3, జూన్ 2023, శనివారం

సీతారాములకళ్యాణము

 *సీతారాములకళ్యాణము* (1/4)


పుల్లెల శ్రీరామచంద్రుడు వారి వచన రామాయణము బాలకాండము నుండి….


తెల్లవారిన పిమ్మట జనకమహారాజు ప్రభాతసమయమున చేయవలసిన కార్యములన్నియు నిర్వర్తించి రామలక్ష్మణసమేతుడైన విశ్వామిత్రుని పిలిపించెను. 


జనకుడు విశ్వామిత్రుని, రామలక్ష శ్రణులను యధావిధిగా గౌరవించి విశ్వామిక్రునితో, “పూజ్యుదా! నీకు స్వాగతమగుగాక! నేను నీకేమి చేయుదును? ఆజ్ఞాపింపుము. నేను నీచే ఆజ్ఞాపింపదగినవాడను.” అని పలికెను.

జనకుని మాటలు విని, విశ్వామిత్రుడు, “దశరథుని పుత్రులు, క్షత్రియులు, లోకప్రసిద్దులు అయిన ఈ రామలక్ష్మణులు నీవద్ద నున్న (శ్రేష్టమైన ధనుస్సును చూడదలచుచున్నారు.. ఆ ధనుస్సును చూపుము. నీకు భద్రమగుగాక! ఈ రాజకుమారులు దానిని చూచి, కోరిక తీరగా వారి ఇష్టము ప్రకారము తిరిగి వెళ్లిదరు.” అని చెప్పెను.


*శివధనువృత్తాంతము*

విశ్వామిత్రుని మాటలు విని జనకుడు ఈవిధముగ ప్రతివచనము పలికెను, “మహామునీ! ఈ ధనుస్సు ఇచట ఎందువలన ఉన్నదో ఆ వృత్తాంతమును చెప్పెదను, వినుము. ఈ ధనుస్సును మహాత్ముదైన శివుడు నిమిచక్రవర్తికి ఆరవవాదైన దేవరాతు డనెడు రాజువద్ద న్యాసముగా ఉంచెను.

పూర్వము దక్షయజ్జధ్వంసము చేయుచు వీర్యవంతుడైన రుద్రుడు ధనుస్సును వంచి, కుపితుదై దేవతలతో, “దేవతలారా! యజ్ఞభాగముల నపేక్షించుచున్న నాకు మీరు యజ్ఞభాగములను కల్పింపలేదుగాన ఈ ధనుస్సుతో మీ శిరస్సులను ఖండించెదను.' అని పలుకగా ఆ దేవతలందరును భయపడి మహేశ్వరుని అనుగ్రహింపచేసుకొనిరి. మహేశ్వరుడు దేవతలను అనుగ్రహించి ఆ ధనుస్సును వారికి ఇచ్చివేయగా దానిని దేవతలు మా పూర్వపురుషుని వద్ద న్యాసముగా ఉంచిరి. 


నేనొకప్పుడు యజ్ఞభూమిని దున్ని పరిశుద్ధము చేయుచుండగా సీత అను కన్య నాగలినుండి బయటకు వచ్చి నాకు లభించినది. భూమినుండి బయటకు వచ్చిన ఆమె నా కుమార్తెగా పెరిగినది. అయోనిజ యైన ఈమెను వివాహమాడవలెనన్నచో పరాక్రమమే శుల్కమని నేను నిశ్చయించితిని. 


మహామునీ! భూతలమునుండి ఆవిర్భవించి, నా కుమార్తెగా పెరుగుచున్న ఈమెను వివాహము చేసుకొనుటకు ఎందరో రాజులు వచ్చిరి. ఆ రాజులందరును వచ్చి కన్యనిమ్మని కోరగా, ఈమె వీర్యశుల్కయని  చెప్పి నేను వారి కీయలేదు. పిమ్మట ఆ రాజులందరును కలిసి తమ బలమెంత యున్నదో పరీక్షించుకొనగోరి మిథిలకు వచ్చిరి. తమ బలమును పరీక్షించదలచిన వారికి ధనుస్సును చూపగా దానిని పట్టుకొనుటకు గాని, కదల్చుటకుగాని వారికి సాధ్యముకాలేదు. 


ఆ రాజుల బలము అల్పమైన దని తెలిసికొని నేను వారికి సీత నీయ నిరాకరించితిని. ఈ విషయము తెలిసికొనుము. ఈవిధముగ తమ బలము విషయమున సందేహము కలుగగా రాజులందరును మిక్కిలి కోపించి మిథిలానగరమును ముట్టడించిరి. ఇది తమకు జరిగిన అవమానమని భావించి కోపముతో మిథిలాపురిని బాధించిరి. ఈవిధముగా (వారి ముట్టడిలో) సంవత్సరము గడవగా నగరములో నున్న జీవనోపకరణము లన్నియు తరిగిపోయినవి. దానితో నాకు చాల దుఃఖము కలిగెను. 


అప్పుడు నేను తపస్సుచే దేవతల నందరిని అనుగ్రహింపచేసికొనగా వారు నాకు చతురంగబలమును ఇచ్చిరి. తమ బలమును గూర్చి సందేహము గల ఆ వీర్యశూన్యులగు పాపాత్ములైన రాజులు యుద్ధమునందు పరాజితులై, సపరివారముగా దిక్కులు పట్టి పారిపోయిరి.

ఓ ముని శ్రేష్టా! మిక్కిలి ప్రకాశించు ఆ శివధనుస్సును రామలక్ష్మణులకు కూడ చూపెదను. రాముడు ఆ ధనుస్సును ఎక్కుపెట్టగలిగినచో, అయోనిజయగు సీతను ఈతనికి ఇచ్చెదను అని ప్రకటించెను.


*శివధనుర్భంగము*

విశ్వామిత్రమహాముని జనకుని మాటలు విని, “రామునకు ఆ ధనుస్సును చూపుము” అనెను. 

విశ్వామిత్రుని వాక్యము విని జనకమహారాజు, “గంధమాల్యాదులచే అలంకరించిన ఆ దివ్యధనుస్సును తీసికొని రండు.”అని సామంతులను ఆజ్ఞాపించెను. 

జనకుని ఆజ్జ్ఞప్రకారము మంత్రులు నగరములో ప్రవేశించి ఆ ధనుస్సును ముందిడుకొని బయలుదేరి వచ్చిరి. మంచి బలము కలవారును, దీర్ధకాయులును అగు ఏబదివందల మంది పురుషులు ఆ ధనుస్సు ఉంచిన ఎనిమిది చక్రాలున్న పెట్టెను అతికష్టముగ లాగికొనివచ్చిరి. 


జనకుని మంత్రులు ధనుస్సు ఉన్న ఆ ఇనుపపెట్టెను తీసికొనివచ్చి, దేవతాసమానుడైన ఆతనితో ఇట్లనిరి. “మిథిలాధిపతీ! నీవు రామునకు చూపదలచు చున్న సర్వరాజపూజితమును, శ్రేష్టమును అగు ధనుస్సు ఇదిగో.”

రాజు వారి వాక్యము విని చేతులు జోడించి, మహాత్ముడైన విశ్వామిత్రునితోను రామలక్ష్మణులతోను ఇట్లు పలికెను.

“విశ్వామిత్రమహామునీ! మా జనకవంశీయులును, పూర్వము దీనిని ఎక్కుపెట్టపోయి విఫలులైన మహావీర్యవంతులగు రాజులును పూజించిన శ్రేష్టమైన ధనుస్సు ఇదియే. సురగణములు కాని, అసురులుకాని, రాక్షసులుకాని, గంధర్వ-యక్ష-కిన్నర-మహోరగులు గాని దీనిని ఎక్కుపెట్టజాలకపోయిరి. ఈ ధనుస్సును వంచుటకుగాని, నారి కట్టుటకుగాని, బాణము సంధించుటకుగాని, నారిని లాగుటకుగాని, కదల్చుటకుగాని మనుష్యులకు శక్తి ఎక్కడిది? ఓ మునిశ్రేష్టా! అట్లి ఈ ధనుస్సును తీసికొని వచ్చినారు. దీనిని ఈ రాజపుత్రులకు చూపుము.” 


విశ్వామిత్రుడు జనకుని మాటలు విని, “వత్సా! రామా! ఆ ధనుస్సును చూడుము.” అని రామునితో అనెను. 

ఆ బ్రహ్మర్షి ఆదేశానుసారము రాముడు ధనుస్సు ఉన్న ఆ పెట్టెను తెరిచి, ధనుస్సును చూచి విశ్వామిత్రునితో, “బ్రహ్మర్షీ! ఇపుడీ శ్రేష్టమైన ధనుస్సును హస్తముతో స్పృశించెదను. దీనిని కదల్చుటకును, సాధ్యమైనచో ఎక్కుపెట్టటకును ప్రయత్నించెదను.” అనెను. 

జనకమహారాజును, విశ్వామిత్రుడును “అటులే చేయుము.” అని పలికిరి. 


విశ్వామిత్రుని ఆజ్జప్రకారము రాముడు అనాయాసముగా ఆ ధనుస్సును మధ్యయందు పట్టుకొనెను. ధర్మాత్ముడైన ఆ రఘునందనుడు వేలకొలది జనులు చూచుచుండగా ఆ ధనుస్సును అనాయాసముగ ఎక్కుపెట్టెను. రాముడు ఆ ధనుస్సును ఎక్కుపెట్టి నారిని ఆకర్ణాంతము లాగగా అది విరిగిపోయెను.  

ఆ ధనుస్సు విరిగినపుడు పిడుగులు

పడుచున్నప్పుడు కలిగే ధ్వనితో సమానమైన

గొప్ప ధ్వని వచ్చిను. పర్వతము

బ్రద్దలగుచున్నపుడు అదరినట్లు భూమి

అదరిను. విశ్వామిత్రుడు, జనకుడు,

రామలక్ష్మణులు తప్ప మిగిలిన జను

లందరును ఆ ధ్వనికి మూర్చితులై క్రింద

పడిరి.

అచట వారందరు యథాపూర్వస్థితికి వచ్చిన పిమ్మట మాటలలో నేర్చరియైన జనకుడు, కంగారు లేనివాడై విశ్వామిత్రునితో ఇట్లు పలికెను.


“మహామునీ! దశరథాత్మజుడైన రాముని వీర్యమును ప్రత్యక్షముగ చూచితిని. అత్యద్భుతము, ఊహింప శక్యము కానిది అగు ఈ కార్యము ఇట్లు జరుగునని నేను అనుకొనలేదు. నా కుమార్తె సీత దశరథుని పుత్రుడైన రాముని భర్తగా పొంది మా వంశమునకు కీర్తిని తీసికొని రాగలదు. నా కుమార్తె సీతను వివాహ మాడుటకు వీర్యమే శుల్కమని నేను చేసిన ప్రతిజ్ఞ సత్యమైనది. నా ప్రాణములతో సమానురాలగు ఈమెను రామున కిచ్చి వివాహము చేసెదను.

 *సీతారాములకళ్యాణము* (2/4)


పుల్లెల శ్రీరామచంద్రుడు వారి వచన రామాయణము బాలకాండము నుండి….


*దశరథునకు కబురంపుట*

నీవు ఆజ్ఞాపించినచో నా మంత్రులు రథముల నధిరోహించి శీఘ్రముగా అయోధ్యకు వెళ్లెదరు. వీర్యశుల్మయగు సీతను రామునకీయ నిర్ణయించుట మొదలగు వృత్తాంతము నంతను వారు సవినయముగ దశరథునకు తెలిపి ఆతనిని నా నగరమునకు తీసికొనివచ్చెదరుగాక! నా మంత్రులు శీఘముగ వెళ్లి, రామలక్ష్మణులు విశ్వామిత్రుని సంరక్షణలో నున్నారని దశరథునకు తెలిపి, సంతోషించిన అతనిని తీసికొనివత్తురు!”

అటులే చేయుమని విశ్వామిత్రుడు పలుకగా జనకమహారాజు మంత్రులతో సంప్రదించి, దశరథునకు జరిగిన దంతయు చెప్పి ఆతనిని తీసికొనివచ్చుటకై తన ఆజ్ఞానిర్వాహకులగు భృత్యులను అయోధ్యకు పంపెను.


జనకుడాజ్ఞాపించిన దూతలు మూడు దినములు ప్రయాణము చేసి, అలసిపోయిన గుర్రములతో అయోధ్యానగరము చేరిరి. అచట రాజభవనమునకు వెళ్లి, ద్వారపాలకులతో, “జనకమహారాజు దూతలు వచ్చినారని దశరథమహారాజుతో చెప్పుడు.” అని పలికిరి.


ద్వారపాలకులు వారి మాటలు దశరథునకు నివేదించిరి. పిమ్మట రాజాజ్ఞ ప్రకారము రాజభవనములో ప్రవేశించిన ఆ దూతలు దేవతాసద్భృశుడును, వృద్ధుడును అగు దశరథుని చూచిరి. 

ఆ దూతలందరును చేతులు జోడించి, కంగారు పడనివారై, నియమబద్భులై దశరథునితో మధురాక్షములుగల వాక్యమును పలికిరి. 

“మహారాజా! మిధిలాధిపతియైన జనకమహారాజు స్నేహపూర్ణమగు మధురమైన వాక్కుతో అగ్నిహోత్రాదినిరతుడ వగు నీయొక్కయు, నీ ఉపాధ్యాయులయొక్కయు, పురోహితులయొక్కయు, పరివారజనముయొక్కయు యోగక్షేమములను విచారించు చున్నాడు. మిథిలాధీశుడగు జనకమహారాజు శద్ధాపూర్వకముగ నిన్ను కుశలప్రశ్న చేసి, విశ్వామిత్రుని అనుమతి పొంది, నీతో ఈ మాట చెప్పుచున్నాడు. 

'నా పుత్రిక వీర్యశుల్కయని నేను పూర్వము చేసిన ప్రతిజ్ఞ ప్రసిద్ధమే కదా. (తమ బలపరాక్రమములు చూపించలేక నాపై) కోపించి వచ్చిన రాజులు నిర్వీర్యులై పరాజితులైపోయిరి. 

దశరథమహారాజా! అట్టి నా ఈ పుత్రికను విశ్వామిత్రుని వెంట దైవవశముచే మిథిలకు వచ్చిన వీరుడైన నీ కుమారుడు సంపాదించుకొన్నాడు. మహాత్ముడైన రాముడు, గొప్ప సభలో, దివ్యమైన ఆ శివధనుస్సును మధ్యకు విరచెను. వీర్యల్కయైన సీతను ఈ మహాత్మున కిచ్చినా ప్రతిజ్ఞను నెరవేర్చుకొనవలెను గావున అందులకు అనుజ్ఞ ఇమ్ము. 

దశరథమహారాజా! నీవు ఉపాధ్యాయపురోహితసహితుడవై శీఘముగ వచ్చి రామలక్ష్మణులను చూడుము. ఇచటికి వచ్చి నాకానందమును కలిగింపుము. నీకు కూడ పుత్రవివాహోత్సవాది దర్శనానందము కలుగగలదు. 

జనకమహారాజు విశ్వామిత్రుని అనుజ్ఞ పొంది, శతానందుని అనుమతితో ఈవిధముగ మధురవాక్యమును చెప్పినాడు”.


*మిథిలకు దశరథుని పయనం*

దూతలు ఈ విధముగా జనకుని సందేశమును వినిపించి రాజుపై గల గౌరవముచే అధికముగ మాటలాడ జంకి ఊరకుండిరి.

దూతవాక్యములు విన్న దశరథుడు మిక్కిలి సంతసించి వసిష్ట వామదేవులతోడను, ఇతర మంత్రులతోడను ఇట్లు పలికెను. 

“కౌసల్యానందవర్ధనుడైన మన రాముడు విశ్వామిత్రపరిరక్షితుడై, సోదరుడైన లక్ష్మణునితోగూడ ఇపుడు విదేహదేశమునం దున్నాడు. మహాత్ముడైన జనకుడు రాముని పరాక్రమమును చూచి తన కుమార్తెను ఆతని కీయగోరుచున్నాడు. జనకుని ఆచారసంపత్తి మీకు నచ్చినట్లయితే విలంబ మేమియు చేయక శీఘముగ మిథిలాపురికి వెళ్లుదము.”

మంత్రులును, మహర్షులును అందరును, “తప్పక అట్లే చేయుదము.” అని పలుకగా దశరథుడు మిక్కిలి సంతోషించి, “రేపే ప్రయాణము.” అని మంత్రులతో అనెను. 

సకలసద్దుణసంపన్ను లగు జనకుని మంత్రులు మంచి సత్క్మారముల నంది ఆ రాత్రి అయోధ్యానగరముననే ఉండిపోయిరి.


రాత్రి గడచిన పిమ్మట, బంధువులతోను, ఉపాధ్యాయులతోను కూడిన దశరథమహారాజు సంతసించి సుమంత్రునితో ఇట్లు పలికెను. 

“ధనాధ్యక్షు లందరును పుష్కలముగా ధనమును, వివిధరత్నములను గూడ గ్రహించి, బాగుగా సంసిద్ధులై ముందుగా వెళ్లైదరుగాక. నేను ఆజ్ఞాపించిన క్షణమునందే చతురంగ బల సైన్యము, శ్రేష్టమైన పల్లకీలు, రథములు మొదలగునవియు బయలుదేరుగాక!


వసిష్టుడు, వామదేవుడు, జాబాలి, కాశ్యపుడు, మార్కండే యుడు, కాత్యాయనఋషి - ఈ బ్రాహ్మణు లందరును ముందు వెళ్లెదరుగాక! నా రథమును కూర్చి శీఘ్రముగ తీసికొని రమ్ము. విలంబము చేయవలదు. జనకుని దూతలు నన్ను తొందర పెట్టుచున్నారు.”


దశరథమహారాజు బుషులతో కలిసి వెళ్లుచుండగా, ఆతని ఆజ్ఞానుసారము చతురంగబలము అతని వెనుకనే వెళ్లెను. 


*దశరథునకు స్వాగత సత్కారములు*

నాల్గు దినములు ప్రయాణము చేసి దశరథుడు విదేహదేశము చేరగా జనకమహారాజు ఆ విషయము విని, దశరథునకు ఆయా ప్రాంతములలో తగు విధముగ సత్కారముల నేర్చరచెను. పిమ్మట జనకమహారాజు వృద్ధుడైన దశరథమహారాజును కలుసుకొని చాల సంతోషించెను. 

అతనితో, “దశరథమహారాజా! నీకు స్వాగతము. నా భాగ్యవశముచే నీవు మిథిలకు వచ్చినావు. నీ ఇరువురి కుమారుల పరాక్రమముచే ప్రాప్తించిన ఆనందమును పొందగలవు. మహాతేజఃశాలియు, భగవంతుడును అగు వసిష్టమహర్షి బ్రాహ్మణోత్తములతో కలిసి, దేవతలతో కలిసి దేవేంద్రుడు వలె, నా భాగ్యవశమున ఇచటికి వచ్చినాడు. నా భాగ్యమువలన పరాక్రమముచే శ్రేష్టులును, మహాత్ములును అగు రఘువంశరాజులతో వియ్యమందితిని. నా విఘ్నము లన్నియు తొలగినవి. నా కులము పూజనీయమైనది. రాజాధిరాజా! రేపు ప్రాతఃకాలము యజ్ఞము పూర్తియెన పిమ్మట బుషిసమ్మతమైన వివాహమును నెరవేర్చుము.” అని సాదరముగా పలికెను. 


మాట నేర్పరులలో శ్రేష్టుడగు దశరథమహారాజు జనకుని వచనము విని, అచటి ఋషులందరును వినుచుందగా ఆతనితో, “జనకమహారాజా! నీవు ధర్మము తెలిసినవాడవు. ప్రతిగ్రహము అనునది దాత చేతిలో నున్నది. దాత ఇచ్చినప్పుదే కదా ప్రతిగ్రహీత స్వీకరించునది! నీ కన్యాదాననిర్ణయాదికమును విని యున్నాము. నీ వెట్లు చెప్పెదవో అట్లే చేసెదము.” అనెను.


సత్యవాదియైన దశరథుడు పలికిన ధర్మసమ్మతము, యశస్కరము అయిన వచనము విని జనకమహారాజు చాల ఆశ్చర్యపడెను. 

అచ్చటి మునీశ్వరు లందరును, పరస్పరము కలిసినందులకు చాల సంతసించినవారై, ఆ రాత్రి సుఖముగ గడిపిరి. 

దశరథమహారాజు పుత్రులైన రామలక్ష్మణులను జూచి ఆనందభరితుడై, జనకుని సత్కారములకు సంతుష్టుడై నివసించెను.


జనకమహారాజు, యజ్ఞమునకు సంబంధించిన కర్మలను, కుమార్తెల వివాహమునకు సంబంధించిన అంకురారోపణాదిక్రియలను పూర్తిచేసికొని ఆ రాత్రి గడపెను.

మన గుడి :

 🕉 మన గుడి :






⚜ కడప జిల్లా : ఒంటిమిట్ట


⚜ శ్రీ కోదండ రామాలయం 


💠 సీతారామ లక్ష్మణులు, స్వామిభక్తికి ప్రతీకగా చేతులు జోడించి ముగ్గురికీ నమస్కరిస్తున్న ఆంజనేయుడు.

ఏ రామాలయంలోనైనా కనిపించే దృశ్యమిదే. కానీ ఆ నీలమేఘశ్యాముని పాదాలచెంత అంజనీ పుత్రుడు లేని రామాలయాన్ని ఎవరైనా ఊహించగలరా..! 

అలాంటి ఆలయంమే కడప జిల్లాలో 

" ఒంటిమిట్ట ".


💠 ఒక మిట్టమీద నిర్మింపబడ్డ రామాలయం అవటంవల్ల ఈ ఆలయానికి ఒంటిమిట్ట రామాలయం అని పేరు వచ్చింది.

ఈ  ఆలయంలోని విగ్రహాలు ఒకే శిలలో మలచబడ్డాయి.  అందుకే దీనికి ఏక శిలా నగరమనే పేరు వచ్చింది.

ఏకశిలపైన సీతారామలక్ష్మణ విగ్రహాలున్న ఈ ఆలయంలో రాముడు యోగముద్రలో దర్శనమివ్వడం విశేషం.


⚜ స్థల పురాణం ⚜


💠 రామలక్ష్మణులు చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు యాగరక్షణకు వారిని విశ్వామిత్రుడు తీసుకెళ్లిన చరిత్ర అందరికీ తెలిసిందే. కానీ సీతారామ కల్యాణం జరిగాక కూడా అలాంటి సందర్భమే ఒకటి ఏర్పడింది. 

యజ్ఞయాగాలకు రాక్షసులు ఆటంకం కలిగించడంతో మృకండు మహర్షి, శృంగి మహర్షి రాముని ప్రార్థించడంతో దుష్టశిక్షణ కోసం ఆ స్వామి సీతా, లక్ష్మణ సమేతుడై అంబులపొది, పిడిబాకు, కోదండం పట్టుకుని వెళ్లారు.రాముడు వాళ్లను హతమార్చి యాగరక్షణ చేశాడట.


💠 అందుకు ప్రతిగా ఈ మహర్షులు ఏకశిలపైన సీతారామ లక్ష్మణుల విగ్రహాలను చెక్కించారనీ, అయితే  ఆ తరువాత రాముడి భక్తుడైన జాంబవంతుడు  రామయ్యపై భక్తితో సీతారామలక్ష్మణ మూర్తులను ఒకే శిలపై మలచి ఇక్కడ ప్రతిష్టించినట్లు స్థలపురాణం చెబుతోంది.


💠 ఈ ఆలయంలోని రామతీర్థాన్ని రాముడే సీతకోసం ఏర్పాటుచేశాడని అంటారు. మొదట ఆ తీర్థాన్ని రామబుగ్గ అనేవారనీ.. క్రమంగా అదే రామతీర్థం అయ్యిందనీ చెబుతారు.

ఈ ప్రాంతానికి వచ్చిన సీతాదేవి చుట్టుపక్కల ఎక్కడా నీళ్లు లేక రాముల వారికి చెప్పిందట. 

అప్పుడు శ్రీరాముడు నీళ్లు పైపైకి ఉబికివచ్చేలా బాణాలు వేశారట. వారి బాణాల వల్ల ఏర్పడిన తీర్థాలను  రామ తీర్థoగా పిలుచుకుంటారు భక్తులు.

ఆలయంలో  బుగ్గను రామతీర్థంగా , పక్కనే ఉన్న చిన్న కోనేరును లక్ష్మణ తీర్థంగా ప్రసిద్ధి చెందాయి. బ్రహ్మోత్సవాల వేళ చక్రస్నానం ఇక్కడే వేడుకగా నిర్వహించడం కొన్ని ఏళ్లుగా ఆనవాయితీ


💠 ఒక కధనం ప్రకారం ఒంటుడు, మిట్టుడు అనే ఇద్దరు రామ భక్తులు (వీరు చోరులు అని కూడా అంటారు). ఈ రాముడిని కొలిచిన ఆ గజదొంగలు ఆ వృత్తిని మానుకుని నిజాయితీపరులుగా బతికారు. 

ఓసారి ఈ ప్రాంతానికి ఉదయగిరిని పాలించే కంపరాజు వచ్చాడు, ఈ అన్నదమ్ములు రాజుకు అన్నిరకాల సేవలు చేయడమే కాక చుట్టూ ఉన్న ప్రాంతాలనూ చూపించారు. ఆ రాజు ఆనందించి ఏదయినా కోరుకోమని చెప్పగా, ఇక్కడ రామాలయం కట్టించమని అడిగారట.

గుడి కట్టే  బాధ్యతను వీళ్లకే అప్పగించి వెళ్లిపోయాడు.దాంతో వీళ్లిద్దరూ ఎంతో భక్తిశ్రద్ధలతో కొన్నేళ్లు కష్టపడి ఈ ఆలయాన్ని నిర్మించారట.వాళ్లిద్దరూ కట్టించడం వల్లే ఈ ఆలయానికి ఒంటిమిట్ట రామాలయం అనే పేరు వచ్చిందoటారు.


💠ఈ ఆలయ నిర్మాణ సమయానికి రాముడికి హనుమంతుడు పరిచయం కాలేదనీ.. అందుకే ఇక్కడ హనుమంతుడి విగ్రహం లేదనే నమ్మకం ఉంది.


💠భక్త  పోతనామాత్యుల వారు తన భాగవతాన్ని ఒంటిమిట్ట కోదండరాముడికే అంకితమిచ్చారు.

పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి ఇక్కడ స్వామిని దర్శించుకున్నాకనే కాలజ్ఞానం రాశారని ప్రతీతి.


💠 సందర్శకులను ఆకర్షించే అంశాల్లో ఇంకొకటి ఇమాంబేగ్ బావి.  1640 సం. లో కడపను పాలించిన అబ్దుల్ నబీఖాన్ ప్రతినిధి ఇమాంబేగ్.   ఒకసారి ఆయన ఈ ఆలయానికి వచ్చిన భక్తులను మీ దేవుడు పిలిస్తే పలుకుతాడా అని ప్రశ్నించాడుట.  చిత్త శుధ్ధితో పిలిస్తే ఖచ్చితంగా పలుకుతాడని వారు సమాధానం ఇవ్వగా ఆయన మూడు సార్లు రాముణ్ణి పిలిచారట.  అందుకు ప్రతిగా మూడు సార్లు ఓ అని సమాధానం వచ్చింది.  ఆయన ఆశ్చర్య చకితుడై, స్వామి భక్తుడిగా మారి, అక్కడి నీటి అవసరాలకోసం ఒక బావిని తవ్వించాడు.  ఆయన పేరుమీద ఆ బావిని  ఇమాంబేగ్ బావి అటారు.


💠 వాల్మీకి రామాయణాన్ని తెలుగులోకి అనువదించి, ఆంధ్ర వాల్మీకిగా పేరుపొందిన శ్రీ వావిలకొలను సుబ్బారావు

జీర్ణదశకు చేరిన ఒంటిమిట్ట రామాలయాన్ని ఉద్ధరించటానికి కంకణం కట్టుకొని,ఆయన టెంకాయ చిప్పను చేతిలో ధరించి ఆంధ్రదేశంలో ఊరూరా తిరిగి బిచ్చమెత్తి ఆ ధనంతో ఆయన ఆలయాన్ని పునరుద్ధరించాడు. చివరకు తాను ఖాళీ అయిన టెంకాయచిప్పను చూచి "నీ జన్మ ధన్యము కదే టెంకయ చిప్పా" అంటూ దానిమీద 'టెంకాయ చిప్ప శతకం' చెప్పిన మహాకవి.


⚜ ఒంటిమిట్టలో రాములోరి కళ్యాణం రాత్రే ఎందుకు చేస్తారు?


💠 ఒంటిమిట్టలో పున్నమి వెన్నెలలో రాములోరి కళ్యాణం నిర్వహిస్తారు. రాత్రే కల్యాణం జరగడానికి పురాణాల్లో ఓ కథ ఉంది..విష్ణుమూర్తి, లక్ష్మిదేవి వివాహం పగలు జరుగుతుంది. తాను అక్క లక్ష్మిదేవి పెళ్లిని చూడలేకపోతున్నానని చంద్రుడు విష్ణుమూర్తికి చెప్పడంతో..నీ కోరిక రామావతారంలో తీరుతుందని విష్ణుమూర్తి చంద్రుడికి వరమిస్తాడు. అందుకే ఈ ఆలయంలో నవమి రోజు కాకుండా చైత్రశుద్ధ పౌర్ణమి రోజు సీతారాముల వివాహం జరుగుతుందని ఒక పురాణ కధ ప్రాచుర్యంలో ఉంది.


💠 కడప నుంచి 25 కిమీ దూరం

ట్యాక్స్ పేయర్స్ ఆర్గనైజేషన్‌

 📞(Flash News)📞ఆల్ ఇండియా ట్యాక్స్ పేయర్స్ ఆర్గనైజేషన్‌ను ఏర్పాటు చేసేందుకు కమిటీని ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు నిన్న నిర్ణయించింది, ఇది ప్రపంచంలోనే అతిపెద్ద సంస్థగా అవతరించింది. ఏ ప్రభుత్వం పాలిస్తున్నప్పటికీ, ఈ సంస్థ ఆమోదం లేకుండా ఏ ప్రభుత్వమూ ఉచిత విద్యుత్, ఉచిత నీరు, ఉచిత పంపిణీ లేదా రుణమాఫీలను ప్రకటించదు. డబ్బు మా పన్ను చెల్లింపుదారులకు చెందినది కాబట్టి, దాని వినియోగాన్ని పర్యవేక్షించే హక్కు పన్ను చెల్లింపుదారులకు ఉండాలి. రాజకీయ పార్టీలు ఓట్ల కోసం ఉచితాలను పంచుతూ ప్రజలను మభ్యపెడుతున్నాయి. ఏ ప్రాజెక్టులు ప్రకటించినా ముందుగా ప్రభుత్వం వాటి బ్లూప్రింట్‌లను సమర్పించి ఈ సంస్థ నుంచి అనుమతి పొందాలి. ఇది MPలు మరియు MLAల జీతాలకు మరియు వారు పొందే ఇతర విచక్షణ రహిత ప్రయోజనాలకు కూడా వర్తింపజేయాలి. ప్రజాస్వామ్యం కేవలం ఓటుకు మాత్రమే పరిమితమా? ఆ తర్వాత పన్ను చెల్లింపుదారులుగా మనకు ఎలాంటి హక్కులు ఉన్నాయి? పార్లమెంటు కార్యకలాపాలను అడ్డుకున్నందుకు ఎంపీలు, ఎమ్మెల్యేలను జవాబుదారీగా ఉంచి, వారిపై క్రమశిక్షణా చర్యలు తీసుకునే హక్కు పన్ను చెల్లింపుదారులకు ఉండాలి. వారు అన్ని "సేవకులు" తర్వాత పన్ను చెల్లింపుదారులచే చెల్లించబడతారు. అటువంటి "ఉచితాలను" ఉపసంహరించుకునే హక్కు కూడా వెంటనే అమలు చేయాలి. మీరు అంగీకరిస్తే, దయచేసి వీలైనంత ఎక్కువ మందిని సంప్రదించండి. దీన్ని చేయడానికి, పోస్ట్‌ను భాగస్వామ్యం చేయండి. దీన్ని మీ స్నేహితుల్లో కనీసం 10 మందికి పంపండి. దయచేసి ఈ సందేశాన్ని వైరల్ చేయడానికి షేర్ చేయండి. 🙏


 

నాయనార్లు

 🕉️నాయనార్లు🕉️

నాయనార్లు అంటే పూజ్యనీయులు అని అర్థం. శివభక్తుల్లో వీరికి విశేష స్థానం ఉంది. నాయనార్లు మొత్తము 63 మంది. శ్రీకాళహస్తి దేవస్థానం లో శివదర్శనానికి చేరుకునే క్రమం లో గుడిలోపల ఈ 63 మంది నాయనర్ల దర్శనం కలుగుతుంది.

భగవంతుడిని సఖ్యునిగా, ఇష్టునిగా, తన యజమాని గా, భావించి నాయనార్లు శివ కృప కు పాత్రులు అయ్యారు.

వీరిలో కన్నప్ప నాయనరు తెలుగు ప్రాంతానికి చెందినవాడు..


రాజంపేట ప్రాంతంలోని ఉటుకూరు ఈయన స్వస్థలం..ఆప్రాంతానికి నాగడు అనే ఒక బోయరాజున్నాడు. అతని ఇల్లాలు పేరు దత్త. వీరిరువురూ సుబ్రహ్మణ్యస్వామి భక్తులు. స్వామి దయవలన వీరికి కలిగినపుత్రుడుకి తిన్నడు అనేపేరు పెట్టుకొన్నారు. నాగడు తిన్నడికి సకలవిద్యలు నేర్పించి రాజుగా చేశాడు. తిన్నడు విలువిద్యలో ఆరితేరాడు. బోయవానిగా తన కులధర్మమును అనుసరించి వేటాడినా - తిన్ననికి అన్ని జీవులయెడ - కరుణ, ప్రేమలు పుట్టుకనండి అభివృద్ధినొందాయి. జంతువులలో పిల్లలని, ఆడవాటిని, రోగాలతో ఉన్నవాటిని వేటాడేవాడు కాదు. తనలోని జంతు భావాలైన కామ, క్రోధ, మద మాత్సర్యాలను జయించాడు.

పంటపొలాలు, జనావాసాల వద్దకు ఎలుగుబంట్లు, క్రూరమృగాలు దుప్పులు, అడవిపందులు ఎక్కువగా సంచరించి తీవ్ర ఇబ్బందులకు గురి చేసాయి.

తన తండ్రి అయిన నాగడు, తిన్నని ని ఆ గ్రామ పెద్దగా బాధ్యతలు అప్పగించి సమస్యని పరిష్కరించవలసినది గా ఆజ్ఞాపించాడు.

అలా తిన్నడు తన స్నేహితులైన కాముడు, నాముడితో క్రూరజంతువుల బారినుండి పొలాలను వారి వాసాలను రక్షించారు.


ఒకనాడు తిన్నడు వేటకు వెళ్ళాడు ఒక పంది అతని వల నుంచి తప్పించుకుని పారిపోజూచింది. తన అనుయాయులైన నాముడు, కాముడులతో కలసి ఆ పందిని తరుముకుంటూ వెళ్ళాడు. దానికి అలసట వచ్చి, చెట్టుముందర ఆగింది. తిన్నడు దాన్ని చంపాడు. అందరూ అలసిపోయారు, దప్పికైంది. దాన్ని మోసుకుని స్వర్ణముఖీనదీ తీరానికి పోయారు. కాళహస్తి కొండ, దేవాలయము కన్పించాయి.


తిన్నడికి ఆ పర్వతమెక్కి - గుడిని చూడాలని విపరీతంగా అనిపించసాగింది. అక్కడ పరమేశ్వరుడు కుడుము దేవారు (పిలకవున్న దేవుడు) అని నాముడు చెప్పాడు. కాముడు పందిని పచనము చేయడం మొదలుపెట్టాడు. ఆ కొండఎక్కుతుండగానే తిన్ననిలో అంతకుముందెన్నడు తనకు అనుభవంగాని అలౌకికానంద పరవశుడవసాగాడు. అది పూర్వ జన్మసంస్కార ఫలితము. తన మీదనుంచి ఏదో బరువు తగ్గుతున్నట్లనిపించసాగింది. దేహస్పృహకూడా మందగించసాగింది.. అక్కడ శివలింగమును కనుగొనగానే దాని మీద అనంతమైన ప్రేమ పుట్టుకు వచ్చింది. ఆ లింగమును కావలించుకున్నాడు..ముద్దులు గుమ్మరించాడు..ఆనందబాష్పాలు రాలటంతో, శివునితో  ‘ఈశ్వరా! ఈ దట్టమైన అడవిలో ఒంటరిగా ఎలా ఉన్నావయ్యా? నీకు ఆహారము ఎలా వస్తుంది? నీకు తోడెవరుంటారిక్కడ? నేను నీతోనే ఉంటాను. అయ్యో! నా తండ్రీ ఆకలిగా ఉందేమోకదా నీకు..ఉండు ఆహారం తీసుకువస్త్తాను' అంటూ లింగాన్ని విడిచి వెళ్ళలేక, వెళ్ళలేకపోయాడు...చివరికి శివుని ఆకలిదీర్ఛుటకు వెంటనే కొండదిగాడు. కాముడు పచనము చేసిన పందిమాంసమును రుచి చూచి మంచిది శివునికి వేర్పరిచాడు. 'నాముడు ఈశ్వరునికి ఆహారము సమర్పించే ముందు ప్రతిదినము నీటితో అభిషేకింపబడుతాడని, పూలతో పూజింపబడతాడని చెప్పాడు. అది విన్న తిన్నడు నదినుండి నోటినిండా నీళను పుక్కిలి బట్టి సేకరించిన పూలను తన తలమీద వుంచుకొని పచనము చేసిన మాంసమును చేతిలో వుంచుకొని, విల్లు అంబులతో తిన్నగా గుడికి వెళ్లాడు. అక్కడ పుక్కిలిబట్టిన నీరును శివునిపై వదిలాడు. అది అభిషేకమైంది. తలమీద వున్న పూలతో శివుని అలంకరంచాడు. అది అర్చన అయింది. తర్వాత తాను తెచ్చినపందిమాంసమును దేవునిముందు పెట్టాడు. అది ఆయనకు నివేదన అయింది. ద్వారము వద్ద ఎవరిని, ఏ జంతువులను రానీకుండా కాపలా కాశాడు... ఆ బోయవాని మూఢభక్తి భోళాశంకరుడైన ఆ కైలాసనాథున్ని కదిలించింది.... మరునాడు ప్రొద్దున మళ్లీ ఆహారము తెచ్చుటకు బయలుదేరి వెళ్లాడు. నాముడికి కాముడికి మతిపోయింది. తిన్నడులో వచ్చిన మార్పును మతిభ్రమణమేమోనని భావించి వెంటనే వెళ్లి తిన్నని తల్లిదండ్రులకు జరిగిందంతా చెప్పారు. వారు తిన్నని ఇంటికి తీసికొని పోజూచారు. తిన్నడు తాను శివుని దగ్గరే ఉంటాను అని వెళ్లలేదు.


తిన్నడు దేవునికాహారము సేకరించటానికి వెళ్ళగా, ఆలయ అర్చకుడు సివగోచారి శివుని దైనందికార్చనకు వచ్చాడు. ఎవరో దేవాలయమును అపవిత్రం చేశారని భావించాడు, నిర్ఘాంతపోయాడు. ఆగమాల్లో ఆ అర్ఛకుడు నిష్ణాతుడు. అందుకని అక్కడ ఉన్న మాంసము మొదలగు వానిని తొలగించి మంత్రయుక్తముగా సంప్రోషణ్ గావించి మళ్లీ స్నానము చేసి మడిగా కుండలో తెచ్చిన స్వర్ణముఖీ జలముతో అభిషేకము చేసి, పూలతోనలంకరించి విభూతినలిమి, తెచ్చిన పళ్లు మధుర పదార్థములతో నివేదన గావించి వెళ్లాడు. పూజారి వెళ్లగానే, తిన్నడు మళ్లీ దేవుని నివేదనకై వేటాడిన మాంసమును తెచ్చాడు. పూజారి అలంకరించిన పూజాద్రవ్యములను తీసివేసి తనదైన పద్ధతిలో పూజచేశాడు. ఈవిధంగా ఐదు రోజులు జరిగాయి. పూజారి ఈక ఉండబట్టలేకపూయాడు. రోదిస్తూ పరమశివుని ప్రార్థంచాడు. "ఈ ఘోరకలిని ఆపుస్వామి..." అని ఎలుగెత్తి ప్రార్థించాడు. శివుడు శివగోచారికి తిన్నని భక్తిప్రపత్తులను చూపదలచాడు. అర్చకునకు కలలో కనిపించి "నీవు లింగము వెనుక దాగి వుండి, బయటకు రాక అక్కడ ఏమిజరుగబోతోందో గమనించు" అని ఆదేశించాడు.


ఆరవ రోజున యథావిధిని తిన్నడు ఆలయానికి వచ్చాడు. వస్తుండగా తిన్ననికి కొన్ని దుశ్శకునాలు గోచరించాయి. ఏదో శివునకు ఆపద జరిగిందని భావించాడు. శివునికి ఆపద జరుగగలదా అని తనని గూర్చి మరచిపోయాడు. గుడికి పరుగెత్తికొని వెళ్ళాడు. వెళ్లిచూడగానే - శివుని కుడికన్ను నుండి రక్కము బయటకి వస్తోంది. దేవుని అర్చనకు తాను తెచ్చిన వస్తువులు క్రింద పడిపోయాయి. బిగ్గరగా ఏడ్చాడు. ఎవరు ఈ పనిచేశారో తెలియలేదు. తనకు తెలిసిన మూలికావైద్యం చేశాడు. కాని రక్తం ఆగలేదు. వెంటనే అతనికి ఒక ఊయ కలిగింది. 'కన్నుకు కన్ను' సిద్ధాంతముగా స్ఫురించింది. సంతోషించాడు. నృత్యం చేశాడు. నృత్యము చేస్తుండగానే - ఇప్పుడు శివునికి ఎడమ కన్ను నండి నెత్తురు బయటకు రావడం గమనించాడు. భయము లేదు మందు తెలిసిందిగా, కాని ఒక సమస్య మదిలో మెదిలింది. తన ఎడమ కన్ను గూడ తీసిన శివుని కన్ను కనుగొనుట ఎలా? అందుకని గుర్తెరుగుటకు తన పాదాన్ని శివుని ఎడమ కంటిపై బెట్టి - తన ఎడమ కన్నును పెకళించబోయాడు.


పరమ శివుడు వెంటనే ప్రత్యక్షమయి తిన్నని చేతిని పట్టుకొని ఆపాడు. " నిలువుము కన్నాప్పా! కన్నప్పా! నీ భక్తికి మెచ్చాను. ఇంతటి నిరతిశయ భక్తిని మునుపెన్నడు చూచి ఎరుగను. పంచాగ్నుల మధ్య నిలిచి తపమొనర్చిన మునుల ఆంతర్యము కన్న నీ చిత్తము అతి పవిత్రమైనది. నా హృదయమునకు సంపూర్ణానందము కలిగించినది నీవొక్కడివే కన్నప్పా! " అని ప్రశంసించాడు. పరమేశ్వరుడు కన్నప్పా అని మూడుమారులు పిలిచాడు. అంటే కన్నప్ప శివుని అనుగ్రహమును మూడింతలుగా పొందాడన్నమాట.


తన కన్నును ఈశ్వరునికర్పించినందులకు తిన్నడు కన్నప్ప అయ్యాడు. కన్నప్పనాయనారు అయ్యాడు. నేత్రేశనాయనారు అనునది సంస్కృతనామము. శివుడు తన రెండు చేతులతో కన్నప్పను తన దగ్గరకు తీసొకొని ప్రక్కకు చేర్ఛుకున్నాడు. కన్నప్పకు చూపువచ్చింది. సాక్షాత్తూ శివుని వలె జీవించాడు. శివగోచారికి తిన్నని అపురూపమైన శివభక్తి గోచరమైంది. మహాభక్తుడైన తిన్నడు తన కళ్లనే పెకలించి శివునికిచ్చుటలో తిన్నని సంపూర్ణశరణాగతి ఆత్మనివేదన గోచరిస్తుంది. అంతకన్నా అనితరమైన భక్తితత్పరత కనిపించదు. వెంటనే అది భగవంతుని సాక్షాత్కరింప చేసింది. ఇలా వేదం, నాదం, యోగం, శాస్త్రాలు, పురాణాలు ఏవీ ఎరుగని ఒక మామూలువ్యక్తి తన భక్తితో ఆ మహాదేవుని ప్రసన్నంచేసుకున్నాడు. ఈ భక్తిసామ్రాజ్యరారాజు..ఒక్క శైవులకే కాదు.. తెలుగువారందరికీ ప్రాతఃస్మరణీయుడు.🕉️

ఎచ్చట అందరూ

 .

                   _*సుభాషితమ్*_


 𝕝𝕝శ్లోకం𝕝𝕝


*యత్ర సర్వేఽపి నేతారః*

*సర్వే పండితమానినః।*

*సర్వే మహత్త్వమిచ్ఛంతి*

*తత్ర కార్యం వినశ్యంతి॥*


తా𝕝𝕝

ఎచ్చట అందరూ నాయకులు కావాలని ఆరాటపడుదురో, ఎచ్చట అందరూ తమకు తామే పండితులని తలచెదరో, ఎచ్చట అందరూ ఉన్నత స్థానమునే ఆశింతురో అచ్చట పనులు నాశనమగును.

ఆర్య చాణక్య*♦️ *పార్ట్ - 79*

 🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹

.    *🌹చారిత్రాత్మక కథాస్రవంతి🌹*

.           ♦️ *ఆర్య చాణక్య*♦️


*పార్ట్ - 79*


అంతవరకూ నాలుగుదిక్కులా శత్రు సైన్యాలను ఎదిరించి పోరాడుతున్న మగధ సైన్యాలలో ఏదో తిరగబాటు జరిగినట్లు కోట లోపలినుంచే మాగధులపై మాగధులే వెనకనుంచి దాడి చేశారు. 


అప్పటివరకూ జరిగిన యుద్ధంలో అటు నందులకి అనుకూలురైన సైనికులూ, ఇటు పర్వతక అనుకూలురైన సైన్యాలూ దాదాపుగా నాశనమయ్యాక ... లోపల నుంచి వెనకదాడి చేసిన మాగధులు మిగిలిన నందానుకూల సైన్యాన్ని ఊచకోత కోస్తూ దారిచేస్తూ "జయహో ... మౌర్య చంద్రగుప్త సార్వభౌములకు... జయ... జయ..." అంటూ పెద్దపెట్టున జయ జయ ధ్వనాలు చెయ్యసాగారు. 


అంతవరకూ అసాధ్యమనిపించిన మార్గం శులభసాధ్యమై చంద్రగుప్తుని సేనలు అన్ని మార్గాలలో నుంచీ కోటలోనికి జోరబడ్డాయి. కానీ అప్పటికే నందానుకూలులందరూ నశించి పోవడం చేత చంద్రుని సేనాసమూహాలను ప్రతిఘటించే వారే లేకపోయారు. భద్రభట, బాగురాయణాది ముఖ్యులంతా ఓటమిని అంగీకరిస్తూ శ్వేత పతాకాలు ధరించి చంద్రుని సేనలకు స్వాగతం పలికారు. 


అప్పటివరకూ బీరాలు పలుకుతూ అహంకారంతో ప్రవర్తించిన నందులు ఒక్కసారిగా పరిస్థితి తారుమారయ్యేసరికి జీవసిద్ధిని ఆశ్రయించడానికి పరుగులు తీశారు. చంద్రగుప్తుడు అశ్వారూడుడై వాళ్ళని వెంబడించాడు. 


నందులు ఎనమండ్రుగురిని మార్గమధ్యంలోనే ప్రతిఘటించాడు చంద్రగుప్తుడు. తన కన్న తండ్రికి నందులు చేసిన ద్రోహాన్ని గుర్తుకు తెచ్చుకొని వీరావేశంతో విజృంభించిన చంద్రగుప్తుడు నందులను వెంటాడి, వేటాడి యాగశాల వద్ద ఒక్కొక్క వ్రేటుకి ఒక్కొక్క నందుడి తలనరికి వేశాడు. 


ఎనమండ్రుగురు నందుల శిరస్సులూ బంతుల్లా ఎగురుతూ వెళ్లి హోమాగ్రిలో పడి భగభగ మాడి మసైపోతుంటే .... ఆనాటి మహానందుల వారి కల్పిత అగ్ని ప్రమాద మరణానికి ప్రతీకారం తీర్చుకున్న చంద్రగుప్తుడు సంబరంతో చిందులు త్రొక్కుతూ ... "అమ్మా... పగ తీర్చుకున్నాను... తండ్రిగారి దుర్మరణానికి కారకులైన దుష్టనందుల మీద పగతీర్చుకున్నాను. తల్లీ... పగతీర్చుకున్నాను...." అంటూ ఆనందంతో పోలికేకలు పెట్టాడు. 


సరిగ్గా అప్పుడే అక్కడికి పరిగెత్తుకువచ్చిన రాక్షసమాత్యుడు హోమగుండంలో కాలి పెటపెట లాడుతూ కపాలమోక్షమవుతున్న నందుల శిరస్సుల ద్వంస దృశ్యాన్ని చూస్తూ మ్రాన్పడిపోయాడు. 

(ఇంకా ఉంది)...🙏


*సేకరణ:- శ్రీ రమణమూర్తి గారి వాట్సాప్ పోస్ట్.* 

🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

ఆహారాన్ని వృధా చేయకండి

 



₹10రూ ల సొంత డబ్బులతో పానీపూరీ కొనుకొనితింటే

 ప్లేట్‌లోని నీళ్లను వదలకుండా తాగుతాము....!


ఐస్‌క్రీం కొంటే చివరికి మూత కూడా నాకుతారము...!


#అలాంటిది మనము పెళ్లిళ్లకు 

డిన్నర్లకు,దావత్లకు, birthday party లకు 

ఇతర వేడుకలకు వెళ్లిన తర్వాత ఆహారాన్ని ఎందుకు వృధా చేస్తారు?

దాని వల్ల మన హోదా ఏమైనా పెరుగుతుందా ?

ఒక్కొక్క ధాన్యపు గింజ ఆహారం గా మారడానికి, అది మన కడుపులోకి రావడానికి  రైతుల శ్రమ, కష్టం, డబ్బు, కూలీలా చెమట చుక్కలు ఉన్నాయనేది మనం మరవ కూడదు.

మన కుటుంబాలలోనే ఒక తండ్రి, తల్లి తన జీవితమంతా

ఆ ఆహారం కోసం కష్టపడి ఉండవచ్చు.

ప్రపంచంలో అన్నిటికంటే బాధ"ఆకలి"

ప్రతి సంవత్సరం కోట్లాదిమంది ఆహారం లేక ఆకలి చావులకు గురి అవుతున్నారు.

కడుపులోకి ఎంత కావాలంటే అంత తీసుకో...!

ఆకలిని తీర్చుకో కానీ ఆహారం వృధా చేసి ఇతర ప్రాణుల నోటి ముద్ద దూరం చేయకు

ఇంట్లో అయినా బయట అయినా ఆహారాన్ని వృధా చేయడం మహా పాపం.

*DON'T WASTE FOOD*


దయచేసి ఆహారాన్ని వృధా చేయకండి.

 ........................✍️

సత్యమేవేశ్వరో

 శ్లోకం:☝️

*సత్యమేవేశ్వరో లోకే*

  *సత్యం పద్మాశ్రితా సదా l*

*సత్యమూలాని సర్వాణి*

  *సత్యాన్నాస్తి పరం పదం ll*

  - వాల్మీకి రామాయణం 


భావం: సత్యంతోనే భగవంతుడు పొందబడతాడు. సత్యం వలన అన్ని సంపదలు లభిస్తాయి. సత్యం అన్ని సుఖాలకు మూలం. సత్యం కంటే పొందవలసినది మరేమీ లేదు.

_అసత్యం వాస్తవికతని మారుస్తుంది లేక వక్రీకరిస్తుంది._ _False distorts the reality._

_ఘీంకారంతో తప్పిన ముప్పు_*

 





*_ఘీంకారంతో తప్పిన ముప్పు_*


తిరుపతి (తితిదే);

గజరాజుల అప్రమత్తంతో తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో పెనుప్రమాదం తప్పింది. 


ఆలయంలో బ్రహ్మోత్సవాలు జరుగుతున్న వేళ  గురువారం రాత్రి వాహనసేవలో పాల్గొనేందుకు అప్పటికే రెండు గజరాజులు (లక్ష్మి, వైష్ణవి) వచ్చాయి. 


భక్తులు స్వామివారి దర్శనానికి వెళ్తూ కొందరు.. తిరిగొస్తూ మరికొందరు.. విశ్రాంతి తీసుకుంటూ ఇంకొందరు.. దుకాణాల వద్ద పలువురు నిల్చుని ఉన్నారు. 


మధ్యాహ్నం 4.40 నుంచి 4.50 గంటల మధ్య చిన్నపాటి చిరుజల్లులతో పెనుగాలులు వీచాయి.


 దీంతో మహద్వారానికి ఎదురుగా _వందల ఏళ్ల నాటి రావిచెట్లు_ కిందకు భక్తులు చేరుకున్నారు.


🐘ఒక్కసారిగా వైష్ణవి అనే గజరాజు ఘీంకారం చేయడంతో చెట్టు కింద ఉన్న భక్తులు అప్రమత్తతో పరుగులు తీశారు. 


ఏం జరిగిందోనని తేరుకుని చూసేలోగా అకస్మాత్తుగా  రావిచెట్టు మొదలు రెండు ముక్కలుగా చీలి నేలకొరిగింది. గజరాజు అప్రమత్తం చేయడంతో పెను ప్రమాదం తప్పింది.🙏గోవిందా నీవే  జగతికి రక్ష జై గోవింద🕉️🚩🕉️

*లక్ష్మీ నివాసం

 ------------------------------------

          *లక్ష్మీ నివాసం*

-------------------------------------


 ఒకసారి నారాయణుడు లక్ష్మీదేవి తో ఇలా  అంటాడు 


"ప్రజలలో ఎంత భక్తి పెరిగింది ...  అందరూ నా కరుణ కోసం "నారాయణ నారాయణ" అని నా నామం జపిస్తున్నారు

 

 ఈ మాటలు విని  లక్ష్మీదేవి

 " అది మీకోసం కాదు నా కరుణా కటాక్షం కోసమే మీ మీద భక్తి పెరిగింది అని అంటుంది.

 

అలా అయితే  జనులంతా లక్ష్మీ లక్ష్మీ అని ఎందుకు

జపించటం లేదు అని అంటాడు నారాయణుడు.

 

అలా అయితే ఓ పరీక్ష పెడదాం భక్తులకు అని అంటుంది లక్ష్మీదేవి.


సరే అని అంటాడు నారాయణుడు.

 

              **

 

నారాయణుడు ఒక  బ్రాహ్మణ రూపం ధరించి

ఒక గ్రామం లోని గ్రామాధికారి ఇంటి తలుపు తట్టుతాడు.


 గ్రామాధికారి తలుపు తెరిచి,  మీరు ఎవరు, ఎక్కడ నుండి వచ్చారు?"  అని అడుగుతాడు.


నాపేరు లక్ష్మీపతి.

 నేను వైకుంఠం అనే వూరి వాడిని.

నేను మీ నగరంలో 

హరికథ చెప్పాలని అనికొంటున్నాను 

అని అంటాడు.

 

 దానికి గ్రామాధికారి అలాగా 

మా గ్రామ ప్రజల మహాభాగ్యం. హరికథ విని పుణ్యం సంపాదించు కొంటారు. మీరు ఇక్కడ ఉన్నంత వరకు మీరు నా ఇంట్లో ఉండండి  అని 

అంటాడు.


 గ్రామంలోని కొందరు వ్యక్తులు సమావేశమై అన్ని సన్నాహాలు చేస్తారు.

 

  మొదటి రోజు పది మంది  

వస్తారు.


  రెండవ మరియు మూడవ రోజులలో మంది మరింత పెరిగి కూర్చోటానికి స్థలం లేక నిలబడి భక్తితో వింటూ 

వుంటారు.

 

 ప్రజల అనన్య భక్తి చూసి 

నారాయణుడు అమిత సంతోషపడిపోతాడు.

 

 ఇదంత గమనించిన 

  లక్ష్మీ మాత ఒక  వృద్ధురాలిగా మారి  ఆ గ్రామానికి వచ్చి అప్పడే ఇంటికి తాళం వేసి హరికథ కాలక్షేపం కోసం వెళుతున్న 

ఒక స్త్రీతోని దాహం గా వుంది నాకు కొంచెం నీళ్లు ఇవ్వవా బిడ్డా అని అడుగుతుంది.


 అమ్మా, సమయం  సాయంత్రం 5.00  అయింది నేను హరికథ వినెందుకు వెళుతున్నాను అని అంటుంది.

 

 "నాకు కొన్ని  మంచి నీరు ఇవ్వు తల్లీ   చాలా దాహం వేస్తుంది. నీకు అమితమైన పుణ్యం లభిస్తుందని వృద్దురాలి రూపం లో వున్న 

లక్ష్మీమాత దీనంగా అడగగానే కాదనలేక ఆ స్త్రీ తాళం తీసి ఇత్తడి చెంబుతో నీళ్లు తెచ్చి ఇస్తుంది.


 లక్ష్మీమాత నీరు తాగి ఆ చెంబు తిరిగి ఆ స్త్రీ చేతికి ఇవ్వగానే ఆ చెంబు బంగారం చెంబు గా మారుతుంది.

 

  అది చూసి ఆ స్త్రీ ఆశ్చర్యపోయి రెండు చేతులు జోడించి ఎంత మహిమగల తల్లివి నీవు.

నీకు ఆకలి వేస్తుందేమో వుండు కంచం లో  నీకూ అన్నం పెడతాను

అని అంటుంది. ఆ కంచం కూడ బంగారంది అవుతుంది అన్న ఆశతో.

 

  లేదు బిడ్డ నాకు ఆకలిగా లేదు. నీ హరికథకు  సమయం అవుతుంది అని

అక్కడనుంచి వెళ్లుతుంది.

 

 ఆ స్త్రీ హరికథ కోసం వచ్చి ఈ సంగతి ఆమె చుట్టుపక్కల ఉన్న  మొత్తం ఆడవారికి  చెబుతుంది.

  అది వింటునే  హరికథ వింటున్న స్త్రీలందరు మధ్య లోనే  లేచి వెళ్లిపోతారు.


 మరుసటి రోజు నుండి హరికథ కు వచ్చేవారి సంఖ్య గణనయంగా తగ్గడం తో 

లక్ష్మీపతి  భక్తుల  సంఖ్య ఎందుకు తగ్గుతూ వచ్చింది అని అడుగుతాడు.

 

 అప్పుడు ఎవరో అంటారు 'ఒక మహిమ గల తల్లి గ్రామానికి వచ్చింది. ఆమె ఎవరింటికైన వెళ్లి ఏ వస్తువులో ఏమి తాగిన, తినిన  ఆ వస్తువు బంగారంగా మారుతుంది. అందువలన  భక్తుల సంఖ్య తగ్గింది అని అంటాడు.

 ...

 లక్ష్మీదేవి వచ్చిదని నారాయణుడికి అర్థం అవుతుంది.


ఇది వింటునే ఆ గ్రామాధికారి 

కూడ అక్కడి నుండి మెల్లగా జారుకొని ఆ వృద్దురాలి దగ్గర కు పోయి

 "అమ్మా, నేను హరికథ  నిర్వహిస్తున్నాను అటవంటిది మీరు నా ఇంటిని  ఎందుకు విడిచిపెట్టారు అని అడుగుతాడు.


 అప్పుడు లక్ష్మీమాత ఇలా అంటుంది 

"మీ ఇంటికే  నేను మొదట వచ్చాను!   మీ ఇంట్లో హరికథ చెప్పేవారు  వుండటంతో నేను రాలేదు.  అతను వెళ్లిపోయాకనే నేను వస్తాను.


 ఓస్ ఇంతేనా తల్లీ నేనిప్పడే  వారికి ధర్మశాలలో గది ఇస్తాను అని అక్కడ నుండి

తన ఇంటికి వస్తాడు.

 

 ఆ రోజున  హరికథ అయిన తర్వాత లక్ష్మీపతి తన ఇంటికి వచ్చిన    వెంటనే,  గ్రామాధికారి ఇలా అంటాడు

"మహారాజ్, మీరు మీ పెట్టేబేడ సర్దుకొండి.  ఇప్పటి నుండి  మీరు ధర్మశాలలో వుండండి. అక్కడ మీకూ ఏర్పాట్లు పూర్తయ్యాయి 

అని అంటాడు.


అప్పుడు లక్ష్మీపతి మాట్లాడుతూ,"హరికథ పూర్తి అయ్యెందుకూ   ఇంకా రెండు, మూడు రోజులు మిగిలి ఉన్నాయి.  ఇక్కడనే ఉంటాను అని అంటాడు.


 లేదు - లేదు, మీరు త్వరగా వెళ్లండి.  నేను వినను.  మరొక అతిథికి వసతి కల్పించాలి అని అంటాడు

 

 ఇంతలో లక్ష్మీమాత  వచ్చి, గ్రామాధికారిని  మీరు కొంచెం బయటకు వెళ్లండి.  నేను వారితో మాట్లాడుతాను అని

అంటుంది.


  "ప్రభు నువ్వు ఇప్పుడు ఒప్పుకున్నావా నీ భక్తులు నీకోసం కాదు నాకోసం మీనామం జపిస్తున్నారని

అని నవ్వుతూ అంటుంది.


 భగవంతుడు నారాయణుడు ఇలా అన్నాడు, "అవును ఇదంతా నీ ప్రభావం. కానీ నీవు కూడ   ఒక విషయాన్ని అంగీకరించాలి. నీవు నాకోసం వైకుంఠం విడిచి వచ్చావు.


 ఎక్కడ అయితే నాకథలు చెప్పుతారో, భజనలు చేస్తారో (లక్ష్మి) ఖచ్చితంగా అక్కడనే నీవూ వుంటావు అని అంటాడు నవ్వుతూ.


 ఇలా అని నారాయణుడు వైకుంఠానికి అక్కడి నుండి వీడ్కోలు పలికాడు.

నారాయణుడు బయలుదేరిన తర్వాత, మరుసటి రోజు గ్రామాధికారి ఇంటి వద్ద గ్రామస్తులంతా గుంపుగా చేరుతారు.  


ప్రతి ఒక్కరి ఇళ్లలోకి ఈ తల్లి రావాలని అందరూ కోరుకుంటారు, కానీ ఇది ఏమిటి అని అంటారు.


 లక్ష్మీ మాత గ్రామాధికారి మరియు ఇతర గ్రామస్తులందరికీ తో ఇప్పుడు నేను కూడా వెళ్తున్నాను అని అనటంతో


 అందరూ ఒకేసారి 

అమ్మా, ఎందుకు అలా చేస్తున్నారు. మేము ఏమైనా తప్పు చేశామా అని అడుగుతారు.


  నారాయణుడు ఎక్కడ వుంటే అక్కడనే నా నివాసం.మీరు నారాయణుడిని పంపించారు. అందుకే నేనుకూడ ఆయన దగ్గరకు 

పోతున్నాను అని వైకుంఠం చేరుకుంటుంది.



 దేవుని స్మరణ ఉన్నచోట.

 అక్కడ లక్ష్మి నివసిస్తుంది.

 లక్ష్మి వెంట పరిగెత్తే వారికి లక్ష్మీ నిలవదు మరియు లక్ష్మీపతి దొరకడు.Follow this link to join my WhatsApp group: https://chat.whatsapp.com/K6gbxAX4SQ74KMreE5YZYw

         జై శ్రీమన్నారాయణ🙏


(శ్రీ దత్త మహా పీఠంFollow this link to join my WhatsApp group: https://chat.whatsapp.com/K6gbxAX4SQ74KMreE5YZYw Follow this link to join my WhatsApp group: https://chat.whatsapp.com/K6gbxAX4SQ74KMreE5YZYw

*ఇంకా యువకుల్లా

 జారే అరుగుల ధ్యాసే లేదు

పిర్ర పై చిరుగుల ఊసేలేదు

అమ్మ చేతి మురుకులు లేవు

అలసట లేని పరుగులు లేవు

ఎత్తరుగులు మొత్తం పోయే

రచ్చబండలూ మచ్చుకు లేవు

 వీధిలో పిల్లల అల్లరి లేదు

 తాతలు ఇచ్చే చిల్లర లేదు

 ఏడు పెంకులు ఏమైపోయే

 ఎద్దు రంకెలు యాడకి పోయె

ఎక్కడా వెదురు తడికెలు లేవు

ఏ తడికకీ భోగి పిడకలు లేవు

కూరలమ్మే సంతలు లేవు 

పెరుగులమ్మే ముంతలు లేవు

బువ్వా లాటల విందే లేదు

గవ్వలాటలు ముందే లేదు

కుప్పిగంతులు లేనే లేవు 

కళ్ళ గంతలు కానే రావు

డ్రింకు మూతల గోలే లేదు 

బచ్చాలాడే ఇచ్చా లేదు

కోతి కొమ్మచ్చి ఏమైపోయే

అవ్వా అప్పచ్చి ముందే పాయె

గూటీ బిళ్ళా గూటికి పోయే

తొక్కుడు బిళ్ళకు రెక్కలు వచ్చె

గచ్చకాయలు మచ్చుకు లేవు

చింత పిక్కలు లెక్కకూ లేవు

ధారగా కారే ముక్కులు లేవు 

జోరుగా జారే లాగులు లేవు

కొబ్బరి పుచ్చు కొరుకుడు లేదు

కొండముచ్చుని కెలుకుడు లేదు

బట్టన మురికి అంటక పోయె

మనసుకి మురికి జంటగ చేరె

కాకి ఎంగిలి కరువై పోయే

భుజాన చేతులు బరువై పోయె

అన్ని రంగులూ ఏడకో పోయె

ఉన్న రంగులూ మాసికలాయె

దానికితోడు కరోనా వచ్చె

బళ్ళూ, గుళ్ళూ మూసుక పోయె

బడిగంటల ఊసే లేదు

బడికి పోయే ధ్యాసే లేదు

మూతులన్నీ మాస్కుల పాలు

చేతులన్నీ సబ్బుల పాలు

ఆన్ లైన్ లో పాఠాలాయె

అర్థం కాని చదువులాయె

ప్రశ్నలకు జవాబులుండవు

కొన్నాళ్ళకు ప్రశ్నలే ఉండవు

ప్రస్తుత బాల్యం వెలవెల పోయె

దానికి మూల్యం ప్రస్తుత మాయే

రేపటి సంగతి దేవుడి కెరుక

నేటి బాలలకు తప్పని చురక

బాలానందం లేని జీవితం

మానవాళికే మాయని మరక.

మేమే అదృష్టవంతులమ్*!           


*1950-75లో పుట్టిన మేము ఒక ప్రత్యేక తరానికి చెందిన వాళ్ళం*.

చాలా సాధారణ స్థాయి బళ్ళో చదువుకున్నా, దాదాపు మా తరం వాళ్ళు అన్ని విషయాలలో నిష్ణాతులుగా కనిపిస్తారు. 

ఆంగ్ల  మాధ్యమంలో  చదువుకోకున్నా, మాకు ఆ భాష మీద ఉండే పట్టు అమోఘం. ఒక్క ఆంగ్లమే కాదు మేము చదువుకొన్న ప్రతి విషయంలో ఎంతో ప్రతిభ చూపించేవాళ్ళము.  లెక్కలు, సామాన్య శాస్త్రం, సాంఘిక శాస్త్రం ఇంకా అనేక విషయాలు ఎంతో శ్రద్ధతో నేర్చుకునేవాళ్ళము. 

పోటీ చాలా ఎక్కువ ఉన్న ఈ రోజుల్లో అదేమంత గొప్ప విషయంగా కనపడకపోవచ్చు, 

కానీ ఆనాడు ఉన్న సామాజిక -ఆర్థిక  పరిస్థితులకు మేము సాధించింది చాలా ఎక్కువ అనే చెప్పుకోవాలి. 


దాదాపు ప్రతీ కుటుంబంలో కనీసం నల్గురు నుండి ఆరుగురు పిల్లలు ఉండేవాళ్ళు.

*ఇంత పెద్ద కుటుంబం కేవలం తండ్రి సంపాదన పైనే ఆధార పడేది...*

అంటే అందరికీ కడుపునిండా తిండి దొరకటమే కష్టం అయ్యేది.

పొద్దున్నే చద్దన్నం, మధ్యాహ్నం మామూలు భోజనం ఉండేది. రాత్రికి కూడా అంతే.

*పండగ రోజుల్లో మాత్రం కాస్త ప్రత్యేకంగా ఉండేది. బొగ్గుల కుంపటిలోనో, కట్టెల పొయ్యిలోనో వంటలు చేసి, ఇంత మంది పిల్లలను పెంచిన ఆ నాటి తల్లి-దండ్రుల ఋణం ఎంత ఇచ్చినా తీర్చుకోలేము.* 


దాదాపు అందరం దుంపల బడిలోనో ప్రభుత్వ ఉచిత పాఠశాలలోనో చదువుకొన్న వాళ్ళమే. మాలో చాలా మంది డిగ్రీ చదువులకు వెళ్లేవరకూ చెప్పులు లేకుండా నడిచిన వాళ్ళమే!  


ఆ రోజుల్లో  చాలా సాధారణంగా ఉండేది. బడి చదువులు అయిన వెంటనే తల్లి-దండ్రులు తమ బిడ్డలకు ఏదో ఒక ప్రభుత్వ ఉద్యోగం వస్తే చాలు అనుకునేవాళ్ళు.  

ఆ రోజులల్లో ప్రభుత్వ డిగ్రీ చేసి PG చేసిన వాళ్ళు తక్కువే.


మా తరం వాళ్లకి సినిమా, రేడియో తప్ప వేరే వినోదం ఉండేది కాదు.

*మూడు అణాలు ఇచ్చి తెరకు దగ్గరగా కూర్చొని చూసిన సినిమాలు ఎన్నో.* 


అదీ కాకుండా, రేడియోలో పాత, కొత్త పాటలు వినటం ఎంతో ఇష్టంగా ఉండేది. ఘంటసాల వెంకటేశ్వరరావు, పిఠాపురం నాగేశ్వరరావు , మాధవపెద్ది సత్యం, సుశీల, లీల, జిక్కీ గార్లు పాడిన తెలుగు పాటలు అంటే పడి చచ్చేవాళ్ళం.

ఇక హిందీ పాటల విషయానికొస్తే, పాటల ట్యూన్ ని బట్టి సంగీత దర్శకులెవరో చెప్పే వాళ్ళం. SD బర్మన్, నౌషాద్, మదన్ మోహన్, శంకర్ జైకిషన్, లక్ష్మీ కాంత్  ప్యారేలాల్,కళ్యాణ్ జీ ఆనంద్ జీ ... ఒకరేమిటి, ఎన్ని పేర్లు చెప్పుకోవాలో తెలియదు. ఈ సంగీత సామ్రాట్టులు అందించిన పాటలు ఈనాటికీ శ్రోతల హృదయాలలో చిరస్థాయిగా నిలిచి ఉన్నాయి.


మాకు ఉన్న మరో వినోదం 

పగలు గూటిబైళ్ల గోళీలాట, ఏడుపెంకులాట, బుచ్చలాట.

రాత్రికి హరికథలు, బుర్ర కథలు, నాటకాలు చూడటం ఇదే వినోద కాలక్షేపం.


ఈనాటికీ దాదాపు అందరం 50-75 సంవత్సరాలు పూర్తి చేసుకున్నవాళ్ళమే. జీవితంలో ఉన్నత ఉద్యోగాలు చేసుకున్నవాళ్ళమే. పిల్లలను పై చదువులు చదివించి ప్రయోజకుల్ని చేసినవాళ్ళమే!


అయినా ఉత్సాహం ఏమాత్రం తగ్గక *ఇంకా యువకుల్లా కనిపిస్తున్నవాళ్ళమే*.

ఈ వయసులో కూడా మన చిన్నప్పటి స్నేహితులను పేరు పేరునా గుర్తుంచుకొని పిలుస్తున్న వాళ్ళమే.   

*ఇక మాకన్నా అదృష్టవంతు లెవరుంటారు?*

*ఆహా! జ్ఞాపకాల దొంతర అంటే ఇదీ!! అచ్చంగా మన బాల్యాన్నిమనమే రాసుకున్నట్టుగానే వుంది*.


*1950-75పుట్టిన వారికి అంకితం*. 

🙏🙏🙏🙏🙏

ఆర్య చాణక్య*♦️ *పార్ట్ - 79*

 🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹

.    *🌹చారిత్రాత్మక కథాస్రవంతి🌹*

.           ♦️ *ఆర్య చాణక్య*♦️


*పార్ట్ - 79*


అంతవరకూ నాలుగుదిక్కులా శత్రు సైన్యాలను ఎదిరించి పోరాడుతున్న మగధ సైన్యాలలో ఏదో తిరగబాటు జరిగినట్లు కోట లోపలినుంచే మాగధులపై మాగధులే వెనకనుంచి దాడి చేశారు. 


అప్పటివరకూ జరిగిన యుద్ధంలో అటు నందులకి అనుకూలురైన సైనికులూ, ఇటు పర్వతక అనుకూలురైన సైన్యాలూ దాదాపుగా నాశనమయ్యాక ... లోపల నుంచి వెనకదాడి చేసిన మాగధులు మిగిలిన నందానుకూల సైన్యాన్ని ఊచకోత కోస్తూ దారిచేస్తూ "జయహో ... మౌర్య చంద్రగుప్త సార్వభౌములకు... జయ... జయ..." అంటూ పెద్దపెట్టున జయ జయ ధ్వనాలు చెయ్యసాగారు. 


అంతవరకూ అసాధ్యమనిపించిన మార్గం శులభసాధ్యమై చంద్రగుప్తుని సేనలు అన్ని మార్గాలలో నుంచీ కోటలోనికి జోరబడ్డాయి. కానీ అప్పటికే నందానుకూలులందరూ నశించి పోవడం చేత చంద్రుని సేనాసమూహాలను ప్రతిఘటించే వారే లేకపోయారు. భద్రభట, బాగురాయణాది ముఖ్యులంతా ఓటమిని అంగీకరిస్తూ శ్వేత పతాకాలు ధరించి చంద్రుని సేనలకు స్వాగతం పలికారు. 


అప్పటివరకూ బీరాలు పలుకుతూ అహంకారంతో ప్రవర్తించిన నందులు ఒక్కసారిగా పరిస్థితి తారుమారయ్యేసరికి జీవసిద్ధిని ఆశ్రయించడానికి పరుగులు తీశారు. చంద్రగుప్తుడు అశ్వారూడుడై వాళ్ళని వెంబడించాడు. 


నందులు ఎనమండ్రుగురిని మార్గమధ్యంలోనే ప్రతిఘటించాడు చంద్రగుప్తుడు. తన కన్న తండ్రికి నందులు చేసిన ద్రోహాన్ని గుర్తుకు తెచ్చుకొని వీరావేశంతో విజృంభించిన చంద్రగుప్తుడు నందులను వెంటాడి, వేటాడి యాగశాల వద్ద ఒక్కొక్క వ్రేటుకి ఒక్కొక్క నందుడి తలనరికి వేశాడు. 


ఎనమండ్రుగురు నందుల శిరస్సులూ బంతుల్లా ఎగురుతూ వెళ్లి హోమాగ్రిలో పడి భగభగ మాడి మసైపోతుంటే .... ఆనాటి మహానందుల వారి కల్పిత అగ్ని ప్రమాద మరణానికి ప్రతీకారం తీర్చుకున్న చంద్రగుప్తుడు సంబరంతో చిందులు త్రొక్కుతూ ... "అమ్మా... పగ తీర్చుకున్నాను... తండ్రిగారి దుర్మరణానికి కారకులైన దుష్టనందుల మీద పగతీర్చుకున్నాను. తల్లీ... పగతీర్చుకున్నాను...." అంటూ ఆనందంతో పోలికేకలు పెట్టాడు. 


సరిగ్గా అప్పుడే అక్కడికి పరిగెత్తుకువచ్చిన రాక్షసమాత్యుడు హోమగుండంలో కాలి పెటపెట లాడుతూ కపాలమోక్షమవుతున్న నందుల శిరస్సుల ద్వంస దృశ్యాన్ని చూస్తూ మ్రాన్పడిపోయాడు. 

(ఇంకా ఉంది)...🙏


*సేకరణ:- శ్రీ రమణమూర్తి గారి వాట్సాప్ పోస్ట్.* 

🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

ఈ రోజు పద్యము

 179వ రోజు: (శని వారము) 03-06-2023

మన మాతృ భాష సేవలో ఈ రోజు పద్యము:


మాతృభాష నేడు మాకు రాదని పల్కు 

జనులు పెరుగు చుండె జగతిలోన 

'అమ్మ' బాసమరువ నధమాధముండగు 

తెలిసి మెలగ మేలు తెలుగు బాల


ఈ ప్రపంచము నందు మాతృ భాషలో చదువుట, వ్రాయుట రాదని చెప్పేవారు ఎక్కువగుచున్నారు. వారు కాలాంతరములో ఏ భాషయందు కూడ పూర్తి నైపుణ్యము (పరిజ్ఞానము)

 లేని వారుగా (రెంటికి చెడిన రేవడి చందాన) తయారగుచున్నారు. 

 

ఈ రోజు పదము. 

అశ్వజాతులు : ఆవర్తి, చోస్కము, జన్నడు, టాంగన్గుఱ్ఱము, నీలడు, పంచకళ్యాణి, పంచభద్రము, పుజవారువము, పూజావాజి, బొల్లడు, భూకలము, యవనము, వనాయుజము, వోల్లాహము, హలుహారము.

మనోనిగ్రహం

 మనోనిగ్రహం


గీత మాటిమాటికీ సమత్వం బోధిస్తుంది.కష్టంకాని, సుఖంలోకాని ఏవిధమైన ఉద్వేగమూ ఉండరాదని చెపుతుంది. ''దుఃఖే ష్వనుద్విగ్న మనాః సుఖేషు విగతస్పృహః'' ఈ స్థితి మనకు రావాలంటే మనం పరిపూర్ణంగా ఈశ్వరుని శరణుజొచ్చితేకాని రాదు. ఈవిషయంలో భగవానులు చక్కగా నిస్సందేహమైన ఆదేశాలు ఇస్తున్నారు. 'యుక్త ఆసీత మత్పరః' 'మామేకం శరణం వ్రజ' 'వాసుదేవ స్సర్వమితి' అన్నిటినీ సమభావంలో చూడలేక కోరికలతో క్రోధాలతో తన మనస్సు రెపరెప లాడుతూంటే, సమర్పణబుద్ధితో తన ధర్మాన్ని చేయలేనివాడు అయుక్తుడని అంటుంది గీత. అయుక్తునికి బుద్ధీలేదు, భావనాలేదు. భావనఅంటే భక్తితోడి శరణాగతి. ఎప్పుడైతే వానికి భావన లేకపోయిందో, వానికి శాంతిసైతమూలేదు శాంతిలేనివానికి సుఖమెక్కడిది? 'అశాంతస్య కుతస్సుఖం' ఈగీతోపదేశాన్ని అనుసరించే, త్యాగయ్య 'శాంతములేక సౌఖ్యమూలేదు' అని గానంచేశారు. ప్రాపంచిక సుఖాలపై తరచు మళ్ళే మనస్సు నిత్యసౌఖ్యాన్ని తెలుసుకోలేక, చిల్లిపడిన నేతికడవవలె ఎన్నడూ నిండక భంగపడుతుంది. గీతాశాస్త్రంలో మనం చూచే యోగం పరోక్షజ్ఞానానికీ, అపరోక్షజ్ఞానానికీ రెంటికే అవసరమని తేలుతున్నది. 


ఐతే గీతలో యోగసందర్భంగా ఉపయోగింపబడిన సమత్వానికి అర్థం ఏకత్వంకాదు. రాజూ, రౌతూ సమమనికాదు దానికి అర్థం. సుఖదుఃఖాలను సమభావంగా చూడటమే దాని ఉద్దేశం. సారాంశమేమిటంటే నియతకర్మలను చేయుమనీ, ఆ చేయడమున్నూ ఫలాభిసక్తి లేక భక్తితో ఆర్ద్రమైన హృదయంతో చేయుమనీ, కర్మ పూర్తికాగానే అది ఈశ్వరార్పితం చేయుమనిన్నీ, ఈఆదేశాలు పాటించాలంటే ఇంద్రియనిగ్రహం ఉండాలి. విషయ ప్రపంచంనుండి ఇంద్రియాలను విముఖంచేయాలి. అట్లుకాక విషయాలను చూచినదే తడవుగా మనస్సు కళ్ళెంలేని గుఱ్ఱమువలె పరుగిడిపోతే దానిసాయంతో ఆత్మచింతనగానీ, సత్యదర్శనంగానీ చేయలేము. ఇంద్రియాలచే ఉద్విగ్నమైన మనస్సు ప్రజ్ఞ తప్పిపోయి తుపానులో చిక్కుకొన్న నావవలె అల్లలాడిపోతుంది. 'వాయుర్నావమివాంభసి' మనస్సుకూ, ప్రజ్ఞకూ గీతలో చేయబడిన తారతమ్యం మనం గుర్తించాలి. మనస్సుచేసే పనులను అనుసరించి ఒకొకపుడు బుద్ధి అనీ చిత్తము అనీ వేర్వేరుపదాలతో దానినే వాడుతూంటారు. అంతర్ముఖధ్యానం చేసేది ప్రజ్ఞ గీతలో మనస్సు సముద్రంతోనూ, ప్రజ్ఞ నావతోనూ, ఇంద్రియోద్వేగం తుపానుతోనూ పోల్చబడ్డది. 


ఇంద్రియ నిగ్రహమనే అస్థి భారంపై, స్థితప్రజ్ఞత్వమనే సౌధం కట్టబడింది. ఇంద్రియాలనుఆంతర్ముఖంచేస్తే ఆత్మైకత్వసిద్ధి కలుగుతుంది. ఎన్నినదులు వచ్చి తనలో పడుతున్నా నిశ్చలంగా ఉంటుంది సముద్రం. 'ఆపూర్వమాణ మచల ప్రతిష్ఠం' ఆవిధంగా ఒకని మనస్సు పరివర్తితమైతే అతడు జ్ఞాని. అట్టివాడు నిత్యా నిత్య వివేచనంతో వ్యాపకబ్రహ్మాన్ని అనుసంధానించి ఆ ఆనందానుభూతితో జీవాత్మ పరమాత్మైక్యాన్నిసాధిస్తాడు. ప్రాపంచకుడుదేనిని నిజమని అనుకొంటాడో జ్ఞానికి అదిమిథ్య. అందుచేతనే భగవానుడు అర్జునునికి నీకుతగిన కర్తవ్యం నీవు చేయుమని చెప్పడం. యుద్ధంచేయడం రాజ్యం కోసం కాదు, మనో నిగ్రహంకోసం. మనోనిగ్రహం లాభించిందంటే నైష్కర్మ్యం సిద్ధించి బ్రహ్మనిర్వాణానికి దారితీస్తుంది. ఆత్మ పరమాత్మల ఐక్యమే బ్రహ్మనిర్వాణం.                        


--- “జగద్గురు బోధలు” నుండి


అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం

శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।।


టెలిగ్రామ్ ఆప్ ద్వారా కంచి పరమాచార్య వైభవం పొందాలనుకునేవారు ఈ టెలిగ్రామ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వగలరు.


t.me/KPDSTrust


#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం

గుడికి వెళ్ళటం

 గుడికి వెళ్ళటం వెనుక అంతరార్దం ఏమిటి? ఎందుకు గుడికి వెళతారు?🌷


గుడికి ఎందుకు వెళ్ళాలి ? 



🍒మనలో చాలామందికి గుడికి వెళ్ళే అలవాటు ఉంటుంది. ఆడ-మగ, పెద్ద-చిన్న అనే తేడా లేకుండా మనలో చాలామంది గుళ్ళు గోపురాలను దర్శించుకుంటారు. అసలు గుడికి ఎందుకు వెళ్ళాలి అని ఎప్పుడైనా ప్రశ్నించుకున్నారా? కాసేపు కాలక్షేపం కోసం లేదా ఏమైనా దిగుళ్ళు ఉంటే మర్చిపోవడం కోసం అనుకుంటే పొరపాటు.


🍒గుడికి వెళ్ళడం మొక్కుబడి వ్యవహారం కాదు. ఆలయాలను దర్శించుకోవడం వెనుక శాస్త్రీయ ప్రయోజనాలు ఉన్నాయి. అసలు గుడి ఎప్పుడు, ఎందుకు, ఎలా ఏర్పడింది? దేవాలయాలకు ఎందుకు వెళ్ళాలి, ఈ విషయమై వేదాలు ఏం చెప్తున్నాయి మొదలైన అంశాలు తెలుసుకోవడం చాలా అవసరం.


🍒మనదేశంలో చిన్నా పెద్దా వేలాది దేవాలయాలు ఉన్నాయి. అయితే అవన్నీ వైదిక దేవాలయాల పరిగణనలోకి రావు. నియమాలను పాటించి, నిర్దిష్టంగా నిర్మించిన ఆలయాలను మాత్రమే గురువులు పరిగణిస్తారు. అలాంటివే అత్యంత ప్రసిద్ధి చెందాయి. ఇతర దేవాలయాలు కూడా పవిత్ర ప్రదేశాలే అయినప్పటికీ కొన్ని ఆలయాలు మరింత పునీతమయ్యాయి. స్థలమహత్యాన్ని సంతరించుకున్నాయి.


🍒భూమిలో మహత్తరమైన ఆకర్షణ శక్తి తరంగాలు ఎక్కడ ప్రసరిస్తూ ఉంటాయో అక్కడ ఆలయాన్ని నిర్మించాలి. ఇంకా అర్ధమయ్యేట్లు చెప్పాలంటే ఉత్తర దక్షిణ ధ్రువాల మధ్య ఎలా ఆకర్షణ శక్తి ఉంటుందో అలా భూమిలో పాజిటివ్ ఎనర్జీ పాసయ్యేచోట ప్రసిద్ధ దేవాలయాలు ఉన్నాయి. అందుకే అలాంటి గుళ్ళలో అడుగు పెట్టగానే తనువూ, మనసూ ప్రశాంతత పొందుతాయి.


🍒దేవాలయ గర్భగృహంలో ఉత్క్రుష్టమైన ఆకర్షణా తరంగాలు కేంద్రీకృతమైన చోట మూలవిరాట్టును నిలిపిన ప్రదేశంలో వేదమంత్రాలు రాసిన తామ్ర పత్రాన్ని (రాగి రేకు) నిక్షిప్తం చేసి ఉంచుతారు. రాగి లోహానికి భూమిలో ఉండే శక్తి తరంగాలను గ్రహించే తత్వం ఉంది. ఆవిధంగా రాగి గ్రహించిన ఆకర్షణను ఆ పరిసర ప్రాంతాలకు విడుదల చేస్తుంది. అందువల్ల రోజూ గుడికి వెళ్ళి మూల విరాట్టు ఉన్న గర్భగుడి చుట్టూ ప్రదక్షిణ చేసే అలవాటు ఉన్నవారికి ఆ తరంగాలు సోకి అవి శరీరంలోకి ప్రవహిస్తాయి. ఎప్పుడో ఒకసారి ఆలయానికి వెళ్ళేవారిలో ఆ శక్తి సోకినా గమనించదగ్గ తేడా తెలీదు. కానీ నిత్యం గుడికి వెళ్ళేవారిలో పాజిటివ్ ఎనర్జీ చేరడం స్పష్టంగా తెలుస్తుంది.


🍒ఇకపోతే గర్భగుడి మూడువైపులా పూర్తిగా మూసి ఉండి, ఒక్కవైపు మాత్రమే తెరిచి ఉంటుంది. అందువల్ల గర్భాలయంలో, ముఖద్వారం దగ్గర పాజిటివ్ ఎనర్జీ కేంద్రీకృతమై మరీ అధికంగా ఉంటుంది. గర్భగుడిలో వెలిగించే దీపం ఉత్పత్తి చేసే శక్తి కూడా చెప్పుకోదగ్గదే.


🍒ఆలయాల్లో గంటలు మోగిస్తారు. వేద మంత్రాలు పఠిస్తారు. భక్తి గీతాలు ఆలపిస్తారు. ఈ మధుర ధ్వనులు శక్తిని సమకూరుస్తాయి.


🍒గుడిలో దేవుడికి సమర్పించే పుష్పాలు, కర్పూర హారతి, అగరొత్తులు, గంధం, పసుపు, కుంకుమల నుంచి వచ్చే పరిమళాలు శరీరంలో రసాయన చర్య జరపడంవల్ల శక్తి విడుదల అవుతుంది.


🍒మూల విరాట్టును ప్రతిష్ఠించిన ప్రదేశం నుండి విడుదలయ్యే మహత్తర శక్తి తరంగాలకు గుడిగంటలు, మంత్ర ఘోష, పూల పరిమళాలు, కర్పూరం, అగరొత్తులు, గంధం, పసుపు, కుంకుమల నుండి వచ్చే అపురూపమైన సుగంధం, తీర్థ ప్రసాదాల్లో ఉండే ఔషధ గుణాలు అన్నీ కలిసి ఎనలేని మేలు జరుగుతుంది.


🍒గుడిలో దేవుడికి కొబ్బరికాయ, అరటిపళ్ళు నైవేద్యం పెడతారు. ఈ కొబ్బరిని, అరటిపళ్ళని భక్తులకు ప్రసాదంగా ఇస్తారు. వీటిని సేవించడం వల్ల శరీరానికి అవసరమైన అనేక ఔషధాలు అందుతాయి.


🍒తీర్థంలో పచ్చ కర్పూరం, యాలుకలు, సాంబ్రాణి (సంబరేను చెట్టునుండి వచ్చే ధూపద్రవ్యం లేదా సాంబ్రాణి తైలము), తులసి పత్రాలు, లవంగాలు మొదలైనవి కలుపుతారు. ఆయా పదార్థాలు అన్నీ ఔషధగుణాలు కలిగినవే. అలా గుడికి వెళ్ళినవారు సేవించే తీర్థం ఎంతో మేలు చేస్తుంది. రక్తాన్ని శుద్ధి చేస్తుంది. ఆయురారోగ్యాలను ఇస్తుంది. ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉండేందుకు తోడ్పడుతుంది.


🍒ఇప్పుడు చాలామంది పాటించడంలేదు కానీ పూర్వం ఆలయానికి వెళ్ళేప్పుడు పురుషులు చొక్కా (షర్టు) లేకుండా వెళ్ళేవారు. దాంతో ఆలయ ప్రాంగణంలో ఉండే శక్తి తరంగాలు వేగంగా పురుషుల శరీరంలో ప్రవేశిస్తాయి. స్త్రీలు నిండుగా దుస్తులు వేసుకుని అనవసరమైన చూపులు తమపై పడకుండా జాగ్రత్త పడటం మన సంప్రదాయం కనుక అందుకు బదులుగా నగలు ధరించి వెళ్ళేవారు.


🍒లోహానికి శక్తి తరంగాలను త్వరితంగా గ్రహించే శక్తి ఉంటుంది. ఆవిధంగా స్త్రీపురుషులిద్దరికీ ప్రయోజనం కలుగుతుంది.


🍒భక్తులు గుడికి వెళ్ళి దేవుని దర్శించుకుంటున్న సమయంలో గర్భగుడిలో దీపం వెలుగుతుంటుంది. కర్పూరహారతి వెలిగిస్తారు. గంటలు మోగుతాయి.తీర్థ ప్రసాదాలు ఇస్తారు. అలా అన్ని పాజిటివ్ ఎనర్జీలూ సమీకృతమై భక్తులకు ఆనందం, ఆరోగ్యం లభిస్తాయి. మనలో దివ్య శక్తి ప్రవేశించి, తేజస్సు అనుభూతికొస్తుంది. కనుక ఆలయానికి వెళ్ళడం కాలక్షేపం కోసం కాదు, ఎన్నో శక్తి తరంగాలు ప్రవేశిస్తాయని శాస్త్రాలు నిరూపిస్తున్నాయి…

పోతన గారి మనోచిత్రణం !


             చొప్పకట్ల.


పోతన గారి మనోచిత్రణం !


మ: తన వేంచేయు పదంబు పేర్కొనఁ డనాధ స్త్రీ జనాలాపముల్

వినెనో? మ్రుచ్చులు మ్రుచ్చిలించిరొ ఖలుల్ వేదప్రపంచంబులన్?

దనుజానీకము దేవతానగరిపై దండెత్తెనో? భక్తులం

గని చక్రాయుధుఁడేడి ? చూపుఁడని ధిక్కరించిరో దుర్జనుల్;


పోతనగారి భాగవతం--గజేంద్రమోక్షము-


శ్రీమదాంధ్రమహా భాగవతమున ప్రసిధ్ధ ఘట్టము "గజేంద్రమోక్షము" అటు కథాపరంగాను ఇటు కవితాపరంగానూ మహోన్నత స్థితికి తావలమైనది ఆకథ.గజేంద్రుని మొఱవిని ఉన్నపాటున నిరాయుధుడై భార్య చేలాంచల హస్తుడై పరువెత్తు మగని యారాటమును జూచి వెరగుపడి యతనివెనుక వినువీధిలో పరువెత్తు శ్రీమహాలక్ష్మి యొక్కచిత్తమునందలి సందేహములను పోతన కడు రమణీయముగా చిత్రిం చినాడు. అదియే పైపద్యము.


శ్రీపతి ఉన్నపాటున పరువెత్తు చున్నాడు. యిదెంత చిత్రం! యెక్కడికి వెళుతున్నాడో తెలియదు.చెప్పనైనా చెప్పడు. ఎక్కడికబ్బాఈపరుగు.? అని యించుక వితర్కించి, గతంలో వేద రక్షణకు, భక్త రక్షణకు అతడుపడిన పాట్లు స్మరణకురాగా

అనుకొను చున్నదట!(తనలో) ఈయన యెటువెళ్ళుచు న్నాడో చెప్పటంలేదు.బహుశః మరోసారి వేదాలనెవరైనా దొంగిలించుకొని పోయారేమో? ఒకసారి సోమకాసురు డెత్తుకుపోతే మత్స్యావతారమెత్తి వాడిని సంహరించి తెచ్చాడుగదూ?


లేకపోతే, అనాధయైన వనిత రక్షింపుమని యార్తనాదం చేసిందోయేమో? ద్రౌపది విషయంలో జరిగిన దదేకదా! అప్పుడూ యింతే ! అక్షక్రీడ మధ్యలోనుండగా నన్ను వదలి పరుగెత్తలేదా? లేక పోతే ,రాక్షసులేమైనా అమరావతిపై దండయాత్రచేశారో యేమో? వారికదేపనీ, వీరికిదేపనీ ,మధ్యలో నాకూ యీ తిప్పలు. లేదా!, ఈయనగారి భక్తులను పట్టుకొని

మీశ్రీహరి యెక్కడరా? చూపండి? అనిదుర్మార్గులెవరైనా భక్తులను బాధించినారో యేమో? (గతంలోహిరణ్యకశ్యపుడు ప్రహ్లాదుని అలాగే బాధించాడుగదా)


ఏంమొగుడో? ఏమీచెప్పడాయె! పోనీ అడుగుదామా?


" అడిగెదనని కడువడిఁ జను.

అడిగినదన మగుడ నుడువడని నడయుడుగున్,

వెడవెడ జిడిముడిఁ దడబడ,

నడుగిడు.నడుగిడదు. జడిమ నడుగిడు నెడలన్;


ఆహా! ఏమీపద్యము! డకార యమకమున లక్ష్మి మనస్సు లోని యూగిసలాటను ఊటాడించినాడు పోతన! అడుగుదామని రెండడుగులు తొందర తొందరగా ముందుకేస్తున్నదట. ఆఁ అడిగినా యీతొందరలో బదులుచెప్పేనా? సందేహమే? మరెందుకులేయని రెండగులు వెనక్కు వేయుచున్నదట. దారిపొడుగునా యిదే పని. ముందుకూ వెనక్కూ లక్ష్మియూగిసలాట!పై పద్యము చదివినచో హృదయసంబంధమైన 

వ్యాధులు రావని పెద్దలు చెబుతారు.

చూచితిరా! పోతన రచనాశిల్పము! అది యనల్పము. అదిపరమేశ్వర కటాక్షము. శారదాదేవి యనుగ్రహము. అదియే అతనికవితలోని జీవము. సాహిత్య పిపాసులకందజేయు కవితామృత రసాయనం !భాగవతం చదవండి! బాగుపడండి!

జయహో! పోతన కవీంద్రా! జయతు ! జయతు!

--       ...

                 స్వస్తి!🙏🙏💐💐💐💐💐🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