3, డిసెంబర్ 2025, బుధవారం

శ్రీమద్భగవద్గీత

  శ్రీమద్భగవద్గీత: పదునేడవ అధ్యాయము

శ్రద్ధాత్రయ విభాగయోగము:శ్రీ భగవానువాచ


ఓం తత్సదితి నిర్దేశో బ్రహ్మణస్త్రివిధః స్మృతః 

బ్రాహ్మణాస్తేన వేదాశ్చ యజ్ఞాశ్చ విహితాః పురా (23)


తస్మాదోమిత్యుదాహృత్య యజ్ఞదానతపఃక్రియాః 

ప్రవర్తంతే విధానోక్తాః సతతం బ్రహ్మవాదినామ్ (24)



పరబ్రహ్మకు ఓమ్ తత్ సత్ అనే మూడు పేర్లు చెప్పారు. పూర్వం దానివల్లనే బ్రాహ్మణులు, వేదాలు, యజ్ఞాలు సృష్టించబడ్డాయి. వేదవేత్తలు శాస్త్రోక్తంగాచేసే యజ్ఞాలు, దానాలు, తపస్సులను ఎప్పుడూ “ ఓమ్ ” అని చెప్పిన తరువాతే ఆరంభిస్తారు.


కృష్ణం వందే జగద్గురుమ్..🙏

కామెంట్‌లు లేవు: