31, డిసెంబర్ 2020, గురువారం

శాంతాకారం

 శాంతాకారం - శ్లోకంలోని అద్భుత భావన!*


*శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం*
*విశ్వాధా(కా)రం గగన సదృశం, మేఘవర్ణం శుభాంగం!*
*లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృద్ధ్యానగమ్యం*
*వందే విష్ణుం భవభయహరం సర్వ లోకైక నాథం!!*

ఇందులో సృష్టిక్రమం..
సృష్టిని పాలించే ఈశ్వర స్వరూపం..
ఒక చక్కని క్రమపద్ధతిలో నిబద్ధించారు.

*శాంతాకారం*
సృష్టికి పూర్వం ఈ జగమంతా శాంత స్థితిలో ఉన్నది.
శాంతం, శమనం – అంటే అన్నీ లయించిన స్థితి.
అనేకంగా ఉన్న వృక్షం, బీజంలో లీనమయినట్లుగా, సర్వ జగతి, పరమాత్మయందే లీనమై ఉన్న స్థితి – శాంతి.
ఏ వికారమూ లేని పరిపూర్ణత్వాన్ని కూడా, ఈ శబ్దం తెలియజేస్తోంది.
శాంతమే తన స్వరూపంగా కలిగిన పరమాత్మ.

*భుజగ శయనం*
భుజగశయనుడు..అనంత కాలతత్త్వమే అనంతుడు – ఆదిశేషువు – భుజగము.
ఈ కాలానికి ఆవల కాలాన్ని అధిష్ఠించిన ఈశ్వరుడే భుజగశయనుడు.
కాలానికి లొంగి ఉన్నవి లోకాలు.
కాలాతీతుడు, కాలం ద్వారా జగతిని శాసించే భగవానుడు కాలభుజగశయనుడు.

*పద్మనాభం*
సృష్టికి తగిన కాలాన్ని అధిష్ఠించిన నారాయణుని సంకల్పం మేరకు, సృష్టి బీజాల సమాహార రూపమైన పద్మం, ఆయన నాభీ కమలం నుండి ఆవిర్భవించింది.
సృష్టిగా విచ్చుకుంటున్న బీజ స్వరూపమే పద్మం.
దానికి నాభి (కేంద్రం) విష్ణువే.
అందుకే ఆయన *పద్మనాభుడు*

*సురేశం*
విశ్వపు తొలిరూపమైన ఆ పద్మమందు,
విష్ణు శక్తియే సృష్టికర్తగా, బ్రహ్మగా వ్యక్తమయింది.
నలువైపులా దృష్టిని ప్రసరించి తన నుండి జగన్నియామక శక్తులైన వివిధ దేవతలను వ్యక్తీకరించాడు బ్రహ్మ.
జగతికి మేలు(సు)కలిగించే వారే సురలు
(సు- అంటే మేలు, ‘రాతి’ అంటే కలిగించు వాడు. సుం-రాతి – మేలును కలిగించువారు సురలు).
ఈ దేవతా శక్తులతో విశ్వమంతా నిర్మితమయింది. నిజానికి దేవతా శక్తులు స్వతంత్రులు కాదు.
ఆ శక్తులన్నీ ఆదిమూలమైన వాసుదేవుని కిరణాలే.
అందుకే ఆ సురలందరికీ తానే నియామకుడై ‘సురేశు’డయ్యాడు.

*విశ్వాధారం*
కనిపిస్తున్న విశ్వాన్ని నియమించే సూక్ష్మ శక్తులు ‘సురలు’. వారితో పాటు విశ్వానికి సైతం ఆధారమై ఉన్న చైతన్యం ఆ వాసుదేవుడు.
సమస్తమునకు ఆధారమై ఉన్నందున అతడే ‘విశ్వాధారుడు’.
కనిపించే జగమంతా ఆయన చైతన్యంతో నిండి ఉన్నందున ఆతడే *విశ్వాకారుడు* కూడా.
నదిలో అలలన్నిటికీ జలమే *ఆధారం*
అలల *ఆకారం* అంతా జలమే.
జలం అలలకు ఆధారమై, ఆకారమై ఉన్నట్లే..
విశ్వాధారుడై విశ్వాకారుడై పరమాత్మయే ఉన్నాడు.

*గగన సదృశం*
ఇది ఎలా సంభవం?
ఆకాశంలో వ్యక్తమయ్యే సమస్తము నందూ, ఆకాశమే ఉన్నది.
సమస్తమూ ఆకాశము నందే ఉన్నది.
అదేవిధంగా ఆకాశంతో సహా,
సమస్త విశ్వమూ ఎవరియందు,
ఎవరిచే వ్యాప్తమై ఉందో,
అతడే పరమాత్మ.
అందుకే ఆయన *గగనసదృశుడు*(గగనం వంటివాడు).
ఇదే భావాన్ని *ఆకాశాత్ సర్వగతః సుసూక్ష్మః* అంటూ ఉపనిషత్తు ప్రకటిస్తోంది.
ఇది నిరాకారుడైన పరమేశ్వరుని తెలియజేస్తోంది.

*మేఘవర్ణం*
నిరాకారుడై సర్వవ్యాపకుడైన ఆ పరమాత్మయే..
తన లీలా శక్తితో భక్తులను అనుగ్రహించడానికై దివ్యమంగళ విగ్రహుడై సాకారుడయ్యాడు.
ఆ సాకారం *మేఘవర్ణం*(మబ్బువన్నె)గా ఉన్నది.

*శుభాంగం*
మేఘం నీటితో నిండి తాపాన్నీ, దాహాన్నీ పోగొడుతుంది. అదేవిధంగా కరుణారసంతో నిండిన విష్ణు మేఘం, సంసార తాపత్రయాల్ని పోగొట్టి, జ్ఞానదాహాన్ని తీర్చుతున్నది.
అందుకే అది నీలమేఘశ్యామం.
ఆ శ్యామల వర్ణ దేహంలో ప్రత్యంగమూ శుభమే. ప్రాపంచిక దేహాలు ప్రకృతి దోషాలతో కూడి ఉంటాయి కనుక అవి అశుభ రూపాలే.
కానీ స్వామి దాల్చిన విగ్రహంలో అవయవాలు శుభ స్వరూపాలు.
తలచే వారికి శుభాలు కలిగించే స్వభావంతో దివ్యమంగళ స్వరూపంగా భాసిస్తున్నాడు భగవానుడు.
అందుకే ఆయన రూపం ‘శుభాంగం’.

*లక్ష్మీకాంతం*
ప్రపంచాన్ని పోషించే ఐశ్వర్యాలన్నీ ఆయనను ఆశ్రయించుకున్నాయి.
ఐశ్వర్యాల అధిదేవత లక్ష్మి ఆయననే చేరి,
ఆయన సంకల్పానుగుణంగా ప్రవర్తిస్తున్నది.
అందుకే ఆ శుభ స్వరూపం *లక్ష్మీకాంతం*

*కమలనయనం*
ఐశ్వర్య దేవతకు ప్రీతికరం.
కమలముల వలె విచ్చుకున్న సూర్యచంద్ర కాంతులతో జగతిని గమనిస్తున్న కరుణామయ దృష్టి కల భగవానుడు ‘కమలనయనుడు’.

*యోగిహృద్యానగమ్యం*
ఇటువంటి విష్ణుతత్త్వం, స్వరూపం అందరూ అందుకోలేరు.
యోగులు మాత్రమే ఏకాగ్రమైన దృష్టితో ధ్యానం ద్వారా తమ హృదయాలలో దర్శించగలుగుతున్నారు.
ఆ కారణం చేతనే అతడు ‘యోగిహృత్ ధ్యానగమ్యుడు’.

*వందే విష్ణుం  భవ భయహరం*
విశ్వమంతా వ్యాపించిన పరమేశ్వరుడు కనుక ‘విష్ణువు’.
ఈ తత్త్వాన్ని గ్రహించి, శుభాంగాన్ని ధ్యానించే వానికి ఈ సంసారంలో భయాలు తొలగి, అవిద్య నశిస్తున్నది. అందుకే ఆ స్వామి ‘భవభయహరుడు’.

*సర్వలోకైకనాథమ్*
సర్వలోకములకు ప్రధానమైన నాథుడు అతడే ‘సర్వలోకైకనాథమ్’.

14నామాలతో *విశ్వానికీ – విష్ణువునకు* ఉన్న అభిన్న సంబంధాన్ని, ఈ శ్లోకం స్పష్టపరుస్తోంది.

ఒకే శ్లోకంలో, విశ్వానికి పూర్వ స్థితి నుండి సృష్టి స్థితులను కూడా నిర్వహిస్తున్న భగవత్తత్త్వాన్ని స్పష్టపరచడం, ఆర్ష దృష్టి వైభవం.

ఇంత స్పష్టంగా శ్రీహరి గొప్పతనాన్ని,
ఆయనలోని సాకార నిరాకార తత్వాలను తెలియజేస్తూ 
యోగపూర్వక ధ్యానం ద్వారా,
మన హృదయాలలోనే ఆయనను దర్శించగలమనే, సాధనా రహస్యాన్ని కూడా, ఈ శ్లోకం అందిస్తోంది.

(జై శ్రీమన్నారాయణ)🙏 

శ్రీలలితా సహస్రనామ వివరణ🌹

 🌹శ్రీలలితా సహస్రనామ వివరణ🌹


*66. సంపత్కరీ సమారూఢ సింధురవ్రజసేవితా*


సంపత్కరీ అను దేవత ఒక యేనుగును అధిరోహించి తనచుట్టూ అటువంటి యెనుగుల గుంపులతో సేవించబడుతూంది. ఆమె వైభవం వూహించటకు శక్యంకాదు లలితా త్రిపుర సుందరీదేవి తన గజబలములకు యీ సంపత్కరీ దేవిని అధికారిణిగా నియమించింది. లలితా దేవియొక్క అంకుశమునుండి ఈ సంపత్కరీదేవి పుట్టినది.


ఈ సంపత్కరీదేవి “రణ కోలాహలము" అనే పేరున్న మత్తగజముపై అధిరోహించి వుంది. ఆ దేవి ననుసరించి కోట్లకొలదీ యేనుగులు వచ్చాయి


భద్రగజములు, మందగజములు, మృగగజములు అనుభేదములుగల యేనుగులను సంపత్కరీ దేవి మచ్చిక చేసికొని అధిరోహిస్తుంది. అలాంటి గజసమూహము చేత శ్రీ లలితాదేవి సేవించబడుతున్నది


సంపత్కరీ' అనునది ఒక విద్యకు పేరు. సుఖ సంపత్కరి ఐక్య సంపత్కరి అనే విశేషములు గలది. ఇట్టి ఐక్యసంపత్కరీ విద్యలచేత దేవి సేవించబడుతుంది


శ్రీ చక్రములో త్రికోణముకుపైన వుండి పూజింపబడే 'కామేశ్వరీదేవే' 'సంపత్కరీ*

అనే దేవత


కం|| గజ సైన్యపు, సంపత్కరి

నిజాయుధపు, యంకుశమున, నిండై కొలువన్ గజ సింధుర బంధురములు,

యజరామర, మూర్తిగొలువ, నధికోత్సహితుల్!!

   

        లలితానామసుగంధం🌹శ్రీలలితా సహస్రనామ వివరణ🌹


*67. అశ్వారూఢా ధిష్ఠితాశ్వకోటి కోటి భిరావృతా


అశ్వారూఢ" అనే దేవతచే అధింపబడ్డ కోటానుకోట్ల గుఱ్ఱములచే పరవేష్టిం

బడి వుం


లలితాదేవి పాశమునుండి' మిక్కిలి చురుకైన విక్రమముతో “అశ్వారూఢ" అనే దేవత పుట్టింది.ఆమె "అపరాజిత” అనే గుఱ్ఱము పైనెక్కి బయలుదేరగా ఆమెను అనుసరించి కోటానుకోట్ల సంఖ్యలు గల గుఱ్ఱములు వాయువేగంగా ఆమెను అనుసరించి వచ్చి అవన్నీ “శ్రీదేవిని” సేవిస్తున్నాయి


ఇంద్రియములను గుఱ్ఱములుగా చెబుతారు. ఇంద్రియములపై అధిష్టించి ఆ యింద్రిములను స్వాధీనపరుస్తుంది గనుక, ఆ దేవి"అశ్వారూఢ" ఇంద్రియములను; వాటి వాటి పనులలో నడిపించు మనసునకు ఆత్మజ్ఞానం కావాలి. అజ్ఞానం చేత ఇంద్రియాధీనం అయిన మనసు కట్టుబడ


లలితాదేవిని ఉపాసించేవారు ఇంద్రియములను జయించి ఆత్మ జ్ఞానము తెలుసుకున్నవారై పరమాత్మలో ఐక్యం కాగలుగుతారు. భండాసుర వధలకై బయులుదేరిన అలితాదేవికి ఒకవేపు గజదళాధిపతియైన "సంపత్కరి" అశ్వదళాధిపతియైన"అశ్వారూఢ" మరొకవేపునా ఉన్నారు


కం|| అశ్వారూఢా, దేవి

అశ్వంబులు కోటి కోట్లకధిపతి దానై

విశ్వంబును గెలువ గలు

విశ్వంభరి చెంతను పరివేష్టిత మగుగా


        లలితానామసుగం🌹శ్రీలలితా సహస్రనామ వివరణ🌹


*68.చక్రరాజ రధారూఢ, సర్వాయుధ పరిష్కృతా


చక్రరాజ' అనే పేరుగల రధముపై సమస్తమైన ఆయుధములతో అలంకరిం

బడి శ్రీమాత వున్న


చక్రరాజ "కిరిచక్ర" "గేయచక్ర" అనే రధములు రధశాస్త్రమలో వర్ణించబడ్డాయి. శ్రీదేవి “చక్రరాజము" అనే రథమునందు వున్న


దానికి “ఆనందధ్వజము" దానికి తొమ్మిది పర్వములు


గేయచక్రరథమునకు" ఏడుపర్వములు, దానియందు "మంత్రినాధ” అనే దేవత వుంది! "కిరిచక్రమునకు "ఐదుపర్వములు. దానిపై "దండనాధ" అనబడే దేవివుం


'చక్రరాజ రధ' మెక్కడవుంటుందో అక్కడే గేయచక్రరథము గేయచక్రరథ మెక్కడ వుంటుందో అక్కడే కిరిచక్రరథమూ వుంటా


సర్వాయుధములతో అలంకరించబడిన "చక్రరాజము" అనే రధంలో దేవిభండాసురుని సంహరించుటకై నెలకొని వున్నది


"శ్రీ" చక్రమే “చక్రరాజమగుటచేత చక్రపుగుర్తులు, యంత్రపు గుర్తులు, మంత్రముల గుర్తులు, యోగ సంకేతములూ దానిలో వుంటా


ఆ “చక్రరాజ" రధములో 'పర్వములు' అని చెప్పబడినవి. శ్రీచక్రమందు

ఆవరణలుగా వుంటవి


కం|| శాత్రవ మర్ధవిరాజి

ఆత్రిపురాంబిక, రధమది యార్తుల గాయన్త

చిత్రంబగు యుద్ధము

జైత్రం బగు చక్రరధము సరగున విడిసెన్!


        లలితానామసుగం🌹శ్రీలలితా సహస్రనామ వివరణ🌹


*69. గేయచక్రరధారూఢ మంత్రిణీ పరిసేవితా


లలితాదేవి గేయచక్రము అనే పేరు గల రధముపై ఎక్కిన మంత్రిణి యగు "శ్యామలా దేవి చేత సేవించబడుతూవుం


ప్రసిద్ధమైన చక్రముగల రధము అనగా "సూర్యమండలము


సూర్యలోకములో నివసించే శ్రీవిద్యను వుపాసించు యోగినులు వారు ఎల్లప్పుడూ ఆ మాతను ధ్యానిస్తూ వుంటారు


శ్రీచక్రమున మధ్యబిందువు చుట్టూవుండే త్రికోణమే "గేయచక్రము" అదిత్రిపురాశక్తి బుద్ధి తత్వముల పరిణామమే మంత్రిణి దేవికీ యీశక్తికీ భేదము లేదు. ఈ దేవిని ఉపాసించుట వలన పరబ్రహ్మసాక్షాత్కారము అవుతుంది. మంత్రిణి


శ్యామలా దేవి గేయచక్రరధముపై కూర్చొని శ్రీమాతకుకుడి భాగమున వుంటుంది


గానము చేయడానికి యోగ్యత గలది. ఈ మంత్రిణీ దేవికి గేయా శ్యామలాంబా సంగీత యోగినీ అనే ఇతర పేర్లు వున్నవి. ఆమె చక్రము సప్తస్వరములతో వుంటుంది. దానికి 'గిరిచక్రము' గీతి చక్రము అని కూడా పే


శ్రీశ్యామలాదేవి సంగీత మాతృకయగుట వలన ఆమె కూర్చున్న రథము 'గేయచక్రము. ఆమె వీణ గలిగినది. ఆమె ఆసనము "గేయము


కం|| మంత్రిణియగు నాశ్యామల, తంత్రములను వల్లెవేయు తగునారధము

యంత్రంబుల, సంజనితపు

మంత్రాన్వితయై, మరికుడి, పార్శ్వము నడచెన్


       లలితానామసుగం🌹శ్రీలలితా సహస్రనామ వివరణ🌹


 *70.కిరిచక్రరాజరధారూఢ దండనాధ పురస్కృతా


వారాహముల చేత లాగబడుతూన్న రథమునందు ఎక్కిన 'దండనాధ' యైన వారాహీ దేవిచేత పరమేశ్వరి సేవించబడుతున్న


కిరిచక్రరథము' అనగా వారాహములవలే వుండిన చక్రముల గల రధమని గూడా అర్ధము. ఎల్లప్పుడూ చేతియందు దండమును ధరించినది కనుక 'దండనాధ' అని పేరు సృష్టి స్థితి, లయ' ఈ మూడింటినీ కూడా “కిరిచక్రము" అనబడును. ఆ రథముపై ఎక్కినప్పుడు యీమె దండధరుడైన యమునకు కూడా లొం


శ్రీ చక్రములో “వసుకోణచక్రము"నకు “కిరిచక్రము" అనిగుర్తు. ఆత్రికోణ చక్రములోని "మహాత్రికోణ, నైరృతి" కోణములో పూజింపబడే 'భగమాలినీ' ‘వారాహీదేవి అంటారు. మనిషిలో వుండే ఇంద్రియములు అనే సైన్యమును అదుపులో వుంచి నడిపిస్తూ వుంటుంది యీ దే


శ్రీమాతకు యిటువంటి దండనాధులు పన్నెండుమంది వుంటారు. అందరిలో "వారాహీ దేవి” ముఖ్యురాలు. శ్రీచక్రమున మహాత్రికోణములో వుండి నైరుృతి కోణములో పుండి పూజింపబడే "భగమాలినీ” అను దేవియే వారాహీదేవి


మన ఆత్మలో వున్న మనసే దండనాయిక. ఈ దండనాయిక ఇంద్రియములనే సైన్యమును అదుపులో వుంచి నడిపిస్తుం


కం|| వారాహీపరమేశ్వరి

భారము వహియింప నెడమ పార్శ్వము సందు

వీరతలన్ వెలసినదై

పూరిత శక్తికిరిచక్ర, పూని వెలసెనూ


         లలితానామసుగంధం

                   M s.s.k !,న్,ది..విగదుది*



                

చిరవిభవా ! శతకము "

 .

          🙏  హరిః  ఓమ్‌  🙏


🌸🌻పద్యాల🌻తోరణం🌻🌸

          🌹శు భో ద యం 🌹


    ప్రాతఃస్మరణీయులు శ్రీమాన్‌    

    కూచిమంచి తిమ్మకవివరేణ్య

                     విరచిత

       " చిరవిభవా ! శతకము "

                    🌼🌹🌼


-8- చంపకమాల :


శరశరదిందు కుంద 

హరిచందన హార తుషార తారకా


దర ఘనసారవర్ణ వరదండ

శుకాంబుజపాణి వాణి యా


దరమునఁ బ్రోచుచోఁ గవికదంబము నిన్బ్రణుతించు ధన్యమై


చిరవిభవా ! భవా ! విజితచిత్తభవా ! యభవా ! మహాభవా🙏



టీకా :


( తెల్లని ..)శర(..ము) = ఱెల్లు , 

శరత్‌(..కాలపు) , + ఇందు = చంద్రుడు , 

కుంద = మొల్ల పూవు , 

హరిచందన(..ము) = వెన్నెల ,  

హార(..ము) = ముత్యాల దండ ,  

తుషార(..ము) = మంౘు ,  

తారకాదర = నక్షత్ర కాంతి , ఘనసార(..ము) = కర్పూరము మొ॥

వర్ణ(..ము గలిగి ) , వరదండ = జపమాల , 

శుక(..ము) = చిలుక , + అంబుజ(..ము) = పద్మము ,  పాణి = హస్తము(..నందు గల) , వాణి = సరస్వతీదేవి , 

(యా)ఆదరమునఁ ,  బ్రోచుచోఁ = కాచుట వలన , (గ)కవి(..యొక్క) , కదంబము = 

(కావ్య..) సముదాయము , ధన్యమై , 

నిన్ = నిన్ను , (బ్ర)ప్రణుతించు = కీర్తించును ..

శివా ! ..

[ ఈ మకుటార్థము 

ప్రతి పద్యమునకును అన్వయము ..

చిరవిభవా ! = శాశ్వతమైన విభవము గలవాడా ! ,  భవా ! = శివా ! 

< విజిత = జయించబడిన , 

చిత్తభవా ! = మన్మథుని గలవాడా > = 

మన్మథుని జయించినవాడా ! (య)అభవా ! = (జనన మరణ 

చక్రబంధ క్రమమున ..) జన్మ లేనివాడా !

మహాభవా ! = ౘచ్చి , పుట్టునటువంటిది కాని గొప్ప పుట్టుక కలవాడా = శాశ్వతుడా..]🙏



భావము : !


చిరవిభవా ! భవా ! 

విజితచిత్తభవా ! యభవా ! మహాభవా ! 

తెల్లని .. ఱెల్లు - శరత్కాలపు చంద్రుడు - మొల్ల పూవు - వెన్నెల - ముత్యాల 

దండ - మంౘు - నక్షత్ర కాంతి - కర్పూరము మొ॥వాటి వర్ణము గలిగి .. జపమాల - చిలుక - పద్మము .. హస్తములందు గల సరస్వతీదేవి 

ఆదరమున కాచుట వలన కవియొక్క 

కావ్యసముదాయము ధన్యమై - నిన్ను కీర్తించును ..

శివా ! ..🙏

పసుపు


*🌻పసుపు-పరిహారాలు🌻*



పసుపుని సంస్కృతంలో హరిద్ర అని అంటారు. పసుపును అన్ని శుభకార్యాల్లో ఉపయోగిస్తారు. శాస్త్రాల్లో పేర్కొన్న కొన్ని ముఖ్య వస్తువులు ఎవరి నుంచి అయినా పొందవచ్చు. వాటికి మైల ఉండదు.

అవేమిటంటే...


1. పసుపు, 2. కుంకుమ, 3. పూలు, 4. పళ్లు, 5. తమలపాకు, 6. వక్క, 7. పాలు, 8. పెరుగు, 9. నేయి, 10. తేనె, 11. కూరగాయలు, 12. తులసి, 13. గంధం అరగదీసే సానరాయి, 14. గంధం చెక్క...


వీటిలో పసుపుకు మొదటి స్థానం కల్పించబడింది. అలానే సుమంగళులకు తాంబూలం లేదా ఆకు, వక్క ఇచ్చే సమయంలో మొదట పసుపు ఇచ్చి తరువాత కుంకుమ ఇస్తారు.

పసుపు సౌభాగ్యానికి చిహ్నం. ఈ కారణం చేతనే సుమంగుళులు తన భర్తకు శుభం కోరుతూ మాంగల్యానికి పసుపును ఉంచి నమస్కరిస్తారు.

దేవీ ఆలయాల్లో, నవరాత్రి పూజా సమయంలో దేవికి పసుపుతో చేసే అలంకారాలు ముఖ్యమైనవి. గోదాదేవి లేదా ఆండాళ్ అమ్మవారి దేవాలయానికి మీరు వెళ్లినప్పుడు మీకు పసుపు ప్రసాదాన్ని అందిస్తే

పసుపును ఇంటికి తీసుకు వచ్చి వంటల్లో లేదా స్నానం చేసేందుకు ఉపయోగిస్తారు అలా కాకుండా ప్రసాదంగా పసుపును పొంది ఇంటికి తీసుకు వచ్చినప్పుడు ఈ విధంగా చేయండి.


1. దేవుని ప్రసాదమైన పసుపును ప్రతి దినం పూజాస్థానంలో ఉంచి పూజిస్తే ఇంటికి, ఇంట్లో ఉన్నవారికి అన్ని విధాలా ధన, కనక, వస్తు, వాహనాలు వృద్ధి చెందుతాయి.


2. పసుపును నీటిలో వేసి స్నానం చేస్తే దేహ కాంతి పెరుగుతుంది. సమస్త చర్మరోగాలు నయం అవుతాయి. పసుపును నీటిలో వేసి చేసే స్నానాన్ని మంగళ స్నానం అని పిలుస్తారు.


3. పసుపుతో గౌరీదేవిని చేసి పూజించటం ద్వారా ఇంట్లో ఉండే వధువుకు ఉన్న వివాహ దోషాలు తొలగిపోయి, త్వరలో వివాహం నిశ్చయమవుతుంది.


4. దేవికి పసుపు రంగు చీరను ఇస్తే ఇంట్లో ఉండే దోషం మరియు దైవ దోషాలు తొలగిపోతాయి.


5. దుకాణాల్లో చాల రోజులుగా అమ్ముడు కాకుండా మిగిలి ఉండే వస్తువులపై కొద్దిగా పసుపు పొడిని చల్లితే వెంటనే వ్యాపారమవుతుంది.


6. పసుపు నీటితో ఇంటిని కడిగితే ఆ ఇంటికి ఆ ఇంటివారికి డబ్బుకు సమస్య రాదు, అప్పుల బాధ తొలగిపోతుంది.


7. కామెర్లు ఉన్నవారి ఇంటి వారు పసుపును దానంగా ఇస్తే కామెర్ల రోగం తొలగిపోతుంది.


8. ప్రతి సంవత్సరం కామెర్లు వచ్చేవారు సుమంగుళులకు పసుపు రంగు చీర తాంబూలాలను దానంగా ఇస్తే కామెర్ల సమస్య తలెత్తదు.


9. గృహదేవతను పసుపు నీటితో కడిగితే విగ్రహాలకు దైవ కళ పెరుగుతుంది.

10. వ్యాపారం జరుగని దుకాణాల్లో దక్షణావృత శంఖాన్ని పసుపు రంగు కాగితంలో చుట్టి దానిని గల్లాపెట్టెలో ఉంచితే వ్యాపారం బాగా అవుతుంది

🙏🏻🌷🙏🏻

కలియుగం


_*కలియుగం అంటే ఏమిటి ?*_


_*కలి ఎవరు ?*_


_*కలి మనలో ఎలా ప్రవేశిస్తుంది?*_


_*కలి నుండి మనం ఎలా తప్పించు కోగలం ?*_


*ముఖ్యమైన యుగాలు 4.*


*1. కృతయుగం* 


*2. త్రేతాయుగం* 


*3. ద్వాపరయుగం* 


*4. కలియుగం* 


*కలియుగం అంటే ఏమిటి?* 


*ఇప్పుడు మనం ఉన్న యుగమే కలియుగం .*


*యుగాల సృష్టిలో 4వది 'కలి'. ద్వాపర యుగం లో అన్నా చెల్లెళ్లకు పుట్టిన వాడే ఈ కలిపురుషుడు ఇతని కాలాన్నే కలియుగం అంటాము.*


*ఈ యుగం మిగతా యుగాలకంటే చాలా భిన్నం గా ఉంటుంది.* 


*ఈ యుగం అయిపోయాక సృష్టి అంతమై పోయి, తిరిగి యుగాలు ప్రారంభ మవుతాయి .*


*కలి ప్రభావం ?*


**************


*కలియుగంలో కలి* 

*పురుషుని ప్రభావం చాల దారుణంగా ఉంటుంది.*


*కలియుగంలో కలిపురుషుని ప్రభావం వల్ల దేవతలకు హవిస్సులందవు.* 


*వేదము అవమానింప బడుతుంది.* 


*పితృదేవతలకు శ్రాద్ధం పెట్టరు.* 


*ధర్మాత్ములు, భూమాత, గోమాతలు అవ మానింప బడతారు.* 


*అసత్యం, బంగారం, డబ్బు చాల ముఖ్యమనుకోవడం.* 


*కష్టపడిన వారికి ఫలితం తక్కువ.* 


*కష్టపడని వారికి ఫలితం ఎక్కువ.*


*శాస్త్రీయత పేరుతో దైవభక్తి ఉండదు.* 


*మనుషులలో నీతి నిజాయితీలు ఉండదు.* 


*దాన-ధర్మాలు ఉండవు.* 


*తల్లిదండ్రులు, అత్తమామలు, అక్కాచెల్లెళ్లు, అనే అనుబంధాలు తగ్గిపోతూ వుంటాయి.* 


*చివరికి కలి వైపరీత్యం వల్ల యుగాంతంలో కరువులు, వరదలు, యుద్దాలు, ఆకలి చావులు వచ్చి, యుగం అంతమై పోతుంది.* 


*కలి పురుషుడు వీరిలో ఎక్కువగా ప్రవేశిస్తాడు.*


*1. జూదం ఆడే వారిలోకి*


*2. మద్యం సేవించే వారి లోకి*


*3. వ్యభిచారం చేసే వారి లోకి*


*4. జీవహింస చేసే వారిలోకి*


*ఇంకా*


*5. జూదంలో నుంచి అసత్యం లోకి,*


*6. మద్యం ద్వారా మదం, అహంకారాల లోకి*


*7. వ్యభిచారం నుంచి కామవాంఛకు,*


*8. హింస లోంచి కోపం లోకి ఎగ బాకుతాడు కలి.* 


************************

*కలి పురుషుడు ఈ యుగం లోకి ఎలా వచ్చాడు?*


***********************

*1. పరీక్షిత్తు మహారాజు - ఎద్దు (ధర్మ దేవత):*


****************************************


*పరీక్షిత్ మహారాజు కలిని అంత మొందించ బోవడం:-*


***************************


*ధర్మ బద్ధంగా పరిపాలిస్తున్న పరీక్షిత్తు మహారాజుకు (చక్రవర్తి) దేశం లో ఒక రోజు ఒక గోమాత ఏడుపు వినిపించింది.*


*తనదేశంలో బాధతో ఉండేవారు అనేది ఉండదు . మహారాజు గారు ఆ గోమాత దగ్గరకి వెళ్ళాడు .*


*ఆ గోమాత.. ఒక ఎద్దుకు మూడు కాళ్ళు విరిగిపోయి ఒక కాలే మిగిలి ఉన్న విషయము చెప్పింది*


*ఆ ఆవు ఎద్దుని ఊరడిస్తూ ఉంది .(ఆ గోమాత మన భూమి ఎద్దు ధర్మ దేవత) ఏమైందని రాజు అడుగగా ఎద్దు కలి ఈ యుగం లోకి ప్రవేశించాడని, అతను తన కాళ్ళను నిర్దాక్షిణ్యంగా విరిచేడని చెప్పింది.*


*అప్పుడు పరీక్షిత్ మహారాజు ఎద్దుతో, ఎవరికీ అవసరం లేని గడ్డి తిని, మనుషులు తాగలేని నీటిని తాగే నిన్ను ఎవరు హింసించారు.*


*ఎవరికీ అపకారం చేయని నీ కాళ్లు ఎవరు విరగ్గొట్టారు అని అంటాడు.*


*ఎద్దు కాలు విరగొట్టిన వారు ఎవరైనా సరే అతని భుజాలు విరగ్గొడతాను అంటాడు పరీక్షిత్ మహారాజు.*


*కామక్రోధావేశుడై, రాజులా కనిపించే కఠినాత్ముడు, కర్ర పట్టుకుని మేము ఏడుస్తూ ఉన్నా కనికరం లేకుండా కొడుతున్నాడు..*


*నా కాళ్లు అతడే విరగ్గొట్టాడు. అని జవాబిచ్చింది ఎద్దు. అతను కలిపురుషుడని పరీక్షిత్ రాజుకు తెలిసింది.*



*దాంతో పరీక్షిత్ మహారాజు కలికి శిక్ష విధిస్తాడు. అప్పుడు కలి.. నన్ను ఎందుకిలా చిత్ర హింసలకు గురి చేస్తున్నావు? అని ప్రశ్నిస్తాడు. ఇది కలియుగం కాబట్టి నేను ఖచ్చితంగా భూమిపైకి రావాల్సిందే అంటాడు.*


*ఇది వదిలి నేనెక్కడుండాలి?*


*నేను ఎక్కడ ఉంటె నువ్వు అక్కడికి వచ్చి చంపుతానంటే ఎలా?* 



*నేను ఎక్కడుండాలో చెప్తే అక్కడ మాత్రమే ఉంటా నన్నాడు కలి.*


*జూదశాల, మద్యపానం, వ్యభిచారం, జీవహింస జరిగే చోటు అనే నాలుగు స్థానాలను ఇస్తా నన్నాడు పరీక్షిత్తు.*


*తన పాలనలో ఉన్న ప్రజలు ఈ నాలుగు చోట్లకి వెళ్లరనే గట్టి నమ్మకంతో అలా అనుగ్ర హించా డాయన.*


*పరీక్షిత్ మహారాజు నాలుగు స్థానాలను మాత్రమే ఇచ్చినప్పటికీ జూదశాల నుంచి అసత్యం, మద్యపానం నుంచి మదం, అహంకారం, వ్యభిచారం నుంచి కామము, హింస నుంచి కోపం, క్రౌర్యం..* 


*ఇలా మరో నాలుగు స్థానాలను కూడా ఆక్రమించాడు కలి.*



*ఇవి కాకుండా మరో స్థానం ఇవ్వమని వేడుకున్నాడు కలి. సరేనని బంగారం ఉన్న చోటు కూడా నీదే నన్నాడు.* 


*అయితే బంగారం నుంచి మాత్సర్యం పుడుతుంది. కాబట్టి ఆ స్థానాన్ని కూడా తనది చేసుకున్నాడు కలి పురుషుడు.*



*మొత్తానికి తొమ్మిది స్థానాల్లో కలి ఉంటాడు అని మనం చెప్పవచ్చు.* 


*2. కలి ప్రభావంతో పరిక్షిత్తు మహారాజు పరిస్థితి:*


******************************************


*పరీక్షిత్ మహారాజు దరిదాపులకు కూడా రాలేని కలి, బంగారం స్థానాన్ని పొందగానే చెలరేగిపోయాడు. పరీక్షిత్ మహారాజు ఒంటినిండా బంగారం ఉండడంతో ఆయనలోకే ప్రవేశించ గలిగాడు.* 



*ఆ ప్రభావంతో క్రూర,మృగాల బాధ తప్పించ డానికి మాత్రమే వేటాడే రాజు, హింసాత్మకుడై వెంటనే వేటకు వెళ్లాలని పించింది.*



*జీవహింస కూడా ఉండడంతో కలి ప్రభావం మరింత పెరిగింది.* 



*అప్పుడే దాహంతో శమీక మహర్షి ఆశ్రమానికి వెళ్లడం, తపస్సులో నిమగ్నమై ఉన్న ఆయన మెడలో క్రోధంతో చనిపోయిన పామును వేసి ఎగతాళి చేయడం జరుగుతుంది.* 


*శమీక మహర్షి కుమారుడైన శృంగి చేతిలో తక్షకుడి ద్వారా మరణిస్తావన్న శాపానికి కూడా గురవుతాడు.* 


*ఇంటికి వెళ్లి కిరీటం, ఆభరణాలు తీసి పక్కన పెట్టగానే కలి ప్రభావం నశించి పశ్చాత్తాపం కలుగుతుంది.*


*అలా కలిని నియంత్రించ గలిగిన పరీక్షిత్తు కూడా తానే అతడి ప్రభావానికి లోనై చివరికి మరణాన్ని కొనితెచ్చు కుంటాడు.*



*3. కలి ప్రభావం - నల దమయంతుల కథ:* 


*************************************


*నల-దమయంతుల - స్వయం వరం:-* 


***********************

*దమయంతి స్వయంవరం ముగిసి, నలమహారాజును ఆమె వరించిన తరువాత అదే స్వయంవరానికి వచ్చిన అష్ట దిక్పాలకులు తిరిగి వెళ్లే టప్పుడు కలి పురుషుడు ఎదురవుతాడు.* 


*దమయంతిని వివాహ మాడడానికి వెళ్తున్నా నంటాడు. ఇంకెక్కడి వివాహం?.. స్వయంవరం ముగిసింది..*


*ఆమె నలుని వరించిందని చెబుతారు దిక్పాలకులు.* 


*ఇది తెలిసి కలిపురుషుడు నలమహారాజుపై క్రోధంతో వాళ్లెలా సుఖంగా ఉంటారో చూస్తానని ప్రతిన బూనుతాడు. కాని ధర్మబద్ధుడై, నిరంతరం దైవచింతన కలిగి, అరిషడ్వర్గాలను అదుపులో ఉంచుకునే నలమహారాజు దగ్గరికి కలి పురుషుడు వెళ్లలేకపోతాడు.*



*కాని ఒకరోజు దురదృష్టవశాత్తు మూత్ర విసర్జన అనంతరం కాళ్లు సరిగా కడుక్కోక హడావుడిగా వెళ్లిన నలుడిలోకి ప్రవేశించ గలుగుతాడు కలి.*


*ఇక అంతటి నలమహారాజు కూడా ధర్మం తప్పుతాడు.*


*మనసుపై నియంత్రణ కోల్పోతాడు. దాయాదులతో జూదమాడి రాజ్యం, సర్వ సంపదలు అన్నీ కోల్పోతాడు.* 


*భార్య దమయంతి ఎంత చెప్పినా వినిపించుకోడు. వెంటనే ఆమె సారథిని పిల్చి, పిల్లలిద్దరినీ పుట్టింటికి పంపించి వేస్తుంది.* 


*రాజ్యం దాయాదులకు అప్పగించి, నలదమయంతు లిద్దరూ అరణ్యాలకు బయల్దేరుతారు.*


*ఆకలి దప్పులతో బాధపడుతుంటారు. ఓరోజు పక్షులు తను కట్టుకున్న పంచెను కూడా లాక్కెళ్లి పోతాయి.*


*తను లేకుంటే భార్య సుఖపడుతుందని భావించిన నలుడు ఆమెను అక్కడే వదిలి వెళ్లిపోతాడు.*


*ఒకసారి*

*నల మహారాజా!*


*రక్షించు! అనే అరుపులు వినిపిస్తాయి. అరణ్యం కాలిపోతుంటే మంటల మధ్యలో కర్కోటకుడనే మహాసర్పం అరుస్తూ కనిపిస్తుంది. దాన్ని కాపాడి నదిలో వేయబోతుంటే కాటేస్తుంది. దాంతో అందమైన నల మహారాజు మరుగుజ్జు అయిన కురూపిగా మారిపోతాడు.* 


*నీకు సాయం చేసిన నన్నే కాటేశావెందుకంటాడు నలుడు. నీ అసలు రూపం నీ ప్రతిష్ఠను దెబ్బతీస్తుంది. నీకు మాత్రమే తెలిసిన అశ్వహృదయం విద్యతో రుతుపర్ణ మహారాజును ఆశ్రయించు.*


*నీకు అవసరం అయినప్పుడు నన్ను తల్చుకుంటే ఓ దివ్య వస్త్రం వస్తుంది. దాని సహాయంతో నీ స్వస్వరూపాన్ని పొందగలవని చెబుతాడు కర్కోటకుడు.* 


*************************


*నలుడు బాహుకుడనే పేరుతో రుతుపర్ణ మహారాజు దగ్గర వంటవాడిగా చేరుతాడు. అశ్వ హృదయ విద్య ద్వారా మొండి గుర్రాలను లొంగదీసుకోగలుగుతాడు.* 


*ఒక్క రాత్రిలోనే ఒక ఊరి నుంచి వేరే ఊరికి వెళ్లగలడు.*


*అరణ్యంలో ఉన్న దమయంతి భర్త కోసం వెదుకుతూ ఇద్దరు బ్రాహ్మణుల సాయంతో సుబాహుపురం చేరుతుంది. అక్కడ రాజమాత చూసి, తన దగ్గర పెట్టుకుంటుంది.*


*నల దమయంతుల జాడ తెలుసు కోవడానికి దమయంతి తండ్రి వేగులను పంపుతాడు. అలా సుబాహుపురం చేరిన వేగు ద్వారా రాజమాతకు ఆమె దమయంతి అని తెలుస్తుంది. తన పెద్దమ్మ దగ్గరే చేరానని అర్థమైన దమయంతి తన తండ్రి దగ్గరకు వెళ్లిపోతుంది.*


*ఆమె కొంతమంది బ్రాహ్మణులను పిల్చి అన్ని రాజ్యాలకు పంపిస్తుంది.*


*అర్ధరాత్రి సమయంలో అరణ్యంలో పతివ్రత అయిన తన అమాయకపు భార్యను వదిలి వెళ్లడం ధర్మమేనా? అలాంటి పురుషుడున్నాడా? అనే ప్రశ్న అన్ని సభల్లోనూ అడగమంటుంది.* 



*అలా రుతుపర్ణుడి రాజ్యానికి చేరిన బ్రాహ్మణుడు అడిగిన ప్రశ్నకు సమాధానంగా పతివ్రత అయిన భార్య తన భర్త పరిస్థితి తెలుసుకోకుండా నిందించవచ్చా? అని అడుగుతాడు బాహుకుడి రూపంలో ఉన్న నలుడు.* 


*ఇది తెలిసిన దమయంతి ఆయనే నలమహారాజని నమ్ముతుంది. అందుకే దమయంతి ద్వితీయ స్వయం వర ఆహ్వాన మంటూ రుతుపర్ణుడికి మాత్రమే పంపించ మని తండ్రిని కోరుతుంది.*



*రుతుపర్ణుడు బాహుకుడిని వెంటబెట్టుకుని స్వయంవరానికి వెళ్తాడు.* 


*దారిలో నీకు అశ్వహృదయం విద్య తెలిస్తే నాక్కూడా మరో విద్య తెలుసునని, దాని ద్వారా చెట్టుకు ఎన్ని కొమ్మలు రెమ్మలు ఉన్నాయో సరిగ్గా లెక్క చెప్పవచ్చు నంటాడు రుతుపర్ణుడు. ఆ విద్యను నలుడికి ఉపదేశిస్తాడు.* 



*దాని మహిమ వల్ల కలిపురుషుడు, చెడులక్షణాలూ ఉండజాలవు. కాబట్టి నలుడి నుంచి కలి పురుషుడు బయటకు వస్తాడు. తనను సంహరించ ప్రయత్నించిన నలుడిని క్షమించమని నలుడి కాళ్లపై పడతాడు.*


*కర్కోటకుడు కాటు వేసినప్పటి నుండే నేను మంటలతో చచ్చిపోతున్నాను. నేనింక నీ జోలికి ఎప్పుడూ రాను. ఆ తాండ్ర చెట్టు దగ్గరే పడిఉంటానని వేడుకుంటాడు.*


*అప్పుడు మహారాజు స్వయంవరం చేరుకుంటాడు. హడావుడేమీ లేకపోవడంతో ఆశ్చర్యానికి లోనవుతారు.* 


*అప్పుడు దమయంతి సభలోకి వచ్చి అదే ప్రశ్న మళ్లీ వేస్తుంది.* 


*అది ధర్మం కాదు గానీ కలి ప్రభావం వల్ల అలా చేశానని చెబుతాడు నలుడు.* 


*ద్వితీయ స్వయంవరం కూడా నిన్ను చేరడానికేనని చెబుతుంది దమయంతి.*


*నలుడు కర్కోటకుడిని తలచుకుంటాడు. దివ్యవస్త్రం వస్తుంది.* 


*అది ధరించగానే విషప్రభావం నశించి, కురూపి రూపం పోయి, నలమహారాజులా మారిపోతాడు.*


*అప్పుడు కలి వచ్చి, రాబోయే కాలంలో నీ చరిత్రను పద్యరూపంలోనో, గద్యరూపంలోనో, మరే రూపేణా విన్నా, పాడినా, తలచినా వారి జోలికి వెళ్లనని వరమిస్తాడు*


*కలి నుండి మనం ఎలా తప్పించు కోగలం*


*****************************


_*ఈ కాలం పేరే కలి కాలం కలి ఎలాగైనా వెంటాడి తీరుతాడు. ఈ యుగం లో ధర్మం అడుగంటి ఉంటుంది. కావున ఎవరికైనా చిన్న సాయం చేసినా, కలి నుండి మనం కొంత తప్పించు కుంటాం .*_


_*మనస్ఫూర్తిగా రోజు ఒక్క సారైనా దైవ స్మరణ చేసిన చాలు కలి నుండి మనం కొంత తప్పించు కుంటాం .*_


_*దాన ధర్మం లు చేయడం,*_ 


_*పెద్దల శ్రాద్ధ కర్మలు మర్చి పోకుండా చేయడం, నోరు లేని జీవాలను ఆదరించడం,*_


_*కాశీకి వెళ్లినట్టు మనసులో తలచుకొన్న చాలు. కలి నుండి మనం కొంత తప్పించు కుంటాం.*_


_*దైవ సంబంధమైన చర్చల్లో భజనలలో, పాల్గొన్నాచాలు. కలి పురుషునికి దూరంగా ఉండవచ్చు.*_


_*ప్రతి ఒక్కరు నిత్యం ఒక్కసారైనా క్రింది పద్యాన్ని స్మరిస్తే కలి భయం ఉండదు.*_


_*"కర్కోటకస్య నాగస్య దమయంత్యాః నలస్యచ!*_


_*ఋతుపర్ణస్య రాజర్షేః కీర్తనం కలి నాశనం!*_


_*దమయంతి నలాభ్యాంచ ప్రణమామి పునః పునః*_🙏

శ్రీమద్భగవద్గీత

 🙏శ్రీమద్భగవద్గీత🙏

6వ అధ్యాయము 

ధ్యాన యోగము


సుహృన్మిత్రార్యుదాసీనమధ్యస్థద్వేష్యబంధుషు ।

సాధుష్వపి చ పాపేషు సమబుద్ధిర్విశిష్యతే ।। 9 ।।


సుహృత్ — శ్రేయోభిలాషుల యందు; మిత్రా — మిత్రులు; అరి — శత్రువులు; ఉదాసీన — తటస్థుల యందు; మధ్య-స్థ — మధ్యస్థులు; ద్వేష్య — ఈర్శాపరులు; బంధుషు — బంధువులు; సాధుషు — సాధువులు; అపి — కూడా; చ — మరియు; పాపేషు — పాపులు; సమ-బుద్ధిః — సమానమైన భావము (ఒక్క లాగే చూసే); విశిష్యతే — సర్వశ్రేష్ఠమైనవాడు.


భావము 6.9: శ్రేయోభిలాషులను, మిత్రులను, శత్రువులను, సాధువులను మరియు పాపులను - యోగులు నిష్పక్షపాత బుద్ధితో చూస్తారు. మిత్రుల, సహచరుల, శత్రువుల పట్ల సమబుద్ధి తో ఉంటూ, శత్రువుల, బంధువుల పట్ల తటస్థంగా, మరియు, పుణ్యాత్ములు, పాపాత్ముల పట్ల పక్షపాతం లేకుండా - ఉన్న యోగి మానవులలో సర్వ శ్రేష్ఠుడు గా పరిగణించబడుతాడు.


వివరణ: 

మిత్రుల పట్ల, శత్రువుల పట్ల వేరే వేరే విధంగా స్పందించటం మానవ సహజ స్వభావం. కానీ, ఒక ఉన్నత స్థాయి యోగి యొక్క స్వభావము వేరుగా ఉంటుంది. భగవంతుని విజ్ఞానము కలిగిఉన్న, ఉన్నతమైన యోగి, ఈ సమస్త సృష్టిని భగవంతుని కన్నా అబేధముగా చూస్తాడు. ఈ విధంగా, వారు అన్ని ప్రాణులను సమ దృష్టి తో చూడగలుగు తారు. ఈ సమత్వ దృష్టి కూడా చాల స్థాయి లలో ఉంటుంది:


1. "అన్ని ప్రాణులు దివ్య ఆత్మలు, కాబట్టి భగవంతుని అంశలే." అందుకే వారు సమానంగా చూడబడుతారు. “ఆత్మవత్ సర్వ భూతేషు యః పశ్యతి స పండితః” "నిజమైన పండితుడు అందరినీ జీవాత్మలుగా చూస్తాడు, కాబట్టి తన లాంటి వారిగానే చూస్తాడు."


2. అంతకన్నా ఉన్నత మైన దృష్టి ఇది: "భగవంతుడు అందరిలో ఉన్నాడు, కాబట్టి అందరూ గౌరవింపబడతగిన వారే."


3. అత్యున్నత స్థాయి లో, యోగి ఈ విధమైన దృష్టి ని పెంపొందించుకుంటాడు: "ప్రతి ఒక్కరూ భగవత్ స్వరూపాలే." జగత్తు అంతా యదార్థంగా భగవంతుని స్వరూపమే అని వైదిక వాజ్ఞయం పదే పదే పేర్కొంటున్నది: ఈశావాస్యం ఇదం సర్వం యత్ కించ జగత్యాం జగత్ (ఈశోపనిషత్తు 1) "సమస్త విశ్వము తనలో ఉన్న చర-అచర వస్తువులతో పాటుగా కూడా, ఆ భగవంతుని ప్రాదుర్భావమే (manifestation), దాని అంతటా ఆయన నిండి ఉంటాడు. "పురుష ఏవేదం సర్వం” (పురుష సూక్తం); “భగవంతుడు ఈ ప్రపంచంలో ప్రతి చోటా నిండి ఉన్నాడు, ప్రతిదీ ఆయన శక్తి స్వరూపమే." కాబట్టి అత్యున్నత యోగి ప్రతివారినీ భగవత్ సాక్షాత్కారముగా చూస్తాడు. ఈ విధమైన జ్ఞానదృష్టి కలిగిఉండి, హనుమంతుడు అంటాడు: "సీయా రామ మయ సబ జగ జానీ” (రామాయణం)", నేను ప్రతివారిలో సీతా రాముల ముఖాన్నే చూస్తాను." అని.


6.31 శ్లోక వ్యాఖ్యానం లో ఈ వర్గాలు మరింత విశదంగా వివరించబడ్డాయి. ఈ మూడు వర్గాలను సూచిస్తూ, అందరు వ్యక్తుల పట్ల సమత్వ దృష్టి కలిగిన యోగి, ఇంతకు క్రితం శ్లోకం లో చెప్పబడిన యోగి కన్నా ఉన్నతమైనవాడు అని అంటున్నాడు శ్రీ కృష్ణుడు. యోగ స్థితి ని గురించి వివరించిన శ్రీ కృష్ణుడు, తదుపరి శ్లోకం నుండి మొదలిడి, ఈ స్థాయిని చేరుకోగలిగే అభ్యాస విధానాన్ని వివరిస్తున్నాడు.

బ్రాహ్మణ కులం

 -: బ్రాహ్మణ కులం..శాఖలు..సమస్యలు:-


బ్రాహ్మణ కులం అంతా ఒకటేనని చాలా మంది అభిప్రాయం. కానీ బ్రాహ్మణులలో అనేక శాఖలు ఉన్నాయి.ఈ శాఖలు పుట్టడానికి అనేక కారణాలు ఉన్నాయి.

బ్రాహ్మణ కులం ముఖ్యంగా వేదాల అధ్యయనం, ప్రచారం, పరిరక్షణ కొరకు ఏర్పడింది అని భావించవచ్చును.

          

వేదాల  అధ్యయనం , పరిరక్షణ, ప్రచారం కొరకు ఉద్భవించిన బ్రాహ్మణ కులంలో అనేక శాఖలు ఏర్పడినవి. ఋగ్వేదం ప్రత్యేకంగా అధ్యయనం చేసే వారు ఋగ్వేద బ్రాహ్మణులనీ,యజుర్వేదాన్ని పఠించే వారిని యజుర్వేద బ్రాహ్మణులు అనీ అలాగన్న మాట.ఉత్తర , దక్షిణ భారతదేశంలో అనేక శాఖలు ఏర్పడినవి. ప్రాంతీయ భేదాలతో కూడా అనేక ఉప శాఖ లు ఏర్పడినవి. పూజించే దేవుళ్ళు ,వృత్తి భేదాలు, భాషా భేదాలు, తదితరాలు ఇందుకు కారణం ఐనాయి. కాలక్రమంలో వివిధ సాంప్రదాయాలు  కూడా పుట్టాయి. ఇవీ కొన్ని భేదాలకు కారణం ఐనాయి. ఇలా బ్రాహ్మణ కులం శాఖోపశాఖలుగా విభజనకు గురైంది.

 ఈనాడు ఉత్తర, దక్షిణ భారతదేశంలో అనేక శాఖలు ఉన్నాయి. దక్షిణ భారతదేశంలో మళ్ళీ రాష్ట్రానికి ఒక్కో రకంగా విభజనలు ఉన్నాయి.

ఉదాహరణకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లలోఈ క్రింద చూపబడిన శాఖలు ప్రముఖంగా  మనకు కనిపిస్తాయి.


* కొన్ని బ్రాహ్మణుల శాఖలు వాటి ఉప శాఖలు*


*ద్రావిడ శాఖ*


1) ప్రధమ శాఖ ద్రావిడ 

2)ద్రావిడ 

3)పేరూరు ద్రావిడ 

4)పెద్ద ద్రావిడ 

5)దిమిలి ద్రావిడ 

6)ఆరామ ద్రావిడ 

7)పుదూరు ద్రావిడ 

8)కోనసీమ ద్రావిడ

9)ద్రావిడ వైష్ణవులు  

10)తుమ్మగంటి ద్రావిడ 

11)తుమ్మ ద్రావిడ 

12)ద్రావిడ నియోగుల

*వైష్ణవ బ్రాహ్మణ శాఖలు*

1)శ్రీవైష్ణవులు 

2)నంబులు

3)గోల్కొండ వ్యాపారులు

4)ఆచార్యులు 

5)మర్థ్యులు

6)వ్యాపారులు 

7)కరణకమ్మ వ్యాపారులు 

8)బడగల కరణకమ్మ 

9)మెలిజేటి కరణకమ్మ 

10)దారుకులు

11)యజ్ఞవల్క్యులు

12)యజుశ్యాఖీయులు

13)బడగ కన్నడలు

14)నంబూద్రి బ్రాహ్మలు

15)వైఖానసులు 

16)మధ్వలు

17)కాణ్వులు 

18)కాణ్వేయులు

19)నియోగి వైష్ణవులు

*శివార్చక బ్రాహ్మణ శాఖలు*

1)మహారాష్ట్ర చిత్సవనులు 

2)లింగార్చకులు

3)ఆదిశైవులు 

4)శివార్చకులు 

5)వీరశైవులు 

6)మోనభార్గవ శైవులు 

7)కాశ్యప శైవులు 

8)శైవులు 

9)ప్రధమ శాఖ శైవులు 

10)రుద్ర శైవులు 

11)పరమ శైవులు 

12) శివ పూజారులు 

13) శైవ స్మార్తులు 


*నియోగి బ్రాహ్మణ శాఖలు*


1)ప్రధమ శాఖ నియోగి 

2)ఆరువేల నియోగి 

3)నందవరీక నియోగి 

4)లింగధారి నియోగి 

5)ఉంత్కఖ గౌడ నియోగి 

6)ఆరాధ్య నియోగి 

7)అద్వైత నియోగి 

8)నియోగి వైష్ణవులు 

9)పాకనాటి నియోగి 

10)ప్రాజ్ఞాటి నియోగి 

11)పొంగినాడు నియోగి 

12)నియోగి ఆది శైవులు 

13)యజ్ఞవల్క్య నియోగి 

14)ఆరాధ్యులు 

15)వేమనారాధ్యులు 

16)తెలగాణ్యు నియోగి

17)కరణకమ్మ నియోగి 

18)బడగల కరణకమ్మ నియోగి 

19)కరణాలు


*వైదీక బ్రాహ్మణ శాఖలు*


1)వెలనాటి వైదీక 

2)వెలనాట్లు 

3)వెలనాటి పూజారులు 

4)కాసలనాటి వైదీక 

5)కాసలనాట్లు

6)ములకినాట్లు 

7)ములకినాటి వైదీక 

8)తెలగాణ్యులు 

9)వేగనాట్లు 

10)వేగనాటి వైదీక 

11)వెలనాటి అర్చకులు 

12)ప్రధమ శాఖ వైదీక 

13)కరణకమ్మ వైదీక 

తదితరాలు..


         ఐతే ఇవన్నీ అంతర్ వివాహ సమూహాలుగా మనకు కనిపిస్తాయి. అంటే ఒక శాఖ వారు ఇంకో శాఖ వారికి తమ అమ్మాయిని ఇవ్వరన్న మాట. అనేక వివాహ వేదికలు విఫలం కావడానికి ఇదో కారణం.మా శాఖయే గొప్ప అంటే మా శాఖయే గొప్ప అనే ఛాందసవాదులూ ఉన్నారు.మధ్య యుగాలలో మా శాఖ యే గొప్పదని పరస్పరం పోరాడిన ఉదంతాలూ చరిత్రలో ఎన్నో ఉన్నాయి. ఈ శాఖల వలన అనేక వాదాలు, వివాదాలు కూడా ఏర్పడటం మనం గమనించవచ్చు. వివాహాలు విఫలం అయ్యే పరిస్థితులు కూడా ఉన్నాయి. ఈమధ్య కాలంలో అనేక మార్పులు వస్తున్నప్పటికీ మరింత మార్పు బ్రాహ్మణ కులంలో రావలసిన అవసరం ఉంది. అసలే నిరుద్యోగం, రిజర్వేషన్ ల  లేమి వలన సమస్యలు ఎదుర్కొంటున్న బ్రాహ్మణులు ఈ శాఖల వలన మరింతగా నష్టపోతున్నారని చెప్పవచ్చును.తమలోని శాఖా భేదాలను తొలగించుకొని మారుతున్న సమాజంలో తమవంతు పాత్ర పోషించి అందరికీ ఆదర్శంగా నిలవాల్సిన అవసరం ఉంది.

           (సశేషం)

ప్రాజ్ఞ్ముఖంగా

 #ముక్కోటిఏకాదశి అనంతమైన పుణ్యఫలం అని చెప్పుకోవాలి. భారతీయులు కాంతిని ఆరాధించేటటువంటి వారు. ప్రాజ్ఞ్ముఖంగా ప్రయాణించేటటువంటి వారు. దేహంలో ఎప్పుడూ కూడా ఎడమ భాగాన్ని కుడి భాగం నియంత్రిస్తూ ఉంటుంది. వామ భాగం స్త్రీ సంబంధితమైనటువంటి భాగం. ప్రేమ, పారమార్థిక దృష్టి, లౌకిక సుఖములు, ఆనందములు ఇవన్నీ కూడా ఉత్తర దిక్భాగంలో ఉంటాయి. వీటన్నింటినీ నియంత్రించేది ఎడమ భాగం. అలాగే మన దృష్టి కూడా నిరంతరం ఎడమ వైపుకే ప్రసరిస్తూ ఉంటుంది. ఉత్తరం దిక్కుకు ధనము, సంపద వంటి వాటికి ప్రాముఖ్యత ఉంది. అన్నింటికంటే మించి ఈ విశాల విశ్వమంతా కూడా తన చుట్టూ తానూ తిరుగుతూ సూర్యుడి చుట్టూ తిరుగుతుంది అనుకుంటే ఈ విశ్వంలో ఉండే అంతర్భాగము axil అంటారు దానిని అది దీనికి వ్యతిరేకంగా తిరుగుతూ ఉంటుంది. ఈ విశ్వము దక్షిణం వైపునుంచి ఉత్తరం వైపుకు anti clockwise తిరుగుతూండగా అందులోని అంతర్భాగం ఉత్తరం వైపునుంచి దక్షిణానికి clockwise తిరుగుతుంది. "ప్రాగ్ ఆరభ్య దక్షిణేణ వర్తనం" మన హిందూ ధర్మంలో అందుకోసమే ఆలయానికి వెళ్తే ప్రదక్షిణ చేయాలి - ప్రాగ్ ఆరభ్య దక్షిణేన వర్తనం. ఉత్తరంగా, ఈశాన్యంగా, తూర్పుగా, ఆగ్నేయం, దక్షిణం ఇలా ప్రదక్షిణ చేస్తూ ఉంటాం. కనుక ఈ రెండింటి మధ్య ఉండే వైరుధ్యం వల్ల కలిగిన ఆకర్షణ శక్తి చేత మనం ఈ భూమిమీద అంటిపెట్టుకొని ఉన్నాం దానికే భూమ్యాకర్షణ శక్తి అని పేరు.


ఈరోజున ఉత్తర దిగ్భాగ మార్గాన్ని అనుసరించి ఇంక రెండు మూడు రోజులలో సూర్యనారాయణ మూర్తి ఉత్తర దిగ్భాగంలో ప్రయాణం చేస్తూంటాడు. ఈరోజున మనం ఉత్తర దిగ్భాగంతో ప్రయాణం ప్రారంభం చేసినట్లయితే తప్పకుండా కైవల్యం లభిస్తుంది. ఈ భూమితో ఉండే ఆకర్షణ సంబంధిత సంబంధాలన్నీ కూడా తొలగిపోయి ఆ శ్రీమన్నారాయణ మూర్తిని చేరుకుంటాము. భవ బంధనాలన్నీ కూడా తొలగిపోతాయి. అనేటటువంటి రహస్యాన్ని కనుగొన్న ప్రాచీనులు ఈ అంశాలన్నీ కూడా శాస్త్రోక్తంగా చెప్తే అందరికీ అర్థం అవుతాయో లేదో అనే ఉద్దేశ్యంతో కథలను జోడించి విభీషణ శరణాగతి కథ, వైకుంఠ ఏకాదశి కథ, ముప్పది మూడు కోట్ల దేవతలతో ఆ స్వామి ఈనాడు మనకు దర్శనమిస్తాడు. మూడు కోట్లతో రంగధాముని దర్శనమిస్తాడు. ఇలా చెప్పి ఆలయాలవైపు మనల్ని మరల్చారు. స్వామి దర్శనం చేసుకోండి అంటూ అనుజ్ఞనిచ్చారు. మన ప్రయత్నం కాకుండా గురువుతో ప్రయత్నం కావాలి. స్వప్రయత్నం కూడదు అంటుంది ధర్మము. కాబట్టి నారాయణుడే అటువంటి మనలో జ్ఞానమును ప్రేరేపించు వాడు. ఆయన ప్రపన్నుడు. అడిగిన వాళ్ళందరికీ కూడా ఆశ్రయం ఇచ్చే ప్రపన్నుడు. ఎవరిని రక్షించాలా? అని సంసిద్దుడై ఉంటాడుట. కాబట్టి ఉత్తర ద్వార దిశగా మనం ప్రయాణం చేస్తే తప్పకుండా కోరిన కోరికలు నేరవేరుతాయి. అన్నింటికంటే కోరవలసినది ఏమున్నది? - ఈ లోకంతో భవ బంధనాలనుంచి విముక్తి. మోక్షము అంటే "ముచిల్ మోక్షణే" అని అర్థం. బంధనాలనుంచి ముక్తిని పొందడము, విముక్తిని కలిగించుకోవడము అని అర్థం. అందుకే ఉత్తర దిశ ఇంత ప్రాముఖ్యం కలది, ఇంతగా విశేషత ఈ పండుగకు ఉన్నది.

యజ్ఞోపవీత మహిమ యజ్ఞోపవీత మహిమ

 యజ్ఞోపవీత మహిమ 


వైదిక సంస్కారాలతో పరిచయం ఉన్న ప్రతివారికీ సుపరిచితమైంది ‘యజ్ఞోపవీతం’. 


దీనినే తెలుగులో ‘జ్యంద్యం’ అంటాం. 


ఇది చాలామంది మెడలో వేలాడుతూ ఉంటుంది కానీ, ఇది అలా ఎందుకు వేలాడుతుందో చాలామందికి తెలియదు. 


ఇలా మెడలో ఈ యజ్ఞోపవీతాలను వేసుకున్న వారు నిష్టతోనూ, కొందరు ఆచారం మీద మక్కువతోనూ, కొందరు ఇతరుల ముందు ప్రదర్శన కోసం, మరికొందరు అవసరార్థం ఉపయోగించేవారుగా కనపడతారు. 


యజ్ఞోపవీతాన్ని ‘బ్రహ్మసూత్రం’ అని కూడా అంటారు. 


దీన్ని ఎందుకోసం ధరించాలో ధర్మశాస్త్రాలు ఈ విధంగా చెబుతున్నాయి.


’సూచనాత్ బ్రహ్మతత్త్వస్య 


   వేదతత్త్వస్య సూచనాత్


తత్సూత్రముపవీతత్వాత్ 


బ్రహ్మసూత్రమితి స్మృతమ్’!!


బ్రహ్మతత్త్వాన్ని సూచించడానికి, వేదతత్త్వాన్ని సూచించడానికి బ్రహ్మసూత్రాన్ని (యజ్ఞోపవీతాన్ని) ధరించాలి. అదే ఉపవీతం. అంటే రక్షణ వస్త్రం.  


యజ్ఞోపవీతాన్ని, శిఖనూ తప్పనిసరిగా ధరించాలని స్మృతులు పేర్కొంటున్నాయి. యజ్ఞోపవీతం పరమ పవిత్రమైనది. 

అది ప్రజాపతి అయిన బ్రహ్మతో కలిసి పుట్టిందని


 ‘యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతేర్యత్సహజం పురస్తాత్...’


 అనే మంత్రం చెబుతోంది.  


యజ్ఞోపవీతాన్ని నవతంతువులతో (తొమ్మిది దారపుపోగులతో) నిర్మించాలి. 


ఒక్కొక్క తంతువునకు ఒక్కొక్క దేవత ఉంటాడని స్మృతుల కథనం - 


‘ఓంకారో హోగ్నిశ్చ నాగశ్చ సోమః పితృప్రజాపతీ 

వాయుః సూర్యశ్చ సర్వశ్చ తన్తుదేవా అమీ నవ 

ఓంకారః ప్రథమే తంతౌ ద్వితీయేహోగ్నిస్థథైవ చ

తృతీయ నాగదైవత్యం చతుర్థే సోమదేవతా 

పంచమే పితృదైవత్యం షష్ఠేచైవ ప్రజాపతిః

సప్తమే మారుతశ్చైవ అష్టమే సూర్య ఏవ చ 

సర్వేదేవాస్తు నవమే ఇత్యేతాస్తంతు దేవతాః’!!


మొదటి తంతువులో ఓంకారం,

 రెండవ తంతువులో అగ్నిదేవుడు, 

మూడవ తంతులో నాగదేవత, 

నాలుగవ తంతువులో సోమదేవుత, 

ఐదవ తంతువులో పితృదేవతలు, 

ఆరవ తంతువులో బ్రహ్మదేవుడు, 

ఏడవ తంతువులో వాయుదేవుడు, 

ఎనిమిదవ తంతువులో సూర్యుడు, 

తొమ్మిదవ తంతువులో మిగిలిన దేవతలందరూ ఉంటారని ఈ శ్లోకాల్లోని పరమార్థం. 


‘యజ్ఞోపవీతం’ కేవలం తంతు సముదాయం మాత్రమే కాదని అదొ తొంభైయారు విషయాలకు ప్రతీక అని సామవేదఛాందోగ్య పరిశిష్టం చెబుతోంది. 


’తిథివారం చ నక్షత్రం తత్త్వవేదగుణాన్వితమ్

కాలత్రయం చ మాసాశ్చ బ్రహ్మసూత్రం హి షణ్ణవమ్’


ఈ శ్లోకంలో తాత్పర్యం ఇది. 


తిథులు 15, వారాలు 7, నక్షత్రాలు 27, తత్త్వాలు 25, వేదాలు 4, గుణాలు 3, కాలాలు 3, మాసాలు 12 మొత్తం 96. 

అంటే యజ్ఞోపవీతాన్ని ధరించిన వారికి తిథులలోనూ, వారాలలోనూ, నక్షత్రాలలోనూ, తత్త్వాలలోనూ, వేదాలలోనూ, గుణాలలోనూ, కాలాలలోనూ, మాసాలలోను పవిత్రత ఏర్పడి అవన్నీ ధరించిన వారికి శుభఫలాలను కలిగిస్తాయని అర్థం.


 ‘యజ్ఞోపవీతం’ తొంభైయారు కొలతలతో కూడి ఉండాలని ‘వశిష్ఠస్మృతి’ చెబుతోంది. 


’చతుర్వేదేషు గాయత్రీ చతిర్వింశతికాక్షరీ

తస్మాచ్చతుర్గుణం కృత్వా బ్రహ్మతంతుముదీరయేత్’


నాలుగు వేదాల్లోనూ గాయత్రీ మంత్రం 24 అక్షరాలుగానే ఉపదేశించబడింది. 


అందువల్ల ఆ మంత్రంలోని అక్షరాల సంఖ్యకు నాలుగింతలుగా అంటే (24X4=96) తొంభైయారు తంతువులుగా యజ్ఞోపవీతాన్ని నిర్మించుకుని ధరించాలని ఉపదేశం. 


గాయత్రీ మంత్రాన్ని స్వీకరించే సమయంలో ధరించేది యజ్ఞోపవీతం. కనుక, గాయత్రీ మంత్రాక్షరాలకు నాలుగింతల సంఖ్యతో కూడిన తంతువులు ఉండాలని తాత్పర్యం. 


యజ్ఞోపవీతాన్ని ఏ పరిమాణంలో తయారు చేసుకోవాలో సాముద్రిక శాస్త్రం చక్కగా ప్రబోధిస్తోంది. 


’పృష్ఠదేశే చ నాభ్యాం చ ధృతం యద్విందతే కటిమ్

తద్ధార్యముపవీతం స్యాత్ నాతిలంబం నచోచ్చ్రితమ్

ఆయుర్హ రత్యతిహ్రస్వం అతిదీర్ఘం తపోహరమ్

యశో హరత్యతి స్థూలం అతి సూక్ష్మం ధనాపహమ్’!!


అంటే యజ్ఞోపవీతం నడుము వరకు మాత్రమే వేలాడుతుండాలి. 

దానికంటే పైన గానీ, క్రిందుగాగానీ ఉండడం మంచిది కాదు. మరీ చిన్నగా ఉంటే ఆయుష్యం తగ్గిపోతుంది. మరీ పొడవుగా ఉంటే చేసిన తపస్సు నశిస్తుంది. లావుగా ఉంటే కీర్తి అంతరిస్తుంది. మరీ సన్నగా ఉంటే ధనం నష్టమౌతుంది.


బ్రహ్మచారి ఒక యజ్ఞోపవీతాన్నీ, గృహస్థుడు రెండు యజ్ఞోపవీతాలను ధరించాలి. వీళ్ళిద్దరూ ఉత్తరీయానికి ప్రత్యామ్నాయంగా అదనంగా మరో యజ్ఞోపవీతాన్ని ధరించాలి. ఆరు నెలలు కాగానే యజ్ఞోపవీతం జీర్ణమైపోతుంది. కనుక ప్రతి ఆరు నెలలకు ఒకసారి యజ్ఞోపవీతాన్ని ధరించి, పాతబడిన దానిని తొలగించాలి.


యజ్ఞోపవీతాన్ని ధరించే సమయంలోనూ, తొలగించే సమయంలో నిర్ధిష్ట మంత్రాలను తప్పక పఠించాలి. మంత్ర పఠనం కాకుండా యజ్ఞోపవీతధారణ, విసర్జనలు పనికిరావు. అశౌచాలవల్ల (ఆప్తుల జనన, మరణ సమయాలలో) ఇతర అమంగళాలు కలిగిన సంధర్భాలలో విధిగా యజ్ఞోపవీతాలను మార్చుకోవాలి. 


యజ్ఞోపవీతం ధారణ మంత్రం:-

💐💐💐💐💐💐💐💐💐💐💐


“ యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతేః యత్సహజం పురస్తాత్

ఆయుష్యం అగ్రియం ప్రతిముంచ శుభ్రం యజ్ఞోపవితం బలమస్తు తేజః


ఈ విధంగా జపిస్తూ క్రొత్త జంద్యం వేసుకోవాలి.


యజ్ఞోపవీతం విసర్జన మంత్రం:-

💐💐💐💐💐💐💐💐💐💐

 ఉపవీతం ఛిన్నతంతుం జీర్ణం కశ్మలదూషితం విసృజామి యశోబ్రహ్మవర్భో దీర్ఘాయురస్తుమే 

------------------------^--------

ఈ విధంగా జపిస్తూ పాత జంద్యం తీసి వేయాలి.

తీసువేసేటప్పుడు పాదాలకు తగలకుండా

నడుము నుంచి క్రిందకు తీసివేసి ఇంటి చూరుపై గాని చెట్లపై గాని ఎవరూ త్రొక్కకుండా ఉండేవిధంగా కానీ లేక ఏదైనా నదిలో గాని విసర్జన చేయాలి.


యజ్ఞోపవీతాన్ని పరిహాసం కోసం వాడడం, ఇతర వస్తువులను కట్టి అపవిత్రం చెయ్యడం ఎంతమాత్రం పనికిరాదు. అలాచేస్తే సమస్తపాపాలు చుట్టుకుంటాయి. 


ఒక్క మాటలో చెప్పాలంటే యజ్ఞోపవీతంలోని మన శరీరంలోని ప్రాణనాడులే! వాటిని ఎంత జాగ్రత్తగా కాపాడుకుంటామో, యజ్ఞోపవీత తంతువులను కూడా అంతే జాగ్రత్తతో సంరక్షించుకోవాలి. యజ్ఞోపవీతం మనిషి శ్రేయస్సుకోసం ఉపయోగపడాలే కానీ ప్రదర్శనకోసం కాదు. ప్రదర్శన కోసం వేసుకోనక్కరలేదు. 


ధర్మాలను ఆచరిస్తూ ధరించాలి. 


ఇదే యజ్ఞోపవీత మహిమ!


ఓం తత్సత్......

సర్వేజనా సుఖినోభవంతూ.......


ॐॐॐॐॐॐॐॐॐॐॐॐॐॐॐॐॐॐ

కర్త ఈశ్వరుడే

 అన్నింటికి కర్త ఈశ్వరుడే* 


గొడ్డలి కట్టెలను కొడుతుంది. గొడ్డలి గొప్పతనం కాదు. 
కలం గొప్ప గ్రంధాలను వ్రాస్తుంది. కలం గొప్పతనం కాదు. 
మనం గొప్ప గొప్ప పనులు చేస్తాం. మన గొప్పతనం కాదు...

అన్నింటికి కర్త అయిన ఈశ్వరునిదే ఆ గొప్పతనం. మనం కేవలం నిమిత్త మాత్రులం. ఈశ్వరుని చేతిలో పనిముట్లం.. అని భావిస్తూ సర్వ కర్మలను, కర్మ ఫలాలను ఈశ్వరుని యందు వదిలి భక్తుడు నిశ్చింతుడై యుండాలి...

ఓక రోజు.. కాశి వెళ్ళే ట్రైను కదిలింది. ఆదరాబాదరాగా పరుగెత్తుకుంటూ ఒక పల్లెటూరి వ్యక్తి రెండు పెట్టెలు నెత్తిమీద పెట్టుకొని ఎలాగో శ్రమపడి రైలు ఎక్కాడు. అతడు రొప్పుతూ రోజుతూ, చెమటలు పట్టి ఉన్నాడు. అటూఇటూ చూచి ఒకచోట సీటు ఉంటే కూర్చున్నాడు. కూర్చొని తాను తెచ్చిన పెట్టెలను తన తలపై ఉంచుకొని ప్రయాణం చేస్తున్నాడు. ప్రక్కన కూర్చున్న వ్యక్తి ఈ పల్లెటూరు ఆసామిని అడుగుతున్నాడు. అయ్యా! ఆ పెట్టెలను ఎందుకు నెత్తిమీద పెట్టుకొని మోస్తున్నావు..? నీ సీటు క్రింద పెట్టుకోవచ్చు గదా.. అన్నాడు. దానికా పల్లెటూరి ఆసామి అంటున్నాడు.. "బాబూ! నేను నాకే టికెట్టు తీసుకున్నాను. వీటిని రైలు మోస్తుందో మోయలేదో తెలియదు గదా.. అందుకే నేనే మోస్తున్నాను అని అన్నాడట. దానికా వ్యక్తి అతడి అమాయకత్వానికి నవ్వి.. నాయనా! నిన్నూ, నీ పెట్టెలను అన్నింటిని ఆ రైలే మోస్తుంది. నీవు నెత్తిమీద పెట్టుకున్నా వాటి బరువును రైలే మొయ్యాలి. ఎందుకు అనవసరంగా నెత్తిన పెట్టుకొని హైరాన పడతావు.. క్రింద పెట్టుకో.. ఏం ఫరవాలేదు అన్నాడు. 

అలాగే ... అన్ని భారాలు మోసేవాడు ఆ ఈశ్వరుడు. అనవసరంగా అహంకారాన్ని నెత్తిన పెట్టుకొని అన్నీ నేనే మోస్తున్నానని భ్రమ పడుతూ ఉండరాదు. అన్నీ నావల్లనే జరుగుతున్నవి అనుకోరాదు. ఇదంతా ఒట్టి అహంకారం. ఈ అహంకారాన్ని వదిలితేనే భగవంతుని సాన్నిధ్యం లభించేది.

కనుక కర్మలన్నింటిని ఈశ్వరుని యందే విడిచిపెట్టాలి. అంటే... 

ఈశ్వరుని స్మరిస్తూ కర్మలు ప్రారంభించు.
ఈశ్వరుని స్మరిస్తూనే కర్మలను కొనసాగించు.
ఈశ్వరుని స్మరణతోనే కర్మలను ముగించు...

కర్మఫలాలను గురించి ఆలోచించకు. లభించిన దానిని ప్రసాద బుద్ధితో స్వీకరించు. నేను నిమిత్తమాత్రుడను అని భావించు. కర్త ఈశ్వరుడే అనే నమ్మకంతో ఉండు. ఏమి జరిగినా నిశ్చితంగా ఉండు. నేను చేస్తున్నాను, ఇది నా వల్లనే జరుగుతుంది అనే అహంకారాన్ని వదులు. ఈ అహంకారాన్ని వదలటమే కర్మలను ఈశ్వరుని లో సన్యసించుట. అలాచేస్తే నీవు ఈశ్వరుని చేతిలో మురళివైపోతావు.

ఇలా సర్వ కర్మలను ఈశ్వరుని తో సన్యసించి, ఈశ్వరుని ధ్యానం నే లక్ష్యంగా పెట్టుకోవాలి...

*|| ఓం నమః శివాయ నమః //*

అద్వైతచైతన్యజాగృతి

 *43-వేదములు📚((((((((((🕉))))))))))     ఆచార్య వాణి🧘‍♂️*

🕉🌞🌏🌙🌟🚩

🔥ఓంశ్రీమాత్రే నమః🔥

అద్వైతచైతన్యజాగృతి

🕉🌞🌏🌙🌟🚩


*16. వేదాంగములు : వ్యాకరణము*


((((((((((🕉))))))))))


*వేదపురుషుని ముఖస్థానము (నోరు) వ్యాకరణము. వ్యాకరణ సంబంధమైన రచనలెన్నో ఉన్నాయి. ఎక్కువ ప్రాచుర్యంలో ఉన్నది - పాణిని రచన. అది సూత్రాలతో నిండి యుంటుంది. ఆ సూత్రాలకు విపులమైన వ్యాఖ్య (వార్తికం) రచించినది వరరుచి. పతంజలి మహర్షికూడ ఒక వ్యాఖ్యానం రచించాడు. ఈ మూడు గ్రంథాలూ వ్యాకరణ శాస్త్రంలో ముఖ్యములు. ఇతర శాస్త్రాలకీ వ్యాకరణానికీ భేదముంది. ఇతర శాస్త్రాలలో సూత్రాలు భాష్యాల కంటె ప్రధానాలు. వ్యాకరణం విషయంలో అట్లాకాదు. సూత్రాల కంటె భాష్యమే ప్రధానం. సూత్రాలు వివరణ ఇవ్వక సూచికల వలె ఉంటాయి. ప్రతి శాస్త్రానికీ భాష్యముంటుంది. ప్రతిభాష్యానికీ, విషయం బట్టి ఒక పేరుంటుంది. వ్యాకరణభాష్య మొక్కదానినే మహాభాష్య మంటారు, దాని ప్రాధాన్యతను బట్టి. ఈ మహాభాష్యాన్ని రచించినది పతంజలి మహర్షి. వ్యాకరణమూ, శివుడూ: శివాలయాలలో ''వ్యాకరణ దాన మండప'' మంటూ ఒక మండప ముండేది. ఇది ఉండటానికి కారణమేమిటి? వైష్ణవాలయాలలో ఉండక పోవటానికి కారణమేమిటి? భాషకీ శివునకీ, ఆ మాటకొస్తే వ్యాకరణానికీ శివునకీ, సంబంధమేమిటి? నిజానికీ, దక్షిణామూర్తి రూపంలో శివుడు మౌని. దీని గురించి.*



 *ఈ శ్లోకం చూడండి : ''నృత్తావసానే నటరాజరాజో ననాద ఢక్కాం నవపంచవారం ఉద్ధర్తు కామః సనకాది సిద్ధాన్‌ ఏతత్‌ విమర్శే శివసూత్ర జాలం'' ''అచలుడై శివుడు మౌనంగా ఉంటాడు. నృత్యానంతరం శివుడు తన డమరుకాన్ని మ్రోగించినప్పుడు భాషాశాస్త్రం పుట్టింది'' ఈ శ్లోక తాత్పర్యమిది. నర్తనమాడే శివుని పేరు నటరాజు. ఆయనను మించిన నర్తకుడు లేడు. తాండవాధినేత ఆయన. మహానటుడాయన. నటరాజు ప్రతిమని చూస్తే ఆ తలనుండి ఏదో బయటకు వస్తున్నట్టు కనబడుతుంది - అది గంగతో, నెలవంకతో - అలంకృతం, అవే శివుని జడలు. శివుడు నాట్య మాడుతూన్నంత సేపూ ఆ జడలు కూడ తిరుగు తూంటాయి.నర్తన మాగిపోగానే ఆ జడలు రెండువైపులా పరచుకుంటాయి. ఆ క్షణాన్నే శిల్పి ఊహించి రాతి ప్రతిమగా, లోహపు ప్రతిమగా చెక్కుతాడు. నటరాజు చేతిలో డమరుకముంటుంది. మామూలుగా జోస్యం చెప్తూండే వాళ్ల చేతులలో ఉండేదాని కన్నా పెద్దదిగా ఉంటుంది. నర్తనం చేసేటప్పుడు శివుడు ఆ డమరుకాన్ని కూడ లయబద్ధంగా ఆడిస్తాడు.*



*పై శ్లోకంలో ''ననాదఢక్కాం'' అన్న మాటకిదే అర్థం. వాద్యాలనన్నిటినీ మూడు విధాలుగా విభజించ వచ్చు. అవి (1) చర్మవాద్యాలు - అంటే చర్మాన్ని ఉపయోగించేవి - ఢక్క, మృదంగం, మద్దెల, చెండ (కేరళలో) వంటివి. (2) తంత్రీవాద్యాలు - వీణ, వయోలిన్‌ వంటివి - తంత్రులనుపయోగించేవి. (3) వాయురంధ్ర వాద్యాలు - వీటిలో గాలిని కొన్ని రంధ్రాల ద్వారా బయటకు ఊదుతారు - వేణువు వంటివి. చర్మవాద్యాలను పలికించటానికి చేతివేళ్లనిగాని, కఱ్ఱలనిగాని ఉపయోగిస్తారు. వాద్యం అంతం కావస్తున్నప్పుడు వేగంగా వాయిస్తారు. ''చోపు'' అంటారు దీనిని. ఆ విధంగానే నృత్యం చివరికి వస్తున్నపుడు (''నృత్తావసానే'') చోపు ధ్వని వినబడింది. నటరాజు నృత్య మాడుతున్నప్పుడు సనక, పతంజలి వ్యాఘ్రపాదుడు వంటి ఋషులు తన్మయతతో తిలకిస్తూంటారు. వారు మహర్షులవటం వల్ల సామాన్యులు చూడలేని, ఆ నర్తనని చూడగలుగుతారు. నటరాజుని నర్తనం చూడటానికి దివ్యచక్షువులు కావాలి కదా! దేవతలు, ఋషులు, యోగులు తమ తపశ్శక్తి వల్ల నటరాజు నర్తనాన్ని చూచే శక్తిని సంపాదించారు. దేవుడ్ని చూడటానికి కావలసిన సామర్థ్యాన్ని ''దివ్యదృష్టి'' అంటారు. దీనినే భగవద్గీతలో ''దివ్య చక్షు'' వన్నారు.*




*సనకాది ఋషులు నటరాజు నర్తనాన్ని తమ కళ్లతోనే చూస్తూ ఆనందిస్తున్నారు. పెద్ద డోలుని విష్ణువు వాయిస్తూంటే, బ్రహ్మ తాళం వేస్తున్నాడు. నర్తనం పూర్తి కావస్తున్న సమయానికి ఢక్క నుండి, పధ్నాలుగు దరువులున్న ''చోపు'' వస్తుంది. పై శ్లోకంలోని ''నవపంచవారం''. అన్న పదం ఈ పధ్నాలుగు (తొమ్మిదికి అయిదు కలిపితే వచ్చేవి) దరువులనీ సూచిస్తుంది. డమరుకపు దరువుల విద్యలు కూడ పధ్నాలుగే. హిందూ ధర్మానికి ప్రాతిపదిక పధ్నాలుగు విద్యలైతే, నటరాజు కూడ డమరుకంతో పధ్నాలుగు దరువులనే ఇచ్చాడు. ఆ పధ్నాలుగు దరువులూ సనకాది ఋషులకు ఆధ్యాత్మిక ప్రగతిని ఇంకా కల్పించాయి అంటుంది ఈ శ్లోకం. ఈ సనకాదులెవరు? ఆలయాలలో దక్షిణామూర్తి చుట్టూ నలుగురు వృద్ధులు కూర్చున్నట్టుగా ప్రతిమలుంటాయి. ఆ నలుగురూ సనక, సనందన, సనాతన, సనత్‌ కుమారులనే మహర్షులు.*



*ఆ పధ్నాలుగు దరువులూ ఈ ఋషులకు శివరూప మెరగటానికి సోపానాలయాయి. ఆ శబ్దాలనే ''శివభక్తి సూత్రాలంటారు''. వీటిపై నందికేశ్వరుడొక భాష్యాన్ని వ్రాశాడు. ఆ శివతాండవాన్ని తిలకించిన వారిలో పాణిని ఒకడు. పాణిని గురించి కథా సరిత్సాగరంలో ఉంది. పాటలీపుత్రంలో (ఈనాటి పాట్నానగరం) వర్షోపాధ్యాయ, ఉపవర్షోపాధ్యాయ అని ఇద్దరుండే వారు. వారిలో రెండవవాడు చిన్నవాడు. అతని కుమార్తె ఉపకోశ్ల. పాణినీ, వరరుచీ వర్షోపాధ్యాయుని శిష్యులుగా విద్యనభ్యసిస్తూండేవారు. వీరిద్దరిలో పాణిని కొంచెం మందబుద్ధి. విద్య బాగా సాగలేదు. అందుచేత తపస్సు చేసుకోమని చెప్పి అతనిని హిమాలయాలకు పంపాడు గురువు. శిష్యుడు తపస్సు చేసి శివుని అనుగ్రహం సంపాదించాడు. నటరాజుని నర్తనాన్ని తన కళ్లతోనే చూడగలిగే భాగ్యాన్ని పొందాడు.*


🕉🌞🌏🌙🌟🚩

భగవంతుని ఇంద్రియములు

 భగవంతుని ఇంద్రియములు అంతటా ఉన్నాయి అని చెప్పిన పిదప, శ్రీ కృష్ణుడు ఇప్పుడు సరిగ్గా దానికి విరుద్ధంగా, ఆయనకు ఎటువంటి ఇంద్రియములు లేవని చెప్తున్నాడు. దీనిని మనం లౌకిక తర్కము ద్వారా అర్థం చేసుకోవటానికి ప్రయత్నిస్తే, ఇది పరస్పర విరుద్ధమైనదిగా అనిపిస్తుంది. "భగవంతునికి అనంతమైన ఇంద్రియములు ఉండి మరియు ఆయన ఇంద్రియములు లేకుండా కూడా, రెండూ ఎలా సాధ్యం?" అని అనిపిస్తుంది. కానీ, ఇలాంటి లౌకిక తర్కము మనోబుద్ధులకు అతీతమైన ఆయన పట్ల వర్తించదు. భగవంతుడు అనంతమైన పరస్పర విరుద్ధమైన గుణములు ఒకే సమయంలో కలిగి ఉంటాడు. బ్రహ్మ వైవర్తక పురాణం ప్రకారం:


విరుద్ధ ధర్మో రూపొసా వైశ్వర్యాత్ పురుషోత్తమాః


"పరమేశ్వరుడు అసంఖ్యాకమైన పరస్పర విరుద్ధ గుణములకు నిలయము." ఈశ్లోకంలో, శ్రీ కృష్ణుడు, భగవంతునికి ఉన్న అనంతమైన పరస్పర విరుద్ధ గుణములలో కొన్నింటిని ఇక్కడ పేర్కొంటున్నాడు.


ఆయనకు మనకున్నటువంటి ప్రాకృతిక ఇంద్రియములు ఉండవు, అందుకే ఆయనకు ఇంద్రియములు లేవు అని చెప్పటం సమంజసమే. సర్వేంద్రియ వివర్జితమ్ అంటే "ఆయనకు ప్రాకృతిక ఇంద్రియములు లేవు." అని అర్థం, కానీ, ఆయనకు సర్వత్రా ఉండే దివ్యమైన ఇంద్రియములు ఉన్నాయి, అందుకే భగవంతుని యొక్క ఇంద్రియములు సర్వవ్యాప్తమై ఉన్నాయి అని అనుకోవటం కూడా సమంజసమే. 'సర్వేంద్రియ గుణాభాసం' అంటే "ఇంద్రియములకు ఉండే స్వభావాన్ని వ్యక్తపరిచి ఇంద్రియవస్తు విషయములను గ్రహిస్తాడు. ఈ రెండు లక్షణములను పొందుపరుస్తూ, శ్వేతాశ్వతర ఉపనిషత్తు ఇలా పేర్కొంటున్నది:


అపాణిపాదో జవనో గ్రహీతా పశ్యత్యచక్షుః స శృణోత్యకర్ణః  (3.19)


"భగవంతునికి ప్రాకృతిక చేతులు, పాదములు, కళ్ళు, మరియు చెవులు ఉండవు. అయినా సరే ఆయన అన్నీ అవగాహన చేసుకుంటాడు, నడుస్తాడు, చూస్తాడు, మరియు వింటాడు."


అంతేకాక, శ్రీ కృష్ణుడు తానే ఈ సృష్టిలోని జగత్తు అంతటినీ పోషించి, సంరక్షించేవాడిని, అయినా దాని నుండి విడిగా ఆసక్తి రహితంగా ఉంటానని చెప్తున్నాడు. తన యొక్క విష్ణుమూర్తి స్వరూపంలో, శ్రీ కృష్ణ భగవానుడు సమస్త సృష్టిని పోషిస్తూ నిర్వహిస్తూ ఉంటాడు. సర్వ భూతముల హృదయములో స్థితుడై ఉండి, వారి కర్మలను నోట్ చేసుకుంటూ, వాటివాటి ఫలితములను అందిస్తూ ఉంటాడు. విష్ణుమూర్తి అధిపత్యమునకు లోబడి బ్రహ్మ దేవుడు, విశ్వమును నిలకడగా నిర్వహించటానికి, భౌతిక లౌకిక శాస్త్ర సూత్రములను మార్పు చేస్తూ ఉంటాడు. ఇంకా విష్ణుమూర్తి ఆధిపత్యములోని దేవతలు మనకు వాయువు, భూమి, నీరు, వర్షము మొదలైన, మన మనుగడకు అవసరమైన వాటిని సమకూరుస్తూ ఉంటారు. అందుకే, భగవంతుడే అన్నింటికీ నిర్వాహకుడు/పోషకుడు. అయినా, తనకు తానే పరిపూర్ణుడు అందుకే అందరితో విడివడి ఆసక్తిరహితముగా ఉంటాడు. వేదములు ఆయనను 'ఆత్మారాముడు' అని అంటాయి, అంటే "తనలో తానే రమించిపోయేవాడు, ఇంకా ఏ ఇతర అన్య బాహ్యమైనవి అవసరం లేనివాడు" అని అర్థం.


భౌతిక శక్తి అనేది భగవంతునికి యొక్క అధీనములో ఉండేది, అది ఆయనకు సేవ చేస్తూ ఆయన ప్రీతి కోసమే పనిచేస్తుంది. అందుకే ఆయన ప్రకృతి త్రిగుణముల యొక్క భోక్త. అదే సమయంలో, ఆయన నిర్గుణుడు (త్రిగుణములకు అతీతుడు), ఎందుకంటే ఈ గుణములు ప్రాకృతికమైనవి, కానీ భగవంతుడు దివ్యమైన వాడు.


  *కృష్ణం వందే జగద్గురుమ్*

శ్రీశనైశ్చరస్వామి మహత్మ్యం

 *🍇 శ్రీశనైశ్చరస్వామి మహత్మ్యం 🍇 4️⃣5️⃣వ భాగం :—* 🚩 సేకరణ :- పరమేశ్వర జానపాటి 🚩

👉 సమర్పణ : మహిమాన్విత

*🦅శ్రీ జ్యేష్ఠలక్ష్మి సమేత శ్రీ శనైశ్చరస్వామి దేవస్థానము 🦅*

( 🪐రాష్ట్రం లోనే తొలిసారిగా  నిర్మితమౌతున్న సతీ సమేత (భార్యతో కూడిన) ఆలయం🪐 - సంగండెయిరి పాలకేంద్రం పక్కన , NRT రోడ్డు - వినుకొండ )

*📿పరమేశ్వర జానపాటి ( శివగురుస్వామి )*

📱Cell no :- 8520096175

👉👉👉 యుద్దరంగమునందు రక్తసిక్తమైన ఆయుధముతో సింహమువలే గర్జించుచూ నిలచివున్న  వర్థమానుడను చుాసి యువరాణి గిరిజాదేవి ఇలా పలికినది " ఓ వీరుడా ! అసమానశూరుడా !! ఎవరు నువ్వు ? నిన్ను చూచుచుంటె నీవు మారాజ్యమునకు చెందిన వాడివిలాలేవు, ఎచటివాడవు నీవు " అని పలుకగా వర్దమానుడు యువరాణికి గౌరవపూర్వక నమస్సులు అందించి ఇలా పలికాడు" ఓ యువరాణి నానామదేయము వర్దమానుడు. నాది ఈ రాజ్యమున పొలిమెరల వద్ద గల అరణ్య ప్రాంతం. ఇచ్చట ఉత్సవములు జరుగుచున్నవని తెలిసి తిలకించుటకు నా సహచరులతో విచ్చేసితిని." అని పలికాడు. 

               వర్థమానుడు గంభీరస్వరం విన్న గిరిజాదేవి " మీ పలుకులు ఓ యుద్దవీరుడను జ్ఞప్తికి తెస్తున్నవి. మీ రాజసము ఓ చక్రవర్తి ని తలపించుచున్నది.మీ ముఖ వర్చస్సు రాజవంశీకులవలే వున్నది. మీ కనులలోని ఎర్రని చారలు మీ ప్రతాప శౌర్యాలను చాటిచెప్పుచున్నవి. కోరుకోండి మీకు మానుండి ఏమి కావలయునో తప్పక ఇచ్చెదము" అని పలుకగా మహారాణి వారి పలుకులు విని సంతోషించి రెట్టింపైన ఆనందముతో వర్థమానుడు గిరిజాదేవి వైపు ప్రేమతో నిండిన చూపులతో ఇలా పలికెను " ఓ యువరాణి నేను ఉపాధి లేని పేదవాడను. మీరాజ్యములో చక్కని ఉపాధిని... మీ అనురాగ మమకారములు మాపై ప్రసరింపచేస్తే చాలు. మాబోటి నిరాశ్రయులకు ఇంకేమి కావలయును." అని పలుకగా గిరిజాదేవి వర్థమానుడి వైపు చిరుమందహాసం చేయుచూ " సరే మీ కోరికను మన్నించాము. ఇక నుండి మీరు మా అంగరక్షకుల వలే భాద్యతలు నిర్వర్తించవలయును." అని పలుకగా సభలోని పురప్రజలందరూ కరతళధ్వనులు చేసారు. వర్థమానుడు మిక్కిలి సంతసించాడు. వర్దమానుడి వైపు యువరాణి గిరిజాదేవి మోహంగా చూచుతూ సభనుండి నిష్క్రమించినది.

         పోరాట సభలో పాలుపంచుకున్న మిగిలిన యుద్దవీరులు వర్ధమానుడను జయజయనాధములతో కొనియాడారు. పూలవర్షములు కురిపించారు. గజరాజు పూలమాలను వర్థమానుడి మెడలో వేసాడు. ఆ దృశ్యములను అతిథుల భవనము పై అంతస్థు నుండి చూస్తూ గిరిజాదేవి తన్మయత్వమును పొందినది.ఎలాగైన వర్థమానుడను తన పతిగా పొందాలని తన మనస్సులో సంకల్పించుకున్నది. మధురమైన తన్మయత్వంలో మునిగి తెలిపోయినది. తన శరీరము వర్థమానుడి చేతి స్పర్శకోసం తహతహలాడినది. మధుర స్వప్నాలను  పొందుతున్నది. యువరాణి భావాలను గ్రహించిన  రాజకాంత స్త్రీలు,, చెలికత్తెలు అచ్చెరువునొందారు.


🦅 శ్రీశనైశ్చర మహత్మ్యం - 45 వ భాగం🦅 .... సమాప్తము.


సమర్పణ :— శ్రీశనీశ్వరాలయం నిర్మాణాభివృద్ది కమిటి - వినుకొండ.

💥💥💥💥💥💥💥💥💥💥💥💥

❄ ముఖ్య విన్నపము :— 🦅 

*-శ్రీ జ్యేష్ఠలక్ష్మీ సమేత శ్రీశనైశ్చరస్వామి దేవస్థానము-* ( రాష్ట్రంలోనే మొట్టమొదటి సతీసమేత శనైశ్చరాలయం )

 {రిజిష్టర్డ్ నంబర్ 14/2018 .}

( ఆలయం నిర్మాణములో వున్నది)

*(సంగంపాలకేంద్రం పక్కన - నరసరావుపేటరోడ్ - వినుకొండ)*

👉 ఆలయ నిర్మాణమునకు సహకరించాలనుకునేవారు దేవస్థానము అకౌంటును పోస్టు చేయుచున్నాము.

(Andhra bank  { Vinukonda branch }


Name : *-Sri Jyesta Lakshmi Sametha Sri Shanaichara swami vari devasthanamu-*


A/C no : *-197910100094811-*


Ifsc code : ANDB0001979 )


Cell No : *-8520096175-*

💥💥💥💥💥💥💥💥💥💥💥💥

యజ్ఞం - ఓ పవిత్ర కార్యం

 🔥🔥🔥🔥🔥

యజ్ఞం - ఓ పవిత్ర కార్యం.

🔥🔥🔥🔥🔥

'యజ్ఞం' అనేది అనాదిగా వస్తున్న ఒక హిందూ సంప్రదాయం. వేదంలో యజ్ఞో వై విష్ణుః అని చెప్పబడింది. అనగా యజ్ఞం విష్ణు స్వరూపంగా భావించవచ్చు. ‘యజ్ఞం’ అను శబ్దం ‘యజ దేవపూజయాం’ అనుదాతువు నుంచి ఏర్పడింది. దైవపూజే యజ్ఞం.


మన దేశంలో పురాణకాలం నుంచి వివిధ రకాలైన యజ్ఞాలు జరిగాయి. యజ్ఞం అంతిమ లక్ష్యం దేవతలకు తృప్తి కలిగించడమే. వారిని మెప్పించడమే. సాధారణంగా యజ్ఞం అనేది అగ్ని (హోమం) వద్ద వేదమంత్రాల సహితంగా జరుగుతుంది. ఇందుకు అనుబంధంగా అనేక నియమాలు, సంప్రదాయాలు ఉన్నాయి. అగ్నిహోత్రం అనేది యజ్ఞంలో ముఖ్యమైన అంశం. యజ్ఞంలోని అగ్నిలో 'వేల్చినవి' దేవతలందరికి చేరుతాయని విశ్వాసం. 


యజ్ఞ విధానం 

వైదిక యజ్ఞంలో అధ్వర్యుడు ప్రధాన అర్చకుడు. అతని అధ్వర్యంలో అన్ని యజ్ఞ కార్యక్రమాలూ జరుగుతాయి. అతనికి సహాయంగా అనేక మంది అర్చకులు, పండితులు ఉంటారు. వేద మంత్రాలు చదువుతారు. యజ్ఞంలో ఒకటి గాని అంతకంటే ఎక్కువగాని హోమాగ్నులు ఉంటాయి. ఆ అగ్నిలో నెయ్యి, పాలు, ధాన్యం వంటి అనేక సంభారాలు పోస్తుంటారు. యజ్ఞాలు కొద్ది నిముషాల నుంచి కొన్ని సంవత్సరాల వరకూ జరుగవచ్చు.


యజ్ఞాల్లో భాగంగా.. అశ్వమేధ యాగం, పుత్రకామేష్టి యాగం, రాజసూయ యాగం,   సర్పయాగం, విశ్వజిత్ యాగం.. వంటి యాగాలున్నాయి. 

🔥🔥🔥🔥🔥

Siva








 

Auto balance scooter

 


30, డిసెంబర్ 2020, బుధవారం

పురుషా రాజన్,

 "సులభా: పురుషా రాజన్, 

సతతం ప్రియవాదినః !

అప్రియస్య చ పథ్యస్య

వక్తా శ్రోతా చ దుర్లభ : !!"


"ఓ రాజా, అధికారంలోవున్న నీ చుట్టూ భజనపరులు చేరి ముఖప్రీతి మాటలతో తమ పబ్బం గడుపుకుంటారు, కానీ నీ హితవు చెప్పేవారు ఉండరు, ఒకవేళ చెప్పినా వినేవారులేరు" అని శ్రీరామాయణంలో చెప్పిన మారీచుడున్నూ; మహాభారతంలో వికర్ణుడున్నూ ఈ ఉభయులు చేసిన జ్ఞానోపదేశం పెడచెవిన పెట్టిన వారికి సంప్రాప్తమైన గతి, వర్తమాన రాచకీయ యవనికపై తాము అవతార యుగ పురుషులుగా భ్రమ, మైకంలో ఉన్న వారికి రాకూడదని ....

బుధుడు

 బుధుడు : 

సోమునకును రోహిని తారకు బుదుడు  సౌమ్య నామ సంవత్సరం భాద్రపద శుద్ద ఏకాదశిజన్మించెను బుదుని భార్య:- వైరజ కుమారుడు :- పురూరవుడు 

బుధుడు : బంధనం , హేమలాభంచ . రిపుపీడం , రిపుక్షయం

దారిద్ర్యం ,భూషణం , లాభం, మనసిద్దిం ,ధనక్షయం

ప్రమోదం, మోదసంహారం, బుదః కుర్యాత్క్రమాద్గతః


తాత్పర్యము: బుధుడు పన్నెండు రాశులలో సంచరిచు సమయములలో 1 బంధనము 2 సువర్ణ లాభము 3 శత్రుభాధలు 4 శత్రువుల నాశనము 5 దరిద్రము 6 ఆభరణ లాభము 7 లాభములను 8 సంతోషము 9 ధన నష్టము 10 ప్రమోదము 11 మోదమును 12 నాశనము కలిగించును. 


బుధ నపుంసక గ్రహం. మిశ్రమ రుచుల కారకత్వం కలిగిన వాడు. ఇరవై వయసున్న వారిని సూచిస్తాడు. వర్ణం ఆకు పచ్చ, జాతి వైశ్య, అధి దేవత విష్ణువు, గుండ్రని ఆకారం, పరిమాణం పొడుగు, ప్రకృతి కఫ, వాత, పిత్తములు కల వాడు. శరధృతువును ఉత్తర దిక్కునూ, సూచిస్తూ, పృధ్వీ తత్వం కలిగిన వాడు, గ్రహ సంఖ్య అయిదు, రత్నం పచ్చ, లోహం, ఇత్తడి, కంచు, గుణం రజో గుణం కలిగిన వాడు. లగ్నంలో దిక్బలం కలిగి ఉంటాడు. ఆశ్లేష, మూల, రేవతి నక్షత్రములకు బుధుడు అధిపతి. మిధున కన్యా రాశులకు అధిపతి. బుధుడు కన్యారాశిలో పదిహేను డిగ్రీల వద్ద పరమ ఉచ్ఛ స్థితిని పొందుతాడు. మీనరాశిలో పదిహేను డిగ్రీల వద్ద పరమ నీచను పొందుతుంది. కన్యారాశిలో పదిహేను ఇరవై డిగ్రీలు మూల త్రికోణము ఔతుంది. బుధుడికి సూర్యుడు, శుక్రుడు మిత్రులు. సింహరాశి, వృషభరాశి, తులారాశులు మిత్ర స్థానములు. చంద్రుడు శత్రువు. కర్కాటక రాశి శత్రు స్థానం. బుధ గ్రహ దశ పదిహేడు సంవత్సరాలు. బుధుడు ఏడవ స్థానం మీద మాత్య్రమే దృష్టిని సారిస్తాడు. బుధుడు స్వభావరీత్యా శుభుడు, తత్వము భూతత్వం, గ్రహ స్వభావం, ఒంటరిగాపాపి శుభగ్రహములతో చేరిన శుభుడు. జీవులు పక్షులు, గ్రహ స్థానం క్రీడాస్థలాలు, జలతత్వం జలభాగం, ఆత్మాధికారం వాక్కు, పాలనా శక్తి రాకుమారుడు, గ్రహపీడ బంధువుల వలన బాధలు, గ్రహ వర్గం శని, గృహంలో భాగములు పఠనా మందిరం, దిక్బలం తూర్పు, నివాస ప్రదేశములు జనావాసాలు, చెట్లు ఫలములు లేని చెట్లు, పండ్లు సీమ చింత, ధాన్యం పెసలు, పక్షులు చిలుక, గబ్బిలం, జంతువులు మేక గొర్రె, ఇతర వస్తువులు నగలు, మిశ్ర లోహములు. వస్త్రం తడి వస్త్రం, దేవ వ్ర్గం శైవ, గ్రహ వేదం అధ్ర్వణ వేదం, గ్రహ గోత్య్రం ఆత్రేయ, అర్ధశుభుడు, అవతారం బుద్ధావతారం, గ్రహవర్ణం తాళపత్ర వర్ణం, వారం బుధవారం, మన స్థితి సాత్వికం, బలంగా ఉంటే వాక్చాతుర్యం బుద్ధి జ్ఞానం, ఋషి నారాయణుడు. హోమముకు వాడవలసిన సమిధ ఉత్తరేణి.


లగ్నములో బుధుడు ఉన్న జాతకుడు దీర్ఘాయువు, మృదుమధుర వాక్కులు పలికేవాడు, హాస్యచతురుడు ఔతాడు.

ద్వితీయస్థానమున బుధుడు ఉన్న జాతకుడు స్వశక్తితో ధనమును సంపాదించు వాడు, ఆకర్ష్ణీయంగా మాటాడు వాడు, ప్రస్పుటముగా మాటాడు వాడు, భోజన ప్రియుడు ఔతాడు.

తృతీయమున బుధుడు ఉన్న జాతకుడు ధైర్యశాలి, శౌర్యం కల వాడు, సమ ఆయుషు కలవాడు, మంచిసోదరులు కలవాడు, త్వరితంగా అలసట పొందువాడు ఔతాడు.

చతుర్ధభావమున బుధుడు ఉన్న జాతకుడు విద్యావంతుడు, హాస్యవిశారదుడు, భూమి కలవాడు, మిత్రులు కలవాడు, ధాన్యసమృద్ధి కలవాడు, ఐశ్వర్యం కలవాడు, సంతోషం కలవాడు ఔతాడు.

పంచమ స్థానమున బుధుడు ఉన్న జాతకుడు విద్యావంతుడు, సుఖవంతుడు, శైర్యవంతుడు, మంత్రవిద్యాభిలాషి, సంతానవంతుడు ఔతాడు.

ష్టమ భావమున బుధుడు ఉన్న జాతకుడు వివాదాస్పదుడు, క్రోధము కలవాడు, నిష్టుర వాక్కులు పలుకు వాడు, శత్రువులను నాశనం చేయువాడు ఔతాడు.

సప్తమ స్థానమున బుధుడు ఉన్న జాతకుడు విద్యావంతుడు, ఔన్నత్యం కల వాడు, ధనసంపన్నత కలిఉగిన భార్య కలిగిన వాడు, అందమైన వస్తధారణ చేయువాడు ఔతాడు.

అష్టమ స్థానమున ఉన్న జాతకుడు ప్రఖ్యాతి కలిగిన వాడు, చిరంజీవి, కుటుంబానికి అండగా ఉండే వాడు, ప్రభువు లేక సైన్యాధ్యక్షుడు ఔతాడు.

నవమ స్థానమున బుధుడు ఉన్న జాతకుడు విద్య, ఐశ్వర్యం, సచ్చరిత్ర, ఆచారము, ప్రావీణ్యం, స్వచ్ఛమైన పలుకులు కలిగిన వాడు ఔతాడు.

బుధుడు దశమస్థానమున ఉన్న జాతకుడు మంచి విద్య, సకలకార్య విజయం, శక్తివంతుడు, మేధా సంపన్నుడు, సుఖము కలవాడు, సత్ప్రవర్తన, సత్యవాక్కు పలుకు వాడు ఔతాడు.

ఏకాదశ స్థానమున ఉన్న జాతకుడు చిరంజీవి, సత్యసంధుడు, బహుధనవంతుడు, సుఖజీవి, సేవాజనము కలవాడు ఔతాడు.

ద్వాదశ స్థానమున బుధుడు ఉన్న జాతకుడు కష్టజీవి, విద్యాహీనుడు, నమ్రత కలిగిన వాడు, క్రూరుడు, తేజోహీనుడు ఔతాడు.....మీ... *చింతా గోపీ శర్మ సిద్ధాంతి** *లక్ష్మీలలితా వాస్తు జ్యోతిష నిలయం* (భువనేశ్వరిపీఠం) పెద్దాపురం, సెల్:- 9866193557

Valueble information


ఈ తరం పిల్లలకు నేర్పించండి. చదివించండి మరియు మనం కూడా మరోసారి మననం చేసుకుందాం.


 దిక్కులు : (1) తూర్పు, (2) దక్షిణం, (3) పడమర, (4) ఉత్తరం


మూలలు :(1) ఆగ్నేయం, (2) నైరుతి,(3) వాయువ్యం, (4) ఈశాన్యం


 వేదాలు :(1) ఋగ్వే దం, 

(2) యజుర్వేదం,(3) సామవేదం,

(4) అదర్వణ వేదం


 పురుషార్ధాలు :(1) ధర్మ, (2) అర్థ,

(3) కామ,(4) మోక్షా


 పంచభూతాలు :(1) గాలి, (2) నీరు,

(3) భూమి,(4) ఆకాశం,(5) అగ్ని.


  పంచేంద్రియాలు : (1) కన్ను, 

(2) ముక్కు, (3) చెవి, (4) నాలుక,

(5) చర్మం.


 లలిత కళలు : (1) కవిత్వం,

(2) చిత్రలేఖనం, (3) నాట్యం,

(4) సంగీతం, (5) శిల్పం.


 పంచగంగలు : (1) గంగ, (2)  కృష్ణ,

(3) గోదావరి, (4) కావేరి, 

(5) తుంగభద్ర.


 దేవతావృక్షాలు : (1) మందారం, 

(2) పారిజాతం, (3) కల్పవృక్షం, 

(4) సంతానం, (5) హరిచందనం.


 పంచోపచారాలు : (1) స్నానం,

(2) పూజ,  (3) నైవేద్యం,

(4) ప్రదక్షిణం, )5) నమస్కారం.


  

పంచామృతాలు : (1) ఆవుపాలు,

(2) పెరుగు, (3) నెయ్యి, (4) చక్కెర, 

(5) తేనె.


 పంచలోహాలు : (1) బంగారం, 

(2) వెండి,  (3) రాగి,

(4) సీసం, (5) తగరం.


 పంచారామాలు : )1) అమరావతి,

(2) భీమవరం, (3) పాలకొల్లు,

(4) సామర్లకోట, (5) ద్రాక్షారామం


 షడ్రుచులు : (1) తీపి, (2) పులుపు, 

(3) చేదు, (4) వగరు, 

(5) కారం, (6) ఉప్పు.


అరిషడ్వర్గాలు  షడ్గుణాలు:(1) కామం, 

(2) క్రోధం, (3) లోభం, (4) మోహం,

(5) మదం, (6) మత్సరం.


ఋతువులు : (1) వసంత,(2) గ్రీష్మ,

(3) వర్ష, (4) శరద్ఋతువు, 

(5) హేమంత, (6) శిశిర


 సప్త ఋషులు : (1) కాశ్యపుడు,

(2) గౌతముడు,  (3) అత్రి,

(4) విశ్వామిత్రుడు, (5) భరద్వాజ,

(6) జమదగ్ని, (7) వశిష్ఠుడు.


తిరుపతి సప్తగిరులు : (1) శేషాద్రి,

(2) నీలాద్రి, (3) గరుడాద్రి, 

(4) అంజనాద్రి, (5) వృషభాద్రి, 

(6) నారాయణాద్రి, (7) వేంకటాద్రి.


సప్త వ్యసనాలు : (1) జూదం,

(2) మద్యం, (3) దొంగతనం, 

(4) వేట, (5) వ్యభిచారం, 

(6) దుబారఖర్చు,

(7) కఠినంగా మాట్లాడటం.


 సప్త నదులు : (1) గంగ, 

(2) యమునా,  (3) సరస్వతి, 

(4) గోదావరి,  (5) సింధు,

(6) నర్మద,  (7) కావేరి.

            

నవధాన్యాలు : (1) గోధుమ,

(2) వడ్లు,  (3) పెసలు,

(4) శనగలు, (5) కందులు,

(6) నువ్వులు, (7) మినుములు, 

(8) ఉలవలు, (9) అలసందలు.


నవరత్నాలు : (1) ముత్యం, 

(2) పగడం, (3) గోమేధికం,

(4) వజ్రం, (5) కెంపు, (6) నీలం, 

(7) కనకపుష్యరాగం, 

(8) పచ్చ (మరకతం), 

(9) ఎరుపు (వైడూర్యం).


నవధాతువులు : (1) బంగారం,

(2) వెండి, (3) ఇత్తడి, (4) రాగి, 

(5) ఇనుము, (6) కంచు,

(7) సీసం, (8) తగరం, 

(9) కాంతలోహం.


నవరసాలు : (1) హాస్యం,(2) శృంగార, 

(3) కరుణ, (4) శాంత, (5) రౌద్ర, 

(6) భయానక, (7) బీభత్స, 

(8) అద్భుత, (9) వీర


నవదుర్గలు : (1) శైలపుత్రి, 

(2) బ్రహ్మ చారిణి, (3) చంద్రఘంట,

(4) కూష్మాండ, (5) స్కందమాత, 

(6) కాత్యాయని, (7) కాళరాత్రి, 

(8) మహాగౌరి, (9) సిద్ధిధాత్రి.


 దశ సంస్కారాలు : (1 ) వివాహం, 

( 2 ) గర్భాదానం, (3 ) పుంసవనం , 

(4 ) సీమంతం, (5) జాతకకర్మ, 

(6 ) నామకరణం, (7) అన్నప్రాశనం, 

(8 ) చూడకర్మ, (9 ) ఉపనయనం, 

(10) సమవర్తనం


దశావతారాలు : (1) మత్స్య,

(2) కూర్మ, (3 ) వరాహ,

(4) నరసింహ, (5) వామన, 

(6) పరశురామ, (7) శ్రీరామ,

(8) శ్రీకృష్ణ, (9) బుద్ధ, (10) కల్కి.


జ్యోతిర్లింగాలు :


హిమలయపర్వతం ~ కేదారేశ్వరలింగం .


కాశీ ~ కాశీవిశ్వేశ్వరుడు .


మధ్యప్రదేశ్ ~ మహాకాలేశ్వరలింగం, ఓంకారేశ్వరలింగం. (2)


గుజరాత్ ~ సోమనాధలింగం, నాగేశ్వరలింగం. (2)


మహారాష్ట్ర ~ భీమశంకరం, త్ర్యంబకేశ్వరం,    ఘృష్ణేశ్వరం, వైద్యనాదేశ్వరం. (4)


ఆంధ్రప్రదేశ్ ~ మల్లిఖార్జునలింగం (శ్రీశైలం) 


తమిళనాడు ~ రామలింగేశ్వరం

 

తెలుగు వారాలు : (1) ఆది, (2) సోమ, 

(3) మంగళ, (4) బుధ, (5) గురు, 

(6) శుక్ర, (7) శని.


తెలుగు నెలలు : (1) చైత్రం,

(2) వైశాఖం,(3) జ్యేష్ఠం,(4) ఆషాఢం, 

(5) శ్రావణం, (6) భాద్రపదం, 

(7) ఆశ్వీయుజం, (8) కార్తీకం, 

(9) మార్గశిరం, (10) పుష్యం, 

(11) మాఘం, (12) ఫాల్గుణం.


 రాశులు : (1) మేషం,(2) వృషభం, 

(3) మిథునం, (4) కర్కాటకం,

(5) సింహం, (6) కన్య, (7) తుల, 

(8) వృశ్చికం, (9) ధనస్సు, 

(10) మకరం, (11) కుంభం, 

(12) మీనం.


తిథులు : (1) పాఢ్యమి, (2) విధియ, 

(3) తదియ, (4) చవితి,(5) పంచమి, 

(6) షష్ఠి, (7) సప్తమి, (8) అష్టమి, 

(9) నవమి, (10) దశమి,(11) ఏకాదశి, 

(12) ద్వాదశి, (13) త్రయోదశి, 

(14) చతుర్దశి, 

(15) అమావాస్య /పౌర్ణమి.


నక్షత్రాలు : (1) అశ్విని, (2) భరణి, 

(3) కృత్తిక, (4) రోహిణి, (5) మృగశిర, 

(6) ఆరుద్ర, (7) పునర్వసు, 

(8) పుష్యమి, (9) ఆశ్లేష, (10) మఖ, 

(11) పుబ్బ, (12) ఉత్తర, (13) హస్త, 

(14) చిత్త, (15) స్వాతి, (16) విశాఖ, 

(17) అనురాధ, (18) జ్యేష్ఠ, 

(19) మూల, (20) పూర్వాషాఢ, 

(21) ఉత్తరాషాఢ, (22) శ్రావణం, 

(23) ధనిష్ఠ, (24) శతభిషం, 

(25) పూర్వాబాద్ర, (26) ఉత్తరాబాద్ర, 

(27) రేవతి.


తెలుగు సంవత్సరాల పేర్లు :

(1) ప్రభవ :-

1927, 1987, 2047, 2107


(2) విభవ :- 

1928, 1988, 2048, 2108


(3) శుక్ల :-

1929, 1989, 2049, 2109


( 4 ) ప్రమోదూత :-

1930, 1990, 2050, 2110


( 5 ) ప్రజోత్పత్తి :-

1931, 1991, 2051, 2111


( 6 ) అంగీరస :- 

1932, 1992, 2052, 2112


( 7 ) శ్రీముఖ :-

1933, 1993, 2053, 2113


( 8 )భావ. - 

1934, 1994, 2054, 2114


9యువ.  - 

1935, 1995, 2055, 2115


10.ధాత.  - 

1936, 1996, 2056, 2116


11.ఈశ్వర. - 

1937, 1997, 2057, 2117


12.బహుధాన్య.-

1938, 1998, 2058, 2118


13.ప్రమాది. - 

1939, 1999, 2059, 2119


14.విక్రమ. - 

1940, 2000, 2060, 2120


15.వృష.-

1941, 2001, 2061, 2121


16.చిత్రభాను. - 

1942, 2002, 2062, 2122


17.స్వభాను. - 

1943, 2003, 2063, 2123


18.తారణ. - 

1944, 2004, 2064, 2124


19.పార్థివ. - 

1945, 2005, 2065, 2125


20.వ్యయ.-

1946, 2006, 2066, 2126


21.సర్వజిత్తు. - 

1947, 2007, 2067, 2127


22.సర్వదారి. - 

1948, 2008, 2068, 2128


23.విరోధి. - 

1949, 2009, 2069, 2129


24.వికృతి. - 

1950, 2010, 2070, 2130


25.ఖర. 

1951, 2011, 2071, 2131


26.నందన.

1952, 2012, 2072, 2132


27 విజయ.

1953, 2013, 2073, 2133,


28.జయ. 

1954, 2014, 2074, 2134


29.మన్మద.

1955, 2015, 2075 , 2135


30.దుర్మిఖి. 

1956, 2016, 2076, 2136


31.హేవళంబి. 

1957, 2017, 2077, 2137


32.విళంబి. 

1958, 2018, 2078, 2138


33.వికారి.

1959, 2019, 2079, 2139


34.శార్వారి. 

1960, 2020, 2080, 2140


35.ప్లవ

1961, 2021, 2081, 2141


36.శుభకృత్. 

1962, 2022, 2082, 2142


37.శోభకృత్. 

1963, 2023, 2083, 2143


38. క్రోది.

1964, 2024, 2084, 2144, 


39.విశ్వావసు.

1965, 2025, 2085, 2145


40.పరాభవ.

1966, 2026, 2086, 2146


41.ప్లవంగ. 

1967, 2027, 2087, 2147


42.కీలక. 

1968, 2028, 2088, 2148


43.సౌమ్య. 

1969, 2029, 2089, 2149


44.సాధారణ . 

1970, 2030, 2090, 2150


45.విరోధికృత్. 

1971, 2031, 2091, 2151


46.పరీదావి. 

1972, 2032, 2092, 2152


47.ప్రమాది. 

1973, 2033, 2093, 2153


48.ఆనంద. 

1974, 2034, 2094, 2154


49.రాక్షస. 

1975, 2035, 2095, 2155


50.నల :-

1976, 2036, 2096, 2156, 


51.పింగళ                 

1977, 2037, 2097, 2157


52.కాళయుక్తి         

1978, 2038, 2098, 2158


53.సిద్ధార్ధి              

1979, 2039, 2099, 2159


54.రౌద్రి                 

1980, 2040, 2100, 2160


55.దుర్మతి              

1981, 2041, 2101, 2161


56.దుందుభి             

1982, 2042, 2102, 2162


57.రుదిరోద్గారి         

1983, 2043, 2103, 2163


58.రక్తాక్షి                 

1984, 2044, 2104, 2164


59.క్రోదన                  

1985, 2045, 2105, 216


60.అక్షయ              

1986, 2046, 2106, 2166.


ఈ తరం పిల్లలకు నేర్పించండి. చదివించండి మరియు మనం మరోసారి మననం చేసుకుందాం....

పెద్దలందరికి విలువైన కొన్ని సూత్రాలు .

 60,65 సంవత్సరాలు దాటిన ఆడ,మగ పెద్దలందరికి విలువైన కొన్ని సూత్రాలు . 

*************************

1) మీరు బాత్రూంలో  వున్నప్పుడు లోపల గడియ పెట్టుకో వద్దు.మీరు లోపల వున్నట్లు తెలియటానికి మీకు వస్తే ఏదైనా కూని రాగాలు పాడుతుండడమో లేకుంటే మీ మొబైల్ తీసుకెళ్లి దాంట్లో  ఏదైనా పాట పెట్టుకోవడమో చేయండి.

2) తడిగాఉన్న నేలపై నడువ వద్దు. ఇప్పడు కట్టే అన్ని ఇండ్లలో ఫ్లోరింగ్ కు పాలిష్ బండలు గానీ , టేల్స్ గానీ, ఇంకా నునుపైన బండలు వేస్తున్నారు. నీరు పడితే కనపడవు. అందవల్ల కాలు పెడితే జారడం ఖాయం.

3) ఫ్యాన్ లు,ఫోటోలు తుడచడానికి గానీ , రిపేరు చేయటానికి గానీ , గుడ్డలు ఆరవేయటానికి గానీ            స్టూళ్ళు , కుర్చీలు, బెంచీలు ఎక్కడం మానుకోండి .

4) కారు గానీ , స్కూటర్  గానీ మీరు ఒంటరిగా నడపడం మంచిది కాదు. ఎవరో ఒకరిని తోడుగా పిలుచుకుని వెళ్ళండి. 

5) మీరు వేసుకునే మందులు ఏమైనా వుంటే డాక్టర్ చెప్పిన ప్రకారం టయానికి మరువకుండా జ్ఞాపకంగా వేసుకోండి. అన్నింటికంటే మీ ఆరోగ్యం మీకు ముఖ్యం. 

6)మిమ్మల్ని సంతోషపరిచే విషయాలలో గానీ,ఆనందపరిచే విషయాలలో గానీ , 

మనశ్శాంతిగా వుండే  విషయాలలో గానీ వేరే వాళ్ళ ఆలోచనలతో రాజీపడవద్దు. 

7) మీరు ఎక్కడికి వెళ్ళినా అంటే బ్యాంకుకు వెళ్లినా , మార్కెట్టుకు వెళ్ళినా, షాపింగ్ కి  వెళ్ళినా ఇంక ఎక్కడకి వెళ్ళినా మీ సహధర్మచారిణిని (భార్యను)తీసుకవెళ్ళండి.

వాళ్ళూ సంతోష పడతారు. మీకు నిజమై తోడు వాళ్ళే.

8) ఇంట్లో మీరు ఒక్కరు వున్నప్పుడు ముక్కు మొహం తెలియని వాళ్ళు వస్తే వాళ్ళతో బాతకానీ కొట్టకండి.     వీలైనంత త్వరగా  మాట్లాడి పంపించేయండి.జాగ్రత్తగా ఉండండి. 

9) ఎప్పుడూ ఇంటి తాళాలు రెండు మెయింటేన్ చేయండి. ఒకటి మీ దగ్గర ,రెండోది మీ భార్య దగ్గర. 

10) మీ బెడ్ రూంలో బెడ్ ప్రక్కనే ఒక కాలింగ్ బెల్ అరేంజ్ చేసుకోండి.ఎప్పుడైనా అవసరం రావచ్చు. 

11) ఇంట్లో వారితోను , బయటి వారితోను 

మాట్లాడేటప్పుడు మర్యాదగా , మృదువుగా మాట్లాడండి . కోపంగాను , రాష్ గాను మాట్లాడుతే మీ మీద గౌరవం పోయి అసహ్యించుకుంటారు.

12) ఎప్పుడు కూడా జరిగిపోయినదాని గురించి గానీ , జరిగేదాని గురించి గానీ, జరుగబోయేదాని గురించి గానీ ఆలోచించ వద్దు. జరిగేది జరుగక మానదు.

13) ఈ వయసులో  మనశ్శాంతి,మంచి ఆరోగ్యం,మంచి బంధుత్వం + మంచి స్నేహితం చాలా ముఖ్యం. 

Note = మీరు వీలు చేసుకుని  + ఓపిక చేసుకుని మీకు తెలిసిన పెద్ద వారికి అందరికి ఈ మెసేజ్ ఫార్వర్డ్ చేయండి.

అద్వైతచైతన్యజాగృతి

 *14- శ్రీ ఆదిశంకరాచార్య విరచితము అపరోక్షానుభూతి*

🕉🌞🌏🌙🌟🚩

🔥ఓంశ్రీమాత్రే నమః🔥

అద్వైతచైతన్యజాగృతి

🕉🌞🌏🌙🌟🚩


*శ్లో|| ఏవందేహ ద్వయాదన్య ఆత్మపూరుష ఈశ్వరః |*

*సర్వాత్మాసర్వ రూపశ్చ సర్వాతీతో೭ హోమవ్యయః ||*


*తాత్పర్య వివరణం:-*


*సూల సూక్ష్మ దేహములకంటే అతీతుడను. దేహములకు ప్రేరకుడను, జీవుడనుకాదు. ఈశ్వరస్వరూపుడను, సర్వమునకు అత్మస్వరూపుడను, నాయందే అంతయు కల్పితమైనది గనుక సర్వము నాస్వరూపమే నేను సర్వాతీతుడను అనగా ఈదృశ్య స్వరూపం నాదికాదు. దృశ్యము కంటే నేను వేరు. అధిష్ఠానము కంటే ఆరోపము ఇది వేరు కాదు గనుక నాకంటే ఇది వేరుకాదు. స్వప్రకాశ స్వరూపడను, సాక్షిని అని గ్రహించ వలయును.*




*శ్లో|| ఇత్యాత్మ దేహభాగేన ప్రపంచసైయ వసత్యతా|*

*యథోక్తాతర్కశాస్త్రేణ తతః కింపురుషార్థతా||*


*తాత్పర్య వివరణం:-*


*ఇంతవరకు మూల శ్లోకములను బట్టి ఆత్మ శరీరము కంటే ప్రపంచంకంటే వేరని తేలినది. రెండూ వేరయినప్పుడు ఆత్మవలె ప్రపంచం కూడా సత్యమని చెప్పినట్లయినది. తర్కశాస్త్రము చెప్పినట్లే చెప్పబడినది. దీనివలన మోక్షపురుషార్థ మెట్లు సిద్దించును? అని ప్రశ్నయే ఈ శ్లోకమున కర్థము.*




*శ్లో|| ఇత్యాత్మ దేహభేదేన దేహాత్మత్వం నివారితం|ఇదానీందేహ భేదస్య హ్యసత్వం స్ఫుటముచ్వ తే||*


*తాత్పర్య వివరణం:-*


*ఇంతవరకు దేహదులకంటే ఆత్మవేరని చెప్పడమైనది. అనగా ముందు అనాత్మవస్తు కంటే ఆత్మవేరుగా నున్నదని, పరిశోధన చేయవలెను. తరువాత ఆత్మకంటే అనాత్మ వేరులేదని విచారించవలయును. ఇదియే బ్రహ్మవిచారమునకు లక్షణము. ఇక ఆత్మకంటే దేహము మొదలగు దృశ్యం వేరులేదని చెప్పుచున్నారు.*




*శ్లో|| చైతన్య సై#్యకరూపత్వాద్భేదోయుక్తో నకర్హిచిత్‌ | జీవత్వం చమృషాజ్ఞేయం రజ్ఞౌ సర్పగ్రహోయథా||*


*తాత్పర్య వివరణం:-*


*ఘటము ప్రకాశించుచున్నది అనగా తెలియుచున్నది. పటముతెలియుచున్నది, అని అనుగతమైన అనుభవమునుబట్టి చైతన్యరూపమైన ఆత్మ ఏకరూపమేగాని, నానా రూపమైనది కాదు. చైతన్యరూపులైన జీవులు నానావిధముగా నున్నారు కదా. అంటే తాడుయందు పాము అను భ్రమవలే, పరమాత్మయందు జీవత్వభ్రమ కలిగినది. భ్రమవలన ఏర్పడిన జీవనానాత్వము వల్ల పారమార్థికమగు పరమాత్మ ఏకత్వమునకు విరోధము లేదు. మనముఖం ఒకటి అయినను నూరు అద్దములలో నూరుముఖములు కనిపించును, గాని అద్దములనే ఉపాధుల వలననే నానాత్వము యేర్పడినది. దానివలన ముఖం ఒకటి యనుటలో విరోధంలేదు. ఘటాకాశము మఠాకాశము అని అనేక ఉపాధులలో ఆకాశము ఉపాధి భేధముచేత అనేక ఆకాశములగా కనిపించినను, పరమార్థముగా ఆకాశం ఒకటేగాని నానాకాదు. అటులనే అజ్ఞానకల్పితమైన అంతఃకరణ లనేకములు గనుక ఆయంతఃకరణలయందు పరమాత్మ ప్రతిబింబములే ఆజీవులుగను,ఆజీవులు చాలా మందియున్నను. బింబమైన పరమాత్మ ఒకటియేగాని నానాకాదని అద్వితీయమని ప్రతిబింబ రూపులయిన జీవులందరు బింబమైన పరమాత్మకంటే వేరుకాదు. గనుక ఏకత్వమునకు భంగములేదని గ్రహించవలసిన విషయం.*


🕉🌞🌏🌙🌟🚩

15. వేదాంగములు : శిక్ష*

 *41-వేదములు📚((((((((((🕉))))))))))     ఆచార్య వాణి🧘‍♂️*

🕉🌞🌏🌙🌟🚩

🔥ఓంశ్రీమాత్రే నమః🔥

అద్వైతచైతన్యజాగృతి

🕉🌞🌏🌙🌟🚩


*15. వేదాంగములు : శిక్ష*


((((((((((🕉))))))))))


*అక్షమాల - జపమాల :-*


*''రుద్రక్షమాల'' అంటే రుద్రాక్షలు కల జపమాల అని అర్థం - రుద్రుని కళ్ల నుండి వచ్చినవి రుద్రాక్షలు అని జనశృతి. ఇక్కడ ''అక్ష'' అంటే 'కన్ను' అని అర్థం. 'అక్షమాల' అంటే ఏమిటి? ఇక్కడ ''అక్ష''ని కన్నుగా అన్వయించుకోవటం తప్పు. ''అ'' నుండి ''క్ష'' వరకూ గల అక్షరాలకి ప్రతీక. సంస్కృతంలో మొదటి అక్షరం ''అ'' చివరిది ''క్ష''. సంపూర్ణతని సూచించటానికి ఇంగ్లీషులో ''A to Z'' అంటారు, సంస్కృతంలో ''అ"కారాది "క్ష" కారాంతః'' అంటారు. అంటే ''అ''తో ఆరంభించి ''క్ష''తో అంతమవటం. అక్షరాలన్నీ కలిపి 50, అందువల్ల అక్షమాలలో 50 పూసలుంటాయి.*



*శబ్దోచ్చారణ యొక్క ప్రాముఖ్యత :- మంత్రపఠనంలో అప్రమత్తత అవసరమని ముందు చెప్పడం జరిగింది. శబ్దోచ్చారణలో పొరపాటు జరిగితే మంత్రం సరియైన ఫలమివ్వకపోగా హానిని గాని, వ్యతిరేక ఫలితాలని గాని ఇస్తుంది. తైత్తిరీయ సంహితలో ఈ విషయాన్ని తెల్పే కథ ఒకటుంది. (2.4.12) త్వష్టుడుకి ఇంద్రునితో వైరం. ఇంద్రుని సంహరించగల కుమారుడు కావాలని కోరుకొంటాడు. అందుకని ''ఇంద్రశత్రుర్వర్ధస్వ'' అన్న మంత్రాన్ని జపిస్తూ ఒక హోమాన్ని చేశాడు. ఈ మంత్రాన్ని సరిగ్గా పఠించే పద్దతిలో పలికితే,''త్వష్టుని కుమారుడు పెరిగి ఇంద్రుని వధించుగాక'' అనే అర్థం వస్తుంది. ఆ శబ్ద ప్రాబల్యం వల్లనే ఆ కుమారుడు పెరిగి ఇంద్రుని వధింప గలిగే వాడు. కాని శబ్దోచ్చారణలో త్వష్టుడు పొరపాటు చేశాడు. అందువల్ల అర్థం తారుమారైంది. అక్షరాలూ, పదాలూ మారకపోయినా స్వరోచ్చారణ దోషం వల్ల, త్వష్టుడు ఆశించిన దానికి సరిగ్గా వ్యతిరేకం జరిగింది. అతని కుమారుని ఇంద్రుడే చంపి వేశాడు. అందువల్ల వృత్రుడన్న అతని కుమారుని వధకు త్వష్టుడే కారణమైనాడు.*



*వేదాలలోని ఈ ఉదంతాన్ని చెప్తూ, సరియైన పద్ధతిలో మంత్రాలని పలకాలంటుంది ఈ శ్లోకం :- ''మంత్రో హీనస్వరతో వర్ణతో వా మిథ్యా ప్రయుక్తో న తమర్థమాహ స వాగ్వజ్రో యజమానం హినస్తి యతేంద్రశత్రుః స్వరతో`òపరాధాత్‌''*


*కొన్ని స్వల్ప భేదాలు :- ఇప్పటి వరకూ వేద శబ్దమెంత శుద్ధంగా ఉండాలో వివరించడము జరిగింది. దీనికి నిదర్శనమిదే; రామేశ్వరం నుండి హిమాలయాల వరకూ భారతదేశంలో ఏ విధమైన సామాజిక సంపర్కమూ లేని ప్రదేశాలలో కూడా వేదాలకి గల పాఠాలని నూటికి తొంభైతొమ్మిది పాళ్లు ఒకే విధంగా అక్షరంగాని పదంగాని వ్యత్యాసం లేకుండా ఉంటాయి. ఇక్కడ వేదాలు ఒక తరం నుంచి మరొక తరానికి లిఖిత పూర్వకంగా కాక, వాక్కు వల్లనే సంక్రమించిన విషయం కూడ గుర్తుంచుకోవాలి.*



*అంటే, స్వల్ప వ్యత్యాస ముందని దీని అర్థమా? అవును, ఉన్నది. ఒక ప్రాంతంలో ఉన్న ప్రతిశాఖకీ మరొక ప్రాంతంలో కల పాఠంలో కొద్ది వ్యత్యాసముంటుంది. ఇది ఆమోద నీయమేనా? ఏ మార్పు ఉన్నా అది విపరీతాలకు దారితీస్తుందని చెప్పిన తర్వాత ఈ 1% వ్యత్యాసం మాత్రమెట్లా సహించటం? శుద్ధమైన రూపము ఒకటే ఉంటే 1%  మార్పుకూడా అనుకొన్న ఫలితాన్నివ్వక పోవచ్చు, వేరొక ఫలితాన్నివ్వవచ్చును. ఈ ప్రశ్నకి సమాధానముంది. మంత్రాలలోని పదాలను మారిస్తే ఫలితం విపరీతమవుతుంది. నిజమే - జబ్బుని కుదర్చటానికి మందుని మార్పు చేస్తే వైద్యం మారినట్టే ఇది కూడ. కాని ఇది రోగికే వర్తిస్తుంది, తనంతట తానే అతడు ఔషధాన్ని మార్చుకో కూడదు, వైద్యుడు మార్చవచ్చు. ఒక వ్యాధిని కుదర్చటానికి ఎన్నో మందు లుంటాయి. అటువంటి సమయాల్లో వైద్యుడు ఒక మందుకి బదులు మరొక దానిని సూచించటంలో తప్పేమీ లేదు. ఒకే జబ్బైనా రోగి దేహస్థితిని బట్టి ఔషధంలోని పదార్థాల మిశ్రమాన్ని కూడ వైద్యుడు మార్చవచ్చు: ఆ విధంగానే ఉద్దేశ పూర్వకంగానే ఋషులు వివిధ శాఖలలోని పదాలను మార్చారు. తమ తరువాత వచ్చేవారు వల్లించటానికి వీలుగా ఈ మార్పు చేయబడింది.*



*''ప్రాతిశాఖ్య'' పాఠాలలో ఈ మార్పులకు సంబంధించిన నియమాలు వివరింపబడ్డాయి. ''ప్రాతిశాఖ్య'' అన్న మాటకి అసలైన అర్థం ''ప్రాంతీయం'' అని. మాటలలోని తేడాలు స్వల్పము - ఆ తేడాలు గణనీయము కావు. సన్నిహిత పదాలు, ఇంచుమించు ఒకే విధంగా ఉచ్చరింపబడే పదాలనే వాడారు. వైదిక శబ్దాలూ - ప్రాంతీయభాషలూ : వేద పదాలలో ప్రాంతీయ భేదాలను దృష్టిలో పెట్టుకొని వివిధ భారతీయ భాషలలో గల తేడాలను గమనిస్తే సాంస్కృతిక భేదాలకు మూలకారణం వైదిక శబ్దాలన్న ఆశ్చర్యకరమైన విషయం బయట పడుతుంది. భాషా శాస్త్ర సంబంధమైన  పరిశోధనలివి.*



*''ద'' ''ర'' ''ల'' ''ళ'' - ఇవన్నీ ఒక దానికొకటి దగ్గరి శబ్దాలు. చిన్న పిల్లవాడిని ''రైలు'' ''రామ'' అనమంటే ''దైలు'' ''దామ'' అంటాడు. ''ద'' ''ర''లకు శబ్దపరంగా సాన్నిహిత్య ముండటమే దీనికి కారణం. ''ద'' ''ర''గా మారగలదు. కనుక 'ల', 'ద'లకు శబ్దపరంగా మారగలదు కదా! ''ల'', ''ళ''లు దగ్గర శబ్దాలు. 'ల'కి, తమిళ శబ్దం ''ళ'' (zha)కి గల సాన్నిహిత్యాన్ని వేరే చెప్పనక్కర్లేదు. ఒక్కొక్క వేదం బాగా ప్రాచుర్యంలో ఉన్న ప్రాంతాలనూ, ఆయా భాషల లక్షణాలనూ గమనిద్దాం. ఈ రోజులలో వేదాలు ఆర్యులవనీ, ద్రవిడ సంస్కృతి దానికి భిన్నమనీ ఒక ప్రచారం జరుగుతోంది. కాబట్టి సమిష్టిగా ద్రవిడ ప్రాంతమని చెప్పబడే మూడు ప్రాంతాలను తీసికుందాము. అంటే తమిళం, తెలుగు, కన్నడ భాషలను. సంస్కృతంలో ''ప్రవాల''మనే శబ్దముంది. ఇదే - తమిళంలో ''పవళం'', తెలుగులో ''పగడం'' కన్నడంలో ''హవళ''. ''ప్రవాల'', తమిళంలో 'పవళం' అయింది తెలుగులో 'పగడ'మయింది. 'వ', 'గ'గా మారింది. 'ప్రవాల' కన్నడంలో ''హవళ''గా మారినప్పుడు మొదటి అక్షరమే మారుతుంది.*



 *''ప్ర'' అన్న అక్షరం తెలుగులో, తమిళంలో ''ప''గా మారటం పెద్ద మార్పుకాదు. కాని కన్నడంలో అది ''హ'' అవుతుంది. ఇది ఆ భాష ప్రత్యేక లక్షణం. ఇతర భాషలలోని ''ప'' కన్నడంలో - 'హ'గా మారుతుంది. ''పంప'' ''హంప''గా ఇంకా ''హంపి''గా మారుతుంది. ఆర్య, ద్రావిడ అంటూ రెండు జాతులుగా కాకపోయినా భాషలను సంస్కృతంలో సంబంధమున్న భాషలనీ, కేవలం ద్రావిడ భాషలనీ వర్గీకరిస్తారు. ఇప్పటి పరిశోధనలననుసరించే ఈ వర్గీకరణం. ఇంకా కొంత పరిశోధన జరిగితే ఈ వర్గీకరణ మనకవసరమేమో ననీ, అన్ని భాషలకూ మాతృక ఒకటేనేమోననీ కూడ నిరూపించవచ్చును. పశ్చిమ భారతంలో, కర్నాటకతో సహా, ప్రాచుర్యంలో ఉండేది ఋగ్వేదం. ఋగ్వేదంలో ''ళ'' శబ్దం ఎక్కువ వాడుకలో ఉంది. ద్రావిడభాష అని అందరూ అనుకునే కన్నడలోకి ''ళ'' అట్లా వచ్చింది.*


🕉🌞🌏🌙🌟🚩

శివానందలహారీ

 🙏శివానందలహారీ🙏



పరమేశ్వరా ! నీదు పాదముల్ దర్శి0ప

            కిటిరూప మెత్తె నా కేశవుండు

శీర్ష భాగంబైన శిరమును దర్శింప

            హంసగా మారె నయ్యబ్జభవుడు

యిర్వురు వారలు యెంత శ్రమించినా

             హర పద శిరములన్నరయరైరి     

వారి కసాధ్యమై పరగిన కార్యంబు 

          శివ శివా నేనెట్లు చేయ గలను ?             

శ్రీకరా ! నేను నిన్నెట్లు చిత్తమందు

దివ్యమౌ రీతి నిక్కంబు తెలియ గలను ?

తెలియ పరచుము శంకరా ! తెల్లముగను

భక్త వత్సల ! పరమేశ ! పాహి పాహి ! 99 #



భవసేవ మగ్నులౌ బ్రహ్మాది దేవతల్

           స్తుతియించ బడదగు స్తుత్య వరుల

గణనమ్ము సల్పెడి క్షణములందున వారు

            నిను నట్గ్రగణ్యుగా నెంచినారు

మాహాత్మ్యవంతుల మహనీయపురుషుల

           చిద్విచారంబును చేయు నపుడు

ధాన్య పొల్లు పగిది తామంత విడిపోగ

           నికర ధాన్యము వోలె నిల్తు వీవు

ఉత్తమోత్తమ ఫలముగనుండినటుల

           విశ్వ దేవతలెల్ల వేద్యు లైరి

యిందు సత్యేతరము లేదు యిందు మౌళి !

స్తోత్ర మించుక లేదయ్య శోభితాంగ !

సర్వమంగళ దాత ! యో సకలవినుత !

భక్త పరిపాల ! శంకరా ! పాహి పాహి ! 100



                           శుభము

                    మంగళం. మహత్


        ✍️గోపాలుని మధుసూదన రావు🙏

Dance