25, నవంబర్ 2025, మంగళవారం

శ్రీమద్భగవద్గీత

  శ్రీమద్భగవద్గీత: పదునేడవ అధ్యాయము

శ్రద్ధాత్రయ విభాగయోగము:శ్రీ భగవానువాచ


కట్వమ్లలవణాత్యుష్ణతీక్ష్ణరూక్షవిదాహినః 

ఆహారా రాజసస్యేష్టాః దుఃఖశోకామయప్రదాః (9)


యాతయామం గతరసం పూతి పర్యుషితం చ యత్ 

ఉచ్ఛిష్టమపి చామేధ్యం భోజనం తామసప్రియమ్ (10)



బాగా చేదు, పులుపు, ఉప్పు, వేడి, కారంకలిగి, చమురులేకుండా వెర్రిదాహం పుట్టించే ఆహారపదార్థాలంటే రాజసులకు ఇష్టం. ఇవి శరీరానికి బాధ, మనసుకు వ్యాకులత, వ్యాధులు కలగజేస్తాయి. తామసులకు చల్లబడిపోయింది, సారంలేనిది, వాసనకొడుతున్నది, చలిది, ఎంగిలిది, అపవిత్రమైనది అయిన ఆహారమంటే ఇష్టం.


కృష్ణం వందే జగద్గురుమ్..🙏

కామెంట్‌లు లేవు: