20, జనవరి 2023, శుక్రవారం

"ఏ ఆవ్ రా బా వా "

 ఒకసారి శ్రీకృష్ణ దేవరాయలు తన ఆస్థాన కవులందరికీ ఒక పరీక్ష పెట్టాడు.


" మీరు ఐదు అక్షరాల పదం ఒకటి రూపొందించాలి. ఒక్కొక్క అక్షరం ఒక్కొక్క భాషలో పుండాలి. ఆ ఒక్కొక్క అక్షరానికి ఆ భాషలో ఏమి అర్థమో మిగిలిన నాలుగు భాషల్లో కూడా అదే అర్థం వుండాలి.


అంతేకాక ఆ ఐదక్షరాల పదంకూడాvఅర్థవంతంగా వుండాలి. దీనికి సమాధానం రేపు సభాముఖంగా నాకు చెప్పండి."


కవులలో కలకలం బయలుదేరింది.


విచిత్రమైన సమస్య అనుకుని ఎవరింటికి వారు బయల్దేరి వెళ్లారు.


మన తెనాలి రామకృష్ణకు నిద్రపట్టడం లేదు. తన బావమరిది ఇంటికెళ్ళి అక్కడ పశువుల పాకలో మంచంవేసుకుని దీర్ఘాలోచనలో మునిగిపోయాడు‌.


అర్థరాత్రి అయినది. ఆ సమయానికి పశువులశాలలో ఒక ఆవు దూడను ప్రసవించినది. వెంటనే రామ కృష్ణుడు " బావా! బావా! ఆవు ఈనింది‌" అని కేకలు వేశాడు. నిద్రమత్తులో నున్న బావమరిది ఆ మాటలు విని " ఏ ఆవ్ రా బా వా " అని అడిగాడు. రామకృష్ణకు వెంటనే ఏదో స్ఫురించింది. ఎగిరి గంతేసాడు.


మరునాడు మహారాజు సభ తీర్చాడు.


"అందరూ సిద్ధంగావున్నారా" రాయలవారి మాట విన్న కవులు ఏమీ మాట్లాడలేదు.


కాని రామకృష్ణుడు మాత్రం లేచి " నేను సిద్ధమే" అన్నాడు.


మహారాజు: ఏదీ ఆ పదం చెప్పు!


రామకృష్ణుడు: "ఏ ఆవ్ రా బా వా "


'ఏ' అనగా మరాఠీలో 'రా' అని అర్థము.*


'ఆవ్ ' అనగా హిందీలో ' రా' అని అర్థము.


'రా' అనగా తెలుగులో 'రా' అనే కదా అర్థము!


'బా' అనగా కన్నడ భాషలో 'రా' అని అర్థము.


' వా' అనగా తమిళంలో 'రా' అని అర్థము.


ఈ అయిదు అక్షరాలూ అయిదు భాషలకు చెందినవి. ఈ అయిదు అక్షరములు కలిసిన పదం " ఏ ఆవ్ రా బా వా" ఇదికూడా అర్థవంతమైన పదమే!


తెనాలి రామకృష్ణుడి వివరణతో మహారాజుకు మహదానందం కలిగింది.


రామకృష్ణునికి భూరి బహుమానాలు లభించాయని వేరే చెప్పాలా !😊😊

*జ్ఞాన, మోక్ష ప్రదాత*

 🙏 *ఓం నారాయణ- ఆదినారాయణ* 🙏


*గ్రంథం:* ధర్మమూర్తి , భగవాన్ శ్రీ శ్రీ శ్రీ వెంకయ్య స్వామివారి దివ్య చరిత్ర

*రచన:* శ్రీ పెసల సుబ్బరామయ్య మాష్టర్ 


*జ్ఞాన, మోక్ష ప్రదాత*


*"మీరు నన్ను వదిలినా నేను మిమ్ములను వదలనయ్యా!, వాళ్ళుండే దాన్ని బట్టి గదయ్యా మనముండేది!"* ఈ రెండు అభయాలూ ఈ ధర్మమూర్తితో పరిచయమున్న ప్రతి వారికీ అనుభవమే.


మనం అజ్ఞానాంధకారంలో మునిగి సాధన చేసి మన మాలిన్యం పోగొట్టుకోలేక పోయినప్పటికీ ఆ ధర్మ ప్రభువును హృదయ పూర్వకంగా ప్రేమించి సేవించినట్లయిన ఆ మహనీయుడే మనలను సంస్కరించి మనకు తెలియకుండానే మనం మన దుష్ట సంస్కారాల నుండి బయటపడేటట్లు చేస్తారు.


శ్రీ స్వామి వారి సేవలో ఉన్న నరసమ్మకు ఇంటికి వెళ్ళి అందరినీ చూచి రావాలని కోరిక కలిగినది. అలా పోసాగితే మనం మమకార బంధంలో తగుల్కుంటామని శ్రీ స్వామి వారికి తెలుసు. ఒక నెల రోజుల పాటు ప్రతి నిత్యం ఇంటికి పోయి రావాలని శ్రీ స్వామి వారిని అడిగినప్పుడంతా వారంగీకరించక ఆమె తనను వదిలి పెట్టి ఇంటికి వెళ్ళేందుకు అనుమతి ఇవ్వలేదు. ఒక నెల తర్వాత ఆమె గుండంనకు సాంబ్రాణి, నవధాన్యములు సమర్పించేందుకు రాగానే శ్రీ స్వామివారు . *నరసమ్మ చచ్చిపోయిందను కున్నానే!"* అన్నారు.


 అందరూ ఆ మాట విని నవ్వుకున్నారు. కొందరు సేవలకులు ఆమె త్వరలోనే స్వర్గస్తురాలు కానున్నదని భాష్యం చెప్పారు. కానిచిత్రంగా తెల్లవారి నుండి ఆమెకు ఇంటికి పోవాలనే తలంపే రాలేదు.ఆ తర్వాత పద్దెనిమిది సంవత్సరాలు శ్రీ స్వామి వారి సేవలోనే ఒక్క రోజు కూడా ఏమారకుండా ఉంది. ఇంతటి గొప్ప సహాయం శ్రీ స్వామి వారి నుండి ఎలా పొందింది? అది *ఆమె శ్రీ స్వామి వారిని హృదయ పూర్వకంగా సేవించినందువలననే సాధ్యమయ్యింది.*


ఈమె సేవకు నేను (రచయిత) చూచిన రెండు ఉదాహరణలు : కుండ పోత వర్షము, చిమ్మ చీకటిలో రెండు కిలో మీటర్లు నడిచి, గుడ్డలు తడిచిపోయి, చలికి వణికి పోతూ శ్రీ స్వామి వారి సేవకులకు పదిమందికి సరిపోయే అన్నం కూరలు నెత్తిన పెట్టి మోసుకొచ్చింది..


మరొక రోజు ఐదు కిలోల సజ్జలు విసిరి కుడుములు చేసి అందులోకి మిరప్పొడి తెచ్చి శ్రీ స్వామి సన్నిధిలో అందరికీ తృప్తిగా పెట్టింది. ఐదు కిలోల సజ్జలు తిరగలిలో విసరడం ఎంత కష్టమో వాటిని కుడుములు చేసేందుకు ఎన్ని కట్టెలు కావాలో యోచించండి. అది *శ్రీ స్వామి అన్ని జీవులలో ఉన్నాడు* అన్న ఆమె విశ్వాసానికి నిదర్శనం. నిత్యమూ ఆమె తులసమ్మ వలె చీమలకు నూకలు అగ్నిహోత్రమునకు నవధాన్యములు శ్రద్ధా భక్తులతో సమకూరుస్తుంది. విశ్వాసము గలవారు శ్రీ స్వామి వారి నుండి పొందలేనిదే లేదు.


*"చచ్చి బూడిదైనా రమ్మంటే వచ్చేదే గదయ్యా!", "వాళ్ళుండే దాన్ని బట్టి గదయ్యా మనముండేది!"* అన్న శ్రీ స్వామివారి మాటలు అక్షర సత్యాలు.


🙏 *ఓం నారాయణ -ఆది నారాయణ*🙏

అక్షంతలు

 *ఇంట్లో ఎల్లప్పుడూ అక్షంతలు ఉండాలా..?*


సాధారణంగా చాలామంది అక్షంతలు ఇంట్లో అంతగా ఉపయోగించరు. ఎప్పుడైనా శుభకార్యాలు చేసుకునేటప్పుడు లేదా పెళ్లి సమయాల్లో వీటిని ఎక్కువగా ఉపయోగిస్తారు.


🌿శాస్త్రం ప్రకారం ఇంట్లో ఎల్లప్పుడూ అక్షంతలు ఉండాలని పండితులు చెప్తున్నారు. ఎందుకంటే.. అక్షంతలు శుభాన్ని సూచిస్తాయి కనుక వాటిని ఇంట్లో ఉంచుకుంటే.. అష్టైశ్వర్యాలు, సకల సౌభాగ్యాలు చేకూరుతాయని నమ్మకం.


🌸1. పూజలో ఉపయోగించిన అక్షంతలని ఒకచోట దాచుకుని ప్రయాణాలకి వెళ్లే వేళ ముఖ్యమైన పనుల మీద బయటకు వెళ్లెటప్పుడు తలపై వేసుకుని బయల్దేరాలి.


🌿ఇలా చేస్తే మీరు తలపెట్టిన లేదా చేయాలనుకున్న కార్యక్రమాలన్నీ దిగ్విజయంగా పూర్తిచేస్తారు. ఇంకా చెప్పాలంటే.. ఎవరైనా మనకి పాదాభివందనం చేస్తే.. వాళ్లని ఆశీర్వదించడానికి కూడా వాడొచ్చు.


🌸2. పూజామందిరంలో దైవాన్నే ఉంచి పూజించాలి తప్ప మన బంధువుల, తల్లిదండ్రులు..


🌿ఇలా ఎవరి చిత్రాలను ఉంచి పూజించకూడదని పురాణాలు చెబుతున్నాయి. పూజ గదిలో దైవాన్ని తప్ప వేరే ఎవ్వరని ఆరాధించరాదని చెప్తున్నారు.


🌸కనుక దైవారాధనకు మాత్రం ఓ ప్రశాంతమైన గదిని ఏర్పాటు చేసుకోవాలి. అప్పుడే మీరు చేయాలనుకున్న పూజ కార్యలు సక్రమంగా జరుగుతాయి.


🌿3. తనంత తానుగా వెలసిన మూలవిరాట్టు పుంగవులచే ప్రతిష్టమైన, మూలవిరాట్టుండి, ప్రవహించే నది ఒడ్డున ఏ దేవాలయంలో కనిపిస్తుందో దానిని క్షేత్రమని అంటారు.


🌸అలా కానిది దేవాలయం. ఇక శిఖరం, ధ్వజస్తంభం అనేవి లేనిది మందిరం...


స్వస్తి...🙏🌹

చొల్లంగి_అమావాస్య

 రేపే కోటి జన్మల పాప హారిణి👇

#చొల్లంగి_అమావాస్య / #మౌని_అమావాస్య

సంధర్భంగా శ్రీరామరాజ్యం ఫేస్బుక్ పేజీ వీక్షకుల శ్రేయస్సుకోసం ప్రత్యేక-పరిహారాలు👇

★ఆకస్మికధనప్రాప్తి యోగం కొరకు 

★జాతకంలోవున్న అవయోగాలు తొలగి, అదృష్టం కలగడానికి

★జీవితంలో యోగదశ (కలసిరాక పోవటం, ఆర్ధిక, అప్పుల, మొండిబాకీల బాధలు) కోసం వేచిచూసేవారి కోసం

★కుటుంబకలహాలు, బేధాభిప్రాయాలు తొలగుటకు

★నరఘోష, దృష్ఠిదోషాలు తొలగుటకు

★అపమృత్యు దోషాలు తొలగుటకు

👉ఈ రోజు మధ్యాహ్నం 2గం.ల పోస్టు లో వీక్షించవచ్చు🙏


https://www.facebook.com/sriramaraajyam?mibextid=ZbWKwL

Sriramarajyam శ్రీరామరాజ్యం

*వృక్షో రక్షతి రక్షితః*

 శ్లోకం:☝️

*దశకూప సమా వాపీ*

  *దశవాపి సమో హ్రదః l*

*దశహ్రద సమః పుత్రో*

  *దశపుత్రసమో ద్రుమః ll*


భావం: పది నూతులతో సమానమొక దిగుడు బావి; పది దిగుడు బావులతో సమానము ఒక చెఱువు; పది చెఱువులతో సాటి ఒక పుత్రుడు; పది మంది పుత్రులతో సమానమైనది ఒక్క మహా వృక్షము - అని పెద్దలు చెపుతారు.


*అశ్వత్థమేకం పిచుమందమేకం*

 *న్యగ్రోధమేకం దశతింత్రిణీకం l*

*కపిత్థబిల్వాామలకత్రయం చ*

*పంచామ్రవాపీ నరకం న పశ్యేత్ ll*


భావం: ఒక రావి చెట్టు, ఒక పిచుమంద వృక్షము, ఒక మర్రివృక్షము, పది చింతచెట్లు, వెలగ చెట్లు మూడు, మారేడులు మూడు, పెద్ద ఉసిరిక చెట్లు మూడు, ఐదు మామిళ్లు గల తోటను పెంచి, దానిలో నొక దిగుడుబావిని నిర్మించినవారు నరకమును చూడరు. అనగా స్వర్గమును చూరగొందురని భావము.

    వనములవల్ల సర్వజీవులకు కావలసినవన్నీ పుష్కలముగా లభించగలవనీ, వర్షమునకూ, భూసార పరిరక్షణకూ, ప్రజారోగ్యమునకూ చెట్లు ముఖ్యమనీ మన భారతీయులు, ఏనాడో గ్రహించి ఆచరణలో చూపించారు.🙏

      *వృక్షో రక్షతి రక్షితః*

కాశీ ఖండం - 3*

 *🌹కాశీ ఖండం - 3*


🌈🌈🌈🌈🌈🌈🌈🌈


 *అగస్త్య ప్రస్థానం* 



 అగస్త్య మహర్షి కాశీవిశ్వేశ్వరుని ప్రార్ధించి, భార్య లోపాముద్రతో ఇలా అన్నాడు.... 


 ‘’మన పై ఎంత భారాన్ని దేవతలు పెట్టారో చూశావా? ముని వృత్తి లో ఉండే మనం ఎక్కడ? ఈ కార్యభారం ఎక్కడ? పర్వతాల రెక్కలను ఛేదించిన ఇంద్రునికి, ఇది అసాధ్య మైనదా? ఈ వింధ్యాద్రి అతనినే 

జయించిందా? కల్ప వృక్షం, కామధేనువు, చింతామణి కలిగిఉన్న దేవేంద్రుడు, ముక్కు మూసుకొని తపస్సు చేసుకొనే ఈ బ్రాహ్మణుడిని, ప్రార్ధించటానికి వచ్చాడు. అన్నిటిని దహించగల శక్తి ఉన్న అగ్ని దేవుడికి, ఈ పని అసాధ్యమైందా? దండం ధరించి ప్రాణులను శాసించే యముడు ఈ పని చేయలేడా ఆదిత్యులు, వసువులు, రుద్రులు, విశ్వేదేవులు ఈ స్వల్ప కార్యాన్ని చేయలేక పోయారా? ఇంత మందికి సాధ్యం కాని వింధ్యాద్రి గర్వాపహరణం, నేను చేయగలనని వారు నమ్మారంటే, ఆశ్చర్యంగా ఉంది’’.


 ‘’కాశీ క్షేత్రాన్ని గురించి మహాత్ములు చెప్పిన మాటలు మళ్ళీ మళ్ళీ జ్ఞాపకానికి వస్తున్నాయి. "కాశీలో నివశించే వారికి, అనేక విఘ్నాలు కలుగుతుంటాయి. అలాంటి విఘ్నమే మనకిప్పుడు వచ్చింది.

విశ్వేశ్వరుడు విముఖంగా ఉన్నప్పుడే వ్యతిరేకంగా ప్రవర్తించాలి. కాశీని వదలుట చేతిలోని మోక్షాన్ని వలటమే. పుణ్యం నశిస్తేనే కాశీ నుండి వెళ్ళాలని పిస్తుంది. ఉత్తమ పురుషార్ధమైన మోక్షం కాశీలోనే లభిస్తుంది. ఇది అతి పుణ్య క్షేత్రమని, శ్రుతులు చెబుతున్నాయి. జాబాలి, అరుణి, వరుణ, పింగళ, నాడీ మధ్య ఉన్న అవిముక్త క్షేత్రం కాశి. వాటి మధ్య ఉన్న సుషుమ్నా నాడియే కాశి.  ఇక్కడ ప్రాణం ఉత్క్రమణం జరిగితే, విశ్వనాధుడు మోక్షమిస్తాడు. ఆయనే తారకమంత్రోపదేశం చేస్తాడు. దానితో బ్రహ్మత్వం సిద్ధిస్తుంది. కాశితో సమానమైన క్షేత్రం, విశ్వేశ్వరునికి సమానమైన దైవం లేవు. ఇలాంటి పుణ్యరాశి 

కాశిని, ఇప్పుడు మనం విడిచి పెట్టి వెళ్ళాల్సి వస్తోంది. మనసు స్వాధీనంలో ఉండటం లేదు‘’ అని, మహర్షి దుఃఖాశ్రువులను, ధారాపాతం గా కార్చాడు. 


 దంపతులిద్దరూ విశ్వేశ్వరుని దర్శించారు. స్వామికి 

విన్నవించుకుంటు, ముని....  


 ‘’నువ్వు కాశీ విభుడవు .కనుక నీకు విన్న వించుకోవటానికి వచ్చాను. నేనేమి అపరాధం చేశాను? అన్నపూర్ణా దేవిని వదిలి పెట్టాల్సి వచ్చింది? కాలభైరవా? నువ్వైనా అభయం ఇవ్వవా ?దండ పాణీ ! నువ్వైనా మేము వెళ్ళకుండా చేయలేవా? డుండి  వినాయకా! విఘ్నాలకు అదధిరాజువు. నీకు మా మీద ఎందుకు కోపం కలిగింది? పంచ వినాయకులారా! చింతామణి గణపతీ!కపర్దీ ! ఆశా గజాశ్యా !సిద్ధి వినాయకా ! నేనేమీ కాశీ వదిలి వెళ్ళేంత తప్పుచేయలేదు. ఇతరుల తప్పు ఎంచలేదు. పరులకు అపకారం చేయలేదు. త్రికాలాలో గంగా స్నానంచేసి విశ్వేశ్వరుడిని సందర్శిస్తూ, నా జీవితాన్ని చరితార్ధం చేసుకొంటున్నాను. ప్రతి పర్వంలోను, పంచగంగా యాత్ర చేస్తున్నాను. తల్లీ విశాలాక్షీ !భవానీ ! శివ రంజనీ ! నువ్వైనా కనికరించవా? కాశీ పట్టణ దేవత లారా! నేనేమీ నా స్వార్ధం కోసం కాశీని వదిలి పెట్టి వెళ్లటం లేదు. దేవతల అభ్యర్ధన మేరకు, పరోపకారం కోసమే వెడుతున్నాను. పూర్వం దధీచి, తన ఎముకను ఇంద్రుడికి ఇవ్వ లేదా? బలి తన సర్వస్వాన్ని పోగొట్టుకో లేదా?’ ’అని అందరికి విన్న వించుకొంటూ, మునులను, ఆబాల వృధ్ధులను, వృక్ష జంతు కోటికి మ్రొక్కి, అందరికి వీడ్కోలు చెప్పి, ధర్మపత్ని లోపాముద్ర వ్రేలు పట్టుకొని, ‘’పుణ్య రాశి అయిన కాశిని వదిలి పెట్టి వెళ్తున్నాను.‘’ అని కన్నీరు కారుస్తూ.. చప్పట్లు చరుస్తూ... "అయ్యో కాశీ, కాశీ

అని  అరుస్తూ.."   "శివ, శివ" అని ప్రలాపిస్తూ, కింద పడిపోయాడు మహర్షి. మళ్ళీ కొంచెం స్థిమితపడి, భార్య చేయి ఊతగా తీసుకొని,  ‘’నాకు వినాశం దగ్గర పడింది" అని పలవరిస్తూ ముందుకు కదిలాడు.


 కొద్ది కాలానికే, ఆకాశ మంత ఎత్తు పెరిగి, సూర్య గమనానికి నిరోధంగా ఉన్న, వింధ్యాద్రి వద్దకు చేరుకొన్నారు దంపతులు. 


 వింధ్యాద్రి భయంతో,  ‘’స్వామీ ! నేను మీ సేవకుడిని. ఏమి ఆజ్ఞ?’’ అని వినయంగా వంగి అడిగాడు. దానికి మహర్షి ‘’వింధ్యరాజా! నువ్వు చాలా ప్రాజ్ఞుడవు. నా శక్తి సామర్ధ్యాలు తెలిసిన వాడివి. నేను దక్షిణదేశానికి వెళ్తున్నాను. తిరిగి వచ్చే దాకా ఇలాగే ఉండు‘’ అని చెప్పాడు. మహర్షి కోపపడనందుకు,  సుముఖంగా మాట్లాడి నందుకు, శపించనందుకు వింధ్య పర్వతం సంతోషపడి, అలాగే వినమ్రంగా కిందికి వంగి ఉండిపోయింది.  మహర్షి వింధ్యను దాటి వచ్చాడు. సూర్యుడు మళ్ళీ తన గమనాన్ని నిరాటంకంగా కొన సాగించాడు. ’’నేడోరేపో అగస్త్య మహర్షి తిరిగి వస్తాడు"  అని ఎదురు చూస్తూ, అలానే ఉండి పోయాడు. వింధ్యరాజు. 


 అగస్త్యుడు మళ్ళీ తిరిగి రాడు, వింధ్య ఇక  పైకి లేవడు అనే సంతృప్తితో సూర్యుడు, మరీ ప్రచండంగా, తన దినయాత్ర సాగించాడు. దుష్టుల సంకల్పాలను, ఇలానే, మహాత్ములు నీరు గార్చుతారని, అందరు అనుకొన్నారు.


 అగస్త్యుడు గోదావరి తీరానికి చేరి సంచరిస్తున్నా... ఇంకా మనసులో, కాశి భావం తొలగిపోలేదు. పదే పదే తలుచుకొంటునే ఉన్నాడు. పిచ్చివారి వలె ఇద్దరూ గాలిని చూసి, ‘’కాశీ పట్నం కుశలమేనా ?ఎప్పుడు మళ్ళీ కాశీకి వేడతాము!? అని ప్రశ్నిస్తున్నారు. అంత అవినాభావ సంబంధంతో, వారు కాశీ లో మెలిగారు. కొల్హాపురం చేరి, అక్కడి మహాలక్ష్మి అమ్మ వారిని దర్శించారు. ముల్లోకాలను అడవిపందిగా భయపెట్టిన కోలాసురుడిని సంహరించిన లక్ష్మీదేవి, ఇక్కడ కొలువై ఉంది. మహాలక్ష్మిని, ఇద్దరు, మనసారా స్తోత్రం చేసి ప్రార్ధించారు. ‘’అమ్మా లక్ష్మీ దేవీ ! నువ్వు ఎక్కడ ఉంటె అక్కడ, సమస్త మంగళాలు ఉంటాయి. నువ్వు అనుగ్రహిస్తే అన్నీ చేకూరుతాయి.‘’ అని ప్రార్థించారు. 


 అమ్మవారు ప్రత్యక్షమై,  ‘’మిత్రావరుణ సంభవా! అగస్త్యమునీ ! పతివ్రతా శిరోమణీ లోపాముద్రా !’’ అని సంబోధించి, లోపాముద్రాదేవిని, తన సమీపంలో కూర్చోబెట్టుకొని, ఆమె శరీరాన్ని స్పర్శించింది మహాలక్ష్మి అమ్మ వారు. ’’కోలాహల రాక్షసుని అస్త్రం చేత బాధింపబడ్డ  నా శరీరాన్ని, నీ స్పర్శతో, స్వాస్థ్యo పొందుతున్నాను." ‘అని పలికి , లోపాముద్రను కౌగిలించుకొని, సౌభాగ్యాలకు  కారణాలైన ఆభరణాలతో ఆమెను అలంకరించింది.

 

 మహర్షితో,  ‘’ఋషి సత్తమా !నీ తాప కారణం తెలిసింది. కాశీ ని వదిలినందుకు, నీ మనసు అమిత బాధ పడుతోంది. ఏదైనా వరం ఇవ్వాలని ఉంది"  ‘అన్నది. దానికి ముని,  ‘’అమ్మా మహాలక్ష్మీ ! వరం ఇవ్వ దలిస్తే, మళ్ళీ మాకు కాశి సందర్శన భాగ్యం అనే వరమే ఇవ్వు. ఇంకేమి వద్దు" అన్నాడు. లక్ష్మీదేవి ‘’తధాస్తు" ‘అని దీవించి, స్వస్థత కలిగించింది. 


 ’’మహర్షీ !రాబోయే ద్వాపర యుగంలో పందొమ్మిదవ బ్రహ్మ కాలంలో నువ్వు వ్యాసుడవు అవుతావు. మళ్ళీ వారణాసికి వెళ్లి, వేద శాస్త్రాలను పరిష్కరించి, ధర్మ బోధ చేస్తావు. ప్రస్తుతం ఇక్కడి నుండి నువ్వు బయల్దేరి వెళ్లి స్కందుని దర్శనం చేసుకో. అతడు నీకు వారణాసి రహస్యమంతా వివరంగా చెబుతాడు." అని చెప్పి, ఇద్దరినీ దీవించి, పంపించింది.


 *కాశీఖండం సశేషం..*

🌈🌈🌈🌈🌈🌈🌈🌈

*🅰️🅿️SRINU*

ఆనందం

 🙏 *శుభోదయం* 🙏


*ఆనందం నా సహజ స్థితి...*


*నా ఆనందాన్ని నేను తప్ప మరెవరూ పాడు చేయలేరు...  అవును... మీరు చదివింది నిజమే...*

 

*నా ఆనందాన్ని మరెవరూ పాడు చేయలేరు... నేను తప్ప*


*నా ఆలోచనలోనే నా ఆనందం....*


*నా అనుభూతి లోనే నా ఆనందం...*

 

*నా ప్రతి కదలికలో నా ఆనందం....*

 

*నేను తీసుకునే ప్రతి నిర్ణయంలో నా ఆనందం...*

 

*నేను ఎదుటి వారి పట్ల ప్రవర్తించే తీరులో నా ఆనందం...*


*ప్రకృతి పులకరింతలోనే నా ఆనందం...* 


*ఆప్యాయతతో కూడిన పలకరింపులో నా ఆనందం...*

 

*నా ప్రవర్తన వల్ల ఎదుటివారికి కలిగే సంతోషంలో నా ఆనందం...*


*సమాజం, ప్రకృతి పట్ల బాధ్యతలో నా ఆనందం....* 

 

*ఇంత ఆనందం కూడా నా ఆలోచన కలుషితమైతే దూరమవుతుంది...*

 

*నా భావన కలుషితమైతే ఆనందం నాకు దూరమవుతుంది...*

 

*ఆనందం పొందాలా వద్దా అనేది నా చేతుల్లోనే...*


*ఇప్పుడు నమ్ముతారా నా ఆనందం పాడుచేసేది నేనే అని...*

 

*కలుషితమైన ఆలోచనలతో ఆనందాన్ని దూరం చేసుకోవాలో, విశ్వ జనీనమైన ప్రేమ భావనతో ఆనంద సాగరంలో మునిగి తేలాలో.... నిర్ణయం నాదే...*

  

 

*ఆనందం నా ఉనికి ...*

 

*ఆనందం నా ఊపిరి...*  


*ఆనందం నా సహజ స్థితి....*


🙏🙏🙏🙏🙏

🔵 "ఇం టి పే ర్లు" 🟢

 అతికించినప్రతి


🔵 "ఇం టి పే ర్లు" 🟢

(ఓ మిత్రుడు పంపిన పోస్ట్)


అరవై దాటేలోపు ఆరుసార్లు అమెరికాకైతే వెళ్ళగలిగాను కానీ ఫ్లైట్లో ఇచ్చిన చిన్నఫారమే సరిగ్గా నింపలేకపోయాను. ఆ ఫారమ్‌లో నేమ్‌ అన్న దగ్గర ఫ‌స్ట్‌నేమ్‌, మిడిల్‌నేమ్‌, లాస్ట్‌నేమ్‌ అని మూడుగళ్ళున్నాయి.

 మనకు తెలిసిందల్లా మనపేరు, దాని వెనకాముందు ఓ ఇంటిపేరు. ఆది మధ్యాంతరాలు ఏవో తెలియక ఎలాగోలా ఆ గళ్ళు నింపి బయటపడ్డా. ఇంటిపేర్లు తెచ్చిన తంటా ఎలాంటిదంటే ఒకసారి భయస్తుడైన ఉద్యోగి సర్‌ నేమ్‌ అన్నకాలమ్‌ ఎదుట స్వామిభక్తితో వాళ్ళ బాస్‌ పేరు రాస్తే, అతి భయస్తుడైన భర్త ఎందుకొచ్చిన గొడవని సర్‌నేమ్‌ అన్న కాలమే కొట్టేసి మేడమ్‌ నేమ్‌ అని రాసేసుకుని దాని ఎదురుగా వాళ్ళావిడ పేరు రాసేసి గొప్ప రిలీఫ్‌గా ఫీలయ్యాడట.


గతంలో ఆంధ్ర విశ్వవిద్యాలయ కులపతిగా మేకా రంగయ్య అప్పారావు గారి తరువాత జస్టిస్‌ ఆవుల సాంబశివరావు గార్ని నియమిస్తే పత్రికల వాళ్ళు మేకలు పోయి ఆవులొచ్చాయి అని చమత్కరించారు.

 ఏనుగు లక్ష్మణకవి, కాశీయాత్ర రాసిన ఏనుగుల వీరాస్వామయ్య మనందరికీ పరిచయమే. గుంటూరు ప్రాంతంలో పూర్వం కొందరు ముర్రాజాతి గేదెపాలు అమ్మేవారట. ఆ గేదెకొమ్ములు జంగిలి (అడవి) దున్నల కొమ్ముల్లా ఉండటంతో వూరి వాళ్ళందరూ జంగిలి వాళ్ళింట్లో పాలు కొంటాం అనడంతో వాళ్ళ ఇంటిపేరు జంగిలి అయిపోయిందట.


మనదేశంలో ఇంటిపేర్లు అమెరికా పోయిన మన వాళ్ళకు పేర్లే కావడంతోనే ప్రమాదం. పోయినసారి అమెరికా వెళ్ళినప్పుడు మా బావ ఆనంద్‌ గారి ఇంట్లో ఫోన్‌ రింగైతే నేను ఎత్తితే అవతలి నుంచి ‘పిల్లి స్పీకింగ్‌’ అనగానే కంగారుపడ్డా. తరువాత మా బావ చెప్తే తెలిసింది వారు పిల్లి సురేష్‌ గారని. అదే ఏ పులి వెంకటరెడ్డిగారో ఎత్తితే పులి గాండ్రింగ్‌ అనో, పాముల నర్సయ్యగారో ఎత్తితే పాములు బుస్సింగో అంటారేమో. 

మిగిలిన వాళ్ళేం తక్కువ. వాళ్ళు దూడల స్పీకింగనో, ‘కోడి’ కేరింగనో, కాకి ‘కావిం’గనో అనేస్తే, అవి విని మనం కెవ్వుకెవ్వు అనాల్సొచ్చేది. అమెరికాలో సైతం వృత్తులను ఆధారంగా చేసుకుని ఇంటిపేర్లు వస్తాయట. కమ్మరి పనిచేసేవాళ్ళు smith లు అయితే వడ్రంగి పనిచేసే కుటుంబాలు woods అవుతారు.


మనవైపు ఊళ్ళపేర్లు ఇంటిపేర్లు కావడం సర్వసాధారణం. 

శ్రీరంగం, కాళహస్తి, శ్రీశైలం, అన్నవరం, సింహాచలం, వారణాసి, శంకరంబాడి, ద్రాక్షారం, ప్రయాగ, కంచి, మధురాంతకం, తిరువీధుల, రామేశ్వరం, తిరుమల వంటి పుణ్యక్షేత్రాలతో పాటు గుడివాడ, బెజవాడ, గూడూరు, కడప, కావలి, చల్లపల్లి, కొండపల్లి, గుంటూరు, టంగుటూరు, దర్శి, తెనాలి వూళ్ళు ఇంటిపేర్లయ్యాయి. 

నీళ్ళకు సంబంధించిన చెఱువు, బురదగుంట, కోనేరు, తూము, నూతి, కడలి, రేవు, కలువ కొలను, కాలువ ఇంటిపేర్లయ్యాయి. 


పక్షులైన డేగలు, కోడి, పిచ్చుకలు, కాకి, పావురాల, నెమలి, కొంగర, చిలక, పిట్టల, గువ్వల ఇంటిపేర్లే. కోడి రామ్మూర్తి గారు గతంలో గొప్ప మల్లయోధులు. ఇలాంటి ఇంటిపేర్లతో ప్రమాదమేమిటంటే డేగలవారింటి అబ్బాయికి పిచ్చుకల వారింటి అమ్మాయిని ఇవ్వడానికి వెనుకాడతారేమో. అసలే మన జాతకాలు (హర్రర్‌స్కోప్‌) చూసేవాళ్ళు దేవగణం, రాక్షస గణం, మనిషిగణం అని లెక్కలేసి అమ్మాయి పులి అయితే అబ్బాయి పిల్లి అయ్యాడనో భయపడి పులి తినేస్తుందని (కాకపోయినా అదే జరిగేది) పెళ్ళికి వెనకాడతారు. 


లోహాలైన బంగారు, కంచు, రాగిరెడ్డి, కనకమేడలు, ఆభరణాలైన ఉంగరాలు, వడ్రాణం, సవరం, మెట్ల, కట్టుపోగుల, గాజులు, కడియాలతోపాటు పగడాలు, ముత్యాలు, మాణిక్యాలు, రవ్వలు, వజ్రం కూడా ఇంటిపేర్లయ్యాయి. 


పనిముట్లైన తాపీ, వడంబం, ఉలి, వానం ఇంటిపేర్లే. తాపీ ధర్మారావు గారు గొప్పరచయిత సినీదర్శకులు.


ఉత్తర భారతదేశంలో ఇంటిపేర్ల కథ వేరే విధంగా ఉంటుంది. అగ్నిహోత్రం చేసే కుటుంబాలు అగ్నిహోత్రులు. వారణాశి ప్రాంతంలో నాలుగు వేదాలు చదివిన పండిత కుటుంబీకులు చతుర్వేదులైతే, మూడువేదాలు చదివినవారు త్రివేదిలు, రెండే చదివితే ద్వివేది. సామవేదం చదివితే సామవేదం వారౌతారు. 


అదే ఫ్లోలో ఏ వేదమూ చదవని కుటుంబీకుల్ని నిర్వేదులనాలేమో. బెంగాలీలో బంధోపాధ్యాయులు, చటోపాధ్యాయులు, ముకోపాధ్యాయుల్ని ఎక్కువగా చూస్తాం. నా పరిమిత జ్ఞానంతో ముకోపాధ్యాయులు అంటే ముక్కుతో చదివేవారేమో అనుకునేవాడ్ని. వాజపేయుల, సోమయాజుల ఇలాంటివే మరికొన్ని.


 ఉత్తర భారతదేశంలోని పేర్లమీద మోజుతో ప్రగతిశీలులైన మన తెలుగు సోదరులు కొందరు చాలాకాలం క్రిందటే వాళ్ళ పిల్లలకు టాగూరనో, రాయ్‌ అనో, ఛటర్జీ అనో, బెనర్జీ అనో, గాంధీ అనో, బోస్‌ అనో పేర్లు పెట్టేసారు. ఇలా పేర్లు పెట్టడం బాగానే ఉంది కాని నిజానికి అవి వాళ్ళ పేర్లుకావు. హౌస్‌నేమ్స్‌. ఇది గుర్రాన్ని వదిలి కళ్ళాన్ని పట్టుకున్నట్లే. పేరు ఏదైనేం లెండి అటువంటి పెద్దల పట్ల మనవాళ్ళకు గల భక్తి, గౌరవాలను మనం మెచ్చుకుందాం.


సంగీత ప్రపంచానికి చెందిన సంగీతం, చిడతల, మేళం, అందెల, గజ్జెల, తప్పెట, సన్నాయిలతో పాటు రణరంగానికి చెందిన ఈటెల, బల్లెం, కత్తుల, ఉండేలు, బాణాల, కత్తి, రంపాల కూడా ఇంటిపేర్లయ్యాయి. వృక్ష సంపదనుండి అడవి, తోట, అరణ్య, టేకు, వెదురు, రావి, తుమ్మల, మర్రి, తాడి, మామిడి, నేరెళ్ళ, చింత, జామి, నిమ్మల, నిమ్మకాయల, తోటకూర, వంకాయల, ఉల్లిలతోపాటు వండుకునే పచ్చిపులుసు, తియ్యగూరలు వచ్చి చేరాయి. 


సువాసనలైన గంథం, జవ్వాజి, కస్తూరిలు (‘ఇంటిపేరు కస్తూరి వారు, ఇంట్లో గబ్బిలాల కంపు’ అనే నానుడి తెలిసిందే) ఇంటిపేర్లే! మా మేనమామ గారి ఇంటిపేరు కస్తూరేగాని వాళ్ళింట్లో గబ్బిబాలు లేవు. పూలకుటుంబం నుండి పూదోట, పుష్పాల, పువ్వుల సంపంగి, మల్లెల, మొగలి వచ్చి చేరాయి. పువ్వుల సూరిబాబు గొప్ప రంగస్థల నటులు. పాలకు పలురూపాలైన పాలపర్తి, మజ్జిగ, పెరుగు, వెన్న, నేతి, చల్లలు ఇంటిపేర్లే అల్లం, మిరియాలు, శొంఠిలతోపాటు కారం, ఉప్పు, బెల్లపు కూడా ఇంటిపేర్లే. పాయసం, పానకం, గంజి కూడా ఇంటిపేర్లే.


పెద్దరికాల్ని, పెత్తనాల్ని తెలియజేసే కమతం, సుంకం, సేనాని, మంత్రం, పట్వారి, కరణం, రాయల, అధికారి, యాజమాన్యం, పెద్దింటి, దళవాయి, తలారి, టంకశాల, నీరుకట్టి, సంధానపు, మహాపాత్ర, వాడ్రేవు, పుట్రేవు, పెద్దింటి, పెద్దిరెడ్డిలు ఇంటిపేర్లే. కరణం మల్లీశ్వరి గొప్ప క్రీడాకారిణి. తలారి అనంతబాబు గారు ప్రఖ్యాత న్యాయవాది. మనశరీరంలోని గెడ్డపు, మీసాల, గడ్డం, సవరం, కొప్పు, కొప్పుల, శ్రీపాద, బొడ్డు, బుర్రా, బొజ్ఞా, కడుపు, చెవి, మెడబలిమి, ముక్కు, తలతోటి, పచ్చిగోళ్ళు, గుంటకండ్ల, మొండెం కూడా ఇంటిపేర్లే. న్యాయవాదులుగా ఖ్యాతిపొందిన కొందరికి ప్రతివాది, మహావాదిలుగా ఇంటిపేర్లయ్యాయట.


కొంతమంది అదృష్ట దీపక్‌లను చూస్తే ఆవగింజంత విద్వత్తు, ప్రతిభలేకపోయినా (కాకా) పట్టు పరిశ్రమలో శ్రమించడం వలన రాజ్యసభసభ్యులుగా, ఛైర్మెన్‌లుగా ఎదగడం చూసిన తరువాత వారి ఇంటిపేర్లును ‘పట్టు’ గా మార్చేసి పట్టుప్రవీణ్‌, పట్టుప్రసాద్‌ అనాలపిస్తుంది. సాధారణంగా వీరికి ఏ పార్టీ సిద్ధాంతల మీద నమ్మకం ఉండదు. వీరు మేము ఎప్పటికీ రూలింగ్‌ పార్టీనే అని రూలింగ్‌ ఇచ్చుకున్నఘనులు కనుకనే ఎప్పుడూ ఏదో ఒక పదవిలో ఉండగలరు. వీరి చేత Great Art of Staying in Power అన్న పుస్తకం రాయిస్తే The Best Seller అయిపోతుంది. వీరు సిల్క్ బోర్డ్‌ అధ్యక్షులు కాదగినవారు. పట్టు తోబుట్టువు పుట్టు. కేవలం కొంతమందికి పుట్టినందుకు వీరు నటులైతే తెరంగేట్రం చేసేసి, నాయకులైతే యువనాయకులై పోయి మనల్ని వినోదింపజేస్తున్నామని, సేవించేస్తున్నామని భ్రమింపచేస్తారు. వెనకటికి బ్యాట్‌ ఎటువైపు పట్టుకోవాలో కూడా సరిగ్గా తెలియని యువకుడు ముఖ్యమంత్రి కుమారుడైనందున ఏకంగా రంజీట్రోఫీనే ఆడేశాడు. ఇలాంటి వాళ్ళ ఇంటిపేరు ‘పుట్టి’ గా మార్చేస్తే సరిపోతుంది. నాట్యంలో ముద్రలంటే పోస్టాఫీస్‌ ముద్రలనుకునే వాళ్ళకు పద్మశ్రీలు వచ్చాయిగా. వీళ్ళూ పట్టు పారిశ్రామికులే. వీరి పుణ్యాన పట్టు పరిశ్రమకున్న డిమాండ్‌ ఇంక దేనికీ లేదు.


దేవతారాధనకు సంబంధించిన దీపాల, కర్పూరం, పరమాత్ముని, దేవభక్తుని, దర్భశయనం, బృందావనం, అయాచితం, నటేశం, అగ్నిహోత్రం, అగ్రహారం, పూజారి, మహంకాళి, శ్రీరామకవచం, సంకీర్తనం, సుదర్శనం, అర్చకం, పంచాగ్నుల, పండితారాధ్యుల, శ్రీరామ్‌, ద్వాదశి, నమశ్శివాయ, విష్ణుమొలకల, సరస్వతుల, భాగవతుల, రామాయణం, గుడిసేవ, గుడిమెట్ల లు ఇంటిపేర్లు. పెళ్ళికి సంబంధించిన కళ్యాణం, మేళం, అగ్నిహోత్రం ఇంటిపేర్లే. కళ్యాణం రఘరామయ్యగారు మన తొలి సినిమా కృష్ణులు, ఈలపాటకు ప్రసిద్ధులు.


ఇవన్నీపోగా ఏ కోవకు చెందని ప్రత్యేకంగా అనిపించేవి కర్రతలుపులు, కిళ్ళి, అధ్వానం, చప్పిడి, కొండబోయిన, చోద్యం, జగడం, మొండి, శరణు, శకునాల, ఆకలి, తీగెల, కోడెబోయిన, (ఎన్నిసార్లు దూడల్ని పోగొట్టుకుంటే వారికీ ఇంటిపేరు దక్కిందో) దూడబోయిన, కొత్తావకాయ లాంటివి. ఇరవై ఐదేళ్ళ క్రితమే ఆప్తమిత్రుడు ప్రభాకర్‌ కడప బలిజ గృహనామాల మీద పరిశోధించి డాక్టరేట్‌ సాధించాడు. ఏది ఏమైనా ఇంటిపేర్లు వాటి పుట్టుపూర్వోత్తరాలు మంచి పరిశోధనాయోగ్యమైన విషయమే. అవి తెలుసుకునే కొద్దీ, చరిత్ర, సమాజం పరిణామాలతోపాటు వలసలు, వృత్తులు గురించి మరింత తెలుసుకోవచ్చు.


(ఆప్తమిత్రులు వీణాప్రవీణ దుడ్డు సీతారామయ్యగారికి కృతజ్ఞతలతో...)

పెద్దలు చెపుతారు.

 శ్లోకం:☝️

*దశకూప సమా వాపీ*

  *దశవాపి సమో హ్రదః l*

*దశహ్రద సమః పుత్రో*

  *దశపుత్రసమో ద్రుమః ll*


భావం: పది నూతులతో సమానమొక దిగుడు బావి; పది దిగుడు బావులతో సమానము ఒక చెఱువు; పది చెఱువులతో సాటి ఒక పుత్రుడు; పది మంది పుత్రులతో సమానమైనది ఒక్క మహా వృక్షము - అని పెద్దలు చెపుతారు.


