17, అక్టోబర్ 2018, బుధవారం

వీక్షిణులకు విజ్ఞప్తి


ప్రపంచవ్యాప్తంగా ఈ బ్లాగును వీక్షిస్తున్న పాఠకులకు కృతజ్ఞతలు.  రోజు రోజుకు పెరుగుతున్న వీక్షిణికుల సంఖ్య నాకు కొండత అండగా వుంది. దయచేసి మీరు మీ మీఅభిప్రాయాలను  కామెంట్ రూపంలో వ్రాయగలరు.  అది నాకు ఈ బ్లాగును ముందుకి తీసుకొని పోవటానికి సాయపడుతుంది.  మీరు సహృదయంతో  సూచనలను చేయ మనవి.  ఈ బ్లాగ్ తెలుగు  సాహిత్యలోకానిది మీరు దీనిలో భాగస్వాములు కండి.  

13, అక్టోబర్ 2018, శనివారం

విడాకులు



అన్ని కోర్టులకన్నా ఈ రోజుల్లో ఫామిలీ కోర్టులోనే  లిటిగెంట్ పబ్లిక్కుతో కిట కిట లాడుతున్నది. అన్ని జిల్లాల్లో ఫ్యామిలీ కోర్టులు వున్నాయి ఇంకా అదనంగా కొత్త అదనపు కోర్టులు వస్తున్నాయి. నిజానికి రోజు రోజుకి పెరుగుతున్న తగాదాలన్నీ కుటుంబ తగాదాలే అంటే ఏమాత్రం అతిసేయోక్తి కాదు.  అది విజయవాడలోని ఫామిలీ కోర్టు.  జడ్జి రంగారావు గారు ఒక నడివయస్కుడు తనవల్ల ఎవరి కుటుంబం వీడిపోకూడదని భావించే వాడు.  అంతేకాదు తనకి చాతనైనంతవరకు భార్య భర్తలని అన్ని విధాలా కలపాలని చూసే మనస్తత్వం వున్నవాడు.  చట్టానికన్నా మానవత్వానికి మంచితనానికి విలువనిచ్చే స్వభావం అతనిది. భార్య భర్తలు చిన్న చిన్న వివాదాలతో విడిపోకూడదన్నది అతని ఫిలాసఫీ.  ఒకరోజు మధ్యాన్నం ఒక కేసు వచ్చింది అది భార్య భర్తల విడాకుల కేసు.  భార్య భర్తనించి విడాకులు కావాలని వేసిన కేసు.  ఇద్దరి మద్య కౌన్సిలింగ్ కోసం సాయంత్రం తన ఛాంబరులో కేసు ఉంచుకున్నాడు. 

భార్య డాక్టర్ కిరణ్మయి దాదాపు ముప్పే సంవత్సరాల వయస్సు ఉంటుంది. చామనచాయ కానీ చూడగానే ఆకర్షించే ముఖ వర్చస్సు, అందరితోటి కలిమిడిగా మాట్లాడే నైపుణ్యం వున్న మనిషి.  నిజానికి తాను  చేస్తున్న డాక్టరు వృత్తికి కావలసిన అన్ని లక్షణాలు పుష్కలంగా వున్నాయి ఆమెలో.  అందుకే ఆమెకు తన క్లినిక్లో క్షణం తీరిక ఉండదు.  కన్సల్టేషన్ 300 రూపాయలు తీసుకున్న ఎవ్వరు వెనకాడకుండా ఆమె వద్దకే వస్తారు అంటే ఆమె హస్తవాసి మంచిదని విజయవాడ వాళ్ల నమ్మకం.  ఎటువంటి రోగమైన తగ్గిస్తుందని మంచి పేరు వున్నది.  అంతేకాదు తనకు చేతగాని కేసుని మంచి హాస్పిటల్కి రెఫెర్చేస్తుంది.  ఎంతలేదన్నా రోజుకి కనీసం రెండు వందల మందికన్నా ఎక్కువ పేటెంట్లనే చూస్తుంది. అంటే రోజు ఆదాయం ఆరువేల పైనే.  వాయిదాకి కోర్టుకి రావాలంటే ఆమెకు ఇష్టం ఉండదు.  కోర్టులో హాజరు కాకుండా పెటేషన్ వేయంగానే విడాకులు మంజురు చేస్తే బాగుండునుకదా అని అనుకుంటుంది.  ఈ రోజుల్లో అంతా ఆన్లైన్లోనే జరుగుతున్నాయి కదా ఈ కేసులు కూడా ఆన్లైన్లో విచారిస్తే బాగుండును అనుకుంటుంది.  దుర్మార్గుడైన భర్తతో ఎలాగో కాపురం చేయలేము.  విడాకులకోసం ఎందుకు ఇన్ని సంవత్సరాలు తిరగాలి  అన్నది ఆమె అభిప్రాయం. స్త్రీలు యెంత చదువుకున్నా యెంత పెద్ద హోదాలో వున్నా ఏదో తెలియని ఒక అభద్రతా భావం ఉంటుంది.  దానానికి కారణం ఏదో ఎవరు చెప్పలేరు.  ఎక్కడో అరకొరగా కొద్దీ మంది మాత్రమే ఈ సమాజంలో ఎదురు తిరిగి మనగలుగుతారు అటువంటి స్త్రీలను సమాజం గవురవించకపోగా వారిమీద లేనిపోని నిందలు వేస్తారు. నిజాముకన్నా అబద్ధం వేగంగా వెళుతుంది.  నిజం నడుచుకుంటూ వెళితే అబద్ధం విమానంలో వెళుతుంది.  కాబట్టి చాలామంది స్త్రీలు ఈ సమాజానికి భయపడి వారిలోని వేక్తిత్వాన్ని మరుగున పెట్టుకుంటారు.  "నః స్త్రీ స్వతంత్ర మర్హతే" అని ఆడవారిని ఈ సమాజం కాలరాయాలని చూస్తుంది.  నిజానికి స్త్రీని చులకనగా చూడమని మన చెరిత్ర చెప్పలేదు. మన భారతీయ సంప్రాదాయాలు స్త్రీలని గావురావించేవే కానీ చులకన చేసేవి కావు.  భార్య భర్తల అనుబంధాన్ని సరిగా అర్ధం చేసుకోక పోవటంతో ఇరువురి మధ్య విభేదాలు తలెత్తుతాయి. నిజానికి అందరు స్త్రీలు కానీ అందరు పురుషులు కాని చెడ్డవారు కారు.  ఈసంఘంలో రెండే తెగలు  వున్నాయి అవి బాధించే వారు భాద పడేవారు.  అందులో నీవు ఎటు వున్నావన్నదే సమస్య. కొంతమంది  స్త్రీలు  తన భర్త మంచివాడు కాదని అనుకుంటారు.  కానీ తన భర్త కన్నా దుర్మార్గుడు కనపడితే అప్పుడు తన భర్తే ఇంద్రుడు చంద్రుడు లాగ కనపడతాడు.  ఒక వ్యక్తి మీద సరిగా ఆలోచించకుండా ఒక నిర్ణయానికి రావటము మంచిది కాదు. కొందరు వేరే వాళ్ళు చెప్పేది వినకుండా వారి నిర్ణయం వారు తీసుకుంటారు. దానివల్ల వాళ్ళే కాదు ఎదుటివారు కూడా బాధపడతారు. నిజానికి మన డాక్టర్ కిరణ్మయి చాలా మంచి మనిషి కానీ చెంద్రునిలో మచ్చ ఉన్నట్లు ఆమెలో వున్న లోపం ఎదుటివారిని సరిగా అర్ధం చేసుకోక పోవటం మాత్రమే.  నిజానికి దీన్ని మనం లోపం అనకూడదు కానీ ఏంచేద్దాం ఆమెలో వున్న ఈ బలహీనతే ఈ రోజు తన భర్తతో విడాకులు తీసుకునే దాక తీసుకు వచ్చింది.  

తారనాధ్ నిజానికి పేరుకు తగ్గ రూపం మనిషిని చూడంగానే మాట్లాడాలనిపించే  వర్చస్సు అంతేకాదు మాట్లాడినా కొద్దీ వినాలనిపించేలాంటి వాగ్ధాటి కలవాడు.  వెతికి చూసినా కూడా ఎటువంటి చెడ్డ లక్షణం కనపడదు అని అనక తప్పదు.  తారనాధ్ చెడ్డవాడు అంటే కళ్ళు పోతాయ్ అంటారు అతనిగురించి తెలిసిన వాళ్ళు.  నిజానికి ఎర్రని వాడు రూపసి చూసినాకొద్దీ చూడాలనిపించే రూపంఅతను బీటెక్ కంప్యూటర్స్ చదివి ఒక సాఫ్ట్ వేరు కంపెనీలో ప్రోగ్రామరుగా పనిచేస్తున్నాడు.  తన జాబ్ పట్ల వున్న అంకిత భావం అతనిని ఈ రోజు ఇంత మంచి స్థితిలో ఉంచింది. నెలకు లక్ష రూపాయల వరకు సంపాదిస్తాడు చేతినిండా డబ్బు వున్నా భార్యతో సఖ్యత లేక మనిషి చిక్కి సగం అయ్యాడు.  పెళ్లి కాకముందు చుసిన వాళ్ళు ఇప్పుడు అతనిని పోల్చుకోలేరు అంటే అతిసేయోక్తి కాదు.  డబ్బుతో అన్ని కొనొచ్చు అని కొందరు అనుకుంటారు కానీ నిజానికి డబ్బుతో ఆనందాన్ని కొనలేమని తారనాద్ ని చుస్తే తెలుస్తుంది. ముప్పిమూడు సంవత్సరాల వయసుగలవాడిలాగా కనపడనే కనపడడు ఇంకా పాతికేళ్ల వాడంటే నమ్ముతారు.  డాక్టర్ కిరణ్మయి తార నాధ్ లను చూస్తే ఎవరికైనా మేడు ఫర్ ఈచ్ ఆథార్ అనిపిస్తుంది.  

పెళ్లైన కొత్తల్లో వాళ్లిదరు ఎంతోఅన్యోన్యంగా వుండేవాళ్ళు నిజానికి చూసేవాళ్లకు కళ్ళు కుట్టేవి అంటే నమ్మచ్చు.  కానీ పెళ్లైన ఒక ఎడుకే వారిద్దరిమద్య మనస్పర్థలు మొదలైయ్యాయి అది కూడా నిజానికి చిన్న చిన్న విషయాలగూర్చి.  నీ ఆఫీస్ 6 గంటలకి వదిలితే ఎనిమిదింటిదాకా ఎందుకు రాలేదు అని ఆమె అనేది.  నేనేంచేయనే  ట్రఫిక్కులో ఇరుక్కో పోయా అనేవాడు తార నాధ్ కాదు నీకు నామీద మోజు పోయింది అందుకే కావాలనే ఆలస్యంగా ఇంటికి వస్తున్నావు అనేది ఆమె.  ఆలా మొదలైన వాక్యుద్ధం చిలికి చిలికి గాలివానగామారి ఇద్దరు యెడ మొహం పెడ మొహం పెట్టుకునేదాకా వచ్చేది.  ఒక్కొక్క రోజు వాళ్ళ గొడవలతో తిండి తినకుండా పడుకునేవారు.  బాగా అలసి వచ్చిన తార నాధ్ కి  వెంటనే నిద్ర పట్టేది అదికూడా తప్పే ఎందుకంటె నేను పక్కనున్న నీకు నిద్ర ఎలా పడుతుంది అంటే నీకు వేరే ఎవరితోటో సంబంధం వున్నది అనేది.  ఆ మాటలు కూడా వినే అంత స్పృహలో అతను లేడు నిద్ర సుఖమెరుగదు ఆకలి రుచి ఎరుగదు అన్నట్లు అతను పక్క మీద కెక్కగానే అలసటతో ఉండటంతో నిద్ర పట్టేది. ఆడవారికి వాళ్ళ మాటే చెల్లలి ఎదుటి వాళ్ళ మాటలు అస్సలు వినరు అన్నట్లు ఆమె ప్రేవర్తించేది.  మరుసటి రోజు ఉదయం మాట్లాడేది కాదు అలక పునాది ఆటను నానా యాతన పడి  ఆమె అలక తీర్చే వాడు.  మొగవాడు యధాలాపంగా ఏమైనా మాట యిస్తే చచ్చాడన్న మాటే ఎందుకంటె ఏదో జసలో పది తన మాట ప్రకారం నడుచుకోక పోతే మూడవ ప్రపంచ యుద్ధమే.  ఒక్కో రోజు ఆఫిసులో పని తొందరగా అయి ఇంటికి ఐదింటికే వస్తే అదికూడా ఆమె తప్పు పట్టేది.  నీ ప్రేయసి వెంటనే వదిలి పెట్టిందే అనేది.  అమ్మ నాకు నీవు తప్ప వేరే ఎవరితోటి ఎలాంటి సంబంధం లేదు అంటే వింటేనా ససేమీరా వినదు మళ్ళి గొడవ మొదలు.  ఇంట్లో గ్లాసులు కంచాలు కూడా వల్ల చేతి వాటంతో కొట్టుకునేవి.  ముఖ్యంగా ఆమె చేతి దురుసు చెప్పనక్కరలేదు. ఆలా ఒకఎడుకే వాళ్లకి నూరేళ్ళకు సరిపడా తగవులు ఏర్పడ్డాయి.  చివరికి డాక్టర్ కిరణ్మయి వేరే ఇల్లు తీసుకొని వెళ్ళింది.  ఆమె ఎప్పుడు తిరిగి వస్తుందా అని తార నాధ్ ఎదురు చూసాడు.  కానీ ఆమె తెరిగి రాలేదు కానీ ఒక రోజు ఒక లేడి అడ్వకెట్ నుండి శ్రీముఖం వచ్చింది అదేనండి లీగల్ నోటీసు.  నోటీసు చదివి తార నాధ్ నివ్వెర పోయాడు అంతా అబద్ధాల పుట్ట లేని పోనీ కల్పనలు చేసి తార నాధ్ ఒక దుర్మార్గుడు, స్త్రీలోలుడు అని చిత్రీకరించి   అల్లిన కధ నిజానికి ఆ నోటీసు ఎవరైనా చదివితే తార నాధ్ లాంటి దుర్మార్గుడు ఎక్కడ ఉండడు అని అనుకో వచ్చు.  ఈ రోజుల్లో ఇటువంటివి చాల సాధారణం అయిపోయాయి.  బతుకు జీవుడా అని తార నాధ్ తనతో చిన్నప్పుడు చదువుకున్న ఒక అడ్వాకేటు వద్దకి వెళ్లి తన గోడు వివరించాడు.  అంతా విని ఆ అడ్వాకట్ ఆ నోటీసుకి రిప్లై ఇచ్చాడు.  ఇక ప్రశాంతంగా ఉండొచ్చు తన భార్య తన దగ్గరకు వస్తుంది కేవలం నోటీసు తనను బెదిరించటానికే ఇచ్చి ఉంటుంది అనుకున్నాడు.  కానీ తన అంచనా తారు మరు అయ్యిన్ది ఒక వారం రోజుల్లోనే కోర్టు నోటీసు వచ్చింది.  అప్పడి నుండి కోర్టుకి తిరుగు తున్నారు ఇద్దరు. 

ఇంకా వుంది 

6, అక్టోబర్ 2018, శనివారం

పనికి వచ్చే లింకులు

http://andhrabharati.com/dictionary/index.php

http://chandam.apphb.com/

http://www.telugunighantuvu.org/ 


http://www.telugunighantuvu.org/

http://andhraamrutham.blogspot.com




1, అక్టోబర్ 2018, సోమవారం

గగన విహారం

అది ఒక మారుమూల పల్లె ఆ ఊరికి బస్సుకూడా రాదు.  అక్కడికి దగ్గర్లో వున్న వూళ్ళో బస్సు దిగి ఒక అర గంట నడిస్తేకాని ఆ పల్లెకు చేరుకోలేము.  చుట్టూరా అడవి.  వూరు ప్రక్కనే ఎప్పుడు పారె ఒక ఏరు.  ఊళ్లోని వారంతా ఆ యెట్లోకి వెళ్లే ప్రొద్దున్నే కాలకృత్యాలు చేసుకొని స్నానం చేసి వస్తారు. రామదాసు ఒక నడి వయస్సు వాడు.  ఒక చిన్న గుడిసెలో వుంటూ కూలి,నాలి చేసుకొని పొట్ట పోసుకుంటున్నాడు.  అతనికి పెద్దగా ఏమి ఆశలు లేవు.  కానీ ఎప్పుడైనా రైలు ఎక్కాలని మాత్రము అతని కోరిక. కానీ తానువున్న పరిస్థితిలో తన జీవితంలో రైలు ఎక్కలేనని తెలుసుకున్నాడు. జీవితం మాములుగ నడుస్తున్నది రోజులు గడుస్తున్నాయి. ఒకరోజుఎక్కడి నుండి వచ్చాడో కానీ ఒక సాధువు ఆ ఊరికి వచ్చి మర్రిచెట్టు క్రింద వున్నాడని అతను అందరికి వారికి జరిగినవి జరగబోయేవి చెపుతున్నాడని ఊరంతా కోడై కూస్తే రామదాసు కూడా ఆ సాధువుని చూడటానికి వెళ్ళాడు. రామదాసుని చూడగానే ఆ సాధువు అతని జీవితంలో జరిగినసంఘటనలు చెప్పి నీకు రైలు ప్రయాణం చేయాలని  వుంది అవునా అన్నాడు.  దానికి రామదాసు ఆశ్చయపోయి అవును స్వామి నాకు నిజంగా రైలు ఎక్కాలని వుంది నేను నా జీవితంలో రైలు ఎక్కగలనా అని అతృతతో అడిగాడు.  దానికి ఆ సాధువు అతని కుడి చేయిని పరిశీలనగా చూసి నొసలు చిట్లిచ్చాడు.  రామదాసు ఆశ కాస్త అడియాస ఐయ్యింది.  వెంటనే ఆ సాధువు నీవు రైలుఎక్కుతావు అంతే కాదు విమానం కూడా ఎక్కుతావు అని చెప్పాడు.  వెంటనే రామదాసు పెద్దగా నవ్వాడు. ఏమిటి స్వామి రైలు ఎక్కటానికి పైసలు లేని నేను విమానం యెట్లా ఎక్కుతాను అన్నాడు.  నాయన నేను నీ జాతకంలో వున్నది చెప్పాను.  నీవు నమ్మితే నమ్ము లేకపోతేలేదు కానీ ఒక్క విషయం నేను చెప్పింది ఇంతవరకు జరగకుండా ఎన్నడు లేదు.  నిజమే ఆ స్వామి తనగూర్చి చెప్పినవన్నీ నిజానికి చూసినట్లుగా చెప్పాడు అటువంటప్పుడు తాను ఎందుకు తప్పు చెపుతాడు అని అనుకున్నాడు.  తన చుట్టూ ప్రక్కల వున్నవారు కూడా అది విని రామదాసు విమానం ఎక్కుతాడు అని అనటం మొదలు పెట్టారు.  నిజానికి తాను విమానం ఎక్కుతాడో లేదో కానీ ఆ నిమిషంలో మాత్రం రామదాసు మనసు గాలిలో తేలిపోసాగింది.  ఆ నోటా ఆ నోటా పడి ఊరంతా ఆ వార్త గప్పుమన్నది.  ఆ రోజునించి వూళ్ళో వారంతా రామదాసుని ఏదో తెలియని ప్రత్యేకతతో చూడటం మొదలు పెట్టారు.  తాను విమానం ఎక్కటం విషయం దేముడికి తెలుసు కానీ రామదాసుకు మాత్రం విమానం ఎక్కిన దానికన్నా ఎక్కువ ఆనందంగా ఉంది.  తాను రైలు ఎక్కలేదే మరి విమానం యెట్లా ఎక్కుతాను, నిజంగా విమానం ఎక్కుతాన ఎక్కుతే ఎక్కడ ఎక్కుతాను ఎక్కడికి పోతాను. నా దగ్గర అంత డబ్బు లేదే. ఇలాంటి ప్రశ్నలు రామదాసుని పట్టి పీడిస్తున్నాయి.  రోజులు గడుస్తున్నాయి.  ఒక రోజు పెద్ద వర్షం వచ్చింది ఏదో పనిమీద రామ దాసు యేరు దాటి ప్రక్క ఊరికి వెళ్ళాడు.  ఆ వూరు చాల పల్లంగా ఉంటుంది.  రామదాసు వూరు దాదాపు ఒక కొండ లాగ ఉంటుంది.  కాబట్టి యెంత పెద్ద వాన వచ్చినా ఏరుకి వరద వచ్చినా వాళ్ళ ఊరికి యే ప్రమాదం లేదు.  కానీ రామదాసు వెళ్లిన వూరు చాలా పల్లంలో ఉండటంలో తరచూ ఆ ఊరికి యేటి వరద తాకిడికి గురి అవుతుంది.  రామదాసు సాయంత్రం కల్లా తిరిగి వద్దామని ఊరికి వెళ్ళాడు కానీ వచ్చే రప్పుడు యేరు ఉర్రుతలు వూగుతున్నది తాను ఎక్కిన పడవ అటు ఇటు వుగ సాగింది పడవలో వున్న వారంతా దేముడిని తలుచుకుంటూ ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని వున్నారు. ఒక్క నిమిషములో పడవలోకి నీరు వచ్చి పూర్తిగా పడవ మునిగి పోయింది.  పడవలో వాళ్లంతా నీటిలో కొట్టుకొని పోయారు.  ఎవరికి ఎవరు కనపడటం లేదు అంతా పెద్దగా అరుస్తున్నారు. రామదాసు కుడా వరద ఉధృతికి కొట్టుకొని పోయాడు.  ఈత సరిగా రాదు కానీ ప్రాణాలు కాపాడుకోవటం కోసం చేతనైనంత వరకు ఈత కొట్టి,కొట్టి అలసి పోయాడు.  ఏమైందో ఏమో తెలియతు ఎంతసేపు తానూ నీళ్లలో వున్నది తెలియదు. పూర్తిగా చీకటి మగత నిద్రగా వుంది కాపాడమని అరవటానికి కూడా నోరు రావటంలేదు.  అయోమయం తాను బ్రతికి వున్నది మరణించింది కుడా తనకి తెలియటం లేదు.  ఏమిటి ఈ వింత యెంత సేపు ఆలా గడిచిందో ఏమో రామదాసుకి తెలియదు తన మీద ఏదో ఒక వస్తువు పైనుంచి వ్రాలాడుతూ తాకుతున్నట్లు అనిపిస్తుంది. కళ్ళు తెరిచే శక్తి కూడా లేదు.  అతి కష్టంగా కళ్ళు తెరిచి చూసాడు  కడుపులో ఆకలి దంచుతున్నది.  వంట్లో ఏమాత్రము శక్తి లేదు. కళ్ళు తెరవంగానే సూర్య భగవానుడు తన ఉగ్ర రూపంతో ప్రత్యక్షమైనాడు.  టైం దాదాపు పది పదకొండు కావచ్చు, తాను ఒక చిన్న రాతి కొండపై వున్నాడు చుట్టూరా  నీళ్లు. పైనించి ఒక తాటి నిచ్చెన వ్రాలాడుతున్నది.  దానిని చూడంగానే రామదాసుకి ప్రాణం లేచి వచినట్లయింది.  అది పైన ఎగురుతున్న మిలిటరీ విమానం నుంచి వ్రాలాడుతూ వున్నది.  ఆ విమానం తన చుట్టూ తీరుగుతూ వున్నది. అతి కష్టంమీద ఆ తాటి నిచ్చనని పట్టుకో గలిగాడు రామదాసు. తాను ఆ తాటి నిచ్చనని పట్టుకోవటమే ఆలస్యం అది వెంటనే పైకి పోవటంమెదలైయింది.  ఒక్క నిముషంలో రామదాసు తాటితో పాటు విమానంలోకి వెళ్ళాడు. ఇద్దరు మిలటరీ వాళ్ళు రామదాసు రెండు చేతులని పట్టుకొని విమానంలోకి తీసుకుని విమానం తలుపు వేశారు.  అప్పుడు రామదాసుకి గతంలో సాధువు చెప్పిన జోస్యం జ్ఞ్యాపకం వచ్చింది.  నిజమే తానూ నిజంగా విమానం ఎక్కాడు. రామదాసు తనను తానూ గిల్లుకొన్నాడు అది కల నిజామా అని, నిజమే.  రామదాసుని ఆ మిలటరీ వాళ్ళు తాను ఎలా వరదలో కొట్టుకొని పోయంది అడిగారు.  రామదాసు జరిగిందంతా చెప్పాడువాళ్ళు రామదాసుని ఒక పెద్ద ఊరికి తీసుకొని వెళ్లారు.  వాళ్లే రామదాసుని ఆ వురి రైల్వే స్టేషనుకి తీసుకొని వెళ్లి తన ఊరికి ఎలా వెళ్లాలో చెప్పి రామదాసు ఊరికి దగ్గర్లోని రైల్వే స్టేషన్కి టిక్కెటు కొని యిచ్చి కొంత డబ్బు కుడా ఇచ్చి అక్కడనుండి తన ఊరికి ఎలా వెళ్లాలో చెప్పారు.  మరుసటి రోజు రామదాసు చస్తుపడుతూ తన వూరికిచేరాడు.  ఊళ్లోని వారంతా రామదాసు కూడా మిగిలిన వారితోపాటు పడవ ప్రమాదంలో చనిపోయాడని అనుకున్నారు. రామదాసు ఊర్లోని వాళ్ళకి జరిగిందంతా చెప్పాడు. సాధువు చెప్పినట్లు రామదాసు విమాన ప్రయాణం చేసినందుకు రామదాసుతో పాటు వూరి వాళ్ళు కూడా ఆనందించారు.  అప్పటినుండి రామదాసుని  విమానం రామదాసు అని పిలవటం మొదలుపెట్టారు.  వరద పుణ్యమాని రామదాసుకి జీవిత కోరిక ఐన రైలు ప్రయాణం మరియు విమాన ప్రయాణం చేయగలిగాడు. 

భగవంతుడు దయామయుడు

ఒకరోజు ఒక పెద్ద చెప్పుల షాపు ముందు ఒక పేదవాడు నిలుచుని అక్కడి వివిధ రకాల చెప్పుల్ని చూసి తన కాళ్ళని చుసుకుంటున్నాడు. ఈ విషయం ఆ దుకాణంలో వున్నా యజమాని చూసాడు వెంటనే ఒక నవుకరిని పంపించి అతన్నిలోపలి తీసుకోరమ్మన్నాడు.  వెంటనే ఆ పేదవాడు ఆ దుకాణందారుని ముందుకి తీసుకొని రాబడ్డాడు. అతను దుకాణందారుని చూసి భయంతో వణికి పోతున్నాడు.  దుకాణందారు అతనికి భయపడవద్దని నేనునిన్ను ఏమి చేయను అని ధెర్యం చెప్పి వాణ్ణి ఈ విధంగా అడిగాడు.  నీవు నా కొట్టు వైపు చూస్తూ ఏమని మనసులో అనుకున్నావు చెప్పు  నేను నిన్ను ఏమి ఇబ్బంది పెట్టను నాకు నిజం చెప్పు అన్నాడు.  దానికి ఆ పేదవానికి దుకాణందారుని మీద నమ్మకం కలిగింది.  అతను నేను మీ కొట్టులో రక రకాల చెప్పులు చూసి నా దారిద్య్రాన్ని నిందించుకొని మీరు ఎంత అదృష్టవంతులో కదా ప్రతి రోజు మీకు కావలసిన చెప్పులు వేసుకోవచ్చు అని అనుకున్నాను అని చెప్పాడు.  అప్పుడు ఆ దుకాణం దారు తను వేసుకున్న లుంగీని ప్రక్కకి జరిపాడు.  ఆశ్చర్యం అతనికి రెండు కాళ్ళు మోకాళ్ళ వరకే వున్నాయి.  అది చూసి ఆ పేదవాడు నిస్చేస్తుడై అన్నాడు.  దేముడు నాకే కాదు మీకు కూడా అన్యాయం చేసాడు.  నాకు మంచిగాకాళ్ళు వున్నాయి కానీ కాళ్ళకి చెప్పులు లేవు, మరి మీకు ఎన్నో రకాల చెప్పులు వున్నాయి కానీ వాటిని వేసుకునే అదృష్టం మీకు లేకుండా దేముడు చేసాడు.  అదే దేముడి లీల అన్నాడు.  దానికి ఆ కొట్టు అతను చెప్పాడు దేముడు నీకు కానీ నాకు కాని అన్యాయం చేయలేదు.  నిజానికి మన ఇద్దరికీ ఎంతో మేలు చేసాడు అన్నాడు.  అది ఎట్లా అన్నాడు.  ఎందుకంటె నీకు కాళ్ళకి చెప్పులు కొనుక్కునే స్తొమత లేదు కానీ నీవు చెప్పులు లేకుండా మండుటెండలో నడవ గల శక్తిని నీకు ఇచ్చాడు.  మరి నాకు నేను ఎన్ని చెప్పులైనా వేసుకొనే శక్తీ వుంది కానీకాళ్ళు లేనందువల్ల వాటిని వేసుకోలేననుకోవటం కేవలం బుద్ధితక్కువ నాకు కాళ్లతో పని లేకుండా నన్ను ఎత్తుకొని ఎక్కడికంటే అక్కడికి తీసుకువెళ్లే ఇద్దరు గుణవంతులైన కుమారులని ఇచ్చాడు అని ఆ ప్రక్కనే వున్నా తన కొడుకులని ఎంతో గర్వంగా చూపించాడు. నేను ఎన్నడూ నాకు కాళ్ళు లేవనే ఆలోచనే కలగకుండా నాకు చేసాడు.  చూసావా మన ఇద్దరికీ భగవంతుడు మేలే చేసాడు.  కానీ మనమే దేముడిని అపార్ధం చేసుకుంటాము.  భగవంతుడు ఎవ్వరికీ అన్యాయం చేయడు.  మన ఆలోచన బట్టి మాత్రమే మన మానసిక స్థితి ఉంటుంది అన్నాడు. భగవంతుడు ఎల్లప్పుడు తన భక్తులని కంటికి రెప్పలాగా చూస్తాడు.  కేవలం మనం అర్ధం చేసుకోవాల్సి మాత్రమే ఉంటుంది. 
మీ కామెంటుకి కృతజ్ఞతలు.  
సర్వ్ జనా సుఖినోభవంతు.