18, ఆగస్టు 2023, శుక్రవారం

Panchaang


 

Shankdvani


 

నమృతమ్ము నాంధ్రమ్ము

 *సీసము*

అయ్యనంగ యమ్మరా ఆయనంగనునావు

   ఇయ్యనంగనునిల్లు ఈనె యీగ

ఉయ్యనంగ నుడుత ఊ యనగను నూడ

   ఎయ్యన ఎలుకరా ఏనె యేరు

ఐయన నైదురా ఒయ్యన నొకటి రా

  ఓయన నోషధీ ఔను నౌక

అమ్మహంబుల తోడ నలరారు యచ్చులు

   తెలుగును వెలిగించి తేజమేలు.

*ఆ.వె.*

అమ్మ మొదటనేర్పు నమృతమ్ము నాంధ్రమ్ము

నాన్న నోట విన్న మాట తెలుగు

గురువు బోధనమున గొప్ప మాట తెలుగు

దేశ భాష లందు తెలుగు లెస్స.

*** *కొంపెల్ల శ్రీనివాస శర్మ*

Scientists


 

పంచాంగం 18.08.2023 Friday,

 ఈ రోజు పంచాంగం 18.08.2023 Friday,

 

స్వస్తి  శ్రీ చాన్ద్రమాన శోభకృన్నామ సంవత్సర: దక్షిణాయనం వర్ష ఋతు నిజ శ్రావణ మాస శుక్ల  పక్ష: ద్వితీయా తిధి భృగు వాసర: పూర్వఫల్గుని నక్షత్రం శివ యోగ: బాలవ తదుపరి కౌలవ కరణం ఇది ఈరోజు పంచాంగం. 


విదియ రాత్రి 08:00 వరకు.

పూర్వఫల్గుని  రాత్రి 10:55 వరకు.

సూర్యోదయం : 06:03

సూర్యాస్తమయం : 06:37

వర్జ్యం :  తెల్లవారుఝామున 04:57 నుండి ఉదయం 06:44 వరకు.

దుర్ముహూర్తం: పగలు 08:34 నుండి 09:24 వరకు తిరిగి మధ్యాహ్నం 12:45 నుండి 01:35 వరకు.


రాహుకాలం : పగలు 09:00 నుండి 10:30 వరకు.


యమగండం : మధ్యాహ్నం 01:30 నుండి 03:00 వరకు.  

 


శుభోదయ:, నమస్కార:

పుణ్య ధరిత్రి

 " పుణ్య ధరిత్రి, సుస్నేహమయి, సమతా మమతల నిత్య సత్య సుహృద్భావ వికాస తేజోమయ దివ్య సుప్రకాశిని, పవిత్ర భారతావని ", భిన్నత్వంలో ఏకత్వ సద్భావన, సన్మైత్రీ సువ్యక్తిత్వ చైతన్య దివ్య దీప్తి ! మన భారత దేశపు ప్రాశస్త్యం, కోటానుకోట్ల వత్సరాల పుణ్య చరిత్ర గలిగి, అపౌరుషేయమై, సకల జీవ సురక్షా మార్గదర్శిగ వెలసిన పవిత్ర వేద సంపదకు నిలయం ! సకల బంధు మిత్రులందరికీ, 77 వ సంవత్సర భారత స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు !    

🙏గుళ్లపల్లి ఆంజనేయులు

Hindu


 

శ్రీవిల్లిపుత్తూరు

 108 దివ్యదేశములు 9 శ్రీవిల్లిపుత్తూరు

భగవంతుని చేరడానికి ఆమె ఎంతో శ్రద్ధతో కృషి చేసింది...


🎀మధురై నుంచి 80 కి.మీ. స్వామి వటపత్రశాయి. పెరియాళ్వార్, ఆండాళ్ అవతార స్థలము. విల్లి, పుత్తర్ అను కిరాత రాజులచే నిర్మింపబడుటచే ఈ క్షేత్రమునకు విల్లిపుత్తూర్ అను పేరు వచ్చినది. ఆండాళ్ గురించి అందరికి తెలిసినదే. వటపత్రశాయి సన్నిధి పక్కనే పెరియాళ్వార్ పెంచిన నందనవనం, ఆండాళ్ అవతరించిన స్థలము, ఆండాళ్ ముఖము చూసుకున్న బావి కలవు. వీటి పక్కనే ఆండాళ్ రంగమన్నార్ గరుడాళ్వార్ సన్నిధి ఉన్నది.


🎀గరుడాళ్వార్ అన్నిఆలయాలలో స్వామికి ఎదురుగా ఉంటారు. విశేషం ఏమిటంటే ఈ ఒక్క సన్నిధిలో మాత్రం స్వామికి ఎడమవైపున ఉంటారు. రంగమన్నార్ (శ్రీమన్నారాయణుడు), కుడివైపున ఆండాళ్, ఎడమ వైపున గరుడాళ్వార్ నిలుచున్న సేవ. చూడటానికే రెండు కళ్ళు చాలవు.


🎀మొదట సుప్రభాతం ఆండాళ్ సన్నిధిలో జరుగుతుంది. తరువాత వటపత్రశాయి సన్నిధిలో జరుగుగుతుంది. ఇప్పటికీ ప్రతి రోజు గోదాదేవి ధరించిన తులసిమాల లేక పూలమాలను వటపత్రశాయికి అలంకరిస్తారు. శ్రీవిల్లిపుత్తూర్ నుంచి సంవత్సరానికి రెండు రోజులు గోదాదేవి ధరించిన పూలమాల, బొమ్మ చిలుకలను తిరుపతి వెంకటేశ్వర స్వామికి ధరింపచేస్తారు. బ్రహ్మోత్సవంలో గరుడసేవ రోజు మరియు భోగి పండుగ రోజు.


🎀మిధున మాసంలో (జూన్ 14- జూలై 13) జరుగు ఉత్సవంలో ఆండాళ్ హంసవాహన రూఢులై వేంచేయగా-- రంగమన్నార్, వటపత్రశాయి, కాట్టళగర్, శ్రీనివాసర్, తన్ గాలప్పన్ పెరుమాళ్ళు అందరు గరుడ వాహనంపై వేంచేయుట సేవింపదగినది. కాట్టళగర్, శ్రీనివాసర్, తన్ గాలప్పన్ పెరుమాళ్ళు దగ్గరిలో ఉన్న ఊళ్ళనుంచి వస్తారు.


🎀అండాళ్ రచించిన తిరుప్పావై ౩౦ పాశురాములు ఈ సన్నిధిలోని బంగారు విమానంపై చెక్క బడియున్నవి. ఈ ఆలయ గోపురం ఎత్తు 192 అడుగులు. 12 అంతస్తులు. తమిళనాడు ప్రభుత్వం ఈ గోపురాన్ని వాళ్ళ ప్రభుత్వ చిహ్నంగా ఎంచుకున్నారు.


🎀గోదాదేవికి ఎప్పుడు భగవంతుని ధ్యాసే. శ్రీకృష్ణుడు అంటే చాలా ఇష్టం. ఆమె ధనుర్మాసంలో భగవంతుని పెళ్లి చేసుకోవాలని వ్రతం ఆచరించినది. వీళ్లు పురాణ పురుషులు. పెళ్లి అంటే భగవంతునిలో ఐక్యం కావడం. ఆమె 30 రోజులు 30 పాశురములతో స్వామిని అర్చించినది. రామాయణంలో ఎంతటి కావ్య శిల్పం ఉన్నదో, తిరుప్పావైలో కూడా అంతటి కావ్య శిల్పం ఉన్నది అని కవులు అంటారు. భగవంతుని చేరడానికి ఆమె ఎంతో శ్రద్ధతో కృషి చేసింది. ధనుర్మాసం 30వ రోజు ఆమె పెళ్లి ముహూర్తం నిర్ణయింప బడినది. 


🎀ధనుర్మాసం 27వ రోజున ఆమె వటపత్రశాయికి, వెంకటేశ్వరస్వామికి, కాలళహర్ పెరుమాళ్ కు, పరమపదంలోని శ్రీ మహా విష్ణువుకు తన వివాహ స్వయంవర విషయమై సందేశం నివేదించింది. తనను పెళ్లి చేసుకొంటే 100 గంగాళాల వెన్న, 100 గంగాళాల అక్కారవడిసెల్ కానుకగా సమర్పిస్తానని కాలళహర్ పెరుమాళ్ళకు మొక్కుకొంది. అక్కారవడిసెల్ స్వామికి చాల ఇష్టం. పాయాసానికి, చక్కర పొంగలికి మధ్యగా ఉంటుంది.


 కెర్లెపల్లి బాలసుబ్రహ్మణ్యం

పుంగనూరుఇలాంటి మరిన్ని పోస్ట్‌లను చూడటానికి మరియు All India Arya Vysya Sangam చేరడానికి, ఇక్కడ క్లిక్ చేయండి


https://kutumbapp.page.link/?isi=1598954409

శ్రీ బుద్ధి మాయి ఆలయం

 🕉 మన గుడి : 





⚜ బీహార్ : వైశాలి


⚜ శ్రీ బుద్ధి మాయి ఆలయం  


💠 వైశాలి ప్రపంచం నలుమూలల నుండి పర్యాటకులు మరియు యాత్రికులకు ప్రసిద్ధి చెందిన ప్రదేశం. ఈ నగరం దాని గొప్ప సాంస్కృతిక మరియు చారిత్రక వారసత్వానికి ప్రసిద్ధి చెందింది మరియు దాని దేవాలయాలు మరియు స్మారక కట్టడాలు భారతదేశం యొక్క గొప్ప ఆధ్యాత్మిక వారసత్వాన్ని అన్వేషించడానికి ఆసక్తి ఉన్న సందర్శకులను ఆకర్షిస్తాయి.


💠 ఈ నగరం దాని హస్తకళలు మరియు వస్త్రాలకు కూడా ప్రసిద్ధి చెందింది, ఇవి వాటి క్లిష్టమైన డిజైన్‌లు మరియు ప్రకాశవంతమైన రంగులకు ప్రసిద్ధి చెందాయి. సందర్శకులు కుండలు, వస్త్రాలు మరియు నగలు వంటి సాంప్రదాయ హస్తకళలను కొనుగోలు చేయడానికి స్థానిక మార్కెట్‌లు మరియు దుకాణాలను అన్వేషిస్తారు.


💠 బీహార్ తూర్పు భారతదేశంలో ఉన్న ఒక రాష్ట్రం, దాని గొప్ప సాంస్కృతిక వారసత్వం మరియు చారిత్రక ప్రాముఖ్యతకు ప్రసిద్ధి. బీహార్‌లోని వైశాలి జిల్లాలో ఉన్న వైశాలి బుద్ధి మాయి ఆలయం బీహార్‌లోని ప్రసిద్ధ గమ్యస్థానాలలో ఒకటి. 

శక్తి దేవతగా పరిగణించబడే బుద్ధి మాయికి ఈ ఆలయం అంకితం చేయబడింది. 


⚜ ఆలయ చరిత్ర ⚜


💠 బుద్ధి మాయి ఆలయ చరిత్ర 2,500 సంవత్సరాలకు పైగా ఉంది. 

పురాణాల ప్రకారం, పురాతన కాలంలో వైశాలిని పాలించిన లిచ్చవి రాజవంశం ఈ ఆలయాన్ని నిర్మించింది. 

6వ శతాబ్దంలో ఉత్తర భారతదేశంలో లిచ్చవిలు అత్యంత శక్తివంతమైన మరియు ప్రభావవంతమైన రాజవంశాలలో ఒకటి.

 వారు బౌద్ధమతానికి మద్దతుగా ప్రసిద్ధి చెందారు మరియు ఈ ప్రాంతంలో అనేక బౌద్ధ విహారాలు మరియు పుణ్యక్షేత్రాల నిర్మాణానికి బాధ్యత వహించారు.


💠 లిచ్చవి రాజవంశం 4వ శతాబ్దంలో గుప్త సామ్రాజ్యంచే పడగొట్టబడింది, అయితే బుద్ధి మాయి ఆలయం వైశాలి ప్రజలకు ఒక ముఖ్యమైన ప్రార్థనా స్థలంగా కొనసాగింది. శతాబ్దాలుగా, ఆలయం అనేక పునర్నిర్మాణాలు మరియు చేర్పులకు గురైంది, సముదాయానికి కొత్త నిర్మాణాలు మరియు శిల్పాలు జోడించబడ్డాయి.


💠 బుద్ధి మాయి దేవాలయం సాంప్రదాయ భారతీయ ఆలయ నిర్మాణ శైలికి ఒక అందమైన ఉదాహరణ. ఈ ఆలయం నగారా శైలిలో నిర్మించబడింది, ఇది పిరమిడ్ పైకప్పు మరియు మధ్య గోపురం కలిగి ఉంటుంది. ఈ నిర్మాణం రాతితో నిర్మించబడింది మరియు హిందూ పురాణాలలోని దృశ్యాలను వర్ణించే అందమైన శిల్పాలతో అలంకరించబడింది.


💠 ఆలయం చుట్టూ పెద్ద తోట ఉంది, ఇది రంగురంగుల పువ్వులు మరియు చెట్లతో నిండి ఉంది. ఈ ఉద్యానవనం ఆలయ సముదాయంలో ఒక ముఖ్యమైన భాగం మరియు సందర్శకులకు విశ్రాంతి స్థలం.


💠 ఆలయం లోపల, ప్రధాన దేవత అయిన బుద్ధి మాయి దేవత విగ్రహాన్ని చూడవచ్చు.

 ఈ విగ్రహం నల్లరాతితో తయారు చేయబడింది మరియు బంగారు మరియు వెండి ఆభరణాలతో అలంకరించబడింది.

 త్రిశూలం, కమలం, గద, ఖడ్గం పట్టుకుని నాలుగు చేతులతో అమ్మవారిని చూడవచ్చు. 


💠 నవరాత్రి ఉత్సవాలలో ఈ ఆలయం ప్రత్యేకంగా ప్రసిద్ధి చెందింది, ఇది సంవత్సరానికి రెండుసార్లు జరుపుకుంటారు మరియు తొమ్మిది రోజుల పాటు కొనసాగుతుంది. 

ఈ సమయంలో, ఆలయం దీపాలు మరియు పూలతో అలంకరించబడి ఉంటుంది.


💠 ఆలయ సముదాయం లోపల ఉన్న పవిత్ర చెరువును ‘కుండ్’ అని పిలుస్తారు మరియు ఇది ఔషధ గుణాలను కలిగి ఉందని నమ్ముతారు.


💠 వైశాలి అనేక ఇతర ముఖ్యమైన దేవాలయాలు మరియు స్మారక చిహ్నాలకు నిలయం. 

వీటిలో మహాబోధి ఆలయం ఉంది, ఇది UNESCO ప్రపంచ వారసత్వ ప్రదేశం మరియు బుద్ధుడికి జ్ఞానోదయం పొందిన ప్రదేశంగా నమ్ముతారు. 

ఈ ఆలయం వైశాలి నుండి 80 కిమీ దూరంలో ఉన్న బోధ్ గయలో ఉంది.


💠 వైశాలిలోని మరో ముఖ్యమైన ఆలయం విశ్వ శాంతి స్థూపం, ఇది శాంతి మరియు అహింసకు ప్రతీక. 

ఈ స్థూపం 20వ శతాబ్దంలో నిర్మించబడింది మరియు ఇది పర్యాటకులకు మరియు యాత్రికులకు ప్రసిద్ధి చెందిన ప్రదేశం. 

స్థూపం అర్ధగోళం ఆకారంలో నిర్మించబడింది మరియు బుద్ధుని జీవితం మరియు బోధనలను వర్ణించే అనేక విగ్రహాలు మరియు శిల్పాలతో అలంకరించబడింది.


💠 కుటగరసాల విహారం వైశాలిలోని మరొక ముఖ్యమైన బౌద్ధ క్షేత్రం. 

ఈ విహారాన్ని 3వ శతాబ్దంలో అశోక రాజు నిర్మించారు మరియు ఇది పురాతన భారతదేశంలోని అతిపెద్ద మరియు ముఖ్యమైన బౌద్ధ ఆరామాలలో ఒకటి. 


💠 వైశాలిలోని మరో ముఖ్యమైన స్మారక చిహ్నం అశోక స్తంభం. ఈ స్తంభాన్ని 3వ శతాబ్దంలో అశోక రాజు నిర్మించాడు మరియు భారతదేశంలోని పురాతన మరియు బాగా సంరక్షించబడిన అశోక స్తంభాలలో ఇది ఒకటి.


💠 ఆనంద స్థూపం వైశాలిలోని మరొక ముఖ్యమైన బౌద్ధ స్మారక చిహ్నం. 

ఈ స్థూపం బుద్ధుని సన్నిహిత శిష్యులలో ఒకరైన ఆనంద అవశేషాలను కలిగి ఉందని నమ్ముతారు. ఈ స్థూపం ప్రశాంతమైన వాతావరణంలో ఉంది మరియు ధ్యానం కోసం ఒక ప్రసిద్ధ గమ్యస్థానంగా ఉంది.


💠 ఈ ముఖ్యమైన ప్రదేశాలే విష్ణువుకు అంకితం చేయబడిన బవాన్ పోఖర్ ఆలయం మరియు శివుని చౌముఖి మహాదేవ ఆలయం ఉన్నాయి.


💠 వైశాలికి సమీప రైల్వే స్టేషన్ హాజీపూర్ జంక్షన్ రైల్వే స్టేషన్, ఇది ఆలయం నుండి సుమారు 35 కిలోమీటర్ల దూరంలో ఉంది. 

రైల్వే స్టేషన్ నుండి, ఆలయానికి చేరుకోవడానికి టాక్సీ లేదా బస్సులో అద్దెకు తీసుకోవచ్చు.

కుష్టువ్యాధిని నివారించే రహస్య ప్రక్రియ

 వంద సంవత్సరములు దాటిన వేపచెట్టుని ఉపయోగించి 40 రోజులలో కుష్టువ్యాధిని నివారించే రహస్య ప్రక్రియ  - 


     నూరు సమత్సరములు కలిగిన వేపచెట్టు కాండంలో 3 నుంచి 4 శేర్లు నీరు పట్టినంత తొర్రని నిలువుగా ఏటవాలుగా తొలచి అందులో సుమారు సేరు బియ్యము అన్నము వండి చల్లారాక మునుపే ఉంచి ఆ వేపచెట్టు పచ్చికర్రతో ఆ తొర్రకి సరిపడు బిరడా తయారుచేసి బిగించి దానిపైన గాలి లొపలికి పోకుండా పైన ఆవుపేడ పూసి ఒక సంవత్సరం ఉంచి ఆఖరు రోజున ఆ బిరడా తెరిచి చూసిన ఆ అన్నం ఎర్రగా ఉండును.దానిని బాగా ఎండించి పూటకి పావులాయెత్తు ( 5 గ్రా ) చొప్పున 40 దినములు పుచ్చుకొనిన కుష్టురోగం నివారణ అగును. 


    ఇది అత్యంత రహస్య యోగముగా ప్రాచీన ఆయుర్వేద గ్రంధాలలో ఉన్నది . 


   మరింత సంపూర్ణ మరియు వివరణాత్మకమైన సమాచారం కొరకు నేను రచించిన గ్రంథాలు చదవగలరు . 


  

శిరా వేధ పద్ధతి

 శిరా వేధ పద్ధతి  - ప్రాచీన చికిత్సా పద్దతి . 


      ఈ శిరావేధ చికిత్స మన ఆయుర్వేదము నందు తప్ప ఏ ఇతర వైద్యము నందు లేదు . ఈ శిరావేధ పద్దతి ద్వారా అసాధ్యవ్యాధులను పోగొట్టవచ్చు .

 శిరావేధ పద్ధతిని "రక్తమోక్షణం " అని కూడా అంటారు.ఇప్పుడు ఈ ప్రాచీన చికిత్స గురించి మీకు సంపూర్ణముగా వివరిస్తాను. 


              మానవ శరీరం నందు మన ఆయుర్వేద శాస్త్ర ప్రకారం 700 శిరలు కలవు . ఈ శిరలు శరీరమంతటా వ్యాపించి చిన్నచిన్న నీటికాలువలు తోటలోని అన్ని చెట్లకు నీటిని ఎలా అందచేయునో అదేవిధముగా శరీరంలోని అన్ని భాగములకు మనము తినిన ఆహారపదార్ధము వలన జనించు రసాధి ధాతువులను అందచేసి శరీరంను పోషించుచున్నవి. శరీరంలో అవయవములు ముడుచుకొనుట , చాచుట వంటి కార్యక్రములకు తోడ్పడుచున్నవి. శరీరంలోని వాత,పిత్త,కఫములు రక్తమునందు చేరి శరీరము అంతటా ప్రసరించుచున్నవి. శరీరము నందలి వాతాదులు అధికంగా వహించు శిరలకు వెఱువేఱు రంగులు , పనులు ఉండును. హస్త, పాదముల యందు 400 శిరలు కలవు. ఉదరము నందు 136 , శిరస్సు నందు 164 ఇలా మొత్తం 700 శిరలు కలవు. వీటిలో హస్తము , పాదముల యందు 16 శిరలు , ఉదరము నందలి 32 శిరలు , మెడకు పైభాగము వేధింపతగినవిగా గుర్తించవలెను. "ఇక్కడ వేధింపడం అనగా శిరకు రంధ్రం చేసి దుష్టరక్తం తీయటం "  శిరావేధ చేయు వైద్యుడు మర్మలకు సన్నిహితముగా ఉండు శిరలను వేధించరాదు . శిరల గురించి వాటి స్థానము గురించి సంపూర్ణ అవగాహన ఉన్న వైద్యుడు మాత్రమే చికిత్స చేయవలెను . 


    మర్మలకు సన్నిహితముగా ఉన్న శిరలను వేధించిన కొత్తరోగములు వచ్చుట , అంగవైకల్యము సంప్రాప్తిచుట జరుగును . ఒక్కోసారి ప్రాణములు పోవటం కూడా జరుగును. సరిగ్గా చికిత్స చేసిన అసాధ్యరోగములు పోగొట్టవచ్చు .మర్మలు మరియు మర్మస్థానములు అనగా శరీరము నందు వాయుప్రసరణ జరుగు నాడీ జంక్షనులు .ఈ శిరావేధనము బాలలు , వృద్దులు , క్షీణించినవారు , తాత్కాలిక కారణాల వలన నీరసించినవారు మొదలగువారికి నిషిద్దం . ఒకవేళ పాముకాటుకు గురైన నిషేధింపబడిన వారికి కూడా శిరావేదన చికిత్స చేయవచ్చు . అలా చేసిన బ్రతకగలరు . ఇప్పుడు మీకు ఈ శిరావేదన పధ్ధతి గురించి సంపూర్ణముగా వివరిస్తాను. 


                      శిరలను వేధించుటకు  ముందుగా శిరస్సు , పాదములు , హస్తములు , ఉదరము , పార్శ్వములు మొదలగు స్థానములందలి శిరలు స్పష్టముగా కనపడేలా గుడ్డతో కట్టిన పిమ్మట వ్రీహిముఖము అను ఒక శస్త్రముతో ఆయాస్థానములు అనుసరించి యవగింజ ప్రమాణము , అర్ధయావగింజ అంత లోతుగా వేధించవలెను . వేధ చేయవలసిన కాలములను సరిగ్గా గుర్తించవలెను . వేధ చేసిన పిమ్మట సువిద్ద ,దుర్విద్ధ లక్షణములు , దుష్టరక్త స్వరూపము , మంచి రక్తస్వరూపము , రక్తము వేధన చేసినను రాకుండా ఉండటం , లేక అధికరక్తస్రావం అగుట , ఎట్టివారికి ఎంత రక్తము తీయవలెను ఇత్యాది లక్షణములను , విధులను బాగుగా గుర్తించి రక్తమోక్షణము చేయవలెను . 


      

      ఈ రక్తమోక్షణం ఏయే భాగాలలో చేస్తే ఏయే వ్యాధులు తగ్గునో మీకు వివరిస్తాను . 


  * పాదదాహము , పాద హర్షము ( గుర్రం మూతి ) , చిప్పము , విసర్పి , వాతరక్తం ( గౌట్ ) , వాత కంటము , విచర్చికా , పాదదారి మొదలగు వ్యాధుల యందు హస్తపాదముల మధ్య ఉండు క్షిప్రమర్మములకు పైభాగమున రెండు అంగుళములలో విహ్రీ ముఖము ( సన్నటి పరికరం ) తో శిరకు రంధ్రం చేసి దుష్టరక్తమును తీయవలెను . 


 *  క్రోష్టుక శీర్షము , ఖంజము , పంగు వంటి వాతవ్యాధులకు చీలమండకు పైన నాలుగు అంగుళములలోని పిక్క యందు శిరకు రంధ్రం చేయవలెను . 


 * గృదసీవాతం ( సయాటికా ) నందు మోకాలు సంధికి నాలుగు అంగుళముల కింద గాని , పైన గాని శిరకు రంధ్రం చేయవలెను . 


 *  గళ గండ రోగము నందు తొడ మొదట ఆశ్రయించి ఉండు శిరను వేధించిన కంఠమును ఆశ్రయించి ఉండు గళగండ రోగము నివృత్తి అగును. 


 *  ప్లీహ ( spleen ) రోగము నందు ఎడమచేయి మోచేతి సంధి యందు ఉండు శిరను గాని లేక చేతి యొక్క చిటికెనవ్రేలుకు , ఉంగరం వ్రేలుకు మధ్య యందు ఉండు శిరను వేధించవలెను . 


 *  కాలేయరోగము నందు ప్లీహమునకు చెప్పినట్టు కుడివైపున చేయవలెను . శ్వాసకాసలకు కూడ కుడి పార్శ్వముల యందు ఉండు శిరలను వేధించవలెను . 


 *  పరివర్తిక , ఉపదంశ , శుక్రదోషముల యందు , శుక్రవ్యాధుల యందు శిశ్నము మధ్యయందలి శిరను వేధించవలెను . 


 *  అసాధ్యములగు అంతర్విద్రదుల యందు , పార్శ్వశూల ( ఒకవైపు తలనొప్పి ) కక్షా స్థనభాగముల మధ్యవుండు శిరను వేధించవలెను . 


 *  అసాధ్యమగు తృతీయక జ్వరం నందు ముడ్దిపూసకు మధ్య వెన్నెముక క్రింద ఉన్న శిరను వేధించవలెను . 


 *  అసాధ్యమగు చాతుర్ధికా జ్వరం నందు భుజశిరస్సులకు క్రిందగా రెండు పార్శ్వముల యందు ఉండు సిరలలో ఎదైనా ఒకదానిని వేధించవలెను . 


             ఇలా చెప్పుకుంటూ వెళితే ప్రతిరోగానికి ఏయే భాగములో శిరావేధ చేయవచ్చో అత్యంత ప్రాచీన ఆయుర్వేద గ్రంథాలలో వివరణాత్మకంగా ఉన్నది . నేను అటువంటి గ్రంథాలను నా పరిశోధన నిమిత్తం అధ్యయనం చేయుచుండగా ఎన్నో ఆశ్చర్యకరమైన విషయాలు తెలుసుకోగలిగాను  . ఆ విజ్ఞానాన్ని మీకు అందించాలన్న సదుద్దేశముతో మీకు సంపూర్ణ సమాచారాన్ని ఇవ్వడం జరుగుతుంది.  నేను రాసిన రెండు గ్రంథాలలో మరింత విపులంగా సమాచారాన్ని ఇచ్చాను. 


         మరొక విలువైన సమచారాన్ని మీకు త్వరలో అందిస్తాను. 


            సమాప్తం 



    నేను రాసిన గ్రంథాలలో  మరింత విలువైన సమాచారం , అనుభవ చికిత్సల గురించి సంపూర్ణ సమాచారం ఇవ్వడం జరిగింది.వాటిని చదవగలరు .


   

గర్భాధారణ రహస్యాలు -

 శుశ్రుతాచార్యుడి గర్భాధారణ రహస్యాలు  -


 *  శుక్రము నీటి గుణము కలిగి ఉంటుంది. స్త్రీ యొక్క ఆర్థవం తేజోగుణం కలిగి ఉంటుంది. 


 *  ఈ శుక్రశోణితములు యందు పంచభూతాలు సూక్ష్మ రూపము కలిగి ఉండును. 


 *  స్త్రీపురుష సంయోగ కాలం నందు శుక్రం అధికంగా ఉండిన యొడల పురుష సంతానం , స్త్రీ యొక్క ఆర్థవం పురుషుడి యొక్క శుక్రం కన్నా ఎక్కువుగా ఉన్నయెడల స్త్రీ సంతానం జనించును. శుక్రం మరియు స్త్రీ యొక్క ఆర్థవం సమాన స్థాయిలో ఉన్న నపుంసకుడు జనించును.


 *  స్త్రీ ఋతు స్నానం చేసినది మొదలు 12 దినములు వరకు స్త్రీ యందు ఆర్థవం ఉత్పత్తి అగును. అందుకనే ఆ 12 దినములను ఋతు కాలం అనెదరు . కొన్ని గ్రంధములలో ఋతుకాలమును 16 దినములుగా పేర్కొన్నారు . అనగా స్త్రీ ఋతువు అయిన 3 దినములు వదిలివేసి మిగిలిన 12 దినముల కాలం ను గర్భాదారణ కు మంచి సమయం అని అర్థం . 


 *  స్త్రీ ఋతుసమయం 3 దినములు అయిపోయిన వరసగా 4 - 6 - 8 - 10 - 12 దినముల యందు స్త్రీ , పురుష సంయోగం వలన పుత్రుడు , 5 - 7 - 9 - 11 దినముల యందు స్త్రీ పురుష సంయోగం వలన కన్యక జనియించును


 * ఆయాసం , బడలిక, దప్పి , తొడల యందు బలం లేకుండా ఉండటం , యోని యందు వణుకు అను లక్షణాలు స్త్రీ యందు కనిపించినచో ఆ స్త్రీ గర్బం ధరించినది అని తెలుసుకొనవలెను . ఇవి ప్రాధమిక లక్షణాలు .


 *  చనుమొనలు నలుపురంగుకు మారు ట , కనురెప్పలు ఒకదానికొకటి కలియిచుండుట , కారణం లేకుండానే వాంతి అగుట. మంచి సువాసన గిట్టకుండా ఉండటం. నోటి యందు నీరు ఎక్కువ వూరుట , శరీరం సడులు ట  ఇట్టి లక్షణములు గల స్త్రీ గర్భిణి అని తెలియవలెను . 


 *  గర్భిణి అని తెలుసుకున్న మొదలు శ్రమకరమైన పనులు , మైథునం , పూర్తిగా కడుపు నిండగా భుజించరాదు , రాత్రి యందు ఎక్కువుగా మేలుకొని ఉండరాదు. ఎక్కువ లంఖణం అనగా ఉపవాసం చేయరాదు , దుఃఖం చెందరాదు, బండి , గుఱ్ఱము మొదలుగు వాహనములు ఎక్కరాదు , భయంకరమైన పనులు చూడరాదు, కాళ్లు , చేతులు ముడుచుకుని కూర్చోరాదు , ఎత్తుపల్లాలు గల ప్రదేశంలో కూర్చోరాదు , మలమూత్ర వేగములను నిరోధించరాదు . 


 *  వాతాదిదోషములు వలన గాని , కర్రదెబ్బల వలన గాని గర్భిణి ఏయే అవయముల యందు వేదన పొందునో గర్భము నందు శిశువు కూడా ఆయా అవయముల యందు వేదన పొందును.


 *  గర్బము ను ధరించిన ప్రథమ మాసం నందు జిగట వలే ఉండును. ద్వితీయ మాసం నందు కఫవాతపిత్తం వలన పరిపాకమును చెంది పంచభూతాత్మము అయ్యి స్వల్పంగా ఘనీభవం చెందును . అట్టి గర్భం స్పర్శం వలన పిండాకారంగా ఉండిన పురుష గర్బం , పొడుగుగా ఉండిన స్త్రీ గర్బం అనియు , ఒక ముద్దవలే ఉండిన నపుంసక గర్బం అవును. స్త్రీ గర్భం ఇటుక రాయి ఆకారం వలే ఉండును అనియు , పురుష గర్బం అనునది గుండ్రముగా కఠినముగా ఉండునని , నపుంసక గర్భం అనునది గుండ్రని ఫలం యొక్క అర్ధభాగం వలే ఉండును . భోజుడు తన వైద్య గ్రంథం నందు వివరించాడు.


                  తృతీయ మాసం నందు గర్భమునకు పాదములు , హస్తములు, శిరస్సు అనునవి పుట్టును. మరియు ఆ మాసం నందే చెంపలు , ముక్కు, పెదవులు, నేత్రములు , చెవులు , వ్రేళ్లు  మొదలగు ప్రత్యంగములు సూక్ష్మ రూపంలో జనించును.నాలుగోవ మాసం నందు అన్ని అంగములు సూక్ష్మరూపంగా జనించును. ఆ మాసం నందే గర్బం నందు హృదయం ఆత్మకు స్థానం అగుట వలన దానికి ఆత్మకు సంభందం ఏర్పడును . 


                 అయిదోవ మాసం నందు మనస్సు , ఆరోవమాసం నందు బుద్ది, ఎడొవ మాసం నందు హస్తములు , పాదములు , నాసిక , వ్రేళ్లు , కేశములు పూర్తిగా ఏర్పడును . ఎనిమిదో మాసం నందు హృదయం నందు ఓజస్సు సర్వ ధాతువులు ఓజస్సు రూపం నొంది అస్థిరంగా ఉండును. ఎనిమిదో మాసం నందు గర్భిణి ప్రసవించినచో దోషం కలిగి ఉండును. కావున కుమార తంత్రం నందు చెప్పబడిన బలి విధానం ఆచరించవలెను . తొమ్మిదో మాసం నందు సర్వ అంగములు పరిపూర్ణంగా అభివృద్ధి చెంది గర్భిణి పరిపూర్ణ శిశువుని ప్రసవించును.


                గర్బముకు మాంసం , రక్తం , మేథస్సు , మజ్జ లేదా మూలుగ , హృదయం , నాభి , లివరు , ప్లీహం , ఆంత్రములు , గుదము మొదలగు మృదు అంగములు తల్లి నుంచి ఏర్పడును . 


        మొదట దక్షిణ స్థనం నందు పాల ఉత్పత్తి అగును. కుడికన్ను పెద్దదిగా కనపడును. తొలుత కుడితోడ గర్భభారము చేత ఉబ్బి ఉండునట్లు అగుపడును. స్వప్నం నందు కమలములు కనపడుట, మరియు నల్ల కలువలు కనపడును , తెల్ల కలువలు , మామిడిపండ్లు మొదలగునవి కనపడును. మొఖం ఎప్పుడూ ప్రశాంతంగా కనపడును ఇటువంటి లక్షణములు కల గర్భిణి స్త్రీ పుతృనిని కనును. దీనికి వ్యతిరేక లక్షణాలు కలిగిన గర్బిణి పుత్రికను కనును. రెండు తొడలు పెద్దగా కనిపిస్తూ కడుపు ముందుకు వచ్చి పైన చెప్పిన రెండు రకాల లక్షణాలు కలిగిన స్త్రీ నపుంసకుడుకి జన్మనిచ్చును. 


           ఏ గర్భిణి స్త్రీ కడుపు మధ్య భాగం పల్లంగా కనిపించుచుండునో అట్టి స్త్రీ కవలపిల్లలను జన్మనిచ్చును.



    నేను రాసిన గ్రంథాలలో మరిన్ని అనుభవ యోగాలు ఇవ్వడం జరిగింది. 


   

Kadupu noppi






















 

Aaseervachan


 

చిత్తము మర్కటమ్ము

 ఉ॥

చిత్తము మర్కటమ్ము, పెనుజిక్కుల గల్పన కాలవాలమున్ 

రిత్తపుటూహలం గడుపు, ప్రేమలు దోమలటంచు బంధముల్ 

గ్రొత్తగ జుట్టుకొంచు నొక గూటిని యుండగ జూచు గాని నీ 

పొత్తున నిల్వనీయదు తమోగుణహారిణి తల్లి శర్మదా! 

*~శ్రీశర్మద*

8333844664

బసవ పురాణం🐂/8వ భాగము🔱

 NAGARAJA RAO JSWALKAR:

*🔱🐂బసవ పురాణం🐂/8వ భాగము🔱*


 భూగర్భ నిధి బిజ్జలుని భాండాగారమునకు చేరింది.

దానితో బిజ్జలునికి బసవన్నపై అపారమైన గౌరవం కలిగింది. బసవన్నను ఘనంగా సత్కరించాడు.

*‘‘వ్యవసాయము చేతునయ్యా శివసేవకు! వ్యవహారము చేతునయ్యా! నీవిచ్చిన ధనమల్లెను నీదే నీ భక్తుల సేవకే వినియోగిస్తాను నీ పాదాంబుజ సాక్షి- నిక్కమిదె స్వామి కూడల సంగమదేవా’’* అన్నాడు బసవన్న.

ఈ విధంగా బసవన్న తనకు లభించిన ధనాన్ని శివభక్తి ప్రచారానికి వినియోగించుకున్నాడు. *‘‘కుల వ్యవస్థ మానవ నిర్మాతమే కాని ఈశ్వర నిర్మితము కాదు. కాచగ కుమ్మరి- ఉతికిన చాకలి- నేతతో సాలె- వేద మంత్రములతో బ్రాహ్మణుడు- ఇలా వారు వారు చేసే వృత్తులను బట్టి కులములేర్పడ్డాయి కాని శివుని దృష్టిలో అంతా ఈశ్వర సంతానమే’’* అన్నాడు బసవన్న. అంతేకాదు సమాజంలోని దంభాచారములను తిరస్కరించాడు. *‘‘ఏమి చిత్రమీలోకము కథ. సత్యేతరమగు జీవితగాములు రాతి పామునర్చించెడి పెద్దలు జాతి నాగులను చంపివేసెదరు. తినెడి జంగమునాచ నాచన నాచనామంచుకు తినని లింగమును తిను తినమందురు’’* అని సూటిగా ప్రశ్నించాడు. ఈ విధంగా బసవన్న తనకు లభించిన పదవిని జాతీయ సమైక్యతకై ఉపయోగించాడు. మూఢాచారములను ఖండించి శివభక్తిని ప్రచారం చేయసాగాడు సమకాలీన సమాజంలో నిరీశ్వరవాదులు మిద్యా బ్రహ్మ చర్యమును పాటించినట్లు నటించి పతనం కావటం చూచి *‘ఇంద్రియ నిగ్రహమేల చేసెదవు? పంచేంద్రియములు బాధపెట్టవా! సతీపతుల సౌఖ్యంబు వదిలిరా సింధు భళ్లాళ సిరియాళాదులు?’’* అని వైవాహిక బంధం వైశిష్ట్యాన్ని ప్రతిపాదించాడు. 


*‘‘చచ్చిననే స్వర్గమ్మను మాటలు చెరుకుతుదను గల సారము వంటిది. టంకసాల ఈ భువి బ్రహ్మయ్యకు ఇట చెల్లిననే అచటను చెల్లును. ఇట చెల్లనిదెచ్చటనిక చెల్లదు. స్వామి కూడల సంగమదేవా’’* అని భూకైలాసాన్ని వాంఛించాడు. అశ్వారూఢ బసవన్న పరిపాలనకు సంకేతము. వచనకార బసవన్న సాహిత్య సృష్టికి నిదర్శనము. ధర్మప్రవచన బసవన్న శివతత్వ ప్రచారానికి నిదర్శనము. ఇలా మూడు రూపాలలో బసవన్న సాక్షాత్కరించాడు.


*ధనవంతులు నిర్మింతురు నీకై ధగధ్ధగోజ్వల గోపురాదులను. ధనము లేని బడుగును నేనెట్టుల తమకై కట్టుదు శివాలయంబును- స్వామి కూడల సంగమ దేవా- చెడును స్థావరము జంగమ మిదిగో- పాదములివి ఆలయ స్తంభంబులు పసిడి కలశమగునా శిరమిదిగో- నడిచెడి ఈ దేవాలయమంబులో నివసింపుము శ్రీ సంగమేశ్వరా!’’*  అని బసవన్న కోరుకున్నారు.

దీని తాత్పర్యం ఏమిటంటే మానవ శరీరమే శివునికి సరియైన దేవాలయము. కాయకమే కైలాసము అంటే కర చరణాది అనే .... గల ఈ మృణ్మయ శరీరమును చిన్మయముగా మార్చవలెనని బసవన్న శాసనం కల్పించారు. కేవలము ఆలయము చుట్టూ తిరిగి లాభము లేదని సత్కర్మచరణముతో మానవ దేవాలయములను నిర్మించాలని బసవన్న తన అనుయాయులకు సందేశమిచ్చారు. బసవన్న ప్రబోధించి ఊరుకోలేదు. తాను చెప్పినది ముందు తానే చేసి చూపించాడు. అంటే ఆచరణ లేని ప్రవచనము వృధాయని బసవన్నగారి అభిప్రాయము.


 *తాను ధనమును కూడబెట్టలేదు. ప్రజలకు అలా ధనాన్ని దాచుకోవద్దు- దాచుకున్నవాడు దోచుకున్నవాడూ ఇద్దరూ దొంగలే*

 అని బసవన్న నూతన సందేశాన్ని సమాజానికి అందించాడు. అంటే తన సమకాలీన సమాజంలో ఆర్థిక, సాంఘిక తారతమ్యములు లేని ఒక మానవాళిని నిర్మించాలని ఆశించాడు.


*మానసిక ప్రక్షాళన లేకుండా డంబాచారములు శుష్కపూజలు నిరర్థకం* అన్నాడు. 


*‘‘ఎంగిలంటున్నాయి లింగా ఏమి చేతునురా మహానుభావా! ఓ లింగమూర్తీ- గంగాతీరథము తీసుకొచ్చి లింగ పూజ చేతమంటే గంగలోని చేప కప్ప ఎంగిలంటున్నాయి. పుష్పములతో పూజ చేస్తే కొమ్మ కొమ్మకు వున్న తుమ్దె ఎంగిలి అంటున్నది. పాలతో అభిషేకం చేయాలనుకుంటే దూడ ముందే పొదుగును ఎంపిక చేసింది. అందుకని ఎంగిలి లేని మనస్సుతో శివపూజ చేయండి. పవిత్ర మనస్సు అనే పద్మం సమర్పించినవారికి పూజకు వేరే పూలతో అవసరమేముంది’’* అని బసవన్న ప్రబోధించాడు. చారిత్రిక స్థలములు హింగులేశ్వర బాహ్యవాడి, ఇది రెండు గ్రామములు. 1. హింగులేశ్వరము అనుపేరుగల బ్రాహ్మణ అగ్రహారము, ఇందులో ఎక్కువమంది పాశుపత శైవులు. 2. బాహ్యవాడి ఇది హింగులేశ్వరమునకు అతి సమీపంలో ఉన్న జనపదము. ఇక్కడ నందీశ్వర మందిరమున్నది. ఇందులోనే మాదాంబిక నందికేశ్వర వ్రతమున్నది. ప్రస్తుతం దీనిని బసవన బాహ్యవాడి అనే పేరుతో పిలుస్తారు. కూడల సంగమేశ్వరం. బసవేశ్వరుని ఐక్య స్థలము. ఇక్కడ కృష్ణ, మలప్రభ, గతప్రభ, అనే మూడు నదులు కలసి త్రివేణి సంగమం గా మారింది. ఈ దక్షిణ ప్రయాగను శైవులు కూడలి సంగమేశ్వర క్షేత్రం అని పిలుస్తారు.

2

అక్కడ కల్యాణ నగరంలో బలదేవ దండనాయకుడు కైలాసానికి వెళ్లిపోయాడు. అప్పుడు ప్రభువైన బిజ్జలుడు ఆప్తులను పిలిచి *‘‘బలదేవుని బంధువులలో ఈ దండ నాయక పదవి’’ నిర్వహింపగలవారెవరైనా ఉన్నారా?’’* అని ప్రశ్నించాడు.

*‘‘ఉన్నాడు ప్రభూ! బసవన్న! ఆయనకే మన బలదేవుడు తనకుమార్తెనిచ్చాడు కదా! బసవన్న సామాన్యుడు కాడు. మహావినయ సంపన్నుడు. పాపరహితుడు. బలవంతుడు, సర్వకళా ప్రవీణుడు, సాక్షాత్తు సంగమేశ్వరుడే స్వయంగా వచ్చి ఆశీర్వదించి వెళ్లాడు ఆయనను. అతడే తమకు ప్రధానమంత్రిగా తగినవాడు’’* అని ఆప్తులు సలహా ఇచ్చారు.


అది విని బిజ్జలుడు సంతోషించి మంత్రులకు, అధికారులకు బసవని తీసికొని రమ్మని పంపాడు. వారు బిజ్జలుని ఆజ్ఞతో ఆయన ఎక్కే పట్టపుటేనుగును బసవేశ్వరునికోసం తీసుకొని సంగమేశ్వరం చేరారు.


- ఇంకా ఉంది🙏


🙏 హర హర మహాదేవ 🙏


J  N RAO 🙏🙏🙏

𝕝𝕝శ్లోకం𝕝𝕝

_-|¦¦|శుభోదయమ్|¦¦|-_* 🕉️

        *_-|¦¦|సుభాషితమ్|¦¦|-_*


 𝕝𝕝శ్లోకం𝕝𝕝 


*జామయో యాని గేహాని* 

*శపన్త్యప్రతిపూజితాః౹*

*తాని కృత్యాహతానీవ*

*వినశ్యన్తి సమన్తతః॥*


𝕝𝕝తా𝕝𝕝

ఏ ఇంట్లో  స్త్రీలు మరో స్త్రీని గూర్చి అసభ్యంగా మాట్లాడుతారో, మనసులో ఈర్ష ద్వేషాలతో ఉంటారో.. ఆ ఇంట్లో ఎప్పుడు రోధనలతో నిండి పూర్తిగా నాశనమైపోతుంది.


____________________________


*దహ్యమానాః సుతీవ్రేణ* 

*నీచాః పరయశోగ్నిsనా*

*అశక్తాస్తత్పదం గన్తుం*

*తతో నిన్దాం ప్రకుర్వతే*


*----- _చాణక్య నీతి_ -----*


తా𝕝𝕝

నీచులు పరుల కీర్తిని చూచి ఓర్వలేనివారై అట్టి అసూయ అనే అగ్నికి దహించబడినవారై వారివలే ఉన్నతస్థానమునకు చేరుకోలేక అటువంటి కీర్తిమంతులను నిందించుచుందురు.


 మ్లేచ్ఛులు అంటే ఎవరు? విదేశీయులను మ్లేచ్ఛులు అని ఎందుకు అంటారు?


అసలు సమాధానం ఇచ్చిన ప్రశ్న: మ్లేచ్చులు అంటే ఎవరు? విదేశీయులను మ్లేచ్చులు అని ఎందుకు అంటారు?

'మ్లేచ్ఛులు' అన్న మాటకు రకరకాల అర్థాలున్నాయి. కాలానుగుణంగా అర్థాలు మారుతూ వచ్చాయి. మ్లేచ్ఛ శబ్దానికున్న సాధారణ అర్థాలు విదేశీయుడు, ఆర్య (భారతీయ) సంస్కృతికి భిన్నమైన సంస్కృతీ సాంప్రదాయాలు కలిగిన వాడు, సంస్కృతం మాట్లాడనివాడు/ అర్థం కాని భాషలో మాట్లాడేవాడు అని. మ్లేచ్ఛ శబ్దం 'మ్లేఛ్' ధాతువునుండి వచ్చింది (మ్లేఛఁ అవ్యక్తాయాం వాచి). అర్థం కాకుండా మాట్లాడే వాడని అర్థం. విదేశీయులు మాట్లాడే భాష అర్థం కాదు కనుక వారిని మ్లేచ్ఛులన్నారు.

బౌధాయనుడు మ్లేచ్ఛ శబ్దాన్ని ఇలా నిర్వచించాడు:

గోమాంస ఖాదకో యస్తు విరుద్ధం బహు భాషతే।

సర్వాఽఽచార విహీనశ్చ మ్లేచ్ఛ ఇత్యభిధీయతే॥


" గోమాంసం తినేవారు, సంస్కృతం కాక పలురకాల వేరే భాషలు మాట్లాడేవారు, మన ఆచారాలను వేటినీ పాటించని వారిని మ్లేచ్ఛులని అంటారు".

రామాయణంలో సుగ్రీవుడు కూడా హిమాలయాలు దాటి, గాంధార దేశం దాటిన తరువాత ఉత్తరాన వచ్చే ప్రాంతాలన్నీ కూడా మ్లేచ్ఛ భూములని వర్ణించాడు.

సంస్కృత భాషనే అయినా ఉచ్చారణ సరిగ్గాలేక అర్థం కాకుండానో, తప్పు అర్థాలు వచ్చేలాగానో మాట్లాడే వారిని కూడా మ్లేచ్ఛులనే అన్నారు. పాణిని వ్యాకరణానికి మహా భాష్యం వ్రాసిన పతంజలి "మ్లేచ్ఛా మాభూమేత్యధ్యేయం వ్యాకరణం" అన్నాడు. మ్లేచ్ఛులు సంస్కృతం నేర్చుకొని మన చరిత్రకు ఏ గతి పట్టించారో చూస్తూనే ఉన్నాము కదా.

కాశీఖండము--3ఆ:48 ప.

 శు భో ద యం🙏

లక్ష్మీ స్తుతి!



అగస్త్యుడు లక్ష్మిని స్తుతించుచున్నాడు


కాశీఖండము--3ఆ:48 ప.

శ్రీనాధమహాకవి.


ఆ.వె

కమలనయన! నీవు కలచోటు సరసంబు /

నీవు లేనిచోటు నీరసంబు / 

కంబుకంఠి! నీవు కలవాఁడు కలవాఁడు / 

లేనివాఁడు నీవు లేనివాఁడు.


ధనం,దానిప్రయోజనం, యీపద్యంలో కవిసార్వభౌమ శ్రీనాధుడు బహు చక్కగా వివరించాడు.


అమ్మా! జగజ్జననీ! ధనలక్ష్మీ!

నీవున్నచోటే సర్వసౌభాగ్యాలకు నెలవు.నీవులేనిచోటు నీరసమే!

(దారిద్యమే) అమ్మా! నీవుకలవాడేకలవాడు. నీవు పుష్కలంగా ఉన్నవాడే ఉన్నవానికిందలెక్క(బ్రతికి యున్నవాడని) నీవు లేనివాడు.లేనివాడే!(మృతప్రాయుడే!నని భావం)


       "లోకంలో వింటూఉంటాం డబ్బుకుకొఱగానివాడు ,డుబ్బుకుకొఱగాడు"-అని;లోకాలోకన నిపుణులైన శతకకారులుకూడాయీవిషయాన్నే భగ్యంతరంగా తెలిపారు.


"ఏనరునకు విత్తముగల

దానరుడుకులీనుడధికుడార్యుండతడే,

ధీనిధి,ధన్యుడు,నేర్పరి,

నానాగుణగణము కాంచనంబున నిలచున్"-అని ఆమాటలు నిజంగదా!


,   ధనం ఉండవలసినదే,కానీ తన్నుతానుమరచునదిగా ఉండరాదు.దానము,భోగము,నాశము,అని మూడవస్థలున్నవి. ఆమూడిటిలో దానము, భోగములే ఉత్తమమైనవి.అట్టిమనుజుడు లోకమున సత్కీర్తిబడయును.


            స్వస్తి!🌷🌷🌷

మార్గనిర్దేశం

 ఆచార్య రజనీష్‌ను ఆయన అనుచరుడు ఒకరు ప్రశ్నించారు...


  ప్రశ్న - *జిహాదీలు ఇళ్లు, ఆస్తులు తగలబెడుతున్నప్పుడు, హత్యలు చేస్తున్నప్పుడు మనం ఏం చేయాలో చెప్పండి?*

 మేము హిందూ ముస్లిం సోదర సోదరభావాన్ని *ప్రోత్సహించాలా లేదా మన స్వంత భద్రత కోసం ఏదైనా చర్య తీసుకోవాలా,* దయచేసి మార్గనిర్దేశం చేయండి.


  సమాధానం - 

*మీ ప్రశ్న మీ మూర్ఖత్వాన్ని తెలియజేస్తోంది, మీరు చరిత్ర నుండి ఏమీ నేర్చుకున్నట్లు అనిపించడం లేదు*.  ఎందుకంటే

మహ్మద్ గజ్నీ సోమనాథ్ ఆలయంపై దాడి చేసినప్పుడు, ఆ సమయంలో భారతదేశంలో సోమనాథ్ అతిపెద్ద మరియు ధనిక దేవాలయం.  ఆ ఆలయంలో పూజలు చేసే 1200 మంది హిందూ పూజారులు, మనవారందరూ ధ్యానం, భక్తి, ఆరాధన, అంటూ పగలు మరియు రాత్రి అనే తేడా లేకుండా నిమగ్నమై ఉన్నారు  కాబట్టి దేవుడు మనలను రక్షిస్తాడు అనే నమ్మకంతో ఉన్నారు.  ఆ దేవుడు మన/తన రక్షణ కోసం ఎటువంటి ఏర్పాటు చేయలేదు. 


  *తత్ఫలితంగా, మహ్మూద్ గజ్నీ వేలాది మంది నిరాయుధ హిందూ పూజారులను చంపి, విగ్రహాలు మరియు దేవాలయాలను పగలగొట్టి చాలా సంపద, వజ్రాలు, నగలు, బంగారం మరియు వెండిని ఎత్తుకెళ్లాడు.

 భగవంతుడిని ధ్యానం, భక్తితో చేసిన పూజలు వారిని రక్షించలేకపోయాయి.


 *ఈరోజు వందేళ్ల సంవత్సరాల తర్వాత కూడా అదే మూర్ఖత్వం కొనసాగుతోంది...మీ మహానుభావుల జీవితాల నుండి మీరు ఏమీ నేర్చుకున్నట్లు కనిపించడం లేదు*.


  దుష్టుల హృదయాన్ని మార్చగలిగేంత శక్తి, ధ్యానానికి ఉన్నట్లయితే, *రామచంద్ర జీ ఎప్పుడూ తన వద్ద విల్లు మరియు బాణాన్ని ఉంచుకోవాల్సిన అవసరం ఏముంది⁉️* 

ధ్యానం యొక్క శక్తితో, అతను రాక్షసులను మరియు రావణుని హృదయాన్ని మార్చేవాడు, వారిని సుర-అసుర సోదరులు మరియు సోదరులుగా వివరించేవారు గొడవ ముగిసేది. *కానీ రాముడు కూడా మూర్ఖులున్నీ మా‌ర్చలేకపోయాడు.* 

పైగా 

*రామ-రావణుల యుద్ధ విజయం ఆయుధం ద్వారానే నిర్ణయించబడింది.*


 *ధ్యానానికి దుష్టుల మనస్సును మార్చగల శక్తి ఉందా⁉️*

  అలాంటప్పుడు పూర్ణావతారమైన *శ్రీకృష్ణుడు* కంసుడిని, జరాసంధుడిని, శిశుపాలుడ్ని *చంపాల్సిన అవసరం ఏమొచ్చింది⁉️  ధ్యానంతోనే వారిని మార్చగలిగాడా. ..!!*


ఎందుకంటే,

 *ధ్యానానికి మరొకరి మనసు మార్చే శక్తి ఉంటే,*

మహాభారత యుద్ధం ఉండేది కాదు, కృష్ణుడు తన ధ్యాన బలంతో దుర్యోధనుడిని మార్చి యుద్ధం నివారించి ఉండేవాడు.  

*పైగా ధ్యానంలోకి వెళ్లాలనుకున్న అర్జునుడిని,*

 *కృష్ణుడు అడ్డుకుని,*

 *యుద్ధంలో నిమగ్నమయ్యేటట్లు చేశాడు.*

 మహాభారత యుద్ధం చరిత్రలో  అతి పెద్ద యుద్ధం.


 గత 1200 సంవత్సరాలలో భారతదేశంలో ఎంతో మంది మహర్షులు, సాధువులు గోరఖ్‌నాథ్ నుండి రవిదాస్ వరకు మరియు కబీర్, గురునానక్ నుండి గురుగోవింద్ సింగ్ వరకు, *ధ్యానం యొక్క శక్తి  వీరందరినీ కూడా ముస్లిం ఆక్రమణదారులు మరియు బ్రిటిష్ వారి దౌర్జన్య, దమన, హత్య, అత్యాచారాల నుండి కాపాడలేకపోయింది.*  

ఈ సమయంలో కోట్లాది మంది హిందువులను ఊచకోత కోసి, వారి మతాన్ని బలవంతంగా మార్చేశారు.

వారిని చంపి ఇస్లాంలోకి మార్చారు.


  *ఆ సాధువుల బోధనలు ఆక్రమణదారులను మార్చలేకపోయాయి.*  గురునానక్ తన మత తత్వశాస్త్రాన్ని ముస్లింలు సులభంగా అర్థం చేసుకోగలిగేలా మరియు గ్రహించగలిగే విధంగా అందించారు కానీ,

అదే గురు సంప్రదాయంలో, గురుగోవింద్ సింగ్ ముస్లింలపై కత్తి పట్టవలసి వచ్చింది. *హిందూ మతాన్ని రక్షించడానికి, నిరాయుధ సిక్కులు ఆయుధాలు పట్టవలసి వచ్చింది.*


అంటే

  *★ధ్యానం ఒకరి తమ స్వంత చైతన్యాన్ని మాత్రమే మార్చగలదని, స్పష్టమవుతుంది.*

  *★★మన భౌతిక దేహాన్ని, మన ఆస్తులను, సంప్రదాయాలను, సంస్కృతిని మనమే రక్షించుకోవాలి. అందుకు శాస్త్ర సాంకేతిక సహాయం తీసుకోవాలి.*


 దేశంలోని 70% కంటే ఎక్కువ *సమస్యలకు ధ్యానం పరిష్కారం కాదు.*


  *శ్రీకృష్ణుడు రాయబారిగా దుర్యోధనుడుని పాండవుల క్షేమం కోసం   5 గ్రామాలను కోరాడు.


  *మన దేశ సనాతన ధార్మిక వ్యవస్థ ప్రయోజనాల కోసం 5 చట్టాలు అడుగుతున్నాం!!*

  *1సమాన విద్య*

  *2ఏకరీతి పౌర స్మృతి*

  *3మార్పిడి నియంత్రణ*

  *4చొరబాటు నియంత్రణ*

  *5జనాభా నియంత్రణ*


 ఈ ఐదు చట్టాలు రాకపోతే, *ప్రస్తుతం భారతదేశంలోని తొమ్మిది రాష్ట్రాల్లో హిందువులు మైనార్టీలైన మాదిరిగానే,*

సనాతన హిందూ ధార్మిక వ్యవస్థ మొత్తం ప్రపంచంలో పూర్తిగా నాశనం అవుతుంది.


  *సేవ్ హిందూ భారత్ ఉద్యమం*


  *మన దేశాన్ని మరియు మన సోదరీమణులు/కూతుళ్లను రక్షించే ఉద్యమం*


  మీరు దీన్ని కనీసం ఒక వ్యక్తికైనా ఈ సందేశం పంపండి


  *🚩జై శ్రీ రామ్🏹*...

ప్రారబ్దకర్మనే

 శ్లోకం:☝️

*సుఖదుఃఖే భయక్రోధౌ*

  *లాభాలాభౌ భవాభవౌ |*

*యచ్చ కిఞ్చిత్తతాభూతం*

  *నను దైవస్య కర్మ తత్ ||*

 - రామాయణం 2.22.22


అన్వయం: _సుఖం దుఃఖం భయం క్రోధః లాభః హానిః జన్మ మరణం సర్వమేతత్ భాగ్యాధినీయమస్తి | అతః న హర్షశోకౌ ప్రదర్శితవ్యౌ |_


భావం: సుఖదుఃఖాలు, భయక్రోధాలు, లాభనష్టాలు, జననమరణాలు లాంటివన్నీ ఖచ్చితంగా విధి యొక్క చర్యలు. మన ప్రారబ్దకర్మనే విధి, దైవం, అదృష్టమని ఇత్యాది పేర్లతో పిలుస్తారు!🙏

పంచాంగం 18.08.2023 Friday,

 ఈ రోజు పంచాంగం 18.08.2023 Friday,

 

స్వస్తి  శ్రీ చాన్ద్రమాన శోభకృన్నామ సంవత్సర: దక్షిణాయనం వర్ష ఋతు నిజ శ్రావణ మాస శుక్ల  పక్ష: ద్వితీయా తిధి భృగు వాసర: పూర్వఫల్గుని నక్షత్రం శివ యోగ: బాలవ తదుపరి కౌలవ కరణం ఇది ఈరోజు పంచాంగం. 


విదియ రాత్రి 08:00 వరకు.

పూర్వఫల్గుని  రాత్రి 10:55 వరకు.

సూర్యోదయం : 06:03

సూర్యాస్తమయం : 06:37

వర్జ్యం :  తెల్లవారుఝామున 04:57 నుండి ఉదయం 06:44 వరకు.

దుర్ముహూర్తం: పగలు 08:34 నుండి 09:24 వరకు తిరిగి మధ్యాహ్నం 12:45 నుండి 01:35 వరకు.


రాహుకాలం : పగలు 09:00 నుండి 10:30 వరకు.


యమగండం : మధ్యాహ్నం 01:30 నుండి 03:00 వరకు.  

 


శుభోదయ:, నమస్కార:

శ్రీమతి మామిళ్ళపల్లి రాజ్యలక్ష్మి గారు.*

 



*పైన ఫోటోలో ఉన్న వ్యక్తి  పేరు శ్రీమతి మామిళ్ళపల్లి రాజ్యలక్ష్మి గారు.* 


ఆకాశవాణి న్యూఢిల్లీ కేంద్రం నుండి తెలుగు వార్తలను మన తెలుగు వారికి వినిపించిన మహిళ.


వీరి వయస్సు 94 సం.లు.


ఇప్పటికీ ఎంతో ఉత్సాహంగా ఉంటూ రేడియో కార్యక్రమాలు వినడం ఆవిడ అలవాటు.


శ్రీశ్రీ మరియు జగ్గయ్య గార్లతో కలిసి పనిచేసారు.


స్వస్థలం నెల్లూరు జిల్లా పల్లెపాడు గ్రామం.


ఈవిడ ప్రస్థానం ఆకాశవాణిలో సంగీత కార్యక్రమాలకు అనౌన్సర్ గా మొదలైంది.


ఆరోజుల్లోఆకాశవాణిలో 14 భాషలు విభాగాలుగా ఉండేవి.


1960 సం. నుండి అద్దంకి మన్నార్, దుగ్గిరాల పూర్ణయ్య, ఏడిద గోపాలరావు మరియు మంగమ్మ ఆకాశవాణిలో ప్రముఖులు.


ఆరోజుల్లో వార్తల సేకరణ టెలీ పింటర్లు మరియు ఫోన్ల ద్వారా జరిగేవి. 


ఉదయం 7 గం., మధ్యాహ్నం 12 గం. మరియు రాత్రి 7 గం.లకు నా గొంతు లక్షల రేడియోల్లో వినిపిస్తోందని, తెలుగు వారంతా వింటున్నారని ఆవిడ భావం. 


కోట్లాది శ్రోతలు వార్తల కోసం వేచి ఉండేవారు ఆ రోజుల్లో. 


*94 సం.ల ఈవిడకి  జన్మదిన  శుభాకాంక్షలు.* 💐🌷🌹

సౌందర్యలహరి

 🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹

🌹🌹🍃🍃🌹🌹🍃🍃🌹🌹

.       *🌹సౌందర్యలహరి🌹*


*భూమౌస్కలితపాదానాం భూమిరేవవలంభనం*

*త్వయిజాతా పారాధానం త్వమేవ శరణం శివే ||*




*శ్లోకం - 1*


       *శివః శక్త్యా యుక్తో యది భవతి శక్తః ప్రభవితుం*

       *న చేదేవం దేవో న ఖలు కుశలః స్పందితుమపి|*

       *అతస్త్వామ్ ఆరాధ్యాం హరి-హర-విరిన్చాదిభి రపి*

       *ప్రణంతుం స్తోతుం వా కథ మకృత పుణ్యః ప్రభవతి||*


శివ, శక్తుల ఏకత్వాన్ని నుతిస్తూ ఈ స్తోత్ర ప్రారంభం చేశారు శంకరులు. 


శివః శక్త్యాయుక్త = శక్తితో కూడియున్న శివుడు

శక్తః ప్రభవితు యది భవతి=సృష్టి, స్థితి, లయలు చేయు శక్తి కలిగియున్నాడు.

న చే దేవం = అలా కానట్లయితే

దేవః న ఖలు కుశలః స్పందితుమపి = ఆ పరమేశ్వరుడు స్పందించే నేర్పు లేని వాడవుతాడు.

 అమ్మవారు చైతన్య శక్తి అని ముందు చెప్పుకున్నాము. చైతన్యం ఉన్నచోటనే స్పందన ఉంటుంది. పరమేశ్వరుడు ఏకః అహం బహుస్యాం - ఒక్కడుగా వున్న నేను అనేకముగా అవుతాను అని సంకల్పించగానే ఆ సంకల్పమునుండి స్పందన దానినుండి ఇచ్చా, జ్ఞాన, క్రియాత్మకమైన వ్యక్తీకరణ జరిగింది. అమ్మవారే ఆ స్పందన శక్తి. జ్ఞాన క్రియాశక్తులతో వేరుగాలేని ఇచ్ఛాశక్తి కలిగియున్న పరమేశ్వరుని వల్ల ఈ ప్రపంచ సృష్టి జరుగుతుంది. అమ్మవారి నామాల్లో  ఇచ్చాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి స్వరూపిణీ అని *సృష్టికర్త్రీ బ్రహ్మరూపా గోప్త్రీ గోవిన్దరూపిణీ* అని మనం చెప్పుకుంటున్నాం. ఇచ్చాశక్తినే సత్య కామః సత్య సంకల్పః అన్నారు శ్రుతిలో. సత్య అంటే ఎప్పుడూ ఉండేది వ్యర్ధము కానిది. ఈ సత్యకామ సత్య సంకల్పాలే కామేశ్వరుడు  కామేశ్వరి. 

అతస్త్వామ్ ఆరాధ్యాం = అందువల్ల హరి హర బ్రహ్మలచే ఆరాధింపబడుతున్నది అమ్మవారు.

 ముందు సంకల్పం చేసాడని చెప్పబడుతున్న పరమేశ్వరుడు  హరి హర బ్రహ్మలకు మూలమైనవాడు. ఆయనే జగన్నిర్వహణ కోసం త్రిమూర్తులుగా ఇతర దేవతలతో కలిసి నిన్ను ఆరాధిస్తున్నారు అమ్మాఅని భావం. సృష్టి స్థితి లయలు నిర్వహించే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల ఇతర దేవతల శక్తులు అమ్మవారినుండి ప్రసరింపబడి వారి వారి విధులకు తగిన శక్తులను ప్రసాదిస్తున్నవి.

ప్రణంతుం స్తోతుం వా కథ మకృత పుణ్యః ప్రభవతి = అటువంటి తల్లికి నమస్కరించాలన్నా స్తోత్రం చేయాలన్నా ఎన్నో జన్మలుగా పుణ్యకార్యముల వాసన లేనివాడు ఎలా చేయగలడు?

🙏🏻 *శ్రీమాత్రే నమః*🙏🏻


*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.* 

🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

శ్రీ వివేకానందస్వామి🚩* . *🚩జీవిత గాథ🚩* *భాగం 12*

 🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹

.    *🌹చారిత్రాత్మక కథాస్రవంతి🌹*

.   *ఓం నమో భగవతే రామకృష్ణాయ*


.       *🚩శ్రీ వివేకానందస్వామి🚩*

.                *🚩జీవిత గాథ🚩*   


*భాగం 12*


జ్యోతి వెలుగులో నిద్రించే ఉన్నత బాలుడు....


నరేంద్రుడు గాంచే దృశ్యాలు ఎన్నో అంతెందుకు, ప్రతి రోజూ రాత్రిపూట అతడు నిద్రించే విధానమే అత్యద్భుతం. అతడు పడుకొని కళ్లు మూసుకోగానే భ్రూమధ్యం నుండి ఒక జ్యోతి కానవస్తుంది. విభిన్న కాంతులతో కూడుకొన్న ఆ జ్యోతి క్రమంగా విస్త్రతించి ఎట్టకేలకు చెల్లాచెదురవుతుంది. ఆ జ్యోతి వెలుగులు శరీరమంతటా పాలనురుగులాంటి తెల్లని కాంతులీనుతూ ముంచెత్తేది. ఆ కాంతిలో నిద్రిస్తాడు ఉన్నతుడైన ఆ బాలుడు. 


కొన్ని సమయాలలో ఒక బాలుడు అతని ఎదుట కనిపించి కాంతి బంతి నొకదాన్ని కాలితో తన్ను తాడు. అది దొర్లుతూ అతని వైపు వస్తుంది. తన ప్రక్కకు రాగానే నరేంద్రుడు దాన్లో లయించిపోతాడు, అంతా మరచిపోవడం జరుగుతుంది. కొన్ని సమయాల్లో ఆ జ్యోతి వర్ణనాతీతమైన మహాజ్యోతిగా ఉండేది. అతడు దాన్లో ప్రవేశించి అట్లే కరిగిపోయేవాడు.


నిద్ర అన్నది అందరికీ ఇలాగే ఉంటుందని అనుకొనేవాడు నరేంద్రుడు. ఒక రోజు ఒక మిత్రుణ్ణి ఇలాంటి అనుభవం కలుగుతుందా అని అడగనే అడిగాడు. ఆ మిత్రుడు, "లేదు" అని జవాబిచ్చాడు. వెంటనే నరేంద్రుడు,

"పడుకోగానే నిద్రలోకి జారుకోకు. కాసేపు గమనించి చూడు. నువ్వూ జ్యోతిని చూడగలవు" అన్నాడు ఆ మిత్రుడితో ఉపదేశ ధోరణిలో. 


అయినప్పటికీ మిత్రుడికి అలాంటి అనుభవం కలుగలేదని విన్నప్పుడు అది ప్రత్యేకించి తనకు మాత్రమే కలిగిన అనుభవమని నరేంద్రునికి అవగతమయింది. తదనంతరం దీనిని గురించి మరెవరితోనూ అతడు ప్రస్తావించలేదు.


*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.* 

🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁

👉 *రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*

🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

🚩శ్రీ వివేకానందస్వామి🚩* . *🚩జీవిత గాథ🚩* *భాగం 11*

 🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹

.    *🌹చారిత్రాత్మక కథాస్రవంతి🌹*

.   *ఓం నమో భగవతే రామకృష్ణాయ*


.       *🚩శ్రీ వివేకానందస్వామి🚩*

.                *🚩జీవిత గాథ🚩*   


*భాగం 11*


నరేంద్రుని లో గుర్తించలేని శక్తి ఒకటి పెంపొందుతూ వచ్చింది. ఇంతటి శక్తిని భరించడానికి లోకం సిద్ధంగా లేదు. కనుక ఒక ప్రమాదం మూలంగా అది అదుపుచేయబడింది...


 ఆ విషయంగా కాలాంతరంలో స్వామి వివేకానంద ఇలా చెప్పారు: "శైశవం నుండే నాలో ఏదో ఒక శక్తి పెంపొందుతున్నట్లు నాకు అనిపించేది. అది నాలో నుంచి ఎగసి నన్ను అతిక్రమించి వ్యాపించసాగింది. ఆ శక్తి నా క్రియాశీలతకు కారణం. 

 

ఒక్క క్షణం కూడా నన్ను ఊరుకోనివ్వకుండా చేసింది ఆ శక్తే! నేను సదా ఏదో ఒకటి చేస్తూనే ఉండాలి.  రెండు మూడు రోజులు ఏమీ చేయకుండా ఊరకే ఉంటే నన్ను ఏదో రుగ్మత ఆవహించేది, లేకుంటే అదుపుతప్పిపోతాను. ఒక భూకంపం నాలో చెలరేగి బీభత్సం సృష్టిస్తున్నట్లుగా నాలోని ఆ శక్తి, 'ఇది చెయ్యి', 'అది చెయ్యి' అంటూ నన్ను ఏదో ఒకటి చేయమని పురమాయిస్తూ ఉంటుంది."


 ఒక రోజు మిత్రులతో నరేంద్రుడు మేడ మీద నుండి దిగివస్తున్నప్పుడు క్రిందపడ్డాడు. నెత్తికి ఒక రాయి తగిలి రక్తం ధార కట్టింది. చాలా రక్తం పోయింది. ఆ గాయం ఆరడానికి కొంతకాలం పట్టింది. ఆ గాయం తాలూకు మచ్చ నెత్తిన ఎడమ కంటికి పైన శాశ్వతంగా ఉండి. పోయింది.

 

ఈ ప్రమాదం గురించి కాలాంతరంలో విన్న శ్రీరామకృష్ణులు, "ఈ ప్రమాదం మూలంగా నరేంద్రునిలోని శక్తి నియంత్రించబడింది. లేకపోతే అతడు లోకాన్ని కుదిపివేసేవాడు" అన్నారు🙏


*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.* 

🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁

👉 *రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*

🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

*🌹శ్రీ వేంకటేశ్వర దివ్య చరిత్ర-22🌹*

 🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹

*🌹శ్రీ వేంకటేశ్వర దివ్య చరిత్ర-22🌹*


🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁


సోదిని నమ్మే ఆచారము వున్నది కదా! అందుచే శ్రీనివాసుడు కనకాంబరము చీర కట్టాడు. కాని రంగు రవికె తొడుగుకున్నాడు. ముద్దొచ్చే పచ్చబొట్టు ముఖానికి పెట్టుకున్నాడు. కండ్లకు నల్లనైన కాటుక పెట్టుకున్నాడు. తలమీద సోదిబుట్ట పెట్టుకొన్నాడు.


 ఈ విధముగా ఎరుకలసాని వేషము ధరించినవాడై శ్రీనివాసుడు అచ్చు ఆడుదానివలె తయారయి ఆకాశరాజు నగరములో ప్రవేశించాడు, సరాసరి రాజభవనము చేరింది ఆ క్రొత్త సోది స్ర్తీ.


 ‘సోది చెబుతానమ్మా సోదీ!’ అని బిగ్గరగా కేక వేసింది. ఆకాశరాజు భార్య ధరణీదేవి ఈ మాట విన్నది. పిలికించి ఆమెను ‘మా అమ్మాయికి సోది చెప్పుము’ అంది. ‘సరే’ యన్నది ఎరుకల సాని పద్మావతిని బుట్టకి ఎదురుగా కూర్చుండజేసి చేటలో విలువైన ముత్యాలు పోయించినది. 


గద్దెపలక వుంటుంది కదా దానికి పసుపూ, కుంకుమా పెట్టించింది. దేవతలను కొలిచినది. మూలదేవతలకు మ్రొక్కినది. ఇంక సోది చెప్పుట ప్రారంభించినది.....


‘‘ఇనుకోవె ఓ పిల్లా ఇవరంగా చెప్పుదు

జరిగేది యంతా నిజముగా చెప్పుడు

వనములో పురుషుని వలపుతో జూసి 

అతని నీ మనసులో అట్లే దాచావు

గుండెలో నతుడు బాగుండినాడే పిల్ల 

శృంగార వనములో శృంగార పురుషుడే ‘‘నన్ను 

ప్రేమింతువా?’’ యని యన్నందుకే నీవు 

రాళ్ళతో కొట్టించు రాలుగాయీ పిల్లా 

వెన్నవంటీ మనసున్నవాడే వాడు 

నిన్న బోలిన బాధ నున్నాడు వాడు 

ఆ రోజు నడవి వాడనుకొంటివే వెఱ్ఱి!

ఆదిదేవుడు నారాయణుడతండే 

శ్రీనివాసునిగాను చెలగుచున్నాడే

ఆకాశమె క్రిందుగా గమనించిననూ 

భూమియే పైపైకి పోయినా ఏమైనా 

దంపతులగుదరు పెండ్లియు జరిగి 

దిగులు నీ పెండ్లితో దిగునులే పిల్లా‘‘

అని వున్నవీ, జరిగేవీ వివరముగా సోది చెప్పినది. వారిచ్చిన కట్నము తీసుకొని వెళ్ళిపోయింది ఎరుకులసాని.

ఎరుకసాని వేషము వేసుకొని సోది చెప్పిన వెనుక శ్రీనివాసుడు పద్మావతి గురించే ఆలోచించసాగాడు. పద్మావతి శ్రీనివాసునితో తనకు ఏ విధముగా పెండ్లి జరుగుతుందా అనే ఆలోచనలో పడింది

. ఆకాశరాజా, ధరణీదేవి పద్మావతిని చూచి విచారించసాగారు. పద్మావతికి కలలో శ్రీనివాసుడు కనుపించి అనేకమైన లీలలు చూపించినాడు. ఆమె ఆవిషయము తన తల్లిదండ్రులతో చెప్పి తాను శ్రీనివాసుని తప్ప మరొకరిని వివాహమాడననెను. ధరణీదేవీ, ఆకాశరాజూ కూడా తాము పెద్దలను సంప్రదించి ఆమె కోరిక తీర్చడానికి ప్రయత్నిస్తా మన్నారు.

వకుళ, రాయబారము సాగించుటకు నారాయణపురము చేరినది. అంత:పురములో ప్రవేశించినది. ఆకాశరాజు, ధరణీదేవి ఆమెను తగురీతిని గౌరవించి పూజించారు. 

అనంతరము ఆకాశరాజు వకుళతో ‘‘అమ్మా! చూడగా మీరు యోగినివలె కనిపించుచున్నారు. మీ రాకవలన మా గృహము పావనమైనది. మీ రాకకు గల కారణము తెలుసుకొనవలెనని కుతూహల పడుచుంటిమి. మీరు యెక్కడ వుంటుంటారు? ముఖ్యంగా మీరు శ్రమపడి వచ్చిన పనిని తెలియజేయ కోరుతున్నాము. అన్నాడు. 


వకుళాదేవి ఆకాశరాజుతో మహారాజు! నేను శేషాచల నివాసిని, నాకు ఒక్కగానొక్క, కుమారుడు. అతనిపేరు శ్రీనివాసుడు. నాకుమారుని అందము చెప్పడానికి భాషలోని మాటలు చాలవు. అతనిది వశిష్టగోత్రము అతని వయస్సు ఇరవై ఐదు సంవత్సరాలు మాత్రమే. ఒకనాడు మావాడు వేటకు వెళ్ళి శృంగారవనమున ప్రవేశించి, మీ ముద్దుల కుమార్తె అయిన పద్మావతి యొక్క సౌందర్యతిశయాన్ని చూసి ప్రేమించినాడు పద్మావతిని తప్ప అన్య కన్యను ఒల్లనంటున్నాడు.’’ ఈ మాటలు అంటూంటే ధరణీదేవి మా అమ్మాయి కూడా యింతే కదా అనుకొన్నది.


వకుళ చెపప్పసాగినది. ‘‘నా కుమారుడు మూడు లోకాల్ని ఏలగల దిట్టడు. ఆ లక్షణాలన్నీ వున్నాయి. బుద్ధిమంతుడూ, అందగాడూ అయిన మా పిల్లవాడికి బుద్ధిమంతురాలూ, సుందరీ అయిన మీ కుమార్తెనిచ్చి వివాహము చేసే ఉభయత్రా బాగుంటుంది. కనుక, మీరు సందేహించక ఆ విధముగా చేయండి. మావాడు దైవాంశజుడేగాని, మానవమాత్రుడు కానేకాడు’’ సాత్త్విక భావము తొణికిసలాడే ఆమె పలుకులకు ఆకాశరాజు ఆనందించి ‘‘ అమ్మా! మీరు ఉన్న విషయాలన్నీ చెప్పారు. ఈ విషయాలన్నీ మా పెద్దలతో కూలంకషంగా యోచించి, ఏ విషయమూ మీకు వర్తమానము పంపుతాను’’ అన్నారు. వకుళాదేవి వారివద్ద శలవు గైకొని తిరిగి తిరిగి తన స్థలానికి చేరుకొన్నది

బిల్వపత్రార్చిత గోవిందా, బిక్షుక సంస్థుత గోవిందా, బ్రహ్మాండ రూప గోవిందా, భక్త రక్షక గోవిందా; |


గోవిందా హరి గోవిందా, వేంకట రమణా గోవిందా, గోవిందా హరి గోవిందా, వేంకట రమణా గోవిందా. ||22||


*శ్రీ వేంకటేశ్వరుని దివ్య లీలల లో మరికొన్ని తదుపరి సంపుటిలో తెలుసుకుందాం.*


*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.* 

🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

ఈర్ష ద్వేషాలతో

 🕉️  *_-|¦¦|శుభోదయమ్|¦¦|-_* 🕉️

        *_-|¦¦|సుభాషితమ్|¦¦|-_*


 𝕝𝕝శ్లోకం𝕝𝕝 


*జామయో యాని గేహాని* 

*శపన్త్యప్రతిపూజితాః౹*

*తాని కృత్యాహతానీవ*

*వినశ్యన్తి సమన్తతః॥*


𝕝𝕝తా𝕝𝕝

ఏ ఇంట్లో  స్త్రీలు మరో స్త్రీని గూర్చి అసభ్యంగా మాట్లాడుతారో, మనసులో ఈర్ష ద్వేషాలతో ఉంటారో.. ఆ ఇంట్లో ఎప్పుడు రోధనలతో నిండి పూర్తిగా నాశనమైపోతుంది.


____________________________


*దహ్యమానాః సుతీవ్రేణ* 

*నీచాః పరయశోగ్నిsనా*

*అశక్తాస్తత్పదం గన్తుం*

*తతో నిన్దాం ప్రకుర్వతే*


*----- _చాణక్య నీతి_ -----*


తా𝕝𝕝

నీచులు పరుల కీర్తిని చూచి ఓర్వలేనివారై అట్టి అసూయ అనే అగ్నికి దహించబడినవారై వారివలే ఉన్నతస్థానమునకు చేరుకోలేక అటువంటి కీర్తిమంతులను నిందించుచుందురు.

మనస్సు

 మన మనస్సు మన శరీరంలో ఎక్కడ ఉన్నది. శరీరంలో ఏ భాగంలో ఉన్నది ఎవరు చెప్పలేరు. కానీ మనస్సు ఉనికి శరీరం కొన్ని రీతుల్లో స్పందించే విధానాన్ని బట్టి ఫలానా కార్యక్రమము మనసు ప్రభావములన జరుగుతున్నది అని తెలుస్తుంది. ఉదాహరణకి బజారులో ఉన్న మామిళ్ళ బుట్టను చూసి మనం కూడా ఒక రెండు మూడు కిలోలు కొంటే మామిడిపండు రుచి చూడవచ్చు. ఈ ప్రకటితము ద్వారా మన మనసు ఇంద్రియాలకి ఏమని చెప్తుంది అంటే మామిడి పళ్ళు రుచి చూడు. ఈ మామిడి పళ్ళు కొనాలేని కోరిక ద్వారా మన మనసు వ్యక్తమవుతుంది.

మనలో ఉన్న ఆత్మ యొక్క ఉనికి ఎలా వ్యక్తమవుతుంది. ఈ శరీరం చేయబడిన 24 కరణాలు లేక తత్వాలు

ఆత్మతో కూడినప్పుడే చైతన్య అవుతుంది. కావున బ్రహ్మజ్ఞానం మనలో చైతన్యం ఉంది అంటే మనకి బ్రహ్మం మనలో ఉన్నాడు అన్నది తెలియకనే తెలుస్తుంది.


మనం ఏది లేకపోతే శివత్వాన్ని కోల్పోయి శవత్వాన్ని పొందుతాము

అదే బ్రహ్మము. అందుకోసం ఏమి ప్రయత్నం చేయక్కర్లే. శివత్వము మనలో ఉందని తెలుసుకోవడమే బ్రహ్మజ్ఞానం.

మనం చేసే మంచి చెడు కార్యక్రమాలన్నిటికీ సాక్షిభూతుడు ఆ బ్రహ్మమే. పాప పుణ్యాల్న్ని నిర్ణయించేదాబ్రహ్మమే.

అందుకే మనం చేసే ప్రతి కర్మకు సాక్షిభూతుడు ఆ బ్రహ్మ అని ఉనికి కలిగియుంటే అది బ్రహ్మజ్ఞానమే. 

ఇంత జ్ఞానం కలిగి ఉండి ఎన్నో తప్పులు చేసే మనం అహంకారంతో కూడి మనం చేసేదే సరైనది అని అనుకోవడం

మనలోనే బ్రహ్మం ఉన్నాడనే ఉనికిని మరిచిపోవడం కదా !


శుభం భూయాత్.

యుజీనా గ్రామం

 *యుజీనా గ్రామం.*    *15000 మంది భీకర హిందు సైన్యం...*  చుట్టూరా ముస్లిం గ్రామాలు. ఇజ్రాయెల్ లా పోరాడుతున్నారు.  నిజమైన హిందుత్వ, దమ్ము ధైర్యం అంటే ఇదే!    హర్యానా లోని మేవాత్ ను మినీ పాక్ అని పిలుస్తారు అని మీరు వినే వుంటారు.  అదే మేవాత్ లో యుజీనా అనే గ్రామం ఉంది. ఇదొక హిందూ గ్రామం, దీనిని ఇజ్రాయెల్ అని పిలుస్తారు.  ఇజ్రాయెల్ దేశం మాప్ లా చుట్టూరా ముస్లిం గ్రామాలు ఉంటాయి. 15000 జనాభా,వీరందరికి తురకల స్వభావం గురించి పూర్తిగా తెలిసినవారు.  అందుకే వారి గ్రామం లో ఒక్క తురక కుటుంబం కూడా లేదు.ఆశ్చర్యం ఏంటంటే అక్కడ అందరూ హిందువులే.  హిందూ అంటే మనలాగా అన్ని మతాలు ఒక్కటే, అందరూ దేవుళ్ళే అనుకునే ఎర్రి సన్నాసి హిందువులు కారు. పూర్తిగా హిందుత్వాన్ని ఆచరించే హిందువులు కల గ్రామం. వీళ్లకు 1947 నుండే తురకలతో ఎలాంటి సోదరభావం ఉండదు. 1992 అల్లర్ల లో ఒక హిందూ యువకుడిని తీసుకెళ్లారు తురకలు మళ్లీ ఇప్పటివరకు ఆ యువకుడిని వీళ్లు చూడలేదు.  అందుకే వీళ్ళందరూ కలిసి ఒక హిందూ సైన్యం తయారు చేసుకున్నారు. తమలో యువకుడు కనబడకపోయినా క్షేమంగా తిరిగి వచ్చేదాకా పట్టు వదలరు. గ్రాఫికల్ గా చూస్తే ఆ గ్రామం ఒక ఇజ్రాయెల్ లా అనిపిస్తుంది.

facts

 మనకు తెలియని మరో ఘోర నిజం..

1930 నుంచి గాంధీకి బ్రిటీష్ వాళ్ళు నెలకు 100/- లెక్కన పెన్షన్ ఇచ్చేవాళ్ళు..

డాలరు-బంగారం విలువ ప్రకారం దాని ఇప్పటి విలువ నెలకు 2.5 లక్షలు..బ్రిటీష్ వాళ్ళు గుజరాత్‌లో మొదటి ఫోన్ కనెక్షన్ గాంధీకి ఇచ్చారు.. ఎందుకు..??....


...#భారతీయుల్ని 

వీళ్ళిద్దరూ వెనకాల నుంచి బలేగా పొడిచారు కదా..??  అంత డబ్బు య0దుకు ఇచ్చారో  పోస్ట్ మొత్తం చదవండి...మీకే అర్థం అవుద్ది..

**********************************************సైరా నరసింహరెడ్డి తల తీసి కోట గుమ్మానికి వేలాడదీశారు


అల్లూరి సీతారామరాజు ని చుట్టుముట్టి చంపారు


మంగల్ పాండేను ఉరితీశారు


తాంతియా తోపేను ఉరితీశారు


రాణి లక్ష్మీబాయిని ఆంగ్ల సైన్యం చుట్టుముట్టి చంపింది


భగత్ సింగ్ ఉరితీశారు


ఉరితీసిన సుఖ్దేవ్ మాస్టర్‌ వేలాడదీయ బడ్డాడు


బ్రిటిష్ పోలీసులు చంద్రశేఖర్ ఆజాద్ ఎన్‌కౌంటర్


సుభాష్ చంద్రబోస్ అదృశ్యమయ్యాడు


భగవతి చరణ్ వోహ్రా బాంబు దాడిలో మరణం


రాంప్రసాద్ బిస్మిల్ ను ఉరితీశారు


జాతీయవాద జర్నలిస్టు అష్ఫకుల్లా ఖాన్ ను హత్య చేశారు


రోషన్ సింగ్ ను ఉరితీశారు


లాలా లాజ్‌పత్ రాయ్ లాతిచార్జ్‌లో మరణించారు


కాలా పానీకి వీర్ సావర్కర్ కు శిక్ష 

చాఫేకర్ బంధు (3 సోదరులు) ఉరితీశారు


మాస్టర్ సూర్య సేన్ ని ఉరితీశారు


ఈ దేశ స్వాతంత్య్ర సంగ్రామంలో తమ అత్యున్నత త్యాగం చేసిన చాలా కొద్దిమంది పేర్లు మాత్రమే ఇవి 


చాలా వేల మంది హీరోలు ఉన్నారు, మనకు వారి పేర్లు కూడా తెలియదు 


ఈ రోజు వరకు ఒక విషయం అర్థం కాలేదు. గాంధీ మరియు నెహ్రూలకు దేవుడు ఎలాంటి  కవచ కుండాలాలు ఇచ్చాడు


ఈ కారణంగా బ్రిటిష్ వారు వారిద్దరినీ ఉరితీయడం అటుంచి, ఒక లాఠీ కూడా కొట్ట లేదు


అన్నింటికంటే మించి, ఇద్దరూ భారతదేశానికి చెందిన బాపు మరియు చాచా అయ్యారు


మరియు వారి తరాలు ఇప్పటికీ దేశం మొత్తం మీద తమ పెంటెంట్‌ను అనుభవిస్తున్నాయి 


*..లోతుగా ఆలోచించండి..*


సైనికులపై రాళ్ళు - అహింసా ఉద్యమం


ప్రొసీడింగ్స్ ఆన్ లవ్ జిహాద్ - పోకిరితనం


రాళ్ళు రువ్వారు - తిరుగుతున్న యువత


భారత్ ను  ముక్కలు చేస్తాం - భావ ప్రకటనా స్వేచ్ఛ 


భన్సాలీ చెంపదెబ్బ - హిందూ ఉగ్రవాదం


గొడ్డు మాంసం తినడం - ఆహార హక్కు


ఈద్ మీద మేక కోత - మత స్వేచ్ఛ 


ట్రిపుల్ తలాక్ హలాలా - మతపరమైన అంతర్గత పదార్థం 


దీపావళి బాణసంచా - పర్యావరణ కాలుష్యం 


నూతన సంవత్సర పటాకులు - వాతావరణానికి ఇబ్బంది లేదు


క్రిష్ణాష్టమి రోజు ఉట్టి కొట్టే  పిల్లలు - 

రాజ్యాంగ విరుద్ధం 


అమాయక పిల్లల సున్తీ - మతపరమైన అంతర్గత విషయం 


వేదికపై నమాజ్ - మతపరమైన హక్కులు


 రోడ్ పండల్ - రోడ్ జామ్ కేసు 


మసీదు లౌడ్ స్పీకర్ - మత స్వేచ్ఛ


ఆలయంలో లౌడ్ స్పీకర్ - శబ్ద కాలుష్యం


కార్వాచౌత్ - ధకోసల 


ప్రేమికుల రోజు - ప్రేమ ఉత్సవం 


నాలుగు వివాహాలు - మత స్వేచ్ఛ 


హిందూ రెండు వివాహం - కేసు నమోదు


గణేష్ నిమజ్జనం, హోలీ - నీటి కాలుష్యం


తాజియా ఇమ్మర్షన్ - రాజ్యాంగ హక్కులు


అజామ్, ఒవైసీ, కేజ్రీ - నేషన్ మెన్ 


మోడీ, యోగి, స్వామి- హిందూ ఉగ్రవాదులు


భగత్ సింగ్ సుఖ్‌దేవ్ రాజ్‌గురు - ఉగ్రవాదులు


అఫ్జల్, కసాబ్, బుర్హాన్ - షాహీద్ స్వాతంత్ర్య వీరులు


15 నిమిషాల పోలీసు తరలింపు-సహనం


ఈ ఎన్నికల్లో బిజెపి గెలిచింది - అసహనం


కర్ణాటక లో హిందువులను చంపిన, కాశ్మీర్, బెంగాల్, కేరళ అల్లర్లు - దేశం నిశ్శబ్దంగా ఉంది 


అఖ్లాక్, గుజరాత్ అల్లర్లు - అవార్డు వాపసీ, అసహనం కలిగిన దేశం 


శివలింగంపై పాలు - పాలు వ్యర్థం 


మేకలు కోయుట, రక్తపు టేరలు - మత విశ్వాసాలు 


రాముని ఆలయం - గుండరాజ్


బాబ్రీ మసీదు - దేశంలో శాంతి 


తాజ్ మహల్ - ప్రేమకు సంకేతం 


రామ్ సేతు- ఊహాత్మకమైనది, రాముడు లేడు 

ఉగ్రవాదుల ఉరిశిక్షపై - రాత్రి సమయంలో, కోర్టులు తెరుచుకుంటాయి, క్షమ పిటిషన్లు దాఖలు చేయబడతాయి, భారత వ్యతిరేక నినాదాలు లేవనెత్తుతాయి. 


ఒక కులభూషణుని ఉరి - అందరూ మౌనంగా ఉన్నారు.


భారతదేశంలో హిందువులపై దారుణం - ఏ గొంతు పెగలదు ... అందరూ నిశ్శబ్దంగా మారతారు. చచ్చిన పాముల్లా ఉండిపోతారు.


హిందువుల ప్రతిచర్య - కాషాయ ఉగ్రవాదులు. దేశంలో అసహనం యొక్క వాతావరణం, వంచన వంటి అవార్డులు‌.


దేవతలను అవమానించడం - వ్యక్తీకరణ యొక్క స్వేచ్ఛ 


మహ్మద్ గురించి వివరణ -  దేశంలో అరాచకత్వం.


ఇది భారతదేశం యొక్క నిజం 


ఈ దేశంలో ఏమి జరుగుతోంది?


సమాన హక్కులు ఎక్కడ ఉన్నాయి? 


ఇది ఏమిటో అందరూ ఆలోచించాలి? 


ఓహో కాంగ్రేస్  మీరు ఈ దేశానికి   ఏ గతి పట్టించారు .


లేవండి సోదరులారా లేవండి.


ఈ సమాచారం భారత దేశం అంతా చదివితేనే  దేశం ముందుకెలుతుంది.......!


నా దేశం, మొట్టమొదట ప్రాధాన్యత.......!


ప్రతి ఒక్కరూ ఈ పద బంధాన్ని ఎప్పుడు పునరావృతం చేసు కోవాలి, 


అప్పుడే నా దేశం మారగలదు!

భారత్ మాతా కీ జై !!


(సేకరణ పోస్టు)


#Gandhi

#Nehru

 #facts