*అశ్వత్థమేకం పిచుమందమేకం*

 *న్యగ్రోధమేకం దశతింత్రిణీకం l*

*కపిత్థబిల్వాామలకత్రయం చ*

*పంచామ్రవాపీ నరకం న పశ్యేత్ ll*


భావం: ఒక రావి చెట్టు, ఒక పిచుమంద వృక్షము, ఒక మర్రివృక్షము, పది చింతచెట్లు, వెలగ చెట్లు మూడు, మారేడులు మూడు, పెద్ద ఉసిరిక చెట్లు మూడు, ఐదు మామిళ్లు గల తోటను పెంచి, దానిలో నొక దిగుడుబావిని నిర్మించినవారు నరకమును చూడరు. అనగా స్వర్గమును చూరగొందురని భావము.

    వనములవల్ల సర్వజీవులకు కావలసినవన్నీ పుష్కలముగా లభించగలవనీ, వర్షమునకూ, భూసార పరిరక్షణకూ, ప్రజారోగ్యమునకూ చెట్లు ముఖ్యమనీ మన భారతీయులు, ఏనాడో గ్రహించి ఆచరణలో చూపించారు.🙏

      *వృక్షో రక్షతి రక్షితః*

నైతిక హక్కు ఎవరికీ లేదు

 #బ్రాహ్మణిజం అంటే...


(పూర్తిగా చదవండి, అర్దం చేసుకోండి, గౌరవించండి, మేల్కొని పాటించండి, 


© ఎవరో బూతులు తిట్టేవిధంగా తప్పుడు సంప్రదాయాన్ని ఆచరించమని బ్రాహ్మణిజం ఏనాడూ ఎవరికీ చెప్పలేదు. నాగరికత వికసిస్తోన్న తొలినాళ్ళలో శుచిగా ఉండమని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోమని చెప్పింది. అలా లేనివాళ్లు దూరంగా ఉండాలన్న నియమాన్ని పెట్టింది శుచి, శుభ్రత పాటించడంకోసం మాత్రమే. ఇక మనిషి పరిణామక్రమం తొలినాళ్ళ నుంచే శ్రమవిభజన స్పష్టంగా వేళ్లూనుకుంది. ఓ దిమ్మరిగా సంచరించే మానవుడు, మరి కొంతమంది తనలాంటి వాళ్ళను కలుపుకొని సమూహంగా, ఆ తరవాత ఇంకొందరిని పోగేసుకుని తెగలుగా ఏర్పడి సంఘజీవిగా రూపాంతరం చెందుతున్న తరుణంలో వాళ్ల, వాళ్ల నైపుణ్యం, మేధస్సు ఆధారంగా పని విభజన జరిగింది. పాలించేతత్త్వం ఉన్న వాళ్లు క్షత్రియులు అని, బోధించే మేధస్సు కలిగిన వాళ్లు బ్రాహ్మణులు అని, వ్యాపార మెళకువలు తెలిసిన వాళ్లు వైశ్యులు అనీ, మిగిలిన వృత్తులలో చాతుర్యం కలవాళ్లు శూద్రులు అని వర్ణవిభజన జరిగి చాతుర్వర్ణ వ్యవస్థ ఏర్పడింది. ఈ ప్రక్రియ ముమ్మాటికీ సహజసిద్దంగా చోటు చేసుకుందే కాని బ్రాహ్మణిజానికి ఏమాత్రం సంబంధం లేని అంశం. ఆ కారణంతో నిందించి, తిట్లతో దుమ్మెత్తి పోయటానికి వర్ణ వ్యవస్థ ఏర్పాటులో బ్రాహ్మణులకు వీసమెత్తు పాత్ర కూడా లేదు. పైగా అది బ్రాహ్మణుల మేధస్సు చూసి మిగిలిన వాళ్లు అక్కసుపడటం మినహా ఇంకోటికాదు అని గుర్తించాలి.

ఇక తాము ఆచరించి, ఆ మంచి అలవాట్లను ఇతరులు కూడా ఆచరించాలని చెప్పడమే  #బ్రాహ్మణవాదం_ముఖ్య_ఉద్దేశ్యం. బ్రాహ్మణులూ, బ్రాహ్మణవాదం రెండు అవిభాజ్యం. వాటిని విడదీసి చూస్తున్నాం, బ్రాహ్మణ కులంలో పుట్టిన వాళ్ళంతా బ్రాహ్మణులు, బ్రాహ్మణవాదులు కారు, ఇందుకు ఫలానావాళ్లు ఉదాహరణ అనడం అవివేకం, మూర్ఖత్వం తప్ప మరొకటి కాదు. ఇక ఇక్కడ తర్కం అంతా బోధించేవాడి బోధనలు అన్నీ సబబేనా, ఐతే మాత్రం అసలు వాళ్లే ఎందుకు బోధించాలి అని ప్రశ్నించే అభ్యుదయ భావజాలంపైనే.

వీటికి సమాధానాలు రావాలంటే అసలు బ్రాహ్మణులు ప్రపంచానికి బోధించింది ఏమిటి ? దాంట్లో మంచి ఉందా లేక చెడునే బోధించారా ? అసలు బ్రాహ్మణవాదం సూత్రీకరించింది ఏమిటి ? అనే అంశాలను లోతుగా చర్చించాలి. ఆ మాటకొస్తే సర్వ కాల సర్వావస్థల్లో, నూటికి నూరు శాతం లోక కళ్యాణం కోసం తపిస్తూ, ఆహరహం సర్వే జనాః సుఖినో భవంతు అని ఆకాంక్షించిందే బ్రాహ్మణిజం అనడంలో ఏ మాత్రం అతిశయోక్తి లేదు.


★ పూర్వ కాలంలో సంచార జీవిగా ఉన్న మానవునికి నదుల ప్రాధాన్యత వివరించి, సంఘజీవిగా మార్చింది బ్రాహ్మణిజం.


★ తాను తినే కందమూలాలతో పాటు పచ్చిమాసం తినే ఇతరులకు ఆహారాన్ని ఉడకబెట్టుకుని తింటే శ్రేయస్కరం అని బోధించింది బ్రాహ్మణిజం.


★ ఉడికించక ఆహరం అట్లానే తింటే ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని సూచించింది బ్రాహ్మణవాదం.


★ పసుపుతో తినే పదార్థాల్లో చెడు బాక్టీరియాను నివారించవచ్చు అని చెప్పిందే బ్రాహ్మణవాదం.


★ నివసించే పరిసరాలను పేడతో అలికితే ఆప్రాంతంలో క్రిములు, కీటకాలు నశించి అక్కడి నివసితులకు రోగాలు రాకుండా ఉంటుందని సూత్రీకరించింది బ్రాహ్మణ వాదం.


★ ఊరు పొలిమేరలో అమ్మవారి ప్రతిష్ట చేస్తే దుష్టశక్తులు ఊళ్ళోకి ప్రవేశించవనీ, అనేక అరిష్టాలు గ్రామం దరి చేరకుండా ఉంటాయని సూచించింది బ్రాహ్మణవాదం.


★ ఆడది శక్తి స్వరూపిణి అంటూ, స్త్రీలను గౌరవించాలి, పరాయి మహిళలు తల్లితో సమానం అని ఉద్భోధించి, ఆనాటి తెగల్లో స్త్రీ, పురుషుల మధ్య ఆచరణలో ఉన్న సెక్స్ విశృంఖలత్వాన్ని కట్టడి చేసింది బ్రాహ్మణవాదం.


★ కట్టుబాట్లులేని పాశ్చాత్య సంస్కృతిలోని సెక్స్ పాశవికం మన దగ్గర లేకుండా చేసింది బ్రాహ్మణిజం.


★ చావు, పుట్టుకలు, పాప, పుణ్యాలను ప్రభోధించింది బ్రాహ్మణవాదం.


★ ఒక మనిషి చస్తే అయ్యో పాపం అనడం, ఆయన/ఆమె ఆత్మకు శాంతి చేకూరాలి అనడం బ్రాహ్మణవాదం.


★ చనిపోయిన వాళ్ళ శరీరాలను దహనం చేయాలి, ఖననం చేయాలి అనే సంస్కారాలను సమాజానికి నేర్పింది బ్రాహ్మణిజం.


★ విశ్వశాంతికి, ప్రక్రుతి వైపరీత్య పరిస్థితుల నుంచి మానవాళిని కాపాడుకోవటానికి, కరువు పరిస్థితుల్లో ప్రకృతిని ప్రసన్నం చేసుకోవడానికి ఆనాటి రోజుల్లోనే శాస్త్రీయంగా, శాస్త్రోక్తంగా యజ్ఞ యాగాదులు చేయించింది బ్రాహ్మణవాదం.


★ ఇక అన్యులకు గుడి ప్రవేశాలను నియంత్రించి, నిషేధించింది బ్రాహ్మణులు అనడం, దాన్ని బ్రాహ్మణవాదానికి ఆపాదించడం ఓ పెద్ద కుట్ర, శుద్ధ తప్పు.


★ గుడి నిషేధం మధ్య యుగాలనాడు సమాజంపై ముమ్మాటికీ రాచరికం విసిరిన పంజా తాలూకు మరక.


★ విభిన్న కులాలకు చెందిన ఋషులను, మహర్షులను వాళ్ల కులాలకు అతీతంగా ప్రచారంలోకి తెచ్చి, వాళ్ళను కొలిచింది బ్రాహ్మణవాదం.


★ బ్రాహ్మణుడు ఏనాడూ తన కులం వాళ్లను దేవుళ్ళను చేయలేదు.


★ మీకు తెలిసిన దేవుళ్ళలో ఎవరైనా ఒక్క బ్రాహ్మణుడు ఉన్నారేమో ఆలోచించండి. అదే సమయంలో ఇతర కులాల్లో దేవుళ్ళు ఉన్నారా ఆలోచించండి. వాళ్లకు దేవుళ్ళ హోదా ఇచిన ఔన్నత్యం బ్రాహ్మణిజం.


★ తన మనుగడకు దోహదపడుతున్న ప్రకృతిని ఆరాధించి, దైవంగా కొలువాలనీ, అగ్ని, గాలి, నీరు, భూమి, ఆకాశాలను పంచ భూతాలుగా అభివర్ణించి పూజించాలని చెప్పింది బ్రాహ్మణవాదం.


★ ఇలా మొట్టమొదలు ప్రపంచానికి నడత, నడక, సంస్కృతి, సంప్రదాయాలు అన్నీ నేర్పింది బ్రాహ్మణవాదమే.


★ అటు నిరంతరం విస్తృత పరిశోధనలు చేస్తోన్న మోడ్రన్ సైన్స్ కానీ, ఆచరణలో ఉన్న నాస్తికవాదం కానీ, అనుసరిస్తున్న హేతువాదం కానీ, అరువు తెచ్చుకున్న వామపక్ష భావజాలం కానీ చెప్పలేని చాలా ప్రశ్నలకు ఇదే బ్రాహ్మణవాదం సమాధానం చెప్పింది.


★ భూగ్రహం పరిసరాల్లో ప్రకాశించే సూర్య, చంద్రులు, నక్షత్రాలు, నక్షత్ర మండలాలు, ఇతర గ్రహాలు, వాటి ఆవశ్యకత, సంచారం, గుట్టుమట్లు, వాటి మీదుగా ప్రసరించే అతినీల లోహిత కిరణాలు, భూగ్రహంపై వాటి ప్రభావాల తీరు లాంటి విషయాలెన్నిటినో ఆనాడే విపులీకరించి చెప్పింది బ్రాహ్మణిజం.


★ అనంత విశ్వం, దాని పుట్టు పూర్వోత్తరాలు, మానవుడు, మానవసృష్టి లాంటి సమాధానం చెప్పలేని వాటిని దేవ రహస్యాలుగా పేర్కొంది.

బ్రాహ్మణవాదం తప్పు అని తేల్చాలనుకునే మేధావులు, నాస్తికులు, హేతువాదులు, సో కాల్డ్ కమ్యూనిస్ట్లు ముందు జనన మరణాల జీవ రహస్యాన్ని ఛేధించాలి, అనంత సృష్టి మూలాల అంతును విడమరచి లోకానికి చెప్పాలి. వాటిని శోధించి, ఛేదించి, బ్రాహ్మణులను, బ్రాహ్మణ వాదాన్ని తప్పు అనాలి. అంతేకాని ఉత్తగనే, అలవోకగా నోటికొచ్చింది వాగుతాము అంటే కుదరదు.

మనం నిత్యం ఆచరించే, మన సంస్కృతిలో భాగమైన వీటన్నిటినీ వదిలిపెట్టి సంబంధం లేని అంశాలను బ్రాహ్మణవాదంతో ముడిపెట్టి, ఆసంబద్ధ అభిప్రాయాలు ఏర్పరచుకొని, మీరు ఆనాడు చేసిందానికి, ఈనాడు మేం ఎంత చేసినా తక్కువే అని వితండవాదం చేస్తూ, బ్రాహ్మణుల పట్ల, బ్రాహ్మణవాదం పట్లా ఒక రకమైన కక్ష పూరిత ధోరణిని ప్రదర్శించడం ఏమాత్రం సరికాదు. అలా అనవసరమైన అంశాలను బ్రాహ్మణిజానికి ముడిపెట్టి, మూర్ఖత్వంతో ఒక్క మాట అనే నైతిక హక్కు ఎవరికీ లేదు.

పలకరింపు

 *పలకరింపు*


మనుషులకు మాత్రమే వున్న వరమిది.


మానవీయ సంబంధాల వారధి. మనసు వ్యాకులతల పారద్రోలు మంత్రమిది.


పలకరింపులు లేని సమాజం సమూహం ఒట్టి నిర్జీవంగా గోచరిస్తాయి.


ఒక్క పలకరింపుతో నూతనోత్తేజమేదో తొంగి చూస్తూంటుంది.


పలకరింపు అనేది మంచితనానికి, కలిసి బతికే మనిషితనానికి నిదర్శనంగా నిలుస్తుంది.


నేటి అత్యంతాధునిక అనేక సౌకర్యాల, విలాసాలననుభవిస్తున్న కాలంలో మనం పోగొట్టుకుంటున్న గొప్ప మానవాంశం పలకరింపు.


ఇది చాలా చిన్న విషయంగానే అనిపించవచ్చు. ఒక్క చిన్న మాటే పలకరింపై వెలగవచ్చు.


ఎన్ని డబ్బులు పోసినా దొరకని అమూల్య సంపద పలకరింపు.


ఒక్క పలకరింపు తో ఒక ప్రాణాన్ని నిలబెట్టవచ్చు. ఒక బాధని తొలగించవచ్చు.


ఒక ఆలోచనను రేకెత్తించవచ్చు. ఒక ఆశను చిగురింపచేయొచ్చు.


మనసు గాయాలను, గాట్లను మాన్పించవచ్చు.


పలకరింపుకు అంత శక్తి వుంది.


పలకరించడమనే సమస్య నేడు ఇండ్లల్లో వృద్ధులు విపరీతంగా ఎదుర్కొంటున్నారు.


తమ జీవితమంతా కుటుంబం కోసం, పిల్లల కోసం వెచ్చించి, వృద్ధాప్యంలో ఏమీ చేయలేని స్థితిలో ఇంట్లో వున్న పెద్దల్ని పనికిరాని వస్తువుల్ని చూసినట్లు చూస్తున్నారు.


వారి శ్రమఫలమే వర్తమానపు మన కళ అని మరిచి పోతున్నారు. అట్లాంటి పెద్దలను ఆప్యాయంగా పలకరించాలి.


ఒక మాట మాట్లాడాలి. ఒక్కసారి పలకరింపుతో వాళ్ళను కదిపి చూడండి.


బండెడు అనుభవాలను మీ ముందుంచుతారు. ఆ అనుభవాలు ఇప్పటికీ మనకు దివిటీలా పని చేస్తాయి.


పలకరింపులు పెద్దలకు ఆరోగ్యాన్నిచ్చే మందులా పని చేస్తుంది.


పెద్దలనే కాదు ఎవరినైనా పలకరిస్తూ వుండాలి. దాంతో స్నేహం, బంధం, ప్రేమ, అనుబంధం పెరుగుతూ వుంటుంది.


ఇవి కేవలం మనుషులు సాధించేవి.


డబ్బులు బాగా సంపాదిస్తూ ఉద్యోగం చేస్తున్నపుడు చాలా మంది పలకరించేవాళ్ళు ఉంటారు.


ఉద్యోగ విరమణ చేసి, ఆదాయం తగ్గిపోయిన క్షణం నుంచి పనికిరాని వాడిలా పలకరింపుకు నోచుకోలేక వృద్ధాశ్రమం చేరుతున్నారు.


డబ్బులు మాత్రమే ముఖ్యంగా మారిన నేటి తరాలకు మనుషుల మధ్య సంబంధాలు అప్రధానమై పోయి ఈ పరిస్థితులు దాపురించాయి.


ఇది లాభాల ఆర్జన కోసం సరుకుల మీద వ్యామోహాన్ని పెంచిన సాంస్కృతిక దాడి ఫలితం.


దీన్ని మార్చకపోతే మనమూ ఒకప్పటికి బాధితులుగా మిగులుతాం.


ఇంట్లోనే అందురున్నప్పటికీ వారి మధ్య దూరాలేవీ తగ్గలేదు... పలకరింపు లేక మరింత పెరుగుతూనే వున్నాయి.


ఎవరి చేతుల్లో వాళ్ళు సెల్‌ఫోన్‌లతో ఇయర్ ఫోన్లతో తమలో తామే, తమకు తామే గడిపేస్తున్నారు.


కుటుంబ సంబంధాల్లో విపరీత దూరాలు పెరుగుతున్నాయి.


మనసుల్లో దాగిన భావాలు, అభిప్రాయాలు పలకరించి అడిగితేనే తెలుస్తాయి.


తెలిసినపుడే వాటిని సరిచేయడమో, చర్చించి మనం సరికావడమో చేయవచ్చు.


కొన్ని అపోహలూ తొలిగిపోవచ్చు.


కుటుంబంలోనే కాదు... ఇంటి పక్కన వాళ్ళను, దూరానవున్న మిత్రులను ఖాళీ సమయం దొరకగానే ఒకసారి పలకరించాలి.


*పలకరించండి.* 

*పలుకులేమీ బంగారం కాదు.*

*మనిషి మంచి తనానికి ఆనవాలు!*


మంచి మోటివేషన్ వచ్చిందా...!?

*ఐతే... ఓ సారి పలకరించండి*

సప్త పవిత్రాలు

 సప్త పవిత్రాలు ఏవి?


ఆచార వ్యవహారాలు బాగా తెలిసిన, కర్మలు/అకర్మాలు చేయించే వైదికులు ఉన్న సభలో, ఒక పండితుడు తల్లి తండ్రులు మరణించిన పిదప చేయు పితృ శ్రాద్ధము/కర్మల యొక్క ప్రాముఖ్యత, ఆవశ్యకత గురించి చెబుతున్నాడు.


“సప్త పవిత్రః అంటే అర్థం ఏమ”ని సభనుద్దేశించి ప్రశ్నించారు మహాస్వామివారు.


ఒక వైదికుడు శాస్త్రం చెప్పిన ఏడు పవిత్ర వస్తువుల గురించి ఇలా చెప్పాడు. “ఆవుపాలు, శివ నిర్మాల్యము లేదా గంగ, తేనె, తెల్లని పట్టు, కుమార్తె కొడుకు, సరైన సమయం(పితృ కార్యం చెయ్యడానికి) మరియు నువ్వులు అని చెబుతారు”


తరువాత పరమాచార్య స్వామివారు దాని గురించి ఇలా వివరణ ఇచ్చారు.


“అందులో ఉన్న ‘సవపర్పతమ్’ అంటే పట్టు పురుగులను చంపి దానినుండి సేకరించిన పట్టుతో తయారుచేసిన వస్త్రం అని అర్థం తీసుకోరాదు. ‘సవం’ అంటే సహజంగా చనిపోయిన పట్టుపురుగు. అంటే అలా సహజంగా చనిపోయిన పట్టుపురుగుల యొక్క దారంతో చేసిన పట్టు పంచె. అందుకే నేటికి కేరళలో శ్రాద్ధ కర్మలకు వచ్చిన వైదికులకు తెల్లని పట్టు పంచెలు ఇస్తారు. తరువాతి పదం ‘దౌహిత్యం’. ‘దౌహిత్రః’ అంటే కుమార్తె కుమారుడు అనే పదం నుండి ఉద్భవించింది. శ్రాద్దంలో కుమార్తె కొడుకు భోజనం చేయాలని తరచుగా చెప్పే అన్వయం. ‘దౌహిత్యం’ అంటే ఖడ్గమృగం కొమ్ముతో తయారుచేసిన పాత్ర. కొమ్ములున్న జంతువులన్నీ రెండేసి కొమ్ములతో ఉంటాయి. కాని ఖడ్గమృగానికి మాత్రం ఒక్క కొమ్ము ఉంటుంది. అందుకే దాన్ని ‘ఏక శృంగి’ అంటారు. దాని భాష్యం ‘దౌహిత్యం ఏకశృంగి పాత్ర విశేషః’ అని ఉంటుంది. అంటే ‘ఒక్క కొమ్ము పాత్ర ఉత్తమమైనది’ అని అర్థం”


పరమాచార్య స్వామివారు ఇటువంటి విషయాలను ఎంతో విపులంగా, సరళంగా విషదపరచేవారు.


--- బ్రహ్మశ్రీ రామకృష్ణ దీక్షితర్, శ్రీమఠం విద్వాన్. మహా పెరియవళ్ దరిశన అనుభవంగళ్


అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం

శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం ।।


#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం

గురువాక్కు మహత్యం*

 *గురువాక్కు మహత్యం*


ఒకానొకప్పుడు ఒక గురువు గారు, ఆయన శిష్యుడు నది నుండి వారి ఆశ్రమానికి తిరిగి వెళ్తున్నారు...


ఇంతలో హఠాత్తుగా గురువుగారు ఒక మహావృక్షం ముందు ఆగి ప్రసన్నంగా నవ్వుతూ *"తథాస్తు"* అన్నారు. 

గురువుగారి చర్యకి కారణం ఏంటి? అని అడిగాడు శిష్యుడు. 


"ఆ మహావృక్షం తన కోరికని పక్కనున్న మరో వృక్షంతో చెప్తుంటే నాకు వినబడి 'తథాస్తు' అన్నాను." 

"ఏమిటా కోరిక గురువు గారూ?" 

*"తాను చక్రవర్తి అయి భూమండలాన్ని ఏలాలని."* 

"వచ్చే జన్మలోనా?" 

"కాదు ఈ జన్మలోనే" 

శిష్యుడు పగలబడి నవ్వాడు, "గురువు గారూ, ఇది మరీ గొంతెమ్మ కోరిక కదూ! అంత అత్యాశ తగునా? అర్హత చూసుకోవాల్సిన పనిలేదా? "


*"అర్హతకేం నాయనా! జీవితమంతా ప్రతఫలాపేక్ష లేకుండా ఫలాలనిచ్చింది. ఎన్నో జీవరాశులకి ఆశ్రయం ఇచ్చింది. అదంతా పుణ్యమే కదా!"* 

"అవుననుకోండి. కానీ చెట్టు చక్రవర్తి ఎలా అవుతుంది" అన్నాడు శిష్యుడు.


అది విని *"ఏమో, భగవానుడు సంకల్పిస్తే ఏమైనా కావచ్చు!"* అన్నారు గురువుగారు.


ఆ రాత్రి పెద్ద గాలివాన వచ్చి ఆ మహా వృక్షం నేలకూలింది. 


శిష్యుడు నవ్వుకున్నాడు. అంతటితో ఆ విషయం మరిచి పోయాడు.

*సరిగ్గా సంవత్సరం తరువాత*


ఒక్కరోజు ఆ శిష్యుడు పరుగు పరుగున వస్తూ "గురువు గారూ,ఈ వింత విన్నారా!

శ్రీరామచంద్రులవారి పాదుకలకి పట్టాభిషేకం చేశారు వారి సోదరులు భరతులవారు. ఇక నుండీ పధ్నాలుగేళ్ళు పాదుకలు సామ్రాజ్యాన్ని పరిపాలిస్తాయట!అన్నాడు.


దానికి గురువు గారు నవ్వి, *"చెట్టు చక్రవర్తి ఎలా అవుతుంది అన్నావు. ఇప్పుడు అయింది కదా!"* అన్నారు.

అంటే? అడిగాడు శిష్యుడు.

అవున్నాయనా,  ఆ మహావృక్షం కలపతోనే వడ్రంగులు పాదుకలు చేశారు. అవి శ్రీరామచంద్రుల వారికి సమర్పించారు. ఎన్ని జన్మలు ఎంత తపస్సు చేసిందో,

ఎన్ని పుణ్యాలు చేసుకుందో, ఆ మహావృక్షం పాదరక్షలుగా మారి శ్రీరామచంద్రులవారి పాదాల వద్దకు చేరింది. 


శ్రీరామచంద్రులవారు ఆ పాదుకల్ని భరతుల వారికివ్వడం, 

భరతులవారు పాదుకలకి పట్టాభిషేకం చేయడం అంతా ఒక్కరోజులో జరిగిపోయింది.


ఆ విధంగా చక్రవర్తి కావాలన్న ఆ మహా వృక్షం కోరిక నెరవేరింది. 

అని చెప్పిన గురువు గారికి సాష్టాంగ ప్రణామం చేశాడు ఆ శిష్యుడు. 


*సద్గురువు వాక్కు సత్యం అయ్యి తీరుతుంది.*

కాదు కాదు, *ఆ భగవంతుడే మహాత్ముల నోటినుoచి వచ్చిన మాటలు నిజమయ్యేలాగా సoకల్పిస్తాడు.*🏵️


              🙏 ఓం నమః శివాయ 🙏

వేమనపద్యాలు

 *(అ)వేమనపద్యాలు*


సీ.

రాజ్యాధికారాన ప్రభవించి శ్రుతిమించి

          సుఖభోగముల నెల్ల జుఱ్ఱి జుఱ్ఱి 

స్పర్శవేధిని నేర్చి బైరాగిగా మారి 

          వేదాంతవేదియై వెలసి నిలచి 

లోకహితములెన్నొ రూఢిగా నెఱిగించె 

          తనదైన శైలిలో ధాటి మెఱయ 

దృష్టాంతముల జూపి దీటైన పద్యాల 

          సన్మార్గమును జూపె జనుల కొఱకు 

వేవేల పద్యాల వేలనీతుల జెప్పి 

          వేమన్న యనుపేర వెలసె నతడు 

మూఢపద్ధతుల రోసి మోసాల తెగటార్చి 

          సన్మార్గముల జూప సాగినాడు 

ఆ.వె.

సంస్కరించె నాడు సంఘోన్నతిని గోరి 

ప్రజలలోని మూఢపథములన్ని 

వినుము విను మటంచు వేదమ్ము పలికిన 

వేమనార్యు తలతు వినతితోడ 

*~శ్రీశర్మద*