3, డిసెంబర్ 2025, బుధవారం

గోసేవకు వరం*

 


                *గోసేవకు వరం* 

                 ➖➖➖✍️

```

ఒకసారి అర్జునుడు, శ్రీ కృష్ణుడు ఒక వృద్ధ విధవరాలి ఇంటికి అతిథులుగా వెళ్లారు. ఆ వృద్ధ విధవరాలు శ్రీకృష్ణునికి పరమ భక్తురాలు కూడ. ఆమె నిత్యం కన్నయ్యను స్మరిస్తూ తన జీవితాన్ని గడుపుతోంది. ఆమెకు నా అన్నవాళ్లు ఎవరూ లేరు. సమాజ సేవ చేసుకుంటు ఈ లోకం లో 

ఆ భక్తురాలు ఉండేది ఒక పూరి గుడిసెలో..! ఆమె వద్ద ఒక ఆవు ఉండేది. ఆమె ఆ గోమాత ప్రసాదించిన పాలను గ్రామ వాసులకు దానం ఇచ్చి కాస్తో కూస్తో పుణ్యం సంపాదించేది. ఆమె తన జీవనాధారమైన ఆవును బాగా చూసుకునేది.


ఆ పుణ్య ప్రభావంతోనే, తాను ఎంతగానో అభిమానించే కన్నయ్య తన ఇంటికి రావడం చూసి, ఎంతగానో సంతోషపడింది. 


కన్నయతో పాటు ధర్మశ్రేష్ఠుడైన దనుర్థారి అయిన పార్థుడు కూడా అతని వెంట రావడం చూసి ఆమె ఆనందానికి అవధులు లేకుండా పోయింది.


ఆ రోజు వచ్చిన అతిథి దేవునితో సమానం అంటారు. అలాంటిది ఏకంగా దేవాది దేవుడే అతిథిగా వచ్చాడు. కనుక అమె సంతోషం అధికమై ఆమె తన ఆవు ఇచ్చిన పాలు ఇతరుల పిల్లల కు ఇవ్వగా వచ్చిన ఆహార పదార్థాలను అన్నిటినీ ఆరోజు కృష్ణార్జునులకు నివేదించింది.


శ్రీకృష్ణుడు ఆమె ఆతిథ్యానికి, అలాగే ఆమె నిష్కల్మషమైన భక్తికి మెచ్చాడు. అలా కొద్దిసేపు ఆమెతో మాట్లాడిన తరువాత ఆ నర నారాయణులు వెళ్లిపోయారు. 


బయటికి వచ్చిన పిమ్మట అర్జునుడు మాధవునితో ఇలా అన్నాడు...

“మాధవా..! మీరు ఆమె భక్తికి మెచ్చారు కదా మరి ఆమెకు ఒక వరాన్ని ఎందుకు ఇవ్వలేదు?"


దీనికి సమాధానంగా గోపాలుడు చిరునవ్వు చిందిస్తూ ఇలా అన్నాడు- “అర్జునా నాభక్తులెవరూ అయాచిత ధనాన్ని కలలో కూడ ఆశించరు. ధనం ఐతే నేను ఆమెకు ఎప్పుడో ఇచ్చేవాడినే. కాని ఆమె ఏ రోజూ నన్ను అడగలేదు. ఇచ్చినా తీసుకోదు కూడ. ఎందుకంటే అది మితి మీరీన ప్రాణ హాని కూడ అనీ విజ్ఞులకు విధితమే, నన్ను ప్రేమించే తనకు ఆ ఆవుకు కామధేనువు వరాన్ని ప్రసాదించాను. ఆ గోవు అక్షయ పాత్రలా క్షీరం లేదనక కాదనక ఎప్పుడూ ప్రసాదిస్తుంది. దాని గోష్ణాన్నీ తాగిన ఆ వూరి పిల్లలంతా మహా బలవంతులౌతున్నారు. వారిని కన్నవారు చాల సంతోషపడి, అలా అందరి ఆశీస్సులు ఆమెకు అందేవి. అది చాలాదా,అర్జునా మానవజన్మకు.


సంభ్రమాశ్చర్యాలకు లోనైన పార్ధుడు తిరిగి కన్నయ్యతో “మాధవా! గోవు కామధేనువు ఎలా ఔతుంది?” అని అన్నాడు.


మళ్లీ కృష్ణయ్య నవ్వుతూ ఇలా సమాధానం ఇచ్చారు... 

“కౌంతేయా..! నీవు నన్ను అర్థం చేసుకోలేదు. ఆమె ఆవు[నా] గురించే ఎక్కువగా ఆలోచించి చేసే సేవ నా ఒక్కడికే చెందదు. ముక్కోటి దేవతలకు ఈ సేవ గోవు ద్వారా ఆమెకు సమకూరుతుంది. ఆవును ఎలా పోషించాలి, ఆవుకు మేత ఎలా సేకరించాలి, ఆవు శుచిగా, శుభ్రంగా ఉండటానికి ఎలా నీటితో స్నానం చేయించాలి....ఇలా పలు విధాలుగా ఎక్కువ సమయం ఆ గోవు గురించే ఆలోచించడం వలన, నన్ను పదే పదే స్మరించడ మవుతుందనేది నీకు తెలుసు కదా అర్జునా”


అదే ఆ ఆవును కామధేనువు చేస్తే మేపే పనే వుండదు. ఆ పనే గనుక లేకపోతే, ఆ భక్తురాలు రోజంతా నన్ను సేవిస్తూ, స్మరిస్తూ నా గురించి ఇతరులకు చెబుతూనే పాలను దానం చేస్తూనే వుంటుంది కదా! ఆ పుణ్యకర్మ తోనే తుది సమయం వచ్చినప్పుడు నేను తనని [ఇహలోకం] భూమి నుంచి దాటి నా లోకము [పరలోకం ]తీసుకు వెళ్ళిపోతాను. నా శాశ్విత సేవలో తరించి తన జన్మను ధన్యం చేసుకుంటుంది. ఈ జన్మాంతరం తాను తప్పక నా లోకాన్ని చేరుకుంటుంది.”


వాసుదేవుని మాటలు విన్న పార్థుడు ఎంతగానో సంతోషించాడు.


చూశారా మనకు ఎన్నో కష్టాలు వస్తుంటాయి. ఆ కష్టాలు అనేవి భగవంతుడు పెట్టే పరీక్ష వంటిది.. కష్టాలు నశించిన పిమ్మట మనకు తప్పక ఆనందం లభిస్తుంది. ఎన్ని కష్టాలు వచ్చినా కృష్ణయ్య లీలలోని భాగమేనని సర్దుకుపోవాలి.. 

ఆ తర్వాత అంతా ఆ పరమాత్ముడే చూసుకుంటాడు.✍️```

. *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

                       🌷🙏🌷```

 🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏```

🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

*రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*

                     ➖▪️➖

ఇలాంటి మంచి విషయాలకోసం…

*“భగవంతుని విషయాలు గ్రూప్“* లో చేర్చమని ఈక్రింది నెంబరుకి వాట్సప్ లో మాత్రమే మెసేజ్ పెట్టండి... 9440652774. లింక్ పంపుతాము. దయచేసి ఫోన్ కాల్స్ చేయవద్దు.🙏

ఆచార్య సద్బోధన*





              *ఆచార్య సద్బోధన*

                ➖➖➖✍️

```

మానవుడు భగవంతుని అనుగ్రహం కోసం నిరంతరం తాపత్రయ పడుతుంటాడు. అయితే భగవంతుని అనుగ్రహం పొందాలంటే మనం ఏమి చేయాలి?


కృతయుగంలో తపో ధ్యాన యోగ సాధనలు ఆచరిస్తూ సత్యానికి పట్టం కట్టారు.


త్రేతాయుగంలో ధర్మమే ఆచరణ అయింది. అది ధర్మయుగమైంది.


ద్వాపరయుగానికి వచ్చేటప్పటికి అర్చన, ఆరాధనలు ఏర్పడ్డాయి. దానివలన శాంతి, ప్రేమలు నెలకొన్నాయి.


కృతయుగం నాటి సత్యం, త్రేతాయుగం నాటి ధర్మం, ద్వాపరయుగంనాటి శాంతి, ప్రేమలకు ఈ కలియుగంలో అహింసను జతచేసి భగవానుడు మనకు సరికొత్త సులువైన సాధన మార్గాన్ని చూపించాడు. భేదభావము చూపక ప్రేమతో అందరినీ సేవించడమే భగవంతుడు చూపిన ఆ ఏకైక మార్గం. భగవంతుని అనుగ్రహం పొందడానికి ఇదే అసలైన రాచబాట.


కలియుగంలో అందరూ ధ్యానం చేయలేరు. యోగం చేయలేరు, యజ్ఞం చేయలేరు. అందుకే భగవంతుడు స్మరణ, సేవ అనే సులువైన అనువైన సాధన మార్గాలు చూపించాడు.


మానవ జీవితములను తరింపజేసే సాధన మార్గాలివి. కనీసం వీటినైనా అచరిస్తూ జీవితములను సార్థకం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి.✍️```

. *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

                       🌷🙏🌷```

 🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏```

🍀🌺🍀🌺🍀🕉️🍀🌺🍀🌺🍀

*రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*

                     ➖▪️➖

ఇలాంటి మంచి విషయాలకోసం…

*“భగవంతుని విషయాలు గ్రూప్“* లో చేర్చమని ఈక్రింది నెంబరుకి వాట్సప్ లో మాత్రమే మెసేజ్ పెట్టండి... 9440652774. లింక్ పంపుతాము. దయచేసి ఫోన్ కాల్స్ చేయవద్దు.🙏

మార్గశిర శుద్ధ చతుర్దశి.

 412e4;

🍀🌺🍀🌺🍀🕉️🍀🌺🍀🌺🍀```

మార్గశిర శుద్ధ చతుర్దశి..```



            *పాషాణ చతుర్దశి*

                 ➖➖➖✍️


```

రామాయణం లో రాముడు సీతా లక్ష్మణ సమేతుడై బయలుదేరి మూడు దినములు జలాహారము, నాలుగవ దినమున ఫలాహారము గైకొని ఐదవనాడు చిత్రకూటము జేరి అందు బండ్రెండేండ్లు నివసించి పదు మూడవ సంవత్సరమున బంచవటియందు కాముకురాలగు శూర్పణఖను విరూపను గావించెను. 


పిదప రావణుడు వచ్చి సీతను గొనిపోవుచుండ నామె యింటలేని రామునికై ‘రామ రామ’ యని యేడ్చెను. 


అపుడు జటాయువు రావణుని కడ్డువెళ్ళి యాతడు రెక్కలు నరుక గ్రిందబడిపోయెను. 


సంపాతి వానరులకు సీతజాడ చెప్పెను. 


మార్గశిర శుద్ధ ఏకాదశి నాడు హనుమంతుడు మహేంద్ర పర్వతమునుండి యెగిరి రాత్రికిరాత్రి లంకనుజేరి తెల్లవారుకట్ట సీతను గని సంచార ముడిగి విశ్రమించి, ద్వాదశినాడు శింశుపావృక్షము నెక్కినాటి రాత్రి చేతులు జోడించి సీతకు నమస్కరించి నమ్మకము కలుగునట్లు పలికి త్రయోదశినాడు అక్షకుమారుడు మున్నగు రాక్షసుల జంపి చతుర్దశి నాడు ఇంద్రజిత్తు ప్రయోగించిన బ్రహ్మాస్త్రమునకు బద్ధుడైనట్లు నటించెను. 


రాక్షసు లానందించి యాతనితోకకు నూనెగుడ్డలు చుట్టి యంటింప దానితో నాతడు లంకాదహనము కావించెను.


ఈనాటి నుంచి చాంద్రాయణ వ్రతం చేస్తారు. ఈనాడు రాత్రి వరకు భోజనం చేయకుండా ఉండి గౌరీదేవిని ఆరాధించాలి.


చాంద్రాయణ వ్రతం. చంద్రకళల వృద్ధి క్షయాలను బట్టి ఆహారాన్ని పెంచడం, తగ్గించడం చేసే ఒక వ్రతం. 


పౌర్ణమినాడు ఈ వ్రతాన్ని ప్రారంభిస్తే రోజుకు ఒక ముద్ద వంతున తగ్గించడం, తరువాత అమావాస్య మొదలు ఒక్కొక ముద్దనూ పెంచుతూ సామాన్య భోజన స్థాయికి చేరడం పద్ధతి.✍️```

. *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

                       🌷🙏🌷```

 🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏```

🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

*రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*

                     ➖▪️➖

ఇలాంటి మంచి విషయాలకోసం…

*“భగవంతుని విషయాలు గ్రూప్“* లో చేర్చమని ఈక్రింది నెంబరుకి వాట్సప్ లో మాత్రమే మెసేజ్ పెట్టండి... 9440652774. లింక్ పంపుతాము. దయచేసి ఫోన్ కాల్స్ చేయవద్దు.🙏

ఆణిముత్యాలు

  *ఆణిముత్యాలు:*

మనుషుల్లో మార్పు సహజం.

ఎలా మారాలనేది...

వివేకం చెబుతుంది.

ఎప్పుడు మారాలనేది...

అనుభవం చెబుతుంది.

ఎందుకు మారాలనేది...

అవసరం చెబుతుంది.


పరిస్థితులు కఠినమైనా సరే,

మనం, నిజాయితీ గా ఉండడమే...

నిజమైన వ్యక్తిత్వం.


జీవితంలో ఎదగాలంటే, రెండు కావాలి!.

నేర్చుకునే సంకల్పం,

ఓర్చుకునే సహనం.

ఇవి ఉన్నప్పుడు గమ్యం...

ఒక రోజు తప్పక చేరుతుంది.


ఆవేశానికి...ఆలోచన ఎంత ముఖ్యమో!,

ఆశయానికి... సాధన అంతే ముఖ్యం!!.


గడియారం..దుకాణంలో ఉంటే రేటు,

ఇంట్లో ఉంటే, టైమ్!,

దేనికైనా విలువ రావాలంటే...

సరైన ప్రదేశంలో ఉండాలి!.


మనిషి కోసం...

కోపాన్ని వదులుకోవాలి!,

కానీ, కోపం కోసం...

మనిషిని వదులుకోవద్దు!.


మంచివాడు...

శత్రువుకీ సహాయం చేస్తాడు!,

చెడ్డవాడు...

తోడబుట్టిన వారినీ ముంచుతాడు.


*సర్వేజనాః సుఖినో భవంతు.*

శుభ సౌమ్య వారం 🌹Happy Wednesday

అష్టాదశ పురాణాలు

   అష్టాదశ పురాణాలు - శ్రీ లింగ మహాపురాణం - జంబూద్వీపం - భరత వర్షము - మేరు పర్వతం - నలభై రెండవ భాగం

_________________________________________________

ప్రియవ్రతుడు తన పెద్ద కుమారుడైన అగ్నీధ్రునికి జంబూ ద్వీపానికి అధిపతిని చేశాడు. అగ్నీధ్రుడు శివునికి మహాభక్తుడు. నిత్యం శివుని పూజించి ఆరాధించేవాడు. జంబూద్వీపం తొమ్మిది వర్షాలుగా (దేశాలుగా) విభజించబడింది.


పరమేశ్వరుని ఆరాధించే అగ్నీధ్రుడికి తొమ్మిదిమంది కుమారులు కలిగారు. నాభి, కింపురుషుడు, హరివర్షుడు, ఇలావ్రతుడు, రమ్యుడు, హిరణ్మానుడు, కురువు, భద్రాశ్వుడు, కేతుమాలుడు అనే తొమ్మిది మంది కుమారులు తండ్రి లాగానే శివధర్మము పాటించే శివభక్తులు. కుమారులు పెద్దవారు, సమర్ధులు, శక్తిశాలురు అయిన తరువాత అగ్నీధ్రుడు వారిని తొమ్మిది వర్షాలకు (దేశాలకు) అధిపతులను చేశాడు.


జంబూద్వీప దక్షిణ భాగంలో గల హిమవర్షానికి నాభిని, హేమకూటము అనే వర్షానికి కింపురుషుడికి అప్పగించాడు. మేరు పర్వతము చుట్టుకుని ఉన్న ఇలావృత వర్షానికి ఇలావ్రతుని అధిపతిని చేశాడు. రమ్యుని నీలాంచల వర్షానికి , హిరణ్మానుడిని శ్వేత వర్షానికి రాజులను చేశాడు.


మాల్యవంత వర్షానికి భద్రాశ్వుడిని, కేతుమాలునికి గంధమాదన వర్షానికి రాజులను చేసి అగ్నీధ్రుడు తపస్సుకి వెళ్లాడు. శివాధాన్యంలో నిమగ్నుడై శివసాయిజ్యం పొందాడు. ఈ వర్షములలో నివసించు జనులు వేదధర్మాలు పాటిస్తూ సుఖంగా ఉన్నారు. వీరికి వృద్ధాప్యం, మృత్యు భయం లేదు. యుగముల ప్రభావము, లక్షణాలు లేవు. మహాదేవుని పూజిస్తూ పరమగతి పొందేవారు.


అగ్నీధ్రుడి జేష్ఠ పుత్రుడు, హిమవర్షాధిపతి అయిన నాభి మేరువతి అనే భార్య ద్వారా ఋషభుడు అనే పుత్రుని పొందాడు. ఋషభుడు రాజులందరిలో శ్రేష్ఠుడిగా గౌరవించబడేవాడు. ఋషభునికి మహావీరుడైన పుత్రుడు కలిగాడు. అతని పేరే భరతుడు. హిమాలయ పర్వతాలకు దక్షిణ భాగంలో కల వర్షానికి భరతుని అధిపతిని చేసి ఋషభుడు శివయోగియై అడవులకు వెళ్లి పరమపదించాడు.


భరతుడు అధిపతినైన వర్షానికి భరత వర్షము అని పేరు కలిగింది. భరతుడు ప్రజారంజకంగా, ధర్మబద్దంగా పరిపాలించి, రాజ్యభారము తన కుమారుడు సుమతికి అప్పగించి తపస్సుకై అడవులకు వెళ్లి పోయాడు.


జంబూద్వీప మధ్యలో మేరువు అనే మహాపర్వతము ఉంది. రత్నమయమైన శిలలతో మేరు పర్వతం ఎనభై నాలుగు వేల యోజనాల ఎత్తు కలిగి ఉంటుంది. భూమి లోపలికి పదహారు వేల యోజనాలు చొచ్చుకుని ఉంటుంది. తొంభై ఆరువేల యోజనాల విస్తీర్ణపు చుట్టుకొలత కలిగి లక్ష యోజనాల విస్తరించి ఉంటుంది. శిఖరం ముప్ఫైరెండు వేల యోజనాల విస్తీర్ణం ఉంటుంది.


పరమేశ్వరుడు స్పర్శ చేత ఈ పర్వతం బంగారు వర్ణం పొందింది. ఉమ్మెత్త పువ్వు ఆకారంలో ఉన్న ఈ పర్వతం పై సకల దేవతలు నిసిస్తుంటారు. మేరు పర్వతం తూర్పభాగం పద్మరాగ కాంతితో, దక్షిణ భాగం బంగారు కాంతితో, పడమర భాగం నల్లని కాంతితో, ఉత్తర భాగం పగడపు రంగు కాంతితో ప్రకాశిస్తుంటాయి. ఆదిశేషుడు పాతాళంలో ఈ పర్వతాన్ని తన పడగల పై మోస్తుంటాడు.


మేరు పర్వత తూర్పు భాగంలో ఇంద్రుని రాజధాని అయిన అమరావతి నగరం ఉంది. నగరంలో బంగారు భవనాలు రత్నాల గోపురాలతో ఉంటాయి. బంగారు తోరణాలు కట్టిన బంగారు సింహద్వారాలు విభిన్న ఆకారాలలో అమరావతిలో ఉన్నాయి. అమరావతి ప్రజలు నిత్యం ఉత్సవాలు జరుపుకుంటూ సుఖసంతోషాలతో ఉంటారు.


మేరు పర్వతం ఆగ్నేయ దిశలో అగ్నిదేవుడి నగరం "తేజస్వి" ఉంది. ఈ నగరం అమరావతి నగరంతో సమానంగా అన్ని వైభవాలు, సౌకర్యాలు కలిగి ఉంటుంది. నైరుతి దిశలో యముని రాజధాని నగరం "వైవస్వతి" ఉన్నది. నల్లని వర్ణంలో గల నగరంలో సువర్ణ భవనాలు, విశాలమైన రాజవీధులు కలిగి ఉన్నది.


మేరు పర్వతానికి నైరుతి దిశలో "శుద్దవతి" నగరం, వాయువ్య దిశలో "గంధవతి" నగరం, ఉత్తర దిశలో "మహోదయ" నగరం, ఈశాన్య దిశలో "యశోవతి" నగరం ఉన్నాయి. అన్ని దిశలలో సుందర నగరాలు గల మేరు పర్వతం పైన ఆకాశంలో బ్రహ్మ విష్ణు మహేశ్వరులు నిసిస్తుంటారు. మేరు పర్వత మధ్యభాగంలో యక్షులు, గంధర్వులు, మునులు, భూత గణాలు నివసిస్తారు.


మేరు పర్వతం పైన గల ఆకాశంలో వేయి యోజనాల విస్తీర్ణం గల విమానంలో సూర్యుడు చంద్రుడు అగ్ని నేత్రాలు గల పరమేశ్వరుడు పార్వతీదేవి, గణపతి, కుమారస్వామిలతో కలసి మణిమయ సింహాసనం పై విరాజిల్లుడై ఉంటాడు.


మేరు పర్వతపు ఆకాశంలో శివుని వామభాగంలో ఐదువందల యోజనాల విస్తీర్ణం గల విమానం లో విష్ణుమూర్తి, దక్షిణ భాగంలో ఐదువందల విస్తరం గల విమానంలో బ్రహ్మదేవుడు నిసిస్తుంటారు. మేరు పర్వతం పైన గల అన్ని నగరాలలో శివాలయాలు ఉన్నాయి. శివుని నిత్యం పూజిస్తుంటారు. సనకసనందాది మహర్షులు, సిద్దులు, యోగులు మేరు పర్వతం పై సంచరిస్తుంటారు.


మేరు పర్వత క్రింద భాగంలో జంబూనది నాలుగు వైపులా ప్రవహిస్తుంటుంది. ఈ నదికి దక్షిణ భాగంలో మహోన్నతమైన జంబూ వృక్షము ఉంది. నాలుగు దిశల వ్యాపించిన వృక్షము అన్ని కాలాలలో జంబూ ఫలాలను ఇస్తుంది. ఈ ఫలాల రసము చేతనే జంబూనది ఏర్పడింది. ఈ జంబూ ఫలాలను, రసమును అమృతంగా, ఆహారంగా ఇక్కడి ప్రజలు సేవిస్తారు.


మేరుపర్వతమునకు నాలుగు వైపులా విస్తరించి ఉన్న జంబూద్వీపపు తొమ్మిది వర్షాల (దేశాల) గురించి రేపటి భాగంలో చదువుదాం.


మీ అమూల్యమైన స్పందన కోరుతూ.


మీ

శ్రీకాంత్ గంజికుంట కరణం

నేటిపెద్దలమాట

  🙏సర్వేజనాః సుఖినోభవంతు: 🙏


   🌺శుభోదయం🌺


🏵️ నేటిపెద్దలమాట 🏵️


మనము మన పనిని ఫలితము ఆశించకుండా నిర్వర్తించాలి అనేది గీత చెప్పే మొదటి పాఠము. ఫలితము ఆశించకుండా మనస్ఫూర్తిగా పనిని నిర్వర్తిస్తే ఫలితము దానంతట అదే సిద్ధిస్తుంది అని గీత భోధిస్తుంది. 


🌹 నేటిమంచిమాట 🌹


శరీరము శాశ్వతము కాదు ఆత్మ మాత్రమే శాశ్వతము. మన శరీరము ఒక వస్త్రము వంటిది. వస్త్రము చినిగిపోయిన తరువాత కొత్త వస్త్రము ధరించినట్లు, ఆత్మ ఒక శరీరాన్ని వదలి కొత్త శరీరాన్ని ప్రవేశిస్తుందని కృష్ణ భగవానుడు చెపుతాడు. 


🌺🌿🌺🌿🌺🌿🌺🌿🌺🌿🌺


పంచాంగం - 02 డిసెంబర్ 2025 - మంగళవారం


శ్రీ విశ్వావసు నామ సంవత్సరం

దక్షిణాయనం - హేమంత ఋతువు

మార్గశిర మాసం - శుక్లపక్షం

సూర్యోదయం - ఉ. 6:34

సూర్యాస్తమయం - సా. 5:36


తిథి - ద్వాదశి మ. 3:52 వరకు

తరువాత త్రయోదశి

సంస్కృత వారం - భౌమ వాసరః

నక్షత్రం - అశ్విని రా. 8:46 వరకు

తరువాత భరణి

యోగం - వారియ రా. 8:58 వరకు

కరణం - భాలవ మ. 3:52 వరకు, భాలవ మ. 3:52 వరకు


వర్జ్యం - తె. 5:18 నుండి ఉ. 6:43 వరకు

దుర్ముహూర్తం - రా. 10:47 నుండి రా. 11:39 వరకు, రా. 10:47 నుండి రా. 11:39 వరకు

రాహుకాలం - మ. 2:51 నుండి సా. 4:13 వరకు

యమగండం - ఉ. 9:20 నుండి ఉ. 10:42 వరకు

గుళికాకాలం - మ. 12:05 నుండి మ. 1:28 వరకు


బ్రహ్మ ముహూర్తం - తె. 4:58 నుండి తె. 5:46 వరకు

అమృత ఘడియలు - మ. 2:23 నుండి మ. 3:49 వరకు

అభిజిత్ ముహూర్తం - ఉ. 11:43 నుండి మ. 12:27 వరకు


🌺🌿🌺🌺🌿🌺🌺🌿🌺🌺🌿🌺



🙏🍃🍃ఓం అంజనీ సుతాయ విద్మహే🍃🍃వాయుపుత్రాయ ధీమహి🍃🍃తన్నో మారుతిః 🍃🍃ప్రచోదయాత్!🍃🍃🍃💦🍌🍌🍌🍌🍌💦🙏


హనుమ నేర్పిన నీతి...


🍁🍁🍁🍁

 


సాక్షాత్తు భగవంతుడిని కూడా ప్రశ్నించవచ్చా? ఎవరిని.. ఎలా అడగాలి? అన్న ప్రశ్నలకు హనుమంతుడు ఒక సమాధానంగా నిలుస్తాడు.


 సీతాదేవిని రావణుడు అపహరించిన తర్వాత ఆమెను వెదుకుతూ రామలక్ష్మణులు రుష్యమూక పర్వత ప్రాంతానికి చేరుకుంటారు. 


సుగ్రీవుడి నివాస ప్రాంతం అది. తనను చంపడానికి తన అన్న వాలి వీరిని పంపించారా అని అనుమానించి, విషయం తెలుసుకునేందుకు తన మంత్రి అయిన హనుమంతుడిని పంపుతాడు. 


మారుతి మారు వేషంలో రామలక్ష్మణుల దగ్గరకు వచ్చి అనేక విధాలుగా ప్రశ్నిస్తాడు.


 ‘రాజర్షి దేవ ప్రతిమౌ తాపసౌ సంశితవ్రతౌ! దేశం కథమిమం ప్రాప్తౌ భవంతౌ వరవర్ణినౌ!!’


 మీరిద్దరూ మంచి తేజోవంతుల్లా, తీవ్రమైన తపోదీక్ష పట్టిన వారిలా ఉన్నారు. మీ రూపం తాపసుల్లా ఉన్నా మీ తేజం క్షత్రియత్వాన్ని సూచిస్తోంది. గొప్ప పని ఉంటే తప్ప మీవంటి యోధులు క్రూరమృగాలు సంచరించే ఇలాంటి చోటుకు రారు’ అని ప్రశ్నిస్తాడు హనుమ.


 ప్రశ్న అంటే ఇలా ఉండాలి. ఒక్క అక్షరం ఎక్కువ తక్కువ కాకుండా ప్రశ్నలు వేశాడు హనుమ. 

ఇంత కాలం తాను ఎవరి గురించి ఎదురు చూస్తున్నాడో ఆ దైవం ఎదుట నిలబడినప్పుడు హనుమ తొందరపడలేదు. వచ్చింది ఎవరో తెలుసుకునే ప్రయత్నం చేశాడు. 

ఎంత గొప్పగా ప్రశ్నించాడంటే రాముడే ముచ్చటపడ్డాడు. వ్యాకరణ పండితుడు తప్ప మరొకరు ఇలా మాట్లాడలేడన్నాడు. హనుమ ప్రశ్న స్వీకరించిన వ్యక్తి కూడా ఆనందపడేలా అడిగాడు.. 


మనం కూడా మన సందేహాన్ని ప్రశ్నను కూడా గొప్పగా అడగ గలగాలి..


జై హనుమాన్..


🍁🍁🍁🍁


🙏సమస్త లోకాః సుఖినోభవంతు🙏


              🌺శుభమస్తు🌺

సుభాషితమ్

  💎🌅  *_-|¦¦|శుభోదయమ్|¦¦|-_* 🌄🪔

🪔 *_𝕝𝕝ॐ𝕝𝕝 సుభాషితమ్ 𝕝𝕝卐𝕝𝕝_* 💎


శ్లో॥  *గురురేవ పరందైవం*

 *గురురేవ పరం తపః*| 

        *గురురేవ పరం ధ్యానం*

 *నగురోరధికంభువి*॥


తా𝕝𝕝 *గురువును మించిన దైవములేదు. గురువును మించిన తపస్సులేదు. గురు ధ్యానముకన్నా మిన్నయైన ధ్యానము లేదు. గురువుగాక ఈ భూమిమీద అధికమైన దేదియు లేదు.*


✍️💐🌹🌸🙏

సంపూర్ణ మహాభారతము

  *సంపూర్ణ మహాభారతము**సరళ వ్యావహారిక భాషలో...!*

*షష్టాశ్వాసం ప్రధమ భాగం*


*578 వ రోజు*


*శుకుడు వైరాగ్యము*


ధర్మరాజు " పితామహా ! వ్యాసపుత్రుడైన శుకునకు వైరాగ్యము ఎలా కలిగింది " అని అడిగాడు. భీష్ముడు " ధర్మనందనా ! వ్యాసుడి కుమారుడైన శుకుడు మొదట సాధారణంగానే ఉన్నాడు. అందరితో కలిసి పోయి శరీరము శాశ్వతం అనుకుని తనకు వ్యాధులు, మరణం ఉంటాయన్న విషయం మరచి విషయవాంఛలలో మునిగి పోయాడు. అది చూసిన వ్యాసుడు తన కుమారుడికి వైరాగ్యం బోధిస్తూ " కుమారా ! శుకా ! నీవు ఇంద్రియములను, మనసును తప్పుమార్గమున పోనీయక అదుపులో ఉంచుకుని వాటిని సరి అయిన మార్గములో పెట్టు. కోపరాహిత్యం, సత్యం పలకడం, ఇంద్రియములను అదుపులో పెట్టుకోవడం, ధర్మమార్గంలో నడవడం, సత్ప్రవర్తన కలిగి ఉండటం, తపస్సు చేయడం, అహింసామార్గము అవలంబించడం ఇవి ధర్మమార్గమాలు. వీటిని అవలంబిస్తూ ఆకలి దప్పులను అదుపులో పెట్టుకో. నీవు సంపాదించిన బిక్ష ముందు దేవతలకు సమర్పించి తరువాత అతిథులకు పెట్టి తరువాత నీవు భుజించు. పంజరంలో పిట్టలా శరీరంలో ఉన్న జీవుడిని మరిచి నీ ఇచ్ఛ వచ్చిన రీతిలో చరించడం ధర్మము కాదు. ఒక్కోరోజు గడిచే కొద్దీ కొంత ఆయుస్షు లెక్కన నీ ఆయుస్షు తరుగుతూ ఉంటుంది. చివరకు మృత్యువు నిన్ను కబళిస్తుంది. ఆ విషయం ఎరుగక నిద్రావస్థలో ఉండటం నీకు ధర్మమా ! ఈ శరీరం రక్త మాంసమయం. జగతిన ఉన్న ప్రాణులన్నీ అంతే. శరీరక సుఖములకు అలవడిన మానవుడు పెద్దల మాటను పెడచెవిన పెట్టి లోకము గురించి తలపక తామనుకున్నదే నిజమని భ్రమిస్తుంటారు. శారీరక సుఖమే ప్రధానమని అనుకోవడంలో ముందుగా సుఖం ఉన్నా తరువాత ఆపద కలిగిస్తుంది. కనుక బుద్ధిమంతులు నడిచే తోవను వదిలి దుర్మార్గులు నడచు తోవను నడవడం నీకు ధర్మంకాదు. ధర్మమార్గాన నడిచే సజ్జనుల బాటలో నడుస్తూ వారి ఉపదేశములను విను. సాలెపురుగువలె నీ చుట్టూ బంధనం కలిగించుకోవడం అజ్ఞానుల లక్షణం. సంసారంలో ఇంద్రియములే జలం, కామ, క్రోధ, లోభములే మొసళ్ళు. ఆ సాగరం దాటడానికి జ్ఞానం ఒక్కటే మార్గం. మూఢునిలా కోరికలతో మనసుని తృప్తి పరుస్తూ ఉంటే నీకు తెలవకుండా మృత్యువు నిన్ను కబళిస్తుంది. నీవలా ఉండ వద్దు. బ్రాహ్మణత్వం పొందడం చాలా కష్టం. నీ పూర్వజన్మ సృకృతం వలన నీకీ జన్మ లభించింది. నీవు దానిని వృధా చేస్తున్నావు. నీవు ఇకనైనా దుష్టసాంగత్యం వదిలి త్పస్సు, ఇంద్రియ నిగ్రహం, నిశ్చలత్వం, వివేకము మొదలైన మంచి గుణములను అలవరచుకో. కుమారా ! నీవు బ్రాహ్మణ జన్మ ఎత్తింది శారీరక సుఖము అనుభవించడానికి కాదు. నియమ నిష్టలతో జీవితము గడిపి పరలోక సుఖములు అనుభవించడానికి కదా ! ఇహలోక కామ సుఖములు అనుభవించడం తన మెడకు తాను ఉరి వేసుకోవడమే కదా ! వివేకవంతులు ఆపని ఎన్నటికి చెయ్యరు. ఒక వేళ చేసినా ఆ ఉరిత్రాడు తెంచుకుని జ్ఞానమార్గంలో నడవడం అలవర్చుకోవాలి. మూర్ఖులు మాత్రమే ఈ విషయము గ్రహించ లేక ఉరిత్రాడుకు వ్రేలాడుతూ ఉంటారు. కుమారా ! శరీరంలో ప్రాణం ఉన్నంత వరకే నిన్ను భార్యాబిడ్డలు, మిత్రులు అనుగమిస్తారు. ఆ తరువాత నిన్ను మరచి పోతారు. కనుక వారితో పొద్దుపుచ్చక వైరాగ్యం అలవరుచుకుని నిన్ను నీవు తెలుసుకుని ఆత్మసాక్షార్కారం చేసుకో. ముసలితనము, మరణము పుట్టినప్పటి నుండి నిన్ను వెన్నంటుతూ ఉంటాయి. కనుక మృత్యువు నీ కొరకు వేచి ఉండక ఎప్పుడైనా కబళించ వచ్చు మంచి పనులు చేయడానికి ముహూర్తం కొరకు ఎదురుచూడ వద్దు. కుమారా ! భార్యా బిడ్డలు నీ వెంట రారు. నిన్ను శ్మశానానికి మోసుకు వెళ్ళి అక్కడ కాల్చి వారిదారిన వారు పోతారు. ఇన్ని రోజుల నుండి వెంట ఉన్న నిన్ను అనుగమించని వారి కొరకు తాపత్రయపడుతూ వల్లమాలిన మమకారం పెంచుకోవడం ఎందుకు ? కాలం ఈ లోకాన్ని అతలాకుతలం చేస్తుంది కనుక ధైర్యంతో ప్రాపంచిక విషయములను వదిలి అంతర్ముఖుడవు కా ! కుమారా ! నీవు ఈ జన్మకు ముందు ఎన్నో జన్మలు ఎత్తావు. ఆ జన్మలో భార్యా బిడ్డలు, మిత్రులు ఉన్నారు వారూ మరణించారు. అలాగే ఈ జన్మలోని వారూ మరణించే వారే ! కనుక నీవూ, నీ భార్యా బిడ్డలు, బంధు మిత్రులు నిరంతరం పుడ్తూ చస్తూనే ఉంటారు. ఈ సత్యం తెలుసుకో . వివేక వంతులు" నేను ఎవరిని ? ఎవరి వాడను ? ఎక్కడ నుండి వచ్చాను ? ఎక్కడకు పోతాను ? పుట్టక పూర్వము ఎవరి వాడనో తెలియదు. మరణించిన తరువాత ఎవరి వాడనో తెలియదు. ఎక్కడ నుండి వచ్చానో తెలియదు. ఎక్కడకు పోతానో తెలియదు. అని తలచిన నీకిక బంధనాలు ఉండవు. కష్టాలు భార్యమీద వ్యామోహంతో మొదలై పరలోకం వరకు వెన్నంటి ఉంటాయి. కనుక వివేకవంతులు భార్యా వ్యామోహంలో పడరు. అనుభవించకుండా, దానం చెయ్యకుండా దాచుకున్న ధనం ఎందుకు ? ఇంద్రియములను జయించలేని ధనం, దర్పం ఎందుకు. ధర్మప్రవర్తన లేని వేదాధ్యనం లేని శాస్త్రవిజ్ఞానం నిష్ప్రయోజనం. ఇంద్రియములను జయించ లేని ఆత్మ దర్శనం ఎందుకు. కనుక కుమారా ! సంసారం త్యజించి జితేంద్రియుడవు కమ్ము " అని ఉపదేశించాడు. ధర్మనందనా ! ఇలా తండ్రి వలన బోధింపబడిన వాడై శుకుడు వైరాగ్యం పొందాడు " అని భీష్ముడు చెప్పాడు.


*రేపు *

*భారతంలో ఉండేది భూమిపై ఎక్కడైనా ఉంటుంది భారతంలో లేనిది భూమిపై ఎక్కడా లేదు*

*రోజూ భారతం చదవండి భగవద్ అనుగ్రహం పొందండి*

శ్రీ గల్తాజీ ఆలయం

 🕉 మన గుడి : నెం 1313


⚜  రాజస్థాన్ : జైపూర్ 


⚜  శ్రీ గల్తాజీ ఆలయం 



💠 ఇది హనుమంతుడికి అంకితం చేయబడిన ఆలయం.

రక్షణలో ఉన్న అనేక ఉల్లాసభరితమైన కోతులకు నిలయం. 


💠 ఈ ఆలయంలో ఏడు పవిత్రమైన 'కుండ్‌లు' ఉన్నాయి, వీటిలో 'గల్తా కుండ్' ఈ కుండ్‌లలో అత్యంత పవిత్రమైనది మరియు ఇది ఎప్పటికీ ఎండిపోదని నమ్ముతారు.


💠 రాజస్థాన్‌లోని జైపూర్‌లో ఉన్న గల్తా జీ కుండ్ ఒక ప్రసిద్ధ పర్యాటక ప్రదేశం. 

గతంలో, ఈ ప్రదేశాన్ని గల్వా ఆశ్రమం అని పిలిచేవారు, ఎందుకంటే ఆయన 5000 సంవత్సరాలకు పైగా తపస్సు చేసి, గంగా నదిని శ్రీ గల్తాజీకి తీసుకువచారని చెబుతారు.


💠 ఇతిహాసాల ప్రకారం, హిందీ మాసంలోని ప్రతి పౌర్ణమి రోజున - కార్తీక్, 'బ్రహ్మ, విష్ణు, శివుడు', త్రిమూర్తులు ఈ పవిత్ర స్థలాన్ని సందర్శిస్తారు అంటారు.


💠 ఈ కుండ్‌లో స్నానం చేయడం వల్ల త్రిమూర్తుల దైవిక ఆశీర్వాదం లభిస్తుందని ప్రజలు నమ్ముతారు.


💠 ఈ కుండ్ గురించి ఉత్తమ విషయం ఏమిటంటే ఇక్కడ మీరు అనేక దేవాలయాలు, మండపాలు మరియు పవిత్ర చెరువులను సందర్శిస్తారు, ఇవి ఈ ప్రదేశాన్ని స్వర్గంలా చేస్తాయి. 

ఈ కుండ్ గురించి అద్భుతమైన వాస్తవం ఏమిటంటే ఇది ఎప్పుడూ కరువును ఎదుర్కోదు.


💠 ఇది గులాబీ రంగు ఇసుకరాయిని ఉపయోగించి నిర్మించబడింది మరియు ఇది వివిధ రకాల పుణ్యక్షేత్రాలను కలిగి ఉన్న విస్తారమైన ఆలయ సముదాయం. 


💠 ఈ అద్భుతమైన భవనం పెయింట్ చేసిన గోడలు, గుండ్రని పైకప్పులు మరియు స్తంభాలతో అలంకరించబడింది. 


💠 కుండ్‌లతో పాటు, ఈ పూర్వ-చారిత్రక హిందూ తీర్థయాత్ర స్థలంలో ఆలయం లోపల రాముడు, కృష్ణుడు మరియు హనుమంతుడి ఆలయాలు కూడా ఉన్నాయి.


💠 గల్టాజీలో కోతుల సంఖ్య ఎక్కువగా ఉండటం వల్ల, ఈ ఆలయాన్ని 'ది మంకీ టెంపుల్' లేదా 'గల్వార్ బాగ్' అని కూడా పిలుస్తారు. గల్టా జీలో కనిపించే కోతుల జాతికి చెందినవి రీసస్ మకాక్ మరియు లంగూర్ కోతులు. 

ఇక్కడి కోతులు సందర్శకులను గుంపులుగా దాడి చేసి వారి వస్తువులను మరియు ఆహారాన్ని దోచుకోవడంలో అపఖ్యాతి పాలయ్యాయి. 

ఎవరైనా ఏదైనా ఆహారాన్ని తీసుకెళ్తున్నట్లు చూస్తే, వాటిని లాక్కునే స్థాయికి అవి ప్రసిద్ధి చెందాయి. 

అన్ని వస్తువులను ఒక సంచిలో తీసుకెళ్లడం మరియు బహిరంగంగా ఏమీ తినకపోవడం తప్పనిసరి అవుతుంది.


💠 రామనంది సాధువు 'పాలు మాత్రమే ఆహారం' తీసుకుంటూ జీవించాడని మరియు 'పయో భక్ష' అని పిలువబడ్డాడని చెబుతారు , అందుకే అతని పేరుకు 'పయో' అనే పదం జోడించబడింది.

 కాలం గడిచేకొద్దీ, ఈ ప్రదేశం రామనంది హిందువులు మరియు నాగ సాధువులకు గణనీయమైన ప్రాముఖ్యత కలిగిన కేంద్రంగా మారింది. 

వారు అనేక యుద్ధాలలో పాల్గొన్నారని కూడా నమ్ముతారు.


💠 రామానందుల గురించి : మధ్యయుగ భారతదేశంలో, సాధువు రామానంద వైష్ణవ మతం (హిందూ మతం) లోని రామానుజాచార్య శాఖ అనుచరుడు. 

రామనందులు తమను తాము రాముడి కుమారులైన లవుడు మరియు కుశుల వారసులుగా భావిస్తారు.


💠 గల్తాజీ గురించి మరో ముఖ్యమైన చారిత్రక అంశం ఏమిటంటే, స్వామి ప్రభుపాద ప్రారంభించిన 'అంతర్జాతీయ ఇస్కాన్ ఉద్యమం' వ్యవస్థాపక తత్వశాస్త్రం , స్వామి బాల్దేవ్ విద్యాభూషణ్ గల్తా జీలో రాసిన 'గోవింద్ భాష్యం' నుండి తీసుకోబడింది . 

గోవింద్ భాష్యం అనేది వేదాంత సూత్రంపై వ్యాఖ్యానం మరియు ఇది 1718లో వ్రాయబడింది.

అదనంగా, అత్యంత లౌకిక మొఘల్ చక్రవర్తి అక్బర్ కూడా గల్టా జీని సందర్శించి ఆశీర్వాదం పొందాడు, తద్వారా అతని కోరికలు నెరవేరిన వెంటనే గల్టా జీ అధిపతికి 2592 బిఘాల భూమిని విరాళంగా ఇచ్చాడు. ఈ గ్రాంట్ ఇప్పటికీ గల్టా పీత్‌లో భద్రపరచబడిన చారిత్రక పత్రం.


💠 మకర సంక్రాంతి మరియు కార్తీక పూర్ణిమ పండుగల సమయంలో గల్తాజీ ఆలయంలో అత్యధిక సంఖ్యలో భక్తులు సందర్శిస్తారు, 

ఈ సమయంలో వేలాది మంది భక్తులు పవిత్ర కుండ్లలో స్నానం చేస్తారు. 

మంత్రాలు మరియు మతపరమైన శ్లోకాల శబ్దాలు పర్యావరణాన్ని మరింత ఆహ్లాదకరంగా మారుస్తాయి. మరియు, ఆలయం పర్యాటక ప్రదేశం నుండి పూర్తిగా దూరంగా ఉండటం వల్ల ఇది మరింత ప్రశాంతంగా ఉంటుంది. 

ఇక్కడికి వచ్చే సందర్శకులలో ఎక్కువ మంది స్థానికులే. 


💠 ప్రతి సంవత్సరం మహా సంక్రాంతి సందర్భంగా, గల్తాజీ ఆలయంలో ఒక పెద్ద ఉత్సవం నిర్వహించబడుతుంది.


💠 గల్తాజీ రాజస్థాన్‌లోని జైపూర్‌కు తూర్పున 10 కి.మీ దూరంలో


రచన

©️ Santosh Kumar

నమస్కార ఫలం:*

 

            *నమస్కార ఫలం:*

                ➖➖➖✍️

```

ఒక భక్తుడు దేవునికి ఇలా నివేదించుకుంటున్నాడు...   

“స్వామీ నేను చేసిన రెండు తప్పులను క్షమించి కాచు!” అని సాష్టాంగపడి నమస్కారపూర్వకంగా అంటున్నాడు.


రెండు తప్పులు ఏమిటి అంటే:             


౧. నేను గత జన్మలో నీకు నమస్కారం చెయ్యలేదు, చేసి ఉన్నట్లయితే నాకు ఈ జన్మ ప్రాప్తించేది కాదు..!

కాబట్టి ఈ జన్మలో నీకు భక్తి పూర్వకంగా నమస్కరించుకుంటున్నాను.



రెండవ తప్పు: 


నేను మరొక జన్మలో నీకు నమస్కారం చెయ్యలేను... 

ఎందుకంటే ఈ జన్మలో నమస్కరిస్తున్నాను కాబట్టి నాకు మరు జన్మ లేదు.


*కాబట్టి...


ఉత్తరోత్తరా జన్మల ప్రశ్నే లేదు, కావున నా ఈ రెండు మహాపరాధాలను క్షమించి కాచుకో! అని అర్ధిస్తున్నాడు...



మన భక్తి కూడా ఇలా వుండాలి, మనమూ చేస్తున్నాము రోజూ నమస్కారం...


అదొక సాధారణ క్రియగా మారింది తప్ప త్రికరణ శుద్ధిగా చేస్తున్నామా? 


మనం త్రికరణ శుద్ధిగా నమస్కరించినప్పుడు మనము కూడా ఆ భక్తుని స్థితికి చేరుకుంటాము, కదా...!!


శివభుజంగ స్తోత్రంలో శంకరులు ఇలా అంటారు...


నేను పశువు సమానుడను, నువ్వు పశుపతివి, పశువు అయితే కాచవా అంటే నీ వాహనం నంది...


కావున నువ్వు నన్ను కాచి కాపాడాలి.


కాదు నేను పశువు కన్నా హీనుడవందువా నన్ను కాస్తేనే నీకు దరిద్రజన పోషక అన్న నామం సార్ధకమవుతుంది. 


నేను అపరాధాల చక్రవర్తిని, నన్ను కాచి నీ నామం స్థిరం చేసుకో, పోనీ పాపులను నువ్వు కాపాడవా అంటే అత్యంత హేయమైన పనులు చేసిన చంద్రుడిని నువ్వు నెత్తిన పెట్టుకున్నావు.


తన భార్యలందరినీ ఒక్కమాదిరి చూసుకుంటానని మాటిచ్చి తప్పి, స్వయంగా తన గురు పత్నినే అపహరించిన చంద్రుడు అత్యంత ఘోరమైన తప్పులు చేసిన వాడు.

అతడినే నువ్వు రక్షించ గలిగినప్పుడు నన్ను బ్రోచి కాపాడు మహేశ్వరా!’అని వేడుకుంటాడు...


మనం కూడా త్రికరణ శుద్ధిగా ఆయనకు ‘సర్వస్య శరణాగతి’ చేసి ఆయనను వేడుకుంటే తప్పక కాపాడతాడు, రక్షిస్తాడు, ఉద్ధరిస్తాడు...✍️```

. *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

                       🌷🙏🌷```


 🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏```

🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

*రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*

                     ➖▪️➖

మునగ ఆకు!”*

 


*300 వ్యాధులకు అద్భుతమైన సంజీవిని మన “మునగ ఆకు!”*

         ➖➖➖✍️


```

#మునక్కాయలు నిత్యం మనం తినే ఆహారమే. అయితే మునక్కాయలే కాకుండా ఆకులోనూ అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలున్నాయని పరిశోధనల్లో వెల్లడైంది.


#అసలు 4,5వేల ఏళ్ల నుంచే మన పూర్వీకులు మునగాకును మెడిసిన్ తయారీలో వినియోగిస్తున్నారంటే ఆ ఆకు గొప్పతనం ఇట్టే అర్థమవుతుంది.


#ఆయుర్వేదంలో 300లకుపైగా వ్యాధులను నయం చేయడానికి ఈ మునగాకును ఉపయోగిస్తారు. 


#అందుకే దీనిని సాంప్రదాయకైన మందుగానూ చెబుతుంటారు మన పెద్దలు.```


#మునగాకులో ఉన్న అద్భుతమైన అద్భుతమైన ఔషద గుణాలు:```


#మునగాకుల్లో విటమిన్స్, ఎమినో యాసిడ్స్, మినరల్స్ సమృద్ధిగా ఉంటాయి.


#క్యారెట్లు తింటే మాత్రమే వచ్చే విటమిన్ Aని పదిరెట్లు అధికంగా మునగాకు ద్వారా పొందొచ్చు.


#కళ్ల వ్యాధులకు సంబంధించిన మెడిసిన్ లో మునగాకును వాడతారు.


#పాల నుంచి లభించే క్యాల్షియం కన్న 17రెట్లు అధికంగా మునగాకు నుంచి వస్తుంది.


#పెరుగు నుంచి పొందే ప్రోటీన్లను 8రెట్లు అధికంగా మునగాకు నుంచి పొందవచ్చు.


#అరటిపండ్ల నుంచి పొందే పొటాషియం 15రెట్లు అధికంగా ఎండిన మునగాకు నుంచి పొందవచ్చు.


#మహిళలు రోజుకి 7గ్రాముల మునగాకు పొడిని 3 నెలల పాటు రెగ్యులర్ గా తీసుకుంటే 13.5శాతం బ్లడ్ షుగర్ లెవల్స్ తగ్గాయని పరిశోధనల్లో తేలింది.


#ఐదు రకాల క్యాన్సర్లకు అద్భుత ఔషదం మునగాకు. లంగ్, లివర్, ఒవేరియన్, మెలానోమా వంటి క్యాన్సర్లను నిరోధించే సత్తా ఉందని తాజా పరిశోధనల్లో తేలింది.


#యాంటీ ట్యూమర్ గానూ ఆకు వ్యవహరిస్తుంది.


#థైరాయిడ్ ను రెగ్యులేట్ చేసే న్యాచురల్ మెడిసిన్ మునగాకు.


#మునగాకులో ఉండే క్లోరోజెనిక్ యాసిడ్ ద్వారా బ్లడ్ లో షుగర్ లెవల్స్ ని కంట్రోల్ చేస్తుందట.


#మునగాకులో ఎ, సి విటమిన్లు పుష్కలంగా వున్నాయి.


#మనం డబ్బులిచ్చి కొనే ఏ ఆకుకూరల్లోనూ మునగాకు స్థాయిలో 

ఈ విటమిన్లు వుండవు.


#అలాగే కాల్షియం, పాస్పరస్, ఐరన్ కూడా మునగాకులో పుష్కలంగా వుంటాయి.```


#వందగ్రాముల మునగాకులో వుండే పోషక పదార్థాలను ఒక్కసారి పరిశీలిద్దాం:```


నీరు – 75.9 శాతం.

పిండి పదార్థాలు – 13.4 గ్రాములు.

ఫ్యాట్స్ – 17 గ్రాములు.

మాంసకృత్తులు – 6.7 గ్రాములు

కాల్షియం – 440 మిల్లీ గ్రాములు.

పాస్పరస్ – 70 మిల్లీ గ్రాములు

ఐరన్ – 7 మిల్లీ గ్రాములు.

‘సి’ విటమిన్ – 200 మిల్లీ గ్రాములు.

ఖనిజ లవణాలు – 2.3 శాతం.

పీచు పదార్థం – 0.9 మిల్లీ గ్రాములు.

ఎనర్జీ – 97 కేలరీలు..```

#ఔషధ విలువలు అద్భుతం```


#ప్రారంభ దశలో వున్న కీళ్ళ నొప్పులకు మునగాకు దివ్య ఔషధం. #మునగాకును నూరి కట్టుకడితే తగ్గిపోతాయి.

#మునగాకును నూరి లేపనంగా రాయడం, కట్టు కట్టడం ద్వారా చర్మరోగాలు, వ్రణాలు నివారణ అవుతాయి.

#మునగాకు రసాన్ని సేవించడం ద్వారా దృష్టి మాంద్యము, రేచీకటి తొలగిపోతాయి.

#మునగ ఆకులలో అమినో ఆమ్లాలు వుంటాయి. అందువల్ల మాంసకృత్తుల లోపాల వల్ల వచ్చే ఆరోగ్య సమస్యలను అధిగమించవచ్చు. 

#గర్భిణులకు, బాలింతలకు మునగాకు రసం అమృతంతో సమానం.

#మునగాకు రసాన్ని దోసకాయ రసంతో కలిసి ప్రతిరోజూ సేవిస్తే గుండె, కాలయం, మూత్రపిండాలకు సంబంధించిన సమస్యలు క్రమంగా తొలగిపోతాయి.

#మునగ రసం రక్తహీనతను నివారిస్తుంది.

#మునగాకుతో మరికొన్ని ఉపయోగాలు:

#మునగాకుల రసాన్ని పాలలో కలసి పిల్లలకు అందిస్తే వారి ఎముకలు బలంగా తయారవుతాయి. 

#గర్భిణులు, బాలింతలకు ఇస్తే వారికి అవసరం అయిన కాల్షియం, ఐరన్, విటమిన్లు పుష్కలంగా లభిస్తాయి. 

#తల్లులతోపాటు, పాలు తాగే పిల్లలు కూడా ఆరోగ్యంగా వుంటారు.

#పాలిచ్చే తల్లులకు మునగాకును కూరగా వండి పెడితే పాలు పెరుగుతాయి.

#గుప్పెడు మునగాకులను వంద మిల్లీలీటర్ల నీటిలో వేసి ఐదు నిమిషాలు ఆ నీటిని కాచి చల్లారనివ్వాలి. ఆ నీటిలో కొంచెం ఉప్పు, మిరియాలపొడి, నిమ్మరసం కలిపి తాగితే ఆస్థమా, టీబీ, దగ్గు తగ్గుతాయి.

#మునగాకు రసం ఒక చెమ్చా తీసుకుని దాన్ని గ్లాసు కొబ్బరినీళ్ళలో కలిపి, కాస్తంత తేనె కలిపి ఇస్తే విరోచనాలు తగ్గిపోతాయి.

#మునగాకు రసానికి నిమ్మరసాన్ని కలిపి ముఖానికి రాస్తే మొటిమలు, బ్లాక్ హెడ్స్ పోతాయి. 

#ముఖ్యంగా కాల్షియం లోపాన్ని ఎదుర్కొనే మహిళలకు మునగాకు వరప్రదాయిని. అలాంటివారు విరివిగా మునగాకును ఏదో ఒక రూపంగా ఉపయోగిస్తూ వుంటే వారిలోని కాల్షియం పెరుగుతుంది.```


మరి ఇన్ని మంచి లక్షణాలున్న మునగాకును నిర్లక్ష్యం చేయడం తగునా..✍️```

. *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

                       🌷🙏🌷```

 🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏```

🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

*రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*

                     ➖▪️➖

మత్స్య ద్వాదశి*

  …


                *మత్స్య ద్వాదశి*

                    ➖➖➖✍️

```

మత్స్య ద్వాదశి విష్ణువుకు ప్రీతికరమయినది. ఈ ఆచారం విష్ణువు యొక్క మొదటి అవతారం మత్స్య లేదా చేప, వీరు సత్య యుగంలో భూమిపైకి వచ్చారు. 


*మార్గశిర్ష మాసం శుక్ల పక్ష పన్నెండవ రోజున మత్స్య ద్వాదశి జరుపుకుంటారు.


పురాణాలలో 'మత్స్య అవతారం' అనేది 'మహాప్రలయం' సమయంలో కనిపించిన ఒక కొమ్ము గల చేప. విష్ణు దేవాలయాలలో ప్రత్యేక పూజలు చేస్తారు. 

ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతిలో ఉన్న 'నాగలాపురం వేద నారాయణ స్వామి ఆలయం' విష్ణువు మత్స్య అవతారమైన ఏకైక ఆలయం.```


*మత్స్య ద్వాదశి యొక్క ప్రాముఖ్యత:```


ద్వాదశి రోజు విష్ణువు యొక్క మత్స్య అవతారాన్ని ఆరాధించడం మత్స్య ద్వాదశి ని చేయడం భక్తుడికి మోక్షం లభిస్తుంది. మత్స్య భగవంతుడిని ఆరాధించడంలో అనుసరించాల్సిన ఆచారాలు, సంప్రదాయాలు మరియు ఆచారాల గురించి గ్రంథాలలో ప్రస్తావించబడలేదు.```


*మత్స్య అవతారం:*```

సత్య యుగంలో, విష్ణువును ప్రసన్నం చేసుకోవడానికి ఒక రాజు తీవ్రమైన తపస్సు చేశారు. ఒక రోజు అతను కృతమల నదిలో ఉన్నప్పుడు అతని ముడుచుకున్న చేతుల్లో ఒక చిన్న చేప కనిపించింది. అతను చిన్న చేపను తిరిగి నీటిలో వదిలి పెట్టబోయాడు, కాని పెద్ద చేపలకు భయపడుతున్నందున చేప అలా చేయవద్దని కోరింది. రాజు దానిని ఒక చిన్న కూజాలో ఉంచి అతనితో తీసుకువెళ్ళాడు. చేప ఒక కూజాకు చాలా పెద్దదిగా పెరిగింది. రాజు చేపను ఒక చెరువులో పెట్టాడు. ఇది మళ్ళీ చెరువు, నదులు, సముద్రానికి చాలా పెద్దదిగా మారింది.  


అభ్యర్థన మేరకు, చేప దాని వాస్తవ రూపాన్ని వెల్లడించింది. విష్ణువు రాజు యందు ప్రత్యక్షమై ఏడు రోజుల్లో గొప్ప వరద ప్రపంచాన్ని నాశనం చేస్తుందని చెప్పాడు. అతను అతి పెద్దదైన పడవను నిర్మించాలని మరియు అన్ని రకాల విత్తనాలతో పాటు అన్ని జీవులను తీసుకురావాలని రాజుకు సలహా ఇచ్చాడు. తన కొమ్ముకు కట్టడానికి సర్పం వాసుకిని తాడుగా ఉపయోగించాలని ఆదేశించాడు. పడవను జాగ్రత్తగా చూసుకునే ఒక కొమ్ము చేప. ఆ మత్స్యపు విష్ణువు అదృశ్యమయ్యాడు. 


ఇంతలో, ముని అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశాడు. ఒక విధిలేని రోజున, భూమిపై వర్షం కురిసింది, మరియు ఒక కొమ్ము గల చేప తిరిగి కనిపించింది. 


రాజు సర్పాన్ని మత్స్య కొమ్ముకు కట్టాడు. మత్స్యం వారిని హిమవత్ పర్వతానికి తీసుకువెళ్ళాడు. మత్స్య భగవంతుడు వేదాలు, పురాణాలు, సంహితలు మరియు శాశ్వతమైన సత్యాల జ్ఞానాన్ని రాజుకు వెల్లడించాడు.```


*మత్స్య పూజ యొక్క ప్రాముఖ్యత*

```

మత్స్య ద్వాదాశి నాడు ప్రజలు ఉదయాన్నే నిద్రలేచి, స్నానం చేసి విష్ణు ఆలయాన్ని సందర్శిస్తారు. భక్తులు చందనం అద్దుకుని, ధూపం, పండ్లు, పువ్వులతో విష్ణువును అభిషేకిస్తారు పూజిస్తారు. భక్తులు రోజంతా ఉపవాసం ఉండి విష్ణువు యొక్క ఆశీర్వచనం పొందటానికి విష్ణు సహస్రనామ మరియు మత్స్య పురాణాలను చదువుతారు. 


త్రయోదశి రోజు సూర్యోదయం వరకు ఈ ఉపవాసం ఉంటుంది.  


విష్ణువును ఆరాధించిన తరువాత భక్తులు ఉపవాసం విరమించుకుంటారు. వివాహితులు తమ భర్త మరియు బిడ్డల వైవాహిక శ్రేయస్సు కోసం ఈ రోజును పాటిస్తారు. ఆరోగ్యం, సంపద మరియు శ్రేయస్సు కోసం పురుషులు మత్స్య ద్వాదశిని పాటిస్తారు. మత్స్య ద్వాదశి రోజున భక్తులు రాత్రి మేల్కొని వేద మంత్రాలు జపిస్తారు. విరాళాలు లేదా దాతృత్వం ఇవ్వడం చాలా ప్రయోజనకరం.


మత్స్య ద్వాదశి, రాజ్య ద్వాదశి, సునామ ద్వాదశి, తారక ద్వాదశి, అపరా ద్వాదశి, శుభ ద్వాదశి, అఖండ ద్వాదశి వ్రతాలు, దశావతార వత్రం, సాధ్య వ్రతం మొదలగు వ్రతాలు ఈనాడు ఆచరిస్తారని ‘చతుర్వర్గ చింతామణి’ద్వారా తెలుస్తుంది. 


భూలోకంలో మూడుకోట్ల తీర్థాలు ఉన్నాయి. ఆ తీర్థాలన్నీ మార్గశిర శుద్ధ ద్వాదశి అరుణోదయ సమయంలో తిరుపతి కొండమీద స్వామి పుష్కరిణిలో ప్రవేశిస్తాయని పురాణాల్లో ఉంది. అందుకే ఏడుకొండల వెంకటేశ్వరస్వామి పుష్కరిణికి ఈనాడు తీర్థదినంగా పూజిస్తారు.✍️```

. *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

                       🌷🙏🌷```

 🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏```

🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

*రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*

                     ➖▪️➖

తినడానికి జీవులనట

  *2311*

*కం*

తినడానికి జీవులనట

హననము చేసెడి నరులకు హాయిగనుండన్

తనుచేసిన హింస ఫలమె

తనవారల మరణమనెట తలవరు సుజనా.?

*భావం*:-- ఓ సుజనా! తినడం కోసం జీవులను చంపేవారికి హాయిగా ఉన్నప్పటికీ తను చేసిన హింసల ఫలితంగా తనవారుకూడా హింసాత్మక మృతి నొందుచున్నారని ఎందుకు భావించలేరు?

*సందేశం*:-- మనుషులు జంతువులను హింసాత్మక ముగా చంపి తినేటప్పుడు హాయిగా నే ఉంటుంది కానీ అదే విధంగా వారికి(పిల్లలకు) కూడా జరుగుతుంది అని మాత్రం భావించరు. మనం చేసిన కర్మలే మనలకు కూడా ఫలిస్తాయని గుర్తించరు. అందుకే ఇతరులకు మంచి చేస్తే మనకు కూడా మంచే జరుగుతుంది.

*** *కొంపెల్ల శ్రీనివాస శర్మ*

నాకు యెదురు లేదు

  నాకు యెదురు లేదు నరులందు ననబోకు

నాల్గు దినము లుండు నరుడు నీవు

మంచి పంచి బతుకు మదిలోన నిలిచేవు

సకురు అప్ప రావు సత్య మిదిర!


భావం: ఓ మానవులారా! ఈ లోకంలో ఎవ్వరూ కూడా నేను చాలా బలవంతుడిననో, ధనవంతుడిననో, రాజకీయంగా, ఉద్యోగ పరంగా గొప్ప అధికార హోదా ఉందనో, మదమెక్కి, ఇతరులను హీనంగా తక్కువ చూపు చూస్తూ, కొవ్వెక్కిన మాటలాడుతూ ఉండకూడదు! ఈ భూమి మీద ఎవ్వరూ కూడా శాశ్వతంగా జీవించి ఉండిపోరు, అలాగే ఎప్పుడూ ఒకే విధంగా ఉండరు! ఒకరిని మించిన వారు ఒకరు వస్తూనే ఉంటారు, స్ధితులు, పరిస్థితులు మార్పుకు గురౌతూనే ఉంటాయి! మన డబ్బూ, పదవీ, అధికారం ఏ క్షణమైనా మన వదిలి పోవచ్చు! అలాగే ఎప్పుడు ఎవరము పోతామో ఎవరికీ తెలియదు! పోయేలోపు పదిమందితో మంచిగా ఉంటూ, మంచి పనులు చేస్తూ పోవాలి! మనం పోయాక మన కుటుంబానికి మంచి పేరుని, గౌరవాన్నీ ఇచ్చి పోవాలి! మనం మంచిగా పది మంది మనసులో నిలిచి పోవాలి! అంతే గానీ పదిమందిలో వెధవ అనిపించుకొని పోకూడదు! 


సకురు అప్పారావూ ఇది అందరూ తెలుసుకోవాల్సిన నిజం! 


ఈ ఆటవెలది పద్యాల శతక కవి: హోమియో వైద్యులు సకురు అప్పారావు గారు, 9848025870

(ఎంతటి కఠినమైన, అసాధ్యమైన వ్యాధులకైనా దేశంలో ఎంతటి మారుమూల గ్రామంలో ఉన్న వారికైనా, ఇంటి వద్దకే మందులు పంపుతూ, అనునిత్యం ఫోన్ ద్వారా టచ్ లో ఉంటూ, క్షణక్షణం సూచనలిస్తూ, అనేక మంది వ్యాధులను నివారణ చేస్తున్నవారు! అలాగే కుటుంబ సభ్యులలో ఎవరికి ఎటువంటి ఎమర్జెన్సీ మరియు ప్రాణాపాయ ఆపద కలిగినా,కరోనా లాంటి వైరస్ లు వ్యాప్తి చెందినా, రకరకాల జ్వరాలు వస్తూ, ఏడిపిస్తున్నా, ప్లేట్ లెట్స్ పడిపోవడం, ఆక్సిజన్ డౌన్ అవ్వడంతో హాస్పిటల్ ఐసీయూలో అడ్మిట్ అయ్యే పరిస్థితి తలెత్తినా, ఎవరికి వారే వైద్యం చేసుకుని, ఇంటిలోని అందరినీ ఏ హాస్పిటల్ కీ వెళ్ళే పని లేకుండా కాపాడుకోగలిగే సర్వరోగ నివారిణి లాంటి అమృతాన్ని కనిపెట్టి, "సకురు అప్పారావు గారి 1,2,3 ఫార్ములా ఫామిలీ కిట్" అనే పేరుతో ప్రజలకు అందిస్తున్నవారు!)

పెళ్ళి లో ఖర్చులు

 *పెళ్ళి లో ఖర్చులు తగ్గించడమే ప్రధాన ఉద్దేశ్యం, ఎందుకంటే పెళ్ళి వలన ఎవరూ అప్పులతో బాధపడకూడదు, అలాగే భార్యాభర్తల గొడవలు కోర్టుల దాకా వస్తున్నందు వలన, పెళ్ళి వీలైనంత తక్కువ ఖర్చుతో ముగించడమే మంచిది.*


⭐⭐⭐ కేవలం ముఖ పరిచయం ఉన్న అందరిని వేల సంఖ్యలో పిలవడం (పిలిచిన వారు ఎవరు వచ్చారో కూడా గమనించే తీరిక ఉండదు. Attend అయిన వారికి 6 నెలల తరువాత అసలు సదరు పెళ్లికి వెళ్లామని కూడా గుర్తుండదు).


⭐⭐⭐ ఎంగేజ్మెంట్ పేరుతో పెళ్ళి అంత ఆర్భాటం చేయడం. (కాబోయే వధూవరులను, పెళ్లి కాకుండానే, ఒక చోట కూర్చోపెట్టి, ఆహ్వానితులకు అక్షింతలు ఇచ్చి ఆశీర్వదించమనడం).


⭐⭐⭐ పెళ్లి కాకుండానే pre wed photo shoot అని సినిమా లెవెల్లో వింత, సామాజిక స్పృహ లేని భంగిమల్లో కాబోయే పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు photos కి pose. ఇంకా ఆ photos(కొన్ని intimate వి) కూడా పెళ్లి తంతులో భాగంగా పెద్ద TV screen పైన ప్రదర్శించడం. పనికిమాలిన మంగళ స్థానం పేరున అమ్మాయిని నడి బజారులో కూర్చోబెట్టి అందరి ముందు తల స్నానం చేయించడం ఏమిటి నీతిమాలిన సంస్కృతి. ఈ మధ్య చిన్న పిల్లలను సైతం వధూవరులుగా అలంకరించి నడి బజార్లో మంగళ స్థానాలు చేయడం, స్టేజీల పైన కూర్చోబెట్టి ఆర్భాటాలు చేసి వారికి చిన్నప్పటి నుండే పెద్దరికం కట్టబెట్టడం చూస్తుంటే ఇది ఒక వింత ఆచారంగా భావించాల్సి వస్తుంది. దేశంలో ఎక్కడలేని ఈ వింత సంస్కృతి ఈమధ్య మన తెలుగు రాష్ట్రాల్లో పెరిగిపోతున్నది. దీన్ని రాబోవు తరాలు తగ్గించుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది.


⭐⭐⭐ పెళ్లి కోసం లక్షల రూపాయలు ఖర్చు పెట్టిన డెకరేషన్ 10 గంటల్లో, ఇంకో ఫంక్షన్ ఉంటే పీకి పారేయడం.

⭐⭐⭐ Photos Natural (candid) గా, తీయకుండా photographer కోసమే పెళ్లి చేసుకున్నట్టు, వాడు చెప్పిన వింత భంగిమల్లో pose ఇచ్చి ఫోటోల పరమార్ధం లేకుండా పోయింది. (photographer bill కూడా లక్షల రూపాయలు).


⭐⭐⭐ పెళ్లి బట్టలకు కూడా లక్షల రూపాయలు ఖర్చు చేసి, జీవితంలో మళ్ళీ ఇంకో function కి వాడకుండా, డబ్బు వృధా చేయడం.


⭐⭐⭐ భోజనాల పేరుతో, సమయంతో నిమిత్తం లేకుండా, అల్పాహారం, chat, 20 రకాల స్వీట్స్, 50 రకాల వంటకాలు, 10 రకాల fruits, 5 రకాల డిసెర్ట్స్ (ఇవన్నీ జీవితంలో ఎన్నడూ తిననట్టు, ఆహుతులు, అన్ని తినే ప్రయత్నం చేయడం ఒక వింత. భోజనం ఖర్చు కూడా లక్షల రూపాయలు).


⭐⭐⭐ పెళ్లి తంతు తరువాత కిలోమీటర్ క్యూలో నిలబడి, స్టేజి ఎక్కి, మొక్కుబడిగా అక్షింతలు, వధూవరుల నెత్తిన చల్లి, వాటిని బూట్లు తొడుకున్న కాళ్లతో తొక్కి, photos కి pose ఇవ్వడం ఆ (photos జీవితంలో ఎవరికి చూసే తీరిక కూడా ఉండదు), అనే ప్రక్రియ కూడా ఆక్షేపనీయం.


⭐⭐⭐ పెళ్లి జరిపించే పంతుళ్ళు మాటలను, శ్లోకాలను పట్టించుకోకుండా, కెమెరామాన్లు, వీడియో గ్రాఫర్ల భంగిమల కోసం జరుగుతున్న తంతు ఒక చిత్రాతి విచిత్రం.


⭐⭐⭐ DJ MUSIC అనే పేరుతో, చెవులు, మెదడు భరించలేని అత్యంత భయంకరమైన శబ్దంతో, అర్థం పర్థం లేని సినిమా పాటలు.


⭐⭐⭐ కర్ణ కఠోరంగా పాడే orchestra బృందం (వీళ్లు కూడా భయంకరమైన సౌండ్ లెవెల్స్ maintain చేస్తారు).


⭐⭐⭐ ఇంకా mehendi అని ,సంగీత్ అని, bachelor పార్టీ అని , అదనపు ఈవెంట్స్.


⭐⭐⭐ మద్యంతో కూడిన విందైతే, హాజరు 110%(బందు మిత్ర సపరివారంగా అనే ఆహ్వానాన్ని సీరియస్ గా పాటిస్తారు).


⭐⭐⭐ ఒక పెగ్గు కెపాసిటీ వాడు 3 పెగ్గులు, 3 పెగ్గుల కెపాసిటీ వాడు 10 పెగ్గులు లాగేస్తారు.


⭐⭐⭐ తదనంతరం పెళ్ళికొడుకు ఇంటి వద్ద సత్యనారాయణ స్వామి వ్రతం అండ్ రిసెప్షన్ పూజ పవిత్రత మంట కలుపుతూ, మాంసాహార వంటలతో, మళ్ళీ పెళ్లి నాటి ప్రహసనం రిపీట్.


⭐⭐⭐ ఇంకా హనీమూన్ అనే కార్యక్రమం కోసం ప్యాకేజీ టూర్స్ (ఇది కూడా లక్షల్లో).


⭐⭐⭐ ఇక గిఫ్ట్స్ పేరుతో వచ్చే తాత్కాలిక వస్తువులను ఏమి చేసుకోవాలో అర్థం కాదు.


⭐⭐⭐ అందుకని పగ తీర్చుకొనేందుకు రిటర్న్ గిఫ్ట్ పేరుతో ప్లాస్టిక్ డబ్బాలు, పచ్చడి సీసాలు వగైరా ఇవ్వడం.


⭐⭐⭐ పైన చెప్పినవన్నీ మధ్యతరగతి వారు, తాహతుకి మించి, ఈ మధ్య విపరీతంగా పాటిస్తు, అప్పుల పాలవుతున్నారు.


⭐⭐⭐ ఈ అనాలోచిత విధానాలు ఒకరిని చూసి మరొకరు అనుసరిస్తూ, ఎదుటివారి ఆడంబరాలను చూసి మేము సైతం అని అప్పులు చేసి బంధువర్గాలకు మొక్కుబడిగా ఫోన్చేసి మేము పిలిచాము అని చాటింపు చేసుకొని, ఇతర ముఖ్యమైన పనుల వల్ల ఫంక్షన్ కి వెళ్ళని వారితో కక్షలు పెంచుకోవడం ఎక్కడి సంస్కృతి. అందుకే మన ఆడంబరాలకు ఇతరులను ఇబ్బంది పెట్టడం మానుకుందాం ముఖ్యమైన ఫంక్షన్లకు మాత్రమే బంధువులందరిని ఆహ్వానిద్దాం చిన్న చిన్న ఫంక్షన్లను కుటుంబంలోనే చేసుకుందాం.


⭐⭐⭐ రెండు కుటుంబాల కలయికని కొత్త బంధువులని ఆర్దికంగా కృంగదీయకండి. ఉన్నంతలో వేడుకని బాగా చేసుకోండి. వేరే వారి వేడుకలతో పోల్చుకోకండి. ఎందుకంటే దేశంలో ధనవంతులతో పోటీపడి వివాహవేడుకలో చూపించుకోకూడదు. మనకి ఉన్నది దానిలో చేసుకోవడం వలన, పిల్లలకి ఆర్థిక క్రమశిక్షణ అలవడుతుంది. 


⭐⭐⭐ ఆర్థికంగా వెనుకబడకండి. పెళ్ళి అనేది వధూవరుల తల్లిదండ్రులకి భారం అవ్వకూడదు. కొత్త దంపతులకి ఆర్థిక భరోసా ఇవ్వండి. పిల్లలు ఫుట్టడానికి హాస్పిటల్స్ కి ఖర్చులు పెట్టా ల్సిన దుస్దిలో ఉన్నాము. పిల్లలు పుట్టిన తర్వాత వారికి ఆస్తులు ఇవ్వడం, బంగారు ఇవ్వడం కోసం, పెళ్ళి ఖర్చులను ఆదాచేయండి. 

     

*సర్వ హిందూ జనాః సుఖినో భవంతు*🙏🌹🙏

పంచాంగం

  


భగవంతునికి పూజ

  *రోజూ భగవంతునికి పూజ చేసే వారు కూడా... భగవంతుడు అంటే ఏమిటి? అంటే... ఎంతో మంది సరైన సమాధానం చెప్పలేరు. కాబట్టి ఓపిక చేసుకుని... ఈ చిన్న కథను చదవండి.*


*ఓ దేశాన్ని పాలించే రాజు మనసులో... ముఖ్యంగా మూడు అర్దంకాని ప్రశ్నలు మెదడును తోలుస్తూ ఉన్నాయి.*

*అవి...*

1. *దేవుడు ఏ వైపు చూస్తు ఉంటాడు?* 

2. *దేవుడు ఎక్కడ ఉంటాడు?*

3. *దేవుడు ఏం చేస్తాడు?* 

*ఆ ప్రశ్నలకు ఎన్నోమార్లు ఎంత యోచించినా సరైన సమాధానం దొరకలేదు.*


*తన ఆస్థానంలో ఓ రోజు సమావేశమై... పండితులను, శాస్త్రకారులను, మేధావులను ఆహ్వానించాడు. తాను మూడు ప్రశ్నలు వేస్తానని, వాటికి జవాబులు చెప్పడానికి ముందుకు వచ్చి సరైన సమాధానం చెప్పిన వారికి గొప్ప బహుమతి లభిస్తుందని చెప్పాడు. సరైన సమాధానం చెప్పకపోతే కారాగారం పాలు చేస్తానని చెప్పాడు. దాంతో భయపడి ఎవరూ ముందుకు రాలేదు. ఈ విషయం దేశమంతా చాటింపబడింది.*


*ఓ కుగ్రామం నుండి పశువుల కాపరి ఒకాయన ముందుకు వచ్చాడు. రాజాస్థానం చేరుకొన్నాడు. రాజు సభలో ఎందరో మేధావులు శాస్త్ర పండితులు కూర్చొన్నారు.*


*పశువుల కాపరి, రాజుగారి మొదటి ప్రశ్నకు సమాధానం చెప్పబోయే ముందు... రాజుకో విషయం నిర్దేశం చేసాడు. ‘చెప్పేవాడు గురువు, వినేవాడు శిష్యుడు. గురువు పైన ఉండాలి, శిష్యుడు క్రింద ఉండాలి’ అని కండీషన్ పెట్టాడు.*


*దానికి రాజు అంగీకరించి సింహాసనం నుండి క్రిందికి దిగాడు. పశువుల కాపరి సింహాసనం అధిష్ఠించాడు.* 


*‘మహారాజా ఇప్పుడు అడగండి మూడు ప్రశ్నలు’ అన్నాడు పశువుల కాపరి.*


*మొదటి ప్రశ్న దేవుడు ఏ వైపు చూస్తుఉంటాడు? దీనికి జవాబు చెప్పండి అన్నాడు రాజు.*


*వెంటనే ఒక దీపాన్ని తెప్పించమన్నాడు గురువు స్థానంలో వున్న పశువుల కాపరి. దీపం తెచ్చి సభ మధ్యలో పెట్టారు.*


*మహారాజా! ఈ దీపం ఎక్కడ చూస్తుంది? నావైపా? నీవైపా? తూర్పువైపా? పశ్చిమానికా? పైనకా? క్రిందకా? ఎక్కడ చూస్తుందో చెప్పండి? అని ప్రశ్నించాడు. ‘అన్నివైపులకు చూస్తుంది’ అని జవాబిచ్చాడు రాజు.*


*ఇంత చిన్న జ్యోతి అన్నివైపులా చూడగలిగినపుడు... పరంజ్యోతి స్వరూపమైన భగవంతుడు అన్నివైపులా చూడలేడా? సమస్త జీవుల కళ్ళల్లో వెలుగుగా వున్న పరంజ్యోతి పరమాత్మే.*


*మరి ఇక రెండవ ప్రశ్న...*


*దేవుడు ఎక్కడ ఉంటాడు? అన్నాడు రాజు.*


*'సరే! ఓ చిన్న పాత్రలో పాలు తెప్పించండి’ అన్నాడు పశువుల కాపరి. పాలు తెచ్చారు. 'మహారాజా ! ఈ పాలల్లో నెయ్యి ఎక్కడ ఉందో చెప్పగలవా?’ అని అడిగాడు.*


*'పాలను బాగా మరుగబెట్టాలి. వాటిని తోడు (మజ్జిగ) కలిపి కొన్ని గంటలు కదలకుండా ఉంచాలి. పెరుగు సిద్ధం అవుతుంది. దాన్ని కవ్వంతో చిలికితే వెన్న వస్తుంది. తర్వాత తయారైన వెన్నను కాస్తే నెయ్యి తయారవుతుంది’ అన్నాడు రాజు.*


*‘సరిగ్గా చెప్పారు మహారాజా!అలాగే హృదయం అనే పాలను గురువు అనే నిప్పులపై బాగా మరిగించి, మనస్సు అనే తోడు వేసి, స్థిరంగా ఉంచితే వచ్చే సత్యం అనే పెరుగును సాధన అనే కవ్వంతో చిలికితే జ్ఞానం అనే వెన్న వస్తుంది. ఆ సాధన ‘అంతర్ముఖం’ అనే నిప్పులపై బాగా కాచినట్లయితే పరమాత్మ అనే నెయ్యి వస్తుంది’అన్నాడు కాపరి. సభలో హర్షధ్వానాలు మిన్నుముట్టాయి.*


*ఇక చివరి ప్రశ్న.*

*దేవుడు ఏం చేస్తాడు? అని.*


*నేను పశువుల కాపరిని, మీరు మహారాజు. క్రింద వున్న నన్ను సింహాసనం పైన కూర్చోబెట్టారు. పైన వున్న మిమ్మల్ని క్రిందికి దించేశారు. ఇదే పరమాత్మ లీల. సత్కర్మలు చేసే జీవులను పై జన్మల్లో ఉత్తమ జన్మగా మార్చడం, దుష్కర్మలు చేసే వాళ్ళను మరుజన్మలో క్రింది స్థాయికి పంచడమే పరమాత్మ పని’ అన్నాడు.*


*సభలో గంభీర వాతావరణం నెలకొంది. రాజు పశువుల కాపరి ముందు పాదాక్రాంతుడయ్యాడు. పశువుల కాపరి రూపంలో ఉన్న పరమాత్మ తాను వచ్చిన దిక్కుగా తిరుగు ప్రయాణం అయ్యాడు. శుభం భూయాత్!*


*మంచిని ఎక్కడ ఉన్న గ్రహిద్దాము... మంచిని నేర్చుకుందాము... మంచిని ఆచరించుదాము... మంచిని అందరికి పంచుదాము... మంచి పేరుతో మరణిద్దాము*


*┈┉┅━❀꧁హరేకృష్ణ꧂❀━┅┉┈*

          *ఆధ్యాత్మిక అన్వేషకులు*

🍁🙇🍁 🙏🕉️🙏 🍁🙇🍁

శ్రీమద్భగవద్గీత

  శ్రీమద్భగవద్గీత: పదునేడవ అధ్యాయము

శ్రద్ధాత్రయ విభాగయోగము:శ్రీ భగవానువాచ


ఓం తత్సదితి నిర్దేశో బ్రహ్మణస్త్రివిధః స్మృతః 

బ్రాహ్మణాస్తేన వేదాశ్చ యజ్ఞాశ్చ విహితాః పురా (23)


తస్మాదోమిత్యుదాహృత్య యజ్ఞదానతపఃక్రియాః 

ప్రవర్తంతే విధానోక్తాః సతతం బ్రహ్మవాదినామ్ (24)



పరబ్రహ్మకు ఓమ్ తత్ సత్ అనే మూడు పేర్లు చెప్పారు. పూర్వం దానివల్లనే బ్రాహ్మణులు, వేదాలు, యజ్ఞాలు సృష్టించబడ్డాయి. వేదవేత్తలు శాస్త్రోక్తంగాచేసే యజ్ఞాలు, దానాలు, తపస్సులను ఎప్పుడూ “ ఓమ్ ” అని చెప్పిన తరువాతే ఆరంభిస్తారు.


కృష్ణం వందే జగద్గురుమ్..🙏

ప్రాతః దీపం జ్యోతి

  🙏🪔🙏 ప్రాతః దీపం జ్యోతి 🙏🪔

                  నమోస్తుతే 


శుభం కరోతి కళ్యాణం 

            ఆరోగ్యం ధన సంపద,


శత్రు బుద్ధి వినాశాయ 

          దీప జ్యోతిర్ నమోస్తుతే ,

                                                🪔      

దీప-జ్యోతి: పరబ్రహ్మ               

           దీప జ్యోతి జనార్ధనః,


దీపో హారతి మే పాపం 

          దీప-జ్యోతిర్-నమోస్తుతే || 

                                                    🪔🙏

మనుష్యస్య వికాసః

  


మనుష్యస్య వికాసః 

అన్యేన మనుష్యేణ భవతి


మనుష్యస్య వినాశః అపి అన్యేన మనుష్యేణ భవతి 


అతః శాస్త్రం వదతి దైవో మానుషరూపేణ ఇతి 


అతః మనుష్యాన్ వయం సఙ్ఘటయామః 


మనుష్యాన్ వయం ప్రసన్నం కుర్మః 


మనుష్యాన్ వయం ధన కనక వస్తు వాహన విద్యా వైద్య ప్రదానైః ప్రసన్నం కుర్మః 


మనుష్యేభ్యః ఆహారం గృహం వస్త్రాణి విద్యాం వైద్యం చ దత్వా మనుష్యాన్ సన్తోషయామః 


యత్ ధనం యత్ ఐశ్వర్యం యత్ జ్ఞానం యా విద్యా యత్ వైద్యం యం ధర్మః మనుష్యాణాం రక్షణాయ పాలనాయ పోషణాయ వర్ధనాయ ఉపయోగాయ న భవన్తి (న ఉపయఙ్గ్తే తత్ వృథా ఏవ ఖలు


SSV SANSKRIT NEWS CHANNEL


मनुष्यस्य विकासः

अन्येन मनुष्येण भवति।


मनुष्यस्य विनाशोऽपि अन्येन मनुष्येण भवति।


अतः शास्त्रं वदति — “दैवो मानुषरूपेण” इति।


अतः मनुष्याञ् वयं सङ्घटयामः।


मनुष्याञ् वयं प्रसन्नं कुर्मः।


मनुष्याञ् वयं धन–कनक–वस्तु–वाहन–विद्या–वैद्य–प्रदानैः प्रसन्नं कुर्मः।


मनुष्येभ्यः आहारं गृहम् वस्त्राणि विद्याम् वैद्यम् च दत्वा मनुष्याञ् सन्तोषयामः।


यत् धनं यद् ऐश्वर्यं यत् ज्ञानं या विद्या यत् वैद्यम् यं धर्मः मनुष्याणां रक्षणाय पालनाय पोषणाय वर्धनाय उपयोगाय न भवन्ति—

(न उपयोग्यन्ते) तत् वृथा, वार्षल एव खलु।


SSV SANSKRIT NEWS CHANNEL


The growth of a human being

happens through another human being.


The destruction of a human being

also happens through another human being.


Therefore, the scriptures declare:

“God helps through human form.”


Therefore, we unite people.


We make people happy.


We make people happy by giving them

money, gold, goods, vehicles, education, and medical assistance.


We bring joy to people by giving them

food, shelter, clothing, education, and healthcare.


Whatever wealth, prosperity, knowledge, education, medicine, or dharma

that does not serve the protection, care, nourishment, or upliftment of human beings—

if they are not used for people—

that wealth is useless, truly wasted.


SSV SANSKRIT NEWS CHANNEL


मनुष्य का विकास

दूसरे मनुष्य के द्वारा ही होता है।


मनुष्य का विनाश भी

दूसरे मनुष्य के द्वारा ही होता है।


अतः शास्त्र कहते हैं—

“दैवः मानुषरूपेण” अर्थात् ईश्वर मानव रूप में सहायता करता है।


इसलिए हम मनुष्यों को एकत्रित करते हैं।


हम मनुष्यों को प्रसन्न करते हैं।


हम मनुष्यों को धन, सोना, वस्तुएँ, वाहन, शिक्षा और चिकित्सा प्रदान करके प्रसन्न करते हैं।


हम मनुष्यों को भोजन, घर, वस्त्र, शिक्षा और चिकित्सा देकर संतुष्ट करते हैं।


जो धन, जो ऐश्वर्य, जो ज्ञान, जो शिक्षा, जो चिकित्सा और जो धर्म

मनुष्यों की रक्षा, पालन, पोषण, उन्नति और उपयोग के लिए कार्य में नहीं आता—

(यदि उसका उपयोग मनुष्यों के लिए नहीं होता)

तो वह धन व्यर्थ है, सचमुच नष्ट ही समझना चाहिए।

హిందూ ధర్మం

  🌹హిందూ ధర్మం 🌹


7-D A Plane of All Possible Worlds With the different Start Conditions; విభిన్నమైన లోకాలు అన్నీ ఒకే సమతలంలో వివిధ సమయాలలో ప్రారంభం అవ్వడం ఈ పరిమాణం నుంచి వీక్షించవచ్చు.


5 మరియు 6 పరిమాణాల్లో ఒక సమయంలో ప్రారంభమైన లోకాల ఉనికి, వాటి స్థానాన్ని పోల్చుకునే అవకాశం ఉండగా, ఈ 7-D కి చేరగానే, ఒక సమతంలో ఉన్న విభిన్నమైన లోకాలు, వేర్వేరు సమయాల్లో ప్రారంభమై, అనేక విధాలుగా పరిణామం చెందడం ఈ Dimension లో ఉన్న వారు చూసేందుకు సాధ్యపడుతుంది. నిజానికి ఇన్ని లోకాలను, వాటిలో జరిగే విభిన్నమైన మార్పులను చూడగల సామర్ధ్యం బ్రహ్మదేవునకు ఉంది. కాబట్టి ఇక్కడే బ్రహ్మలోకం ఉండవచ్చు. మిగితా Dimensions లాగానే ఇక్కడి నుంచి కూడా తన క్రింద ఉన్న అన్నిDimensions ని చూసే అవకాశం ఇక్కడ ఉన్నవారికి ఉంటుంది.


8-D A Plane of All Possible Worlds, Each With Different Start Conditions, Each Branching Out Infinitely; విభిన్నమైన లోకాలు అన్నీ ఒకే సమతలంలో వివిధ సమయాలలో ప్రారంభం అయ్యి, వివిధ ఆకృతులలో నిరవధికంగా పెరగడం.


అంటే పాలకడలిలో శేషతల్పంపై శ్రీ మన్నారాయణుడు ఉండే Dimension ఇది. సముద్రంలో ఏర్పడే కెరటాల మీదనున్న నురగలో నిరంతర ఎన్నో బుడగలు ఉద్భవించి, లయిస్తుంటాయి. అలానే దైవసృష్టిలో అనేక బ్రహ్మాండాలు నిత్యం ఉద్భవించి, లయిస్తూ ఉంటాయని శ్రీ మద్భాగవతం మొదలైన గ్రంథాలు చెబుతున్నాయి. ఆయన నుంచి అనేకమంది బ్రహ్మలు ఉద్భవించి, లయిస్తూ ఉంటారు, ప్రతి బ్రహ్మ- ఒక బ్రహ్మాండాన్ని సృష్టి చేస్తుంటాడు. బ్రహ్మాండంలో లోకాలు ఉంటాయి. ఇవన్నీ నిత్యం గమనిస్తూ ఉంటాడు శ్రీ మన్నారాయణుడు. ఇక్కడి నుంచి చూసినప్పుడు, ఎన్నో బ్రహ్మాండాలు ఉద్భవించి, అనంతంగా వ్యాపిస్తూనే ఉంటాయి. దాన్ని ఊహించడం కూడా అసాధ్యం.


మళ్ళీ మనం ఆదినారాయణుడని అంటాము. ఆదినారాయణుడంటే పరతత్త్వము, ఆది నుంచి ఉన్నవాడు. ఆయన నిరాకారుడని చెప్తారు.



9-D All Possible Worlds, Starting With All Possible Start Conditions and Laws of Physics; విభిన్నమైన బ్రహ్మాండాలు అన్నీ అన్ని సమతలాలలో వివిధ సమయాలలో, వివిధ సాధ్యమైన ఆకృతులలో ప్రారంభం అయ్యి నిరవధికంగా పెరగడం, ఇక్కడి భౌతిక సూత్రాలు వేరుగా ఉంటాయి. దానికి ఈ 3-D ప్రపంచంలో అంటే మనుష్యలోకంలో ఉన్న భౌతిక సూత్రాలకు సంబంధం లేదు.


అంటే ఒకనాడు మహాశివలింగం ఇక్కడే, ఈ పరిమాణంలోనే ఆవిర్భవించి ఉండవచ్చు. అదే ఈ లోకంగా మారిందని లింగపురాణం మొదలైనవి చెబుతున్నాయి. ఈ పరిమాణంలో ఉండి, తన క్రిందనున్న ఇతర పరిమాణాల్లో ఉన్న లోకాలు, బ్రహ్మాండాల చరిత్రను చూడవచ్చు, పోల్చవచ్చు, నమోదు చేయవచ్చు. అంటే వేదవ్యాస మహర్షి ఈ పరిమాణానికి చేరుకుని అక్కడి నుంచి పురాణ రచన చేశారు. పురాణాల్లో చెప్పబడిన లోకాలు అసలు ఉంటాయా? అవి సాధ్యమా? మేము నమ్మాలా? అంటారు కదా, ఈ 9-Dimension కి వెళితే, అప్పుడు అర్దమవుతుంది.


మన పురాణాల్లో చెప్పబడిన అనేక అంశాలు, ఈ 3-D ప్రపంచంలోనే జరిగినవి కావు, అవి అనేక ఇతర Dimensions లో వేర్వేరు సమయాల్లో జరిగాయి. ఆ Dimensions లో ఉన్న ధర్మాలు వేరు. అక్కడి జీవుల జీవనశైలి భిన్నమైనది. వారిది మనలాంటి రక్తమాంసాలతో కూడిన దేహం కాదు. వారు ఎంతో పరిణతి చెందిన జీవులు. పురాణాల మీద విమర్శ చేసే ముందు మనకు క్వాంటం ఫిజిక్స్ అర్దమైతే బాగుంటుందేమో?! ఈ విషయం బోధపడితే, మనం ఋషులను ఏనాడు నిందించము, కనీసం ప్రశ్నించము కూడా.



10-D Infinite Possibilities – లెక్కలేనన్ని ప్రపంచాలు , ఒక నిర్దుష్టమైన ప్రణాళిక లేకుండా పెరిగి పెద్దవ్వడం.

ఇక్కడ అసాధ్యమన్నది ఏదీ లేదు. ఇక్కడకు చేరిన జీవుడు, భగవంతుని అద్భుత సృష్టిని చూసి ఆశ్చర్యపోవటం తప్ప, దాన్ని విశ్లేషించలేడు. లెక్కలేనన్ని విశ్వాలు, లెక్కలేకుండా ఉద్భవించి, వ్యాప్తి చెంది, లయించడం, అది కూడా ఒక క్రమంలో కాదు, గందరగోళంగా జరగటం చూడవచ్చు. ఇది జీవులకు మాత్రమే గందరగోళం కానీ, పరబ్రహ్మానికి కాదు.  


11D M-థియరీ ప్రకారం ఒక నిర్దుష్ట ప్రణాళిక ద్వారా లయం కూడా అవ్వడం. వాటి పూర్తి అవగాహన ఉండడం. ఇది పరబ్రహ్మం స్థాయి. జీవుడు ఇక్కడికే చేరుకుని, పరబ్రహ్మంలో లయమవుతాడు. ఇక్కడ ఎంత గురుత్వాకర్షణ శక్తి ఉంటుందంటే, ఇక్కడ ఉన్న పరబ్రహ్మ మిగితా లో ఉన్న లోకాలను, తనలోకి లాక్కునే ప్రయత్నం చేస్తాడు. వేర్వేరు వేగాలతో, వేర్వేరు కాలాల్లో ఉద్భవించి, లయించే అనేక సృష్టిలు, తెలిసో తెలియకో, దానిలోకే వెళ్ళిపోతున్నాయి. అందుకే సనాతన ధర్మంలో "ఎవరు ఏమి చేసినా, చేయకున్నా, అందరు ఒకనాడు ఆయనవద్దకు చేరుకునేవారే........ అన్నిటి యొక్క గమ్యం ఆ బ్రహ్మమే..... ప్రతి కర్మ భగవంతునిదే...... ప్రతి క్షణం భగవంతునికి చెందినదే...... మంచి వారు, చెడ్డవారు... అందరూ ఆయనలోనే కలిసిపోతారు..... రాక్షసులు, దేవతలు, ఆయన దిశగానె పయనిస్తున్నారు........" అని బోధిస్తుంది.🌹🌹🌹🙏🙏🙏🌹🌹🌹

ముఖచంద్రకళంకాభమృగనాభివిశేషకా

  🌹ముఖచంద్రకళంకాభమృగనాభివిశేషకా🌹


అష్టమీచంద్రవిభ్రాజదళికస్థలశోభితా।

ముఖచంద్రకళంకాభమృగనాభివిశేషకా। 


వశిన్యాదులు చెప్పిన స్తోత్రంలోని యీ నామం ముఖచంద్రకళంకాభమృగనాభివిశేషకా లో ఉన్న మృగం కస్తూరీ మృగం. మృగనాభం అంటే కస్తూరి. కస్తూరి పరీమళం చాలా గొప్పగా ఉంటుంది.

అసలు సిసలైన పరిమళద్రవ్యాలంటే ఎనిమిదింటిని చెబుతారు. అవి కర్పూరము, కస్తూరి, పునుగు, జవ్వాజి, అగరు, పన్నీరు, గంధము, శ్రీగంధము అనేవి.

సంస్కృతంలో మృగం అన్న మాటకు సాధారణార్థంగా జంతువు అని అర్థం ఉన్నా, విశేషంగా మృగం అంటే జింక అనే అర్థం. స్త్రీని మృగనయన అంటారు అంటే అమ్మాయి కళ్ళు జింక కళ్ళ వలె అందంగా ఉంటాయని పోల్చి చెప్పటం. అంతే కాని ఏజంతువైనా మృగం అంటారు కాబట్టి గేదెకళ్ళు కలది విగ్రహవాక్యం చెప్పకూడదు!

అందుచేత కస్తూరిమృగం అంటే కస్తూరిజింక. జింకల్లో ఒక జాతి. వాటిలోనూ మగ కస్తూరిజింక పురుషాంగానికి కొంచెం పైన ఉన్న ఒక గ్రంథి నుండి వెలువడే ఒక పరిమళభరిత స్రావం.


ఈ మృగమదం అనబడే కస్తూరి పరిమళద్రవ్యాలలోని కెల్లా గొప్పది అన్నది నిర్వివాదం. ఈ రోజుల్లో మనం సంప్రదాయికమైన పరిమళద్రవ్యాల మీద అభిరుచిని కోల్పోయాం. ఏ కంపెనీ సెంటు బాగుంటుందా అనే అలోచన మనది. కాని అవన్నీ కూడా రకరకాల రసాయనాలు కాని సహజమైనవీ నిరపాయకరమైనవీ కానే కావు.

మన కస్తూరి అపాయకరమైనది కాదు కాని అచ్చమైన కస్తూరిని వాసన చూస్తే ముక్కు వెంట నెత్తురు వచ్చే అవకాశం ఉందట! అందుకని సహజమైన కస్తూరిని కూడా సాధారణంగా కొంచెం ఇతరపదార్థాలతో కలిపి కొంచెం సున్నితం చేసే వాడుతారట.

ఈ కాలంలో కస్తూరి పేరుతో చెలామణీ అవుతున్న దానిలో ముప్పాతిక మువ్వీసం నకిలీ. అసలు కస్తూరిమృగం నుండి వచ్చిన పరిమళద్రవ్యం కానే కాదు.

కస్తూరి ఒక పరిమళద్రవ్యం అనగానే అది ఒక అలంకారంగా వాడబడే వస్తువు అని వేరే చెప్పనక్కర లేదు కదా.

మరి అమ్మ కూడా కస్తూరిని ఒక అలంకారంగా నుదుట తిలంగా ధరిస్తుంది అని ఈ నామం ముఖచంద్రకళంకాభమృగనాభివిశేషకా అనే దాని వలన తెలుస్తోంది.

మరి అలా అమ్మ పెట్టుకున్న కస్తూరీ తిలకం గురించి ప్రస్తావించగానే మనకి ఈ ప్రసిధ్ధమైన శ్లోకం గుర్తుకు రావాలి కదా. ఒకసారి చెప్పుకుందాం.


కస్తూరీతిలకం లలాటఫలకే వక్షఃస్థలే కౌస్తుభం

నాసాగ్రే నవమౌక్తికం కరతలే వేణుం కరే కంకణం

సర్వాంగే హరిచందనం చ కలయన్ కంఠే చ ముక్తావళీం

గోపస్త్రీపరివేష్టితో విజయతే గోపాలచూడామణిః


ఈ సుప్రసిధ్ధశ్లోకం లీలాశుకుడి శ్రీకృష్ణకర్ణామృతం లోనిది. ఇందులో శ్రీకృష్ణమూర్తి శోభను వర్ణిస్తున్నాడు కవి. ఆయన ముఖాన కస్తూరిని తిలకంగా ధరించి ఉన్నాడట.

దీనిని బట్టి ఒకప్పుడు స్త్రీలూ పురుషులూ కస్తూరీతిలకాలను ధరించే వారని అర్థం అవుతున్నది కదా. ఈ కస్తూరి కేవలం అలంకారసాధనమే కాదు, ఆయుర్వేదవైద్యంలో దీనికి చాలా ప్రశస్తి ఉంది. ఇది ధనధాన్యసౌభాగ్యవర్థకం అన్న ప్రతీతి కూడా ఉంది.

కస్తూరి అలంకారం కావటానికి కారణం అది సువాసనాభరితం కావటమే కాదు, ఆ సువాసన శృంగారోద్దీపనం కావటమూ ముఖ్య కారణమే. 


అమ్మ కస్తూరీ తిలకం ధరించింది కదా, ఆ తిలకం ఎలా శోభిస్తోందీ అంటే వశిన్యాదులు ఒక చక్కని ఊహ చేసి చెప్పారు

స్తీల ముఖాలను చంద్రబింబాలతో పోలుస్తాం కదా. అమ్మముఖం ఐతే చెప్పేది ఏముంది అచ్చంగా పూర్ణచంద్రబింబమే అనవలసిందేను

చంద్రుడు ఎంత అందంగా ఉన్నా ఆ చంద్రబింబంలో ఒక మచ్చ ఉంది అని అందరికీ తెలుసు. కాని చిత్రం ఏమిటంటే మచ్చ ఉన్నా అది చంద్రుడి అందానికి ఏమన్నా లోపమా అంటే కానే కాదు. ఒక్క సినిమా చంద్రుడు మాత్రమే మచ్చ లేని చంద్రుడు కాని ఆకాశం మీద చంద్రుడు మచ్చతోనే ఉంటాడు - ఐనా చాలా అందంగా

ఈ నామం ముఖచంద్రకళంకాభమృగనాభివిశేషకా లో కళంకం అనే శబ్దం ఉంది కదా. కళంకం అంటే మచ్చ. ఈ మాట అందరికీ తెలిసిందే. ఇకపోతే ముఖచంద్ర అనే పోలిక ఉంది. అంటే ముఖం అనే (పూర్ణ)చంద్రబింబం. వశిన్యాదులు కళంకాభం అన్నారు కదా, దాని అర్థం కళకం వంటిది అని.


ప్రశ్న. అమ్మ ధరించిన కస్తూరీతిలకం ఎలా ఉందీ?

జవాబు. నల్లగా ఉంది.


ప్రశ్న. కొంచెం కవిత్త్వంతో చెప్తే ఆ నలుపు ఎలా ఉందీ అంటాం?

జవాబు. అమ్మ ముఖం అనే పూర్ణచంద్రబింబంలో మచ్చలాగా ఉంద

చంద్రుడు మనః కారకుడు. చంద్రమా మనసో జాతః అని వేదం. సమస్తజీవుల సమిష్టి మనో రూపమే చంద్రుడు. అచంద్రుడు అమ్మకు ముఖం. అయన షోడశకళా యుక్తుడు.

🌹🌹🌹🙏🙏🙏🌹🌹🌹

హనుమ సన్యాసి వేషములో

 హనుమ సన్యాసి వేషములో మొదటిసారిగా రామచంద్రమూర్తి దగ్గరకు వెళ్ళారు. రామలక్ష్మణులను చూడగానే అద్భుతమైన స్తోత్రము చేసారు. ప్రప్రధమ సమావేశములో హనుమ మాటలు విని, ఆ వాగ్వైభావము చూసి 


రాముడు నా సృగ్వేదవినీతస్య నా యజుర్వేదధారిణః | నా సామవేదవిదుషః శక్యమేనం ప్రభాషితుం |


చూడు లక్ష్మణా! ఎలా మాట్లాడాడో! ఆ మాట తీరు చూడు! ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము చదువుకున్నవాడు తప్ప ఇలా మాట్లాడ లేడు. అనగా ఆయన ఉద్దేశ్యము సామవేదము శాంతిని ఇస్తుంది. యజుర్వేదము మంత్రముల చేత దేవతల యొక్క అనుగ్రహమును క్రతు రూపములో సాధించిపెడుతుంది. ఋగ్వేదము సూక్త రూపములో ఉంటుంది. ఆ మూడూ ప్రసన్నము చేసుకోవడానికి ఎలా ఉపకరణములుగా ఉంటాయో అలా ఆయన యొక్క మాట తీరు ఉన్నది. వాటిని సమగ్రముగా విచారణ చెయ్యనివాడు కార్య సాధకుడై ఇలా మాట్లాడలేడు అని ఎంతో కోపముతో ఉండి కత్తి ఎత్తిపెట్టి చంపేద్దామని పొడిచేస్తున్నవాడు కూడా ఇటువంటి

వ్యక్తి మాట్లాడితే కత్తి దింపేస్తాడు. ఎంత గొప్ప మాట? ఎటువంటి వాగ్వైభవము? ఈయనను అభినందించాలి ఆదరించాలి. హనుమ మాటల వలన రామ లక్ష్మణులకు హనుమకు సయోధ్య కుదిరింది.🙏🏻🙏🏻🙏🏻

ఆచార్య సద్బోధన*

  


               *ఆచార్య సద్బోధన*

                  ➖➖➖✍️


```

ప్రతి జీవియు ఆనందము కొరకై తహతహలాడుతున్నాడు.


దుఃఖమును పోగొట్టుకొనుటకై తీవ్రముగ అభిలషించుచున్నాడు.


బంధ విముక్తికై ఉత్కంఠను వెలిబుచ్చుతున్నాడు. మోక్షమునకై అర్రులు చాచుచున్నాడు.


కాని ఆ మోక్షము ఎట్లు లభించును? 


మోక్షమునకు ఆత్మ జ్ఞానము అవసరము. ఆత్మ జ్ఞానమునకు చిత్తశుద్ధి అవసరము. చిత్తశుద్ధికి సచ్ఛీలము అవసరము.


అట్టి సచ్ఛీలము, సచ్చరిత్ర మనుజునకు కలుగవలెను అనిన, అతడు పుణ్యకార్య తత్పరుడై, పాపవిముఖత్వము కలిగి ప్రవర్తించవలెను.


సద్గుణావలంబియై, దుర్గుణములకు లవలేశమైనను తన హృదయమున చోటీయక పాప భీతి కలిగి ప్రవర్తింపవలయును.✍️```

. *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

                       🌷🙏🌷```

 🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏```

🍀🌺🍀🌺🍀🕉️🍀🌺🍀🌺🍀

*రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*

                     ➖▪️➖

ఇలాంటి మంచి విషయాలకోసం…

*“భగవంతుని విషయాలు గ్రూప్“* లో చేర్చమని ఈక్రింది నెంబరుకి వాట్సప్ లో మాత్రమే మెసేజ్ పెట్టండి... 9440652774. లింక్ పంపుతాము. దయచేసి ఫోన్ కాల్స్ చేయవద్దు.🙏

నీతి సూక్తి*

 *నీతి సూక్తి*


*సమస్యను కూడా చిరునవ్వుతో స్వాగతించే అలవాటు చేసుకుంటే, ఎంతటి కష్టమైనా మీ ముందు తలవంచక తప్పదు*. 


*క్రాంతి కిరణాలు*


*కం. చిరునవ్వుతో సమస్యను*

*త్వరగానే తీర్చవచ్చు స్వాగతమనుచున్*

*బరువని మది తలచదెపుడు*

*పరుగుననే తీసివేయ భారము కాదే*


*పద్య కవితా శిల్పకళానిధి. మఱ్ఱిపల్లి శ్రీధరాచార్యులు మిట్టాపల్లి*

03డిసెంబర్2025🪷* *దృగ్గణిత పంచాంగం*


*卐ॐ ఓం శ్రీ 🌹గురుభ్యోనమః ॐ卐*

      🌷 *బుధవారం*🌷 

 *🪷03డిసెంబర్2025🪷*

    *దృగ్గణిత పంచాంగం* 

                   

        *స్వస్తి శ్రీ విశ్వావసు* 

        *నామ సంవత్సరం* 

*దక్షిణాయనం - హేమంత ఋతౌః*

*మార్గశిర మాసం - శుక్ల పక్షం*


*తిథి       : త్రయోదశి* ‌మ 12.25 వరకు ఉపరి *చతుర్దశి*

*వారం    : బుధవారం* (సౌమ్యవాసరే)

*నక్షత్రం   : భరణి* సా 05.59 వరకు ఉపరి *కృత్తిక*

*యోగం  : పరిఘ* సా 04.57 వరకు ఉపరి *శివ*

*కరణం   : తైతుల* మ 12.25 *గరజి* రా 10.33 ఉపరి *వణజి*


*సాధారణ శుభ సమయాలు:* 

*ఉ 08.00 - 10.00  సా 03.30 - 05.00* 

అమృత కాలం  : *మ 01.46 - 03.10*

అభిజిత్ కాలం  :  *ఈరోజు లేదు*

*వర్జ్యం             : శేషం ఉ 06.43 & రా.తె 04.27 - 05.50*

*దుర్ముహూర్తం  : ప 11.35 - 12.20*

*రాహు కాలం   : ప 11.57 - 01.21*

గుళికకాళం      : *ఉ 10.33 - 11.57*

యమగండం    : *ఉ 07.45 - 09.09*

సూర్యరాశి : *వృశ్చికం*                       

చంద్రరాశి : *మేషం/వృషభం*

సూర్యోదయం :*ఉ 06.31*

సూర్యాస్తమయం :*సా 05.41*

*ప్రయాణశూల   : ఉత్తర దిక్కుకు పనికిరాదు*


*వైదిక విషయాలు:*

ప్రాతః కాలం          :*ఉ 06.21 - 08.36*

సంగవ కాలం         :     *08.36 - 10.50*

మధ్యాహ్న కాలం    :    *10.50 - 01.05*

అపరాహ్న కాలం    : *మ 01.05 - 03.19*


*ఆబ్ధికం తిధి         : మార్గశిర శుద్ధ చతుర్దశి*

సాయంకాలం        :  *సా 03.19 - 05.33*

ప్రదోష కాలం         :  *సా 05.33 - 08.07*

రాత్రి కాలం           :*రా 08.07 - 11.32*

నిశీధి కాలం          :*రా 11.32 - 12.23*

బ్రాహ్మీ ముహూర్తం :*తె 04.39 - 05.30*

******************************

        *🌷ప్రతినిత్యం🌷*

       *_గోమాతను 🐄 పూజించండి_* 

        *_గోమాతను 🐄 సంరక్షించండి_*


*🕉️శ్రీ సరస్వతీ కవచం🔯*


             *ఓం హ్రీం*

 *సర్వపూజితాయై స్వాహా*

    *చోర్థ్వం సదాఽవతు.*


🌷 *ఓం సరస్వత్యై  నమః* 🌷


🌷🪷🌹🛕🌹🌷🪷🌷

*సర్వే జనాః సజ్జనో భవంతు !*

*సర్వే సజ్జనా స్వజనో భవంతు !!*

*సర్వే స్వజనా సుకృతో భవంతు !*

*సర్వే సుకృత జనః సుఖినో భవంతు !!*

<><><><><><><><><><><><><><>


         🌷 *సేకరణ*🌷

      🌹🌿🪷🪷🌿🌹

        *న్యాయపతి వేంకట*

       *లక్ష్మీ నరసింహా రావు*

      🌷🍃🌷🌷🍃🌷

 🌹🌷🪷🪷🪷🪷🌷🌹

వేద ఆశీర్వచనం

 *నమస్తే సదా వత్సలే మాతృ భూమే*


*కలియుగాబ్ది 5126*

*శ్రీ శాలివాహన శకం 1947 స్వస్తి శ్రీ    చాంద్రమాన  విశ్వావసు నామ సంవత్సరం దక్షిణాయనము  - హేమంత ఋతువు - మార్గశిర మాసం - శుక్ల పక్షం - త్రయోదశి - భరణి -‌‌ సౌమ్య వాసరే* (03.12.2025)


ప్రముఖ వేదపండితులు, తణుకు /తాలూకా ఇరగవరం వాస్తవ్యులు 

*బ్రహ్మశ్రీ గుళ్ళపల్లి శివశర్మ ఘనపాఠీ* *(9491391009, 9440091234)* గారి నేటి వేద ఆశీర్వచనం.





.🙏🙏 

భవదీయుడు

దశిక ప్రభాకరశాస్త్రి 

9849795167

----------------------------------------------

*పిల్లలకి బతుకుతో పాటు భారతీయత కూడా నేర్పండి*

పంచాంగం