31, డిసెంబర్ 2021, శుక్రవారం

శ్రీకృష్ణదేవరాయలకు

 శ్రీకృష్ణదేవరాయలకు దేశభాషలందు తెలుగు లెస్స అని చెప్పిందెవరో తెలుసా ?

...............................................................

శ్రీకృష్ణదేవరాయలు తూర్పు దిగ్విజయయాత్రలో విజయవాటిక అంటే విజయవాడలో కొన్నాళ్ళు వున్న తరువాత శ్రీకాకుళంలోని ఆంధ్రమహ విష్ణువు దర్శనార్థమై వెళ్ళాడు. అక్కడ ఏకాదశి ఉపవాసం వుండి రాత్రి నిద్రించాడు. ఆ రాత్రి నాల్గవ యామంలో శ్రీకృష్ణరాయడుకి స్వామి కలలో కనిపించి ఇంతవరకు అనేక ప్రాంతాలు జయించావు. సంస్కృతంలో మదాలస చరిత్రము, సత్యవధూప్రీణనం, సకలకథాసార సంగ్రహం, సూక్తినైపుణి జ్ఞానచింతమణి, రసమంజరి ఆనే గొప్ప సంస్కృత గ్రంథాలను వ్రాశావు.


కాని దేశభాషలందు తెలుగు లెస్స కాబట్టి శ్రీవైష్ణవ అళ్వారులలో ఒకత్తైన గోదాదేవి చరిత్రను తెలుగులో వ్రాయమన్నాడు. అలా శ్రీకృష్ణదేవరాయలు తెలుగులో వ్రాసినదే అముక్తమాల్యదగా పిలవబడిన విష్ణుచిత్తియమనే గ్రంథం.


అళ్వారులు 12 మంది, వీరు శ్రీవైష్ణవభక్తులు. తమిళసాహిత్యంలో విష్ణువు మీద 4 వేలవరకు పాశురాలను తమిలంలో వ్రాశారు. వీటికే దివ్యప్రబంధాలని పేరు.

12 మంది అళ్వారులలో గోదాదేవి ఒక్కర్తే స్త్రీ.


ఆళ్వారులు12 మందని చెపుకొన్నాము కదా ! వారెవరంటే.


 (1) పొయ్‌గై యాళ్వార్ (2) పూదత్తాళ్వార్ (3) పేయాళ్వార్ (4) పెరియాళ్వార్ (5) తిరుమళిశై యాళ్వార్ (6) కులశేఖరాళ్వార్ (7) తిరుప్పాణాళ్వార్ (8) తొండరడిప్పొడి యాళ్వార్ (9) తిరుమంగై యాళ్వార్ (10) ఉడయవర్ (11) నమ్మాళ్వార్ (12) గోదాదేవి.


దేశభాషలలో తెలుగు లెస్స అని శ్రీకృష్ణరాయల కంటే చాలా ముందుగానే పలికినవాడు క్రీడాభిరామమనే గ్రంథాన్ని వ్రాసిన వినుకొండ వల్లభరాయుడు.


వల్లభరాయుడు శ్రీనాథకవికి సమకాలికుడు. వల్లభరాయునికి క్రిడాభిరామ గ్రంథరచనలో సాయ పడ్డాడు కనుకనే కొంతమంది సాహితి విమర్శకులు క్రీడాభిరామ కావ్యాన్ని వ్రాసింది శ్రీనాథకవి సార్వభౌముడేనంటారు.

............................................................................జిబి.విశ్వనాథ, 9441245857, అనంతపురం.

30, డిసెంబర్ 2021, గురువారం

డయాబెటిస్‌కు

 డయాబెటిస్‌కు శుభవార్త.

 

ఈ సమాచారం అవసరమైన వారికి సహాయపడటానికి మీరు ఈ క్రింది సందేశాన్ని ఫార్వార్డ్ చేయగలరని ఆశిస్తున్నాము ...!

 

ఒక మహిళ (65) గత 20+ సంవత్సరాలుగా డయాబెటిస్ కలిగి ఉంది మరియు రోజుకు రెండుసార్లు ఇన్సులిన్ తీసుకుంటుంది. ఆమె పక్షం రోజులపాటు ఇంటిలో తయారు చేసిన (medicine) ఔషధాన్ని ఉపయోగించింది మరియు ఇప్పుడు ఆమె డయాబెటిస్ నుండి పూర్తిగా ఉచితం మరియు స్వీట్స్‌తో సహా ఆమె ఆహారాన్ని సాధారణమైనదిగా తీసుకుంటుంది.

 

ఇన్సులిన్ మరియు రక్తంలో చక్కెరను నియంత్రించే మందులను ఆపమని వైద్యులు ఆమెకు సూచించారు. దయచేసి మీ అందరికీ ఈ క్రింది మెసేజ్ ను మీకు వీలైనంత ఎక్కువ మందికి పంపించి, దాని నుండి అధిక ప్రయోజనం పొందమని నేను కోరుతున్నాను.

 

DR. టోనీ అల్మైడా

 (బొంబాయి కిడ్నీ స్పెషాలిటీ నిపుణుడు) పట్టుదల మరియు సహనంతో విస్తృతమైన ప్రయోగాలు చేసి మధుమేహానికి విజయవంతమైన చికిత్సను కనుగొన్నారు.

ఇప్పుడు డయాబెటిస్ కారణంగా చాలా మంది ప్రజలు, వృద్ధులు మరియు మహిళలు చాలా బాధపడుతున్నారు.

 

 కావలసిన పదార్థాలు

 1 - * గోధుమ 100 గ్రా

 2 - * బార్లీ 100 గ్రా 

 3 - *నల్లజీలకర్ర (కొలుంజీ) 100 గ్రాములు *

 కొలుంజీ తమిళంలో * కరుంజీరాహం*

తయారీ విధానం:

 పైన పేర్కొన్న అన్ని పదార్థాలను 5 కప్పుల నీటిలో ఉంచండి.

దీన్ని 10 నిముషాలు మరిగించాలి 

స్వయంగా చల్లారాలి!


ఇది చల్లగా మారినప్పుడు, వడపోసి ఒక గాజు పాత్ర లేదా సీసాలో ఈ నీటిని నిలువ చేయండి!

 

 దీన్ని ఎలా వాడాలి?

ప్రతిరోజూ ఉదయాన్నే మీ కడుపు ఖాళీగా ఉన్నప్పుడు ఈ నీటిని ఒక చిన్న కప్పు తీసుకోండి.

దీన్ని 7 రోజులు కొనసాగించండి.

వచ్చే వారం అదే కానీ ప్రత్యామ్నాయ రోజులలో (రోజుమార్చి రోజు) పునరావృతం చేయండి. ఈ 2 వారాల చికిత్స తో మీ ఆరోగ్యం మామూలుగా మారిందని మీరు ఆశ్చర్యపోతారు. 

 సమస్య లేకుండా సాధారణ ఆహారం తీసుకోవచ్చును!

 

గమనిక:

దీన్ని వీలైనంత ఎక్కువ మందికి విస్తరించాలని ఒక అభ్యర్థన, తద్వారా ఇతరులు కూడా దాని నుండి ప్రయోజనం పొందవచ్చు.

 

 ఇవి అన్ని సహజమైనవి, వాటిని తీసుకోవడం హానికరం కాదు. ఈ చికిత్స గురించి నైపుణ్యం ఉన్నవారు ఏ హాని లేకుండా ప్రయత్నించవచ్చు.

 

మరోసారి ఈ సందేశం పంపినందుకు ధన్యవాదాలు ...

చాలా మందిని చక్కెర వ్యాధి నుండి కాపాడండి .... (డయాబెటిస్)

సర్పబంధనం

 సంపదను దాచుకునే పురాతన టెక్నాలజీ "సర్పబంధనం" .అప్పట్లో రాజులకు బ్యాంకులు లాకర్ లు లేవు కాబట్టి వారు విలువైన సంపాదన సర్పబంధనం వేసేవారు. అది ఎవరైన తవ్వితే వేల సంఖ్యలో లక్షల సంఖ్యలో పాములు వచ్చేవి.మరి ఆ పాములు తెచ్చి అక్కడ ఎలా పెడతారు.....? పూర్వం రాజులు తమ సంపద దాచాలనుకున్న చోట లోతుగా అంటే ఒక తాటి చెట్టు అంత లోతు తవ్వి అందులో సంపద పెట్టి కొంత మట్టి వేసి తరువాత కొన్ని టన్నుల బెల్లం వేసి పెట్టేవారు. ఆ బెల్లం కోసం వేల సంఖ్యలో లక్షల సంఖ్యలో చీమలు వచ్చి చేరి పెద్ద చీమల పుట్ట ఏర్పడేది.చీమల పుట్ట లే కదా పాములకు ఆవాసాలు అయ్యేవి.అంత పెద్ద చీమల పుట్ట లో వందల సంఖ్యలో పాములు చేరి గుడ్లు పెట్టి పిల్లల్ని చేసి కాలక్రమం లో అవి లక్షల్లో చేరుతాయి. అలా సర్పాలకు ఆవాసమయిన ఆ గుంత సర్ప గృహం గా మారుతుంది. పుట్ట కాదు సర్ప గృహం. అది ఎవడైనా తవ్వితే వేల సంఖ్యలో విష సర్పాలు బయటికి వచ్చి వాటి కాటుకు మరణిస్తాడు.


ఆ సంపద తీయలనుకున్నప్పుడు నిపుణుడు అయిన వ్యక్తి అక్కడ సమీపం లో మరొక గుంత తొవ్వి మళ్ళీ సేమ్ బెల్లం తో పెద్ద చీమల పుట్ట ఏర్పాటు చేసి అక్కడ ప్రత్యేక ద్రవ్యాలతో హోమం నిర్వహించి ఆ పొగ కు ఆ పాములు అన్ని అక్కడి నుండి వేరే పుట్టలోకి పోయిన తరువాత ఆ సంపద తిరిగి రాజ్యానికి చేర్చేవారు అని "తంత్ర శాస్త్రం" చెబుతుంది

జ్ఞాన మండలి

 జ్ఞాన మండలి...


 రోజూ భగవంతునికి పూజ చేసే వారు కూడా... 

భగవంతుడు అంటే ఏమిటి...

అంటే.....

ఎంతోమంది సరైన సమాధానం చెప్పలేరు. 


కాబట్టి ఓపిక చేసుకుని... 

ఈ చిన్న కథను చదవండి. 


ఓ దేశాన్ని పాలించే రాజు మనసులో... ముఖ్యంగా మూడు అర్దంకాని ప్రశ్నలు మెదడును తోలుస్తూ ఉన్నాయి. 

అవి... 


1.దేవుడు ఏ వైపు చూస్తుఉంటాడు? 

2.దేవుడు ఎక్కడ ఉంటాడు? 

3.దేవుడు ఏం చేస్తాడు? 


ఆ ప్రశ్నలకు ఎన్నోమార్లు ఎంత యోచించినా సరైన సమాధానం దొరకలేదు.


తన ఆస్థానంలో ఓ రోజు సమావేశమై... పండితులను, 

శాస్త్రకారులను, 

మేధావులను ఆహ్వానించాడు.

తాను మూడు ప్రశ్నలు వేస్తానని, 

వాటికి జవాబులు చెప్పడానికి ముందుకు వచ్చి సరైన సమాధానం చెప్పిన వారికి గొప్ప బహుమతి లభిస్తుందని చెప్పాడు. 

సరైన సమాధానం చెప్పకపోతే కారాగారం పాలు చేస్తానని చెప్పాడు. 

దాంతో భయపడి ఎవరూ ముందుకు రాలేదు. ఈ విషయం దేశమంతా చాటింపబడింది.


ఓ కుగ్రామం నుండి పశువుల కాపరి ఒకాయన ముందుకు వచ్చాడు.

రాజాస్థానం చేరుకొన్నాడు. 

రాజు సభలో ఎందరో మేధావులు శాస్త్ర పండితులు కూర్చొన్నారు.


పశువుల కాపరి, రాజుగారి మొదటి ప్రశ్నకు సమాధానం చెప్పబోయే ముందు.... రాజుకో విషయం నిర్దేశం చేసాడు.

‘చెప్పేవాడు గురువు, 

వినేవాడు శిష్యుడు. 

గురువు పైన ఉండాలి, 

శిష్యుడు క్రింద ఉండాలి’ 

అని కండీషన్ పెట్టాడు . 


దానికి రాజు అంగీకరించి సింహాసనం నుండి క్రిందికి దిగాడు. 

పశువుల కాపరి సింహాసనం అధిష్ఠించాడు. 


‘మహారాజా ఇప్పుడు అడగండి మూడు ప్రశ్నలు’’ అన్నాడు పశువుల కాపరి. 


మొదటి ప్రశ్న

దేవుడు ఏ వైపు చూస్తుఉంటాడు? 

దీనికి జవాబు చెప్పండి అన్నాడు రాజు.


వెంటనే ఒక దీపాన్ని తెప్పించమన్నాడు గురువు స్థానంలో వున్న పశువుల కాపరి. దీపం తెచ్చి సభ మధ్యలో పెట్టారు.


మహారాజా! ఈ దీపం ఎక్కడ చూస్తుంది? నావైపా? నీవైపా? తూర్పువైపా? పశ్చిమానికా? పైనకా? క్రిందకా? ఎక్కడ చూస్తుందో చెప్పండి? అని ప్రశ్నించాడు.

‘అన్నివైపులకు చూస్తుంది’ అని జవాబిచ్చాడు రాజు.


ఇంత చిన్న జ్యోతి అన్నివైపులా చూడగలిగినపుడు.... పరంజ్యోతి స్వరూపమైన భగవంతుడు అన్నివైపులా చూడలేడా? సమస్త జీవుల కళ్ళల్లో వెలుగుగా వున్న పరంజ్యోతి పరమాత్మే.


మరి ఇక రెండవ ప్రశ్న.... 


దేవుడు ఎక్కడ ఉంటాడు? 

అన్నాడు రాజు.


‘సరే! ఓ చిన్న పాత్రలో పాలు తెప్పించండి’ అన్నాడు పశువుల కాపరి. 

పాలు తెచ్చారు.

‘మహారాజా ! ఈ పాలల్లో నెయ్యి ఎక్కడ ఉందో చెప్పగలవా?’ అని అడిగాడు.


‘పాలను బాగా మరుగబెట్టాలి. 

వాటిని తోడు (మజ్జిగ) కలిపి కొన్ని గంటలు కదలకుండా ఉంచాలి. 

పెరుగు సిద్ధం అవుతుంది. 

దాన్ని కవ్వంతో చిలికితే వెన్న వస్తుంది. తర్వాత తయారైన వెన్నను కాస్తే నెయ్యి తయారవుతుంది’ అన్నాడు రాజు.


‘సరిగ్గా చెప్పారు మహారాజా! 

అలాగే హృదయం అనే పాలను గురువు అనే నిప్పులపై బాగా మరిగించి, 

మనస్సు అనే తోడు వేసి, 

స్థిరంగా ఉంచితే వచ్చే సత్యం అనే పెరుగును, 

సాధన అనే కవ్వంతో చిలికితే 

జ్ఞానం అనే వెన్న వస్తుంది.

ఆ సాధన ‘అంతర్ముఖం’ అనే నిప్పులపై బాగా కాచినట్లయితే పరమాత్మ అనే నెయ్యి వస్తుంది’అన్నాడు కాపరి.

సభలో హర్షధ్వానాలు మిన్నుముట్టాయి.


ఇక చివరి ప్రశ్న. 

దేవుడు ఏం చేస్తాడు? అని.


నేను పశువుల కాపరిని, మీరు మహారాజు.

క్రింద వున్న నన్ను సింహాసనం పైన కూర్చోబెట్టారు. 

పైన వున్న మిమ్మల్ని క్రిందికి దించేశారు. ఇదే పరమాత్మ లీల.

సత్కర్మలు చేసే జీవులను పై జన్మల్లో ఉత్తమ జన్మగా మార్చడం, 

దుష్కర్మలు చేసే వాళ్ళను మరుజన్మలో క్రింది స్థాయికి పంచడమే పరమాత్మ పని’ అన్నాడు.


సభలో గంభీర వాతావరణం నెలకొంది. రాజు పశువుల కాపరి ముందు పాదాక్రాంతుడయ్యాడు. 

పశువుల కాపరి రూపంలో ఉన్న పరమాత్మ తాను వచ్చిన దిక్కుగా తిరుగు ప్రయాణం అయ్యాడు.  


మంచిని ఎక్కడ ఉన్న గ్రహిద్దాము..

మంచిని నేర్చుకుందాము..  

మంచిని ఆచరించుదాము... 

మంచిని అందరికి పంచుదాము... 


హరే కృష్ణ 🙏

27, డిసెంబర్ 2021, సోమవారం

ఆయుర్వేద ఔషధాలలోని రకాలు -

 ఆయుర్వేద ఔషధాలలోని రకాలు - 


 * కషాయము - 


     కషాయము కాచునప్పుడు పైన మూత వేయకుండా కాయవలెను . మూసినచో కషాయము చెడిపోవును . కషాయము నందు ఉపయోగించవలసిన ద్రవ్యములు దినుసు (మూలిక) 4 తులముల చొప్పున గ్రహించి వాటిని మెత్తగా నలుగగొట్టి కొత్త కుండ యందు వేసి అందు 2 శేర్ల మంచినీటిని పోసి మందాగ్ని చేత కాచి అష్టాశముగా దింపి వడగట్టి బాలురకు పావుతులము నుంచి తులము మోతాదులో మరియు పెద్దవారికి 4 తులముల మోతాదు వరకు ఇవ్వవచ్చును . ఇందు చక్కర చేర్చవలసి వచ్చిన వాతరోగులకు 4 వ భాగము , పిత్తరోగులకు 8 వ భాగము , శ్లేష్మరోగులకు 16 వ వంతు ఇవ్వవలెను . తేనె కలుపవలసి వచ్చిన శ్లేష్మరోగులకు 4 వ వంతు , పిత్తరోగులకు 8 వ వంతు , వాతరోగులకు 16 వ వంతు చేర్చవలెను . జీలకర్ర , గుగ్గిలము , శిలాజిత్ , క్షారములు , ఇంగువ వంటివి పావుతులము కన్నా ఎక్కువ చేర్చకూడదు . 


 * కల్కము - 


      అల్లము తదితర శుష్కపదార్థాలను ఉదకము ( నీరు ) చే నూరి తీసేడు రసమును కల్కము అందురు . ఈ కల్కము నందు ద్రవ్యము తులప్రమాణములో ఉండవలెను . ఈ కల్కమున నెయ్యి , తేనె , నూనె కలపవలసి వచ్చినప్పుడు ఒకదాని మీద మరొకటి రెట్టింపుగాను , బెల్లము మరియు చక్కెర సమభాగాలుగా చేర్చవలెను . 


 * చూర్ణము - 


      ఎండిన ద్రవ్యములను మెత్తగా నూరి వస్త్రగాలితము ( మెత్తని వస్త్రము నందు నూరిన చూర్ణం వేసి జల్లెడ పట్టుట ) చేసి అరతులము నుంచి 1 తులము వరకు , చిన్నవారు ఒక మాషము ( 1 గ్రాము ) నుంచి 3 మాషములు 

(3 గ్రాములు ) వరకు దేహతత్వమును , వ్యాధి బలమును , దేశ కాలభేదములను బట్టి గుర్తెరిగి పుచ్చుకొనవలెను . 


            ఈ చూర్ణములో బెల్లము కలపవలసి వచ్చిన చూర్ణపు మోతాదుకు సమానంగా , చక్కెర కలపవలసి వచ్చిన చూర్ణముకు రెట్టింపు మోతాదులో కలపవలయును . ఇందు ఇంగువను కలపవలసి వచ్చిన ఇంగువను నేతితో పొంగించి కలుపవలెను . నెయ్యి కలపవలసి వచ్చిన ఇంగువకు రెట్టింపు మోతాదులో , నీటిని కలపవలసి వచ్చిన చూర్ణముకు నాలుగురెట్లు చేర్చవలెను . 


                 చూర్ణము అయినను , మాత్రలు అయినను , లేహ్యమైనను , కల్కమ్ అయినను సేవించిన పిదప పాలు మొదలగువాటిని తాగవలసిన యెడల వాతరోగము నందు 12 తులములు , పైత్యరోగము నందు 8 తులములు , శ్లేష్మరోగము నందు 4 తులములు పుచ్చుకొనవలెను . 


     చూర్ణమును భావన ( నానబెట్టి ఆరబెట్టుట ) చేయవలసిన చూర్ణమును , చూర్ణం మునుగునంతవరకు రసము పోసి ఆ రసం ఇగురునంత వరకు భద్రపరచి ఉంచవలెను . ఒకసారి భావన చేయుటకు 24 గంటలు పట్టును . 


 * ఔషధాలు పుచ్చుకొనవలసిన కాలనిర్ణయం - 


      చూర్ణరూపము , కషాయ రూపము మొదలగు ఔషధములను ఉదయము మరియు సాయంకాలము పుచ్చుకొనవలెను . ముఖ్యముగా ఉదయం ప్రాతఃకాలం అనగా సూర్యాస్తమయానికి ముందు సాయంకాలం సంధ్యాసమయం తరువాత అనగా చీకటి పడిన తరువాత పుచ్చుకొనుట ఉత్తమం . అసాధ్యరోగములకు అనేకసార్లు , వమనము , విరేచనాదులకు ప్రాతఃకాలము నందు కలికాదులకు సాయంత్రసమయం ఉత్తమం . 


            కాళహస్తి వేంకటేశ్వరరావు 


             అనువంశిక ఆయుర్వేదం 


                  9885030034

26, డిసెంబర్ 2021, ఆదివారం

కేదార్‌నాథ్_దేవాలయం_పరిష్కరించని_రహస్యం_కోడ్

 #కేదార్‌నాథ్_దేవాలయం_పరిష్కరించని_రహస్యం_కోడ్

కేదార్‌నాథ్ ఆలయాన్ని ఎవరు నిర్మించారనే దానిపై చాలా చర్చ జరుగుతోంది.పాండవుల నుండి ఆదిశంకరాచార్యుల వరకు.


కేదార్‌నాథ్ ఆలయం బహుశా 8వ శతాబ్దంలో నిర్మించబడిందని నేటి శాస్త్రం సూచిస్తుంది.  ఈ ఆలయం కనీసం 1200 సంవత్సరాల నుండి ఉనికిలో ఉంది.


21వ శతాబ్దంలో కూడా కేదార్‌నాథ్ సమీపంలోని భూమి చాలా ప్రతికూలంగా ఉంది.  కేదార్‌నాథ్ పర్వతం ఒకవైపు 22,000 అడుగులు, 

మరోవైపు #కరచ్‌కుండ్ 21,600 అడుగుల ఎత్తు, #భరత్‌కుండ్_మూడో_వైపు_22700 అడుగుల ఎత్తు ఉన్నాయి.ఈ మూడు పర్వతాల నుండి ప్రవహించే ఐదు నదులు #మందాకిని, 

#మధుగంగ_చిర్గంగా_సరస్వతి మరియు #స్వరందరి.  ఇది పురాణాలలో ప్రస్తావించబడింది.


ఈ ప్రాంతం "#మందాకినీ_నది" ఉన్న ఏకైక రాష్ట్రం.  చల్లని రోజున భారీ మంచు మరియు వర్షాకాలంలో భారీ వర్షం.  ఇంత శత్రుభూమిలో గుడి కట్టాలంటే ఎంతో అధ్యయనం చేయాల్సి వచ్చేది.


  ఈ రోజు కూడా మీరు "కేదార్‌నాథ్ ఆలయం" ఉన్నంత వరకు డ్రైవ్ చేయలేరు.  అలాంటి స్థలంలో ఎందుకు నిర్మించారు?  అది కాకుండా, 100-200 కాదు, 1000 సంవత్సరాలకు పైగా, ఇంత ప్రతికూల పరిస్థితిలో ఆలయం ఎలా మనుగడ సాగిస్తుంది?  మనమందరం ఒక్కసారైనా ఆలోచించాలి.  10వ శతాబ్దానికి చెందిన పక్షంలో ఈ ఆలయం భూమిపై చిన్న "మంచు యుగం" కాలంలో ఉండేదని శాస్త్రవేత్తలు ఊహిస్తున్నారు.


  డెహ్రాడూన్‌లోని వాడియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ జియాలజీ వారు కేదార్‌నాథ్ ఆలయ శిలలపై "#లిగ్నోమెట్రిక్_డేటింగ్" పరీక్షను నిర్వహించి ఆలయం ఉన్న ప్రదేశానికి సమీపంలో పూర్తిగా మంచుతో కప్పబడి ఉండేలా చూసుకున్నారు.  "రాతి జీవితాన్ని" గుర్తించడానికి లిగ్నోమాటిక్ డేటింగ్ పరీక్షలు నిర్వహిస్తారు.  14వ శతాబ్దం నుంచి 17వ శతాబ్దం మధ్యకాలం వరకు ఈ ఆలయం పూర్తిగా మంచుతో కప్పబడి ఉందని ఈ పరీక్షలో తేలింది.  అయితే ఆలయ నిర్మాణంలో ఎలాంటి నష్టం జరగలేదు.


  2013లో కేదార్‌నాథ్‌లో వరదలు వచ్చినప్పుడు అందరూ చూసి ఉంటారు.  ఈ కాలంలో వర్షపాతం "సగటు కంటే 375%" ఎక్కువ వర్షం కురిసింది.  తదుపరి వచ్చిన వరదలలో కనీసం 5,748 మంది మరణించారు (ప్రభుత్వ గణాంకాలు).  4200 గ్రామాలు దెబ్బతిన్నాయి.  భారత వైమానిక దళం ద్వారా 1 లక్షా 10 వేల మందికి పైగా ప్రజలు విమానంలో సురక్షిత స్థలానికి చేరారు.కానీ ఈ విపత్తు వరదలో కూడా, కేదార్‌నాథ్ ఆలయ నిర్మాణం కొంచెం కూడా ప్రభావితం కాలేదు.


ఆర్కియోలాజికల్ సొసైటీ ఆఫ్ ఇండియా ప్రకారం, వరద తర్వాత కూడా, ఆలయ మొత్తం నిర్మాణం యొక్క ఆడిట్‌లో 99 శాతం దేవాలయాలు పూర్తిగా రక్షించబడ్డాయి.  2013 వరదల సమయంలో భవనానికి ఎంత నష్టం జరిగిందో, ప్రస్తుత పరిస్థితిని అధ్యయనం చేసేందుకు "IIT మద్రాస్" ఆలయంపై "NDT పరీక్ష" నిర్వహించింది.  ఆలయం పూర్తిగా సురక్షితంగా, పటిష్టంగా ఉందని కూడా చెప్పారు.


1200 సంవత్సరాల తరువాత, ఆ ప్రాంతంలో ప్రతిదీ ప్రవహించే చోట, ఒక్క నిర్మాణం కూడా మిగిలి లేదు.  ఈ దేవాలయం మనసులో నిలిచి ఉంది మరియు నిలబడడమే కాకుండా చాలా బలంగా ఉంది.  ఈ ఆలయాన్ని నిర్మించిన తీరు చూస్తే నమ్మండి.  ఎంపిక చేయబడిన స్థలం.  ఈ వరదలో ఈ ఆలయం తన కాళ్లపై తాను నిలబడగలిగినందుకు ఈ ఆలయ నిర్మాణంలో ఉపయోగించిన రాయి మరియు నిర్మాణమే కారణమని నేడు శాస్త్రం చెబుతోంది.


  ఈ ఆలయం "ఉత్తర-దక్షిణ"గా నిర్మించబడింది.  కేదార్‌నాథ్ నిర్మాణం "దక్షిణ-ఉత్తరం" అయితే భారతదేశంలోని దాదాపు అన్ని దేవాలయాలు "తూర్పు-పడమర"గా ఉన్నాయి.  నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఆలయం "తూర్పు-పశ్చిమ" గా ఉంటే, అది ఇప్పటికే నాశనం కాబడి ఉండేది.  లేదా కనీసం 2013 చివరి నాటికి నాశనం చేయబడి ఉండేది.


  కానీ ఈ దిశ కారణంగానే కేదార్‌నాథ్ ఆలయం మనుగడలో ఉంది.  ఇంకో విషయం ఏంటంటే ఇందులో వాడే రాయి చాలా గట్టిగా, మన్నికగా ఉంటుంది.  విశేషమేమిటంటే, ఈ ఆలయ నిర్మాణానికి ఉపయోగించిన రాయి అక్కడ లభ్యం కాదు, అయితే ఆ రాయిని అక్కడికి ఎలా తీసుకెళ్లి ఉంటారో ఒక్కసారి ఆలోచించండి?  అప్పట్లో అంత పెద్ద రాయిని మోసుకెళ్లే పనిముట్లు లేవు.  ఈ రాయి ప్రత్యేకత ఏమిటంటే, వాతావరణంలో తేడాలు ఉన్నప్పటికీ, మంచు కింద ఉన్న 400 సంవత్సరాల తర్వాత కూడా దాని "గుణాలు" మారలేదు.

 

అందువల్ల, ఆలయం ప్రకృతి చక్రంలో తన బలాన్ని నిలుపుకుంటుంది.  ఆలయంలోని ఈ బలమైన రాళ్లను ఎటువంటి సిమెంట్ ఉపయోగించకుండా "#ఆష్లర్" పద్ధతిలో కలుపుతారు.  అందువల్ల, రాతి కీళ్లపై ఉష్ణోగ్రత మార్పుల ప్రభావం లేకుండా ఆలయ బలం అభేద్యంగా ఉంటుంది.  2013లో విత ఘాలాయికి గుడి వెనుక భాగంలో పెద్ద రాయి చిక్కుకుపోయి నీటి అంచు పగిలిపోయింది.  మరుసటి రోజు భారత వైమానిక దళం ఎవరిని హెర్లిఫ్ట్ చేసింది.


  విశ్వాసం ఉందా లేదా అనేది ప్రశ్న.  కానీ 1200 సంవత్సరాలకు పైగా సంస్కృతిని మరియు శక్తిని నిలుపుకునే ఆలయ నిర్మాణానికి స్థలాన్ని ఎంచుకున్న తర్వాత, దాని దిశ, సారూప్య నిర్మాణ వస్తువులు మరియు ప్రకృతిని కూడా పరిగణనలోకి తీసుకున్నారనడంలో సందేహం లేదు.  టైటానిక్ మునిగిపోయిన తర్వాత, పశ్చిమ దేశాల ప్రజలు "NDT పరీక్ష" మరియు "ఉష్ణోగ్రత" ఆటుపోట్లను ఎలా మార్చగలరో గ్రహించారు.  కానీ మనం 1200 సంవత్సరాల క్రితం ఇది ఇలా అని అనుకున్నాం.


కేదార్‌నాథ్ అదే స్పష్టమైన ఉదాహరణ కాదా?  

కొన్ని నెలల వర్షం, 

కొన్ని నెలలు మంచు, మరియు కొన్ని సంవత్సరాలు మంచు, ఇప్పటికీ మంచు, గాలి మరియు వర్షంతో కప్పబడి ఉంటుంది.  మరియు 6 అడుగుల ఎత్తైన ప్లాట్‌ఫారమ్ యొక్క బలాన్ని బట్టి, మనం ఆలోచించడం ఆశ్చర్యానికి గురిచేస్తుంది.  ఎంత సైన్స్ ఉపయోగించబడింది ఇక్కడ.


ఈరోజు, అన్ని వరదల తరువాత," కేదార్‌నాథ్ శాస్త్రవేత్తల సృష్టికి మేము మరోసారి నమస్కరిస్తున్నాము.


వైదిక హిందూధర్మం  మరియు సంస్కృతి ఎంత ముందున్నాయో ఇదొక ఉదాహరణ.

  ||  ఓం నమః శివాయ ||


సేకరణ..

డా॥కె.యు.గిరిధర్

సాధన -3

 సాధన -3

 శరీర సంసిద్ధత 

వంట చేయాలంటే ముందుగా వంటకు వాడే పాత్రలు శుభ్రంగా తోముకొని స్వచ్ఛమైన నీటితో కడుగుకొని వుంచుకుంటాము. అదే విధంగా బియ్యం, పప్పులు, కూరలు మరియు ఇతర వంటకు పనికివచ్చే దినుసులన్నీ స్వచ్ఛమైనవిగా చూసుకొని అప్పుడు కానీ పొయ్యిమీద గిన్నె పెట్టాము. ఇది మనందరికీ తెలిసిన విషయమే ఎందుకంటె మనం వండుకునే వంటకం స్వచ్ఛముగా, రుచికరంగా, ఆరోగ్యకరంగా ఉండాలని మనం అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటాము. 

సాధకుడు తను ఆ అనంతునివైపు పయనించే సాధన చేయాలంటే తన సాధనకు ఉపకారంగా వున్న శరీరాన్ని కూడా శుభ్రంగా, శుచిగా, శుద్ధంగా సిద్ధం చేసుకోవాలి కదా. ముందు శరీరం శుచిగా ఉంటే అప్పుడు మనస్సు కూడా శుచిగా ఉండి చక్కగా  సాధనకు సహకరిస్తుంది. 

శరీరాన్ని శుభ్రంగా ఉంచుకోవటం అంటే శుభ్రంగా స్నానం చేయటం అని మనం అనుకుంటాము.  అది కూడా నిజం చక్కగా స్నానమాచరించాలి, అంతేకాక తలను కూడా శుభ్రంగా ఉంచుకోవాలి అప్పుడే బుద్ధికుడ శుభ్రంగా అవుతుంది. సాధకునికి దేహ మొహానికి కారణం శిరోజాలు అంటే తలవెంట్రుకలు. అధర్వణ వేదాంతర్గత మైనట్టి ముండకోపనిషత్తు సాధకుని ముందుగా ముండనం చేసుకొని అంటే గుండు చేయించుకోమని తెలుపుతున్నది. ఎప్పుడైతే సాధకుడి తలబొడిది అవుతుందో అప్పుడు అతని బుద్ధికుడ శుభ్రంగా మారుతుంది. మనం తెలుసుకున్న యోగ పురుషులు, ఉదాహరణకు శ్రీ రామకృష్ణ, శ్రీ రమణులు ఇంకా అలంటి వారి కోవకు చెందిన అనేక మహానుభావులు వారి తలలను బోడిగా వుంచుకోవటమే ఇందుకు  నిదర్శనం. ఇప్పుడు కూడా అనేక మంది సన్యాసజీవనాన్ని గడుపుతున్న మహానుభావులు కూడా వారి తలలను బోడిగానే ఉంచుకుంటున్నారు. కాకపొతే సంసార జీవనాన్ని గడుపుతున్న సాధకులు మాత్రము పూర్తిగా బోడి గుండు కాకుండా శిఖను (పిలకను) ధరించాలి. మన సనాతన ధర్మంలో బ్రాహ్మణులకు ఈ రకమైన సంప్రదాయం ఉండటం బహుశా వారి మానసిక ఉన్నతికి తోడ్పాటుకొరకే అయివుండొచ్చు. ఇప్పుడు గుండు పిలక కలిగిన బ్రాహ్మణులను చాలా తక్కువగా చూస్తున్నాము.  కానీ సాధకుడు మాత్రం విధిగా తన సాధనకొరకు గుండు పిలక కలిగి  ఉండాలి. అప్పుడే సాధన సక్రమంగా కొనసాగుతుంది. 

కేశాలను అలంకరించుకొని, ఇంకా మాట్లాడితే రంగు దిద్దుకొని వేదాంత మాటలు చెప్పే వారిని కేవలము మూర్ఖులుగా భావించాలి. తానూ ఆచరించక ఇతరులకు చెప్పటం పెద్ద దోషం. 

సాధకుని ద్రుష్టి సదా మోక్షం మీద మాత్రమే ఉండాలి,  సమాజం నా గూర్చి ఏమనుకొంటుందో అనే భావనను పూర్తిగా విడనాడాలి. ఈ సమాజానికి మనం ఎలా కనబడితే అలానే చూస్తుంది. ఒకరికోసం కాదు జీవనం. సాధకుని ఆధ్యాత్మిక అభివృద్ధి అది కేవలం అతని వ్యక్తిగతం. ఎన్నో విధాల శ్రమదమాలను ఓర్చుకుంటేనే సాధన నిరంతరాయంగా సాగుతుంది. 

సాధకుడు సామాజిక జీవనానికి తక్కువ ప్రాధాన్యత, ఆధ్యాత్మిక జీవనానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. ఈ విషయం సదా జ్ఞ్యాపకం ఉంచుకోవాలి. ముముక్షువు లక్ష్యం ఎప్పుడు మోక్షం మీదనే ఉండాలి.  ఈ సమాజంలో ఇవ్వన్నీ సాధ్యమేనా అనే ప్రశ్న  ఉదయిస్తుంది. నిజానికి అన్ని సాధ్యమే కేవలం మనస్సుని స్వాధీన పరచుకోవాలి.  సాధకుడు తన మనస్సుని తన ఆధీనంలో ఉంచుకుంటే పూర్తి ప్రకృతి శక్తులు తన వశం అవుతాయి. 

ఓం తత్సత్. 

ఓం శాంతి శాంతి శాంతిః. 



* రాక్షసులతో సమానులు

* రాక్షసులతో సమానులు ఏవరు ?

 

1. రాజాజ్ఞ మీరినవారు.

2. ఆధారం లేక అప్పు చేసినవారు.

3. తనంతటి వాడు లేడని గర్వించేవాడు .

4. జన్మనిచ్చిన వారిని కష్టపెట్టేవాడు.

5. చేసిన ఉపకారాన్ని మరిచేవాడు.

6. ఆడదాని మాటలు విని కలహించేవాడు.

7. నమ్మించి మోసగించేవాడు.

8. స్త్రీని బలాత్కారంగా అనుభవించేవాడు.

9. నిరసంగా పరిహసించువాడు .

10. సభకు విగ్నం కలిగించువాడు.

11. పురుషుని అదుపాజ్ఞలలో ఉండని స్త్రీ .

12. హంతకుడు.


స్వర్ణ భస్మం గురించి సంపూర్ణ వివరణ -

 స్వర్ణ భస్మం గురించి సంపూర్ణ వివరణ - 


    స్వర్ణ భస్మం గురించి అంతకు ముందు మీకు వివరించాను . ఇప్పుడు మీకు మరికొంత విలువైన సమాచారాన్ని అందిస్తాను . 


   స్వర్ణ భస్మము ప్రయోగించుట వలన అనేకరకాల మొండివ్యాధులను సైతం నయం చేయవచ్చు . వాతము వలన వచ్చు జ్వరము , పిత్త సంబంధ జ్వరము , అతిసార రోగము , గ్రహణి , పాండురోగము , క్షయ , గర్భ సంబంధ రోగములు , ఫిరంగి రోగము ( siphalis ) , ఆయాసం , ఆమ్లపిత్తము , అపస్మారము , శిరస్సుకు సంబంధించిన రోగములు , ఉన్మాద రోగము , త్రిదోషాల వలన సంప్రాప్తించు రోగములు , స్తనరోగము , విషము వలన కలిగెడి రోగములు , ఎక్కిళ్లు , బాలలకు వచ్చు రోగములు వంటి సమస్తరోగములు ఈ స్వర్ణభస్మ సేవన వలన నయం అగును . 


      ప్రస్తుత కాలములో మనం తీసుకునే ఆహరం దగ్గర నుంచి తాగే నీరు వరకు ప్రతీది కాలుష్యమే . మన భారతదేశము నందు ఈ మధ్యకాలములో పురుగు మందుల వాడకం విచ్చలవిడిగా పెరిగిపోయింది . సంవత్సరానికి మనం 300ml నుంచి 400ml వరకు పురుగు మందు మన శరీరంలోకి ప్రవేశిస్తుంది. ఇది మనశరీరాన్ని చిన్నచిన్నగా విషపూరితం చేస్తుంది . క్రమముగా అనేక భయంకర రోగాలపాలు అవ్వడం జరుగుతుంది. ఇలా కలుషితం అయిన శరీరాన్ని బాగుచేసుకొనుటకు మరియు శరీరములో ఉన్నటువంటి టాక్సిన్స్ ను బయటకి పంపి సంపూర్ణ ఆరోగ్యం పొందుటకు ఈ స్వర్ణభస్మం ఎంతగానో ఉపకరించును . 


        నేను చేసిన పరిశోధన మరియు నేను గ్రహించిన అనుభవం మేరకు ఈ స్వర్ణభస్మం ను మరికొన్ని భస్మాలతో కలిపి ప్రయోగించినప్పుడు ఫలితాలు వేగవంతంగా వచ్చాయి. మా పూర్వీకుల ఫార్ములా ఉపయోగించి తయారుచేసిన స్వర్ణఔషధం అత్యుత్తమ ఫలితాలు ఇచ్చినది.


       ఈ స్వర్ణఔషదం నరాలు , ఎముకలు , కండరాల మీద అద్భుతముగా పనిచేయును .మధుమేహ వ్యాధిగ్రస్తులకు లోపలి అంతగర్గత అవయవాలు దెబ్బతినడం జరుగును . ఈ ఔషధం వాడుట వలన అంతర్గత అవయవాలు దెబ్బతినకుండా బలం చేకూరును . అదేవిధముగా ఈ మధ్యకాలంలో నరాల సంబంధ దోషములతో చాలామంది ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యముగా మధుమేహము ఉన్నవారు.అటువంటి దోషములన్నింటిని పోగొట్టి నరాలను శక్తివంతముగా మార్చును.


         ఈ స్వర్ణఔషదం గొప్ప వాజీకరణం . శృంగారపరమైన బలహీనత , శృంగారము పైన ఆసక్తి లేకపోవటం వంటి సంబంధ సమస్యలే కాకుండగా స్త్రీలలో వచ్చు గర్భసంబంధ దోషములకు కూడ అద్బుతముగా పనిచేయును . 


        చిన్నపిల్లలలో అమితమైన జ్ఞాపకశక్తిని మరియు మెదడుకు మరింత బలాన్ని చేకూర్చును . ఇది క్రమం తప్పకుండా వాడుతున్నవారు ఏకసంథాగ్రాహకులు గా మారును . ఇది మంచి ఇమ్మ్యూనిటి బూస్టరుగా పనిచేయును . రోగనిరోధక శక్తిని అమితముగా పెంచును. 


        కరోనా సమయములో కరోనా వచ్చి బలహీనపడిన వారికి ఇది ఇవ్వడం వలన త్వరితగతిన కోలుకోవడం జరిగింది . మగవారికి మాత్రరూపములో , ఆడవారికి మరియు పిల్లలకు లేహ్యరూపములో ఇవ్వడం జరుగును. 


 గమనిక - 


      దీని ఖరీదు కొంత ఎక్కువుగా ఉండును . కావలసిన వారు ఫొన్ చేసి సంప్రదించగలరు. మెస్సేజి , కామెంట్స్ రూపములో స్పందించడం జరగదు.దీనికి కారణం మీరు ఫొన్ చేసినప్పుడు నేను అడిగే కొన్ని ప్రశ్నలకు సమాధానం ఇవ్వవలెను . దీనివల్ల మీ శరీరాత్త్వాన్ని అంచనా వేసుకొని తయారుచేసి ఇస్తాను. 


     ఎటువంటి దుష్ప్రభావాలు ఉండవు. ఎవ్వరైనా వాడుకోవచ్చు. దీనిని వాడటం వలన రాబోయే దుష్ప్రభావాలను ఎదుర్కొనే శక్తి వచ్చును .  


       ఈ స్వర్ణఔషదం కావలసిన వారు 9885030034 నంబర్ కి ఫోన్ చేయగలరు . 


     

              కాళహస్తి వేంకటేశ్వరరావు 


              అనువంశిక ఆయుర్వేదం 


                   9885030034

కృతఘ్నత

 ॐ                       కృతఘ్నత 



    "కృతఘ్నత" (ఇతరులు మనకు చేసిన మేలు మరచి పోవడం) మహాపాపం.

    అన్ని పాపములకు "ప్రాయశ్చిత్తం" శాస్త్రములలో చెప్పబడి  ఉంది.

    కానీ "కృతఘ్నతా దోషానికి" మాత్రం  ప్రాయశ్చిత్తం లేదు.

    భగవంతుడు కూడా ఈ దోషాన్ని పోగొట్టలేడు.

    ఒక్క సద్గురువు మాత్రమే ఈ దోషమునుండి భక్తులను కాపాడగలరు.


    కృతఘ్నతా దోషము పాలుగాకుండా, ఒక మహా పండితుని  శ్రీ కంచి పరమాచార్యులవారు అనుగ్రహించిన  సంఘటన ఒకటి ఇప్పుడు చెప్పుకుందాము.


    అనంతపురంలో  "మొదలి శ్రీ బాల విశ్వనాధ శర్మ గారు"  అనే వేద విద్వాంసులు ఉండేవారు.

    వారు అనేకమంది శిష్యులకు వేదము చెప్పేవారు. సంస్కృతములో కూడా గొప్ప పండితులు.

    అనంతపురం, ప్రభుత్వ కళాశాలలో సంస్కృత భాషోపన్యాసకులుగా ఉద్యోగం చేసే వారు.


    మా బావమరిది శ్రీ అమ్మనమంచి శివప్రసాదు, అనంతపురం వైశ్యాబాంక్ లో పనిచేస్తుండగా వీరి సాంగత్యం లభించి, వీరి శిష్యులైనారు. వీరిదగ్గర "అరుణము", మొదలైనవి అధ్యయనం చేశారు.

    వారికి శ్రీ శర్మగారు స్వయముగా చెప్పినదే ఈ వృత్తాంతమంతా.


    శ్రీ శాస్త్రిగారు  నిత్యము " సప్తశతి"పారాయణ చేసేవారు.

    అనేకమంది చేత చండీయాగములు చేయించారు.

     ఆగమ శాస్త్ర పండితులు కూడా కాబట్టి  అనేక దేవాలయ ప్రతిష్టలు కూడా నిర్వహించారు.

    నెల్లూరు దగ్గరవున్న" పెంచలకోన" లో శ్రీ విజయేశ్వరి అమ్మవారు అనేకసార్లు వీరిచేత  తమ ఆశ్రమంలో చండీయాగములు చేయించారు. 


    ఒకసారి శ్రీ కంచి పరమాచార్యులవారు అనంతపురంలో పదిరోజులు బస చేశారు.

    శ్రీ బాల విశ్వనాధ శర్మ గారు రోజూ వారిని దర్శించుకునేవారు. కానీ ఎన్నిసార్లు ప్రయత్నించినా శ్రీ స్వామివారు వీరితో మాట్లాడేవారు కాదు. 

    అందరితో మాట్లాడుతూ, ప్రత్యేకంగా, ఆ ఊరిలో ఎంతో ప్రఖ్యాతి చెందిన వీరితో మాత్రం  శ్రీ స్వామివారు మాట్లాడక పోవడము అందరికీ ఎంతో ఆశ్చర్యం కలిగించేది.

    శ్రీ స్వామి వారు తనతో మాట్లాడక పోవడముతో శ్రీ శర్మగారు ఎంతో మనస్తాపం చెందారు.

    కారణము తెలియక వారికి రోజు రోజుకు దుఃఖము అధిక మవుతుండేది.

    ఇలా పదిరోజులు గడిచినై.


    శ్రీ స్వామివారు అక్కడనుండి "ధర్మవరము" నకు ప్రయాణమయినారు.

    శ్రీ శర్మగారు చింతాగ్రస్తులయినారు. ఏమైనా సరే, శ్రీ స్వామివారు మాట్లాడేదాకా వారిని అనుసరించాలని నిర్ణయించుకున్నారు.

   "నేను ఎప్పుడు వస్తానో తెలియదు.అప్పటివరకు సెలవు మంజూరు చేయ వలసినది" అని కళాశాలకు సెలవు చీటీ పంపించి, శ్రీ స్వామివారి వెంట ధర్మవరము వెళ్లారు.

    శ్రీ స్వామివారు నదీ స్నానం ఆచరిస్తుండగా అక్కడ నిలబడి " అఘమర్షణ " సూక్తము మొదలైన స్నాన మంత్రములు చదివారు.

    మంత్రములు చదవటం పూర్తి అయినా, శ్రీ స్వామివారు, ఇంకా స్నానం చేస్తూనే ఉన్నారు.

    శ్రీ శర్మగారు కొంత తటపటాయిస్తూ "రుద్రము" చదవటం మొదలుపెట్టారు. 

    శ్రీ స్వామివారు చదవమని చేయి ఊపి సైగ చేశారు.


    పది రోజుల తరువాత అదే 

మొదటిసారి శ్రీ స్వామివారు, శ్రీ శర్మగారివంక చూడటము. 

    శ్రీ శర్మగారు మహదానంద భరితులయినారు.


    సాయంకాలము ఊరి వారందరితో కూడిన సభ జరుగుతున్నది. శ్రీ స్వామివారు వున్నట్లుండి శ్రీ శర్మగారిని పేరు పెట్టి పిలిచి, వేదికపైకి రమ్మన్నారు.

    శ్రీ శర్మగారు వేదికపైకి వెళ్లి శ్రీ స్వామివారికి " న కర్మణా న ప్రజయా" అని వేదమంత్రం చదువుతూ సాష్టాంగ నమస్కారం చేశారు. 

    శ్రీ పరమాచార్యులవారు వీరితో సంస్కృతములో సంభాషణ ప్రారంభించారు.


   "మీరు మీ గురువులను విస్మరించారు.

    మీ కుటుంబము వారందరికి శ్రీ శృంగేరీ జగద్గురువులతో ఎన్నో తరములనుండి అనుబంధము ఉన్నది.

    మీకు చిన్న తనములో నత్తి వల్ల మాటలు సరిగా రాకపోవడంతో మీ ఇంట్లో వారందరు దిగులు పడ్డారు.

    మీ తాతగారు, మిమ్ములను, శ్రీ శృంగేరి జగద్గురువులు శ్రీ చంద్రశేఖర భారతీ స్వాములవారి సన్నిధికి  తీసుకు వెళ్లి విషయం విన్నవించారు.

    జగద్గురువులు మీ నోరు తెరవమన్నారు. ఎంతో అనుగ్రహంతో మీ నాలుకమీద వారి అమృతదృష్టి ప్రసరింపజేసి, చిరునవ్వు నవ్వుతూ "ఈ అబ్బాయి గొప్ప పండితుడు అవుతాడు. చాలా ప్రఖ్యాతి సంపాదిస్తాడు" అని ఆశీర్వదించారు.

    ఆ క్షణం నుండీ మీకు నత్తి పోయింది స్పష్టమైన ఉచ్ఛారణ వచ్చింది. వేదము, సంస్కృతము అధ్యయనం చేసి మంచి పండితులైనారు.

    అటువంటి సద్గురువులను మీరు విస్మరించారు" అన్నారు.


    శ్రీ శర్మగారు నిశ్చేష్టులైనారు.

    ఒక్కసారిగా వారికి గతమంతా గుర్తుకు వచ్చింది.

    తనను తన తాతగారు, శృంగేరీ తీసుకువెళ్లడము, జగద్గురువులు ఆశీర్వదించడము,తన విద్యాభ్యాసము, క్రమంగా శ్రీ జగద్గురువులను మరచి పోవడము అన్నీ జ్ఞప్తికి వచ్చినవి.

    ఎంతో సిగ్గు పడ్డారు.

    వారికి ఆశ్చర్యం కూడా వేసింది.

    ఎప్పుడో తన చిన్నతనంలో జరిగిన ఈ విషయాలు శ్రీ స్వామివారికి ఎలా తెలుసు?


    శ్రీ స్వామివారు సాక్షాత్తూ భగవంతుని అవతారం అనటానికి ఇంతకంటే వేరే నిదర్శనం ఏమి కావాలి?

    తనకు "నత్తి" పోగొట్టి, వాక్పటుత్వము ప్రసాదించిన శ్రీ శృంగేరీ జగద్గురువులు కనులకు గోచరించారు. వారి మనస్సు భక్తి భావంతో నిండిపోయింది.

    శ్రీ పరమాచార్యులవారికి సాష్టాంగ నమస్కారము చేశారు.


    తాను శ్రీ శృంగేరీ జగద్గురువులను విస్మరించి గొప్ప పాపం చేశానని, మీరు నన్ను కాపాడాలని, 

శ్రీ పరమాచార్యులవారిని  వేడుకున్నారు.

    శృంగేరీ వెళ్తానన్నారు.

    ఆ తరువాత వారిద్దరూ అనేక విషయములు మాట్లాడుకున్నారు.

    శ్రీ శర్మగారి సందేహాలు ఎన్నో శ్రీ స్వామివారు తీర్చారు.

    వారిని ఆశీర్వదించి తిరుగు ప్రయాణానికి అనుజ్ఞ ఇచ్చి పంపారు.

    శ్రీ శర్మగారు అప్పటినుండి శ్రీశృంగేరీ వారితో తమ అనుబంధం కొనసాగించారు. అనేకమందికి,వేదము, సంస్కృతము చెప్పారు. అనేక గ్రంధాలు రచించారు. 

    అనేక సత్కార్యాలు చేసి జన్మ చరితార్ధము చేసుకొన్నారు.

    దేహత్యాగ పర్యంతము ఏటువంటి రుగ్మతా లేకుండా సంపూర్ణ ఆరోగ్యముతో వున్నారు.

    కృతఘ్నతా మహా దోషం నుండి తనను కాపాడిన శ్రీ పరమాచార్యులవారిని ఆ జన్మాంతమూ, స్మరించుకుంటూనే ఉండేవారు.


    కేవలము తమ భక్తులనే కాదు, సన్మార్గంలో ఉండే వారందరినీ  శ్రీపరమాచార్యులవారు ఇలా

 కాపాడుతూ ఉంటారు. 


శ్రీ సద్గురు చరణారవిందాభ్యాం నమః.


                    శుభమస్తు.

తూములూరి మధుసూదనరావు.

25-12-'21. 


                   **********

    పరమాచార్య నడిచే దైవం.

    ఇప్పూడూ సమాధినించీ నడిపించే ఆ దైవానికి ప్రణామాలు.


"కృతఘ్నత" గురించి శ్రీరాముడు లక్ష్మణుని వాలివద్దకు పంపుతూ లక్ష్మణునితో అన్న మాట 


కృతార్థా హ్యకృతార్థానాం 

మిత్రాణాం న భవన్తి యే I

తాన్మృతానపి క్రవ్యాదాః 

కృతఘ్నాన్నోపభుఞ్జతే ॥ 4/30/73


    మిత్రులసహాయముతో తమ పనులను పూర్తి చేసికొని, 

    పిదప వారికి సహాయపడనివారు కృతఘ్నులు. 

    అట్టివారు చనిపోయిన పిమ్మట వారి కళేబరములను పచ్చిమాంసములను తినెడి క్రూరమృగములుగూడ ముట్టవు. 


    Even the carnivorous animals 

    dislike to eat the body of such ungrateful men 

    who do not help their friends even though they have received help and have achieved their objective. 


    — రామాయణం శర్మ 

              భద్రాచలం

పాఠక మిత్రులకు విన్నపం

ఈ బ్లాగు మనందరిది. దీనిని సర్వాంగ సుందరంగా తీర్చి దిద్దే కార్యక్రమంలో అందరు భాగస్వాములు కావచ్చు. కానీ మీరు మీకు నచ్చిన, లేక నచ్చని అంశం ఎందుకు నచ్చిందో, నచ్చలేదో తెలిపే ముందు మీరు మన బ్లాగులో ఫాలోవరుగా అవ్వండి. తదుపరి మీరు చేయాలనుకునే కామెంటును సహేతుకంగా అందరికి అర్ధమయ్యే రీతిలో వ్రాయండి. క్రింద మీ పూర్తీ పేరు, అడ్రస్సు, ఫోను నెంబరు వ్రాయటం మాత్రం మరువకండి. అసంపూర్తి వివరాలు లేక మీ వివరాలు తెలుపకుండా కామెంట్లు చేస్తే అవ్వి ప్రచురించబడవు.  గమంచగలరు. 

సాధన -2

 సాధన -2

కారు, డ్రైవరు 

సాధకునికి ఆత్మానాత్మ విచక్షణ సులభంగా అర్ధం కావటానికి  కఠోపనిషత్లో క్రింది మంత్రం ద్వారా తెలియచేస్తున్నది.  

రథరూప కల్పన ఆత్మానం రథినం విద్ధి శరీరం రథమేవ తు | బుద్ధిం తు సారథిం విద్ధి మనః ప్రగ్రహమేవ చ |3|

= ఆత్మానం = ఆత్మను; రథనం = రథస్వామి అని; విద్ధి = తెలుసుకో శరీరం = శరీరాన్ని; రథం ఏవ తు = రథమే అని (తెలుసుకో); బుద్ధిం తు= బుద్ధిని; సారథిం = సారథి అని; విద్ధి = తెలుసుకో; మనః = మనస్సు: ప్రగ్రహం ఏవ చ = పగ్గమే అని కూడా (తెలుసుకో); = = (తా|| ఈ ఆత్మను రథస్వామి అని తెలుసుకో. శరీరాన్నే రథమని తెలుసుకో. బుద్ధిని సారథి అని తెలుసుకో. మనసేమో పగ్గమే అని తెలుసుకో.)

దీనిని ప్రస్తుత కాలానికి అనుగుణంగా సాధకుల సౌలబ్యానికి ఇలా అర్ధన్ని చెప్పుకుందాం. 

ఇక్కడ కారు-కారు డ్రైవరు పోలికతో మనకు ఉపనిషత్తు సాధకునికి తన ఆత్మకు, శరీరానికి వున్న అనుబంధాన్ని తెలియ చేయుచున్నది. ఆత్మను కారు యజమాని గాను, శరీరాన్ని, కారు గాను, బుద్ధిని కారు డ్రైవరుగాను ఇక మనస్సు కారుకు ఉన్నటువంటి స్టీరింగ్, కాగా  బ్రేకు, క్లచ్, యాక్సిలరేటర్లు ఇంద్రియాలుగా పోల్చుతున్నది. కారు యజమాని సురక్షితంగా ప్రయాణం చేయాలంటే కారు డ్రైవరు అలాగే స్టీరింగ్ తదితర అన్ని హంగులు సక్రమంగా పనిచేయాలి. అప్పుడే గమ్యానికి క్షేమంగా చేరగలడు. ప్రయాణం సాఫీగా జరగాలంటే ముందుగా కారు పూర్తి కండిషనులో ఉండాలి అంటే సాధకుని శరీరము పూర్తిగా ఆరోగ్యవంతంగా ఉండాలి. ఏరకంగా కారు డ్రైవరు రోజు కారు పరిస్థితిని గమనించి లోటుపాట్లు అంటే పెట్రోలు, ఆయిల్ మొదలైనవి సరిగా ఉన్నాయో లేదా అని చూసుకుంటాడో అట్లాగనే సాధకుడు తన బుద్దిని వుపయోగించి శరీరానికి కావలసిన ఆహార, పానీయ దుస్తులు మొదలైనవి బాధ్యతగా సమకూర్చి శరీరం రోగగ్రస్తం కాకుండా, అలసత్వం చెందకుండా ఎప్పుడు చెతన్యవంతంగా వుండే విధంగా చూసుకోవాలి.  కానీ శరీరం మీద మొహాన్ని మాత్రం పెంచుకోకూడదు.  శరీరం కేవలం ఆత్మను పరమాత్మ వద్దకు (మోక్షాన్ని) తీసుకొని వెళ్లే ఉపకరణంగా మాత్రమే చూడాలి అంతేకాని సమాజంలో శరీరానికి ఆపాదించే మానవమానాలు తనవిగా  భావించరాదు. వాటిని పరిగణలోకి తీసుకోరాదు. అప్పుడే సాధకుడు సాధనలో ముందుకు వెళ్లగలడు. 

సాధకుని ద్రుష్టి సదా మోక్షం మీద మాత్రమే ఉండాలి,  భౌతికమైన విషయాలను తాత్కాలికమైనవిగాను తాను వాటికి ఎంతవరకు సంబందం కలిగి ఉండాలో అంతవరకుమాత్రమే సంబంధం ఉంచుకోవాలి. కేవలం తామరాకు మీద నీటి బిందువు లాగ మాత్రమే ఈ సమాజంలో తాను ఉండాలి.  ఇవ్వన్నీ సాధ్యమేనా అనే ప్రశ్న  ఉదయిస్తుంది. నిజానికి అన్ని సాధ్యమే కేవలం మనస్సుని స్వాధీన పరచుకోవాలి.

ఓం తత్సత్. 

ఓం శాంతి శాంతి శాంతిః. 



25, డిసెంబర్ 2021, శనివారం

సాధన -1

సాధన -1  

విమానంలో కిటికీ ప్రక్కన కూర్చున్న ప్రయాణకునికి విమానము కదలటం మొదలుకాగానే భూమి మీద వస్తువులు వెనుకకు వెళుతున్నట్లు కనపడి విమానం గాలిలో ఎగరటం మొదలు కాగానే అవి మొదట చిన్నగా తరువాత సుష్మముగ కనపడి తరువాత కనపడకుండా పోతాయి. కేవలం ఆకాశంలో మేఘాలు మాత్రమే కనపడుతుంటాయి. అంటే దీని అర్ధం విమానం క్రింద భూమి, భూమిమీది వస్తువులు లేకుండా పోయాయని కాదు.  కేవలం ప్రయాణికుడు అవి చూడలేని అంత ఎత్తుకు వెళ్లాడని మాత్రమే.  ఆ ఎత్తులో మేఘాలు ఉంటాయి కాబట్టి వాటిని మాత్రం స్పష్టంగా చూడగలడు. 

సంసారబంధనాలలో కొట్టు మిట్టాడుకునే మానవుడు ఎప్పుడైతే జిజ్ఞాసకుడిగా అయ్యి సాధన మొదలు పెడతాడో అప్పుడు తన సాధన క్రమంలో మొదట్లో బౌతికంగా వున్న భావ బంధాలు అంటే భార్య పిల్లలు, నా వారనే బంధాలు కొంత చిన్నవిగా కనపడతాయి అదే సాధనలో పరిపక్వత చెందుతున్న కొద్దీ ఆ బంధాలు సుష్మముగా తరువాత లేనట్లుగా గోచరిస్తూ కేవలం అద్వితీయమైన, అనంతమైన, శాశ్వితమైన, నిత్యమైన భగవంతునితో మాత్రమే అనుసందానం కలిగి ఉంటాడు. 

సంసార జీవనం గడిపే మనకు సాధన సాగదు, మనకు ఒక మంచి గురువు తనంతట తానె వెతుక్కుంటూ వస్తాడు, ఫలానా ప్రవచనాకారుడు చెప్పాడు విగ్రహారాధన ఒక్కటే మార్గం కేవలం సన్యాసం తీసుకున్న వారు మాత్రమే వారికి ఎలాంటి భాద్యతలు వుండవు కాబట్టి పూర్తిగా ఆధ్యాత్మిక జీవనం గడప  గలరు. ఈ జన్మకు నేను చేసే పూజలే  చాలు. కలియుగంలో నామ స్మరణే చాలు మోక్షానికి అని ఇలా పలుతెరుగుల వాదనలు, సమర్ధింపులు చేసుకునే వారిని పెక్కు మందిని మనకి తారస పడతారు.  కానీ నిజమైన సాధకుడు ఆ మాటలను ఏమాత్రం గణించక తన ఆధ్యాత్మిక జీవనం కోన సాగిస్తాడు. 

ఇలా వ్యర్ధ ప్రసంగాలను చేసి కాలాన్ని వృధా చేసుకునే వారిని ఆది శంకరాచార్యుల వారు " కాకికి దంతాలు వున్నాయి, దంతాలు లేవని వాదన చేసే (మూర్ఖులు ) గా అభివర్ణించారు.  

సాధకులారా ఇంకా కాలయాపన చేయకండి ఇప్పుడే మీ ఆధ్యాత్మిక జీవనానికి నంది పలకండి.  ఈ జన్మలోనే నేను మోక్షాన్ని పొందుతాను అని దృఢ సంకల్పులు కాండి. 

ఓం తత్సత్. 

ఓం శాంతి శాంతి శాంతిః. 

23, డిసెంబర్ 2021, గురువారం

పాపం-పుణ్యం

 పాపం-పుణ్యం 

(ఈ వ్యాసం వ్రాయటానికి ముందు నేను ఒకింత సందేహించాను ఎందుకంటె ఇంత చిన్న విషయాలు మాకు తెలియవా అని మనలో చాలామంది అనుకోవచ్చు.  కానీ ఇది కేవలం తెలియని వారిని దృష్టిలో ఉంచుకొని వ్రాసిందని గమనించగలరు)

మనం తరచుగా పాపం-పుణ్యం అనే ద్వంద పదాలను వింటుంటాము, అంటూవుంటాము. కానీ ఇదమిద్దంగా పాపం అంటే ఏమిటి, పుణ్యం అంటే ఏమిటి అంటే చాలామంది చెప్పలేని స్థితిలో వుంటారు.  కానీ ఒక్కటి మాత్రం ప్రతి వక్కరు చెప్పగలరు అదెమంతి పాపం అనేది చెడుకు సంబంధించింది, పుణ్యం అనేది మంచికి సంబంధించింది కాబట్టి మనం పుణ్యం చేయాలి అని మాత్రం అంటారు. ఎవరైనా ఏదయినా కానీ పని చేస్తే పోన్లే వాడి పాపాన వాడే పోతాడు అని మనం అనటం కూడా కద్దు. అంటే మనం ఏమిచేయనవసరం లేదు వాడి పాప ఫలితాన్ని వాడే పొందుతాడు అని కాబోలు ఆలా వాడుకలోకి వచ్చింది.  ఏది యెమీయేన ఒక్కటి మాత్రం నిజం పాపం కానీ లేక పుణ్యం కానీ మనం చేసే పనులకు ప్రతిగా వచ్చే ఫలితం అంటే మన కర్మలకు లభించే ఫలితం. అంటే పాప పుణ్యాలకు కారణం కర్మలు అంటే కొన్ని కర్మలు చేస్తే పాపం వస్తుంది అదే విధంగా కొన్ని కర్మలు చేస్తే పుణ్యం వస్తుంది. 

ఒక చిన్న ఉదాహరణ చూద్దాం 

1) తల్లి తండ్రులను గౌరవించాలి 

2) తల్లి తండ్రులను హింసించాలి. 

ఇందులో మొదటి కర్మ చేస్తే పుణ్యం వస్తుందని రెండవ కర్మ చేస్తే పాపం వస్తుందని అందరము ముక్త కంట్టంగా చెపుతాము. కానీ ఎందుకు అంటే మాత్రం చెప్పలేము. 

మనం చేసే కర్మలు రెండు రకములు 1) విహిత కర్మలు 2) నిషిద్ధ కర్మలు అంటే మొదటిది చేయవలసిన పనులు లేక చెప్పిన పనులు రెండవది చేయకూడదని చెప్పిన పనులు అని స్థూలంగా అర్ధం. ఇంకా వివరంగా పరిశీలిస్తే విహిత కర్మలు అంటే వేదవిదిత కర్మలు అనగా వేదంలో చేయమని చెప్పిన కర్మలు అదే విధంగా నిషిద్ధ కర్మలు అంటే వేదనిషిద్ద కర్మలు అనగా వెడలు చేయవద్దని చెప్పిన కర్మలు. 

వేదాలు అంటేనే కర్మ కాండ అనగా మానవులు ఎలాంటి కర్మలు చేయాలి, ఎలాంటి కర్మలు చేయకూడదు అని వివరించేవి వేదాలు 

మనం అక్కడక్కడ ఇది యాంటీ కాన్స్టిట్యూషన్ అని రాజకీయ నాయకులూ పలుకుతూ ఉండటం చూస్తాం అంటే కాన్స్టిట్యూషన్కి విరుద్ధం అని కదా అర్ధం, అదే మాదిరి నిషిద్ధ కర్మలు కూడా ఇప్పుడు కొంతవరకు మీకు అర్ధం అయ్యిందని నేను అనుకుంటాను. 

ఇదంతా చాలా గజిబిజిగా వున్నది ఒక్క మాటలో పాప పుణ్యాలు అంటే ఏమిటో చెప్పలేవా అని మీరు అడగ వచ్చు. ఆలా చెప్పాలంటే 

ధర్మాన్ని ఆచరించటం పుణ్యం 

ధర్మాన్ని ఆచరించక పోవటం మరియు ధర్మ విరుద్ధంగా ప్రవర్తించటం పాపం. 

ఇప్పుడు ధర్మం అంటే ఏమిటన్న ప్రశ్న ఉదయిస్తుంది. ధర్మం అంటే ప్రతివారు తానూ ఆచరించవలసిన విధానం. ఇది ఒక్కొక్క వ్యక్తికీ ఒక్కొక్క రీతిగా వుంటూ అందరికి ఒకేరీతిగా ఉంటుంది. 

అదెలా అంటే నీ తల్లిదండ్రులను చూసుకొనేది నీ ధర్మం నీవు నీ తల్లిదండ్రులను సరిగా చూసుకోలేదనుకో అప్పుడు నేను నీ తల్లిదండ్రులను చూసుకోవటం నా ధర్మం కాదు మరి అది ఏమిటి అంటే దానికి శ్రీ కృష్ణ భగవానులు దానిని పరధర్మం అని స్పష్టం చేసారు. భగవానులు ఎల్లప్పుడూ ప్రతి వారు తన ధర్మాన్నే ఆచరించాలని పరధర్మాన్ని ఆచరించకూడదని పేర్కొన్నారు. 

 శ్రీమద్భగవద్గీత / Bhagavad-Gita – 142 🌹
. తృతీయ అధ్యాయము – కర్మ యోగము  – 35 
35. శ్రేయాన్ స్వధర్మో విగుణ: పరధర్మాత్ స్వనుష్టితాత్ |
స్వధర్మే నిధనం శ్రేయ: పరధర్మో భయావహ: ||
🌷. తాత్పర్యం :
పరధర్మము చక్కగా నిర్వహించుట కన్నను గుణరహితమైనను స్వధర్మమును ఆచరించుట ఉత్తమము. పరధర్మపాలనము హానికరమైనది కావున దానిని పాటించుట కన్నను స్వధర్మపాలనము నందు నాశనము పొందుటయైనను ఉత్తమమైనదే!

ప్రతివారు వారి వారి ధర్మం ఏమిటో తెలుసుకొని దానిని మాత్రమే ఆచరించాలి. వారు ఆచరించాల్సిన ధర్మాన్ని విద్యుక్త ధర్మం అని అంటారు. 
ఒక పురుషునికి తన తల్లిదండ్రులను, తన భార్య పిల్లల యోగాక్ష్యేమాలు చూడాల్సిన ధర్మం ఉంటుంది. అదే విధంగా ఒక స్త్రీకి తన భర్త, అత్తా మామలు, పిల్లల యోగక్షేమాలు చూడాల్సిన ధర్మం ఉంటుంది. కాబట్టి, ధర్మం అనేది ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క రకంగా ఉంటుంది. అది తెలుసుకొని నడచుకోవటం తద్వారా పొందే ఫలమే పుణ్యం దానికి భిన్నంగా ప్రవర్తించటమే పాపం. 
ఓం శాంతి శాంతి శాంతిః 
బుధజన విధేయుడు 
భార్గవ శర్మ 






ఒక్క క్షణం.....

 🍁ఒక్క క్షణం.....🍁


ఒక ఊర్లో మంచి పేరు ప్రతిష్టలు కలిగిన పండితుడు ఒకాయన ఉండేవాడు. చాలా చక్కని వాక్పటిమ గలవాడు. ఆయన ఆలయం ఆవరణలో కూర్చొని ప్రవచనం చెబుతూ వుంటే వేలమంది జనం అలా కదలకుండా బొమ్మల్లా వింటూ ఉండిపోయేవాళ్ళు. ఆయన ప్రఖ్యాతి చుట్టుపక్కల చాలా గ్రామాల్లో వ్యాపించింది.


ఒకసారి ఆయన ప్రవచనం నిమిత్తం పొరుగూరు వెళ్ళవలసి వచ్చింది. ఆ ఊరు వెళ్ళే బస్సు ఎక్కి టికెట్ తీసుకున్నాడు. అయితే పొరపాటున బస్సు కండక్టర్ పది రూపాయలు ఎక్కువ ఇచ్చాడు. పండితుడు అది గమనించి తిరిగి ఇవ్వాలని యోచించాడు. కానీ బస్సు నిండా జనం కిక్కిరిసి ఉండటంతో, దిగేటప్పుడు ఇద్దాంలే అనుకుని కూర్చున్నాడు. 


కొద్ది సేపు తరువాత అతని మనసులొ ఆలోచనలు మారాయి. 'ఆ కండక్టరు కూడా ఎంతమంది దగ్గర చిల్లర కొట్టేయడం లేదు.. ఈ బస్సు కూడా ఒక సంస్థదే కదా.. ఎంత మంది తినటంలేదు.. నా పది రూపాయలకే నష్టపోతుందా ఏమిటి.. ఈ పది రూపాయలు ఏదైనా దైవ కార్యనికి ఉపయోగిస్తా...' అని అనుకుని మౌనంగా కూర్చున్నాడు.

 

అంతలో వూరు వచ్చింది... బస్సు ఆగింది... కానీ ఆయన దిగేటప్పుడు బస్సు కండక్టర్ దగ్గరికి రాగానే తన ప్రమేయం ఏమాత్రం లేకుండా అసంకల్పితంగా కండక్టరుకు ఇవ్వవలిసిన పది రూపాయలు ఇచ్చి... "మీరు నాకు టికెట్ ఇచ్చేటప్పుడు ఈ పది రూపాయలు ఎక్కువగా ఇచ్చారు" అన్నాడు. 


దానికి ఆ కండక్టర్ "అయ్యా..! నేను మీ ప్రవచనాలు ఎంతో శ్రద్ధగా వింటాను. మీరు చెప్పడంతోటే సరిపెట్టుకుంటారా లేక పాటిస్తారా అని చిన్న పరీక్ష చేశాను" అని అన్నాడు. 


పండితుడు చల్లటి చిరు చెమటలతో బస్సు దిగి.. 'పది రూపాయల కోసం తుచ్ఛమైన ఆశతో నా విలువలకే తిలోదకాలు ఇవ్వబోయాను... నా అదృష్టం బాగుంది. నా మనస్సాక్షి సరైన సమయంలో సరియైన నిర్ణయం తీసుకొని నా విలువలను కాపాడింది' అనుకున్నాడు.


జీవిత కాలం పాటు సంపాదించుకున్న మంచితనం కూడా సర్వనాశనం కావడానికి క్షణం చాలు🍁

19, డిసెంబర్ 2021, ఆదివారం

దోసావకాయోత్పత్తి

 👉సరదాగా కాసేపు అంతే


*దోసావకాయోత్పత్తి వృత్తాంతము::*

పూర్వం 1822 వ సంవత్సరంలో, దెందులూరు గ్రామమునందు దర్భా ధనుంజయ చైనులు గారు అనెడి ఒక వేదపండితుడు వేదములతో పాటు, సాంప్రదాయ సద్వంటలను కూడా క్షుణ్ణముగా అభ్యసించినాడు!


ఆయన ఒక సాయంత్రము రాత్రి భోజనమునకు దోసకాయ పప్పు చేయవలెనని, ఒక పుల్లని, గట్టి దోసకాయను ముక్కలు గా చేసి ఒక తప్పాలా యందు వేసికొనినాడు! అటు పిమ్మట ఆయన కించిత్తు వేదపఠనమునందు నిమగ్నుడయినాడు! ఇంతలో ఆయన గారి సతీ మణి, దర్భా దాక్షాయనీ దేవమ్మ, ఆ ఉదయము కొత్త ఆవకాయ పెట్టుటకు వాడిన ఆవపిండి కాస్త ఒక పళ్ళెమునందు మిగిలియుండుట చేత, ఆ ఆవపిండి పళ్ళెమును ఆ దోసకాయ ముక్కల తప్పాలాయందు, దృష్టి లోపమువలన చూచుకొనక పడవైచినది! అటు పిమ్మట ఆమె ఇంకనూ రెండు దినములలో గల లక్ష వత్తుల నోముకు వత్తులు చేసికొనుటకు ఉపక్రమించినది!


అంతలో, వేదపఠనము ముగించుకొని, ఇక ఇంగువ తిరగమాత దోసకాయ పప్పు చేయుదమని వచ్చిన చయనులు గారు, ఆ దోసముక్కల మీద పడియున్న ఆవపిండిని చూచి, 'అకటా, ఇక ఈ రాత్రికి దోసకాయ పప్పు దుర్లభము కదా! ఏమి శాయవలె?' అని ఆలోచించి, 'సరియే, ఈ ఆవపిండి తో కలసిపోయిన దోస ముక్కలను ఎటులయిననూ సద్వినియోగము చేయుదు గాక ' అనుకొనుచూ, పాక దేవీ మాత పైనుండి దీవించుచుండగా, ఆ దోసముక్కలూ, ఆవపిండీ గల తప్పాలమునందు, కాస్త మచిలీపట్నపు రాళ్ళ ఉప్పూ, నారాకోడూరు ఎర్ర కారమూ కలిపి, ఆ పైనుండి ధారగా గానుగ నువ్వుల నూనె పోసినాడు! ఆ మిశ్రమమును ఒక బృహద్గరిటె తో బాగుగా కలియ బెట్టినాడు! 'ఇది ఏదియో చూచుటకు మాత్రము బహు ముచ్చటగానున్నదే' అనుకొనినాడు!


ఒక గంట పిమ్మట, ఆ దంపతులు ఇరువురూ, రాత్రి భోజనమున వేడి వేడి దంపుడు బియ్యపన్నము నందు ముద్దపప్పు కలిపి, అవనిగడ్డ ఆవునెయ్యి ధారాళముగా వేసికొని, ఆ ముద్దపప్పన్నము తో పాటు, ఈ తప్పాలమునందలి వింత పదార్ధమును నంచుకొనుచుండగా, వారికి ఆ ఘాటుకు నుదుటినుండి స్వేదము చిందుచూ, అనిర్వచనీయమగు అనుభూతీ, ఆనందమూ లభ్యమైనవి!


ఆ రాత్రి భోజనానంతరము , దర్భా ధనుంజయ చైనులు గారు, ఆ ఎర్రని, ఘాటగు వింత పదార్ధమునకు 'దోస ఆవకాయము ' అని నామకరణమొనర్చినాడు!


ఇతి దోసావకాయోత్పత్తి వృత్తాంతః


ఈ దోసావకాయ గురించి పాకపంచశతి మూడవ అధ్యాయం అయిన "ఉత్తర పీఠిక "లో ఫలశృతి చెప్పబడింది. అందులో జఠమహర్షి, ఉదరానందునకు చెప్పిన కొన్ని విషయాలు:


ఈ దోసావకాయ అపమృత్యువులను, అకాలమృత్యువులను కూడా పోగొట్టును. రోగాలను నివాఱించి దీర్ఘాయుర్దాయాన్ని ప్రసాదించును. దీనిని శ్రద్ధాసక్తులతో విధివిధానుసారం భుజించాలి. అన్ని రోగాలను హరించడానికి గట్టిగా ఉన్న ఒక్క ముక్క చాలును. ఆసక్తి గలవారు నిత్యం గాని, పుణ్యదినములయందుగాని ఈ దోసావకాయను తప్పక భుజించాలి. ఊరగాయలు, పచ్చళ్ళలో దోసావకాయ అసమానమైనది. జిహ్వసక్తి లేనివారికి దీనిని వడ్డించరాదు.


నిత్యకృత్యమునందు, పర్వదినములందు ఎవరీ దోసావకాయను యథాశక్తి విధిగా భుజిస్తారో, వారికి ధన్వాంతరీ అనుగ్రహముచే దీర్ఘాయువు, రథగజతురంగములతో సదా సుప్రసన్నమైన స్థిరసంపదలు సిద్ధించును...





పద్యం*

 *చదివే సమయంలో పెదవి మాత్రమే తగిలే పద్యం*


భూమీ భామాంబు భవా

వామాపా వైభవ భువి భావావాపా

వేమమ్మోముము భూభవ

భీమ భవాభావ భావ విభువామావిభా


*చదివే సమయంలో పెదవులు తగలనిది*


శ్రీశా సతత యశః కవి

తాశా ధాత్రీశ ఖండితాశా నిస్సం

కాశా నిరతారాధిత

కీశేశా హృష్ణ గగనకేశా యీశా


*ఒక అక్షరం పెదవికి తగలనిది తరువాతి అక్షరం తగిలేది*

*అంటే పెదవి తగలనిది, తగిలేది*


దేవా శ్రీమాధవ శివ

దా వేగాభిజ్ఞ మురభిదా మాధామా

జ్యావగ వంద్యా వాసవ

సేవితపద పగవిరామ శివ జపనామా


*కేవలం నాలుక కదిలేది*


సారసనేత్రా శ్రీధర

రారా నన్నేల నిందు రాక్షసనాశా

నారద సన్నుత చరణా

సారతరానందచిత్త సజ్జనరక్షా     


                                                                                                                                   

*నాలుక కదలని (తగలని) పద్యాలు*


కాయముగేహము వమ్మగు

మాయకు మోహింపబోకు మక్కువగ మహో

పాయం బూహింపుము వే

బాయగ పాపంబు మంకుభావమవేగా

భోగిపభుగ్వాహ మహా

భాగా విభవైకభోగ బావుకభావా

మేఘోపమాంగభూపా

బాగుగమముగావువేగ బాపాభావా


*నాలుక కదిలీ కదలని పద్యం*


ఓ తాపస పరిపాలా

పాతక సంహారా వీర భాసాహేశా

భూతపతిమిత్ర హరి ముర

ఘాతా కాలాంబుదవిధ గాత్రవరాహ్వా 


🙏ఈ పద్యాలు రచించిన మహా కవులకు తెలుగు జాతి ఋణపడి వుంటుంది. . 


🙏 *పద్య భాషాభిమానులకు జోహార్లు*.


🙏 

*అందుకే అన్నారు దేశభాషలందు తెలుగు లెస్స అని *

పిండిమ‌ర‌" కష్టాలు* 🤔

 🌹🌹🌹🌹🌷🌷🌹🌹🌹🌹

🤔 *చిన్న‌త‌నంలో "పిండిమ‌ర‌" కష్టాలు* 🤔


చిన్న‌త‌నంలో ఎంత‌ క‌ష్ట‌మైనా రావచ్చుగాని పిండి మ‌ర‌కెళ్ళాల్సిన క‌ష్టం మాత్రం ఎవ్వ‌రికీ రాకూడ‌దు.🤫

అంతా చ‌దివి... మీరే అవునో, కాదో చెప్పండి...🤔


నా బాల్యం అంతా చిన్న టౌన్ లో గ‌డిచింది.. 

అప్ప‌ట్లో *అన్న‌పూర్ణా* ఆటాలు, *ఆశీర్వాద్* ఆటా ఆశీర్వాదాలు మాకు దొర‌క‌ని క‌ష్ట‌కాల‌మాయే..


అంద‌రూ గోధుమ‌లు, ధాన్యం, ప‌ప్పులు మ‌ర ఆడించుకోవ‌ల్సిందే..


ఈ ప‌నికోసం అమ్మ‌లు, అమ్మ‌మ్మ‌లు మ‌మ్ముల్ని బాల కార్మికులుగా వినియోగించుకుని పిండిమ‌ర‌కుతోలేవాళ్ళు..

మాకు ఇప్ప‌టిపిల్ల‌లంత అవేర్‌నెస్ క‌పోవ‌డంతో..

కార్మిక శాఖ‌కు కంప్లైట్ చేయాల‌ని తెలియ‌దు..

మేము అలా పిండిమ‌ర దారిప‌ట్ట‌డానికి రాష్ట్ర ప్ర‌భుత్వ రాయితీ జ‌ల్లులా మ‌ర‌కు పోయి వ‌స్తే పావలానో..

ప‌దిపైస‌లో ఆక‌ర్ష్ ప‌థ‌కానికి ఆశ ప‌డి..

ఈ సాహ‌సానికి సిద్ద‌ప‌డితే మేము ప‌డ్డ క‌ష్టాలు ప‌గవాడికి కూడా వ‌ద్దు...


గోధుమ‌లో మ‌రొక‌టో నాలుగుమూడు కిలోలు క్యాన్‌లో పోసి ఆడించుకు ర‌మ్మ‌ని చెపుతూ.. 

అమ్మ‌లు మ‌ర‌వాడికి ఒక కేజీ త‌క్కువ చేసి చెప్ప‌మ‌ని చెప్పి పంపేవారు... 


మ‌ర‌కు పోయి.. అబ‌ద్దం చెప్ప‌డానికి పూర్తిగా సాహ‌సించ‌లేక పిండిమ‌ర చ‌క్రాలు క‌ర్‌క‌ర్ మ‌ని చేసే సౌండ్‌లో..

అశ్వ‌ద్దామ హ‌తఃకుంజ‌రః అన్న‌ట్లుగా మూడు కేజీల‌ని రెండ‌నో, నాలుగును మూడ‌నో అనేసేవాళ్ళం...


పిండిమ‌ర వాళ్ళు పొద్దున్నుంచి నాలాంటి వాళ్ళ‌ను ఎంతో మందిని చూసుంటారు కదా..

బాల‌య్య బాబులా* కంటి చూపుతో స‌రుకు తూకం క‌నిపెట్టేసి క‌రెక్ట్ గా వ‌సూలు చేసేవాళ్ళు...


ఇంట్లో మ‌ర‌కు పంపేముందు క‌ణ్వ‌మ‌హ‌ర్షి శ‌కుంత‌ల‌కు చేసే అప్ప‌గింత‌ల కంటె ఎక్కువే..

మాకూ బోధ జ‌రిగేది...


*”పిండి ఆడించేప్పుడు దిక్కులు చూడ‌కు, పిండికాజేస్తారు జాగ్ర‌త్త”* అని, బరకగా ప‌ట్టించ‌మ‌నో, మెత్త‌గా ప‌ట్టించ‌మ‌నో, ప‌సుపు త‌రువాత ఆడించ‌వ‌ద్ద‌నో, కారం త‌రువాత ఆడించ‌వ‌ద్ద‌నో..

ఆంక్ష‌లు చెప్పి పంపేవారు...


ఇన్ని జాగ్ర‌త్త‌లు చెప్పారు క‌దా అని మేము పిండిమ‌రలో అడుగు పెట్టిన ద‌గ్గ‌ర‌నుండి..

ముఖ్య‌మంత్రి గారి సెక్యూరిటీ వింగ్ వాళ్ళు డేగ క‌న్నుతో చూస్తున్న‌ట్లు చూస్తూ ఉండే వాళ్ళం... 


దీనికితోడు ప్ర‌తి పిండి మ‌ర‌లో ఒక స‌న్న గొట్టం.. 

దొంగ చాటుగా అందులోనుండి కొంత పిండి మ‌ర‌వాళ్ళు కాజేస్తార‌న్న బ‌ల‌మైన‌ రూమరు ప్రచారం లో ఉండేది...


పిండిమ‌ర‌కు చేరుకుని హై ఎల‌ర్ట్ లో వెయిటింగ్‌లో ఉంటే..

ఈ లోపు మ‌ర‌వాళ్ళు మేము పిల్ల‌లం గ‌నుక..

పెద్ద‌ల్ని, నోరుగ‌ల‌వాళ్ళ‌ని ప్ర‌యార్టీలో పెట్టేసేవారు..

ఆ రోజుల్లో క‌రెంట్ ఉన్న స‌మ‌యం కంటే..

క‌రెంట్ క‌ట్ స‌మ‌య‌మే ఎక్కువ కావ‌డంతో..

వెయిటింగ్ త‌ప్పేది కాదు...


ఈ వినోదాన్ని గ‌మ‌నిస్తూ కొంతసేపు వేచి ఉండేసరికి మ‌ర‌లో లేచిన పిండంతా.. 

త‌ల‌మీద ప‌డి మాకు బాల‌వృద్దుల గెట‌ప్ వ‌చ్చేసేది... 


కాసేప‌టికి ఆ గోల‌లోనే ఆప‌రేట‌ర్ మా చేతిలో క్యాన్ గుంజుకుని..

స్పెసిఫికేష‌న్స్ చెప్పేలోపే పైనున్న బ‌కెట్ లో పోసేసి..

పిండి వ‌చ్చే గొట్టానికి వేలాడుతున్న టార్ప‌లిన్ గుడ్డ‌ను మ‌డిచి..

గొట్టం మీద‌కు తోసి.. 

క‌ర్ క‌ర్ మ‌ని విష్టుమూర్తిలా రెండు చ‌క్రాలు తిప్పేవాడు...


పైన బ‌కెట్‌లో వేసిన గోధుమ‌లు గ్రైండ‌ర్‌లో న‌లిగి క్రింద ఉన్న టిన్‌లో ప‌డ‌టానికి రెండు,మూడు, నిముషాలు ప‌ట్టేది..

పిండి నలిగి కింద‌కు ప‌డే టైమ్ కు మ‌డ‌చి ఉంచిన టార్పాలిన్ గొట్టాన్ని క్రింద ఉన్న డ‌బ్బాలోకి సెట్ చేసేవాడు...


ఈ నాలుగైదు నిముషాల్లో పైన వేసినదంతా పిండిగా వ‌స్తుందో లేదో అన్న టెన్ష‌న్‌తో మా న‌రాలు చిట్లుతుండేవి... 

(ఇంట్లో పెట్టిన అప్ప‌గింత‌లు భ‌యాలు సామాన్యమైనవా!) 

మ‌న‌పిండి ఆడుతున్నంత సేపూ ఏ చ‌క్రం తిప్పినా ఎటువెళ్ళినా మ‌న పిండి పోతోంద‌న్న అనుమానంతో మాకు మ‌న‌శ్శాంతి ఉండేదికాదు...


కాసేప‌టికి డ‌బ్బాలో ప‌డ్డ‌పిండిని మ‌న క్యాన్‌లో వొంపి పొమ్మ‌నేవాడు..

మ‌న క‌ళ్ళ‌న్నీ వింబుల్డ‌న్ ఫైన‌ల్ మ్యాచ్‌లో బాల్ వైపే తిరుగుతున్న‌ట్లు ఆప‌రేట‌ర్ చుట్టూ తిరుగుతూ ఉండేవి...


ఈ అడ్వెంచ‌ర్ ముగించుకుని త‌ల, వొళ్ళు దులుపుకుని క్యాన్ భుజానికో, సైకిల్‌కో త‌గిలించుకుని..

మ‌న‌కు ఇవ్వ‌బోయే పావాలాకు బ‌డ్జెట్ ప్లానింగ్ డ్రీమ్స్ వేసుకుంటూ..

ఇల్లు చేరేవాళ్ళం... 


ఇంటికి రాగానే క్యాన్ లో వ‌చ్చిన పిండిని తూనిక‌లు కొల‌త‌ల శాఖ‌ల వ‌లె హోమ్ శాఖ‌వారు కొలిచేవారు...


 ఇహ‌మొద‌లు ”ఎటు దిక్కులు చూశావ్‌! 

 మోసం చేసి పిండి కాజేశాడు..

మేము ఎన్ని చెప్పిపంపితే ఏం ప్ర‌యోజ‌నం, అర‌కేజి త‌క్కువొచ్చింది...


మెత్త‌గా ప‌ట్ట‌మంటే బ‌ర‌గ్గా ప‌ట్టాడు. నీకు ఇన్నేళ్ళొచ్చాయి. ఒక్క ప‌నీ వివ‌రంగా చేసుకురాలేవు” అంటూ..

 కేంద్ర్రప్ర‌భుత్వం జి.ఎస్‌.టీ కాంపెన్సేష‌న్ ఎగొట్టిన‌ట్లో, త‌గ్గించిన‌ట్లో వారి ద‌యాదాక్షిణ్యాల‌తో కొంత‌ కోత విధించి ప‌దిపైస‌లే ఇవ్వ‌డ‌మో..

మ‌రీమూడ్ బాగాలేక పోతే మొత్తానికే మొండి చెయ్యి చూపేవారు... 


ఇలాంటి చేదు అనుభ‌వ‌మైన త‌రువాత మ‌ళ్ళీ మ‌ర‌కు పోకూడ‌దు అనుకునే వాడిని..

కాని ప్ర‌తీసారీ కొత్త రాయితీల‌తో న‌మ్మ‌బ‌లికి పంపేవారు...

క్లైమాక్స్ మాత్రం ఒక్క‌టే, ‘పిండి త‌క్కువ వచ్చింది మోసం జ‌రిగిపోయింది. మీ వ‌ల్ల ఏమీ కాదు’...


ఆ రోజుల్లో పిండిమ‌ర స్వానుభ‌వం అయిన సాటి కామ్రేడ్స్ అంద‌రికీ ఒక్క విష‌యం అర్థ‌మై ఉంటుంది...


యూనివ‌ర్సిటీ వీ.సీ.గా ప‌నిచేసి విద్యార్థుల‌తో తిట్టించుకోకుండా ఉండొచ్చేమో..

ఎమ్మేల్యేగా నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌లంద‌రితో మంచి అనిపించుకోవ‌చ్చేమో కానీ..


పిండిమ‌ర‌కెళ్ళొచ్చి మంచి ప‌నిమంతుడ‌నిపించుకోవ‌డం మాత్రం దుర్ల‌భం...

🤔😄

18, డిసెంబర్ 2021, శనివారం

 పదాల పరమార్థాలు పెరుమాళ్లకెరుక...

 

     ‘‘మీ అక్షరాలు ముత్యాలు మాస్టారూ’’ అన్నాడో శిష్యుడు గురువుగారిని కాకాపట్టడానికి. ‘‘నా నీళ్లు ముత్యాలా? ఇదెక్కడి దిక్కుమాలిన పోలికరా శుంఠ...!’’ అంటూ వెంటనే వాతపెట్టారు ఆ మాస్టారు. చేతిరాత గురించి చెబుతుంటే గురువుగారు నీళ్లంటున్నారేంటని కుర్రాడు తెల్లముఖమేశాడు. మాస్టారి మాటల్లోని మర్మమేంటో పాపం అతనికి ‘అర్థం’ కాలేదు. 

‘అక్షరం’ అంటే సాధారణంగా అకారాది వరుసలోని వర్ణమే అనుకుంటాం. నిజానికి ‘పరబ్రహ్మ, ఆకాశం, కాలమానం, ఓంకారం, నీరు, ప్రకృతి, తపస్సు, యజ్ఞం’... ఇన్ని అర్థాలు ఉన్నాయి ఆ పదానికి. క్షరం (నాశనం) లేనిది ఏదైనా అక్షరమే. ఆ విషయాన్ని మరచిపోయి దాన్ని వర్ణానికి పరిమితం చేసేశాం. 

      పలుకుబడి, అవసరం, ప్రాధాన్యాలను బట్టి కొన్ని పదాల వాడుక ఎక్కువగా ఉంటుంది. ప్రజల అవగాహన, పదప్రయోగ అవసరం, భావ స్పష్టత, ప్రాచుర్యాన్ని బట్టి ఆ పదాల వినిమయం జరుగుతుంటుంది. వినియోగించకపోతే ఎంత గొప్ప వస్తువైనా మూలన పడిపోతుంది. పదాల పరిస్థితీ అంతే. ఏదో సందర్భంలో, ఏదో అవసరార్థం ఏర్పడ్డ పదం... దాని అవసరం తీరిపోయాక మరుగున పడుతుంది. అలాంటి స్థితిలో ఆ స్థానాన్ని మరొక అర్థం ఆక్రమిస్తుంది. అలా ఆక్రమించిన భావాలు కొన్ని సందర్భాల్లో స్థిరపడిపోతాయి. అలా స్థిరపడటాన్ని భాషలో ‘నిపాత’లు అంటారు. నిపతించడం అంటే పాతిపెట్టడం, స్థిరపరచడం. అంటే ఓ పదానికి వాడుకలో ఉన్న అర్థంతోపాటు ఇతర అర్థాలు ఇంకెన్ని ఉన్నా, వినియోగంలో లేకపోవడంతో మరుగున పడిపోతాయన్న మాట. ‘అక్షరం’ విషయంలోనూ అదే జరిగింది. అన్నట్టు, తెలుగులో ఇలాంటి పదాలు చాలా ఉన్నాయి. వాటిలో చాలా వరకూ సంస్కృతం నుంచి వచ్చినవే. 

      భద్రాచలం, పట్టిసాచలం, శేషాచలం... లాంటి పదాల్లో అచలమంటే ఏంటి? పర్వతం. అదొక్కటేనా దానికి అర్థం? దానికి ఇంకా ‘లోకం, వస్త్రపుటంచు, మేకు’ తదితర అర్థాలున్నాయి. అలాగే, చలనరహిత స్థితిలో ఉన్నది ఏదైనా అచలమే అవుతుంది. సరే, ‘ఉదధి’ దగ్గరికి వద్దాం. ‘మేఘం’ పర్యాయపదాల జాబితాలో ఇది ఉంటుందా? అబ్బే... ఎందుకుంటుందండీ, ‘ఉదధి’ అంటే సముద్రం కదా అంటారా! అదే పొరపాటు. కడలితో పాటు మేఘమూ ఉదధే. ఎందుకంటే... ఉదకాన్ని ధరించేది ఉదధి. మరి మేఘానికీ ఆ మురిపెం ఉంది కదా! 

భలే శిరోజాలు

‘మీ శిరోజాల సంరక్షణకు మా కొబ్బరి తైలాన్నే వాడండి’ అంటూ గతంలో ప్రకటనలు హోరెత్తేవి గుర్తుందా? వాటిని చూసిన పెద్దలు కొందరు... ‘వీళ్లేంటి పేలు పెంచుకోమని చెబుతున్నార’ని ముక్కున వేలేసుకునేవారట! విషయం ఏంటంటే... ‘శిరస్సులో పుట్టింది’ శిరోజం. అంటే, జట్టుతోపాటు పేను, చుండ్రు లాంటివి కూడా శిరోజాలే. కానీ, వ్యవహారంలో జుట్టు అనే అర్థమే స్థిరపడిపోయింది. ‘తైలం’ కూడా అంతే. తిలలు అంటే నువ్వులు. వీటి నుంచి తీసిన పదార్థమే ‘తైలం’. ‘నువ్వుల నూనె’ అని మాత్రమే దీనికి అర్థం. కానీ వేరుశనగ, ఆముదం, కొబ్బరి, ఆవ, అవిశ, విప్ప... తదితరాల నుంచి తీసే నూనెలనూ తైలాల కిందే జమకడుతున్నాం. మొత్తంగా తైలాన్ని నూనెకు పర్యాయపదం చేశాం. 

      ఉమ్మెత్త, సంపెంగ, నల్లచందనం, మోదుగ, బంగారం- వీటన్నింటి మధ్య ఓ సంబంధం ఉంది గుర్తుపట్టారా? ఏంటంటే... ‘కనకం’! ఈ పదానికి పైవన్నీ అర్థాలే. కానీ, మనం ఒక్క బంగారాన్నే వాడుతున్నాం. ‘రావణ కాష్ఠం’ అని మనకో జాతీయం ఉంది. ఆ లంకాధీశుడి చితి ఎప్పటికీ మండుతూనే ఉంటుందన్న నమ్మకంలోంచి ఇది పుట్టింది. అదలా ఉంచితే, అసలు ఈ కాష్ఠమంటే ఏంటి? కర్ర. దాంతో పాటు ‘పద్దెనిమిది రెప్పపాట్ల కాలం’ అని కూడా బ్రౌణ్య నిఘంటువు చెబుతోంది. కానీ, ఈ పదం ‘చితి’ అన్న అర్థంలోనే వాడుకలో ఉంది. పార్థివదేహాన్ని కట్టెలతోనే దహనం చేస్తారు కాబట్టీ, అదీకాక అశరీర సంస్కారాలన్నింటికి ఉపయోగించేవి కర్రలే కాబట్టి ఈ అర్థమొక్కటే జనం నోళ్లలో నానుతోంది. 

అదే పక్షి... అదే గాలి

ఖగమంటే పక్షి మాత్రమేనా? గ్రహం, బాణం, గాలి... ఇవేవీ ఖగాలు కావా? అవీ అవుతాయి. ఎందుకంటే... పద వ్యుత్పత్తి ప్రకారం ఆకాశంలో సంచారం చేసేది ఏదైనా ఖగమే. కానీ ఏం లాభం? మనం ‘పక్షి’తోనే సరిపెట్టుకుంటున్నాం. మరి ‘గోత్రం’ సంగతేంటి? వంశం పేరు, పేరు, గొడుగు, అడవి, బలం, వరిచేను కోసిన పొలం అనే అర్థాలున్నాయి. అయితే, అవి నిఘంటువులకే పరిమితమయ్యాయి. వాడుకలో మాత్రం గోత్రమంటే వంశం చిరునామానే! 

      తిరుమల వెంకన్న బంగారు చీరలు కట్టుకునేవాడట! నమ్మకపోతే అన్నమయ్యను అడగండి... ‘పసిడిచీరవాడు...’ అంటూ తన్మయత్వంతో పాడేస్తాడు. వాస్తవానికి ‘చీర’ అంటే వస్త్రం. పురుషులు ధరించేదైనా, స్త్రీలు ధరించేదైనా సరే. కానీ, ఇప్పుడది స్త్రీలకే సొంతమైంది. పాపం... ‘జలజం, పంకజం’ కూడా ఇలాంటివే. ‘జలమందు, బురదయుందు పుట్టేవి’ ఏవైనా జలజాలు, పంకజాలే! చేప, నత్తగుల్ల, జలగ, ముత్యం, పద్మం, కలువ లాంటివేవైనా కావచ్చు. అయితే, అదేం విచిత్రమో కానీ పై రెండు పదాలకీ ‘తామర/ పద్మం’ అనే అర్థాన్నే స్థిరం చేశారు. 

      పళ్లని ఆహారంగా స్వీకరించడమే ‘ఫలహారం’ కదా. పళ్లు కాకుండా ఇతర ఉపాహారాలు (అల్పాహారం) తీసుకున్నా ‘ఫలహారం చేశాం’ అంటున్నామెందుకు? అదే మరి నిపతించడమంటే! ఇక ‘శిల్పం’ అంటే ‘శిలతో తయారైంది’ అని అర్థం. అంటే ఒక ఆకృతి, లేదా బొమ్మ అని భావం. కాలక్రమేణా ఏ పదార్థంతో తయారు చేసిన బొమ్మలనైనా శిల్పాలు అనడం ఆనవాయితీ అయింది. మొత్తమ్మీద శిల్పం అంటే ‘బొమ్మ’ అనే అర్థం ఖాయమైంది. 

ఆదర్శాలూ... అవరోధాలూ...

కాలప్రవాహంలో కొన్ని పదాలకు ఏమాత్రం చుట్టరికం లేని అర్థాలు స్థిరపడిపోతాయి. ఆ పదం అసలు అర్థానికీ, వ్యవహారంలో ఉన్న అర్థానికి నక్కకూ నాకలోకానికి ఉన్నంత తేడా ఉన్నా మనం పట్టించుకోం. ఇలాంటి వాటికి ‘వివక్ష’ చక్కటి ఉదాహరణ. ‘వేరు చేసి చూడటం’ అనే అర్థంలో స్థిరపడింది కానీ, నిజానికి వివక్ష అంటే ‘మాట్లాడాలి అనే కోరిక’. ‘వక్తం ఇచ్ఛా వివక్షా’... ఇది వ్యుత్పత్తి. దీనికి, ‘మా మీద వివక్ష ప్రదర్శిస్తున్నారు’ అనే మన సాధారణ ప్రయోగానికి ఏమన్నా సంబంధముందా? చెప్పుకుంటూ వెళ్తే భాషలోని చిత్రాలు అన్నా ఇన్నా!! 

      ‘లక్ష్యసాధనలో అవరోధాలను అధిగమించడానికి పట్టుదల ముఖ్యం’ అంటూ పాఠాలు చెప్పేస్తాం కదా. దేనికి పట్టుదల కావాలి? అంతఃపురంలో అడుగుపెట్టడానికా? నిజానికి అవరోధ మంటే ‘అంతఃపురం’. ‘రాణివాసపు స్త్రీలు ఉన్నందున ఇతరుల ప్రవేశాన్ని నిషేధించిన ప్రదేశం’ అని అసలు అర్థం. కానీ, ఇది మనకు ‘అడ్డంకి’గానే తెలుసు! అలాగే, ‘ఆకాంక్ష’ను ‘కోరిక’ అనే అర్థంలో స్థిరపరిచేశారు. కానీ క్రియను బట్టి కర్త, కర్మలను తెలుసుకోవడం, విశేష్యాన్ని బట్టి విశేషణాన్ని తెలుసుకోవాలనే కోరిక కలిగి ఉండటం మాత్రమే ‘ఆకాంక్ష’ అవుతుంది. వ్యాకరణం చదివిన వారికి ఇది తెలిసిందే. 

      మనకు తెలిసినంత వరకూ ఆదర్శానికీ, అద్దానికీ ఏమైనా సంబంధం ఉందా? లేదు. నిజానికైతే ఉంది. ‘నీడ కనబడేందుకు ఉపయోగపడేది’ (అద్దం) అని ‘ఆదర్శం’ అసలు అర్థం. కానీ, ‘అనుసరించదగినది’ అనే అర్థంలోనే వ్యవహారంలోకి వచ్చేసింది. ఇక ‘ఆహుతి’ అంటే దేవతా ప్రీత్యర్థం అగ్నిహోత్రంలో హవిస్సును వేయడం. అలా వేసి సాదరంగా ఆహ్వానిస్తే దేవతలు వస్తారని నమ్మకం. అలా వచ్చేవారే ‘ఆహూతులు’! ఈ అర్థం పక్కకెళ్లి, ఏ సందర్భంలోనైనా ‘పిలిస్తే వచ్చేవారు’ అందరూ ఆహూతులవుతున్నారు ఇప్పుడు! దట్టమైన, భయంకరమైన అడవిని ‘కికారణ్యం’ అనడం రివాజు. ఈ పదం పంజాబీ భాషలోంచి వచ్చింది. ‘కికార్‌’ అంటే ‘నల్లతుమ్మ’ అని ఆ భాషలో అర్థం. ఆ చెట్లు అధికంగా ఉండే అరణ్యమే ‘కికారణ్యం’. అంటే నల్లతుమ్మ చెట్లున్న అడవి. ఈ విషయం తెలిసో తెలియకో మనం కాకులు దూరని కారడవులన్నింటినీ ‘కికారణ్యాలు’ అనేస్తున్నాం. 

      ఇలా పదం వేరు, పరమార్థం వేరైన పదాలు ఎన్నో కనిపిస్తాయి. కానీ, ‘పదుగురాడు మాట పాటియై ధరచెల్లు’ కాబట్టి వాడుకలో ఉన్న అర్థాలతోనే సర్దుకుపోవాలి. అయితే... మాటకట్లు తయారు చేసేవారు, చిత్ర రచనలు చేసేవారికి మాత్రం ఇలాంటి పదాలు బాగా ఉపయోగపడతాయి. ఆ సంగతి అలా ఉంచితే... మనం యథాలాపంగా వాడేసే పదాల వెనుక ఎంతటి కథ ఉందో తెలుసుకోవడం మాత్రం ఆసక్తికరం. భాషను పూర్తిగా ‘అర్థం’ చేసుకోవడానికి ఆ ప్రయత్నం అవసరం కూడా.

(అయ్యగారి శ్రీనివాసరావు -

 విజయనగరం)

*కర్మ కర్మణా నశ్యతి కర్మ!*

 *✍️...నేటి చిట్టికథ*


*గంగలో స్నానమాచరిస్తున్న లక్షలాది మందిని చూసిన ఒక ఋషి కి ఒక సందేహం వచ్చింది!*


*వెంటనే గంగానదినే అడిగాడట!*


*అమ్మా! ఎందరో ఎన్నో పాపాలు చేసి నదిలో మునకలేస్తున్నారు. వారి వారి పాపం వదిలేస్తున్నారు. మరి ఇందరి, ఇంత పాప భారం ఎలా మోస్తున్నావు? తల్లీ! అని.*


*అందుకా తల్లి "నాయనా నేనెక్కడ ఆ పాపభారం మోస్తున్నాను? అవి అన్నీ తీసుకెళ్ళి ఎప్పటికప్పుడు సముద్రంలో కలిపేస్తున్నాను" అని బదులిచ్చిందట.* 


*అయ్యో అన్ని పుణ్య నదులు ఇంతేకదా! పాపా లన్నీ సముద్రంలోనే కలిపేస్తే ఆ సముద్రుడు ఎలా భరిస్తున్నాడో?అనుకొని!*


*సముద్రాన్నే అడిగాడు!*


*ఎలా మోస్తున్నావు? ఈ పాపభారాన్ని!?! అని!*


*దానికా సముద్రుడు!* 


*నేనెక్కడ భరిస్తున్నాను?! ఆ పాపాలను వెంట వెంటనే ఆవిరిగా మార్చి, పైకి మేఘాల లోనికి పంపిస్తున్నాను' అని బదులిచ్చాడట.* 


*అరే!!! ఎంతో తేలికగా కదిలి పోయే మేఘాలకు ఎంత కష్టం వచ్చింది! అని అనుకుంటూ!* 


*ఓ మేఘ మాలికల్లారా ఎలా భరిస్తున్నారు? ఈ పాప భారాన్ని! అని అడగగా!!!*


*అవి పకపకా నవ్వి!  మేమెక్కడ భరిస్తున్నాం? ఎప్పటి కప్పుడే మీ మీదే కురిపించేస్తున్నాం వర్ష రూపేణా'! అని బదులివ్వగా...*


*ఓహో!!!* 

*ఆ పాపాలన్నీ మన మీద పడి మనమే అనుభవిస్తున్నా మన్నమాట!*


*అయితే ఎట్టి పరిస్థితుల్లో కూడా! ఎవరూ కూడా! కర్మ ఫలితాలు వదిలించు కోలేమని!!!! గ్రహించాడు అక్కడ స్నాన మాచరిస్తున్న ఋషి!*

                 

*ఇదం తీర్ధమిదం తీర్ధం భ్రమన్తి తామసా జనాః ఆత్మతీర్ధం నజానన్తి కధం మోక్షః శృణు ప్రియే.*


*పరమశివుడు పార్వతీ దేవికి ఉపదేశించిన శ్లోకమిది!.*


*ఈ తీర్ధంలో స్నానమాచరించిన పుణ్యం కలుగును! ఆ తీర్ధంలో స్నానమాచరించిన మోక్షం కలుగును!* 

*అని... తీర్ధ స్నానమునకై పరుగు లెత్తెడు మానవులు "భ్రమకు లోబడిన వారు"!*


*ఆత్మ జ్ఞాన తీర్ధంలో స్నాన మాచరించని వారికి మోక్ష మెటుల కలుగును?!? అని ఈ శ్లోకం అర్థం.*


*కర్మ కర్మణా నశ్యతి కర్మ!*


*అంటే ..*

*కర్మ అనేది కర్మతోనే* *నశిస్తుంది.*

🔹🔸🔹🔸🔷🔷🔸🔹🔸🔹

ప్రసవించిన స్త్రీకి చేయవలసిన ఉపచారములు -

 ప్రసవించిన స్త్రీకి చేయవలసిన ఉపచారములు  - 


 

 *  బాలింతలకు ప్రసవించిన 8 వ దినము నుండి క్రమక్రమంగా శరీరమునకు బలము చేకూర్చు ఔషధములు , ఆహారములు వాడుట మంచిది. బాలింతలకు 12 దినములు గడుచునంత వరకు మాంసం పెట్టకూడదు. 


 *  గర్భం నందు శిశువు తల్లి ఆహారం పంచుకొని పెరుగుట చేత ప్రసవవేదన అనుభవించుట చేత , ప్రసవకాలమున అధిక రక్తస్రావం జరుగుటవలన బాగా అలిసిపోవడం వలన బాలింతరాలుకు  వ్యాధులు తొందరగా వచ్చును.అందుకొరకు తొందరగా బలం చేకూర్చుటకు ప్రత్యేక ఔషదాలు ఇవ్వవలెను. దశమూలారిష్టం టానిక్ గాని ద్రాక్షరిష్టం టానిక్ గాని , సౌభాగ్యశొంటి అను లేహ్యం కాని భోజనమును తరువాత వాడవలెను. దీనివలన మంచి జీర్ణశక్తి కలుగును. 


 *  బాలింతలకు పథ్యమైన ఆహారాన్ని మాత్రమే ఇవ్వవలెను . దేహశ్రమ , పురుషసంపర్కం , కోపం చల్లనిపదార్ధాలు వీటిని విడిచిపెట్టవలెను. అన్నివిధముల పరిశుభ్రముగా ఉండవలెను . నెయ్యి వంటి పదార్థం కలిసిన పథ్యమైన ఆహారం మితముగా భుజించవలెను. ప్రతిదినము తలంటుస్నానం చేయవలెను . ఈ నియమాలు బాలింత శ్రద్దగా ఒక నెలరోజుల పాటు అనుసరించవలెను. 


 *  బాలింతరాలు తలంటు స్నానం నందు మూడుమాసముల వరకు బలాధన్వంతర తైలం వాడుట మంచిది. దీనివలన నరములకు బలం కలుగును. 


 *  స్త్రీకి గర్భధారణ నిల్చిపోయి 6 సంవత్సరములు అయిన పిదప మరలా గర్భదారణ జరిగి ప్రసవం ఏర్పడినట్లైతే ఆ శిశువుకు ఆయుర్ధాయం తక్కువ ఉండునని శుశ్రుతుడు చెప్పెను. 


 *  బాగా పాతబడిన బియ్యాన్నే ఆహారముగా ఇవ్వవలెను. 


 *  కందికట్టు , ధనియాలపొడి , శొంఠిపొడి , వెల్లుల్లి పాయ కారం , నువ్వులనూనె , నువ్వులపొడి , ఇంగువ , పాతబెల్లం , తాంబూలం పాత ఉశిరిక పచ్చడి , పాతనిమ్మ పచ్చడి , పొట్లకాయ , మునగకూర , బీరకాయ , కందకూర 

ఆవుపాలు , వేడినీటి స్నానం , ఎక్కువ విశ్రాంతి ఇవన్ని తప్పకుండా ఆచరించాలి . 


 *  ప్రసవించిన 15 రోజుల వరకు ఒంటిపూట భొజనం చేయాలి . బొప్పాయిపండు తినవచ్చు. రొట్టె , కాఫీ పుచ్చుకోవచ్చు. కాచి గోరువెచ్చగా ఉన్న చల్లార్చిన నీటిని తాగవచ్చు . 


 *  మాంసాహారం తీసుకునేవారు ఎండుచేపలు , కాల్చిన మాంసం , ఆవునెయ్యిలొ వేయించిన మాంసం , ఎండబెట్టిన మేకమాంసం , మేకమాంసానికి అల్లం , ఉప్పు , కొద్దిగా గరం మసాలా రాసి ఎండించి చిన్నచిన్న ముక్కలుగా తరిగి ఆవునెయ్యిలొ వేయించి తినవచ్చు . 


  బాలింతలు తినకూడని ఆహార పదార్దాలు  -


 

 *  ఎట్టి పరిస్థితులలో కొత్తబియ్యం అన్నం తినకూడదు. 


 *  చద్దిఅన్నం , పలుకుగా ఉన్న అన్నం తినరాదు.


 *  పచ్చి చేపలు , కొత్త చింతపండు , పులుసుకూరలు , మజ్జిగ , పెరుగు ముట్టుకోకూడదు. 


 *  చల్లటి పదార్దాలు ముట్టరాదు. 


    పైన చెప్పిన నియమాలు పాటించని బాలింతలకు సూతికా వ్యాధులు సంభవిస్తాయి. ఒక్కోసారి ఈ చిన్న వ్యాధులు 13 రకాల సన్నిపాత జబ్బులుగా మారి ప్రాణాలు హరిస్తాయి 

  

 గమనిక  - 


      అతి త్వరలో నా మూడొవ గ్రంథం మీ ముందుకు రాబోతుంది. ఈ గ్రంధము నందు మనకి తెలిసిన మొక్కల యొక్క రహస్య యోగాలు ఎన్నింటినో మీ ముందుకు తీసుకువస్తున్నాను . 


              కాళహస్తి వేంకటేశ్వరరావు 


                అనువంశిక ఆయుర్వేదం 


                    9885030034

BIO-CLOCK

 *😁 BIO-CLOCK 😁*


మనం ఉదయం ఎక్కడికన్నా ప్రయాణం చేయ్యల్సి వస్తే తెల్లవారుజామున 4:00 గంటలకు అలారం సెట్ చేసి నిద్రపోతాము. 

కానీ కొన్నిసార్లు మనం అలారం లేకపోయినా అనుకున్న టైంకి నిద్ర లేస్తాము. 

ఇదే *బయో-గడియారం*. 


చాలామంది 80-90 సంవత్సరాల వయస్సులో చనిపోతారని సాధారణంగా నమ్ముతారు. 


50-60 సంవత్సరాల వయస్సులో అన్ని రోగాలు వస్తాయని మనసులో గాఢంగా నమ్మబల్కోని చాలామంది తమ సొంత బయోక్లాక్‌ ను ఏర్పాటు చేసుకున్నారు. అందుకే సాధారణంగా 50-60 వద్ద ప్రజలు అనారోగ్యం పాలవుతారు  *మనం మనకు తెలియకుండానే బయోక్లాక్‌* ను మానసికంగా తప్పుగా సెటప్ చేస్తాము. 


చైనాలో చాలా మంది ప్రజలు 120 సంవత్సరాల వరకు ఆరోగ్యంగా జీవిస్తారని నమ్మి అలా మానసికంగా సంసిద్దులై వారి బయోక్లాక్ ను అలా ఏర్పాటు చేసుకున్నారు.


*కాబట్టి ..!*


1. మనము మన బయో-గడియారాన్ని మానసికంగా పాజిటివ్ ఆలోచనలతో సర్దుబాటు చేసి, రోజు క్రమం తప్పకుండా *ధ్యానం* చేస్తే తద్వారా మనం *కనీసం* 120 సంవత్సరాల వరకు ఆరోగ్యంగా జీవించవచ్చు.


2. 40 నుండి 90 సంవత్సరాల వయస్సులో ఎటువంటి వ్యాధి వచ్చే అవకాశం లేదని మనం నమ్మాలి. వృద్దాప్యం అనేది 120 సంవత్సరాలకు మొదలు అవుతుందని బలంగా నమ్మాలి.


3. వెంట్రుకులకు సహజ సిద్ధమైన రంగు ( తెల్లజుట్టు ఉంటే) వెయ్యండి, యవ్వనంగా కనిపించే ప్రయత్నం చేయండి. *ముఖ్యంగా డ్రెస్ విషయంలో కూడ యువతి, యువకుల మాదిరి డ్రెస్ వేసుకునే ప్రయత్నం సాధ్యమైనంత వరకు చేయండి. తద్వారా మనలో కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతాయి. యెట్టి పరిస్థితులలో వృద్ధాప్యంగా కనిపించడానికి మన మనసుని అనుమతించవద్దు*.


4. మనం తీసుకునే భోజనం కల్తీ అనీ, కలుషితం, అనుకుంటూ నెగటివ్ థాట్స్ తో తీసుకోవద్దు. *ధ్యాన శక్తి వల్ల నేను తీసుకునే ఆహారం పరమ పవిత్రమైనది గా మారింది, ఇది నాకు నిత్య యవ్వనాన్ని, సంపూర్ణ ఆరోగ్యాన్ని నిండు 120 ఏళ్ల జీవితాన్ని ఇస్తుంది అని పరిపూర్ణంగా నమ్మండి.* లేదంటే ఋణాత్మక ఆలోచనల వల్ల మన శరీరంలో నెగటివ్ ఎంజైములు విడుదలై మన జీర్ణ వ్యవస్థను, మన శరీర నిర్మాణాన్ని పూర్తిగా దెబ్బతీస్తుంది.


5. ఎప్పుడూ చురుకుగా ఉండండి. నడవడానికి బదులుగా వీలైతే జాగింగ్ చేయండి. 


5. *వయసు పెరిగే కొద్దీ ఆరోగ్యం పెరుగుతుందని నమ్మండి*. (ఇది నిజం కూడ).


6.ఆనందానికి, వ్యాధికి పడదు. ఒకటి ఉన్నచోట ఇంకొకటి ఉండదు. కనుక ఆనందంగా ఉండండి తద్వారా ఆరోగ్యంగా ఉండండి. *(ప్రతిరోజు హాస్య భరిత సినిమాలు చూడండి మనసులో కాకుండా పైకి నవ్వండి*).


7. ప్రతి సమస్యకు కారణం మన మనస్సు. మన ఆలోచనా విధానం. ముఖ్యంగా మన మాట, సరదాకు కూడ నాకు Old age వస్తుంది అనే మాటను అనకండి. 


*ధర్మరాజుకు యువరాజుగా పట్టాభిషేకం జరిగింది కూడా 105 సంవత్సరాల వయసులోనే అని గ్రహించండి.*


కాబట్టి మీ మానసిక బయో క్లాక్ ని 

మీ తక్కవ ఆయుర్దాయం కోసం సెట్ చేసుకోమాకండి. ఇకనైనా మీ ఆలోచనా దృక్పధాన్ని మార్చుకోండి.


          👍👍👍👍👍👍

దత్త జయంతి

 మార్గశిర పౌర్ణమి దత్త జయంతి


       ( 18-12-2021)


🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷



శ్రీమహావిష్ణువు ఇరవై ఒక్క అవతారాల్లో దత్తావతారం ఆరోదని భాగవత పురాణం చెబుతోంది. 


దత్తరూపం అసామాన్యమైంది. త్రిమూర్తుల లక్షణాలు, త్రిమూర్తుల తత్త్వాలు మూర్తీభవించి, ఆవిర్భవించినదే దత్తావతారం. 


మార్గశిర శుద్ధ పూర్ణిమనాడు అత్రి, అనసూయ దంపతులకు త్రిమూర్తుల వరప్రభావం వల్ల దత్తుడు జన్మించాడు.


 ‘దత్తం’ అంటే ఇచ్చినవాడని. అత్రి కుమారుడు కావడంతో ఆత్రేయుడైనాడు. దత్తాత్రేయుడు ఉపనయనం అయిన వెంటనే అరణ్యానికి వెళ్లి తపస్సు ద్వారా పరిపూర్ణమైన జ్ఞాన సముపార్జన చేశాడు. ఇరవై నలుగురిని తన గురువులుగా భావించి, సేవించాడు.


 కార్తవీర్యుడు, పరశురాముడు, యదువు, అలర్కుడు, ప్రహ్లాదుడు వంటి పలువురు లోకప్రసిద్ధులకు ఆధ్యాత్మిక విద్య బోధించాడు. అవధూత గీత, జీవన్ముక్త గీత, అవధూతోపనిషత్తు మొదలైన గ్రంథాలు రచించాడు.


దత్తుడు గొప్ప అవధూత. మహాజ్ఞాని. చిరంజీవి. యుగయుగాలకు ఆయన ఆదర్శమూర్తి.


 లోకగురువైనాడు. ప్రాపంచిక విషయాలను వదిలి ఏకాంతవాసం చేశాడు. జాతి శ్రేయస్సుకోసం జ్ఞానబోధ చేశాడు. దత్తాత్రేయుడు ఆదిగురువైన పరబ్రహ్మ స్వరూపుడు. 


శిష్యకోటి హృదయాల్లో అఖండ జ్ఞానదీపం వెలిగించిన వైరాగ్యరూప విలక్షణమూర్తి. ఆయన బోధలు లోకకల్యాణ కారకాలు. భూమి నుంచి సహనశీలత, గాలినుంచి స్వేచ్ఛ, ఆకాశం నుంచి నిస్సంగత్వం నేర్చుకోవాలని ఉద్బోధించిన మార్గనిర్దేశకుడు. అగ్నినుంచి నిర్మలత్వాన్ని, సముద్రం నుంచి గాంభీర్యాన్ని, కపోతంనుంచి నిర్మోహత్వాన్ని గ్రహించాలన్నాడు. కొండచిలువలా భ్రాంతిలో పడకూడదన్నాడు. స్పర్శకు దూరంగా ఉండటం మిడత నుంచి, ఏనుగు నుంచి పట్టుదల, చేపనుంచి త్యాగచింతన నేర్చుకోవాలి. మానావమానాలకు సమస్పందన అలవరచుకోవాలి. సాలెపురుగు నుంచి సృష్టి స్థితిలయకారకుడు పరమాత్మేనని తెలుసుకోవాలి. సీతాకోక చిలుకలా ఆత్మానందాన్వేషణ అలవరచుకోవాలి. చంద్రుడి నుంచి వృద్ధిక్షయాలు శరీరానికే కాని ఆత్మకు కావని గ్రహించాలి. ఆర్తులను కాపాడే చింతనను నీటినుంచి గ్రహించాలి. చీమలా జిహ్వ చాపల్యానికి లోనుకారాదని తెలుసుకోవాలి. ఇవన్నీ తనకు గురువులుగా ప్రకటించిన జ్ఞానానందమయుడు- జగద్గురువు దత్తాత్రేయ స్వామి!


దత్తాత్రేయుడు సతీమదాలస ముద్దులపట్టి అలర్కుడికి యోగవిద్య నేర్పాడు. ఓంకారోపాసనా విధానాన్ని ప్రబోధించాడు. పరశురాముడికి శ్రీవిద్యను, ప్రహ్లాదుడికి ఆత్మజ్ఞాన రహస్యాన్ని ప్రసాదించాడు. త్రిమూర్తుల అనుగ్రహ అవతారం కావడంతో, దత్తుడిరూపం మూడు శిరసులతో సందేశాత్మకమై ప్రకాశిస్తోంది.


దత్తుడు పదహారు అంశలు కలవాడని ‘దత్తపురాణం’ చెబుతోంది. శ్రీపాదవల్లభులు, శ్రీనృసింహ సరస్వతి, శ్రీ అక్కల్‌కోట మహరాజ్‌, శ్రీమాణిక్య ప్రభువు,గజానన మహరాజ్‌, శ్రీకృష్ణ సరస్వతీ మహరాజ్‌, వాసుదేవానంద సరస్వతీ మహరాజ్‌ దత్తావతారాలుగా వెలసినట్లు దత్తచరిత్ర చెబుతోంది. దత్తపురాణ గ్రంథాన్ని దీక్షగా పారాయణం చేస్తారు.


మత్స్య పురాణం, స్మృతి కౌస్తుభంలో దత్తచరితం విస్తృతంగా ఉంది. ఈ పూర్ణిమనాడు కొన్ని ప్రాంతాల్లో చంద్రపూజ చేస్తారని నీలమత పురాణం వివరిస్తోంది. 


ఈ రోజున ఆగ్నేయ పురాణ గ్రంథం దానం చేస్తే సతతం మేలు కలుగుతుందని పురాణోక్తి. కొన్ని ప్రాంతాల్లో ఈ పౌర్ణమి ‘కోర్ల పూర్ణిమ’గా ప్రసిద్ధి చెందింది. మహామార్గశీర్ష పేరుగల ఈ పున్నమిరోజున నరకపూర్ణిమావ్రతం చేయాలని చతుర్వర్గ చింతామణి కథనం.


మహారాష్ట్రలో దత్తజయంతిని భక్తిశ్రద్ధలతో వైభవంగా జరుపుకొంటారు. దత్తుడు ‘ఉగ్రదేవత’ అని గర్గసంహిత చెబుతోంది. దత్తుడికి గురువారం అత్యంత ప్రీతికర దినమని చెబుతారు. ఆ స్వామికి ఇష్టమైన వృక్షం మేడివృక్షం. 


ప్రేమ, అహింస, భూతదయ, త్యాగశీలత, ఆత్మజ్ఞానం మనుషులకు రక్షణ కవచాలన్న దత్తాత్రేయుడి సందేశాలు సర్వదా ఆచరణీయం.



🌹🌷🌹🌷🌹🌷🌹🌷



.

శివాజీ గురించి

 స్కూల్లో చరిత్రలో శివాజీ గురించి పెద్దగా నేర్చుకోలేదు. చాలామంది అతని గురించి ఏమనుకుంటున్నారో చూసి ఆశ్చర్యపోయాను :


 *"కాబూల్ నుండి కాందహార్ వరకు నా తైమూర్ కుటుంబం మొగల్ సుల్తానేట్‌ను సృష్టించింది. ఇరాక్, ఇరాన్, టర్కిస్తాన్ మరియు అనేక దేశాలలో నా సైన్యం క్రూరమైన యోధులను ఓడించింది. కానీ భారతదేశంలో శివాజీ మాకు బ్రేకులు వేశారు. నేను శివాజీకి నా గరిష్ట శక్తిని వెచ్చించాను, కానీ తీసుకురాలేకపోయాను. అతని మోకాళ్లకు.*


 *యా అల్లాహ్, నువ్వు నాకు శత్రువును, నిర్భయమైన మరియు నిటారుగా ఉన్నవాడిని ఇచ్చావు, దయచేసి అతని కోసం స్వర్గానికి మీ తలుపులు తెరిచి ఉంచండి ఎందుకంటే ప్రపంచంలోని అత్యుత్తమ మరియు విశాల హృదయం ఉన్న యోధుడు మీ వద్దకు వస్తున్నాడు."*


 -ఔరంగజేబ్ (శివాజీ మరణానంతరం నమాజ్ చదువుతూ)


 *"ఆ రోజు శివాజీ నా వేళ్లు నరికేయలేదు కానీ నా అహంకారాన్ని కూడా నరికేశాడు. నా కలలో కూడా ఆయనను కలవాలంటే భయం."*


 --షాహిస్తా ఖాన్.


 *"నా రాజ్యంలో శివాజీని ఓడించే వాడు లేడా??"*


 - విసుగు చెందిన బేగం అలీ ఆదిల్షా.


 *"నేతాజీ, బ్రిటిష్ వారిని తరిమికొట్టడానికి మీ దేశానికి హిట్లర్ అవసరం లేదు. మీరు బోధించాల్సింది శివాజీ చరిత్ర మాత్రమే."*


 -అడాల్ఫ్ హిట్లర్


 *"శివాజీ ఇంగ్లండ్‌లో జన్మించి ఉంటే, మనం భూమిని మాత్రమే కాకుండా మొత్తం విశ్వాన్ని పాలించి ఉండేవాళ్ళం."*


 -లార్డ్ మౌంట్ బాటన్


 *"శివాజీ ఇంకో పదేళ్లు బ్రతికి ఉంటే బ్రిటిష్ వాళ్ళు భారతదేశం ముఖం చూసి ఉండేవారు కాదు."*


 -- ఒక బ్రిటిష్ గవర్నర్


 *_భారతదేశానికి స్వాతంత్ర్యం కావాలంటే ఒక్కటే మార్గం, 'శివాజీలా పోరాడండి'."*


 --నేతాజీ


 *"శివాజీ అనేది కేవలం పేరు కాదు, భారతీయ యువతకు ఇది శక్తి వనరు, ఇది భారతదేశాన్ని స్వేచ్ఛగా మార్చడానికి ఉపయోగపడుతుంది."*


 - స్వామి వివేకానంద.


 *"శివాజీ అమెరికాలో జన్మించి ఉంటే, మేము అతనిని SUN అని నామకరణం చేస్తాము."*


 - బరాక్ ఒబామా


 ఉంబర్‌ఖైండ్ యొక్క ప్రసిద్ధ యుద్ధం గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో పేర్కొనబడింది:


 *"ఉజ్బెకిస్తాన్ నుండి వచ్చిన 30,000 మంది కరతలాబ్ ఖాన్ సైన్యాన్ని కేవలం 1000 మంది శివాజీ మావలలు ఓడించారు. స్వదేశానికి తిరిగి రావడానికి ఒక్క ఉజ్బెకీ కూడా ప్రాణాలతో మిగిలిపోలేదు."*


 శివాజీ అంతర్జాతీయ ఖ్యాతి పొందిన రాజు. తన కెరీర్‌లో 30 ఏళ్ల వ్యవధిలో కేవలం ఇద్దరు భారతీయ యోధులతోనే పోరాడాడు. మిగతా వారంతా బయటి వ్యక్తులు.


 అబూ తాలిబాన్ మరియు టర్కిస్తాన్ రాజుగా తన కలలో కూడా శివాజీకి భయపడే షాహిస్తా ఖాన్.


 బెహ్లోల్ ఖాన్ పఠాన్, సికందర్ పఠాన్, చిదర్ ఖాన్ పఠాన్ అందరూ ఆఫ్ఘనిస్తాన్ యొక్క యోధ సర్దార్లు.


 దిలేర్ ఖాన్ పఠాన్ మంగోలియా యొక్క గొప్ప యోధుడు. వీరంతా శివాజీ ముందు దుమ్ము దులుపుకున్నారు.


 సిద్ధి జౌహర్ మరియు సలాబా ఖాన్ ఇరానియన్ యోధులు, వీరు శివాజీ చేతిలో ఓడిపోయారు.


 సిద్ధి జౌహర్ తర్వాత సముద్ర దాడికి ప్లాన్ చేశాడు. ప్రతిస్పందనగా శివాజీ ఒక నౌకాదళాన్ని, మొదటి భారతీయ నౌకాదళాన్ని పెంచారు. అయితే ఆ పని పూర్తి కాకముందే శివాజీ ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయాడు.  


 Google *"శివాజీ, మేనేజ్‌మెంట్ గురువు."* ఇది బోస్టన్ విశ్వవిద్యాలయంలో పూర్తి సబ్జెక్ట్.


 ఇంకా, భారతీయులమైన మనకు ఆయన గురించి చాలా తక్కువ తెలుసు..... పాపం.... కనీసం మన భావి తరానికి కూడా ఈ గొప్ప భారతీయుని గురించి తెలిసేలా చేద్దాం.


 దయచేసి కనీసం విస్తృతంగా ప్రసారం చేయండి.🙏🙏🙏

చక్కని సందేశం

 చక్కని సందేశం. 


*భగవద్గీతను ఎందుకు చదవాలి?చదివితే ఏమి అవుతుంది ?*

  


    ఒక పెద్దాయన రైతు... కొండలపైన ఉన్న 

తన పొలంలో యువకుడైన తన మనవడితో ఉంటున్నారు. 


   రోజూ పొద్దున్నే లేచి వంటింట్లో ఉన్న

బల్ల దగ్గర భగవద్గీత చదువుతూ కూర్చుంటాడు. 


   మనవడికి తాత చేసే పనులంటే చాలా ఇష్టం…తనూ అన్ని పనులూ తాతగారిలా చెయ్యాలనుకుంటాడు…


   పొద్దున పూట తాతలానే తానూ 

భగవద్గీత చదవటానికి ప్రయత్నిస్తున్నాడు కానీ అతని వల్ల అవ్వటం లేదు…


    ఒకరోజు ’తాతా.. నువ్వు చదివినట్టు 

నేనూ భగవద్గీతను  చదవాలని ప్రయత్నిస్తే…ఎంత చదివినా అర్ధం కావటం లేదు…కష్టం మీద కొంచెం అర్ధం చేసుకున్నా…పుస్తకం ముయ్యగానే మర్చిపోతున్నాను. అసలు భగవద్గీతను  ఎందుకు చదవాలి? 

ఏంటి ప్రయోజనం’ అని తాతని 

అడిగాడు మనవడు.


   పొయ్యిలో బొగ్గు పెడుతున్న తాతగారు మనవడివైపు తిరిగి..తన చేతిలోని ఖాళీ అయిన బొగ్గు బుట్టని మనవడికి ఇచ్చి..

‘కింద నది నుండి ఈ బుట్ట నిండా నీళ్ళు తీసుకుని రా..’ అని చెప్పారు.


‘సరే తాతా..’ అని మనవడు బుట్ట తీసుకెళ్ళి నదిలో బుట్టను ముంచి కొండ పైకి ఇంటికి వచ్చేటప్పటికి నీళ్ళు బుట్ట నుండి కారిపొయ్యాయి…


అది చూసి తాతగారు…’ఓరి మనవడా ఇంకొంచెం వేగం పెంచు...

ఇంటికి రావటంలో’ అని సలహా చెప్పారు! 


  సరే అని ఈ సారి ఇంకొంచెం వేగంగా బుట్టలో నీళ్ళు నింపి ఇంటికి వచ్చాడు మనవడు. ‘బుట్ట ఖాళీ తాతా! బుట్టలో 

నీళ్ళు ఎలా నిలుస్తాయి?  నేను గిన్నె తీసుకెళ్తాను అన్నాడు మనవడు.’ 


  తాత చెప్పాడు…’లేదు లేదు బుట్టతోనే 

నీళ్ళు తేవాలి..బహుశా నువ్వు ఇంకొంచెం ఎక్కువ శ్రమ పడాలి అనుకుంటా…

ఇంకొంచెం శ్రద్ధగా ప్రయత్నిస్తే పని 

అవ్వచ్చు.’ అని మనవడిని 

ప్రోత్సహించారు…


   మనవడు ఈ సారి ఇంకా వేగంగా నదిలో బుట్టను ముంచి..బుట్టలో నీళ్ళు నింపి పరిగెత్తుకుంటూ ఇంటికి వచ్చాడు…బుట్టలో నీళ్ళు నిలవలేదు…మళ్ళీ వెంటనే ఇంకోసారి కూడా ప్రయత్నించాడు…అయినా ఫలితం మాత్రం అదే…తాతగారు మనవడి కష్టం అంతా కిటికీలోంచి చూస్తూనే వున్నారు….


   ఖాళీ బుట్టతో ఆయాసపడుతూ నించున్న మనవడితో నవ్వుతూ చెప్పారు..’ఒకసారి బుట్ట వైపు చూడు మనవడా…’అని…!


   మనవడు బుట్టను చూసాడు…నల్లని బొగ్గుల బుట్ట ఇప్పుడు చాలా శుభ్రంగా, తెల్లగా ఉంది…!


   తాతగారు చెప్పారు…’భగవద్గీత చదివితే మనకు జరిగేది ఇదే…మనకు అర్ధం అవ్వనీ అవకపోనీ…గుర్తు ఉండనీ ఉండకపోనీ…చదివే సమయంలో మనకు తెలియకుండానే..మన ఆలోచనల్లో..మన దృక్పధంలో    మంచి మార్పు వస్తూ ఉంటుంది…ఆ మార్పు మనకి వెంటనే తెలియదు కూడా…సందర్భాన్ని బట్టీ..అవసరమైన సమయంలో.. ఆ మంచి మార్పు…ఉపయోగపడుతుంది…భగవద్గీత చదవటంలో కృష్ణుడు మనకు చేసే మేలు అదే…మన మనస్సులను శుభ్రపరచటం…ఏది ఏమిటో…ఏది ఎందుకో…సరైన అవగాహన మనకి తెలియచేయటం…

ఇవన్నీ అనుభవపూర్వకంగా..

ఎవరికి వారే తెలుసుకోగలుగుతారు…’

అని చెప్పి మనవడి ప్రశ్నకు సహేతుకంగా, ఉదాహరణతో సహా వివరించారు 

తాతగారు.✍️

 ॐ గీతా జయంతి 


                        సందేశం - 3 


భగవద్గీత అందించే శాంతి సందేశం 


1 పరమాత్మ 


    పరబ్రహ్మము 

    విభజింపబడనిదియైనను ప్రాణులయందు విభజింపబడినదానివలె ఉన్నదీ, 

    ప్రాణులను సృష్టించేదీ, పోషించేదీ, లయింపజేసేదీ అని తెలుసుకోదగినది. 


    Brahman is though undivided, It exists as if divided in beings; 

    It is to be known as the supporter of beings; 

    It devours and It generates. 


అవిభక్తం చ భూతేషు విభక్తమివ చ స్థితమ్ I 

భూతభర్తృ చ తజ్జ్ఞేయం గ్రసిష్ణు ప్రభవిష్ణు చ ॥ 13 - 17 


2. భగవంతుని స్థానం 


    ఎవడు సమస్త భూతములందును నన్ను చూచుచున్నాడో, మఱియు 

    నన్ను సమస్త భూతములందును గాంచుచున్నాడో, 

    అట్టివానికి నేను కనబడకపోను, 

    నాకతడు కనబడకపోడు. 


    He who sees Me everywhere and sees everything in Me, 

    he never becomes separated from Me, 

    nor do I become separated from him.


యో మాం పశ్యతి సర్వత్ర సర్వం చ మయి పశ్యతి I 

తస్యాహం న ప్రణశ్యామి స చ మే న ప్రణశ్యతి ॥ 6 - 30  


3. ద్వేష ఫలం 


    సమస్త ప్రాణులలో గల ఆత్మయగు నన్ను ద్వేషించువారును, 

    క్రూరులును, 

    అశుభ(పాప) కార్యములను జేయువారును అగు మనుజాధములను నేను 

    జననమరణరూపమలగు ఈ సంసారమార్గములందు 

    అసురసంబంధమైన నీచజన్మలందే ఎల్లప్పుడు త్రోసివైచదను. 


    Entering into demonical wombs and deluded, 

    birth after birth, 

    not attaining Me, 

    they thus fall, O Arjuna, into a condition still lower than that


తానహం ద్విషతః క్రూరాన్ సంసారేషు నరాధమాన్ I 

క్షిపామ్యజస్ర మశుభా నాసురీష్వేవ యోనిషు ॥ 16 - 19 


          ॐ శాంతిశ్శాంతిశ్శాంతిః 


    — రామాయణం శర్మ 

            భద్రాచలం

బాపు గారి జయంతి

 సత్తిరాజు లక్ష్మీనారాయణ, బాపు గారి జయంతి నేడు. ఇతగాడు సృష్టించిన బొమ్మలు, పుట్టించిన బామ్మలు మన తెలుగింట ఇప్పటికీ కళకళలాడుతూనే వున్నారు.


అందాలబొమ్మల బాపుకి అపరాహ్ణవేళ అక్షర నైవేద్యం...


‘గుండ్రంగా రాయడం రాక ఇలా వంకరటింకరగా లాగించేస్తున్నాడు...ఏం తెలివి?’ అనేసుకుని నోట్లో కొంగులూ, కండువాలూ కుక్కేసుకున్నార్ట!


ఆ అక్షరాలు చూడ్డానికి అదోలా వుంటాయి. కాసేపు చూస్తే ‘ఏదోవుందిందులో!’ అనిపించేస్తుంది. ఆనక పుస్తకం మూసేసాక మళ్ళీ తెరిచి చూడాలనిపిస్తుంది. 


మనం పెట్టే కొమ్ములూ, దీర్ఘాలన్నింటినీ కొత్తరకంగా తగిలించే తెలివి. పేరంతా రాసేసిన తరవాత చూస్తే ఊరేగింపుకి తయారైన దేవుడిపల్లకీలా వుంటుంది. ఆ నిండుదనం గోదారినించీ, ఆ అందం చందమామనించీ తెస్తాడు. 


ఇహ బొమ్మలు....


ఒక స్త్రీ బొమ్మంటే సామాన్యశాస్త్రం పుస్తకంలో ఆడమనిషి బొమ్మలా అందరూ వేస్తున్నరోజుల్లో ఇతగాడు చుక్కలముగ్గెట్టినంత చులాగ్గా వేసేసి చూపించాడు. 


రావాకుల్లా పరుచుకున్న రెండుకళ్ళూ, 

మకరధ్వజాల్లా కనుబొమ్మలూ,  

చదరంగంలో శకటులా ధీటైన ముక్కు, 

చిన్న చెగోడీలా నోరూనూ! 

చూడగానే ముద్దిస్తున్నట్టూ, ముద్దొస్తున్నట్టూ అనిపించేస్తుంది ఎవరికైనా! 


ఇహ మెడా, జడా సంగతి సరేసరి! జుట్టంతా పొందిగ్గా అల్లి, పాపిడితీసి, నాగుబాములా పేద్ధ జడేసేసేవాడు. చివర్న ఓరెండు గంటలు కట్టేవాడు. నడుం మీద ఆట్టే ఆసక్తి చూపెట్టేవాడు కాదు. ఎంచేతంటే...అసలది వుంటేగా? అలాగ్గీసేవాడు. 


ఈ యవ్వారాలన్నీ పూర్తయ్యేసరికి మగపిల్లలందరికీ గుండెల్లో గుబులు మొదలయ్యింది. ‘పెళ్ళిచేసుకోరా నాయనా!’ అని బామ్మలూ, అమ్మానాన్నలూ అడిగితే శివకాశి టపాకాయల్లా ‘బాపూబొమ్మం’టూ బ్రాండొకటి చెప్పేవారు. అలాంటి పిల్లలే కావాలంటే ఎక్కణ్ణించొస్తారు? ఆఖరికి అదొక గోల్డ్ స్టాండర్డ్ అయి కూర్చుంది.


ఇహ ఈ రమణున్నాడే! గొప్ప కబుర్లపోగు. ఏవో కథలూగట్రా రాస్తూండేవాడు. ఆయనగారి మనసులో ఏం వుందో ఈయనకి తెలిసిపోయేది. ఈయనగారి కలంలో ఏం వుందో ఆయనకి అర్ధమైపొయ్యేది. 


బుడుగూ, సీగానపెసూనాంబ....అనేసి రెండుపేర్లు అనుకుని ‘ఓం విఘ్నేశ్వరాయ’ అని ముందస్తుగా రాసి మొదలెట్టగానే ఈయనేసిన రెండు బొమ్మలూ రూపం తెచ్చేసుకున్నాయి. ఆనక వాళ్ళనాన్న గోపాళం, రాద, బాబాయ్, రెండుజెళ్ళసీత, పక్కింటి లావుపాటి పిన్నిగారు, ఆవిడ మొగుడు...అందరికన్నా అందంగా... వత్తులపెట్లో డబ్బులు దాచుకునే బామ్మ..వీళ్ళందరి బొమ్మలూ వేషాలేసుకుని పుస్తకమ్మీదకి వచ్చేసాయి. 


మనకింక తడుంకునే పన్లేదు. ‘బుడుగంటే ఎలా వుంటాడూ?’ అని నీ బుర్రనీ, పుస్తకాన్నీ చించుకోవాల్సిన అవసరం లేకుండా తాళ్ళలాగేసి, ఓ బుగ్గల బూరిగాణ్ణి మన ముందు నిలబెట్టేసాడు. రెండు కొత్తిమీర కట్టల్లాంటి జళ్ళేసి సీగాననీ లాక్కొచ్చేసాడు. వాళ్ళెంత నచ్చేస్తారంటే అందరూ చూస్తుండగా వందసార్లూ, ఎవరూ చూడకండా మరో వందసార్లూ పుస్తకాన్ని ముద్దెట్టేసుకునేంత!


వీళ్ళిద్దరితోనే అయ్యిందేఁవిటి? 


‘రామపట్టాభిషేకం పటం ఇంటోవుంటే శుభం! బాపూదయితే ఇంకా శుభం!’....


ఇది మన తెలుగింటి నానుడి! నేనన్నది అతిశయోక్తేమో గానీ అతిమాత్రం కాదు.


ఓమారు ఆ చివర్నించి ఈ చివరిదాకా చూడండి...


సీతారాములేమో మొహమాటంగాను, లక్ష్మణ భరత శత్రుఘ్నులేమో ‘హమ్మయ్య! అన్నయ్యొచ్చేసాడు! ఇహ మనకేం ఫరవాలేద’న్నట్టుగాను, వసిష్టుల వారేమో ‘ఈరోజుకోసం ఎన్నాళ్ళనించి చూస్తున్నానో తెలుసా?’ అన్నట్టుగాను, ఇహ హనుమంతుడయితే ‘నాకోసమే అప్పుడాగిపోయింది పట్టాభిషేకం. నేలేననే! అదీ అదృష్టఁవంటే!’ అనుకునేంత గాఢభక్తితోను...


చూస్తూనే వుండిపోయి, చుట్టుపక్కలేం జరుగుతోందో కూడా మర్చిపోతావు. ఆ క్షణంలో ఓ అప్పారావొచ్చి ‘ఓ ఫైవ్ లాక్స్ అప్పిస్తావోయ్?’ అనడిగినా ఇచ్చి పడేస్తావ్! అంత విషయం వుందక్కడ!


ఈయన బొమ్మ వుందంటే పుస్తకానికి పసుబ్బొట్టు పెట్టినంత అందం. గుమ్మానికి మావిడాకు కట్టినట్టు, కొత్తబట్టలు కొనుక్కున్నట్టు. పత్రికలవాళ్ళు పండగలన్నిటికీ ఈయన్నే వెయ్యమనేవారు ముఖచిత్రాన్ని.


అంతవరకూ ప్రతివారం వచ్చే వాణిశ్రీలూ, జమునలూ, జయప్రద, సుధ, చిత్రలూ మాయమై పోయేవారు. వాళ్ళందరికన్నా అందంగా ఓ పిల్ల దిగేది. ఆ పుస్తకాన్ని లోపలి కథల కోసం కొందరూ, బయట బొమ్మ కోసం కొందరూ ఏళ్ళ తరబడి దాచుకునేవారు.


అమరావతి కథలకి ఈయన గీసిన బొమ్మల్ని చూసారా? సత్యంగారి ఆత్మ బాపు బొమ్మల్లో కనబడుతుంది. ఆయనేఁవనుకుని రాసాడో తెలీదుగానీ ‘రాగిచెంబులో చేపపిల్ల’, ‘భోజన చక్రవర్తి’, ‘ముద్దులల్లుడు’ కథలకి బొమ్మలొకసారి చూడండి. 


పుస్తకంలేదా మీయింటో? అదేమరి! మీరేం తెలుగువాళ్ళూ? కథని చదివి, జీర్ణంచేసేసుకుని, రక్తంలోకీ, మనసులోకీ ఎక్కించుకుని ఆనక బుర్రకి పనిచెప్పి ఓబొమ్మగీస్తే....కథంతా ఒక్క బొమ్మలో తెలిసిపోతుంది! అంత పనిమంతుడు మన బాపు!


మిథునఁవైతే ఇహ లాభంలేదని ఏకంగా మొత్తం తన దస్తూరీలోనే రాసిపడేసాడు. ఒకసారి దూరంనించి చూస్తే పళ్ళెంలో పారిజాతాల్లా వుంటాయి అక్షరాలన్నీ! ఏరి వాసన చూడాలన్నంత అందంగా!


ఎంత మందికో కథలకీ, నవలలకీ బొమ్మలేసాడు. సినిమా పుస్తకాల్లో రేలంగిరిజల్నీ, జమునాసావిత్రుల్నీ కళ్ళకి కట్టేసేవాడు.


అంతర్జాతీయ స్థాయి అందాలబొమ్మల అపురూప చిత్రకారుడు...


అమర లోకంలో రంభావూర్వశులు రోజూ వాళ్ళ బొమ్మలెయ్యమని సలపాదిస్తూ వుండే వుంటారు. 


నీ బొమ్మల్ని చూస్తూ పెరిగాం. నీ బొమ్మల్ని చూస్తుండగానే నువ్వెళిపోయావు. మనసులో నీ బొమ్మ మాత్రం పది కాలాలపాటు పదిలంగా అలానే వుంటుంది.


నివాళులు!


జగదీశ్ కొచ్చెర్లకోట


#mahanubhavulu

15, డిసెంబర్ 2021, బుధవారం

తేయాకు

 తేయాకు గురించి సంపూర్ణ వివరణ - లాభనష్టాలు .


    తేయాకులో రెండు జాతులు కలవు. ఒకటి ఆకుపచ్చగా ఉంటుంది. దీనిని ఆంగ్లము నందు Viridis అంటారు. రెండొవది నలుపురంగులో ఉండును. దీనిని Bohea అని పిలుస్తారు . నల్లని తేయాకు చైనా , జపాన్ దేశముల పంట .ఈ మధ్యకాలంలో జావా దీవి యందు బ్రెజిల్ దేశము నందు కూడా ఈ రకము సాగుచేస్తున్నారు.


              200 సంవత్సరాల వరకు కూడా తేయాకు గురించి యూరపు ఖండములో తెలీదు .1664 వ సంవత్సరములో ఈస్టిండియా కంపెనీ వారు తేయాకును యూరపు ఖండంనకు పరిచయం చేసి దిగుమతి చేసినారు. మొట్టమొదట బ్రిటిష్ రాజుగారికి బహుమానంగా రెండు పౌనుల రెండు ఔన్సుల తేయాకును తెచ్చి ఇచ్చారు. ఫ్రెంచ్ దేశములో తేయాకు వాడకం తక్కువ కాని కాఫీ , పొగాకు , వైన్ వాడకం ఎక్కువ. నిద్రమత్తు వదలడానికి , శరీరంలో నూతన ఉత్తేజం నింపడానికి తేయాకు పానీయం వాడుతారు. తేయాకు పానియం లో ఎటువంటి పోషకవిలువలు లేవు కాకుంటే దంతబాధతో ఉన్నప్పుడు తేనీరు పాలు కలపకుండా తీసుకోవడం వలన దంత బాధ నుంచి కొంతమేర ఉపశమనం కలుగును.


             తేనీరు వలన లాభాల కంటే నష్టాలు ఎక్కువ కలవు. అలసట , బలహీనత, రక్తహీనత కలిగిన రోగులు తేనీరు సేవించినచో ఎక్కువ నష్టం జరుగును. తేనీరు ఉదయాన్నే ముఖప్రక్షాళన పిదప సేవించినచొ కొంతకాలం పిదప ఉదరము నందు వాయువును పుట్టించును మరియు మంట కలిగించును. సర్వరోగములకు మూలకారణం అగును. ఆకలిని చంపును. నల్లని తేయాకు మరియు కాఫీ ఇంకా ఎక్కువ దుష్పరిణామాలు కలుగచేయును. నాడి ఎక్కువ కొట్టుకొనును. గుండెవేగం పెరుగును . మూత్రపిండాలపైన ప్రభావం ఎక్కువ చూపడం వలన మూత్రము ఎక్కువ వచ్చును. ఎక్కువ కాలం తేనీరు అధిక మోతాదులో సేవించిన చర్మం శీఘ్రముగా పాలిపోవును. శరీరం నందు అమితమైన వేడిని పెంచును. కన్నులు లోతుకు పోవును . నాడి బలహీనం అగును.


           శరీరం నందు ఏదైనా వ్యాధి వృద్ది చెందే సమయంలో తేనీరు అధికంగా సేవించుచున్న కాళ్లు , చేతులు చల్లబడి చెమట పుట్టును . జీర్ణాశయం పైన అత్యధిక ప్రభావం చూపును. కొన్ని ప్రాంతాలలో ఈ తేయాకును కూడా కల్తి చేయుచున్నారు. నల్లని ముతక తేయాకును ఇనప పెనం పైన కొంచం వేడి చేసి ఆకుపచ్చని రంగుకు మార్చి దానికి నీలిమందు , తెల్లసీసం మిశ్రమమును చేర్చి తద్వారా రేగుపండు రంగు వలే నవనవలాడే కోమలమైన ఆకుపచ్చని తేయాకు వలే ఉంగరములుగా చుట్టుకొని ఉండునట్లు సిద్ధము చేయుచున్నారు ఇది అత్యంత ప్రమాదకరం . ఈ విధానములో ఎక్కువుగా కల్తి చైనాలోని కాంటస్ అనే ప్రదేశములో ఎక్కువుగా తయారుచేయుచున్నారు.


                  తేయాకు దంతములకు కానరాని హాని చేయును . అకాల దంతక్షయం కలుగచేయును . తేనీరు తీక్షణ తత్వం ఎక్కువ. వేడిగా ఉండగా తేనీరు సేవించుతాం అందువలన చిగుళ్లకు కూడా తీవ్రమైన నష్టం కలుగును. చిగుళ్లకు రోగం పుట్టించి దంతముల లోపల పుచ్చు వ్యాధిని కలుగచేయును . ఒక సన్నటిపొర నోటిలోపల ఉండును. అదే పొర పొట్టవరకు వ్యాపించి ఉండును. పొట్టలోపల కూడా అదే పొర ఉండును. పొట్టకు కీడుచేయు పదార్దాలు అన్నియు దంతములకు కీడు చేయును . వేడివేడి పానీయాలు మరియు అతి చల్లటి పదార్దాలు పొట్ట మరియు దంతములు రెండింటికి కీడు చేయును . తేనీటిని ప్రతినిత్యం సేవించువారి సంతానం వంశపారంపర్యంగా "గండమాల" అను వ్యాధి సంప్రాప్తిచ్చును . స్త్రీ అధికంగా తేనీరు సేవించుట వలన నాడీదౌర్భల్యం సంభవించును. ముఖ్యంగా గర్భనాడులను దుర్భలపరుచును. దీనివలన ఆ స్త్రీకి కలుగు సంతానముకు వంశపారంపర్య వ్యాధులు సంక్రమించును. ముఖ్యంగా క్షయ , గండమాల వంటి వ్యాధులు సంభంవించును. 


          పైన చెప్పిన విధముగా టీ మరియు కాఫీలను పూర్తిగా నిషేధించి ఆరోగ్యాన్ని కాపాడుకొనగలరు.


       గమనిక -


           నాచే రచించబడిన "ఆయుర్వేద మూలికా రహస్యాలు " , " ప్రాచీన ఆయుర్వేద రహస్యాలు " అను ఈ రెండు గ్రంథముల యందు అత్యంత రహస్యమైన సులభముగా ఇంటి యందు , చుట్టుపక్కల దొరికే మూలికలతోనే పెద్దపెద్ద రోగాలను నయం చేసుకొనే విధముగా అనేక వైద్య యోగాలను ఇచ్చాను. ఈ గ్రంథాలలో ఇచ్చినటువంటి యోగాలు అన్నియు గత 250 సంవత్సరాల నుంచి వంశపారంపర్యముగా మాకు వస్తున్న రహస్యయోగాలు పరోపకారార్థం దాచుకోకుండా ప్రచురించాను.


           మన చుట్టుపక్కల ఉండే మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల బొమ్మలతో మొక్కల చిత్రపటాలు ఇవ్వడం జరిగింది.


            రైతులకు ఉపయోగపడేవిధముగా చెట్లను , భూమిని బట్టి , రాళ్లని బట్టి భూమి యందు జలమును కనుగొను విధానం , ముహూర్తాలను అనుసరించి ఏయే సమయాలలో పంటలు వేయాలి . ఆయుర్వేద మూలికల సహాయముతో పురుగు మందులు వాడకుండా అత్యంత ఎక్కువ దిగుబడులు సాధించే రహస్య వృక్షయుర్వేద యోగాలు , పశువులకు సంబంధించిన వైద్య యోగాలు కూడా ఇవ్వడం జరిగింది . ఈ గ్రంథాలలో ఇచ్చిన యోగాలు ఉపయోగించటం వలన ఎటువంటి వ్యతిరేక ఫలితాలు రావు.


      ప్రాచీన ఆయుర్వేద రహస్యాలు గ్రంథం 288 పేజీలు ఉంటుంది . విలువ 350 రూపాయలు మాత్రమే . ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథం 384 పేజీలు ఉంటుంది . విలువ 450 రూపాయలు . కొరియర్ చార్జి 100 రూపాయలు అదనం .పుస్తకములు ఎక్కువ కాలం మన్నిక కొరకు కుట్టించి ఇవ్వడం మరియు అత్యంత నాణ్యమైన తెల్లటి 80GSM పేపరుతో ఉంటాయి.


            ఈ రెండు గ్రంథాలు కావలసినవారు డైరెక్టుగా 9885030034 నెంబర్ కి ఫోన్ చేయగలరు. కామెంట్లు , మెస్సేజెస్ సమాధానము ఇవ్వబడదు. కాల్ చేయగలరు .


                  కాళహస్తి వేంకటేశ్వరరావు 


                         9885030034 


               అనువంశిక ఆయుర్వేద వైద్యులు