20, డిసెంబర్ 2025, శనివారం

సమస్త మంగళప్రదం

  *పారిజాత పుష్పాలు ఎందుకు కొయ్యకూడదు?*

🔔 *తెలుసుకొందాం* 🔔


✨ *పారిజాత పుష్పాల ఆధ్యాత్మిక విశిష్టత* ✨


🌺 క్రింద పడిన పారిజాత పుష్పాలతోనే దేవుడిని పూజ చేయాలని ఎందుకు చెబుతారో తెలుసా?


🌿 *పారిజాతం ప్రత్యేకత*


• పారిజాత వృక్షం దైవ స్వరూపంగా పరిగణించబడుతుంది.


• ఈ పుష్పాలతో పూజ చేస్తే భగవంతుని అనుగ్రహం తప్పక లభిస్తుంది.


• పురాణాల ప్రకారం పారిజాత వృక్షం సముద్ర మథనంలో ఉద్భవించింది.


• తర్వాత విష్ణువు స్వర్గానికి తీసుకెళ్లగా, సత్యభామ కోరిక మేరకు శ్రీకృష్ణుడు భూలోకానికి తెచ్చాడు.



🌸 ఎందుకు కిందపడిన పుష్పాలనే వాడాలి?


• సాధారణంగా పూలను కోసి పూజ చేస్తారు.


• కానీ పారిజాత పువ్వు మాత్రం భూమిని తాకిన తర్వాత మాత్రమే స్వామికి సమర్పించాలి అని శాస్త్రం చెబుతుంది.


• ఎందుకంటే ఇది స్వర్గం నుంచి భూలోకానికి వచ్చిన వృక్షం 🌿.


• అందుకే కిందపడిన పువ్వు భూమిని తాకిన తర్వాతే పవిత్రమవుతుంది.


• కిందపడిన పువ్వులను మాత్రమే ఆవుపేడతో అలికిన నేల నుండి ఏరుకొని దేవుడికి సమర్పించాలి.



🌼 పారిజాతం ఇంటి ఆవరణలో ఉంటే…


🌟 ఆ ఇంటిలో ఎప్పుడూ సిరి సంపదలు, ఐశ్వర్యం నిలుస్తాయి అని పురాణ వచనం.



🌺 పారిజాత పుష్పాలు 9 రకాలు 🌺


1. ఎర్ర (ముద్ద) పారిజాతం ❤️


2. రేకు పారిజాతం 🍃


3. తెలుపు–ఎర్ర కాడతో (సాధారణంగా కనిపించేది) ⚪🔴


4. పసుపు పారిజాతం 💛


5. నీలం పారిజాతం 💙


6. గన్నేరు రంగు పారిజాతం 🌺


7. గులాబీ రంగు పారిజాతం 🌸


8. తెల్లని పాలరంగు పారిజాతం 🤍


9. ఎర్ర రంగు పారిజాతం 🔴


⚠️ ఎరుపు రంగు పారిజాతం విష్ణు ఆరాధనకు వాడరాదు.


ఎందుకంటే ఎరుపు = తమోగుణం, కానీ విష్ణువు = సత్వగుణం.



🕉️ పారిజాతం వరప్రసాదం 🕉️


• పారిజాత వృక్షం తపస్సు చేసి,


🌸 “నా పుష్పాలను కోయకూడదు, తానే ఇచ్చినప్పుడు మాత్రమే వాడాలి” అనే వరం పొందింది.


• అందువల్లే కిందపడిన పువ్వులను మాత్రమే తీసుకుని పూజకు వాడడం పవిత్రం.


🌟 *పారిజాతం యొక్క పంచస్పర్శ మహిమ* 🌟


భూ స్పర్శ 🌍 + మృత్తికా స్పర్శ 🪨 + జల స్పర్శ 💧 + హస్త స్పర్శ ✋ + స్వామి స్పర్శ 🙏


➡️ ఈ ఐదు స్పర్శలతో కలిసిన పారిజాతం పంచమహా పాతకాలను తొలగిస్తుంది.

💐 అందుకే పారిజాతం పుష్పాలు – కిందపడినవే పవిత్రమైనవి, పూజకు ఉత్తమమైనవి అన్నది పురానవచనం.


✨ పారిజాత పుష్పం భగవంతుని అనుగ్రహానికి దివ్య ద్వారం. ✨


✨శ్రీ పారిజాత పుష్ప సమర్పణం సమస్త మంగళప్రదం కావాలి.✨

కామెంట్‌లు లేవు: