10, నవంబర్ 2020, మంగళవారం

వాస్తు శాస్త్రానికి సంబంధించిన

 **వాస్తు శాస్త్రానికి సంబంధించిన గ్రంధాలు**

సౌలభ్యం కోసం ఆకారంత క్రమములో సంస్కృతంలో ఉన్న వాస్తు గ్రంధాలు

1. అపరాజిత పృచ్చ

2. అపరాజిత వాస్తు శాస్త్రం

3. అగ్నిపురాణం

4. అభిలషితార్ధ చింతామణి

5. అర్ధశాస్త్రం

6. అంశుమత్

7. కాశ్యపీయం

8. అంశుమాన కల్పం

9. ఆగమాలు-శైవ పాంచరాత్రం శాక్తేయ వైఖానసం

10. కూపాది జలస్థాన లక్షణం

11. కౌతుక లక్షణం

12. క్రియా సంగ్రహ పంజిక

13. గరుడ పురాణం

14. గార్గ్య సంహిత

15. గృహవాస్తు ప్రదీపము

16. గృహపీఠిక

17. గోపుర విమానాది లక్షణం

18. గ్రామ నిర్ణయం

19. ఘట్టోత్సర్గ సూచనిక

20. చక్ర శాస్త్రము

21. చిత్రకర్మ శిల్పశాస్త్రము

22. చిత్రపటము

23. చిత్రలక్షణము

24. చిత్రసూత్రము

25. జయమాధవ మానసోల్లాసము

26. జలార్గళ శాస్త్రము

27. జలార్గళ యంత్రము

28. జ్ఞానరత్న కోశము

29. తచ్చుశాస్త్రము

30. తారాలక్షణము

31. బుద్ధప్రతిమా లక్షణం

32. దశాప్రకారము

33. దేవతాశిల్పము

34. దేవాలయ లక్షణము

35. ద్వారలక్షణ పటలము.

36. నారద పురాణం

37. నారద సంహిత

38. నారద శిల్పము

39. పక్షిమనుష్యాలయ లక్షణము

40. పాంచరాత్ర ప్రదీపిక

41. పిండప్రకారము

42. పీఠ లక్షణము

43. పురాణాలు

44. ప్రతిమాద్రవ్యాది వచనము

45. ప్రతిమా దాన లక్షణము

46. ప్రతిష్టా తత్వము

47. ప్రతిష్టా తంత్రము

48. ప్రాసాద కల్పము

49. ప్రాసాదదీపిక

50. ప్రాసాద మండనము

51. ప్రాసాద లక్షణము

52. ప్రాసాదాలంకార లక్షణము

53. బింబ మానము

54. బృహత్సంహిత

55. బుద్ధప్రతిమా లక్షణము

56. బుద్ధలక్షణము

57. మఠ ప్రతిష్టా తత్వము

58. మనుష్యాలయ చంద్రిక

59. మంజుశ్రీ మూలకల్పము

60. మయమతము

61. మానకధనము

62. మానవవాస్తు లక్షణము

63. మానసారం

64. Manasara Series (An Encyclopedia of Indian Hindu Architecture by BP Acharya 9Volumes)

65. మానసొల్లాసము

66. మానసొల్లాస వృత్తాంత కధనము

67. మూర్తి ధ్యానము

68. మూలస్థంభ నిర్ణయము

69. రత్నదీపికా

70. రత్నమాల

71. రాజగృహ నిర్మాణము

72. రాజవల్లభం

73. రాశిప్రకాశిక

74. రూపమండనము

75. లక్షణ సముచ్చయము

76. లఘుశిల్పజ్యోతిషము

77. లఘుశిల్పజ్యోతిష సారము

78. బలిపీఠ నిర్ణయము

79. వాస్తు చక్రము

80. వాస్తు తత్వము

81. వాస్తు నిర్ణయము

82. వాస్తు పురుష లక్షణము

83. వాస్తు ప్రబంధము

84. వాస్తు ప్రదీపము

85. వాస్తు మంజరి

86. వాస్తు మండనము

87. వాస్తు యోగ తత్వము

88. వాస్తు తత్వ ప్రదీపము

89. వాస్తు రత్నావళి

90. వాస్తు రత్నాకరము

91. వాస్తు రాజవల్లభము

92. వాస్తు ముక్తావళి

93. వాస్తు లక్షనము

94. వాస్తు విచారము

95. వాస్తు విద్య

96. వాస్తు విద్య(విశ్వకర్మ ప్రోక్తము

97. వాస్తు విద్య(సనత్కుమార ప్రోక్తము

98. వాస్తు శాస్త్రం లేదా శిల్ప శాస్త్రం

99. వాస్తు శిరోమణి

100. వాస్తు సముచ్చయం

101. వాస్తు సంగ్రహం

102. వాస్తుసారము

103. వాస్తు సారిణి

104. వాస్తుసర్వస్వ సంగ్రహము

105. విమాన లక్షనము

106. విశ్వకర్మ మతము

107. విశ్వకర్మ జ్ఞానము

108. విశ్వకర్మ పురాణము

109. విశ్వకర్మ ప్రకాశము

110. విశ్వకర్మ సంప్రదాయము

111. విశ్వకర్మీయ శిల్పశాస్త్రం

112. విశ్వవిద్యాభరణం

113. శాస్త్రజలధి రత్నము

114. శిల్పదీపకము

115. శిల్పనిఘంటువు

116. శిల్పలేఖ

117. శిల్పశాస్త్రం

118. శిల్ప రత్నము(2 భాగాలు

119. శిల్పసారము

120. శిల్పార్ధ శాస్త్రము

121. శుక్రనీతి

122. సమరాంగణ సూత్రధారి

123. దీపార్ణవం

124. పాంచరాత్ర ప్రాసాద ప్రాసాదము

125. 108 పాంచరాత్ర ఆగమ సంహితలు 

126. కాశ్యప జ్ఞాన కాండము

127. సంముర్తార్చనాధికారము

128. శ్రీ విమానార్చనా కల్పము


తెలుగులో లభించే గ్రంధాలు

1. కృష్ణ వాస్తు

2. గృహవాస్తు

3. గృహవాస్తు గణిత రత్నావళి

4. గృహవాస్తుదీపిక

5. గృహవాస్తు దర్పణం

6. గృహవాస్తు రహస్యము

7. గృహగణిత బోధామృతం

8. పంచావాస్తు పారిజాతం

9. వాస్తు దుందుభి

10. వాస్తు పద్మాకరము

11. వాస్తు నారాయణీయం

12. వాస్తు పూజా విధానం

13. వాస్తు సార సంగ్రహం

14. రామరాయ వాస్తు

15. శిల్పశాస్త్రం

16. సుబ్బరాయ వాస్తు శాస్త్రం

17. వాస్తు విజ్ఞాన సర్వస్వం

ఇంకా ఆంగ్లంలో,తమిళంలో,కన్నడలో,మలయాళంలో కూడా గ్రంధాలు ఉన్నాయి.

**సంకలనం గొడవర్తి సంపత్కుమార్ అప్పలాచార్యులు**

కావలసిన పురాణం యొక్క బుక్స్ లింక్స్

 మీకు కావలసిన  పురాణం యొక్క బుక్స్ లింక్స్ ఇక్కడ ఇస్తున్నాను 

పురాణ సంబంద 49 పుస్తకాలు(PDF) ఒకేచోట ఉచితంగా తెలుగులో.


గరుడ పురాణం www.freegurukul.org/z/Puranamulu-1

దేవీ భాగవతం www.freegurukul.org/z/Puranamulu-2

విష్ణు పురాణం www.freegurukul.org/z/Puranamulu-3

సంపూర్ణ శ్రీ శివ మహాపురాణం

www.freegurukul.org/z/Puranamulu-4

శివ పురాణము www.freegurukul.org/z/Puranamulu-5

భవిష్య మహా పురాణము

www.freegurukul.org/z/Puranamulu-6

దేవీ భాగవతం www.freegurukul.org/z/Puranamulu-7

సంపూర్ణ కార్తీక మహాపురాణం

www.freegurukul.org/z/Puranamulu-8

శివ పురాణం www.freegurukul.org/z/Puranamulu-9

పురాణ పరిచయము www.freegurukul.org/z/Puranamulu-10

బ్రహ్మ పురాణము-1,2,3

www.freegurukul.org/z/Puranamulu-11

మార్కండేయ పురాణం www.freegurukul.org/z/Puranamulu-12

శ్రీ దత్త పురాణం www.freegurukul.org/z/Puranamulu-13

హరి వంశ పురాణం www.freegurukul.org/z/Puranamulu-14

లక్ష్మీ నరసింహ పురాణం

www.freegurukul.org/z/Puranamulu-15

సంపూర్ణ దేవీ భాగవతము

www.freegurukul.org/z/Puranamulu-16

కల్కి పురాణము-1,2 www.freegurukul.org/z/Puranamulu-17

బసవ పురాణం www.freegurukul.org/z/Puranamulu-18

అష్టాదశ పురాణ కథా విజ్ఞాన సర్వస్వము

www.freegurukul.org/z/Puranamulu-19

శివ పురాణము – ధర్మ సంహిత

www.freegurukul.org/z/Puranamulu-20

కన్యకా పురాణం www.freegurukul.org/z/Puranamulu-21

శివ రహస్య ఖండము-1,2

www.freegurukul.org/z/Puranamulu-22

మదాంధ్ర బ్రహ్మావైవర్త మహాపురాణ సార సంగ్రహము www.freegurukul.org/z/Puranamulu-23

భాగవత,వామన, మార్కండేయ మహాపురాణాలు

www.freegurukul.org/z/Puranamulu-24

మార్కండేయ పురాణము

www.freegurukul.org/z/Puranamulu-25

శ్రీ పరమేశ్వరి-దేవీ భాగవత వచనము

www.freegurukul.org/z/Puranamulu-26

సూత సంహిత -స్కాంద పురాణాంతర్గతము

www.freegurukul.org/z/Puranamulu-27

ఆంధ్ర స్కాందము-1 www.freegurukul.org/z/Puranamulu-28

మదాంధ్ర బ్రహ్మావైవర్త మహాపురాణము-బ్రహ్మఖండము www.freegurukul.org/z/Puranamulu-29

స్కాందపురాణ సారామృతము

www.freegurukul.org/z/Puranamulu-30

దేవాంగ పురాణం www.freegurukul.org/z/Puranamulu-31

అగ్ని పురాణం www.freegurukul.org/z/Puranamulu-32

మత్స్య మహాపురాణము

www.freegurukul.org/z/Puranamulu-33

మదాంధ్ర బ్రహ్మావైవర్త మహాపురాణము-ప్రకృతి ఖండము www.freegurukul.org/z/Puranamulu-34

వైశాఖ పురాణము www.freegurukul.org/z/Puranamulu-35

పురాణ వాంగ్మయం www.freegurukul.org/z/Puranamulu-36

విష్ణు ధర్మోత్తర మహాపురాణము -1

www.freegurukul.org/z/Puranamulu-37

స్కాంద పురాణంతర్గత కార్తీక పురాణం

www.freegurukul.org/z/Puranamulu-38

నారదీయ పురాణము www.freegurukul.org/z/Puranamulu-39

పద్మ పురాణము-భూమి ఖండము

www.freegurukul.org/z/Puranamulu-40

మత్స్య మహా పురాణము-1

www.freegurukul.org/z/Puranamulu-41

స్కాంద పురాణతర్గత బ్రహ్మోత్తరఖండం

www.freegurukul.org/z/Puranamulu-42

మదాంధ్ర బ్రహ్మావైవర్త మహాపురాణము-శ్రీకృష్ణజన్మ ఖండము-ఉత్తరార్ధము

www.freegurukul.org/z/Puranamulu-43

మదాంధ్ర బ్రహ్మావైవర్త మహాపురాణము-శ్రీకృష్ణజన్మ ఖండము-పూర్వార్ధము

www.freegurukul.org/z/Puranamulu-44

సూత పురాణము www.freegurukul.org/z/Puranamulu-45

కైశిక మహత్యము www.freegurukul.org/z/Puranamulu-46

శివ తాండవము www.freegurukul.org/z/Puranamulu-47

దేవల మహర్షి చరిత్ర -వచన దేవాంగ పురాణం

www.freegurukul.org/z/Puranamulu-48

ప్రధమాంధ్ర మహాపురాణము

www.freegurukul.org/z/Puranamulu-49


పురాణముల పై అధ్యయనం, పరిశోధన చేయడానికి కావలిసిన పుస్తకాలు ఒకేచోట దొరకక తెలుగువారు ఇబ్బంది పడుతున్నారు. కావున ప్రతి ఒక్కరికి చేరేలా సహాయం చేయండి.

దీపావళి

 దీపావళి

తైలే లక్ష్మీ ర్టలే గంగా దీపావళి తిధౌ వసేత్‌

అలక్ష్మీపరిహారార్థం తైలాభ్యంగో విధీయతే|| 


దీపావళినాడు నువ్వుల నూనెలో లక్ష్మీయు, అన్నినదులు బావులు, మడుగులులోని నీళ్ళ యందు గంగయు ఉండును కావున ఆనాడు అలక్ష్మి (దారిద్య్రం) తొలగుటకు నువ్వుల నూనెతో తలంటుకొని స్నానం చేయవలెను. దానిచేత గంగాస్నాన ఫలం లభిస్తుంది. నరక భయంగలవారు నివారణకై దీనిని చేయుట శుభము.

దీపములు వెలిగించి అందు లక్ష్మిని ఆహ్వనించి లక్ష్మీపూజ చేయవలెను. దీనివల్ల అలక్ష్మీ నిస్సరణ జరుగుతుంది. లక్ష్మీపూజ చేసిన వారి ఇంట లక్ష్మీ శావ్వతంగా ఉండవలెననీ బలివరం కోరుకొన్నాడు. అలక్ష్మీ నిస్పరణానికి, డిండిమాదులు వాయించటం, ఉల్కాదానం వీనికి చిహ్నములుగా టపాకాయలు పేల్చి చప్పుడు చేయటం, 'జ్ఞాత్వా కర్మాణి కుర్వీత' తెలిసి చేసినా తెలియక చేసినా ఫలం వస్తుంది. ఆశ్వయుజ బహుళచతుర్ధశి నరకచతుర్దశి. దీనిని ప్రేత చతుర్ధశి అని కూడా అంటారు.


ఆశ్వయుజ చతుర్దశ్యాం సూర్యోదయాత్పురా

యామినీ పశ్చిమే భాగే తైలాభ్యంగో విధీయతే||

సూర్యోదయానికి ముందు రాత్రి తుదిజాములో ఈనాడు నువ్వుల నూనెతో అభ్యంగము చేసుకోవలెను. ఇందు వలన కలిగే ప్రభావం ఋషులు దివ్యదృష్టికే గోచరించే రహస్యం. ముఖ్య కాలంలో చేయుటకు వీలు కాకపోతే గౌణకాలంలోనైనా, అనగా సూర్యోదయం తర్వాతనైనా తైలా భ్యంగం చేయాలి. యతులు కూడా అభ్యంగం చేయాలని ధర్మసింధువు చెబుతున్నది. ఉత్తరేణి శిరస్సుపై తిప్పుతూ స్నానం చేయవలెను. దీనివల్ల యమబాధ తప్పుతుంది. త్రిప్పేటప్పుడు మంత్రంపఠిస్తూ త్రిప్పాలి.


శీతలోష్ఠ సమాయుక్త సకంటక దలాన్విత

హరపాప మాపామార్గ భ్రామ్యమాణః పునః పునః||

దున్నిన చాలులోని మట్టిపెళ్ళతో కూడినదీ, ముళ్ళతో నున్న ఆకులు గలదియూ అగు ఓఅపామార్గమా! నిన్ను త్రిప్పుతున్నాను. మాటిమాటికీ త్రిప్పబడి నీవు నాపాపమును హరింపచేయుము, అని అర్థము. అపామార్గాన్ని ఉత్తరేణు అని అంటారు.ఇక సాయంకాలం ప్రదోషసమయంలో అన్ని చోట్ల నువ్వులనూనెతో దీపాలు పెట్టాలి.  


అమావాస్యా చతుర్దశ్యోః ప్రదోషే దీపదానతః|

యమమార్గే దికారేభ్యోముచ్యతే కార్తికే నరః||

ఇక్కడ 'కార్తికే' అన్నమాట పూర్ణిమాంత మాసపక్షము. మన దేశంలో అమావాస్యాంత మాసపక్షం అమలులో ఉన్నందున. మనకిది ఆశ్వయుజమే. ఇక ఉల్కాదానం దివిటీలుకొట్టడం దక్షిణదిశగా మగపిల్లలు నిలబడి పితృదేవతలకు త్రోవ చూపుటకుగాను దివిటీలు వెలిగించి చూపవలెను. పిమ్మట పిల్లలు కాళ్ళుకడుగుకొని లోపలికి వచ్చి మధుర పదార్థం తినుట ఆచారము. సేకరణ.....మీ... *చింతా గోపీ శర్మ సిద్ధాంతి** *లక్ష్మీలలితా వాస్తు జ్యోతిష నిలయం* (భువనేశ్వరిపీఠం) పెద్దాపురం, సెల్:- 9866193557

నవగ్రహా దోషాల నివారణకు స్నానాలు

 నవగ్రహా దోషాల నివారణకు స్నానాలు


మానవ జీవితమున నవగ్రహాల ప్రభావంతో ఈతిబాధలు తప్పవు. నవగ్రహాలలో ఒక్కో గ్రహం, దాని తాలూక దోషం.. ఆయా వ్యక్తులకు మనఃశాంతి లేకుండా చేస్తుంటాయి. అందువల్ల గ్రహదోషం అనగానే వాటికి శాంతి చేయించడానికి పలు రకాల అవస్థలు పడుతుంటారు. అయితే ఈ గ్రహదోషాలు తొలగిపోవడానికి నియమబద్ధమైన పూజలే కాదు, వివిధ రకాల స్నానాలను గురించి కూడా శాస్త్రాలు చెబుతున్నాయి.


స్నానౌషధములు సిద్ధౌషధ సేవల వల్ల వ్యాధులు, మంత్ర జపము వల్ల సకల భయం తీరునట్లుగా ఔషధస్నాన విధానం వల్ల గ్రహదోషములు నశించును.


సూర్య గ్రహ దోష నివారణకు...

కుంకుమ పువ్వు, మణిశిల, ఏలుకలు, దేవదారు, వట్టివేళ్ళు, యష్టిమధుకము, ఎర్ర పుష్పాలు, ఎర్రగన్నేరు పువ్వులు.. ఈ వస్తువులను నీళ్ళలో వేసి కాచి, ఈ నీటితో స్నానం చేయాలి. సూర్య గ్రహ దోష నివారణకు గాను సూర్యున్ని పూజించుట, ఆదిత్య హృదయం పారయణ చేయుటకు, కెంపు,(మాణిక్యము) ధరించుట, సూర్యునకు గోధుములు, బెల్లం, కంచు, గుర్రము, రక్త చందనం, పద్మములు, ఆదివారం, దానం చేస్తే.. రవి వలన కలిగిన దోషాలు తొలుగును.


కంచుతో చేయబడిన ఉంగరం ధరించుట వల్ల మంజిష్టం గజమదం, కుంకుమ పువ్వు రక్త చందనములను రాగి పాత్రయందలి నీటిలో కలిపి ఆ రాగి పాత్ర యందలి నీటితో స్నానము చేసిన దోష నివృత్తి కలుగుతుంది. రాగి ఉంగరము ధరించడం కూడా మంచిదే. శుభ తిధి గల ఆదివారము రోజున సూర్యుని ఓం-హ్రాం-హ్రీం-హ్రౌం-సః సూర్యాయనమహః అను మూలమంత్రమును 40 రోజులలో 6 వేలు జపము పూర్తి చేసిన సూర్య సంబంధమైన దోషాలు తొలగిపోతాయి. 


చంద్ర గ్రహ దోష నివారణకు...

గో మూత్రం, ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు పేడ, ఆవు నెయ్యి, శంఖములు, మంచి గంధములు, స్పటికము.. ఈ వస్తువులను నీళ్ళలో వేసి కాచి, ఆ నీటితో స్నానము చేయాలి. చంద్రగ్రహ దోష నివారణకు చంద్రుని పూజించుట, దుర్గా దేవి ఉపాసించుట, బియ్యం దానం చేయుట, ముత్యం ఉంగరాన్ని ధరించుట గాని, మాలగా వేసుకొనుట గాని చేయాలి. సీసం, తెల్లని ఆవు, ముత్యములు, తెల్లని వస్త్రం నేయితో నింపిన కలశం, ఎద్దులలో ఎదేని ఒకటి సోమవారం దానము చేసినచో చంద్రునకు సంబంధించిన దోషం పోవును. వట్టివేర్లు, దిరిసెన గంధం, కుంకుమ పువ్వు, రక్త చందనము కలిపి శంఖములోపోసిన నీటితో స్నానం ఆచరిస్తే చంద్ర దోష పరిహారం కలుగుతుంది.


సీసపు ఉంగరము, వెండి ఉంగరము గాని ధరించుట మంచిది. శుభ తిధి గల సోమవారము నందు ఓం-శ్రాం-శ్రీం-శ్రౌం-సః చంద్రయనమః అను మంత్రమును 40 జపము చేసి చివరి రోజున అంటే.. 41వ రోజున బియ్యం, తెల్లని వస్త్రం నందు పోసి దానం చేస్తే చంద్ర దోష నివారణ కలుగుతుంది.


కుజ గ్రహ దోష నివారణకు...

మారేడు పట్టూ, ఎర్ర చందనము, ఎర్ర పువ్వులు, ఇంగిలీకము, మాల్కంగినీ, సమూలంగా పొగడ పువ్వులు.. ఈ వస్తువులను నీళ్ళలో వేసి కాచి ఆ నీటితో స్నానం ఆచరించాలి. కుజ దోష నివారణకు గాను కుజుని పూజించి సుబ్రహ్మణ్య స్వామిని పూజించడం వల్లగానీ, ఎర్రని పగడమును గాని కందులు, మేకలు, బెల్లము, బంగారము, ఎర్రని వస్త్రము, రాగి వీటి యందేదయిన దానము చేయుటకు కాని కుజదోష నివారణ అవుతుంది. వెండి పాత్రయందు చండ్రకర్ర గంధము, దేవదారుగంధం ఉసిరిక పప్పు కలిపిన నీటితో స్నానం ఆచరిస్తే అంగారకదోష నివారణ కలుగుతుంది.


బంగారు ఉంగరము ధరించు ఆచారము కలదు. శుభ తిధి గల మంగళవారం రోజున ఓం-క్రాం-క్రీం-క్రౌం-సః భౌమాయనమః అను మంత్రమును 7 వేలు 40 రోజులలో పూర్తి చేసిన ఎర్రనిరంగు బుట్టలో కందులు వేసి 41 వ రోజున దానం చేయడం మంచిది.


బుధ గ్రహ దోష నివారణకు...

చిన్న సైజులో ఉండే పండ్లు, ఆవు పేడ, గోరోచనము, తేనే, ముత్యములు బంగారము.. ఈ వస్తువులను నీళ్ళలో వేసి కాచి, ఆ నీటితో స్నానం ఆచరించవలెను. బుధ గ్రహ దోష నివారణకుగాను బుధ గ్రహమునకు పూజ,విష్ణు సహస్రనామ పారయణ చేయాలి. పెసలు దానము చేయాలి. ఆకు పచ్చ రంగు బట్ట, తగరము, టంకము, పచ్చ పెసలు, మరకతము, లొట్టపిట్ట, గజదండము (అంకుశము), పచ్చని పూవులు... వంటి వానిలో ఒకటి దానం చేసినచో బుధగ్రహం వలన కలుగు దోషం పరిహరించబడును.


నదీసంగమము నందు గల సముద్రపు నీటిని మట్టిపాత్రలో పోసి ఆ నీటిలో గజమదము కలిపి, ఆ నీటిని స్నానం చేస్తే కూడా బుధ దోషం తొలగును. ఇత్తడి లేక కంచు ఉంగరము ధరించుట సంప్రదాయము. శుభ తిధితో కూడిన బుధవారమునందు ఓం-బ్రాం-బ్రీం-బ్రౌం-సః బుధాయనమః అను మంత్రమును 40 రోజులలో జరిపించి చివరి రోజున అనగా 41 ఆకు పచ్చని వస్త్రములలో పెసలు పోసి దానము చేసినచో బుధగ్రహ దోష నివారన కలుగును.


గురు గ్రహ దోష నివారణకు...

మాలతీ పువ్వులు, తెల్ల ఆవాలు, యష్టి మధుకం, తేనే... వస్తువులను నీళ్ళలో వేసి కాచి, ఆ నీటితో స్నానము చేయాలి. గురు దోష నివారణకు గురుగ్రహమును పూజించుట నమక పారాయణ చేయడం వల్ల దోష నివారణయగును. పుష్యరాగం ఉంగరమున ధరించుట శనగలు, పుష్యరాగం, పసుపు, చక్కెర, ఏనుగు, బంగారు రంగువస్త్రము గాని, బంగారము గాని ఎదొకదానిని దానము చేయుటవలన కూడా గురునకు సంబంధించిన దోషము శాంతించగలదు. బంగారుతో చేసిన పాత్రతో బ్రహ్మమేడి (బొడ్డ), మారేడు, మర్రి, ఉసిరిక ఫలములను వేసి ఆ నీటితో స్నానం చేస్తే.. గురువునకు సంబంధించిన దోషము తొలగిపోవును.


బంగారముతో చేసిన ఉంగరము సాంప్రదాయము. శుభతిధి గల గురువారము నాడు ఉదయము ఓం-హ్రాం-హ్రీం-హ్రౌం-సః బృహస్పతయే నమః అను మంత్రము 40రోజులలో 16వేలు జపము పూర్తి చేసి పసుపు పచ్చని బట్టలో సెనగలు దానమిచ్చినచో గురుగ్రహ దోష శాంతి కలుగును.


శుక్ర గ్రహదోష నివారణకు...

కుంకుమ పువ్వు, యాలుకలు, మణిశిల, శౌవర్చ లవణము.. ఈ వస్తువులను నీళ్ళలో వేసి కాచి, ఆ నీటితో స్నానం ఆచరించాలి. శుక్ర గ్రహ గ్రహ నివారణకు గాను శుక్ర గ్రహమునకు లక్ష్మీదేవికి పూజ చేయాలి. వజ్రమును ఉంగరంను ధరించుట వలన శుభ వస్త్రము, తెల్లని గుర్రము తెల్లని ఆవు, వజ్రం, వెండి, గంధము, బియ్యం బొబ్బర్లు వీటియందేదొకటి దాన మిచ్చుట వలన గాని శుక్ర గ్రహ దోషం నివారింపబడును. వెండి పాత్రయందలి నీటిలో గోరోచనము గజమదము, శక్తిపుష్పము, శతావరిని కలిపి, ఆ నీటితో స్నానం ఆచరిస్తే శుక్రగ్రహ సంబంధమైన దోషం తొలగును.


వెండితో చేసిన ఉంగరము గాని, ముత్యముతో వెండి ఉంగరము ధరించుట సంప్రదాయము. శుభతిధితో కూడిన శుక్రవారమునందు ఓం-ద్రాం-ద్రీం-ద్రౌం-సః శుక్రాయనమః అను మంత్రము 20,వేలు 40రోజులలో జపము పూర్తిచేసి ,41వ రోజున తెల్లని వస్త్రములో బొబ్బరులుపోసి దానము చేసిన శుక్ర సంబంధమైన దోషం నివారింపబడును.


శని గ్రహ దోష నివారణకు..:

సాంబ్రాణి, నల్ల నువ్వులు, సుర్మరాయి, సోపు.. వస్తువులను నీళ్ళలో వేసి కాచి, ఆ నీటితో స్నానం చేయాలి. శని గ్రహ దోష నివారణకు శనిగ్రహ పూజలు,ఈశ్వర పూజ, తైలాభిషేకం, నీలమణి ధరించుట, నువ్వులు దానం చేయడం వల్ల గ్రహ దోష నివారణ కలుగును. నీలం, నూనె, నువ్వులు, గేదె, ఇనుము, నల్లని ఆవులందు ఏదో ఒకటి దానం చేయవలెను. ఇనుప పాత్రయందు గల నీటిలో మినుములు, ప్రియంగు ధాన్యము, నీలగంధ, నీల పుష్పములు వేసి ఆ నీటితో స్నానము చేస్తే శనిగ్రహ దోష నివారణయగును.


శుభతిధి గల శనివారము నుండి ఓం-ఖ్రాం-ఖ్రీం-ఖ్రౌం-సః శనయేనమః అను మంత్రము 40 రోజులలో 19వేలు జపము చేసి, 41వ రోజున నువ్వులు నల్లని బట్టలో వేసి శని గ్రహ దోష నివారణ కలుగుతుంది.


రాహు గ్రహ దోష నివారణకు...

నువ్వు చెట్టు ఆకులు, సాంబ్రాణి, కస్తూరి, ఏనుగు దంతము (ఏనుగు దంతం లభించకపోతే మిగిలినవి).. ఈ వస్తువులను నీళ్ళలో వేసి ఆ నీటితో స్నానం ఆచరించాలి.  రాహు గ్రహ దోష నివారణకుగాను రాహు గ్రహమును పూజించుట, దుర్గాదేవిని పూజించుట, గోమేధికమును ధరించుట వలన రాహు గ్రహ దోష నివారణ యగును, గోమేధ్కము, గుర్రము, నీలవస్త్రము, కంబళి నూనె, మినుములు, పంచలోహములు, వీటియందేదైన దానం చేయడం వల్ల కూడా దోష శాంతి కలుగును.


గేదె కొమ్ముతో చేసిన పాత్రయందలి ఉదకమున గుగ్గిలము, ఇంగువ,హరిదళము, మనశ్శిలలతో కలిపి ఆ నీటితో స్నానం చేసి అన్చో రాహు దోషం తొలగును. పంచ లోహములతో చేసిన ఉంగరము ధరించుట సాంప్రదాయం. శుభతిధి గల శనివారము నాడు రాహుమంత్రమగు ఓం-భ్రాం-భ్రీం-భ్రౌం-సః రాహవే నమః అను మంత్రమును 40 రోజులలో 18 వేలు జపము పూర్తి చేసి, 41వ రోజున మినుము చల్లని బట్టలో వేసి దానం చేసినచో రాహుగ్రహ సంబంధమైన దోషం తొలగిపోవును.


కేతు గ్రహ దోష నివారణకు...

సాంబ్రాణి, నువ్వుచెట్టు ఆకులు, మేజ మూత్రం, మారేడు పట్ట, ఏనుగు దంతం, (ఏనుగు దంతం లభించకపోతే మిగిలినవి)..  ఈ వస్తువులను నీళ్ళలో వేసి కాచి ఆ నీటితో స్నానం చేయవలెను. కేతు దోష నివారణకుగాను కేతుగ్రహమును పూజించి సూర్యనమస్కారములు చేస్తూ ఉలవలు దానం ఇవ్వాలి. వైఢూర్యం, నూనె, శాలువా, కస్తూరి, ఉలవలు వీటిని దానం చేసినా కూడా కేతుగ్రహ దోష నివారణ కలుగుతుంది.


ఖడ్గమృగము కొమ్ముతో చేయబడిన పాత్రయందు గల నీటిలో పర్వతముల యందు పందికొమ్మతో తవ్వబడిన మట్టి, మేక పాలు కలిపి ఆ నీటితో స్నానం ఆచరిస్తే కేతుగ్రహ దోష నివారణ కలుగును. పంచలోహముల ఉంగరం ధరించుట సాంప్రదాయం. శుభ తిధి గల మంగళవారం నాటి నుంచి ఓం-ప్రాం-ప్రీం-ప్రౌం-సః కేతవే నమః అను మంత్రమును 40 రోజులలో 7 వేలు జపము పూర్తి చేసి 41వ రోజున ఎర్రని వస్త్రంలో ఉలవలు పోసి దానమిచ్చిననూ కేతుగ్రహ దోష నివారణ కలుగుతుంది.....మీ... *చింతా గోపీ శర్మ సిద్ధాంతి** *లక్ష్మీలలితా వాస్తు జ్యోతిష నిలయం* (భువనేశ్వరిపీఠం) పెద్దాపురం, సెల్:- 9866193557

విద్యాగంధం

 శ్లో!రూప యవ్వన సౌందర్యం గుణ శీల సమన్వితం 

                         విద్యాహీనం నశోభంతే పాలాశ కుసుమం వృధా 


ఒకరోజు ఈ   శ్లోకాన్ని చదివారు. మా నాన్నగారు.  అర్థమడిగాను. "ఎన్ని మంచి లక్షణాలు వున్నా విద్యాగంధం లేకుంటే, మోదుగ పూల లాగా వృథా, అని అంటూ, ఈ మోదుగ పూలు అడవిలో ఎక్కవగా పూయడం వల్ల వాటిని ఎవరూ ఆదరించరు, అలాగే, మంచి చదువు లేకున్నా మనిషి పరిస్థితి అంతే" అని ఒక సంబంధిత కథ చెప్పుకొచ్చారు.


పూర్వం ఒక గ్రామంలో సకల విద్యాపారంగతులైన ఒక బ్రాహ్మణ కుటుంబంలో నలుగురు కొడుకులు, ఒక కూతురు వుండేవారు. పదేళ్లు దాటిన తన కూతురికి వివాహం కాలేదని వాపోయేవాడు తండ్రి. చివరకు ఆయన స్నేహితుడి ద్వారా, ఒక సంపన్న కుటుంబంలోని పదహారేళ్ల యువకుడిని అల్లుడిగా చేసుకున్నాడు. అల్లుడు పెద్దగా చదువుకోలేదు. అయితే, ఏం? గొప్ప ఆస్తిపరులు. చిన్నపిల్ల కారణంగా కూతురిని ఇంకా కాపురానికి పంపలేదు.


ఐదేళ్లు గడిచిన తర్వాత, మామగారే వెళ్లి, అల్లుడిని  పండగ సాకుతో తమ ఊరికి   పిలుచుకొని వచ్చాడు. దాదాపు తన వయసు వారే అయిన బావమరదులు, బావగారిని సాదరంగా ఆహ్వానించారు. అందరికీ పాండిత్య ప్రకర్ష వుంది కనుక, శాస్త్ర చర్చలలో తమ పాండిత్యానికి పదును పెడుతూ కూర్చున్నారు.

బావగారు, 'కిం కర్తవ్యం' అన్నట్టు కూర్చున్నాడు. భర్త విద్యాగంధం లేనివాడని గ్రహించిన భార్య, 'పాలాశ కుసుమం వృథా' అని సరదాగా ఆట పట్టించింది. తనను, తన భార్యనే అందరి ముందు అవమానించిందనే ఆవేశంతో, అపార్థం చేసుకొని, అప్పటికి ఏమీ అనకపోయినా, ఎలాగైనా తాను కూడా సంస్కృత విద్యలో ఆరి తేరాలని, ఆ రాత్రికి రాత్రే అత్తగారిల్లు విడిచి వెళ్లిపోయాడు.


కథ కంచికి వెళ్లినట్టు, ఇతడు కూడా విద్యార్జన కోసం కాశీకి బయలు దేరాడు. అక్కడ సర్వ శాస్త్రములు తెలిసిన ఒక గురువు గారి అభయం కోరి,  కాళ్లుపట్టుకొని వదలలేదు. శిష్యుడి ఉద్దేశం గమనించిన గురువుగారు, అతడిని పైకిలేపి, "శుభం నాయనా, నూతి దగ్గరకు వెళ్లి స్నానం చేసిరా, భోజనం చేద్దువుగానీ" అన్నారు. 

పెరటి గుమ్మం పొట్టిగా వున్న కారణంగా, వస్తూ వెళుతూ గుమ్మాన్ని తలకు తగిలించుకునేవాడు. బాగా నొప్పి కలిగేది. అమ్మా! అబ్బా! అని అంటూవుండేవాడు కానీ, చదువు ధ్యాసలో ఇవన్నీ పట్టించుకునేవాడు కాదు. అయితే, గురువుగారు ఇదంతా గమనిస్తూ వుండేవారు.


అతనికి వంటల్లో ఆముదం వేసి పెట్టమని భార్యకు చెప్పాడు గురువుగారు. చదువు ధ్యాస ముందు ఏమీ తెలిసేది కాదు. అలా, ఎంతో నిష్ఠతో రోజులో పదహైదు గంటలు చదువుకు వెచ్చించి, గీర్వాణాంధ్ర భాషలు, తర్క, వ్యాకరణ, న్యాయ, మీమాంసాది షట్ శాస్త్రాలు క్షుణ్ణంగా ఐదేళ్లలో పూర్తి చేసేశాడు. 


ఒకరోజు యథాప్రకారం పెరట్లోకి వెళుతుంటే గుమ్మం తగిలింది. వెంటనే వెనుతిరిగి, "గురువుగారూ, ద్వార బంధం చిన్నగా వుండి, కొట్టుకుంటుంది, మార్పించండి" అన్నాడు. స్నానం చేసి, వచ్చి భోజనం చేస్తూ, "వంటల్లో కొంచెం ఆముదం వాసన వేస్తుంది" అన్నాడు. దీంతో, ఆ దంపతులు నవ్వుకున్నారు. "నాయనా, నీ చదువు అయిపోయింది. ఇక నువ్వు ఇంటికి పోవచ్చు" అన్నారు గురువుగారు.


గురువు దగ్గర సెలవు తీసుకొని చక్కగా, భార్య వున్న గ్రామానికే వచ్చి, అక్కడే ఒక అతిథి గృహంలో బస చేశాడు. గ్రామానికి ఎవరో పండితుడు వచ్చాడని, కర్ణాకర్ణిగా విన్న బావమరదులు  చూడడానికి వచ్చారు. విద్యతో వెలిగిపోతున్న అతడి వర్ఛస్సు, వాళ్లని కదలనివ్వలేదు. అతడి వినయం, గుణ సంపద కట్టిపడేసింది.

 

ఇంత చిన్న వయసులో, ఇంతటి పాండిత్యమా! అని ఆశ్చర్యపోయిన వాళ్లు, అతిథిని తమ ఇంటికి భోజనానికి ఆహ్వానించారు. అయితే,  ఐదేళ్ల నుండి చూడని కారణంగా, తమ బావగారిని గుర్తించలేదు. పైగా, దీక్షా కేశపాశాలు అడ్డమయ్యాయి. కానీ, ఇతడు వాళ్లను గుర్తు పట్టి, ఆతిథ్యానికి ఒప్పుకున్నాడు.


మరుసటి రోజు ఆతిథ్యానికి బయలుదేరాడు. ఇంత కాలం రాని అల్లుడు, తప్పక ఆత్మహత్య చేసుకొని వుంటాడని నమ్మిన గ్రామస్థులు, వాళ్లను బలవంతంగా ఒప్పించి, అతడికి ఉత్తర  క్రియలు చేయించి, భార్యకు శిరోముండనం కూడా చేయించారు. ఆమే వంటచేసి, అందరికీ వడ్డించింది. ఆ స్థితిలో వున్న భార్యను చూసి, చలించిపోయాడు. నిజంగా మనసులో బాధ పడ్డాడు.


భోజనం చేస్తున్నాడు. కానీ మనసు, మనసులో లేదు. జీలకర్ర, మంచి ఇంగువ వేసిన చారు వాసన అమోఘంగా వుంది. కానీ, ఉప్పు లేదు, రుచి అనిపించలేదు. ఐదేళ్ల క్రితం భార్య అన్న మాట గుర్తుకొచ్చి, అప్పుడు ఎగతాళి చేసిందనుకున్నాడు. కానీ,  వున్నమాటే అనిందని, తానెవరో భార్యకు తెలియజెప్పాలని, ఒక శ్లోకాన్ని వదిలాడు. 


                   శ్లో!చారు చారుసమాయుక్తం, హింగు జీలక మిశ్రితం 

                       కించిల్లవణ శూన్యంచ, పాలాశ కుసుమం వృథా!


అంటూ, గుర్తుపట్టిందా! లేదా అని భార్యవైపు చూశాడు. ఆమె ఆతడిని బాగా గమనించి, గుర్తించింది. ఒరేయ్, మీ బావగారురా! అని తెగ సిగ్గుపడిపోయి, తలపైన కొంగు సర్దుకుంటూ వంటిట్లోకి పరుగెత్తుకెళ్లింది. ఆశ్చర్యపోయిన సోదరులు కూడా అతడిని తేరిపారా చూసి, గుర్తించి, తెగ సంబరపడిపోయారు. 


మరుసటి రోజు అంబష్టుడిని పిలిపించి, క్షవరం చేయించి, నూతన వస్త్రాలతో సత్కరించి, అలంకృతుడిని చేసి, శాస్త్ర ప్రకారం ప్రాయశ్చిత్త, ఆయుష్షు హోమాది వైదిక కర్మలు, దానాదులు చేయించి, చెల్లెలిని సుమంగళిగా అలంకరించారు. గర్భాదాన ప్రక్రియ కూడా పూర్తి చేశారని, కథను ముగించారు మా నాన్నగారు.  

 

ఈ కథ ద్వారా చదువు యొక్క ఆవశ్యకత, విశిష్టత చెప్పడమే మా నాన్న గారి ఉద్దేశమై వుంటుంది. నిజంగా,ఆ తెల్లవారుజామున ఆయన కథ చెప్పిన తీరు, విధానం, నాకు చదువు పట్ల ఎంతో ఆసక్తిని కలిగించాయి.

 

ఈ నాటి యువత కూడా, ఎన్ని అడ్డంకులు ఎదురైనా, ఎన్ని అవరోధాలు కలిగినా కృంగిపోకుండా చదువు మీదనే దృష్టిపెట్టి, జ్ఙానాన్ని సంపాదించుకుంటారని మనసారా ఆకాంక్షిస్తున్నాను.

చదివినందులకు ధన్యవాదములు 🙏

అంబాళం పార్థసారథి,

08-09-2016.

----------------------   శుభసాయింత్రం   -----------------------------

సౌభాగ్యాన్ని కాపాడే స్తోత్రం)

 స్త్రీల సౌభాగ్యాన్ని కాపాడే స్తోత్రం)





నమః కాంతాయ భర్త్రేచ శిరశ్చంద్ర స్వరూపిణే |
నమశ్శాంతాయ దాంతాయ సర్వదేవాశ్రయాయచ ||

నమో బ్రహ్మస్వరూపాయ సతీప్రాణపరాయ చ |
నమస్యాయచ పూజ్యాయ హృదాధారాయతే నమః||

పంచప్రాణాధిదేవాయ చక్షుషస్తారకాయ చ |
జ్ఞానాధారాయ పత్నీనాం పరమానంద రూపిణే ||

పతిర్బ్రహ్మా పతిర్విష్ణుః పతిరేవమహేశ్వరః |
పతిశ్చనిర్గుణాధారో బ్రహ్మరూప ! నమోస్తుతే ||

క్షమస్వ భగవాన్ ! దోషం జ్ఞానాజ్ఞానామృతం చయత్ |
పత్నిబంధో ! దయాసింధో ! దాసీదోషం క్షమస్వమే ||

- ఇతిస్తోత్రం మహాపుణ్యం సృష్టాదౌ పద్మయాకృతం
సరస్వత్యాచ ధరయా గంగయా చ పురావ్రజ

సావిత్ర్యా చ కృతం పూర్వం బ్రహ్మణే చాపి నిత్యశః
పార్వత్యా చ కృతం భక్త్యాకైలాసౌ శంకరాయచ

బ్రహ్మవైవర్త పురాణంలోని  ఈ  స్తోత్రాన్నిలక్ష్మీ, సరస్వతి, గంగ, భూదేవి, సావిత్రి, పార్వతి మున్నగు దేవతా మూర్తులు పఠించారు. 

బ్రతుకు బండి

 బ్రతుకుమీద భ్రాంతి లేదు

మృత్యువంటే భయం లేదు

మనుగడ .. మృత్యువుల మధ్య

బ్రతుకు బండి సాగుతోంది

భారంగా !


భోగించాలన్న ఆశాలేదు

యోగి కావాలన్నధ్యాసాలేదు

భోగి.. యోగిల మధ్య

జీవితం జరిగిపోతుంది

జారుకుంటూ!


జ్ఞానికావాలన్న వాంఛాలేదు

అజ్ఞానిగా మిగలాలనీ లేదు

జ్ఞానం.. అజ్ఞానం మధ్య

జీవనం సాగిపోతుంది

పడుతూ.. లేస్తూ !


సంపాదనపై అనురక్తీలేదు

సంపద అంటే విరక్తీలేదు

అనురక్తీ.. విరక్తుల మధ్య

కాలం గడిచిపోతుంది

యధావిధిగా !


చావంటే భయం లేదు

చచ్చిపోవాలనీ లేదు

ఉఛ్వాశ.. నిశ్వాసల మధ్య

ఊపిరి సాగిపోతుంది

నిశ్శబ్దంగా!


ఆకలని  ధ్యాసా లేదు

అన్నం మానాలనీ లేదు

తినటం .. తిరగటం మధ్య

తనువు సాగిపోతుంది

యాంత్రికంగా !


కీర్తి కావాలని కోరుకోవటంలేదు

అపకీర్తి మూటకట్టాలనుకోవటంలేదు

అన్నీ.. అశాశ్వతమని

అందుకోసం ఆరాటమెందుకని

బ్రతుకు సాగుతోంది.. మామూలుగా!


భౌతిక వాంఛలను కాదన్నదీలేదు

ఆధ్యాత్మికతపై విరక్తీలేదు

భౌతికత .. ఆధ్యాత్మికతమధ్య

ఆవిరైపోతుంది ఆయువు

అయోమయంగా!


పాపం చేయాలనీలేదు

పుణ్యం మూట కట్టాలనీలేదు

పాప పుణ్యాల మధ్య

పుణ్యకాలం కరిగిపోతుంది

దిశారహితంగా!

👏👏👏

సింగినాదం - జీలకర్ర

 “సింగినాదం - జీలకర్ర*


కొన్ని సందర్భాల్లో 

మనకు తెలియకుండానే 

తెలుగుల కొన్ని నానుడులు 

 అసంకల్పితంగా 

 అనేస్తూ ఉంటాము....


కాని వాటి వెనుక 

ఉన్న అసలు 

అర్ధం చాలామంది కి 

తెలియదు...


ఈ రోజు 

సింగినాదం జీలకర్ర 

అనే నానుడి వెనుక 

దాగి ఉన్న అంతరార్ధం 

 తెలుసుకుందాం....


ఒకప్పుడు 

ఓ రాజ్యంలో 

జీలకర్రకు 

విపరీతమైన 

కొరత ఏర్పడింది...


ప్రజలందరూ 

జీలకర్ర లేక చాలా

ఇబ్బందులు పడ్డారు..


ఇదే అదనుగా 

వ్యాపారస్తులు 

ఇతర దేశాల నుండి 

జీలకర్రను దిగుమతి 

చేసుకుని ఎక్కువ రేట్లకు 

అమ్మడం మొదలు పెట్టారు....


ఈ విషయమై ప్రజలందరూ 

తమ గోడును రాజు గారికి 

 విన్నవించుకున్నారు...


అప్పుడు రాజు గారు 

మంత్రివర్గం తో 

అత్యవసర సమావేశం 

ఏర్పాటు చేసి 

విదేశాలనుండి ఓడల 

మీద జీలకర్రను తెప్పించి 

 మధ్యవర్తుల ప్రమేయం 

లేకుండా డైరెక్ట్ గా ప్రజలకు 

అమ్మే ఏర్పాటు చేశారు...


అయితే జీలకర్ర తో 

కూడిన ఓడ...

రేవుకు చేరుకున్నవెంటనే 

ఆ విషయం ప్రజలకు 

 తెలియచేయడానికి 

ఓ ఏర్పాటు చేశారు...


అదే శృంగ నాదం...


శృంగ నాదం

అంటే ఒక సంగీత 

వాయిద్య పరికరం... 


ఒక విధంగా ఇది 

బాకాను పోలి ఉంటుంది....

ఓడ,  రేవుకు చేరగానే 

శృంగనాదం గట్టిగా ఊదడం 

ద్వారా ప్రజలకు ఆ విషయాన్ని 

 తెలియ చేసెడి వారు...


ప్రజలు వెంటనే 

ఓడ రేవుకు చేరుకుని 

డైరెక్ట్ గా జీలకర్రను 

కొనుక్కునే వారు...


మధ్య దళారుల 

ప్రమేయం 

లేక పోవడంతో 

జీలకర్ర తక్కువ 

రేటుకి లభించి ప్రజలు 

 ఆనందించారు...


ఇక అసలు 

విషయానికి వస్తాను...


జీలకర్ర లేకపోవడం వల్ల 

జనజీవనం అస్త వ్యస్తం 

అయ్యే అంత పరిస్థితి 

 ఏమి ఉండదు...


అయినా రాజు గారు 

దానికి అధిక ప్రాధాన్యాన్ని 

ఇచ్చి లేనిపోని హడావిడి చేశారు...


అందుకే అప్పటి నుండి 

ఎవరైనా అనవసర 

విషయాలకు అధిక 

ప్రాధాన్యాన్ని ఇస్తే 


ఆ చేశావులే 

శృంగానాదం జీలకర్ర 

అనడం పరిపాటి అయినది...


కాలక్రమంలో 

శృంగానాదం 

కాస్త సింగినాదం గా 

మారి....


సింగినాదం జీలకర్ర గా 

మారింది...


ఈ విషయం చెప్పడానికి 

నేను ఇంత మేటర్ ను 

తెలుగులో తయారు చేసి 

మీకు 

పోస్ట్ చేయడం అంత 

అవసరం అంటారా...


*ఆఁ... సింగినాదం జీలకర్ర....*😊😃🥳

మంత్రానికి శక్తి ఉందా?

 మంత్రానికి శక్తి ఉందా?


మంత్రం ఒక శబ్దం. మౌనంగా మనోవల్మీకంలో జరిగే మంత్రజపాలకి చింతకాయలు రాలుతాయా? ఈ ఆధునిక యుగంలో,బిజీలో, గజిబిజీలో మనోభావాలకి తావెక్కడ అనిపిస్తుంది! కానీ ఆశ్చర్యమేమిటంటే ఒకపక్కన మన భారతీయ సంస్కృతి గురించి మనమే యోచిస్తుంటే ఇంకో పక్క ప్రపంచమంతటా రోజురోజుకి వెలుస్తున్న యోగ ధ్యాన కేంద్రాలు, వాటినిండా ఎందరో దేశ విదేశాల వారు మన అష్టాంగ మార్గాన్ని, ఆసనాలని, మంత్ర సాధనలని నేర్చుకుంటున్నారు. ఈ రంగాలలో బహుశా మనకన్నా వారే పురోగమిస్తున్నారేమో అనిపిస్తుంది. Art of living, Transcendental Meditation, ఇంకా ఎన్నో విశేషమైన పద్ధతులు ప్రపంచ వ్యాప్తమవుతున్నాయి.


మంత్రాలని గురించి మనం మాట్లాడే ముందు కొన్ని ముఖ్యమైన విషయాలు పరిశీలించాలి. మనం ఈ రోజు పాల సీసా నించి ప్లాస్మా టీవీ దాకా వాడుతున్నాం, ఆనందిస్తున్నాం. అందుకు మూలం రసాయనశాస్త్రంలో (Chemistry) మనం సాధించిన ప్రగతి అని అందరికీ తెలుసు. విచిత్రమేమిటంటే రసాయనశాస్త్రం ఒకప్పుడు రసవాదంతో (Alchemy) మొదలైంది. లోహాలని బంగారంగా మార్చాలన్న మానవ తపన తన చుట్టూవున్న మూలకాలని, లోహ సం యోగ ధర్మాలని అధ్యయనం జరిగేలా చేసింది, బంగారం చేయలేక పోయినా అదే ఈ రోజు బంగారం కన్నా విలువైన వైజ్ఞానిక ప్రగతిని ఇచ్చింది, మానవాళిని ఖండాంతర, గోళాంతర గతిలో తీసుకు వెడుతోంది. అందుకే అనిపిస్తుంది ఏ శాస్త్రాన్ని, విజ్ఞాన రంగాన్ని తక్కువ అంచనా వేయలేము అని.


మంత్రం మనోనిర్మితం.మనస్సుకి ఇంత శక్తి వుందా అని ఆశ్చర్యపోనక్కర్లేదు. మామూలుగా పెన్ను పక్కన పెట్టుకుని మర్చిపోయే మనుషులు హిప్నటైజ్ చేయబడ్డపుడు ఎంతో కాలం క్రితం జరిగిన చిన్న చిన్న సంఘటనలని జ్ఞాపకం చేసుకోగలగడం, పూస గుచ్చినట్లు చెప్పగలగడం పైగా మంచు గడ్డల మీద మంచం మీద పడుకున్నట్లు పడుకోగలగడం ఇవన్నీ మనసుకి సహజంగా వుండే మహాశక్తికి అతిచిన్న మచ్చు తునకలు. మనిషి అంతరంగంలో ఆ మేధస్సులో (Subconscious) ఎన్ని రహస్యాలున్నాయో అనిపిస్తుంది. మనలో దాగిన ఈ శక్తి కనీసం 5% ఐనా మనం వాడుతున్నమా అనిపిస్తుంది. Math Bee,Spelling Bee లాంటి వాటిలో చిన్నారుల ప్రతిభ చూస్తే వారి మేధస్సుకి వారికే కాదు ఒక్కొసారి మానవ జీవితాన్ని, తెలివిని ఇచ్చిన ఆ దేవుడికి కూడా నమస్కరించాలనిపిస్తుంది.


ఒకప్పుడు భూమి గుండ్రంగా వుంది అంటే నవ్వారు. అది ఇప్పుడు శాస్త్రమైంది. యోగం, ధ్యానం పాతచింతకాయ్ పచ్చడి అనుకున్నాం. ఇప్పుడు వాటిని అందరూ శాస్త్రీయంగా భావిస్తున్నారు. విచిత్రమేమిటంటే ప్రపంచ చరిత్రను మార్చిన అనేకమంది శాస్త్రవేత్తలు., వేదాంతులు, సాధకులు, యోగులు కూడా. ఫ్లాటో నించి నీల్స్ బోర్ దాకా అధిభౌతిక తత్వం కనిపిస్తూనే వుంది.


మనస్తత్వ శాస్త్రంతో పరిచయం వున్న చాలా మందికి ఫ్రాయిడ్ తెలుసు. ఫ్రాయిడ్ కి సమకాలికుడైన ఒక మహా మనోవైజ్ఞానికుడు కార్ల్ జంగ్. మతాన్ని,దేవుడిని శాస్త్ర దృక్పధంలోంచి చూపిన ఒక మహానుభావుడు. ఆయన శ్రీ చక్రాన్ని,మంత్ర ఉపాసకుల మండలాలని గురించి యధాతధంగా ఇలా అన్నారు


"Things reaching so far back into human history (like yantras and mandalaas) naturally touch upon the deepest layers of the unconsciousness, and can have a powerful effect on it. Even when our conscious language proves itself to be quite impotent such things can not be thought up but must grow again from the forgotten depths..(from book: Word and Image on Carl Jung"


(మండలం, యంత్రం లాంటివి మానవ చరిత్రలో భాగంగా వున్న సహజ భావాలు.ఇవి మనోప్రవృత్తిలో ఏకమై మన తరతరాలుగా వస్తున్న ఆలోచనా పరంపరలో భాగం. వీటి శక్తి,ప్రభావం అపరిమితం. మన వాడుక భాషకూడా వీటిని వివరించడంలో విఫలమవుతుంది. ఎందుకంటే, వీటిని మనం కల్పించలేం, మళ్ళీ మనం మనావాళిగా మరిచిపోయిన,మస్తిష్కంలో దాగిన ఆ నిక్షిప్త రహస్యాలని మళ్ళీ వెలికి తీసి వృద్ధి చేసుకోవడం తప్ప.. స్వేచ్చానువాదం).


అంతేకాదు మంత్రాన్ని, తరతరాలుగా మానవ పురోగమనంతో బాటు వస్తున్న సం స్కృతి చిహ్నంగాను, అతీతమైన ఓ సృష్టి శక్తి మనిషికిచ్చిన చిన్న సంతకం అని కూడ చెప్పుకో వచ్చు. లోకకల్యాణమే ఆశయంగా పెట్టుకున్న, తపస్సుకే జీవితాన్ని అంకితం చేసిన ఏ యోగికో ఆ మంత్రాన్ని ప్రకృతి మాత అందిస్తే దాన్ని మనం మంత్రం అంటున్నాం, ఆయన్ని మంత్రద్రష్ట అంటున్నాం.అటువంటి మంత్రాలని నిరంతరం ఉపాసించడం ద్వారా అనేకమంది సాధకులు యోగులయ్యారని,లోకోపకారానికి తమ తపస్సుని వినియోగించారని పురాణ ఇతిహాసాలు, వేదాలు చెపుతున్నాయి.అన్ని సంవత్సరాల కృషిని,విజ్ఞాన సంపదని కేవలం ఒక మామూలు విషయంగా చూడలేము కదా!


"Let noble thoughts come from all directions" అంది ఋగ్వేదం.


ఫ్రణవమే సృష్టికి మూల శబ్దమట. "సృష్టి ఆదిలో శబ్దము పుట్టెను" అని బైబిలు కూడా చెబుతోంది.అంతెందుకు మన జీవితంలో ప్రతి కోణం పదాలతో నిండి వుంది. "బాగున్నరా" అనడానికి "బడుద్ధాయి" అనడానికి ఎంతో తేడా వుంది. మనం శబ్దాన్ని విన్నపుడు మనకి అది మనసులో శక్తిగా, దృశ్యంగా రూపం కనిపిస్తుంది. అందుకే గాయత్రి మంత్రాన్ని జపించినపుడు ఆ తేజో రూపశక్తిని బుద్దిని ప్రదీప్తం చెయ్యమని ప్రార్ధిస్తారు. దేవతలని పూజించాలన్నా, ఆవాహన చేయాలన్నా, దర్శించాలన్నా అది కేవలం మంత్రాల వల్లే సాధ్యం అనడానికి అందరికి తెలిసిన ఎన్నో కధలున్నయి. మంత్రాన్ని జపిస్తూ పునరావృతం చేయటం వల్ల మంత్రం సిద్ధించి దేవత అనుగ్రహిస్తుందిట. ఒక రామ మంత్రం బోయ వాణ్ణి వాల్మీకిగా మార్చింది. ఒక కాళీ మంత్రం తెనాలి రామలింగడిని తయారు చేసింది. మంత్రాలు వేదాలలో, పురాణ ఇతిహాసాలలో అస్త్రాలుగా, అమృతతుల్యమైన మహా శక్తులుగా కీర్తింప బడ్డాయి.


అనేక లక్షల సార్లు జపించబడ్డ మంత్రము శక్తిగా, ఆరాధించే దేవత రూపంగా మారుతుంది. పలు మార్లు అయస్కాంతానికి తాకించిన ఇనుప ముక్క అయస్కాంతంగా ఎలా మారుతుందో అలాగే సాధకుని సూక్ష్మ దేహం, ధ్యాన మండలం దేవతాశక్తి క్షేత్రంగా మంత్ర జపం వల్ల మారతాయి. క్రమంగా కన్నులు రెండూ మూసి తదేక దృష్టితో చెసిన మంత్ర జపం వల్ల మూడో కన్ను తెరుచుకుని జ్ఞానాన్ని, కొందరికి దివ్య దృష్టిని ప్రసాదిస్తుంది అని మంత్రశాస్త్రవేత్తలు చెపుతున్నరు. మంత్ర సాధన చేసేవారు అప్పుడప్పుడు ధ్యానంలొ మెరుపులని, దృశ్యాలని అనుభూతి చెందుతారుట. సాధన చెయ్యగా చెయ్యగా చివరికి ఆరాధించే దేవుడు లేక దేవతకి దగ్గరై, సాధకునికి దేవతకి మధ్య ఒక సమతాస్థితి ఏర్పడుతుంది. కొందరు దీక్షాబద్ధులై నిరంతర సాధన వల్ల ఆ దేవత తాలూకు శక్తిని పొంది, కార్య సాధకులుగా, సిద్ధులుగా, జీవన్ముక్తులుగా, పరాముక్తులుగా అవుతారు.


“మననాత్ త్రాయతే ఇతి మంత్రః” అని మంత్రాన్ని నిర్వచించారు ఋషులు. మననం చెయటం వల్ల రక్షించేది మంత్రము అని అర్ధము.జపం వల్ల, మనసులొ పునరావృతం చేయటం వల్ల మంత్రం శక్తి వంతమై సాధకునికి కవచంగా, కల్పతరువుగా అవుతుంది.


వైఖరి,మధ్యమ, పశ్యంతి అని మూడు విధాలుగా మంత్ర జపం చెయ్య వచ్చునని శాస్త్రాలు చెబుతున్నాయి. వైఖరి అంటే గట్టిగా జపం చెయ్యడం. ఇది అంత శక్తివంతం కాదు. మధ్యమ అంటే రహస్యంగా పెదవుల కదలికతో మత్రం వుందేలా జపం చేయడం. ఇది వైఖరి కన్నా మంచి పద్ధతి. ఆఖరిది పశ్యంతి - పూర్తిగా మనసులో చేసే ధ్యానం. అన్నిటికన్నా మంచి పద్ధతి. ఇందులో సాధకులు కేవలం మనసులోనే జపం చేస్తారు. ఈ పద్ధతి జపాన్ని తపస్సుగా, సాధకుడిని యోగిగా మారుస్తుంది. అందుకే కొందరు సాధకుల, స్వాముల సమీపంలో మంచి శాంతం, వారిలో తేజస్సు అనుభూతి చెందుతాము.మంచి సాధన చేసేవారు మరింత ఆనందంగా తయారవుతూ అందరిని ఒకేలా భగవత్స్వరూపంగా ప్రేమగా చూడగలరు.


ఆరాధించే దేవతా స్వరూపాన్ని బట్టి ఆయా తత్వం సాధకుడిని ప్రభావితం చేస్తుంది, అతనిలో ప్రవేశిస్తుంది. కృష్ణుడిని పూజిస్తే కృష్ణతత్వము, కాళిని పూజిస్తే కాళిశక్తి వస్తాయి. అంటే దాని అర్ధం మనిషి కాళి అవుతాడని కాదు, సాధకుని సూక్ష్మ దేహం చుట్టూ కాళిశక్తి వలయం ఏర్పడి అతన్ని అనుగ్రహిస్తూ వుంటుంది. ఎక్కడో కొందరు మహానుభావులకి ఇంకా కొన్ని అపురూపమైన అనుభవాలు కలుగుతాయి. రామకృష్ణ పరమహంస ఆంజనేయ ఉపాసన చేస్తుంటే చిన్న తోక వచ్చిందట. సర్వాంతర్యామి పరబ్రహ్మ స్వరూపాన్ని 'నేను 'గా,సర్వ-ఆత్మగా ఉపాసించే రమణ మహర్షుల వారికి పక్కనే వున్న గడ్డిపై ఎవరో నడుస్తుంటే మహర్షులవారికి నొప్పి కలిగేదట.ప్రసిద్ధులైన అనేకమంది కవులు, పండితులు ఉపాసనల మూలంగా శక్తిని పొందినవారే. మనలొ చాలమందికి పరిచితులైన ఒక మహాత్మునికి అమ్మవారు అనుగ్రహించగా ఆకాశమునుండి అద్భుతంగా ఒక దేవి విగ్రహం ప్రత్యక్షమైందిట. ఆ విగ్రహం ఇప్పటికీ గుంటూరులో వుంది.


కీ||శే|| అద్దంకి కృష్ణమూర్తిగారు మంత్రశక్తితో ఎన్నో చిత్రాలు చూపించేవారు. గాలిలోంచి వస్తువులు సృష్టించడం,దేవుడికి నైవేద్యం పెడితే ప్రసాదం పళ్ళెంతో సహా మాయమవడం లాంటి ఎన్నో సంఘటనలు చూడడం జరిగింది. 'ఆటోబయోగ్రఫి ఆఫ్ ఎ యోగి ' (ఒక యోగి ఆత్మకధ) గ్రంధంలో సాధన గురించి, సిద్ధిని గురించి,భగవదనుగ్రహాన్ని గురించి ఎన్నో విశేషాలు శ్రీ పరమహంస యోగానంద వివరించారు. సూక్షంగా చెప్పాలంటే మంత్రం ఆధ్యాత్మిక ప్రపంచానికి ఒక పాస్ వర్డ్ లాంటిది.మంత్రం దేవతాశక్తికి తాళంచెవి లాంటిది. మంత్రం దివ్యలోకాలకి 'యూ ఆర్ ఎల్ '(web URL) లాంటిది. మంత్రం నిక్షిప్తమైన రహస్యం లాంటిది. మంత్రం సాధకునికి దేవతకి మధ్య వంతెనగా శక్తిని, భక్తిని అందచేస్తుంటుంది అని గురువులంటున్నారు. జపించిన ప్రతిసారి సాధకుని తపన, కష్టం, సాధన స్థితి అన్నీ దేవతకి మంత్రం ద్వారా అందచేయబడతాయి. మామూలు పూజకన్న త్వరగా మంత్రం పై లోకాలకి ప్రయాణం చేస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి.అందుకే గాయత్రి మంత్రం 'తత్ సవితుర్ వరేణ్యం 'అంటుంది. అంటే 'ఆ సూర్యుడిని అర్ధిస్తున్నాం ' అని అర్ధం. ఏ సూర్యుడిని అని ప్రశ్నిస్తే 'ఏ సూర్యుడయితే భూ లోక, భువర్లోక, సువర్లోకాలలో సంచరిస్తున్నాడో - ఆ సూర్యుడన్న మాట '.


ప్రతి మంత్రానికి అర్ధం వుండాలని నియమం ఏమీ లేదు.ఊన్నా ఆ అర్ధం మన మామూలు అర్ధాలలో ఇమడాలని లేదు. ఉదాహరణకి ఒక లక్ష్మీ మంత్రాన్ని చూస్తే,'హ్రీం శ్రీం మహా లక్ష్మియై స్వాహా ' - ఈ మంత్రము ఓం తో ప్రారంభమవలేదు, నమః అని తుదిలోను లేదు. హ్రీం కి ఎన్నో అర్ధాలున్నాయి. హ్రీం అనేది మాయా బీజం. (అంటే మాయమవుతామని కాదు)మాయ బీజం కావటం చేత, ఈ మంత్రం చేయువారికి సర్వ వ్యాపకమైన శ్రీం లభిస్తుంది. అంటే కేవలం పైసలలో వుండే డబ్బు కాకుండా, ఏ లక్ష్మి శ్రీసూక్తంలో విశెషంగా కీర్తించబడిందో అది లభిస్తుంది.


'ధనమగ్నిర్ధనం వాయుర్ధనం సూర్యోధనం వసుః '


మంత్రమును ఏకాగ్రతతో చేయడం అవసరం అని అందరు అంటారు. నిజమే, కాని అంత తీవ్రమైన ఏకాగ్రత కుదరకపోయినా సాధనలో ప్రగతిని సాధించవచ్చు. మన మంత్రాన్ని మనమే వినడం ద్వారా ఏకాగ్రత పెంపొందించుకోవచ్చును. కొందరు సాధకులు ఏ దేవతని ఉపాసిస్తున్నరో ఆ దేవతని ఎదురుగా వున్నట్లు ఊహించుకుని సాధన చేయడంవల్ల భక్తితో, శ్రద్ధగా మరింత ముందుకి వెడతారు.


మంత్రాలు బీజాక్షరాల సముదాయం. 'బీజాక్షరాలు ' అంటే విత్తనాల లాంటివి అన్నమాట.బీజాక్షరాలు కూడ విత్తనాల లాగే ధ్యానభూమికలలో వుంచడం వల్ల మహావృక్షాల్లా పెరిగి అనుగ్రహం కలుగచేస్తాయి. గోల్ఫ్ ఆడేవారికి క్లబ్ ఎలాగో, మంత్ర జపానికి మాల అలా అవసరం. రుద్రాక్షమాలని జ్ఞానానికి, మనోశక్తికి, సిద్ధశక్తులకి వినియోగిస్తారు. తులసి మాలని ఆరోగ్యానికి, శాస్త్రజ్ఞానానికి, నిర్మలత్వానికి వుపయోగించవచ్చును. ఎర్రచందనం మాలతో కామ్యసిద్ధి, తామరపూస మాలతో జపం చెస్తే లక్ష్మి ప్రసన్నత కలుగుతాయని మంత్ర మహోదధి, మేరు తంత్రము, రుద్రయామళము వంటి గ్రంధాలు చెబుతున్నాయి. ఆవిధంగా మాల కేవలం జపం లెక్కించటానికే కాక మంత్రసిద్ధిలో కూడా ఉపయోగిస్తుంది.


ఇలా మంత్రసాధనలని చేసి ఈ ఆధునిక యుగంలోనూ అతీంద్రియ శక్తులను సాధించవచ్చునని అనేక గ్రంధాలే కాక నిజమైన జ్ఞానాన్ని, నిర్మలమైన ధ్యానాన్ని నమ్మిన గురువులు సూచిస్తున్నారు. ఐతే అంత గొప్ప స్థితులకి నేను వెళ్ళగనా? గురువులు ఖరీదై, సత్-గురువులు కరువైన ఈరోజుల్లో, ఎక్కడో ప్రాచీనమైన ఈ శాస్త్రాలని నేను అర్ధం చేసుకోగలనా? ఎప్పుడో వచ్చే స్వర్గం కాదు ఇక్కడే ఈ నేలపై నా జీవితాన్ని గురించి మన శాస్త్రాలు ఏమంటున్నాయ్? ఇవన్నీ వచ్చే సంచికలలో చర్చించ ప్రయత్నిద్దాం.


(సేకరణ)

_పుష్కరాలు_

 🙏 *_పుష్కరాలు_* 🙏


పుష్కరుడు అనే మహా భక్తుడు మహేశ్వరుని గురించి ఘోర తపస్సు చేసాడు. అతని తపస్సుకు మెచ్చి శివుడు ప్రత్యక్షమై ఎం వరం కావాలో కోరుకొమ్మన్నాడు.


అందుకు పుష్కరుడు...


" స్వామీ నదులన్నీ జీవులు చేసిన పాపాలతో నిండిపోయాయి. ఆ నదులని పునీతము చేయుటకై నీ జలమైన శరీరమును నాకిమ్ము , నీ స్పర్శ తో నదులన్నీ పునీతమౌతాయి అని వరం కోరాడు.


ఆ తరువాత బృహస్పతి( గురుడు) కూడా శివుని తనువుని పుష్కరుని వలె పొంది సర్వులకు ఆధారము కావాలని తపము చేసాడు. 


బృహస్పతి తపసుకు మెచ్చి శివుడు, తనకిచ్చిన వరాన్ని గురునికి ఇవ్వడానికి ఒప్పుకోలేదు. ఆపై బ్రహ్మ గురించి గురుడు తపము చేసి తన కోరికను తెలియజేశాడు. 


అప్పుడు బ్రహ్మ 12 జీవనదులలో సంవత్సరానికొక్కసారి 12 రోజులు పుష్కరుడుండునట్లు , గురుడు ఒక్కో రాశిలో సంచారము బట్టి జరుగుతుందని చెప్పి ఇద్దర్ని శాంతపరిచాడు .


గురుడు

1 మేష రాశిలో ఉంటే గంగా నది పుష్కరాలు

2 వృషభ రాశిలో ఉంటే నర్మదా నద పుష్కరాలు

3 మిధునంలో ఉంటే సరస్వతీ నది పుష్కరాలు

4 కర్కాటకం లో ఉంటే యమునా నది పుష్కరాలు

5 సింహ రాశిలో ఉంటే గోదావరి నది పుష్కరాలు

6 కన్యా రాశిలో ఉంటే కృష్ణ నది పుష్కరాలు

7 తులా రాశిలో ఉంటే కావేరి నది పుష్కరాలు

8 వృశ్చికంలో ఉంటే భీమా నది పుష్కరాలు

9 ధనూరాశి లో ఉంటే తపతి నద పుష్కరాలు

10 మకరం లో ఉంటే తుంగభాద్ర నది పుష్కరాలు

11 కుంభ రాశిలో ఉంటే సింధూ నది పుష్కరాలు

12 మీన రాశిలో ఉంటే ప్రాణహిత పుష్కరాలు


మనిషి తాను జన్మించిన దగ్గర్నుంచి ఎన్నో పాపాలు తెలిసి తెలియక చేస్తుంటారు. పుష్కర స్నానం చెయ్యడం ద్వారా సమస్త పాపాలు పోతాయని మహాభారతం లో వ్యాసభగవానుడు చెప్పారు.


*జన్నప్రభృతి యత్పాతం స్త్రియా వా పురుషేణ వా౹౹ పుష్కరే స్నాతమాత్రస్య సర్వమేవ ప్రణశ్యతి ౹౹*


స్త్రీ చేత కానీ పురుషుని చేత కానీ పుట్టినప్పటి నుంచి చేయబడిన పాపమంతా పుష్కర సమయంలో స్నానం చేస్తే తొలగిపోతుంది.


పుష్కర సమయంలో మనమే కాదు,

ముక్కోటి దేవతలూ భూమిమీదకొచ్చి పుష్కర స్నానం చేసి తరిస్తారు.


పుష్కర స్నానం వల్ల, అహల్యను భంగం చేసిన దోషాన్ని ఇంద్రుడు పోగొట్టుకున్నాడు.


బ్రహ్మ శిరస్సు ఖండించిన దోషం వలన పొందిన బ్రహ్మహత్యా పాపం నుంచి శివుడు విముక్తుడయ్యాడు.


🙏 *_ఓం నమో నారాయణాయ_* 🙏

వృద్ధాశ్రమాలెందుకు

 వృద్ధాశ్రమాలెందుకు :-


టీ కప్పు హాండిల్ విరిగింది దానిని ఏ బడ్స్ దాయటానికో ,పిన్నీసులు పెట్టుకోవడానికో ఉపయోగిస్తున్నాము !

.

దుప్పటి చిరిగిపోయింది ..దానిని నాలుగుమడతలు వేసి కాళ్ళు తుడుచుకునే పట్టా క్రింద వాడుతున్నాం !

.

కుండ చిల్లిపడింది ! దానిని పూలకుండీక్రింద వాడుతున్నాం !

.

మరి సంపాదించే శక్తిఉడిగిపోయిందంటూ వృద్ధులను వృద్ధాశ్రమాలలో ఎందుకు పెడుతున్నాం ?

.

కండరాల శక్తి వలననేఉపయోగమా ?

.

 వారి అనుభవాన్ని జ్ఞానాన్ని ఎందుకు ఉపయోగించుకోలేకపోతున్నాం ?

.

పైగా వృద్ధాశ్రమాలలో పండ్లు పంచిపెట్టడం చేసి వారి మీద సానుభూతి చూపి ఏదో దైవకార్యం చేసినట్లు ఫోజులిస్తున్నాం !

.

మన దేశంలో వృద్ధులపట్ల ఒక ఉదాసీన భావం బాగా ప్రబలిపోయింది ! 

.

అమెరికా అధ్యక్షపదవికి పోటీ పడిన ఇద్దరు అభ్యర్థుల వయస్సు చూస్తే 79 ఒకాయనకు ,75 ఒకాయనకు ! వారు ప్రపంచ భవిష్యత్తును నిర్ణయించగలిగే కీలకపదవికి పోటీదారులు ! 

.

నోబెల్ ప్రైజు గెలుచుకున్న వారి వయస్సు ఒకసారి అందరిదీ పరిశీలించండి అందరూ వృద్ధులే దాదాపుగా !  

.

మనకు అర్ధం కావడంలేదు మనదేశంలో ఏం పోగొట్టుకుంటున్నామో ! 

.

ఒక వృద్ధులైన డాక్టర్ వద్దకు వెళ్ళు ఏం లాభమో తెలుస్తుంది

ఒక వృద్ధులు అనుభవజ్ఞుడైన లాయర్ వద్దకు వెళ్ళు ఎంతో విజ్ఞతతో కూడిన సలహా లభిస్తుంది

ఒక వృద్ధులైన కళాకారుడిని అడిగిచూడు మెలకువలు తెలుస్తాయి ! 

అసలు ఏ రంగంలో వృద్ధులు ఆ రంగంలో ఒక నిధి

వారిని సేవించండి జ్ఞానం లభిస్తుంది !!

.

వారి అనుభవాన్ని ఉపయోగించుకుంటే వారు ఎంతో ఉత్సాహంగా ఉపయోగపడతారు పైగా వారి ఆరోగ్యమూ మెరుగుపడుతుంది ! 

.

అసలు  వారే దేశ సంపద ! వారి అనుభవం, విజ్ఞత దేశానికి ,సమాజానికి ,కుటుంబాలకు ఉపయోగపడవద్దా ? 

.

అసలు వృద్ధాశ్రమాలెందుకు ?


!! ఆలోచించండి !!

దుర్గా సప్తశతి

 *🌹. శ్రీ దేవీ మహత్యము - దుర్గా సప్తశతి - 10  / Sri Devi Mahatyam - Durga Saptasati - 10 🌹*

✍️. మల్లికార్జున శర్మ 

📚. ప్రసాద్ భరద్వాజ 


*అధ్యాయము 3*

*🌻. మహిషాసుర వధ - 1 🌻*


1. ఋషిపలికెను : 

2. అంతట తన సైన్యం నాశనమవడం చూసి సేనాని అయిన చిక్షురమహాసురుడు అంబికతో యుద్ధం చేయడానికై కోపంతో వచ్చాడు. 


3. మేరుపర్వతశిఖరంపై మేఘం ఎలా వర్షం కురిపిస్తుందో అలా యుద్ధంలో అసురుడు ఆ దేవిపై బాణవర్షం కురిపించాడు.


 4. అంతట దేవి అవలీలగా ఆ బాణసమూహాన్ని ఛేదించివేసి, తన బాణాలతో అతడి గుజ్జలను, గుజ్జాలను తోలేవాణ్ణి చంపింది.


5. వెంటనే ఆమె అతని ధనుస్సును, మిక్కిలి ఎత్తైన ధ్వజాన్ని ఛేదించి, విరిగిపోయిన ధనుస్సు గల అతని శరీరాన్ని బాణపు పోటులచేత గ్రుచ్చివేసింది.


6. విల్లు త్రుంపబడి, రథం లేక, గుజ్రాలూ సారథి చంపబడగా ఆ అసురుడు ఖడ్గాన్ని, డాలును ధరించి ఆ దేవిపైకి ఉరికెను.


7. అతివేగంగా అతడు మిక్కిలి పదను గల తన కత్తివాదరతో సింహం తలపై కొట్టాడు. దేవిని కూడ ఆమె ఎడమభుజంపై కొట్టాడు.


8. రాజకుమారా! అతని ఖడ్గం ఆమె భుజాన్ని తాకడంతోనే ముక్కలుగా విరిగిపోయింది. అతడు అంతట కోపంతో కళ్ళు ఎఱ్ఱబారి శూలాన్ని తీసుకున్నాడు.


9. ఆ మహాసురుడు అంతట ఆ శూలాన్ని, జాజ్వల్యమాన తేజోయుక్తమైన దానిని, ఆకాశం నుండి సూర్యబింబాన్ని విసరినట్టు, భద్రకాళి పై  విసిరాడు. 


10. తన మీదికి వస్తున్న ఆ శూలాన్ని చూసి దేవి తన శూలాన్ని విసరగా అది ఆ శూలాన్ని, ఆ మహాసురుణ్ణి నూరు ముక్కలుగా ఖండించింది.


11. మహిషాసురుని సేనానియైన మహావీరుడు వధితుడవడం వల్ల వేల్పులను నొప్పించడానికై చామరుడు ఏనుగునెక్కి (దేవిని) మార్కొనెను. 


12. అతడు కూడా తన భల్లాన్ని అంబికాదేవిపై విసిరాడు, ఆమె వెంటనే ఒక హుంకారంతో (“హుమ్” అను శబ్దంతో) దాన్ని ఎదిరించి అది కాంతివిహీనమై నేలపై పడిపోయేటట్లు చేసింది.


13. తన భల్లం విరిగి నేలకూలడం చూసి చామరుడు కోపంతో ఒక శూలాన్ని విసిరాడు. ఆమె దాన్ని కూడా తన అమ్ములతో త్రుంచివేసింది.


14. సింహం అప్పుడు పైకి ఎగిరి ఏనుగు కుంభస్థలమధ్యలో కూర్చొని, ఆ సురవైరితో బాహు యుద్ధం చేసింది. 


15. పోరాడుతూ వారిరువురూ ఏనుగుపై నుండి దూకి మహా ఘోరంగా యుద్ధంచేస్తూ ఒకరినొకరు మిక్కిలి భయంకరంగా కొట్టుకున్నారు.


సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹

శ్రీ సత్యనారాయణస్వామి వ్రతమహాత్మ్యము

 శ్రీ సత్యనారాయణస్వామి వ్రతమహాత్మ్యము 


            మొదటి అధ్యాయము 


తే  1

శ్రీకరంబైన నైమిశక్షేత్రమందు 

శౌనకాదిగ  వరలెడి సకలమునులు 

వివిధకథలను సూతుచే వినుచునుండి 

వినయమొప్పగ నడిగిరి వేడు కొనుచు 

               

తే   2

"ఎట్టి వ్రతమును జనములు నిలను సేయ 

కామితార్థంబు కల్గును కలియుగమున 

వినగ కోరిక జనియించె  విబుధవర్య ! 

తెలియపరచుడు వినెదము తీరు గాను      

 

కం   3

మునిసంఘము లీరీతిగ 

ఘను సూతును నడిగినంత కడుయుత్చుకతన్ 

విని సూతుడు చిఱునగవుతొ  

ననెమునులతొ నంతటిటుల యానందముతోన్ ;


ఆ   4

నారదుండు దొల్లి  నారాయణుని జూచి 

యివ్విధంబు నడుగ నెరుగ దలచి

మునిని గాంచి యపుడు ముదమంది శ్రీహరి 

నుడివినట్టి  నుడులు నుడివె దిపుడు      

                     

కం.    5

సురముని నారదు డొకపరి 

హరినామము బాడుకొనుచు నవనకి జనియున్   

నరు లచ్చట పలువెతలతొ 

కరమరుదుగబ్రతుకుచుండ  గాంచెను వ్యధతోన్ 


సీ.   6

ఈతి బాధలతోడ నిక్కట్లు పడుచును

                 నకనకలాడెడి నరుల గాంచె 

తనురుగ్మతలతోడ తల్లడిల్లుచు మిగుల 

                 నడయాడుచుండెటి నరుల గాంచె 

ఆత్మశాంతియులేక  నలమట నొందుచు 

                 నలుగుచుండెడి పెక్కు నరుల గాంచె 

ఋణ విత్త బాధల కృశియించి బ్రతుకున

                 నానా వెతలనున్న నరుల గాంచె 

    తే

    నరులు పడియెడి బాధలు నారదుండు 

    కన్నులారంగ జూచియు కడు వ్యదొంది 

    మానవుల బాధ పోగొట్ట మదిని దలచి 

    కదలె వైకుంఠపురముకు గాంచ హరిని 


కం.   7

నారదు డట జని కాంచెను 

నారాయణు శేషతల్పు నవ్యామ్బరునిన్ 

నీరద తను సంకాసుని 

శ్రీరమ సంసేవ్య పాదు శ్రీత మందారున్ 


కం.   8

నారద సంయమి యంతట 

నారాయణు నెదుట నిలిచి నతమస్తకుడై 

ధారాళ మైన నుడులతొ 

యీ రీతిగ ప్రస్తుతించె యీప్సిత మదితోన్ 


మ ద్వి.  9

"శ్రీకరా !శుభకరా !శ్రీచిద్విలాస!

శ్రీ లక్ష్మి సంసీవ్య ! శ్రీ వత్స చిహ్న ! 

కామితార్థ ప్రదాత ! కౌస్తుభ భూష !

వాసుదేవా ! హరీ ! వైకుంఠ వాస  !

శంఖ గదా చక్ర శార్ఙ్గ సంకాశ !

యభయ వరద హస్త యాస్రితపోష !

దేవదేవ ! వరద ! దివ్య ! జీవాత్మ !

దేవవంద్య ! వినుత ! తేజితదేహ !

పరమపురుష ! విష్ణు ! పావననామ !

జయము నారాయణా ! జగదీశ ! విష్ణు !

మాధవా ! కేశవా ! మధుకైటబారి !

శ్రీధరా !గోవింద! శ్రీహృషీకేశ !

వాసుదేవా ! హరే ! వామన ! విష్ణు ! 

యనిరుద్ధ ! ప్రద్యుమ్న ! యచ్యుతా ! దేవ !

నారాయణా ! విష్ణు ! నళినాయ తాక్ష !

పురుషోత్తమా ! దివ్య ! పుండరీకాక్ష !

పాహిమాం పాహిమాం పరమాత్మ! దేవ !

గో విప్ర రక్షకా ! గురుమీన రూప !

కౌస్తుభ మణిహార ! కచ్ఛప రూప !

గోపాల పాలకా ! క్రోడంబ రూప !

నారాయణా ! హరీ ! నరహరి రూప !

వందిత విక్రమా ! వామన రూప !

పృధివీశబలహరా  ! భృగురామ రూప !

రాజీవలోచనా ! రఘురామ రూప !

పాలితయాదవా !బలరామ రూప !

శ్రీచిద్విలాస యో శ్రీకృష్ణ రూప !

వినుతింతు మనసార విష్ణు స్వరూప !

కామితార్థప్రదాత !కరుణించు మమ్ము 

జయము నారాయణా ! జయము యో దేవ !"


కం.   10

సురముని నారదు స్తుతులను 

సిరినాథుడు విష్ణు వినియు స్థిఱ నగవులతోన్ 

పరికించుచు యాతని గని 

కరుణతొ యిట్లనియె నపుడు కడు శాంతమునన్ 


తే.   11

"విమలమానస నారదా ! యేల యిపుడు *

కూర్మితోడను నీవిట కొచ్చినావు ? 

తెల్పు నీకోర్కె యేదైన దీర్తు నిపుడె 

తేటతెల్లంబుగా నీవు దెల్పవయ్య "


కం.   12

నారాయణు డా విధముగ 

కారుణ్యము తోడ బలుక, కడు పులకితు డై 

నారదు డన్తట  భక్తితొ 

యీ రీతిగ బలికె మిగుల వినయము తోడన్ 


సీ  13

"సర్వజ్ఞు డవునీవు సర్వేశ !పరమేశ !

              నీ వెఱుంగని దేది నీరజాక్ష !

మర్త్య లోకమునందు మనుజులుపెక్కురు 

              పలుయోనులందున ప్రభవమొంది 

వివిధ యిడుములందు విధిదప్పి పడుచుండి 

               యనుభవించుచునుండె యమితవగపు 

పాపకర్మలతోడ పలురోగములతోడ 

               పీడింప బడుచుండె పెక్కురీతి 

యమిత బాధల క్లేశాల యనుభవమున 

మహిని జీవించుచున్నట్టి మానవులకు 

బాధలను బాప నేదైన పరమపథము 

బోధజేయగ గోరుదు పురుషశ్రేష్ఠ !"


కం 14

ముని నారదు డావిధముగ 

వినయంబున ప్రభునిగాంచి వేదన తోడన్ 

జనముల బాధలు దెలుపగ 

విని మనమున మెచ్చుకొనియు విష్ణుండనియెన్ 


కం  15

"మునివర ! నీ యభిమతమును 

విని సంతస మొందినాను వేడుక యయ్యన్ 

జగముల క్లేశము బాపగ 

మనమందున దలచు నిన్ను మది శ్లాఘింతున్ 


తే గీ 16

లోక కల్యాణమును గోరి తేకువగను 

యమిత యావేదనంబున యడుగ జూచి 

సంతసంబయ్యె నాకెంతొ సంయమీంద్ర ! 

వినుము దెల్పెద నీకొక్క విమల పథము 


కం 17

వినుమో నారద ! తెల్పెద 

మనమందున కలతమాని మదిస్థిమితమునన్ 

జనులందఱు సుఖ శాంతుల 

మనగల రీ పుణ్య వ్రతము మఱి చేయంగన్ 


తే గీ  18

కామితార్ధ ప్రదాయిని కల్పతరువు 

"సత్యనారాయణస్వామి సద్వ్రతంబు"

యిహమునందున సుఖశాంతు లిచ్చితుదకు 

పరమునందున మోక్షపుప్రాప్త మిచ్చు

ధార్మికగీత - 76

 🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲 

                          *ధార్మికగీత - 76*

                                    *****

      *శ్లో:- అరా  వప్యుచితం కార్యం ౹*

             *ఆతిథ్యం  స్వయమాగతే  ౹*

             *ఛేత్తు:  పార్శ్వగతాం ఛాయామ్ ౹*

             *నోపసంహరతే  ద్రుమః  ౹౹*

                                  *****

*భా:- అల్పులకు తన, పర అనే భావం నరనరాన జీర్ణమై ఉంటుంది. ఉదారచరితులు లోకమంతటిని తమ కుటుంబంగా భావిస్తుంటారు. శత్రువైనా సరే ఈర్ష్యాద్వేషాలను, భేషజాన్ని ప్రక్కన పెట్టి, మన ఇంటికి తనంతట తానుగా ఒక మెట్టు దిగి వచ్చినపుడు చుట్టంగా భావించి, చక్కని అతిథి మర్యాద చేయడం మంచిపని. అది విజ్ఞతకు, విచక్షణకు శుభసూచకము. ఎలా అంటే  మహావృక్షం కూడా తనను పెద్దగొడ్డలితో  కట్టెలనిమిత్తం నరకడానికి వచ్చిన వాడికి కూడ ప్రక్కనే బాసటగా ఉన్న తన   నీడను ఉపసంహరించుకోవడం లేదు. చల్లదనాన్ని  ఇవ్వడం మానుకోదు. ఫలాలను తినవద్దనడం లేదు. పూలను కోసుకోవద్దనడం లేదు.  కర్ణుడు తన ప్రాణాలకు ముప్పని తెలిసినా కవచ కుండాలాలను శత్రుభావనతో వచ్చిన  ఇంద్రునికి ఇవ్వడం మానుకోలేదు. ఆవులు, గేదెలు తమను చంపే వాడికి కూడా పాలివ్వడం మానుకోవుగదా! లోకంలో ఉదారులకు తన,పర భేదం లేకుండా సాయపడడమే సహజగుణమని సారాంశము. చంపదగినవాడికి కూడా మేలు చేసి పంపడమే మేలని వేమన ఉద్భోధించడం  గమనార్హము*.

                                  *****

                   *సమర్పణ  :  పీసపాటి*

🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲

*బ్రౌన్ పుట్టినరోజు 10.11.1798*



 *బ్రౌన్ పుట్టినరోజు 10.11.1798* 


ఛార్లెస్‌ ఫిలిప్‌ బ్రౌన్‌ 1817, ఆగస్ట్‌ 13. ఇంగ్లండ్‌ నుంచి భారతదేశానికి ఓడ ఒకటి బయల్దేరింది. దాని పేరు కర్ణాటక్‌. వందలాది ప్రయాణికులున్నారు అందులో. ఆ వందల్లో ఓ అనామకుడు. 19 ఏళ్లవాడు. పేరు.. ఛార్లెస్‌ ఫిలిప్‌ బ్రౌన్‌. భవిష్యత్తులో మరణశయ్యపై ఉన్న తెలుగు సాహిత్యాన్ని.. శాస్త్రీయతా అనే గంగతో బతికించే సాహితీ భగీరథుడు. 'కానీ ఆ ఓడ ఎక్కేటప్పుడు అసలు 'తెలుగు' అనే మూడక్షరాల మాట విన్లేదు' అంటాడతను నిజాయతీగా. కానీ అతని జీవితం మొత్తాన్ని ఆ మూడు అక్షరాలే శాసించాయి. అతని మాటల్లో చెప్పాలంటే 'పిచ్చెక్కించాయి'. అతని వూపిరున్నంత వరకు వూడిగం చేయించుకున్నాయి!


(నవంబర్ 10, 1798 ) తెలుగు సాహిత్యమునకు విశేష సేవ చేసిన ఆంగ్లేయుడు. తొలి తెలుగు శబ్దకోశమును ఈయనే పరిష్కరించి ప్రచురించాడు. బ్రౌన్ డిక్షనరీని ఇప్పటికి తెలుగులో ప్రామాణికంగా ఉపయోగిస్తారు. తెలుగు జాతికి సేవ చేసిన నలుగురు ఆంగ్లేయులలో ఒకరిగా బ్రౌన్ ను పరిగణిస్తారు. మిగతా ముగ్గురి పేర్లు ఆర్థర్ కాటన్, కాలిన్ మెకెంజి, థామస్ మన్రోలు. ఆంధ్ర భాషోద్ధారకుడు అని గౌరవించబడిన మహానుభావుడు.వేమన పద్యాలను సేకరించి, ప్రచురించి, ఆంగ్లంలో అనువదించి ఖండాంతర వ్యాప్తి చేశాడు.


12 డిసెంబర్‌ 1884న అవివాహితుడిగానే తన 87వ యేట లండన్‌లోనే కన్ను మూశారు.

కుటుంబం - సంసారం వంటి బంధనాల్లో ఇరుక్కోకుండా స్వేచ్ఛగా తెలుగు భాషా సాహిత్యాలకు, తెలుగు ప్రజలకు తనను తాను అర్పించుకున్న మహనీయుడు ఛార్లెస్‌ ఫిలిప్‌ బ్రౌన్‌! డాక్టర్‌ జానుమద్ది హనుమచ్ఛాస్త్రి కడపలో బ్రౌన్‌ స్మారక గ్రంథాలయం నెలకొల్పారు. బ్రౌన్‌ జీవితం - సాహిత్య కృషి గురించి పరిశోధించి, విషయాలు తరువాతి తరాలవారికి అందించారు. జానుమద్దిగారితో గతంలో ఉత్తర ప్రత్యుత్తరాలు జరపడం, కొన్ని సాహిత్య సభల్లో ఆయన్ని కలుసుకోగలగడం మరువలేని జ్ఞాపకాలు! బ్రౌన్‌ను తనలో ఆవహింపజేసుకున్నవాడిగా ఆయన కనబడేవారు. ప్రతి రంగంలోనూ త్యాగధనులు ఉంటారు. వారి కృషిని కనీసం స్మరించుకోవడం మనుష్యులైన వారి కనీస కర్తవ్యం.


Stay Safe. 👍

Ghanta Surender 😊

శివానందలహారీ

 🙏శివానందలహారీ 🙏


ఉపేక్షా నోచేత్కింన హరసి భవద్ధ్యాన విముఖాం

దూరాశాభూయిష్టా0 విధిలిపి మశక్తో యది భవాన్

శిరస్తద్వైధాత్రం స నఖలు సువృత్త0 పశుపతే

కథంవా నిర్యత్నం కరనఖముఖే నైవ లులితమ్ 



తాత్సార మేలయ్య ? తరుణేందుశేఖరా !

             కరుణేక్షణలనన్ను గావుమయ్య  

త్వన్మధు నామంబు తలపని దుష్టుడన్

             నా లలాటము మీది నలువ లిపిని

భవదీయ కరముచే బలవంతముగ నైన

              విశ్వేశ ! తుడువుము వేగిరముగ

సర్వేశ ! యారీతి సాధ్యంబు కాదని

              భక్తుడౌ నాతోడ బలుక బోకు

మటుల గాకున్న నాడు దురాగ్రహమున

 ధాతృ పంచమ శిరమును తగు బలాన 

చేతి గోటితో  నేరీతి చెండి తీవు ?

నీకు సాధ్యంబు గానిదింకేమి యుండు ?   15 # *




విరించిర్దీర్ఘాయు ర్భవతు భవతా తత్పరశిర

శ్చతుష్కం సంరక్ష్యం న ఖలు భువి దైన్యం లిఖితవాన్ 

విచార: కో వా మాం విశద కృపయా పాతి శివ దే 

కటాక్షవ్యాపార  స్స్వయ మపి చ దీనావనపరః 



తరగగా మిగిలిన తలలు నాలుగు గల్గి

             బ్రహ్మ  నీచేతిలో బ్రతికి పోయి

దీర్ఘాయువును పొంది తేజరిల్లుచు నుండి

             సృష్టి కార్యంబును చేయుచుండె

మావంటి కొందఱి మనుజుల నొసట తా

              వదలక దైన్యమున్ వ్రాయుచుండె

నరయగా మాకది నుపకార మెట్లగు ?

              నుపకారముగ మాకు నుండు నెపుడు

దైన్య మొందియు మేమున్న తరుణ మందె

దీన రక్షణ జేసెడి దీక్ష నున్న

విమలమౌ తావక కటాక్ష వీక్షణంబు

రక్షణము సేయు మమ్ముల తక్షణంబు  16 #



✍️ గోపాలుని మధుసూదన రావు

దివ్య ఔషధం శొంఠి గృతం.

దివ్య ఔషధం శొంఠి గృతం. 

నాకు కడుపులో మంట, తిన్నది అరగటంలేదు, నాకు గ్యాసు, నాకు కడుపులో నొప్పి, నాకు మోషన్ సరిగా అవటం లేదు. నాకు కడుపు ఉబ్బరం. నీరసంగా వుంటున్నది కానీ ఆకలి కావటంలేదు. అన్నం చూస్తే వెగటుగా వుంటున్నది, అన్నం తినాలని అనిపించటం లేదు. ఈ రకమైన బాధలు అన్ని కానీ కొన్ని కానీ లేక ఏదో వక్కటి కానీ లేనివాళ్లు నూటికి 50 మంది కన్నా ఎక్కువగా ఉంటారంటే ఆశ్చర్య పడవలసిన పనిలేదు.  మీకు జీర్ణాశయానికి సంబందించిన ఏ సమస్య ఐనా సులువుగా ఇంట్లోనే తయారుచేసుకునే మందుతో పరిష్కరించుకోవచ్చు అంటే మీరు నమ్ముతారా. కానీ ఇది నిజం నూటికి నూరు పాళ్ళు మీకు ఉపయోగ పడుతుంది. మీరు చేసుకొని వాడి మీ తోటివారికి కూడా వాడమని చెప్పండి. 

శొంఠి అంటే తెలియని వారు వుండరు. ఇది మామూలు అల్లంను ప్రాసెస్ చేసి తాయారు చేసిందని మనలో చాలామందికి తెలియక పోవచ్చు. కానీ ఇది కూడా అల్లం యొక్క ఔషధ రూపం అని చెప్పవచ్చు. అల్లం కూడా చాల విధాలుగా మనకు ఆరోగ్య కరం. కానీ శొంఠి ఇంకా చాల ఉపయోగకరం. 

ఇప్పుడు శొంఠి గృతానికి కావలసిన పదార్ధాలను చూద్దాం. 

శొంఠి పొడి. దీనిని మనం సూపర్ మార్కెట్లలో కొనుక్కోవచ్చు లేదా శొంఠిని తీసుకొని దానిని మెత్తని పొడిగా మిక్సీ పట్టి కూడా తయారు చేసుకోవచ్చు. 

ఇక గోగృతం అంటే ఆవు నెయ్యి. మీకు నమ్మకంగా మార్కెటులో దొరికితే కొనండి. లేకపోతె రాందేవ్ బాబా స్టోరులో మీకు స్వచ్ఛమైన ఆవు నెయ్యి లభిస్తుంది అక్కడ తీసుకోండి. . 

కొంత సింధవ లవణం లేక మాములు ఉప్పు. 

తయారు చేసే విధానం. 

మీరు శొంఠి గృతం యెంత చేయాలని  అనుకుంటున్నారో అంతకు సగం ఆవు నెయ్యి మిగిలిన సగభాగం శొంఠి పొడి తీసుకొని రెంటిని పూర్తిగా కొంచం సైన్ధవ లవణం కానీ మాములు ఉప్పుకాని కలిపి మొత్తం ఒక పేస్టులాగా చేయండి దానిని ఒక గాజు సీసాలో తీసుకోండి. ఈ మిశ్రమాన్నే శొంఠి గృతం అని అంటారు. 

ఉపయోగించే విధానం. 

మీరు రోజు భోంజనఁ చేసే ముందు ఒక చెంచా శొంఠిగృతం తీసుకొని దానిని కొంచం అన్నంలో కలిపి ఒక ముద్దగా చేసి దానిని మొదటి ముద్దగా తినండి తరువాత మీ పూర్తి భోంజనం చేయండి. 

మీరు ఈ విధంగా వాడిన తరువాత రెండు మూడు రోజులలో మీ అనారోగ్యం నయం అవుతుంది. శొంఠి జీర్ణ వ్యవస్థను బాగు పరుస్తుంది. ఆవు నెయ్యి చాలా మంచిది అది మీ ఆహరం పేగులలో సాఫీగా ప్రయాణించటానికి మరియు మీకు మంచి కోలాస్త్రలును అనిడిస్తుంది. ఈ రెంటి మిశ్రమము మీకు చాలా మంచిగా పనిచేస్తుంది. రోజు ఉదయం భోజనములో ఒక చెంచా రాత్రి భోజనములో ఒక చెంచా మాత్రమే వాడండి. పిల్లలకు వారి వయస్సును పట్టి అరచెంచా లేక అంతకన్నా తక్కువ వాడండి. 

గమనిక: ఇది చాలా సురక్షితమైన మందు ఐనా మీరు వాడటం వలన మీకు ఏమైనా సైడు ఎఫెక్ట్స్ వస్తే ఈ రచయిత భాద్యత లేదు గమనించండి. 

ఇది ఉపయోగించి లబ్ది పొందిన మిత్రులు మీ అనుభవాన్ని షేర్ చేస్తే సంతోషంగా ఉంటుంది, మరియు  నలుగురికి ఉపయోగ పడుతుంది. మరొక వైద్య విదితో ఇంకోసారి కలుదాం. 

మీ 

సి. భార్గవ శర్మ 

ఓం తత్సత్. 

సర్వ్యజన సుఖినో భవంతు. 

జీవిత పాఠాలు

 *జీవిత పాఠాలు. 

ఒకరి జీవితం మరొకరికి మార్గదర్శకం కావచ్చు... లేదా హెచ్చరికగానూ ఉండవచ్చు. ప్రతి జీవితం ఎలా జీవించాలో, జీవించకూడదో తెలియజేసే ఒక పాఠం అవుతుంది. నేర్చుకోవాలన్న ధ్యాస ఉండాలేగానీ... ఏదో ఒకటి నేర్చుకునే అవకాశం ఎప్పుడూ ఉంటుంది.

పుస్తక పఠనం ద్వారా ఎంత నేర్చినా, మనుషులను చదివినప్పుడు నేర్చుకున్నంత సాధ్యపడదు. ప్రతి జీవితం ఒక విజ్ఞాన సర్వస్వం.

నాన్ననుంచి క్రమశిక్షణ, అమ్మనుంచి సందర్భోచిత నాయకత్వ లక్షణాలు, మామ్మనుంచి మనశ్శక్తి, తాతయ్యనుంచి అప్పగింతలు, తోబుట్టువులనుంచి క్షమ, మరపు... ఎన్నో నేర్చుకోవచ్చు. మనిషి కళ్లు తెరిచిన దగ్గర్నుంచీ నేర్వదగ్గ పాఠాలు బోలెడు.

మీరా నుంచి భక్తి, హనుమనుంచి సమర్పణ భావం, మహాత్మాగాంధీ సంకల్పబలం, అసాధ్యాన్ని సుసాధ్యం చేయడమెలాగో స్టీవ్‌ జాబ్స్‌నుంచి, ఎడిసన్‌ నుంచి పట్టువిడవని సాధన... ప్రతి జీవితం జ్ఞానసముపార్జనకు అద్భుత అవకాశం కల్పిస్తుంది. మనిషి తనలో ఉండే విద్యార్థిని సజీవంగా ఉంచడమనేది కీలకం. లోపల ఉండే అన్వేషకుడు నిరంతరం అన్వేషిస్తూనే ఉండాలి. ఎవరినుంచైనా, దేనినుంచైనా, ఏ పరిస్థితిలోనైనా నేర్చుకోవడమన్నది విడవకూడదు. చాలామందిలో పాఠశాల రోజులతోనే నేర్చుకోవడం ఆగిపోతుంది. అటువంటి బతుకు నిరర్థకంగా తయారవుతుంది.

మనిషిలో శక్తిసామర్థ్యాలు పెరగాలంటే, ఆరోగ్యంగా ఎదగాలంటే- అధ్యయనం జీవితాంతం సాగాలి. అది శ్వాస తీసుకోవడంలా, తుదిక్షణాల వరకు నిలవాలి.

ఆటపాటల్లో మునిగితేలే పిల్లల్ని చూస్తే వర్తమానంలో జీవించడమంటే ఏమిటో బోధపడుతుంది.

ఎదురయ్యే సంఘటనల నుంచి గ్రహించేదంతా అనుభవం అవుతుంది. అది పరిపక్వతను పెంచుతుంది.

ప్రాముఖ్యం లేని సంఘటనలు సైతం అద్భుతమైన అవకాశాలై జీవితంలో గొప్ప అనుభవాలుగా నిలుస్తాయి. ఎందరికో మార్గదర్శకం అవుతాయి. ఐన్‌స్టీన్‌, ఆర్కిమెడిస్‌, న్యూటన్‌ పరిశోధనలు మానవ జీవనశైలినే మార్చేశాయి. ఆ పరిశోధనలన్నీ ఏ మాత్రం ప్రాధాన్యం తోచని అనుభవాలుగా మొదలై వెలుగులోకి వచ్చినవే.

కొత్త పరిస్థితులు ఎదురైనప్పుడు అవగతమవుతుంది మనిషికి... పరిపక్వతకు ఒక అడుగు తక్కువలో ఉందన్న విషయం. పరిస్థితులకు తలకిందులైపోయి, చెదిరిపోయి, ఉద్విగ్నతకు లోనై నిరుత్సాహపడితే నేర్చుకునేది ఏమీ లేకపోగా- అవే పరిస్థితులు పునరావృతమవుతుంటాయి.

జీవితం ఎప్పుడూ ముందు పరీక్ష పెడుతుంది. ఆ తరవాతే పాఠం నేర్పుతుంది. కొందరికి నెలలు, ఏళ్లు పడితే... మరికొందరికి జీవితకాలం సరిపోదు.

అనుభవాలు రకరకాలు. జయాపజయాలు, మంచి చెడులు, అనుకూల ప్రతికూలాలు... ప్రతి అనుభవం ఒక పరీక్షే. అవన్నీ ‘నేటి’నుంచి ఎలా ఉండనుందో తెలియని రేపటికి తీసికెళ్ళేందుకు మనిషిని సిద్ధం చేయడం కోసమే.

తాను చేసే పొరపాట్లవల్ల మనిషి లోతైన పాఠాలు నేర్చుకుంటాడు. అపజయాలు గుర్తుండిపోయే పాఠాలు నేర్పుతాయి. విజయం ప్రేరణనందిస్తే, పరాజయం బోధకుడి పాత్ర పోషిస్తుంది. మనిషి పొరపాట్లకు మానసికంగా చలించిపోతే ‘రేపు’ కొత్తగా ఉండదు. బతుకు భారమనిపిస్తుంది.

జీవితం ఒక ఆట. లెక్కకు మించిన అవకాశాలను, సవాళ్లను దారిపొడుగునా విసురుతూనే ఉంటుంది. పట్టుదల ఉంటే వాటినందుకుంటూ జీవితాన్ని మెరుగుపరచుకుంటూ మనిషి ముందుకు సాగిపోగలుగుతాడు. 

(ఈనాడు అంతర్యామి)

✍🏻మంత్రవాది మహేశ్వర్

భీమేశ్వర జ్యోతిర్లింగము

 *🚩భీమేశ్వర జ్యోతిర్లింగము🚩*


భీమేశ్వర జ్యోతిర్లింగం గూర్చి ప్రార్థనా శ్లోకంగా ఒకమాట చెప్తారు.


యం డాకినీశాకినికాసమాజై నిషేవ్యమాణం పిశితా శనైశ్చ!


సదైవ భీమాదిపదప్రసిద్ధం, తమ్ శంకరం భూతహితం నమామి!!


ఇక్కడ ఉండే శంకరుడిని భీమలింగము అని పిలుస్తారు. శివాష్టోత్తరంలో ‘భీమః’ అన్న నామము ఉన్నది. ‘భీమః’ అనే నామం విష్ణుసహస్రనామ స్తోత్రంలో కూడా ఉన్నది. ఇది చాలా చిత్రాతిచిత్రమయిన స్వయంభూలింగము.


లింగపురాణం వాయువు పేరును ‘ప్రభంజనః’ అని పేర్కొంది. ఆయన గట్టిగా వీస్తే పెద్దపెద్ద వృక్షములు కూడా కూకటి వేళ్ళతో క్రిందపడిపోతాయి. ఆయన ప్రభంజనుడు. అటువంటి వాడికి శంకరుడు ‘నీవు జీవులలో ఉండి వాళ్ళ కార్యములన్నీ నిర్వర్తించాలి’ అని చెప్పాడు. వెంటనే వాయువు జీవులలోకి వెళ్ళాడు. ప్రభంజనుడై వాయువు  శరీరములు నిలబడడానికి పది రకములయిన కర్మలను లోపల ఉండి నిర్వహిస్తున్నాడు. ఆయన ఇవి చెయ్యకపోతే బ్రతుకే లేదు.


పూర్వకాలమునందు సహ్య పర్వత శిఖరముల మీద ఇద్దరు రాక్షసులు ఉండేవారు. ఆ రాక్షసుని పేరు కర్కటుడు. ఆయన భార్య పేరు పుష్కసి. ఈ రాక్షస దంపతులకు ఒక రాక్షసి పిల్ల పుట్టింది. ఆమె పేరు కర్కసి. పెరిగి పెద్దదయి యౌవనంలోకి వచ్చింది. తగిన సంబంధం చూడాలి. విరాధుడు అనేవాడిని ఈమెకు తగిన వరునిగా నిర్ణయించి పెళ్ళి చేశారు. కొంతకాలమునకు రామచంద్రమూర్తి అరణ్యవాసమునకు వచ్చి ఆ విరాధుడిని సంహరించాడు. ఈవిడకి వైధవ్యం వచ్చింది రాముడి పట్ల వైరం ఉన్న కుంభకర్ణుని పట్ల మక్కువ పెంచుకుంది. ఈ విషయం తెలుసుకుని కుంభకర్ణుడు ఈమె దగ్గరికి వచ్చాడు. కదళీ వనంలో వున్న ఆమెను స్వీకరిస్తానని చెప్పి ఆమెను బలాత్కారం చేసి వెళ్ళిపోయాడు. ఆవిడకి కుంభకర్ణుడి వల్ల ఒక కొడుకు పుట్టాడు. ఆ పుట్టినవాడు అపారమయిన బలవంతుడు అవాలని ఆమె కోరుకుంది. తన కొడుకు తన భర్త విరాధుడిని, కుంభకర్ణుని సంహరించిన రాముడిని సంహరించగల శక్తిమంతుడు కావాలని ఆమె కోరిక. అందుకని ఆ పిల్లాడిని ‘భీమః’ అని పిలవడం ప్రారంభించింది. భీమః అంటే గొప్పబలం ఉన్నవాడని అర్థం.


వాడు పెరిగి పెద్ద రాక్షసుడు అయ్యాడు. వాడు ఒకనాడు తల్లిని “నాన్నగారు ఎక్కడ” అని అడిగాడు. అపుడు ఆమె తన కథను కొడుక్కి చెప్పి ఈ రాముడు ఇప్పుడు అవతార పరిసమాప్తి చేసి విష్ణువుగా ఉన్నాడు. నీవు విష్ణువును సంహరించాలి’ అని చెప్పింది. విష్ణువు గురించి లోకములనన్నింటిని వెతికి వెతికి విసిగిపోయాడు. ఎవడయినా భగవంతుని పాదములు పట్టుకున్న వాడు ఉన్నట్లయితే వాని తలకాయ తీసివేయమని ఆజ్ఞాపించాడు. ఇలా భక్తులన్దరినీ చెణకుతూ వెళ్ళిపోతుండగా ఒకానొకప్పుడు కామరూప రాజ్యమును పరిపాలిస్తున్న సుదక్షిణుడు అనే రాజును ఓడించి తీసుకు వచ్చి కారాగారంలో పెట్టాడు.


సుదక్షిణుడు పార్థివ లింగం పెట్టి రోజూ లింగార్చన చేస్తూండేవాడు. మనస్సుతోనే ఆయన అన్నీ సృష్టించి శివపూజ చేస్తుండేవాడు. అలా చేస్తుంటే అక్కడ ఉన్న కాపలాదారులు వెళ్ళి ఈవిషయం రాజుకు చెప్పారు. వీడికి ఎక్కడ లేని కోపం వచ్చి నాకన్నా గొప్పవాడు ఎవడు? ఇప్పుడే ఈ లింగమును కత్తితో నరికేస్తాను అని చంద్రహాసం తీసి శివలింగం మీద కొట్టబోతుండగా సుదక్షిణుడు పరమేశ్వరా! నీవు ఆవిర్భవించి వీనిని సంహరించు అని ప్రార్థన చేశాడు.


ఎప్పుడయితే తన చేతిలో ఉన్న చంద్రహాసమును విసిరాడో అంతటా నిండి నిబిడీ కృతమయి ఈ కన్నులకు కనపడని పరమాత్మ సాకార రూపమును పొంది పార్థివ లింగంలోంచి బయటకు వచ్చి నేను నా భక్తుల జోలికి వెళ్ళే వాళ్ళని ఉపేక్షించను అని ఉత్తరక్షణం వాడిని కుత్తుక మీద పొడిచి సంహారం చేశాడు. ఆ సందర్భంలో పరమేశ్వరుడే తన పేరు ‘భీముడు’ అని చెప్పుకున్నాడు. భీముడు అనగా అద్వితీయ పరాక్రముడు.


ఇందులో తెలుసుకోవలసిన రహస్యం ఒకటి ఉన్నది. ఆ రాక్షసుని కక్ష విష్ణువు మీద. ఇక్కడ పరమశివుడు వచ్చాడు. యథార్థమునకు విష్ణురూపం రావాలి కదా! అయితే శివరూపంతో వచ్చి ఎందుకు చంపాడు? అంటే భగవంతుని రెండు పేర్లు చెప్తారు – వామదేవ, వాసుదేవ. వాసుదేవ అంటే శ్రీమన్నారాయణుడు. వామదేవ అంటే పరమశివుడు. ఈ రెండు పేర్లలో మారిన అక్షరములు ‘మ’ ‘సు’. ఇప్పుడు ‘సు’ పక్కన ‘మ’ పెట్టండి. ‘సుమ’ అవుతుంది. ‘సుమం’ అంటే పువ్వు. పువ్వు అనగా జ్ఞానం. జ్ఞానం కలిగి తెలుసుకుంటే ఆ వామదేవుడు వాసుదేవుడు, వాసుదేవుడు వామదేవుడు అవుతారు. నామములు, రూపములు మారాయి. తత్త్వరీత్యా ఉన్నది ఒక్కటే పదార్ధం. శివలింగమును పూజించి రాముని జోలికి వెళ్ళినా, రావణాసురుని పది తలలు తెగిపోతున్నప్పుడు శివస్వరూపం ఆపదు. శివ స్వరూపం జోలికి వెళ్ళి శ్రీ మహావిష్ణువు పాదములు పట్టుకున్నా, శ్రీమహావిష్ణువు వచ్చి శంకరుడు చేసే ప్రళయమును ఆపడు.   ఉన్నది ఒక్కటే పదార్థము. ‘ఏకోదేవః సర్వభూతాంతరాత్మా స్రవభూతాభివాసః సాక్షీచేతోకేవలోనిర్గుణస్యా’ అంది వేదం. ఆ ఉన్న ఒక్క పదార్థము అవసరమును బట్టి రూపమును మారుస్తుంది.  భీమః –  ఏమి కోరుకుంటున్నారో అటువంటి శక్తి ఏదయినా ఇవ్వగలిగిన వాడు.  ఆ స్థితిలో వచ్చి రాక్షససంహారం చేసి తన భక్తుడయినవాడికి రాజ్యాధికారం ఇచ్చి, తదనంతరం మోక్షమునిచ్చినవాడు.


ఒక్కసారి వెళ్ళి ఆ భీమశంకర జ్యోతిర్లింగం దగ్గర నిలబడి ‘డాకిన్యాం భీమశంకరం’ అని ఒక్క నమస్కారం చేస్తే భీముడు శంకరుడు శుభం చేస్తాడు. ఒక్క నమస్కారం చేస్తే ఆ పరమాత్మ  ఎటువంటి దుఃఖములు రాకుండా కాపాడి రక్షిస్తాడు.

తల్లితండ్రుల గొప్పదనం

 *తల్లితండ్రుల గొప్పదనం గురించి  శాస్త్రాలలో చెప్పబడిన విధానం.*

======================


01. ఈ సమస్త భూమి కంటే బరువైనది తల్లి.


02. ఆకాశము కన్నా ఉన్నతుడు తండ్రి0


03. ఒక్కసారి తల్లికి, తండ్రికి నమస్కరించిన గోదానము చేసిన పుణ్యము వచ్చును.


04. సత్యం తల్లి .............. జ్ఞానం తండ్రి.


05. పదిమంది ఉపాధ్యాయులకంటే ఆచార్యుడు గొప్పవాడు. వందమంది ఆచార్యుల కంటే తండ్రి గొప్పవాడు. ఆ తండ్రి కంటే వేయి రెట్లు గొప్పది జన్మనిచ్చిన తల్లి.


06. తల్లితండ్రులకు సేవ చేస్తే ఆరుసార్లు భూప్రదక్షిణ చేసిన ఫలమూ, వెయ్యిసార్లు కాశీయాత్ర చేసిన ఫలమూ, వందసార్లు సముద్ర స్నానము చేసిన ఫలమూ దక్కుతాయి.


07. ఎవరు మాతృదేవతను సుఖముగ ఉంచరో, సేవించరో వారి శరీర మాంసాలు శునక మాంసము కన్నా హీనం


08. ఎంతటి శాపానికైనా నివృత్తి ఉంటుంది కానీ, కన్నతల్లి కంట కన్నీరు తెప్పించిన లక్ష గోవులు దానమిచ్చినా, వెయ్యి అశ్వమేధ యాగాలు చేసినా ఆ పాపం పోదు.


09. తను చెడి తన బిడ్డలను చెడగొట్టిన తండ్రిని అసహ్యించుకున్నా తప్పులేదు. చెడు నడతతో ఉన్న తల్లిని నిరాదరించినా అది తప్పే  అని ధర్మశాస్త్రం చెబుతోంది.


10. తల్లిని మించిన దైవం లేదు - గాయత్రిని మించిన మంత్రం లేదు.

🌹🌹🌹🌹🌹

🙏🙏🙏🙏🙏

నామ స్మరణం..ముక్తిమార్గం!*

 🚩🛕 *హిందూ ఆధ్యాత్మిక వేదిక*🚩🛕

=======================


*నామ స్మరణం..ముక్తిమార్గం!*


రాబోయే కాలంలో ఎలాంటి సంఘటనలు, ఉపద్రవాలు సంభవిస్తాయో బ్రహ్మం గారు తన కాలజ్ఞానంలో చెప్పారు. మనకు తెలియని మరో సంగతి ఏంటంటే, ద్వాపర యుగం ముగిసిన తరువాత రాబోయే కలియుగంలో ఎలాంటి పరిణామాలు సంభవిస్తాయో కృష్ణ భగవానుడు కూడా ముందే చెప్పాడు. కలి ప్రభావం వల్ల మనుషుల్లో ఎలాంటి మార్పులు వస్తాయో, పాపకర్మలు ఎలా పెరిగిపోతాయో ఆయన తన అవతార సమాప్తిలో చెప్పాడు. అంతేకాదు, కలి ప్రభావం నుంచి బయటపడి, పాపకర్మలను అధిగమించి, పుణ్యకార్యాలవైపు ఎలా వెళ్లాలో కూడా సూచించాడు.


*ద్వాపర యుగాంతం...*


శ్రీకృష్ణ పరమాత్మ అవతారం చాలించడానికి సిద్ధంగా ఉన్నాడు. అప్పుడు ఉద్ధవుడిని పిలిచాడు. తన నిర్యాణం తరువాత కలి ప్రవేశం జరుగుతుందనీ, ఏడో రాత్రి లోపల ద్వారకానగరం అంతా సముద్రమయం అయిపోతుందనీ చెప్పాడు. కలి ప్రవేశించిన తరువాత మనుషుల ఆలోచనా ధోరణి, ప్రవర్తన అన్నీ మారిపోతాయి. అయినప్పటికీ భగవంతుణ్ణి చేరుకోవడం మాత్రం సులభసాధ్యమంటూ కలియుగం గురించి ఇలా వివరించాడు కృష్ణుడు. ఉద్ధవా! కలి ప్రవేశించగానే రెండు విషయాల పైన ఈ ప్రపంచం ఆధారపడుతుంది. ఒకటి కోపం. రెండవది విపరీతమైన కోర్కెలు. వీటివల్ల మనుషుల్లో ఆయుర్దాయం తగ్గుతుంది. విపరీతమైన కోర్కెలతో సంతృప్తి లేకుండా మనుషులుంటారు. తద్వారా ప్రశాంతత కరువై, తీవ్రమైన వ్యాధులు ప్రబలుతాయి. ఒక పక్క దైవభక్తి తగ్గుతుంది. మరోపక్క ఏ దేవతామూర్తి కోర్కె తీరుస్తుందంటే అటు పరుగులు పెడతారు. అంతేగాని దేవుడొక్కడే అంటే ఒప్పుకోరు. మతాల ఆధారంగా పరమాత్మ పట్ల భేదం చూపిస్తారు. సర్వాంతర్యామి అయిన భగవంతుడిలో రూపాన్ని బట్టి రకరకాల భేదాలు చూపి, కొట్టుకుంటారు. భక్తిలేని వాడు దేవుడి పనులను, గుడి నిర్మాణాలను చేపడ్తాడు. 


వేదాల్ని, యజ్ఞ యాగాదుల్ని ధిక్కరిస్తారు. అర్హత లేనివాళ్లు ఆయా పనుల్లో నిష్ణాతులమంటారు. యోగ్యత, పాండిత్యం వల్ల మనుషులు గౌరవింపబడరు. డబ్బు ఎవరికి ఎక్కువ ఉంటుందో వాళ్లనే గౌరవిస్తారు. ఇంద్రియాలకు బానిసలవుతారు. తద్వారా అంతశ్శుద్ధి కోల్పోతారు. ఇంద్రియాలతో మనకు ఏదైతే సుఖాన్నిస్తుందో అది మన జన్మను పాడు చేస్తుందనే జ్ఞానాన్ని కోల్పోతారు. అయితే కలియుగంలో దైవనామం చెప్పినంత మాత్రాన వాళ్లకు పుణ్యం లభించి, పాపకర్మల నుంచి విముక్తులవుతారు. అందుకే బదరికాశ్రమం వెళ్లి, నా మూర్తిని ఆశ్రమంలో ఉంచు. ప్రతిరోజూ భగవన్నామం కొంతసేపైనా చెప్పు. కొన్ని పూలు ఆ మూర్తిపై వేయి. అప్పుడు ఆ మూర్తి అహంకారాన్ని తగ్గించి, పుణ్యం వైపు నడిపిస్తుంది. పాపకర్మల నుంచి విముక్తులవడానికి కలియుగాన ఉన్న సులభమార్గమిది. 


*పరమాత్మను చేరే మార్గం..*


పాపకర్మలన్నీ పెరిగిపోయినప్పటికీ కలి ప్రభావం నుంచి బయటపడి, భగవంతుని చేరుకోవడానికి మనం చేయాల్సిన కర్మల గురించి సూచనలు చేశాడు కృష్ణ భగవానుడు. 

దైవ నామస్మరణ, ఎక్కువసార్లు అనవసర విషయాలు మాట్లాడకుండా మౌనం పాటించడం, దైవపూజ, ఇంద్రియ నిగ్రహం, జపం.. వీటిని పాటిస్తే చాలు పాపాల నుంచి విముక్తులమై ఆయన అనుగ్రహం పొందవచ్చు. అంతేకాదు, కోర్కెలను తీర్చుకునే మార్గాలూ ఇవే. అయితే అమ్మో! ఇన్ని చేయాలా అని అన్పిస్తుంది మనకు. కానీ ప్రతిరోజూ దైవనామం స్మరించే సమయాన్ని పెంచుతూ పోవాలి. సాధారణంగా మనం ఏదో ఒక కోర్కె తీరాలని భగవంతుడిని ప్రార్థిస్తూ ఉంటాం. కాని ఇది సరైన పద్ధతి కాదు. అంతశ్శుద్ధి, ఇంద్రియ నిగ్రహాన్ని ప్రసాదించాలని ప్రార్థించాలి. నామస్మరణతోనే కరుణించే స్వామి వాటిని మనకు ప్రసాదిస్తాడు. అంతశ్శుద్ధితో భక్తి దానికదే వస్తుంది. భక్తి చింతనతో మనకు కావాల్సింది కోరుకుంటే చాలు ఆయనే ఇస్తాడు. అయితే సర్వాంతర్యామి అయిన భగవంతుడికి నాకు కావాల్సిందేమిటో తెలియదా! ప్రత్యేకించి కోరుకోవడమెందుకు.. అని కూడా అన్పించొచ్చు. కాని మన తోటివారితో, స్నేహితులతో ఎందరితోనో మనకు ఫలానా సమస్య ఉందనీ, కష్టం ఉందనీ చెప్పుకుంటూ ఉంటాం. మానవమాత్రులెవరూ తీర్చలేని కష్టాన్ని కూడా ఆ భగవంతుడు తీరుస్తాడు. ఆయన జగద్రక్షకుడు. మనల్ని కంటికి రెప్పలా కాపాడుతూ ఉండే రక్షకుడితో చెప్పుకుంటే బాధ తగ్గుతుందీ, కష్టమూ తీరుతుంది. ఆయా సమస్యల నుంచి విముక్తులమూ అవుతాం. 


*ఇంద్రియ నిగ్రహం.. ఇలా సాధ్యం!*


వివాహం అయిన స్త్రీ తల్లితో సమానమనే భావన కలియుగంలో తగ్గిపోతుంది. పరస్త్రీలు, పర పురుషులపై మోహం కలగడం కలియుగ లక్షణం. దీనికి వివాహంతో సంబంధం లేదు. కలి ప్రభావం వల్ల కలిగే ఈ మోహాల నుంచి బయటపడడానికి కూడా సులువైన మార్గం ఉంది. ఒక అందమైన స్త్రీని చూసినప్పుడు మోహం కలిగితే - ఇంత అందంగా ఉన్న ఈ అమ్మ కన్పించి కరుణించింది. పొద్దున్నే మా అమ్మ జగన్మాత కనిపించి ఆశీర్వదిస్తున్నది అని అనుకోవాలి. అదేవిధంగా పరపురుషుని పట్ల మోహం కలిగినప్పుడు స్త్రీలు - కృష్ణా! నీ జగన్మోహనాకార దర్శనం ఇచ్చావా తండ్రీ! అని అనుకోవాలి. ఇలాంటప్పుడు పాపచింతన కాస్తా పుణ్యం వైపు దారితీస్తుంది. పాపకర్మలను పుణ్యకర్మలుగా మార్చుకునే సాధనం ఇది. క్రమంగా మనసుకు ఇది అలవాటై పోతుంది. ఇక పాపకర్మల వైపు మనసు మళ్లదు. అలాంటి వాళ్ల మనసు నిర్మలంగా ఉంటుంది. ప్రశాంతంగా ఉంటారు.