17, డిసెంబర్ 2025, బుధవారం

సాలగ్రామము

 సాలగ్రామము గురించి సంపూర్ణ వివరణ - 

          

 సాలగ్రామము ఒకవిధమైన శిలాజాతికి చెందినది. యావత్ ప్రపంచము నందు ఈ విధమైన శిలలు రెండు స్థలముల యందు తప్ప ఇంక ఎక్కడా దొరకవు. ఒకటి నేపాల్ నందు ఖాట్మండు నగరమునకు ఉత్తరమున గండకీ నది తీరమున ముక్తినాధమను పేర ప్రసిద్ధమై ఉన్నది సాలగ్రామక్షేత్రం. ఈ నది నుండి సాలగ్రామములు తీయుదురు. దీనిని నారాయణీనది అని అందురు. రెండోవది హిందూ దేశము నందలి నర్మదా నది యందు దొరుకును. 

                  

      ముత్యము ఏ విధముగా ఒక పురుగు నుండి తయారగునో అదేవిధముగా ఈ సాలగ్రామం కూడా ఒక పురుగు నుండి తయారగును. 1000 సంవత్సరములు గడిచిన తరువాత ఇది గట్టిపడి శిల వలే తయారగును. ఈ విధముగా శిల వలె తయారైన తరువాత దీనికి చెకుముకి రాయి గుణములు వచ్చును. ఈ గుణము రావడానికి ముందు ఇది సున్నపు (calcium ) అంశమును కలిగి ఉండును. 

              

    సాలగ్రామము నిజమునకు రాయిగా మారిన సముద్రజీవి . ఇది " జురాసిక్ టెతీన్ " కాలమునకు చెందినది. సంస్కృత భాషలో సాలగ్రామం అను మాటకు "శిలగా మారిన శలభము" అని అర్థం కూడా ఉన్నది. రుద్రాక్ష ఎంత పెద్దది అయితే అంత మంచిది . సాలగ్రామము ఎంత చిన్నదైన అంత మంచిది . ఇట్లు అనేక సంవత్సరముల అనంతరం ఇది ఒక ఆకారమునకు వచ్చిన పిదప దీనికి ఔషధ గుణములు వచ్చును. దీనికి ఉదాహరణగా టెంకాయ గురించి చెప్తాను. టెంకాయ లేతకొబ్బరి నీరు నందు ఒక గుణం ఉండును. కాయ అయిన తరువాత మరియొక గుణం వచ్చును. ఇది ప్రకృతి నియమం. ఇదేవిధముగా సాలగ్రామమునకు కూడా అనేక వేల , లక్షల సంవత్సరాల తరువాత ఈ ఔషధోపయుక్త గుణములు వచ్చును. 

                

. ఈ గుణమును నీటితో అభిషేకించు సమయము నందు ఎలక్ట్రోమ్యాగ్నటిక్ ఆక్టివిటీ నీటియందు ప్రవేశించును. ఆ అభిషేకపు నీటిని మనము తీర్థపు నీటిగా స్వీకరిస్తాము. దీనితో సాలగ్రమము నందు గల ఔషధోపయుక్త గుణము కలిగిన నీటిని మనము స్వీకరించినట్లుగా అగును. 

              

      సాలగ్రామము పూజ చేయుటకు పెద్దపెద్ద మంత్రాలు పాటించవలసిన అవసరం లేదు . కేవలం " ఓం నమో నారాయణాయ నమః " అను మంత్రము పఠిస్తూ అభిషేకం చేయవచ్చు. శుభ్రముగా స్నానం ఆచరించిన పిదప రెండు చిన్న పాత్రలలో నీరు నింపి ఉంచుకొనవలెను. వాని యందు తులసీదళములను వేసి భక్తిశ్రద్ధలతో "ఓం నమో నారాయణాయ నమః" అంటూ మట్టిపాత్రలను ముట్టి జపించవలెను. తర్వాత శంఖంతో ఆ నీటిని తీసుకుని నారాయణ మంత్రంతో సాలగ్రామమును అభిషేకించవలెను . మొదటిపాత్రతో అభిషేక తీర్థమును పారబోయవలెను. రెండోవమారు రెండొవపాత్రలోని నీటితో అభిషేకమాచరించిన నిర్మల తీర్ధం అగును. దానిని శంఖముతో దేవునికి అర్పించి తాను స్వీకరించవలెను. 

              తర్వాత మరలా రెండుపాత్రల యందు నీరు నింపి ఒకదానిలో గంధం , పుష్పములు , తులసి మొదలగు వానిని వేయవలెను. మరియొక దానియందు తులసి మాత్రమే వేయవలెను . గంథం వేసిన నీటిని గంధోదకం అందురు. మరియొకటి శుద్ధోదకం. మొదట సంకల్పము " భారతీరమణ ముఖ్యప్రాణాంతర్గత లక్ష్మీనారాయణ స్య పూజాఖ్యంకర్మ కరిష్యే" అని చెప్పి పూజను ప్రారంభించవలెను. ఘాంటానాదము గావించి శంఖము నందు నీరు నింపి పుష్పములు , తులసి ఉంచి 8 మార్లు " ఓం నమో నారాయణాయ " అని జపించి నీటిని ప్రతిమలకు , తనకు మొదలు అన్నింటికి ప్రోక్షణం చేసుకొనవలెను . దీనితో మనం పవిత్రులమగుదుము . 

              

     నల్లగా నిగనిగా మెరిసే ఈ అతినున్నటి రాళ్లకు చిన్నరంధ్రం ఉంటుంది. ఆ రంధ్రం నుంచి చూచినప్పుడు లొపల కొన్ని యంత్రాల వంటి గీతలు ఉంటాయి. ఆ రాళ్లను అడ్డంగా సమంగా రెండుచెక్కలుగా కోసి చూస్తే ఆయా దేవతలకు సంబంధించిన యంత్రాలు స్పష్టంగా కనిపిస్తాయని , కొంత బంగారం కూడా ఉంటుందని పెద్దలు చెప్తారు. లోపలనున్న యంత్రాలను బట్టి ఆయా సాలగ్రామాలను ఆయాదేవతలకు మూర్తులుగా భావించి ఆరాధిస్తారు. మిక్కిలి బరువుగాను , బలిష్టంగానూ ఉండే ఈ శిలలను పగలగొట్టకుండానే లోపలి యంత్రాలను గుర్తిస్తారు. ఈ సాలగ్రామాలకు అడుగున పైనా రాగిలోహాన్ని ఉంచితే గనుక అవి నిజమైన సాలగ్రామ శిలలు అయితే ప్రదిక్షణ క్రమంలో కదులుతాయి.  

          

      ధనుర్మాసం నందు సాలగ్రామ పుజ చేయుట వలన సర్వపాపాలు హరిస్తాయి. 

   


   ఆయుర్వేదములోని ఎన్నొ రహస్య మూలికల అనుభవ యోగాల గురించి నా గ్రంథాల యందు సంపూర్ణముగా , అందరికి అర్థమయ్యే సులభ భాషలో వివరించాను . వాటిని చదివి మరింత విజ్ఞానాన్ని పొందగలరు . 

 


గమనిక -

      


నేను రాసిన " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు " మరియు " ఆయుర్వేద మూలికా రహస్యాలు " రెండు గ్రంథాలలో ఎన్నొ రహస్య చిట్కాలు , మా కుటుంబపరంగా గత 250 సంవత్సరాల నుంచి మా పెద్దవారు మాకు అందించిన ఎంతో అనుభవసారాన్ని ఈ గ్రంథాలలో అందరి అర్థం అయ్యే విధంగా సామాన్య బాషలో వివరించాను. ఇంట్లో ఉండి మరియు అందుబాటులో ఉన్న వాటితోనే పెద్ద పెద్ద రోగాలు నయం చేసుకునే విధంగా అత్యంత సులభయోగాలు మన ప్రాచీన భారతీయులు రచించిన చెట్లను బట్టి భూమిలో నీటిని కనుక్కునే విధానాలు , వృక్షాలకు ఆయుర్వేద మూలికల ఉపయోగించి దిగుబడి పెంచే వృక్షాయుర్వేద చిట్కాలు , రైతులకు ఉపయోగపడే విధంగా ఏయే నక్షత్రాలలో పంటలు వేస్తే ఫలితాల ఎక్కువుగా ఉంటాయో తిథి, నక్షత్ర, వారాలతో సహా ఇవ్వడం జరిగింది. ఆయుర్వేదం నేర్చుకోవాలి అనుకునేవారికి ఇది మంచి దిక్సూచిలా ఉపయోగపడును. 

            నా మూడొవ గ్రంథము నందు 50 రకాల మొక్కల గురించి అత్యంత విపులంగా ఇవ్వడం జరిగింది . ఈ మొక్కలన్నియు ప్రతి ఒక్కరికి తెలిసినవి మరియు మన ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటివే . ఈ గ్రంధములలో మీకు లభ్యమయ్యే సమాచారం మరే గ్రంథములలో లభ్యం అవ్వదని చెప్పగలను . మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల చిత్రములు కూడా ఇవ్వడం జరిగినది . ఏయే జబ్బులకు ఎటువంటి ఆహారపదార్థాలు తీసుకోవలెనో , తీసుకోకూడదో కూడా సంపూర్ణముగా మీకు ఇందులో లభ్యం అగును . ఔషధాలు మరియు తీసుకోవాల్సిన ఆహారవిహారాలు ఒకేదగ్గర లభ్యం అగును . 

   ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు గ్రంథము 288 పేజీలతో ఉండును . దీని విలువ 400 రూపాయలు , ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథము 384 పేజీలతో ఉండి 500 రూపాయలు , సర్వమూలికా చింతామణి గ్రంథము 352 పేజీలతో ఉండును . దీని విలువ 550 రూపాయలు . అందరికి అర్ధమయ్యేలా సులభ బాషలో ఉండును. గ్రాంథిక భాష ఉపయోగించలేదు . 

                ఈ గ్రంథములు కావలసిన వారు 9885030034 నంబర్ కు Phonepay or Googlepay or Paytm కు డబ్బు పంపించి ఇదే నంబర్ కు Whatsup నందు screenshot పెట్టి మీ పూర్తి Adreass ఇవ్వగలరు . కొరియర్ చార్జీ 100 రూపాయలు అదనం .

            

           కాళహస్తి వేంకటేశ్వరరావు .

             

. అనువంశిక ఆయుర్వేద వైద్యులు .

                         

                    9885030034

సంపూర్ణ మహాభారతము*

 🔯🌹🌷🏹🛕🏹🌷🌹🔯

*🪷బుధవారం 17 డిసెంబర్ 2025🪷*

``

           *ప్రతిరోజూ*

*సంపూర్ణ మహాభారతము*

  సరళ వ్యావహారిక భాషలో!

                            7️⃣7️⃣

*ప్రతిరోజూ భారతం చదవండి భగవద్ అనుగ్రహం పొందండి!*

*భారతంలో ఉండేది భూమిపై ఎక్కడైనా ఉంటుంది భారతంలో లేనిది భూమిపై ఎక్కడా లేదు*``


     *సంపూర్ణ మహాభారతము*           

                    *77 వ రోజు*                   


*వన పర్వము ద్వితీయాశ్వాసము*

```

ఒకరోజు బృహదశ్వుడు అనే ముని పాండవుల వద్దకు వచ్చాడు. ధర్మరాజు ఆ మునికి అతిధిసత్కారాలు కావించి కౌరవుల వలన తాము పడుతున్న బాధలు అన్నీ వివరించి “మహాత్మా! రాజ్యాన్ని, నివాసాన్ని పోగొట్టుకుని మాలాగ అడవిలో కష్టాలు పడుతున్నవారు ఎవరైనా ఉన్నారా? ఉంటే చెప్పండి” అని అడిగాడు. 


అందుకు బృహదశ్వుడు “ధర్మరాజా! నీవు కష్టాలు పడుతూ అడవులలో ఉన్నా, నీ వెంట నీ అన్నదమ్ములు, నీ భార్యా, నీ హితం కోరే విప్రులు నీ వెంట ఉన్నారు. పూర్వం నలుడనే మహారాజు నీవలె జూదంలో సర్వం కోల్పోయి, పుష్కరునికి రాజ్యాన్ని అప్పగించి భార్యా సమేతుడై ఒంటరిగా అరణ్యాలకు వెళ్ళాడు", అని చెప్పాడు. 


అది విని ధర్మరాజు “మహత్మా! నాకు నలుని కథ వివరించండి” అని అడిగాడు.```


      *నలదమయంతులు*```


బృహదశ్వుడు ధర్మరాజుకు ఇలా వివరించ సాగాడు.. 

“నిషిధదేశాన్ని వీరసేనుడి కుమారుడైన నలుడు పరిపాలిస్తున్నాడు. తన పరాక్రమంతో ఎన్నో దేశాలను జయించి ప్రజారంజకంగా పరిపాలిస్తున్నాడు. అతనికి జూదం అంటే ఎక్కువ ప్రీతి. ఆ కాలంలో విదర్భ దేశాన్ని భీముడనే రాజు పరిపాలిస్తున్నాడు. చాలా కాలం అతనికి సంతానం లేదు. అతనికి దమనుడు అనే ముని ఇచ్చిన వరము వలన దమయంతి అనే కూతురు, దముడు, దమనుడు, దాంతుడు అనే కుమారులు కలిగారు. దమయంతి సౌందర్యరాశి, గుణవంతురాలు. దమయంతి నలుని గుణగణాలను గురించి విన్నది. నలుడు దమయంతి గురించి, ఆమె సౌందర్యం గురించి విన్నాడు. ఇరువురి నడుమ ప్రేమ అంకురించింది.```


*నలదమయంతుల మధ్య హంస రాయబారం*```

ఒకరోజు నలుడు ఉద్యానవనంలో ఉండగా హంసల గుంపు వచ్చి అక్కడ వాలింది. ఆ హంసలను చూసి ముచ్చట పడి నలుడు వాటిలో ఒకదానిని పట్టుకున్నాడు. మిగిలిన హంసలు తోటి హంసను విడిచి వెళ్ళలేక ఆకాశంలో తిరుగుతున్నాయి. నలునితో అతని చేతిలోని హంస మానవభాషలో ఇలా అన్నది. “ఓ మహారాజా! నీవు దమయంతిని ప్రేమిస్తున్నావు. నేను దమయంతి వద్దకు వెళ్ళి నీ గురించి, నీ అందచందాల గురించి గుణగణాల గురించి చెప్పి నీమీద అనురాగం కలిగేలా చేస్తాను” అని పలికింది. 


ఆ హంస పలుకులు విని నలుడు ఆనంద పడి, దానిని విడిచిపెట్టాడు. ఇచ్చిన మాట ప్రకారం ఆ హంస విదర్భదేశానికి ఎగిరిపోయింది. 


అంతఃపురం ముందు విహరిస్తున్న హంసను చూసి దమయంతి ముచ్చట పడింది. చెలికత్తెల సాయంతో దమయంతి ఆ హంసను పట్టుకుంది. ఆ హంస దమయంతితో “దమయంతీ! నేను నీ హృదయేశ్వరుడైన నలుని వద్ద నుండి వచ్చాను. నలుడు సౌందర్యవంతుడు, సంపన్నుడు, సద్గుణ వంతుడు. నీవు సౌందర్యంలో, గుణంలో అతనికి తగినదానివి. అతనికి భార్యవైతేనే నీకు రాణింపు" అని పలికింది. 


దమయంతి “ఓ హంసా! నలుని గురించి నాకు ఎలా చెప్పావో అలాగే నలునికి నా గురించి చెప్పు" అన్నది. ఆ హంస అలాగే చేసింది. ఇలా ఇరువురికి ఒకరిపై ఒకరికి అనురాగం అధికమైంది.``` 


            *(సశేషం)*

*సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

             🌷🙏🌷```


*🚩జై శ్రీ కృష్ణ!   జై శ్రీ కృష్ణ!🚩* 


*ఆధ్యాత్మిక బృందం* నుండి వచ్చింది                     

                *సేకరించి*

*భాగస్వామ్యం చేయడమైనది*


 *న్యాయపతి నరసింహారావు*

🙏🌷🪷🪔🛕🪔🪷🌷🙏