12, డిసెంబర్ 2025, శుక్రవారం

దేవతల పేర్లు

  వ్యాపారాల్లో దేవతల పేర్లు వాడటం నిషేధించాలి. 

నిత్యం మనం అనేకచోట్ల దేవి దేవతల పేర్లతో వ్యాపారసంస్థలు ఉండటం చూస్తున్నాము. వ్యాపారవేత్తలకు భక్తి ఉంటే అది వారి దేముడి గది మటుకు ఉంచుకొని బయటకు రాకుండా చూసుకుంటే మన దేముళ్ళ పవిత్రత, పరిశుద్ధత, విలువలను కాపాడినవాళ్లు అవుతారు.  కానీ వారి మనస్సులో కల్మషం ఉన్నా  లేకపోయినా కానీ దేముళ్ళను వారి వారి వ్యాపారాల వరకు తీసుకొని వస్తే అది మన ధర్మానికి అవాంతరంగా మారే ప్రమాదం వున్నది. అది ఎట్లానో చూద్దాం. 

కొంతమంది సారా వ్యాపారాలు చేసే వారు వారి షాపులమీద " ధనలక్ష్మి వైన్స్" శంకర బ్రాందీ షాపు, వెంకటేశ్వర డ్రింక్స్, ఇలా అనేక దేముళ్ళ పేరులమీద ఈ రోజుల్లో వ్యాపారాల షాపుల మీద అమ్మవార్ల బొమ్మలతో సహా పేర్లు ఉండటం మనం అక్కడక్కడ చూస్తున్నాము. అటువంటివి చూసినప్పుడు ఏదో తెలియని మనసులో బాధకలుగుతుంది. ఈ విధంగా మనలో చాలామంది బాధపడి వున్నవార్లు వుంటారు. 

అదే విధంగా అనేక షాపులు కిరాణా షాపులు, ఫాన్సీషాపులు, ఇతర షాపులు, హోటళ్లవాళ్లు కూడా అనేక దేముళ్ళ పేర్లు, ఉపయోగించి వ్యాపారాలు చేస్తున్నారు. 

ఇక లారీ సంస్థలు కూడా భగవంతుని పేర్లతో వ్యాపారాలు చేస్తున్నారు. వీరాంజనేయ లారీ సర్వీస్, వెంకటేశ్వర ట్రాన్స్పోర్టు , కనకదుర్గ లారీ సర్వీసు. ఇలా అనేక పేర్లతో లారీలమీద వ్రాస్తున్నారు. అంతే కాక కార్లు, మినీ బస్సులు అద్దెకు ఇచ్చే వార్లు కూడా దేముళ్ళ పేర్లు పెట్టుకుంటున్నారు. 

పూజా సామానులు.  

అష్టలక్ష్మి దూప్ స్టిక్లు, అంబికా దర్బారుబత్తి ఉదుబత్తులు , ఇలా అనేక వస్తువులమీద దేవి దేవతల పేర్లు  కాకుండా దేవుళ్ళ బొమ్మలు  ముద్రిస్తున్నారు. ఒక్కసారి ఆలోచించండి ఆలా వున్న అట్ట డబ్బాలను మనం చెత్తలో పారేయగలమా మీరే చెప్పండి. ఈ పోస్టుద్వారా అందరికి నేను తెలియచేసేది ఏమిటంటే సాధ్యమైనంతవరకు మన హిందూ దేవుళ్ళ పేర్లను, చిత్రాలను మీ మీ వ్యాపారాలకు ఉపోయోగించకండి. దాని బదులు మీకు నచ్చిన  వస్తువో  జంతువునో మీ వ్యాపారానికి వాడుకోండి. అది ఎట్లానో మీకు ఒక ఉదాహరణ తో చెపుతాను. మనలో చాలామందికి గతంలో హెచ్ యమ్ వి అనే గ్రామఫోను రికార్డులు ఉండేవి వాటి మీద ఒక కుక్క బొమ్మ ఉండేది. అదే విధంగా మనం అనేక జంతువులను, వస్తువులను వ్యాపారానికి పేర్లుగా చిహ్నాలుగా వాడుకోవచ్చు. 

మీకు ఈ పోస్ట్లు నచ్చితే అందరికి పంపి మన హిందూ ధర్మాన్ని కాపాడటం లో మీ వంతు  కృషి  చేయగలరు. 

ప్రతిరోజూ నడుస్తారా

  హరి ఓం ,

               

మీరు ప్రతిరోజూ నడుస్తారా?

పాదాల నుండి పైకి వృద్ధాప్యం పెరుగుతోంది. 


కాబట్టి, మీ పాదాలు బలంగా ఉంటే, వృద్ధాప్యం ఆలస్యంగా వస్తుంది. క్రింద ఉన్న కథనాన్ని చదివి గమనించండి.


వృద్ధాప్యం ఫలితంగా, శరీర కండరాల బలం క్షీణిస్తుంది.

ఇది భయానక పరిస్థితి.


మీరు వీలైనంత ఎక్కువగా నిలబడటం అలవాటు చేసుకోవాలి. వీలైనంత తక్కువగా కూర్చోండి.


మీరు కూర్చోగలిగితే, వీలైనంత తక్కువగా పడుకోండి.


వారు ఆసుపత్రిలో చేరితే, వారిని ఎక్కువగా విశ్రాంతి తీసుకోమని చెప్పకండి.


వారిని పడుకోమని మరియు మంచం నుండి లేవవద్దని సలహా ఇవ్వకండి.


ఒక వారం పడుకోవడం వల్ల కండరాల ద్రవ్యరాశి 5% తగ్గుతుంది.


ఒక వృద్ధుడు వారి కండరాలను పునర్నిర్మించుకోలేరు; అవి కోల్పోయిన తర్వాత, అవి పోతాయి.


సాధారణంగా, సహాయకులను నియమించే చాలా మంది సీనియర్ సిటిజన్లు వేగంగా కండరాల నష్టాన్ని అనుభవిస్తారు.


అత్యంత వేగంగా కండరాల నష్టం కాళ్ళ కండరాలలో జరుగుతుంది.


ఇది చాలా ముఖ్యం ఎందుకంటే ఒక వ్యక్తి కూర్చున్నప్పుడు లేదా పడుకున్నప్పుడు, కాళ్ళు కదలవు మరియు కాళ్ళ కండరాల బలం ప్రభావితమవుతుంది.


మెట్లు ఎక్కడం మరియు దిగడం, తేలికపాటి జాగింగ్ మరియు సైక్లింగ్ అన్నీ కండరాలను నిర్మించగల అద్భుతమైన వ్యాయామాలు.


వృద్ధాప్యంలో మెరుగైన జీవన నాణ్యత కోసం, కండరాల క్షీణతను నివారించడానికి మీ పెద్దలు మరియు ప్రియమైన వారిని వీలైనంత ఎక్కువగా నడవమని ప్రోత్సహించండి.


వృద్ధాప్యం కాళ్ళతో ప్రారంభమవుతుంది!


మీ కాళ్ళను చురుకుగా మరియు బలంగా ఉంచుకోండి.


మనం వయసు పెరిగే కొద్దీ, మన కాళ్ళు ఎల్లప్పుడూ చురుకుగా మరియు బలంగా ఉండాలి.


మీరు కేవలం రెండు వారాల పాటు మీ కాళ్ళను కదపకపోతే, మీ కాళ్ళ బలం వాస్తవానికి 10 సంవత్సరాలు తగ్గుతుంది.


క్రమం తప్పకుండా వ్యాయామం మరియు నడక చాలా ముఖ్యమైనవి.


కాళ్ళు ఒక రకమైన స్తంభం,


మానవ శరీరం యొక్క మొత్తం బరువు దానిపై ఆధారపడి ఉంటుంది.


ప్రతిరోజూ నడవడం చాలా అవసరం.


ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఒక వ్యక్తి యొక్క ఎముకలలో 50% మరియు వారి కండరాలలో 50% కాళ్ళలో ఉంటాయి.


మానవ శరీరంలో అతిపెద్ద మరియు బలమైన కీళ్ళు మరియు ఎముకలు కూడా పాదాలలో కనిపిస్తాయి.


మానవ కార్యకలాపాలు మరియు శక్తిలో 70% పాదాల ద్వారానే ప్రసారం అవుతాయి.


పాదాలు శరీర కదలికకు కేంద్రం.

మానవ శరీరంలోని యాభై శాతం నరాలు మరియు 50 శాతం రక్త నాళాలు పాదాలలోనే ఉన్నాయి మరియు 50 శాతం రక్తం వాటి ద్వారానే ప్రవహిస్తుంది.


వృద్ధాప్యం పాదాల నుండి పైకి ప్రారంభమవుతుంది.


డెబ్బై ఏళ్ల తర్వాత కూడా, మీరు మీ పాదాలకు వీలైనంత ఎక్కువ వ్యాయామం చేయాలి.


మీ పాదాలకు సరైన వ్యాయామం లభిస్తుందని మరియు మీ కాళ్ళ కండరాలు ఆరోగ్యంగా ఉన్నాయని నిర్ధారించుకోవడానికి, ప్రతిరోజూ కనీసం 30-40 నిమిషాల వ్యవధిలో నడవండి.


మనమందరం రోజురోజుకూ వృద్ధాప్యం చెందుతున్నాము కాబట్టి, ఈ కథనాన్ని మీ పరిచయస్తులకు పంపడం మర్చిపోవద్దు. నడిచి, మిమ్మల్ని మీరు యవ్వనంగా ఉంచుకోండి........                  

       🌹*పీపుల్స్ మోటివేషన్*

తెలుగుసూరీడు

 #తెలుగుసూరీడు #చార్లెస్_ఫిలిప్_బ్రౌన్ (Charles Phillip Brown) (నవంబర్ 10, 1798 - డిసెంబర్ 12, 1884). 


ఆయన ఒక భారతీయుడు కాదు..ఒక తెలుగు వాడు కాదు ..అసలు #తెలుగు అనే ఒక భాష ఉందని కూడా ఆయనకు 19 ఏళ్ళు వచ్చేవరకు తెలియదు ..కానీ ఈయనని తెలుగులో మొట్టమొదటి ప్రచురణకర్తగా చెప్పుకోవచ్చు. 200 సంవత్సరాల క్రితమే #తెలుగుభాష ని ఉద్ధరించడం కోసం, తెలుగు సాహిత్యాన్ని అందరికీ అందుబాటులోకి తేవడం కోసం తన జీవితం మొత్తం అంకితం చేసిన మహామనీషి..మహానుభావుడు 🙏 ఈరోజు మనం పురాణాలూ, భాగవతం, భారతం, రామాయణం ,వాఙ్మయం, మను చరిత్ర, వసుచరిత్ర ఇలాంటి పుస్తకాలు తెలుగు అచ్చులో చదువుకోగలుగుతున్నామంటే దీనికి పునాది 200 సంవత్సరాల కిందట భారత దేశానికి చెందని ఒక బ్రిటిష్ దేశస్థుడు చేసిన కృషి. ఆయనే #సీపీబ్రౌన్..చార్లెస్ ఫిలిప్స్ బ్రౌన్….బ్రిటిష్ వారి అంధకార సామ్రాజ్యంలో నుండి పుట్టిన ఒక కాంతి పుంజం. ఆయనకు తెలుగు భాష కోసం తెలుగు ప్రజల కోసం అనుపమానమైన కృషి చెయ్యాల్సిన అవసరం లేదు. మిగతా వారిలా భోగభాగ్యాలు అనుభవించవచ్చు లేదా కేవలం వారి ఉద్యోగ బాధ్యతలు మాత్రమే చూసుకుని ఉండవచ్చు. కానీ ఆయన ఉద్యోగానికి అస్సలు సంబంధం లేని పని..(ఆయన ఉద్యోగం న్యాయ వ్యవస్థకి సంబంధించినది). ఆ ఉద్యోగం చేసుకుంటూనే తెలుగుభాషకి అచ్చు ప్రాణం పోసారు. అదీ తన సొంత ఖర్చు పెట్టడమే కాకుండా ఆ రోజుల్లో 60000 రూపాయలు (200 ఏళ్ళ క్రితమే 60000 రూపాయలు అంటే ఈ రోజుల్లో వాటి విలువ ఎంతో పోల్చలేము ) అప్పు చేసి మరీ తెలుగు భాషకి జీవం పోసిన గొప్ప మహనీయుడు.


చార్లెస్ ఫిలిప్ బ్రౌన్ తెలుగు సాహిత్యమునకు విశేష సేవ చేసిన ఒక ఆంగ్లేయుడు. తొలి తెలుగు శబ్దకోశమును ఈయనే పరిష్కరించి ప్రచురించారు. బ్రౌన్ డిక్షనరీని ఇప్పటికి తెలుగులో ప్రామాణికంగా ఉపయోగిస్తారు. తెలుగు జాతికి సేవ చేసిన నలుగురు ఆంగ్లేయులలో ఒకరిగా బ్రౌన్ ను పరిగణిస్తారు. మిగతా ముగ్గురి పేర్లు ఆర్థర్ కాటన్, కాలిన్ మెకెంజి, థామస్ మన్రోలు. ఆంధ్ర భాషోద్ధారకుడు అని గౌరవించబడిన మహానుభావుడు. వేమన పద్యాలను సేకరించి, ప్రచురించి, ఆంగ్లంలో అనువదించి ఖండాంతర వ్యాప్తి చేశారు.


‘అప్పటికి తెలుగు సాహిత్యం కొనప్రాణంతో కొట్టుకులాడుతోంది. 1825 నాటికి ప్రమిదలో దీపం కొడిగట్టిపోతోంది. తెలుగు సాహిత్యం దాదాపు అంతరించిపోతూ ఉండడం నా కళ్లబడింది. నేను 30 ఏళ్లు కృషి చేసి, దాన్ని పునఃప్రతిష్ట చేశానన్నాడు' బ్రౌన్. నిరాలంకారంగా మాట్లాడ్డం బ్రౌన్ శైలి. ఈ మాటల్లో కూడా అందుకే అతిశయోక్తులు కనిపించవు. 


ఆ రోజుల్లో అసలు తెలుగులో పుస్తకాలు ఏవి ముద్రణ ఉండేవి కావు. తాటాకుల మీద రాసి ఉండేవి. ఆ తాళ పత్ర గ్రంధాలు అసలు ఎక్కడ ఉన్నాయో వెతికి సేకరించి పరిష్కరించడం (వాటిని పండితులతో చదివించి వ్యాఖ్యనాలతో రాసి ముద్రించడం), ఈ సాహిత్యాన్ని పరిష్కరించడమే కాదు తెలుగు భాష అందరికి అందుబాటులో ఉండాలి అంటే ఒక వాచకం ఉండాలి, ఒక వ్యాకరణం ఉండాలి అని ఆలోచించి ఆయన తెలుగు #వ్యాకరణం, #వాచకం , తెలుగు #నిఘంటువులు రాసి ముద్రించడం వంటి కార్యక్రమాలకి శ్రీకారం చుట్టారు. ఆయన సేకరించిన పుస్తకాలన్నీ కలిపితే దాదాపు కొన్ని లక్షల పేజీలు అవుతాయట. కేవలం ఆ కాలంలో ఆయన జరిపిన ఉత్తర ప్రతుత్తరాలే 20 సంపుటాలు (ఒక్కో సంపుటి దాదాపు 400 పేజీలు ) ఉన్నాయట..వీటిల్లో కొన్ని అచ్చు అయినవి మద్రాస్ , లండన్ గ్రంధాలయంలో భద్రపరిచారు.


అసలు 1800 ప్రాంతాల్లో తెలుగు భాష కానీ తెలుగు సాహిత్యం మీద ఆదరణ కానీ విజయనగర రాజుల తర్వాత తగ్గిపోయింది.1806 ప్రాంతాల్లో తెలుగు పుస్తక ప్రచురణ ఆరంభం అయినప్పటికీ 1830 వరకు వేగం పుంజుకోలేదు.అదే తమిళ భాషని తీసుకుంటే 100 సంవత్సరాల క్రితమే ప్రచురణలు ప్రారంభం అయ్యాయి. అచ్చులో పుస్తకాలు లేని రోజులు, తాళపత్ర గ్రంధాల్లో అందునా గ్రాంధిక భాషలో దాగుని ఉన్న సాహిత్యం కేవలం పండితులకి మాత్రమే అర్ధం అయ్యేది. ఈ కారణాల వల్ల ప్రజల్లో నిరక్ష్యరాస్యత బాగా ఉన్న రోజులు అవి.


సీపీ బ్రౌన్ వాళ్ళ నాన్న పేరు రెవరెండ్ డేవిడ్ బ్రౌన్. ఆయన కలకత్తాలో ఉద్యోగం చేస్తూ ఉండేవాడు. ఆయన రెండో భార్యకి పుట్టిన ఇద్దరి అబ్బాయిల్లో చిన్నవాడు సీపీ బ్రౌన్. 1798 నవంబర్ 10 న కలకత్తాలో జన్మించాడు. వాళ్ళ నాన్నగారు ఈ కుర్ర వాడికి ఆయనకు తెలిసిన అరబ్బీ , పార్సీ , హిందుస్తానీ , గ్రీక్ , లాటిన్, హీబ్రు భాషలు పరిచయం చేశాడు. చిన్నతనంలోనే సీపీ బ్రౌన్ హిందుస్తానీ భాషని ఉచ్ఛరించే విధానం అచ్చు భారతీయుల మాటల్లానే ఉండేదట.1812 లో ఆయన తండ్రి చనిపోయాక వాళ్ళ కుటుంబం అంతా లండన్ వెళ్ళిపోయింది . నిజానికి వాళ్ళ నాన్నగారు తన పిల్లలిద్దరినీ మత గురువులుగా క్రైస్తవ ప్రచారకులుగా చెయ్యాలని అనుకున్నారట. కానీ ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు పిల్లలిద్దరికి చేయూతని అందించడంతో వాళ్ళు లండన్ కళాశాల హైల్బెరీలో చదువు కొనసాగించారు. ఆ కళాశాలలో సంస్కృతం కూడా చెప్తూ ఉండేవాళ్ళు.


ఆయనకు 18 సంవత్సరాలప్పుడు ఉద్యోగరీత్యా ఈస్ట్ ఇండియా కంపెనీ వారు వాళ్ళ అన్నయ్యని కలకత్తాకి, సీపీ బ్రౌన్ ని మద్రాస్ కి పంపించారు. ఆయన మద్రాస్ కి రాకపోయి ఉంటే మరి తెలుగుభాష చరిత్ర ఎలా ఉండేదో !


అలా ఆయన 1817, ఆగష్టు 4న మద్రాస్ చేరుకున్నారు. కంపెనీ వాళ్ళు ఆయనని నువ్వు విధులు నిర్వహించాల్సినది తెలుగుదేశంలో కనుక ముందు తెలుగు నేర్చుకోమని చెప్పారు. అప్పటి వరకు ఆయనకు తెలుగు అనే ఒక భాష ఉంటుందని కూడా తెలియదు . వెలగపూడి కోదండరామ పంతులు గారి చేత ఆయనకు 19 వ యేట తెలుగులో అక్షరాభ్యాసం జరిగింది. అలా ఆయన 3-4 సంవత్సరాలు మద్రాస్ కళాశాలలో తెలుగు మొదటి భాషగా మరాఠీ రెండో భాషగా నేర్చుకుని ఉత్తీర్ణులు అయ్యారు. తమిళ రాష్ట్ర గవర్నర్ థామస్ మన్రో గారి చేతుల మీదగా ఆయన సర్టిఫికెట్ పుచ్చుకున్నారు. గవర్నర్ గారు ఆ సమావేశంలో తెలుగు భాష గొప్పతనం, ఆ ప్రజల అలవాట్లు, పద్ధతులు ఆచార్య సంప్రదాయాలు అన్నీ చక్కగా బ్రౌన్ కి వివరించారు.


1820 లో కడపలో కలెక్టర్ కి (హాన్బెరీ) సహాయకుడిగా బ్రౌన్ ని నియమించారు. ఆ కలెక్టర్ గారు కూడా తెలుగులో అనర్గళంగా మాట్లాడటంతో బ్రౌన్ కి తెలుగు అంటే ఇంకా మక్కువ అయ్యింది. ఆ రెండు సంవత్సరాలు తెలుగు ప్రజలని గమనించడానికి, తెలుగు భాష మీద పట్టు తెచ్చుకోవడానికి ఆయనికి చాలా ఉపయోగపడ్డాయి. 1824 నుండి ఆయన తెలుగుభాష సేవా ప్రస్థానం మొదలయ్యింది . 


ఒకసారి ‘Hindu manners, customs and ceramonie s’ అనే పుస్తకం ఆయన కంటపడింది. ఆ పుస్తకంలో వేమన ఒక కవి అని, ఆయన పద్యాలు వేమన శతకంలో రాసారని, తెలుగు ప్రజలలో ఆ పద్యాలు మమేకం అయ్యాయని, కానీ ఆ పద్యాలు ఇప్పుడు ఎవరికి అందుబాటులో లేవు అని రాసి ఉంది. అది ఆయన జీవితంలో పెద్ద మలుపు. అప్పటి నుండి ఆయన వేమన పద్యాలన్నీ తాళపత్ర గ్రంధాల్లో ఉన్నాయని తెలుసుకుని వాటన్నిటిని అన్వేషించి సేకరించారు. ఆ సమయంలో ఆయన మచిలీపట్టణం కోర్టులో జడ్జికి రిజిస్ట్రారుగా పనిచేస్తూ ఉండేవారు. ఆ కోర్టులోనే పని చేసే భత్యం అద్వైత బ్రహ్మ శాస్త్రి, ఆయన స్నేహితుడు డిప్పబట్ల వెంకటశివశాస్త్రి గార్లతో కలసి తాళపత్ర గ్రంధాల్లో ఉన్న పద్యాల అర్ధాలు తెలుసుకుని వాటికి తాత్పర్యం వ్రాయించి పరిష్కరించడం మొదలు పెట్టారు. వాళ్ళు తెలుగులో వ్యాఖ్యానం రాస్తే ఈయన వాటికి ఇంగ్లీష్ లో అర్ధాలు రాసేవారు. అలా 6-7 నెలలు వివిధ కవులతో క్షుణ్ణంగా చర్చలు జరిపి ఆ పద్యాలకి అర్ధవంతమైన వ్యాఖ్యానంతో ఒక శుద్ధ ప్రతిని తయారు చేశారు. ఈ సందర్భంలోనే ఆయన తెలుగు వ్యాకరణం, ఛందస్సు, నిఘంటువులు మీద పరిశోధనలు జరిపారు. మద్రాస్ యూనివర్సిటీ వాళ్ళ సహాయంతో ఈ పుస్తకాలన్నీ ప్రచురితమయ్యాయి. 


1827 లో కడపలో ఒక పెద్ద బంగాళా కొని దాంట్లో ఒక వైపు తోట ఇంకో వైపు స్కూల్, గ్రంధాలయం, తెలుగు పండితులు, కవులు, రాసేవాళ్ళని, పరిష్కరించేవాళ్ళని అందరినీ ఒకే చోటకి తెచ్చి ఒక కుటీర పరిశ్రమలా తన సొంతఖర్చులతో స్థాపించారు. పైడిపాటి వెంకటనర్సయ్య గారిని వేమన పద్యాలు పరిష్కరించడానికి, కంభం నృసించార్య అనే ఆయన రాఘవ పాండవీయానికి వ్యాఖ్యానం రూపొందించడానికి ఇలా ఒక్కక్కరికి ఒక్కో పని అప్పచెప్పి వీళ్లందరినీ చూసుకోవడానికి అయోధ్యాపురం కృష్ణారెడ్డి అనే ఆయన్ని నియమించారు. 1829 లో కొన్ని రోజులు తిర్చురాపల్లి కోర్టులో రిజిస్టరుగా పనిచేసినప్పుడు తమిళ్ భాషకి తెలుగుకి ఉన్న తేడా గమనించారు.


1832 లో గుంటూరుకి కలెక్టర్ గా పని చేసేటప్పుడు విపరీతమైన కరువు కాలంలో ప్రజలకి గంజి సరఫరా చేసే కేంద్రాలని స్థాపించి సహాయం చేశారు. మచిలీపట్టణంలో ప్రెస్ స్థాపించి సొంతంగా పుస్తకాల ముద్రణ చేయడం మొదలు పెట్టారు. 1834 లో ఉద్యోగరీత్యా రాజమండ్రి బదిలీ అయ్యినప్పుడు ఎవరో ఒకతని కుట్రకారణంగా ఉద్యోగం పోగొట్టుకోవలసి వచ్చింది . అలా ఆయన 1834 లో లండన్ వెళ్ళిపోయి అక్కడ ఉన్న రెండు ఏళ్ళలో తెలుగు వ్యాకరణం రాశారు. తిరిగి 1837 లో మళ్ళీ భారతదేశంలో ఒక పర్షియన్ అధికారికి అనువాదకుడిగా చేరారు. కాలేజీ బోర్డు అనే సంస్థ సభ్యుడిగా ఉండి చాలా పుస్తకాలు ముద్రణ చేయించారు. 1839లో వేమన పద్యాల రెండవ ప్రతిని, 1841లో నలచక్రవర్తి అనే ద్విపద కావ్యం , 1842లో గౌరన హరి చంద్రోపాఖ్యానం , నలనాద చరిత్ర అనే ద్విపద కావ్యం అచ్చు వేయించారు. 1842 ఆగష్టు 4 న వర్తమాన తరంగిణి అనే పేపర్లో మహాభారతం, ఆదిపర్వం పుస్తకాలు 8 రూపాయలకు లభ్యం అనే ప్రకటనలు చూడవచ్చు. కేవలం పుస్తక ప్రచురణే కాకుండా మచిలీపట్టణంలో ఒక స్కూల్, కడపలో ఒక స్కూల్, మద్రాస్ లో ఒక ప్రీస్కూల్ తన సొంత ఖర్చులతో నడిపారు . ఈ సమయంలోనే ఈయన ఒక ఇంగ్లీష్ వ్యాపారి దగ్గర అప్పులు చేయాల్సి వచ్చింది. ఎంత ఆర్ధిక బాధలు ఉన్నా నెలనెలా 150 మంది వికలాంగులకు, దాన ధర్మాలకి 500 రూపాయలు ఖర్చు చేస్తుండేవారు.


1845లో ఈయన సేకరించిన 2500 తాళ పత్ర ప్రతులని రాసిన పుస్తకాలని మద్రాస్ లిటరరీ సొసైటీ వారికి బహుకరించారు. మద్రాస్ లో పోస్టుమాస్టర్ జనరల్ గా స్థిరమైన ఉద్యోగం వచ్చాక సంస్కృతంలో ఉన్న భగవద్గీత, నల సావిత్రి హితోపదేశం, మాఘరాట్నం , కవితారత్నాకరం, అమరం పుస్తకాలని తెలుగులిపిలో ప్రచురించారు. 1855 లో ఉద్యోగ విరమణ చేసి లండన్ వెళ్ళి , లండన్ యూనివర్సిటీలో తెలుగు ప్రొఫెసర్ గా తన జీవిత చరమాంకం వరకు సేవలందించారు 


1817 నుండి 1834 దాక 17 ఏళ్ళు ,1838 నుండి 1855 దాక మరో 17 ఏళ్ళు మొత్తం 34 ఏళ్ళు భారత దేశంలో సివిల్ ఉద్యోగి లాగా సామ్రాజ్యతత్వ వలసతత్వ ప్రతినిధిగా, తెలుగువాళ్ళ మధ్య బ్రతికి, తెలుగు సాహిత్య అధ్యాయానికి , ఉద్ధరణకు తనలోని జీవశక్తులన్నీ ఖర్చు చేసి తెలుగు సంస్కృతిని, తెలుగు భారతిని తన రక్తంలో జీర్ణింప చేసుకుని తన తత్త్వంలో ఒక ప్రధాన భాగం చేసుకున్న బ్రౌన్ తెలుగు వాళ్లపై ఒక లివింగ్ అథారిటీలా లండన్ లో కాలు పెట్టారు. 1868 లో తెలుగు ఛందస్సు పుస్తకం రాసి పునఃప్రచురించారు.


ఈ తెలుగు సూర్యుడు 1884 డిసెంబర్ 12 న తన స్వగృహము 22 కిల్డారే గార్డెన్స్, లండన్లో అవివాహితునిగానే మరణించాడు.


తెలుగు భాషకు చేసిన సేవ:

1.వేమన పద్యాలను వెలికితీసి ప్రచురించాడు. 1829లో 693 పద్యాలు, 1839లో 1164 పద్యాలు ప్రచురించాడు.

2.1841లో "నలచరిత్ర"ను ప్రచురించాడు.

3. "ఆంధ్రమహాభారతము"

4. "శ్రీమద్భాగవతము" 

5. 1840లో తెలుగు నేర్చుకునే ఆంగ్లేయుల కొరకు వాచకాలు, వ్యాకరణ గ్రంథాలు రాసాడు.

6.లండన్‌లోని "ఇండియాహౌస్ లైబ్రరీ"లో పడి ఉన్న 2106 దక్షిణ భారత భాషల గ్రంథాలను మద్రాసు తెప్పించాడు. "హరిశ్చంద్రుని కష్టాలు" గౌరన మంత్రిచే వ్యాఖ్యానం వ్రాయించి 1842లో ప్రచురించాడు.

7. 1844లో "వసుచరిత్ర"'

8.1851లో "మనుచరిత్ర" ప్రచురించాడు. జూలూరి అప్పయ్య శాస్త్రి చేత వీటికి వ్యాఖ్యానాలు రాయించాడు.

9.1852లో "పలనాటి వీరచరిత్ర" ప్రచురించాడు.


రచనలు:

1.ఆంధ్ర గీర్వాణ చందము కాలేజి ప్రెస్సు, మద్రాసు -1827.

2.లోకం చేత వ్రాయబడిన శుభ వర్తమానము, బైబిల్ కథల తెలుగు అనువాదం

3.రాజుల యుద్దములు, అనంతపురం ప్రాంత చరిత్ర 4.తెలుగు-ఇంగ్లీషు (1852), ఇంగ్లీషు-తెలుగు (1854), మిశ్రభాషా నిఘంటువు, జిల్లా నిఘంటువు, లిటిల్ లెక్సికన్ (తెలుగు వాచకాలకు అనుబంధమైన నిఘంటువు)

5.తెలుగు వ్యాకరణము - 1840లో ప్రచురణ

6. వేమన పద్యాలకు ఆంగ్ల అనువాదం


ఇతరుల ప్రశంసలు:

నాటి పండితుడు, అద్వైత బ్రహ్మ శాస్త్రి: "సరస్వతికి ప్రస్తుతమందు తమరు ఒకరే నివాస స్థానంగా కనపడుతున్నారు. ఎక్కడ ఏయే విద్యలు దాచబడి ఉన్నవో అవి అన్నీ తమంతట తామే తమ సన్నిధికి వస్తూ ఉన్నవి... తమరు పుచ్చుకున్న ప్రయాసల వల్ల తేలిన పరిష్కార గ్రంథములు ఆకల్పాంతమున్నూ తమయొక్క కీర్తిని విస్తరిస్తూ ఉంటవి"


ప్రముఖ భాషా పరిశోధకుడు బంగోరె (బండి గోపాల రెడ్డి) : "నిలువ నీడ లేకుండా పోయిన తెలుగు సరస్వతిని ఆహ్వానించి, తన బంగళాలో ఒక సాహిత్య పర్ణశాల ఏర్పరచి, ఆ వాగ్దేవిని నిండు ముత్తైదువ లాగా నడయాడేటట్లు చేయగలిగాడు బ్రౌన్"


బంగోరె: "ప్రపంచంలోని తెలుగు ప్రొఫెసర్లు, పరిశోధకులు, విద్యావేత్తలు, సాహితీ సంస్థలు అన్నీ కలిసి తెలుగు భాషకు చేసిన సేవ, బ్రౌను ఒక్కడే చేసిన సేవలో ఓ చిన్న భాగం కూడా కాదు"


బంగోరె: సీపీ బ్రౌన్‌ తెలుగు సూరీడు. కారణజన్ముడు. ఆయన మనకు మిగిల్చిపోయిన అక్షర సామ్రాజ్యం ఎంతో విశాలమైంది.


"సి.పి.బ్రౌను అను నాతడు ఆంధ్రభాషామతల్లి సేవకే జన్మమెత్తినట్లు కానవచ్చుచున్నది. ఇతడు ఆంధ్ర వాజ్మయాభివ్రుద్దికి చేసినంతటి పని ఇటీవలి వారెవ్వరూ చేయలేదని చెప్పిన అతిశయోక్తి కానేరదు" - కొమర్రాజు లక్ష్మణరావు


"ఆంధ్రభాషోద్దారకులలో కలకాలము స్మరింపదగిన మహనీయుడు, మహావిద్వాంసుడు సి.పి.బ్రౌను" – వేటూరి ప్రభాకరశాస్త్రి


స్మృతి చిహ్నం:

బ్రౌను స్మృతి చిహ్నంగా, కడపలో ఆయన నివసించిన బంగళా స్థలంలో బ్రౌన్ మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రభుత్వము మరియు ప్రజల నిధులు మరియు సహకారంతో బ్రౌన్ గ్రంథాలయాన్ని నిర్మించింది. వివిధ సంస్థలు, వ్యక్తులు గ్రంథాలను విరాళంగా ఇచ్చారు.2006 నవంబర్ 10 న భాషాపరిశోధనా కేంద్రంగా యోగి వేమన విశ్వవిద్యాలయంలో భాగమైంది.


ఆయనలా మనం తాళపత్ర గ్రంధాలు సేకరించక్కర్లేదు..నిఘంటువులు రాయక్కర్లేదు..అప్పు చేసి మరీ తెలుగు భాషకి సేవ చెయ్యక్కర్లేదు..తెలుగులోనే మాట్లాడి..మన పిల్లలకి తెలుగు నేర్పించుకుని వాళ్ళతో కొన్ని మంచి తెలుగు పుస్తకాలు చదివించి తెలుగుని బతికించుకుంటే చాలేమో.. అవే ఆయనకు మనం ఇచ్చే ఘన నివాళులు..🙏

ఆన్లైన్లో సంగీతం క్లాసులు

ఆన్లైన్లో సంగీతం క్లాసులు


 ఆన్లైన్లో కర్ణాటక సంగీత క్లాసులు కండక్ట్ చేయబడుతున్నాయి మీ పిల్లలకి సంగీతం నేర్పించదల్చుకుంటే వెంటనే ఈ పోస్ట్ కింద కామెంట్ రూపంలో మీరు తెలియజేయగలరు. మీ వాట్సాప్ నంబర్ తెలియజేస్తే వాట్సాప్ ద్వారా మేమే మిమ్మల్ని కాంటాక్ట్ చేయగలము. మీరు పెట్టిన కామెంట్లు ఈ బ్లాగులో ఎవరికి కనబడవు. 


మీరు ప్రపంచంలో ఏ దేశంలో ఉన్నా పర్వాలేదు ఆన్లైన్లో క్లాసులు అటెండ్ కావచ్చు 


ప్రస్తుతం అమెరికాలో వివిధ రాష్ట్రాల నుంచి విద్యార్థులు ఉన్నారు.

వేద ఆశీర్వచనం.

  *నమస్తే సదా వత్సలే మాతృ భూమే*


*కలియుగాబ్ది 5126*

*శ్రీ శాలివాహన శకం 1947 స్వస్తి శ్రీ చాంద్రమాన విశ్వావసు నామ సంవత్సరం దక్షిణాయనము - హేమంత ఋతువు - మార్గశిర మాసం - కృష్ణ పక్షం - అష్టమి - ఉత్తరాఫల్గుణి -‌‌ భృగు వాసరే* (12.12.2025)


ప్రముఖ వేదపండితులు, తణుకు /తాలూకా ఇరగవరం వాస్తవ్యులు 

*బ్రహ్మశ్రీ గుళ్ళపల్లి శివశర్మ ఘనపాఠీ* *(9491391009, 9440091234)* గారి నేటి వేద ఆశీర్వచనం.





.🙏🙏 

భవదీయుడు

దశిక ప్రభాకరశాస్త్రి 

9849795167

----------------------------------------------

*పిల్లలకి బతుకుతో పాటు భారతీయత కూడా నేర్పండి*

పురోహితుడు

 పూర్వ కాలంలో “పురోహితుడు” అంటే ఒక ఉద్యోగం కాదు – ఒక పధవి, ఒక పరమపూజ్య స్థానం*


పురోహితుడు అనేది

మూడు లోకాలకూ అనుసంధానం కలిగించే వ్యక్తి.


*దేవునికి – మనిషికి మధ్య వారధి.*

*వేదాలకు – మన కుటుంబానికి మధ్య దారి.*

*నీతికి – నిత్యానికి మధ్య దిశ.*


ఇప్పుడు మనం చూస్తున్న “పూజలు చేయడం, పండుగలు చేయడం” మాత్రమే వారి పని కాదు…

పూర్వ కాలంలో పురోహితుడు ఒక ఇంటి ఆధ్యాత్మిక శిరస్త్రాణం.


*పురోహితులకు రాజులు కూడా తల వంచిన సంఘటనలు*


*ఉదాహరణ 1: విశ్వామిత్రుడు – దశరథుడిపై కోపం వస్తె రాజ్యమే వణికింది*


రామాయణంలో

విశ్వామిత్ర మహర్షి కోపజ్వాల రాజ్యంలో వ్యాపిస్తే

రాజు దశరథుడు చేతులు జోడించాడు.


👉 ఎందుకు?

పురోహిత శక్తిని రాజు అధికారాన్ని కూడా మించినట్లు భావించేవారు కాదు.

వారి శాపం— రాజ్యాన్ని దహించగలదు.

వారి అనుగ్రహం— తరాలను రక్షిస్తుంది.


*ఉదాహరణ 2: వశిష్ఠ మహర్షి మాట = రాజ్యం ధర్మం*


అయోధ్యలో వశిష్ఠుడు చెప్పే మాట

అది చట్టం.

అది ధర్మం.

అది నిర్ణయం.


రాజు, రాణి, మంత్రి, ప్రజలు—

వేడుకల్లో, నిర్ణయాల్లో, రాజ్యపాలనలో కూడా

వశిష్ఠుని ధర్మబోధను శిరస్సువంచి పరిగణించేవారు.


*ఉదాహరణ 3: శుక్రాచార్యుల ఆశీస్సు లేకుండా అసురులు యుద్ధం ప్రారంభించేవారు కాదు*


దైత్యులు కూడా

తమ గురువు శుక్రాచార్యుని మాటను మించేవారు కాదు.


👉 అర్థం ఏమిటి?

పురోహితుడు అనేది కేవలం పండుగ చేసే వాడు కాదు…

ఆధ్యాత్మిక వ్యూహరచన చేసే గురువు.


*ఉదాహరణ 4: యుధిష్ఠిరుడు – బంధువుల కంటే పురోహితులకు ఎక్కువ గౌరవం*


మహాభారతంలో, యుధిష్ఠిరుడు యుద్ధం ముందు కూడా

ద్రోణాచార్యుడు, కృపాచార్యుడు, వ్యాస మహర్షి…

వీరిని మొదట నమస్కరించేవాడు.


*పురోహితుల గౌరవం ఎందుకు అంత ఎక్కువగా ఉండేది?*


*1. వేదాలు, ఉపనిషత్తులు, యజ్ఞాలు— వీటి కాపాడేవారు పురోహితులే*


అక్షర గణాన్నే గుండెల్లో పెట్టుకుని

తరాలకి అందించిన వారు వీరే.


👉 జ్ఞాన పరంపర = పురోహితుల భుజాలపై.


*2. పూర్వీకులు, దైవం, విశ్వశక్తి – వీటన్నిటిని ఇంటికి అనుసంధానించే శక్తి*


ఒక ఇంటి సమస్యల నుంచి

ఒక ఇంటి అభివృద్ధి వరకు

అన్నీ పురోహితుని మార్గదర్శనంలోనే జరిగేవి.


*3. వివాహం, సీమంతం, నామకరణం, గృహప్రవేశం, శ్రాధ్ధం… జీవనచక్రాన్ని నడిపే శక్తి*


ఒక కుటుంబానికి “జీవన చక్రం” ఎవరూ నడుపుతారు?

*పురోహితుడు.*


ఈ క్రియలు కేవలం రీతులు కాదు—

మనసు, శరీరం, వాతావరణం, ఆత్మకి సంబంధించిన శుద్ధి పద్ధతులు.


*4. పురోహితుల శాపం = ధర్మ విపరిత పరిణామం, ఆశీస్సు = తరాల అభివృద్ధి*


శాపం అనే పదం వెనక ఉన్న అర్థం భయం కాదు…

*దుర్వ్యవహారం → దుర్ఫర ఫలితం*

*సద్గుణం → శుభఫలం*


ఈ నియమం సమాజాన్ని సక్రమ దారి పట్టించింది.


*పురాతనంలో పురోహితుల పట్ల సమాజం చూపిన గౌరవ ఉదాహరణలు*


*ఉదాహరణ 1: ఇంట్లో పురోహితునికి మొదటి స్థానం*


పురోహితుడు ఇంట్లోకి వస్తే:


ముందు సీటు


ముందే నీళ్లు


ముందే తామరపువ్వులా మాట్లాడటం


ఆయనకోసం ప్రత్యేక ఆహారం


ఆయన కూర్చునే చోట శుద్ధి


ఈ గౌరవం అప్పట్లో సామాన్యం.


*ఉదాహరణ 2: “గురువు బ్రహ్మ గురువు విష్ణు…” – గురువును దైవ స్థానం పెట్టిన మన సంస్కృతి*


పురోహితుడు, గురువు, ఆచార్యుడు

మూడు వేరు కాదు.

మూడు రూపాలు— ఒక్కటే సత్యం.


*ఉదాహరణ 3: తరం నుంచి తరానికి పురోహిత కుటుంబాలకే పెళ్లిళ్లు*


ఎందుకు?


👉 ఒకే విలువలు

👉 ఒకే సంస్కారం

👉 ఒకే ఆచారం

👉 ఒకే దార్శనికత

👉 ఒకే ఆధ్యాత్మిక వాతావరణం

👉 వేదాధ్యయనం రెండింట్లో కూడా కొనసాగుతుంది


అందుకే

పురోహితుడు → పురోహిత కుటుంబమే

ఇది కేవలం కులం కాదు— *పవిత్రమైన పాత్ర పరిరక్షణ.*


*ఇప్పుడు పరిస్థితి ఎందుకు దిగజారింది?*


*1. జీతం, హోదా, డబ్బు— విలువల్ని మించి చూచిన సమాజం*


ఇప్పుడు పెళ్లిళ్లలో మొదటి ప్రశ్న:


👉 జీతం ఎంత?

👉 ఉద్యోగం ఏంటి?


నీతి, జ్ఞానం, ధర్మం → పట్టు వదిలాయి.


*2. టెక్నాలజీ, అర్బన్ లైఫ్ – ఆధ్యాత్మిక అనుబంధాన్ని తగ్గించాయి*


దేవాలయం → “ఫ్రీ టైం ఉన్నప్పుడు వెళ్లే స్థలం” అయిపోయింది.


ఇంట్లో ఒక కార్యక్రమంలో బ్రహ్మ స్థానం లో ఉండే ఇంటి పురోహితుడు → “ఘట్టాలకే వచ్చే వ్యక్తి” అయిపోయాడు.


*3. విలువలు బలహీనపడ్డాయి, గౌరవం కూడా తగ్గింది*


పురోహితుని పని అనేది పండగా చేయడం కాదు—

*మన ఇంటి శక్తిని నిలబెట్టడం.*


ఇది మర్చిపోయింది సమాజం.


*రమాదేవి గారు చెప్పిన బాధ – విలువలు కూలిపోతున్న శబ్దం*


పురోహితుడి కూతురిని పురోహితుడికి ఇవ్వకపోవడం


పురోహితులే తమ పాత్రను తగ్గించుకుపోవడం


సమాజం ఆధ్యాత్మికతను కన్నా “ఆఫీసు/ఉద్యోగం”ను పెద్దది చూడడం


యువత పెళ్లి నిర్ణయాలను ప్రేమ, ఫ్యాషన్, స్వేచ్ఛ ఆధారంగా తీసుకోవడం


ఆడపిల్లలు, మగపిల్లల పాత్రలు మారిపోవడం


ఇవి యాదృచ్ఛికం కాదు—

*మూలాలు బలహీనపడితే… కొమ్మలు పాడవుతాయి.*


*మనం మళ్లీ పురాతన గౌరవాన్ని సంపాదించాలంటే?*


👉 పురోహితుల పాత్రను సమాజంలో తిరిగి వెలుగులోకి తీసుకురావాలి.

👉 పిల్లలకు వేద సంప్రదాయాలు, సంస్కారం నేర్పాలి.

👉 పురోహిత కుటుంబాల విలువను గుర్తించాలి.

👉 ఆధ్యాత్మికత & వేద జ్ఞానం అనే శక్తి మనకు ఎంత ముఖ్యమో అర్థం చేసుకోవాలి.

👉 “ఉద్యోగం” కన్నా “ఉత్తమ గుణాలు” ఎక్కువ విలువైనవి అని పిల్లలకు తెలియజేయాలి.


*ముగింపు*


పురోహితుడు అనేది కేవలం పూజారి కాదు…

*మన సంస్కృతి యొక్క ప్రాణం.*

*మన పూర్వీకుల జ్ఞానానికి నడక.*

*మన కుటుంబ అభివృద్ధికి ఆశీర్వాదం.*

*మన ధర్మానికి రక్షణ.*


ఆ స్థానం తగ్గినప్పుడు

సమాజం కూడా తగ్గిపోతుంది.

నేటి పరిస్థితి అదే.

ఆచార్య సద్బోధన*



               *ఆచార్య సద్బోధన*

                   ➖➖➖✍️

```

ఒక పాము ఒక వడ్రంగి దుకాణంలోకి దూరి, అక్కడ వున్న ఱంపం పై నుండి పాకినప్పుడు పాముకు స్వల్పంగా గాయమైంది. 


వెంటనే పాము కోపముతో ఱంపమును గట్టిగా కరిచింది. 


ఈసారి పాము నోటిలో పెద్ద గాయమై రక్తం వచ్చింది. 


పాముకు అసలేమి జరుగుతుందో తెలియక, ఱంపం తనపైన దాడి చేస్తుందనుకొని, వెంటనే ఱంపమును గట్టిగా చుట్టుకుని, తన బలమంతా ఉపయోగించి, ఱంపమునకు ఊపిరి అందకుండా చేసి చంపివేయాలని నిర్ణయించుకొని, చివరికి తన ప్రాణం మీదకే తెచ్చుకొంది.


మనము కూడా కొన్ని సమయాలలో ఆలోచన లేకుండా, ఆవేశంలో మనకు కష్టం కలిగించిన వారిపై ఇలానే స్పందించి‌, చివరకు మనమే ఆపదలకు గురి అవుతాము. అవతలి వ్యక్తికీ అసలు జరిగిన దానికీ సంబంధం లేదని తెలుసుకొనే లోపు, జరగవలసిన నష్టం జరిగి పోతుంది.


జీవితంలో ప్రశాంతంగా ఉండాలంటే కొన్నిసార్లు అనవసరమైన కొన్ని పరిస్థితుల్ని, మనుషులను, వారి ప్రవర్తనను, వారి మాటలను, అసూయలను మరియు ద్వేషాలను పట్టించుకోకుండా ఉండాలి. కొన్ని సార్లు అసలు రియాక్ట్ కాకపోవడమే ఆరోగ్యానికి మంచిది.✍️```

. *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

                       🌷🙏🌷```

 🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏```

🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

*రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*

                     ➖▪️➖


తెరిచే సాధనం :*

 


              *తెరిచే సాధనం :*

                ➖➖➖✍️


*ఒకానొకప్పుడు ఒక నగరంలోని ఇరుకైన వీధుల మధ్య పాత తాళాలు బాగుచేసే దుకాణం ఉండేది.*


*అక్కడికి తాళం కప్పలు, తాళాలు కొనేందుకు జనం వచ్చేవారు. కొన్నిసార్లు, తాళాలు పోగొట్టుకున్నవారు నకిలీ తాళాలను కూడా అక్కడ చేయించుకునే వారు.*


*దుకాణం తాళాలు పగులగొట్టడానికి అప్పుడప్పుడు ఉపయోగించే భారీ సుత్తి కూడా అక్కడ ఉండేది.*


*’చిటికెలో ఎంతటి బలమైన తాళాలైనా తెరవగలిగే ఈ చిన్న తాళాలలో ఏముంది, నేను మాత్రం ఆ తాళంకప్ప మీద చాలా దెబ్బలు వేయాల్సి ఉంటుంది', అని సుత్తి తరచుగా ఆశ్చర్యపోయేది.*


*ఓ రోజు తట్టుకోలేక దుకాణం మూసేశాక సుత్తి, ఓ చిన్న తాళం చెవిని అడిగాడు, “అక్కా, ఇంత బలంగా ఉన్న నేనే తెరవలేని మొండి తాళంకప్పలను తెరిచే శక్తి నీలో ఏముందో చెప్పు?"*


*తాళంచెవి చిరునవ్వుతో ఇలా అంది, "నిజానికి, మీరు తాళాలు తెరవడం కోసం వాటిని కొట్టడానికి బలప్రయోగం చేస్తారు, ఆ క్రమంలో వాటిని పగులగొడతారు.*


*నేను ఎప్పుడూ తాళాన్ని గాయపరచను, దాని లోపల నా స్థానాన్ని ఏర్పరుచుకోవడం ద్వారా నేను దాని హృదయాన్ని తాకుతాను. ఆ తర్వాత, తెరవమని అభ్యర్థిస్తాను, అది వెంటనే తెరుచుకుంటుంది."*


*మిత్రులారా, మానవ జీవితంలో కూడా అదే జరుగుతుంది. మనం నిజంగా ఎవరినైనా గెలవాలంటే, వారిని మన సొంతం చేసుకోవాలి, అప్పుడు మాత్రమే మనం ఆ వ్యక్తి హృదయంలోకి ప్రవేశించగలం.*


*ఎవరితోనైనా బలవంతంగా పని చేయించడం సాధ్యమే, కానీ ఆ విధంగా, మనం తాళాన్ని తెరవం, బదులుగా దానిని పగలగొడతాం.*


*అంటే, మనం ఆ వ్యక్తి యొక్క ప్రయోజనత్వాన్ని, సహజమైన ప్రతిభను నాశనం చేస్తాం. అయితే, ప్రేమతో ఒకరి హృదయాన్ని గెలుచుకోవడం ద్వారా, మనం వారిని ఎప్పటికీ మన స్నేహితునిగా చేసుకుంటాం. వారి ఉపయోగాన్ని, సమర్ధతను అనేక రెట్లు పెంచుతాం.*


*బలంతో సాధించగలిగినవన్నీ ప్రేమతో కూడా సాధించవచ్చు, కానీ ప్రేమతో సాధించగలిగేవన్నీ బలంతో సాధించలేము.*


♾️♾♾♾♾♾♾♾


స్వభావంలో తీవ్రమైన వినమ్రతను సృష్టించుకోండి, తద్వారా ఎవరి హృదయానికి ఎటువంటి హాని కలిగించడానికి మొగ్గు చూపనంతగా ప్రేమ భావనతో అది నిండిపోతుంది. ✍️

. *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

                       🌷🙏🌷```

 🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏```

🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

*

తల్లితండ్రులు- పిల్లల బాధ్యత*

 


   *తల్లితండ్రులు- పిల్లల బాధ్యత*

               ➖➖➖✍️



*తల్లి తండ్రులకు కంటనీరు పెట్టించిన వారు ఎంత దురదృష్టవంతులో ఆనంద భాష్పాలు తెప్పించిన వారు అంతటి అదృష్టవంతులు.*


*వాళ్ళు ఉన్నంత కాలము మనము ఉంటాము. మనం ఉన్నతం కాలము వాళ్ళు ఉండరు.*


*బిడ్డలు శక్తి సామర్ధ్యాలు పొందే కాలంలో తల్లి తండ్రులకు శక్తి సామర్ధ్యాలు తగ్గిపోతాయి.*


*బిడ్డలకు ఉన్నతమైన భవితపై ఆశలు చిగురించే సమయంలో తమ భవితపై అంతులేని అనిశ్చితికి లోనయ్యే సమయం వారిది.*


*బిడ్డలకు కొత్త కొత్త ప్రపంచాలు ఏర్పడే కాలంలో బిడ్డలే తమ ప్రపంచంగా మారే కాలం తల్లి తండ్రులది.*


*రేపటి అంతులేని ఆశ బిడ్డలది. రేపటిపై అర్ధంకాని అయోమయం తల్లి తండ్రులది.*


*తమ జీవితాలని పెట్టు బడిగా పెట్టి పిల్లల భవితను తీర్చి దిద్దిన తల్లితండ్రులకు కొంత ప్రేమ మరికొంత ఆసరా ఇంకొంత ధైర్యం కలిగించవలసినది ఆ బిడ్డలే!*


*తమకంటూ ఏమి మిగుల్చుకోని తల్లి తండ్రుల త్యాగాలను గుర్తించకున్నా బాధ పడని తల్లితండ్రులు ఏవోవో కోరికలతో అత్యాశలతో స్థాయికి మించి పిల్లల కోరికలతో నిష్టురంగా మాట్లాడితే కలిగే బాధ వర్ణనాతీతము.*


*జీవితాన్నిచ్చిన తల్లితండ్రులకు రెండు పూటలా తిండితో పాటు రెండు మాటలు ప్రేమతో మాట్లాడితే ఎంత ఆనందిస్తారో ..!*


*ఏ తల్లి తండ్రులు బిడ్డలకు భారంగా మారాలని కోరుకోరు. తమ పనులు తాము చేసుకుంటూ దాటిపోవాలనే ఆశిస్తారు. అలా జరగనప్పుడు వారి ఆఖరి ప్రయాణానికి అంతులేని ప్రేమను పంచి ఆనందంగా ముగించటం బిడ్డల బాధ్యత.*


*ఆ దేవుడు కూడా మెచ్చుకొనేది అటువంటి జీవులనే. తల్లి తండ్రులను గౌరవించని వాడు ఎన్ని పూజలు చేసినను ఆ దేవదేవుడు స్వీకరించడు.*✍️

. *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

                       🌷🙏🌷```

 🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏```

🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

*