24, నవంబర్ 2025, సోమవారం

మరణం చాలా సూక్ష్మమైనది.

  మరణం చాలా సూక్ష్మమైనది.

ఆత్మ ఈ శరీరంలోంచి వెళ్లిపోయే ముందే, స్మరణ చేత మరల ఉపాధిని వెతికేసుకుంటుంది. మనస్సుకి ఏదో సంస్కారం అలవాటవుతుంది.


అస్తమానూ ఈశ్వరుడి గురించి వినడం అలవాటనుకోండి, భగవంతుని గురించి చెప్పడం అలవాటనుకొండి, భాగవతం చదవడం అలవాటనుకోండి, వాడికి వెళ్ళిపోయేటపుడు కూడా సంస్కారం అక్కడే ఉంటుంది. కాబట్టి వాడు ఉత్తర జన్మలో ఒక మహాపండితుడుకి కొడుకుగా పుట్టి చిన్నతనం నుంచే అన్నీ నేర్చేసుకుని, పరవశించిపోయి, అపారమైన ఐశ్వర్యంతో తులతూగుతూ, పదిమందికి పెడుతూ తాను తింటూ, ఈశ్వరుడిని గురించి చెప్పుకుంటూ, సార్థకత పొంది, ఈశ్వరునిలో కలిసిపోతాడు.

🌹🌹🌹🌹🌹

కామెంట్‌లు లేవు: