🍃💠 “శివా ప్రభూ… నీ విన్యాసం ఇదేనా?”
శివా…
మంచి మనసు పెట్టుకుని నడిచేవాళ్లకే ఎందుకో ఈ లోకంలో పరీక్షలు ఎక్కువగా వస్తున్నాయి..లోకంలోని మాయ, మోసం, స్వార్థం వారిని వెంటాడుతున్నాయి..
ఎవరికి జాలి, దయ ఉందో, ఎవరు నిజాయితీగా జీవించాలనుకుంటారో… వారికే ఎక్కువ నష్టం, ఎక్కువ బాధ, ఎక్కువ త్యాగం ఎదురవుతోంది..
🔹నిజంగా మంచి వాళ్లే ఎందుకు అకాలమరణం పొందుతున్నారో?
🔹దానం కోసం చాచే చేతులే ముందెందుకు విరిగిపోతాయి?
🔹పరుల బాగుకోసం నడిచే అడుగులే ముందుగా అలసిపోతాయి..
🔹మానవత్వం అనే పడవకు మంచివారే భారం అవుతున్నారా?
🔹శివా.! దయా–హృదయం లేని వాళ్లు, మనసులో మోసం నింపుకున్న నటించే వారు, హాయిగా, భారంలేకుండా నడుస్తున్నట్టు కనిపిస్తారు..
🔹ఏ కష్టం అంటకుండా, ఏ పరీక్షా దరిచేరకుండా నిత్య సుఖంలో తేలియాడుతున్నట్టు కనిపిస్తారు..
ఇది నీ ఆటా ప్రభూ?
🔹ఈ జగన్నాటకంలో నీ నియమం ఇదేనా?
🔹మంచిని నమ్ముకున్న మనసులకు, నిస్వార్థాన్ని పాటించే హృదయాలకు ఇంత కఠిన పరీక్ష ఎందుకు?
కానీ ఒక మాట మాత్రం చెప్తాను శివా— అంతిమ సత్యం ఇదే..
మంచి మనసు పడి చేసిన ఒక్క పని కూడా, ఒక చిన్న దయ కూడా, నీ దృష్టికి అందకుండా ఉండదు కదా..
నీ కనుసన్నల్లో ప్రతిదీ లెక్కించబడుతుంది అంటారు..
🔹మంచి వాళ్ల జీవితం చిన్నదైనా… వారి వెలుగు మాత్రం కాలాతీతం, శాశ్వతం..
🔹లోకం చూడకపోయినా, వారి త్యాగాన్ని గుర్తించకపోయినా,
మరి కలియుగం ధర్మం ప్రకారం, కర్మకు ఫలితం వెంటనే ఉండాలి కదా ప్రభూ?
🔹నిస్సహాయులను బాధించి, కన్నీరు పెట్టిన వారికి, వారి కర్మ ఫలం ఇప్పుడే, ఈ జన్మలోనే ఉండాలి కదా?
అప్పుడు కూడా వారికి శిక్షలు ఉండవా శివా?
చివరిమాట శివా.! ఈ లోకంలో మంచి మనసులకు నువ్వే చివరి ఆధారం గమనించు తండ్రీ.
🙏🕉🙏🕉🙏🕉🙏🕉🙏🕉🙏🕉🙏
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి