🕉 మన గుడి : నెం 1332
⚜ తమిళనాడు : కోడుముడి - ఈరోడ్
⚜ శ్రీ ముఘ్దేశ్వర్ ఆలయం
💠 బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు వేరు వేరుగా ఆలయాలు మనం చూస్తూనే ఉంటాం కాని ఒకే ఆలయంలో త్రిమూర్తులు ముగ్గురూ కొలువు తీరి ఉండటం చాలా అరుదుగా చూస్తాం. అలాంటి ఒక ఆలయమే తమిళనాడులోని ఈరోడ్ దగ్గరలో ఉన్న కొడుముడి దేవాలయం.
ఈ ఆలయం కావేరి నది ఒడ్డున కలదు..
💠 ఈ విశాలమైన ఆలయంలో తూర్పు వైపున 3 ప్రవేశ ద్వారాలు ఉన్నాయి.
మధ్య ద్వారానికి ఉత్తరాన కొడుముడి నాథర్ మరియు మకుటేశ్వరర్ అని పిలువబడే ప్రధాన దైవం శివుని మందిరానికి ప్రవేశ ద్వారం ఉంది. మధ్య ద్వారానికి దక్షిణాన పన్మోళి నాయకి మరియు సౌందరంబిక అని పిలువబడే తల్లి పార్వతిదేవి ఆలయానికి ప్రవేశ ద్వారం ఉంది. విష్ణువును వీరనారాయణ పెరుమాళ్ అని పిలుస్తారు.
కుంచితపాద నటరాజర్ తన రెండు పాదాలను నేలపై ఉంచాడు, ఎడమ పాదం పైకి లేచింది.
💠 ఇక్కడి శివుడిని ముఘ్దేశ్వర్ అని, అమ్మవారిని సౌందర్యవల్లి అని అంటారు.
💠 ఈ ఆలయ పురాణం అగస్త్య మహర్షికి సంబంధించినది .
ఒకసారి ఆ మహర్షి విగ్రహం అదృశ్యమవుతుందని గమనించి, తన చేతిలో ఆ విగ్రహాన్ని పట్టుకున్నాడు మరియు ఆయన వేలిముద్రలు ఆ దేవతపై కనిపిస్తున్నాయి.
💠 పాండ్యరాజులు ఈ ఆలయాన్ని క్రమం తప్పకుండా పోషించారు మరియు పాండ్య రాజుల సంబంధం కారణంగా, ఈ శివస్థలాన్ని తిరుప్పండికొడుముడి అని పిలుస్తారు.
💠 ఒక పురాణగాథ ప్రకారం ఆదిశేషుడికి, వాయుదేవుడికి మధ్య ఎవరి బలం గొప్పదో అనే దాని మీద వాదోపవాదాలు జరిగి ఇద్దరు మేరు పర్వతం దగ్గరకి వచ్చి యుద్ధానికి తలపడ్డారు.
ఆదిశేషుడు మేరు పర్వతాన్ని గట్టిగా పట్టుకుని ఉండగా వాయుదేవుడు తన శక్తి మేర గట్టిగా ఊదితే అతని ప్రతాపానికి ఈ పోరాటంలో మేరు పర్వతం పైభాగం ఐదు ముక్కలుగా (కొన్ని ఏడు అని చెబుతారు) విరిగి వివిధ ప్రదేశాలలో రత్నాలుగా పడిపోయింది, వాటిలో తిరువన్నమలై, రత్నగిరి (తిరువత్పోకి), ఈంగోయిమలై మరియు పోతిగైమలై ఉన్నాయి.
💠 ఇక్కడ ఒక వజ్రం పడి స్వయంభు లింగంగా మారింది. ఆదిశేషుని సంబంధం దృష్ట్యా, ఈ ఆలయం నాగదోషాన్ని తొలగించడానికి కూడా ప్రసిద్ధి చెందింది మరియు పాములను మగుడితో మచ్చిక చేసుకోవడం వల్ల, ఇక్కడ శివుడిని మగుడేశ్వరర్ అని పిలుస్తారు.
💠 అలా వజ్రంతో సమానమైన మేరు పర్వత శిఖర భాగం వచ్చి ఈ కొడుమూడిలో పడి శివలింగ రూపం దాల్చింది. అదే ముఘ్దేశ్వర శివలింగం.
💠 శివుడి పెళ్లి జరిగిన తరువాత పార్వతి దేవితో కలిసి అగస్త్య మహర్షికి ఈ ప్రదేశంలోనే ప్రధమ దర్శనమిచ్చారు. అలాగే భరద్వాజ మహర్షికి శివుడి తాండవం చూసే అదృష్టం కూడా ఈ ప్రదేశంలోనే కలిగింది.
💠 ఈ ఆలయ ప్రాంగణంలోనే భరద్వాజ తీర్థం, దేవ తీర్థం, బ్రహ్మ తీర్థం అనే మూడు తీర్థాలని మనం చూడవచ్చు.
💠 ఇక విష్ణుమూర్తి రూపాన్ని వీర నారాయణ పెరుమాళ్ అని అంటారు. అమ్మవారిని తిరుమంగ నాచియార్ అని పిలుస్తారు.
పెళ్లికాని వారు ఇక్కడ పరిహార పూజలు చేయించుకుంటే వెంటనే పెళ్లి కుదురుతుందనే ఒక నమ్మకం కూడా ఉంది.
అంతేకాదు రాహు కేతువులకు కూడా పహిహార పూజలు చేసుకోవచ్చు. కుజదోషం ఉన్నవారు ఇక్కడ ప్రత్యేక పూజలు చేస్తూ ఉంటారు.
మొత్తానికి ఎలాంటి జాతక దోషాలకైనా ఇక్కడ పరిహార పూజలు చేయటం పరిపాటి.
💠 బ్రహ్మ దేవుడు ఒక చెట్టు రూపంలో ఉండటం ఇక్కడి మరొక విశేషం.
వణ్ణి చెట్టుగా పేరుపొందిన ఈ మహావృక్షం దాదాపు 3000 సంవత్సరాల నాటిదని చెప్తున్నారు ఆలయ నిర్వాహకులు.
ఈ చెట్టుకున్న మరొక విశేషం దీనికి ఒక వైపు ముళ్ళు ఉంటే మరో వైపు ఉండవు, అంతేకాదు దీనికి పళ్ళు పువ్వులు కూడా కాయవు.
ఈ చెట్టు ఆకు ఒక్కటైనా ఒక బిందెడు నీళ్ళల్లో వేసి ఉంచితే ఆ నీళ్ళు ఎన్నాళ్లయినా పాడవ్వవు అని ఇక్కడి భక్తుల నమ్మకం.
💠 ఈ ఆలయంలో అనేక గణేశులు ఉన్నప్పటికీ, వాటిలో ముఖ్యమైన వ్యక్తిని కావేరీ కంద గణేశన్ (కావేరీని చూసినవాడు) అని పిలుస్తారు. వయస్సుకు సమానమైన కుండలతో వినాయకుడికి అభిషేకం చేయడం ఈ ఆలయంలో చాలా ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది.
💠 ఈ ఆలయంలోని మరొక ప్రత్యేక వినాయకుడిని వ్యాక్రపాద వినాయకుడు అని పిలుస్తారు, ఎందుకంటే ఆయన పులి పాదాలను కలిగి ఉంటాడు మరియు ఈ మూర్తి ఒక స్తంభంలో కనిపిస్తాడు!
ఈ రకమైన మూర్తి మరే ఇతర ఆలయంలోనూ కనిపించడు.
ఏనుగు మొహంతో ఉండే వినాయకుడికి కాళ్ళు మాత్రం పులి పంజాలా ఉంటాయి.
💠 బ్రహ్మోత్సవం తమిళ మాసం చిత్తిరైలో జరుపుకుంటారు.
పంగుని మరియు ఆవణి అనే తమిళ నెలలలో 4 రోజుల పాటు సూర్యకిరణాలు శివుడు మరియు అంబాల్ గర్భగుడిలో ప్రకాశిస్తాయి.
💠 ఈ ఆలయం ఈరోడ్ జిల్లాలోని కరూర్ నుండి 25 కి.మీ మరియు ఈరోడ్ నుండి 40 కి.మీ దూరంలో ఉంది . ఈరోడు - కరూర్ రైల్వే లైన్ లో కొడుముడి రైల్వే స్టేషన్ వస్తుంది..
Rachana
©️ Santosh Kumar
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి