16, సెప్టెంబర్ 2020, బుధవారం

పోలేలమ్మ వ్రతకధ

పోలేలమ్మ వ్రతకధ:- ఉజ్జయినీ మహంకాళి పట్టణమందు సోమయాజులు సోమిదేవమ్మ కలరు. ఆమెకు ఏడుగురు కుమారులు ఏడుగురు కోడండ్రు సిరిసంపత్తుతో తులతూగుచుండిరి. యేడుగురుకుమార్లు వేరుగా కాపురము చేయుచుండగా భాద్రపద మాసమందు కోడండ్రనందరిని పిలిపించి అమ్మాయి ఈ అమావాస్య పోలేలమ్మ ఆరోజున పోలేలమ్మ వ్రతము మీరందరు చెయ్యవలసిన దని ఆమె చెప్పగా కొడండ్రందరు ఈ వ్రతం ఏవిధంగా చేయ్యవలెను. మాకా సంగతి యావత్తు చెప్పవలసినదని కోరిరి.అమ్మాయి ఈ వ్రతము నేను చేసి మీ మగల ఏడుగురిని కంటిని ఈ ఐశ్వర్యము అందువల్లనే మనకు ప్రాప్తించినది కనుక ఆ దినమందు ఉదయమున లేచి ఇల్లు గడపలు పరిశుభ్ర ముగా చేసుకోని ముగ్గులు పెట్టుకొని స్నానము చేసికొని శుచిగా బియ్యమును నానబోసి పిండిదంపి కొబ్బరి కాయ ముక్కలు తరగి ఆరెద వండి కలగాయపులుసును అనగా ఏడు జాతుల ముక్కలు వేసి పులుసువండి ప్రదోషకాలమందు మహంకాళి కి పూజ గావించి ఏడుపుల్లగుమ్మడి ఆకుల లోని ఆరెద వుంచి భక్ష్యభోజ్యములు నివేదన చేసి కథ విని అక్షతలు వేసికొని ప్రసాదములు పుచ్చుకోవలెను. బహునిష్టగా నీవ్రతము విధిగా చెయ్య వలయునని చెప్పి పంపెను.. అమావాస్య నాటికి ఉదయమున సోమిదేవమ్మ ఏడుగురు కుమారుల ఇండ్లకును ఏడుమానికల బియ్యమును ఏడుకొబ్బరి కాయలును ఏడుసేర్ల బెల్లమును పంపించినది.. అత్తగారు నియమించిన ప్రకారము కోడండ్రులందరు మిక్కిలి శుచిగా ఈ వ్రతమును జరుగుచుండగా ఏడవకోడలు మాత్రము బియ్యము నానవేసి నానినవో లేదోయని కొంచెము నోటిలో వేసికొనెను.. అటుతరువాత పూజ వగైరాలు జరుపుకొనిరి.. తన పసిపిల్లలను తీసికొని కధవినవలెనని పిల్లవానిని తీసేసరికి చచ్చిపోయుండేను.. అంత హ!దైవమా!యేమి యీ గతిపెట్టితివని తల్లిదండ్రి దుఃఖపడి తలుపువేసి పిల్లవానిని భద్రపరచివచ్చి దుఃఖపడుచు ఇంటివద్దనుండిరి... ఉదయమున అత్తగారు కోడండ్ల ఇంటికి వచ్చి చూడగా అందరు కుమార్లు కోడండ్రు మహసంతోషముగా నుండిరి. కాని కడపటి కుమారుడు కోడలు మాత్రము విచారముగా నుండిరి... వారివలన సంగతి యావత్తు తెలిసికొని విచారించివెళ్ళెను.. అటులనే యేడు సంవత్సరములు భక్తిలేని పనులు చేసేసరికి యేడుగురు కుమారులు చనిపోయిరి. యేడవసంవత్సరంబున చనిపోయిన కుర్రవానిని శ్మశానమందు భద్రపరచి మన ఇల్లు ఎందుకు సంసారమెందుకని విసికి పోవుచుండగా విశేషముగా గాలి వర్షము వల్ల చీకాకుపడి ఉజ్జయినీ మహంకాళి ఆలయం చెంత నిలబడిరి.. లోపల మహంకాళి భక్తుల చేత ఇవ్వబడ్డ భక్ష్యభోజ్యములు దూతలు సహితము గా వినియెాగపరుచుచుండే సమయమున మాయుభయులు ఇట్లు చేరి వుండుటెరింగి దూతను పంపి లోపలికి తెప్పించి ఈ నడురేయుని మీరిట్లు వచ్చుట కేమికారణము అని అడుగగా వారి వర్తమానమంతయు సవిస్తరంగా మనవి చేసి కొనిరి.. అప్పుడా దేవి కనికరించి నీవు దుర్మార్గురాలవు నీవు భక్తి లేకుండా మనస్సు మెత్తనచెేసికొని కూడని పనులుచేస్తివి గనుక నీకీగతి సంభవించింది.ఆలువను నీయందు కనికరము కలిగినది కనుక యెక్కడెక్కడ యేడుగురిని పాతిపెట్టితివో యేడుగోతులు కనుపరచుమని బంగారుపడ్డల పల్లకినెక్కి దూతలు వెంటనడువ రుద్రభూమికి వెళ్లి యేడు గోతులమీద అక్షతలుచల్లి బంగారు కలశంతో జలము చల్లి వెండి బెత్తముతో నొకదెబ్బకొట్టగా యేడుగురు కొడుకులు ఆడేవాడొకడు యెగిరేవాడొకడు పాకేవాడొకడు అమ్మా ఆకలే అనే వాడొకడు, మువ్వలవాడొకడు గజ్జలవాడొకడు ఇట్లు యేడుగురు కొడుకులు సజీవులగుటజూచి తల్లితండ్రి చాలా ఆశ్చర్యమునుపొంది ఆమెను అనేకవిధముల స్తోత్రము చేసిరి.. దేవి వారిని జూచి ఇకనైనాను మహభక్తితో నీ వ్రతమును చేయమని ఆజ్ఞాపించి అంతర్ధానము పొందెను.. పిల్లలను వెంటబెట్టుకొని ఇంటికి వచ్చి పుల్లగుమ్మడి ఆకుల లోని ప్రసాదము యేడుగురుకిచ్చి పిమ్మట సశేషమును వారుభయులు తినిరి.. ఉదయమున లేచి అత్తగారు మాములు ప్రకారము యేడిండ్లకు వచ్చేటప్పటికి కడసారపు కోడలు కుమారుడు పిల్లలతో మహనందముగా నుండుట జూచి ఆశ్చర్యమునొంది జరిగిన సవిస్తరముగా వారివల్లవిని చాలా సంతోషించినది.గనుక వారు పట్టిన నోమునే నీవు పట్టినావు భక్తితప్పినా ఫలము తప్పరాదు...కధలోపమైనా వ్రతం లోపం కారాదు....

సిద్ధవిద్యా

------------:- ------------

పంచదశీ మహామంత్రము సిద్ధవిద్యామంత్రము. దానికి శోధన లేదు. సిద్ధాదిశోధన అవసరం లేకుండానే ఈ మంత్రాన్ని ఉపదేశం పొందవచ్చు.

సామాన్యంగా ఏదైనా మంత్రాన్ని తీసుకోవాలనుకున్నప్పుడు ఆ మంత్రం మనకు సిద్ధిస్తుందా లేదా అనే విషయం ముందుగా తెలుసుకోవాలి. దీనికి అర్వాణచక్రం వేసి మంత్రం తీసుకోబోయేవాడికి, మంత్రం ఏ రకంగా ఉన్నదో చెబుతారు. అర్వాణచక్రంలో మంత్రం నాలుగు రకాలుగా వస్తుంది. 1. సుసిద్ధము 2. సిద్ధము 3. సాధ్యము 4. అరిష్టము.

1. సుసిద్ధము అంటే
గత జన్మలలోనే ఈ మంత్రం సాధకుడికి సిద్ధించింది.
కాబట్టి మంత్రం తీసుకుని ఏ కొద్దిపాటి జపం చేసినా సిద్ధిస్తుంది.

2. సిద్ధము అంటే - మంత్రాన్ని గట్టిగా నియమనిష్టలతో ఉపాసనచేసినట్లైతే సిద్ధిస్తుంది.

3. సాధ్యము అంటే - చాలా శ్రమపడి ఉపాసన చేస్తే మంత్రం సిద్ధించవచ్చు. అంత తేలిక మాత్రం కాదు.

4. అరిష్టము అంటే - మంత్రాన్ని తీసుకుంటే ఉపాసకుడికి భయం వేస్తుంది. పిచ్చికలలు వస్తాయి. ఒక రకమైన ఉన్మాదానికి కూడా లోనవుతాడు. ఇటువంటి వారు ఆ మంత్రాన్ని వదిలివేసినట్లైతే ఆ బాధలు తప్పుతాయి.

అయితే పంచదశి మహామంత్రం విషయంలో ఈ రకమైనవి ఏవీ చూడవలసిన అవసరం లేదు. సిద్ధశోధన చెయ్యవలసిన అవసరం లేదు. ఇది మహామంత్రము. మహామంత్రాలను ఉపాసన చెయ్యాలి అంటే గతజన్మలో వాటితో అనుబంధం ఉండాలి. లేకపోతే వంశపారంపర్యంగా రావాలి. కాని శ్రీవిద్య సిద్ధవిద్య. దీనికి అటువంటి నియమాలు నిష్టలు అవసరం లేదు. అది సిద్ధిస్తుందా లేదా అని చూడవలసిన అవసరం కూడా లేదు. దేశంలో చాలామంది ఏరకమైన మంత్రోపాసనా లేకుండానే లలితా సహస్రం
పారాయణ చేస్తుంటారు. వారందరికీ కూడా గతజన్మలోనే పరమేశ్వరితో అనుబంధం ఉన్నదన్నమాట. లేకపోతే వారలాచెయ్యరు. ఈ రకంగా అనుబంధమున్నవారు తమ
స్నేహితులవల్లనో, ఇతరులవల్లనో పారాయణ జరిగే చోటికి వెళ్ళి క్రమేణా వారు కూడా లలితాసహస్రం పారాయణ చెయ్యటానికి అలవాటు పడతారు. వీరందరికీ గతజన్మలో పరమేశ్వరితో అనుబంధమున్నది అనే విషయం మరిచిపోకూడదు. అలా కొంతకాలం పారాయణ చేసిన తరువాత మంత్రోపదేశం కూడా తీసుకోవచ్చును. మంత్రం సిద్ధిస్తుందా లేదా అనే విషయం ఆలోచించవలసిన అవసరం లేదు. తప్పనిసరిగా సిద్ధిస్తుంది.
మంత్రోపాసన చేసినట్లైతే శ్రీవిద్యలో కొన్ని ఇబ్బందులు వస్తాయట కదా ? అని చాలా మంది అడుగుతుంటారు. మంచి గురువు దగ్గర ఉపదేశం పొంది సత్సంకల్పంతో జపం చేస్తే చెడు ఎప్పుడూ జరగదు. కాకపోతే మంత్రాన్ని ఎప్పుడూ మంచి కోసమే వాడాలి. అంతే కాని చెడు కోసం మంత్రాన్ని ఉపయోగించకూడదు. అలాంటప్పుడు దానివల్ల ఇబ్బందులు వస్తాయి. మంత్ర జపం చేసేటప్పుడు సత్సంకల్పమనేది ముఖ్యం. మనసా వాచా కర్మణా అందరి క్షేమాన్నే కోరాలి. శ్రీవిద్య మీద ఆసక్తి గలవారి కోసం ఈ
విషయం ఇక్కడ చెప్పబడింది. పుట్టుకతోనే జ్ఞానవైరాగ్యాలు కలవారు సిద్ధులు సనకసనందనాదులు, వారిచే ఉపాసించబడే విద్య కాబట్టి ఇది సిద్ధవిద్య, షట్చక్రాలలో ఆధారచక్రంలో ఉండే దేవత సిద్ధవిద్య, ఉపాసనవల్ల చిత్తశుద్ధిని, జ్ఞానాన్ని ప్రసాదించేవి సిద్ధవిద్యలు. అవి.

కాళీ తారా మహావిద్యా షోడశీ భువనేశ్వరీ
భైరవీ ఛిన్నమస్తా చ విద్యా ధూమావతీ తథా
బగళా సిద్ధవిద్యా చ మాతంగీ కమలాత్మికా
ఏతా దశమహావిద్యాః సిద్ధవిద్యాః ప్రకీర్తితాః ||

                    శ్రీమాత్రే నమః
                🌹🌹🌹🌹🌹🌹

పూజారిని పోషించే వ్యవస్థ కనుమరుగయ్యింది !*

*గుడిలో పూజారిని పోషించే వ్యవస్థ కనుమరుగయ్యింది !*
 కాదు కనుమరుగు చేశారు .
ఇది ఒక పథకం ప్రకారం జరిగింది !
.
గుడిలో పూజారికి కడుపునిండకపోతే ఆ దేవుడు చూపిన వేరే దారి వెతుక్కుంటాడుగానీ పూజారిగా ఉండడు!
.
అప్పుడు గుడి ఉండదు దేవుడిపూజలూ ఉండవు!
.
 మనం గొప్పగా చెప్పుకునే భారతీయ సంస్కృతి అసలే ఉండదు ! ...ఎందుకంటే గుడులే సంస్కారకేంద్రాలు కాబట్టి !
.
పూజారికి కానుకలు వేయవద్దు అని బోర్డులు ! బాగుంది !
.
మరి ఆయనకు జీతమెంత ఇస్తారు ఆలోచించారా ?
.
ఎక్కువలో ఎక్కువ 5000 /
ఆడబ్బుతో పెళ్ళానికి చీరలేకొంటాడా ?
పిల్లాడికి చదువులేచెప్పిస్తాడా ?
రోగంరొష్టువస్తే వైద్యమే చేయించుకుంటాడా ?
.
అసలు విషయం మరచిపోయా ఇంటి అద్దె కట్టి కడుపునింపుకొని గుడ్డలుకొనుక్కొన్న తరువాత కదా పైన చెప్పినవి !
.
గుడులు ఆదాయకేంద్రాలు కాదు అవి సంస్కారకేంద్రాలు ! అక్కడ పనిచేసేవారి జీవితం జీవనం సుఖసంతోషాలతో ఉంటేనే ! సంస్కృతి సంప్రదాయం నిలబడేది !
.
పూజారిగారికి దక్షిణ ఇవ్వండి ! వారి జీవితాలలో వెలుగు నింపండి ! అప్పుడే భారతీయసంస్కారాలు పదికాలాలు నిలబడతాయి !

🚩🚩🚩🙏🏻🚩🚩🚩

Kedar NADH




Don't know what happened next movement




సత్యం గోచరిస్తుంది

*🌸మనస్సు పావనమైనప్పుడు సత్యం గోచరిస్తుంది.*🌸
🕉️🌞🌎🏵️🌼🚩

 *మనస్సుని ఎలా పావనం చేయడం అనేది వెంటనే ఉద్భవించే సందేహం.*

 *నీరు నిర్మలంగా ఉన్నప్పుడు అందులో మనం*
 *ప్రతిభింబిస్తాం. అందులో విషం కలిపినా, పాలు కలిపినా నీరు కలుషితం అవుతాయి. బింబం అగోచరమౌతుంది. అలానే మనస్సులో మొదట చెడు తలంపులు తరిమేయడానికి మంచి తలంపులు చేయాలి. క్రమంగా మంచి తలంపులు కూడా తగ్గించాలి. అలా తగ్గించగా మనసు నిర్మాలమౌతుంది. అప్పుడు సత్యం గోచరిస్తుంది.*

 *కాలులో ముల్లు గుచ్చుకున్నప్పుడు మరో ముల్లు తో తీసివేసి రెండు ముళ్ళు పారవేస్తాం. అలానే అజ్ఞానమనే ముల్లు* *తీసివేయడానికి జ్ఞానమనే ముల్లును వాడవలసి ఉంటుంది. అజ్ఞానం పోగానే జ్ఞానాన్ని విసిరివేయాలి. అంటూ శ్రీరామకృష్ణులు విపులీకరించారు.*

 *ఈ రీతినే మనస్సు నిశితంగా గమనించే ఎవరికైనా ఒకవిషయం స్పష్టమౌతుంది. మనస్సు ఒక్కొక్క భాగము ఒక్కొక్క పనిని నేర్పడానికి తహతహలాడడం* *గ్రహించవచ్చు. ఒక రథానికి పూన్చిన గుఱ్ఱాలు ప్రతిఒక్కటీ ఒకొక్క దిశలో పోతుంటే రథికుడు గతి ఏమౌతుంది?*

 *సాధన లేక పరివిధాల పోయే మనస్సు గల మనిషి గతీ అంతే.. అతడు దేనిని సక్రమంగా చేయలేడు. బాహ్య వ్యవహారాలనే సక్రమంగా చేయలేని అతడు ఆంతరంగిక జీవితం గురించి ఆలోచన కూడా చేయలేడు* .

 *ఏకాగ్రమైన మనస్సే పావన మనస్సుగా విరాజిల్లుతుంది.*

  🕉️🌞🌎🏵️🌼🚩

Great man














ఆడదాని జీవితము

.ఆడదాని జీవితము అంతులేని బాధలే ఆ బాధలకు అంతే లేదులే
తల్లితండ్రుల నడుమ గారాబంగా పెరిగిన తల్లి,
చదువులలో ఆ పిల్ల సరస్వతి కావచ్చు,
పెళ్లి అయిన తరువాత మొగుడు
ఎట్లా వస్తాడో,
వాడు శ్రీ రామ చంద్రుడైతే జీవితము ఆనందమే,
అదే ఒకరికి ఇద్దరితో సరసాలాడే సోగ్గాడైతే ఎవరికి చెప్పుకోలేక నలిగేను ఆ వనిత,
పిల్లలు చక్కగా చెప్పిన మాట వింటే ను కౌసల్య లాతాను మురిసేను,
అత్తమామలు ఏమన్నప్పటికి చిరు
నవ్వుతో భరించేను భూదేవిలా,
వందనాలమ్మా ఓ సహనం వున్న ప్రతి స్త్రీ కి సహనమూర్తుల వల్లే
ఈ వర్షాలైనా కురుస్తున్నాయి
వందనాలు........

సర్వేజనా సుఖినోభవంతు
శ్రీమతి జొన్నలగడ్డ జ్యోతి

8886240088

సనత్కుమారుని బోధలు*

*భాగవతము*
*శ్రీగురుభ్యోనమః*
🕉🌞🌎🌙🌟🚩
*
*ॐॐॐॐॐॐॐॐॐॐ*

*మనలో దయ లేకపోతే పరిపూర్ణముగా 'కలి' ఆవహిస్తాడు. కలియుగములో ధర్మము ఒక పాదము. మూడు పాదములు అధర్మము. ఆ ఒక్క పాద ధర్మమే దయ.*


*స్థితిగతులలో, జ్ఞానములో, ప్రజ్ఞలో తక్కువ స్థితి వాళ్ళుంటారు. వారి యందు దయ, ఆదరణ ఉండాలి. చిన్నవారిని ఆదరణగా చూసుకునే పెద్దవారియందు భగవంతుని ఆశీర్వాదముంటుంది. మన వలన ఎవరికీ (చెట్టు, జంతువు ఏదైనా) అపకారము జరగకూడదు అనేది దయకు ప్రధానమైన సూత్రము.*

🕉🌞🌎🌙🌟🚩

*ఆచార్య సద్భోదన*
*ॐॐॐॐॐॐॐॐॐॐ*

*మనలోని "నేను" ని తొలగిస్తే గానీ భగవంతుని పొందలేం. విచారణ ద్వారా మనలోని స్వార్థాన్ని పోగొట్టుకోగలమని భావిస్తున్నారా? కానీ దానిని ప్రేమ ద్వారా మాత్రమే తుడిచి వేయగలం. మనకు మనం అనాలోచితంగా, నిరపేక్షంగా ఉన్నత కేంద్రం పై దృష్టి నిలప గలిగితే మహోన్నత శక్తి మన ద్వారా పని గావిస్తూ గొప్ప కార్యాలను సాధింపజేస్తుంది. ఇది లెక్కలు కట్టే గుణం ద్వారా సాధించబడదు. నిష్కామ ప్రేమ అనే గొప్ప నిధి మానవునిలో దాగి ఉంది. దాని ద్వారా సర్వస్వాన్ని అర్పించగలం, తిరిగి సమస్తాన్ని చేజిక్కించుకోగలం. అయితే ముందుగా స్వార్థాన్ని త్యజించ గలగాలి.*

*"సర్వేజనా స్సుఖినోభవంతు.-*

*సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

🕉🌞🌎🌙🌟🚩

అద్దాల గది.

ప్రదీప్ తన గురువుగారి దగ్గరకు వెళ్ళాడు.
“గురువుగారూ ! నేను ఈ మధ్య ఒక విషయం గమనించానండీ ! నా దగ్గర పనిచేసే వాళ్ళూ, ఇంట్లో పిల్లలూ, భార్యా ఒక్కరేమిటి ఈ ప్రపంచంలో అందరూ స్వార్ధపరులైపోయారండీ ! ఒక్కరూ నిజాయతీగా ఉండడం లేదు” అన్నాడు.

గురువుగారు చిరునవ్వు నవ్వి ఒక కధ చెప్పారు .......

“ఒక చిన్న ఊరు ఉంది. ఆ ఊరిలో ఒక పెద్ద భవంతి ఉంది. అందులో ఒక గదిలో 1000 అద్దాలు ఉన్నాయి.
ఒక చిన్న పాప ఆ గదిలోకి వెళ్ళేది. ఆమెకు ఆ గదిలో తనలాగే ఉన్న అనేక మంది పిల్లలు కనబడ్డారు. వాళ్ళతో ఆడుకుంటూ తనను తాను మరిచిపోయేది. ఆమెకు అది ఒక ఆనందదాయకమైన నిత్యకృత్యం అయ్యింది.
ఆమె అనుకునేది ఈ ప్రపంచంలో ఆ గది అత్యంత ఆనందకరమైన ప్రదేశం అని.

ఆ గదికి ఒక రోజు ఇంకొక వ్యక్తి వెళ్ళాడు. అతడు చాలా విచారంగా, కోపంగా, డిప్రెషన్ తో ఉన్నాడు. అతడికి ఆ గదిలోకి వెళ్ళగానే అదే భావాలతో ఉన్న అనేక మంది కనబడ్డారు. వాళ్ళ ముఖాలు కోపంగా కనిపిస్తున్నాయి అతడికి.
అతడికి ఆ ప్రతిబింబాలను చూడగానే భయం వేసింది. చెయ్యి ఎత్తి కొట్టాలి అనుకున్నాడు. అప్రయత్నంగా చెయ్యి పైకి లేచింది. చుట్టూ 1000 చేతులు తన మీదకు లేచాయి. భయం వేసింది.
అతడు అనుకున్నాడు “ఈ ప్రపంచం లో అత్యంత భయంకరమైన ప్రదేశం ఇది” అని.

బాబూ ! ప్రదీప్ ! ఈ ప్రపంచం కూడా అలాగే అద్దాల గది.
నువ్వు ఈ ప్రపంచాన్ని
ఏ భావంతో చూస్తే అలాగే కనిపిస్తుంది.

నువ్వు నవ్వుతూ చూస్తే ప్రపంచం నీకు నవ్వునే చూపిస్తుంది.

నువ్వు ద్వేషంతో చూస్తే - నీకు ప్రపంచం ద్వేషాన్నే చూపిస్తుంది

నువ్వు ప్రేమను పంచు – ప్రపంచం నీకు ప్రేమను ఇస్తుంది.

*ఈ ప్రపంచం స్వర్గం - నువ్వు దేనిని ఇస్తావో అదే తిరిగి పొందుతావు*

💐🙏
*మృత్తికా ప్రసాదం*

మృత్తికా ప్రసాదం అంటే దేవాలయంల్లో ప్రసాదరూపంగా మట్టిని ఇస్తారు .దీన్ని వెంటే మీకు ఆశ్చర్యం కలుగుతుంది. అన్ని దేవాలయాల్లో ప్రసాదంగా భక్తులకు విభూది, కుంకుమ, చందనం తదితరాలను ఇస్తే నుదిటికి పెట్టుకోవచ్చు.

ఒక వేళా పండ్లు లేదా తినే పదార్ద్దాన్ని ఇస్తే తినవచ్చు. అయితే ప్రసాద రూపంగా వచ్చే మన్ను ప్రసాదాన్ని తినేoదుకు అవకాశం లేకుండా ఉంటుంది. అలా అని దాన్ని పడేసేందుకు మనస్సు ఒప్పుకోదు. అటువంటి సందర్భంలో ఎం చేయాలో మనస్సుకు తోచదు. మృత్తికా ప్రసాదంతో మనకు ప్రయోజనం ఏమ్మిటి. ఆ ప్రసాదాలను ఎం చేయాలి. ఇక్కడ చూద్దాం

మీరు ఎప్పుడైనా కుక్కే సుబ్రమణ్య దేవాలయానికి వెళ్ళితే అక్కడి అది సుబ్రమణ్య దేవాలయంలో భక్తులకు వల్మిక మృత్తికా అంటే పుట్ట మన్ను ప్రసాదరూపంలో అందిస్తారు.

ఉడిపి సమీపంలో ఉన్న నాగబనగహళ్లి అంటే శ్రీ సుబ్రమణ్య దేవాలయంలో కూడా మీకు పుట్ట మన్నును ప్రసాదరూపంలో ఇస్తారు. ఈ ప్రసాదాలను ఏమి చేయాలో యోచించేoతలోనే చేసే పనులతో ఈ విషయాన్నీ మీరు మరచి పోతారు.

మృత్తికా ప్రసాద వివరాలు.

01. మృత్తికా ప్రసాదాన్ని ఎవరు ధరిస్తారో వారికీ నాగుల భయం ఉండదు. నాగ దేవతల అనుగ్రహం ఉంటుంది.

02. ఎవరైతే పాములను చూసి చాలా భయపడతారో, ఎవరిఅతే కలలో పాములు ఎక్కువుగా కనబడుతుంటయో అటువంటి వారు మృత్తికా ప్రసాదాన్ని ధరిస్తే సర్పాల భీతి తొలగిపోతుంది.

03. ఆడ పిల్లలు ఎవరైతే ఎంత మంది పెళ్లి కొడుకులు వచ్చిన వివాహానికి ఒప్పుకోరో అటువంటి ఆడ పిల్లలు లేదా అబ్బాయులు పెళ్లి చూపులకు వెళ్ళే సమయంలో శ్రీ సుబ్రమన్యస్వామిని ధ్యానించి ఒక చిటిక మృత్తికాను మరో చిటిక పసుపును స్తానంచేసి సమయంలో వేడినీరు కాచే పాత్రలో వేసి తరువాత స్తానం చేయాలి. తరువాత శుబ్రమైన వస్త్రాన్ని కట్టుకొని దేవునికి నేతి దీపాన్ని వెలిగించి ప్రాద్దన చేస్తే వివాహం త్వరగా అవుతుంది.

ఎం.ఎస్.సుబ్బులక్ష్మి గారు గానం చేయాలని

ఐక్యరాజ్య సమితి 50 వ వార్షికోత్సవ సందర్భంగా  శ్రీమతి ఎం.ఎస్.సుబ్బులక్ష్మి గారు
గానం చేయాలని  ఆమెను ప్రత్యేక అథితి  గా ఆహ్వానించినారు.
వెంటనే  కంచి పరమాచార్యుల వారికి విషయం తెలిపి
వారి ఆశీస్సులు పొందడానికి  స్వామిని దర్శించారు.
కంచి పరమాచార్య జగద్గురు చంద్రశేఖర సరస్వతి
గారు ఆశీర్వదిస్తూ,  వెంటనే  సంస్కృతంలో ‘మైత్రీమ్‌ భజతా’ అనే భక్తి గీతాన్ని రచించి
ఆ గీతాన్ని  పాడమన్నారు.
మైత్రీం భజత, అఖిల హృత్ జైత్రీం
ఆత్మవదేవ పరాన్నపి పశ్యత
యుద్ధం త్యజత, స్ఫర్ధాం త్యజత
త్యజత పరేషు అక్రమాక్రమణం!!
జననీ పృథివీ కామదుఘాస్తే
జనకో దేవః సకల దయాళుః
'దామ్యత, దత్త, దయధ్వం' జనతాః
శ్రేయో భూయాత్ సకల జనానాం!!

భావం
"అందరి హృదయాలనీ జయించే ’మైత్రి’ని మనం స్వీకరించాలి. ఇతరుల్ని ’మన’లాగే చూడాలి.
యుద్ధాన్నీ, స్పర్థనీ, అక్రమమైన ఆక్రమణలని విడనాడాలి. అన్ని కోరికలూ తీర్చే ఈ భూమి మన తల్లి. సర్వేశ్వరుడు, దయామయుడు భగవంతుడే మన తండ్రి.
దామ్యత -నిగ్రహణ కావాలి.
దత్త’-అవసరంలో ఉన్నవారిని ఆదుకొనేలా సహాయాన్ని అందించాలి.
’దయధ్వం- సానుభూతితో కూడిన సహకారభావమే ’దయ’, దానిని చూపించాలి
ఈమూడు ’ద’కారాలు కావాలి.
సకల జనములకు శ్రేయస్సు కలగాలి".
ఇంకో విషమేమంటే
ప్రముఖ అమెరికన్ రచయిత TS ఇలియట్
తన కావ్యం "waste land" లో
What the thunder said అనే పద్యం లో కూడా స్వామి చెప్పిన పై మూడు విషయాలనే చర్చించారు
పద్యం చివరలో ఓం శాంతి ఓం శాంతి ఓం శాంతి
అని ముగించారు.

**వ్యతిరేక దృక్పథం ఉన్న వారు**



*మనం పనిచేసే వాతావరణం లో అనేక మనస్తత్వాలున్న అనేకమంది పనిచేస్తుంటారు. పైకి అంతా నవ్వుతూ ఆనందంగా కనబడుతుంటారు కానీ అంతర్గతంగా రకరకాలుగా ఉంటారు.అందులో సానుకూల దృక్పథం ఉన్నవారితో కలిసి పనిచేయడం ఎంత ఆనందమో వ్యతిరేక దృక్పథం ఉన్న వాళ్ళతో సర్దుకు పోవడం అంత సులభం కాదు. వీరందరితో సర్దుకుపోతూ పనిచేయడం అంత సుళువైన విషయం కాదు. ముందుగ విభిన్న రకాల వ్యతిరేక దృక్పథం ఉన్న మనుష్యులను ముందుగా అర్ధం చేసుకుందాం.*

🙏🙏🙏🙏🙏🙏🙏 *1.COMPLAINERS( ఫిర్యాది చేసె వారు*):
---------------------------------------- *వీరు తరుచూ అన్ని విషయాల పట్ల, అందరివ్యక్తులపై తీవ్ర అసంతృప్తితో ఉండి వారిలోని లోపాలను నిత్యం కనబడే ప్రతీవారికి ఫిర్యాదు చేస్తుంటారు. కోడిగుడ్డు పై వెంట్రుకులుతీసే పనిలో నిత్యం ఆనంద పడుతుంటారు.*

*2, BACKSTABBERS* *(వెన్నుపోటు పోడిచె వారు )*
---------------------------------------- *వీరు మన ఎదుట చాలా మంచిగా నటిస్తూ ఉంటారు కాని సమయం చూసి మన అంచనాకు ఏ మాత్రం అందకుండా దొంగదెబ్బ తీస్తారు.వీరి వినమ్రత, నక్క వినయాలు చూసి వీరిపై పూర్తిగా ఆధారపడ్డామా అడ్డంగా దొరికిపోతాం.*

*3.CONTROLLERS*: *(రిమోటర్స్)*:
------------------------------------ *మన స్వంత విషయాల్లో గాని ఇతర విషయాల్లో గాని అధికంగా జోక్యం చేసుకుంటూ మనపై ఆధిక్యం చూపించాలని ప్రయత్నిస్తూ ఉంటారు.* *అందరూ తమ నియంత్రణలో ఉండాలనే భ్రమల్లో బ్రతుకుతూ ఉంటారు.*

*4.CLAMS* : *(దాగుడుమూత చేసె వారు )*
---------------------------------------- *వీరు ప్రతీ పని చాలా రహస్యంగా చేస్తుంటారు. తమ విషయలు ఎవరితో పంచుకోవడం గాని నలుగురికి చెప్పడం గాని ఎప్పుడు చేయరు. ఆఖరికి వాళ్ళ అబ్బాయి పెళ్ళి నిర్ణయించబడిన విషయం పక్కింటివారికి కార్డు ఇచ్చినంతవరకు కూడా తెలియనీయరు.*

*5.SLUFFERS* *(పనిదొంగ వారు )* *----------------------------వీరు ఏ మాత్రం అనుకున్న సమయనికి లేదా వస్తామన్న సమయానికి ఎప్పుడూ రారు.పని చేయాల్సివస్తే ఇలా కనబడి అలా మాయమైపోతారు. పనిపూర్తయ్యాక తప్పనిసరిగా కనబడతారు. వీరిని నమ్ముకొని ఏ పని మొదలెట్టినా పనంతా మనం చేసుకోవలసి వస్తుంది లేదా అనుకున్న పని వీరి మూలంగా వాయిదా పడే పరిస్థితి తలెత్తుతుంది.*

*6. GOSSIPERS :( పుకారు చేసె వారు)*
*----------------------------వీరికి లేనిపోని, పనికిమాలిన అనవసర కబుర్లతో కాలక్షేపం చేయడమంటే వీరికి చాలా ఇష్టం.నిత్యం ఎవరిగురించో గాలికబుర్లు ప్రచారం చేస్తుంటారు. ఎవరినైనా ఎత్తెయ్యాలన్నా, ముంచెయ్యాలన్నా వీరికి క్షణంలో పని.*

*7.WALKING WOUNDED: ( క్షతగాత్రులు) :*
*---------------------------జీవితంలో అనేక విషయాల్లో ఎదురుదెబ్బలు తినడం వలన ప్రపంచంలోని సమస్యలన్నీ వీరికే ఉన్నట్టు తలకు వేలాడేసుకుంటూ తిరిగి పనిచేస్తుంటారు. తాము ఎన్ని బాధల్లో ఉన్నప్పటికీ ఒక్కరే పనిభారం తమపై వేసుకొని ఒకరితో సంబంధం లేకుండా పనిచేస్తుంటారు.*

*8.NEGATIVES*: *(రంధ్రాన్వేషకులు*) -----------------------------వీరు ప్రతీ విషయంలో నెగటివ్ ఏముందో దానిని వెతకడానికి ప్రయత్నిస్తుంటారు. నిరాశవాదంతో తెగ నలిగిపోతూ ఎవడూ సుఖంగా లేకుండా అందరిలో గాలి తీస్తుంటారు.*

*9.BROWN NOSERS* *(చంచాలు )*
---------------------------------------- *ఎలాంటివారినైనా పొగడ్తలతో తెగ పొగిడి తమ పని కాకా పట్టి చేయించుకుంటుంటారు.పనిపూర్తి అయ్యెంత వరకు తెగ పాలిష్ చేస్తుంటారు.*

*10.SNIPPERS ( దొంగదెబ్బవారు )*
---------------------------------------
*పైకి మంచిగా కనబడినా చాటుగా గోతులు తెగ తీస్తుంటారు. ఎటువంటి పరిస్థితుల్లో ఎవరికీ దొరకరు. అకస్మాత్తుగా దాడిచేయడం లో సిద్ధహస్తులు.*

*11.WHINERS ( ఏడుపుగొట్టు వారు) :*
---------------------------------------- *ఎప్పుడు ఇతరుల ఉన్నతిని , విజయాలను చూసి ఏడిచేవాళ్ళు. అందరూ బాగున్నారు కాని తాము మాత్రమె ఎదగాలేకపోతున్నాం అంటూ తెగ బాధపడుతుంటారు. ఎపుడు ఇతరుల పై అసూయ తొ ఉంటూ ఉండేవాళ్ళు.*

*12. EXPLODERS (పటాష్ వారు)*
*---------------------------వీరికి వ్యతిరేకంగా ఏమి జరిగినా వీరు అనుకున్నట్టు వీరికి ఏ మాత్రం అనుకూలంగా జరగకపోయినా పటాష్ లా ఫట్ మని బద్దలై బీభత్సం సృష్టిస్తారు. వీరితో పెట్టుకోవడం చాలా ప్రమాదం అని అందరూ అనుకునేలా నోరు వేసుకొని మీద పడుతుంటారు.*

*13. PATRONIZERS* *(వకాలత్ వారు*)
*---------------------------వీరు ఎప్పుడు తమ గురించి కాకుండా ఇతరుల గురించి వకాలత్ తీసుకొని మాట్లాడుతుంటారు.వారికి సంబంధం లేకపోయినా ఇతరుల గురించి వీరు తెగ ఫీలైపోతుంటారు.*

-- పైన పేర్కొన్న మనస్తత్వంతో ఉన్న వారిని ఎలా సంస్కరించాలనే ఆలోచన వద్దు.
వీరినుండి మనం మనల్ని ఎలా కాపాడుకోవాలో ఆలోచించడం ముద్దు.

*దారిలో ముళ్ళుంటే వాటిని ఏరుతూ కూర్చుంటామా, కాళ్ళకు మంచి చెప్పులు వేసుకుంటే సరిపోతుంది కదా...*
                 *Wish You All The Best.*

సదాచారములు--సంస్కారాలు


1.అబద్ధము చెప్పకూడదు.
2.అబద్ధము సాక్ష్యం చెప్పకూడదు.
3.చెడు మాటలు పలుకవద్దు.
4.తిట్టగూడదు.
5.భగవంతునిపై నమ్మకం ఉంచు.
6.దేవుళ్ళును,దేవతలను పూజించు.
7.క్రూరముగా ప్రవర్తించ కూడదు.
8.మాంసాహారము వీలైనంత వరకు తినకూడదు.
9.మద్యము సేవించకూడదు.
10.శుభ్రమైన స్వచ్ఛమైన దుస్తులు ధరించాలి.
11.ముక్కు,నోరు, దంతాలను శుభ్రము చేసుకో
12.ఉమ్మడికుటుంబములో అలవాటు చేసుకోవాలి.
13.అత్తగారి ఇంట్లో సఖ్యముగా ఉండాలి.
14.తల్లివలె---భార్యను చూడటము.
15.కుటుంబపోషణ చూడటము.
16. పెద్ద వారిని గౌరవించటము నేర్చుకోవాలి.
17.వ్రుద్దులను,వితంతువు లను గౌరవించటము నేర్చుకోవాలి.
18.వికలాంగులకు సేవచేయాలి.
19.పశుపక్చ్యాదులకు ఆహారం, నీరు అందించాలి..

విష కుచముల

 ఏ మహనీయతాగరిమ నెవ్వరు నన్ను ననుగ్రహింతురో?

ఏ మధురాక్షరామృతమునెవ్విధి నాకు లభింప నిత్తురో

ఏ మది నున్న దివ్య పరమేశ్వరు సత్కృప నన్ను బ్రోచునో

ఆ మహితాత్మతత్వవిదు లందరికిన్ నతులందఁజేసెదన్.


 విష కుచముల దరిజేరుచు
మృషలాడుచు పాలనిచ్చు మృగమతి చంపున్
మిష దైత్యుల వధకును అని౼
మిష, రక్షకును నాందిపల్కు మేటివి కృష్ణా!

బృందావన చారణ మా
నందమ్ముగ సల్పుచుండు నందాత్మజ నీ
చిందుల పరమార్థము తో
చం దమమతి భక్తిభావ చందనమున్నే!

కాళీయుని పడగలపై
క్రాలం బాదాలముద్ర గావించిన నీ
లీలే గతి భావింతుము
క్రాలుం గారుణ్యవార్థి గాచెడు కృష్ణా!

యదుకుల బాలుండనగా
పదిలముగానుండి గోపబాలుర మధ్యన్
పదునాల్గు లోకపాళిని
సదమలకృప బ్రోచు సాధుసన్నుత కృష్ణా!

రాయప్రోలు సీతారామశర్మ భీమవరం.

శ్రీ జనార్దనాష్టకం


1) నమో భగవతే జనార్దనాయ
   జన్మమృత్యుజరావ్యాధిరహితస్థితిప్రదాయకాయ
   భక్తమనోభీష్టసిద్ధిప్రదాయకకమలహస్తాయ
   ఋగ్యజుస్సామాథర్వతత్త్వస్వరూపవిగ్రహాయ ||


2) నమో భగవతే జనార్దనాయ
   అనంతభువనబ్రహ్మాండవ్యాప్తతేజోమయాయ
   వ్యాసాంబరీషశుకశౌనకభక్తవరేణ్యపూజితాయ
   నరకాసురాదిదానవసంహరభక్తజనరక్షకాయ ||



3) నమో భగవతే జనార్దనాయ
   హయగ్రీవాసురసంహరశ్రీహయగ్రీవదేవాయ
   పరిపూర్ణజ్ఞానఫలప్రదవాగీశ్వరేశ్వరాయ
   సరససంభాషణాచాతుర్యజనరంజకాయ ||

4) నమో భగవతే జనార్దనాయ
   సుతామ్రకమలసనాదిదేవసంఘపూజితాయ
   సమీచీనఆలోచనపరంపరాప్రదదైవతాయ
   శిశుపాలదంతవక్త్రసంహరవీర్యవిక్రమాయ ||






5) నమో భగవతే జనార్దనాయ
   రమామేదినీహృదయాంబుజవాసనళినేక్షణాయ 
   సప్తద్వారజయవిజయపార్షగణాదిపరివేష్ఠితవైకుంఠవాసాయ 
   శతకృతుశచీదేవిపూజితపల్లవాంఘ్రియుగళాయ ||

6) నమో భగవతే జనార్దనాయ
   ధర్మానుష్ఠానతత్పరధర్మమార్గనిర్దేశకాయ
   ధర్మార్థకామమోక్షఫలప్రదాయకవేదపురుషాయ
   భూరిసంభావనాదక్షిణస్వీకృతబ్రాహ్మణస్వరూపాయ ||






7) నమో భగవతే జనార్దనాయ
   కుంభసంభవమతంగమహర్షిగణసంస్తుతాయ
   అష్టదిక్పాలకనవగ్రహాధిపత్యబ్రహ్మాండనాయకాయ
   ప్రదోషసమయమృదంగవాద్యవాదనావినోదాయ ||

8) నమో భగవతే జనార్దనాయ
   అన్నమార్యరామదాసత్యాగరాజాదిభక్తాగ్రగణ్యసంస్తుతాయ
   తాపత్రయహరసర్వరక్షాకరకుసుమకోమలకరాబ్జాయ
   నిందాస్తుత్యాతీతబ్రహ్మానందసరోవరచరరాజహంసాయ ||
 
         సర్వం శ్రీజనార్దనదివ్యచరణారవిందార్పణమస్తు

గాయత్రం ఛందం

గాయత్రం ఛందం పరమాత్మం స్వరూపం సాయుజ్యం వినియోగం ... ఇది ఒకటి ... రెండవది ...సర్వవేదేషుయత్పుణ్యం సర్వతీర్థేషుయత్ఫలం తత్ఫలంపురుషమాప్నోతి స్తుత్వాదేవం జనార్దనః ... జనార్దనుని స్తుతిస్తే సర్వ వేదాలు చదివిన ఫలం సర్వ తీర్థాలలో స్నానమాడిన ఫలం అని చెపుతున్నారు.. అయితే స్తుత్వాదేవం అన్నారు.. 
ఆయనను ఎలా స్తుతించాలి ... ఇది ఒక ప్రశ్న..అయితే దీనికి మనకు సమాధానం ఒక ధ్యానశ్లోకంలో కనిపిస్తుంది..
ధ్యేయస్సదాసవితృమండలమధ్యవర్తీ నారాయణసరసిజాసనసన్నివిష్టః
కేయూరవాన్మకరకుండలవాఙ్కిరీటీ హారిహిరణ్మయవపుర్ధృతశంఖచక్రః
 సవితృమండల అంటే సూర్యమండల .. మధ్యవర్తి అంటే మధ్యలో ఉన్న సూర్యనారాయణమూర్తులవారికి అర్ఘ్యం ఇవ్వడం వల్ల, భానుమండలమధ్యస్థ అయిన శ్రీ లలితా అమ్మవారికి కూ డా అర్ఘ్యం ఇచ్చినట్లు అవుతుంది .. (గాయత్రి స్వరూపంలో ఉన్న లలితా అమ్మవారు.... ఆవిడ ప్రొద్దున గాయత్రి, మధ్యాహ్నం సావిత్రి, సాయంత్రం సరస్వతి స్వరూపంలో గోచరిస్తారు) అర్ఘ్యం ఇవ్వడంవల్ల మంచి మేధాశక్తి ఒనగూడుతుంది .... ఇదే కాకుండా మన బ్రాహ్మణులకు గౌతమ ఋషి శాపం ఉంది .... అందుకని మనము తప్పక గాయత్రి జపం చెయ్యాలి ..ఇదే కాకుండా సూర్యమండలవర్తి అయి శివభగవానులు కూదా ఉన్నారు .. ఈ విధంగా శ్రీ విష్ణు .. లలితా.. సదాశివ.. ముగ్గురికీ మనం సంధ్యావందనంలో భాగంగా అర్ఘ్యం ఇచ్చినట్లు అవుతుంది .. . సంధ్యావందనంలో ఉత్తరభాగం గాయత్రి జప ప్రక్రియ .... . గాయత్రి అమ్మవారిని ప్రతిఒక్కరినీ కాపాడమని వేడుకుంటూ ..




నమస్తే సవితృమండలవాసిని
భక్తాభీష్టనిజభయవారిణి
సకలవిద్యాజ్ఞానప్రకాశిని
వేదమాతే నమో నమః

అద్భుతంగా జవాబు చెప్పిన "గురువు."*

*7 ప్రశ్నలకు చాలా అద్భుతంగా జవాబు చెప్పిన "గురువు."*

*1వ ప్రశ్న:* ప్రపంచంలో ఏది పదునైనది?

*జ:* చాలా మంది కత్తి అని చెప్పారు.

*గురువు:* కాదు,మనిషి నాలుక, ఎందుకంటే ఈ నాలుక తో మనుషులు ఇతరుల మనస్సును, వాళ్ళ నమ్మకాలను విరగ్గొట్టేస్తారు.

*2వ ప్రశ్న:* మనకు అత్యంత దూరంలో వున్నది ఏమిటి ?

*జ:* చాలా మంది చంద్రుడు ,సూర్యుడు ,గ్రహాలూ

*గురువు:* మనకు అత్యంత దూరం లో వున్నది గడిచిపోయిన కాలం.
ఎంత ప్రయత్నించినా ఆ కాలాన్ని తీసుకురాలేము,
ఆ కాలం లోకి వెళ్లలేము. అందుకే వున్న ఈ సమయాన్నే మంచి పనులకు సద్వినియోగం చేసుకోవాలి. ఎంత డబ్బు వున్నా కూడా మనం గడిచిన కాలం లోకి వెళ్లలేము.

*3వ ప్రశ్న:* ప్రపంచంలో అత్యంత పెద్దది ఏది?

*జ:* చాలా మంది పర్వతం ,సూర్యుడు ,భూమి ఇలా ఎన్నో అంటారు.

*గురువు:* ప్రపంచం లో పెద్దది మన పాపమే.

*4వ ప్రశ్న:* ప్రపంచంలో కఠినంగా, బరువుగా ఉండేది ఏది ?

*జ:* చాలా మంది, వజ్రము, ఇనుము, ఏనుగు అని చెప్పారు.

*గురువు:* కఠినమైనది అనేది *"మాట ఇవ్వడం"*
మాట ఇవ్వడం తేలికే కానీ నిలబెట్టు కోవడమే చాలా కష్టం.

*5వ ప్రశ్న:* ప్రపంచంలో తేలికైనది ఏది?

*జ:* దూది,గాలి,ఆకులు అని చెప్పారు

*గురువు:* ప్రపంచంలో తేలికైనది అనేది ఒకరిని చూసి వ్యంగ్యం గా మాట్లాడడం.

*6వ ప్రశ్న:* మనకు దగ్గరగా వున్నది ఏది?

*జ:* తల్లి తండ్రులు, స్నేహితులు, బంధువులు అని చెప్పారు.

*గురువు:* మనకు దగ్గరగా ఉండేది మన చావు.
అందరూ దూరమైనా కూడా ఎప్పుడో ఒకప్పుడు చావు అనేది ఖచ్చితం.
అది పుట్టుక తోనే మన వెంట వచ్చింది.

*7వ ప్రశ్న:* ప్రపంచంలో సులువైనది ఏది ?

*జ:*తినడం , పడుకోవడం, తాగడం, తిరగడం

*గురువు:* ప్రపంచంలో సులువైనది అనేది మరొకరి మనస్సు ను విరగ్గొట్టడం, ఇంతకంటే సులువు ఏదీ లేదు. 🌺🌺🌺🌺

*TTD e-Books:*


తిరుమల తిరుపతి దేవస్థానం వారు, వారి మొత్తం ప్రచురించిన అన్ని భాషలలో వివిధ పుస్తకాలను పిడిఎఫ్ (PDF ) ప్రతులు గా మార్చి ఉచితంగా చదువు కోవడానికి వీలుగా INTER NET లో అందు బాటు లోకి తెచ్చారు. వాటిని ఉచితంగా DOWNLOAD కూడా చేసుకోవచ్చు .
మహా భారతం , పోతన భాగవతము, అన్నమయ్య సంకీర్తనలు ,త్యాగరాజ కీర్తనలు, వంటి ఎన్నోఅరుదయిన మంచి రచనలు , పుస్తకాలు మనకు ఇప్పటికయినా అందు బాటు లోకి తేవడం ఒక ప్రయోజనం. సప్తగిరి సచిత్ర మాసపత్రిక కూడా అన్ని భాషల్లో ఉచితం గా చదువు కోవచ్చు . 👇

*Link click here:* ebooks.tirumala.org.

గీతా మకరందము

14-19-గీతా మకరందము
        గుణత్రయవిభాగయోగము

-పూజ్యశ్రీశ్రీశ్రీ విద్యాప్రకాశానందగిరి స్వాములవారు,
శ్రీశుకబ్రహ్మాశ్రమము, శ్రీకాళహస్తి.

అవతారిక - మోక్షమును బొందుటకు ఉపాయమును తెలియజేయుచున్నారు –

నాన్యం గుణేభ్యః కర్తారం
యదా ద్రష్టాఽనుపశ్యతి |
గుణేభ్యశ్చ పరం వేత్తి
మద్భావం సోఽధిగచ్చతి ||

తాత్పర్యము:- ఎప్పుడు వివేకవంతుడు (సత్త్వాది) గుణములకంటె నితరమును కర్తగా నెంచడో మఱియు తనను గుణములకంటె వేఱగువానినిగ దెలిసికొనుచున్నాడో, అపుడాతడు నాస్వరూపమును (మోక్షమును) బొందుచున్నాడు.

వ్యాఖ్య:- ఈశ్లోకము, రాబోవు శ్లోకము చాలముఖ్యములైనవి. విచారణాపరులగు సాధకులు ఈ భావములను, మఱల మఱల జ్ఞాపకమునకు తెచ్చుకొనవలెను. ఏలయనిన సంసారబంధవిముక్తికి, పరమాత్మస్వరూపప్రాప్తికి (మోక్షమునకు) రాజబాట యిచట తెలుపబడినది. జీవుడుచేయు సమస్తకర్మములకు త్రిగుణములే కర్త. అనగా త్రిగుణాత్మకమగు మనస్సే కర్త. ఆ త్రిగుణములే, ఆ మనస్సే దేహేంద్రియాదులచే కర్మలను చేయించుచున్నది. బంధమునొందునది ఆ మనస్సే; మోక్షమునొందునదియు అదియే. కర్త, భోక్త దానికంటె వేఱుగ నెవడునులేడు. ఆత్మమాత్రము సాక్షిగ వర్తించుచున్నది.
        కావున వివేకముచే జీవుడు తాను వాస్తవముగ గుణములకంటె వేఱుగానున్నాడనియు, గుణములకు, దేహేంద్రియాదులకు సాక్షియగు ఆత్మయే తాననియు, కావున ఆ యా కర్మలకు తాను కర్తకాదనియు ఎపుడు తెలిసికొనునో, అపుడే యాతడు ద్రష్టగ, దృగ్రూపుడుగ శేషించి పరమాత్మరూపమునే పొందుచున్నాడని యిట వచింపబడినది. కనుకనే ముందు ‘ద్రష్ట’ కావలెనని ఉద్భోధించుటకు కారణము. ‘ఓ జీవుడా! నీవు దృశ్యరూపములగు త్రిగుణములతో, మనస్సుతో, దేహేంద్రియములతో ఐక్యముకాకుము. వానికి సాక్షియగు ద్రష్టవు కమ్ము’ అని భగవానుడు కరుణతో బోధించుచున్నారు.
ఈ జగన్నాటకమందు మనస్సే, త్రిగుణములే కర్త. తాను నాటకమందు దీపము వలె వాని యన్ని క్రియలకు సాక్షియై వర్తించుచున్నాడు. తాను గుణములకు పరుడై వెలయుచున్నాడు. "సినిమా”యందు అధిష్ఠానమగు తెరగుడ్డవలె అన్నిటికిని ఆధారభూతుడై, సుఖదుఃఖములకు పరుడై, నిర్లేపముగా విలసిల్లుచున్నాడు. ఇదియే పరమసత్యము. ప్రపంచములోని సమస్తదుఃఖములకు కారణము ఈ గుణతాదాత్మ్యమే. అనగా జీవుడు గుణములతో, మనస్సుతో, దేహముతో నైక్యమై "నేను చేయుచున్నాను, నేను పుట్టుచున్నాను, నేను చచ్చుచున్నాను” ఇత్యాదిరూపమున కర్తృత్వము గలిగియుండుచున్నాడు. బంధమునకు కారణము ఈ కర్తృత్వమే అయియున్నది. దానిని వదలగొట్టిన మఱుక్షణమే జీవుడు భగవత్స్వరూపమును బొందుచున్నాడని శ్రీకృష్ణపరమాత్మ పలుకుచున్నారు.
     'మద్భావం సోఽధిగచ్ఛతి’ - అని తెలిపినందువలన, ఏ జీవుడు క్రియలన్నిటికిని గుణములే కర్తయనియు, తాను వాస్తవముగ ఆ గుణములకంటె వేఱుగనున్నాడనియు తెలిసికొనునో అతడు ఎవడైనను ఏ జాతికి జెందినప్పటికిని, స్త్రీయైనను, పురుషుడైనను ఆ క్షణముననే భగవానుని స్వరూపమును తప్పక బొందగలడని స్పష్టమగుచున్నది. కావున జీవుడు శివు డగుటకు, నరుడు నారాయణునిస్థితిని జెందుటకు, జనుడు జనార్దను డగుటకు ఇది చక్కటి ఉపాయము. మోక్షమున కిదియే చక్కని బాట; ఇక జీవుడు తాను అల్పుడని, దుర్బలుడని తలంపక తాను వాస్తవముగ నిరంజనుడని, మనస్సాక్షియని, గుణాతీతుడని, సాక్షాత్ భగవత్స్వరూపుడేయని నిశ్చయించి, ధైర్యోపేతుడై అట్టి వివేకమును బడయుటకు యత్నముగావింపవలెను.
    అధిగచ్ఛతి -- అను పదముచే బ్రహ్మైక్యమును అట్టివాడు తప్పక పొందగలడని భగవానుడు నొక్కిచెప్పినట్లైనది. కావున ముముక్షువులు భగవద్వాక్యమునందు విశ్వాసము గలిగి, పిరికితనమును పారద్రోలి, త్రిగుణములను తెగద్రుంచి గుణాతీత పరమాత్మరూపులై వెలయవలెను.
       ‘పశ్యతి' అని చెప్పక "అనుపశ్యతి” - అని చెప్పుటవలన - 'తాను కర్తకాద’ను ఈ భావమును మఱల మఱల చింతన జేసి దృఢపఱచుకొనవలెనని భావము.
అయితే భగవానుడు తెలిపిన ఈ సత్యములను బహుజాగ్రతగ అర్థము చేసికొనవలసియుండును. ఏలయనిన కొందఱు అవివేకులు "ఇంద్రియములు ఏమిచేసినను, ఏమి అనుభవించినను నాకేమియు సంబంధములేదు" అను ఈ వాక్యమును విపరీతముగ అర్థముచేసికొని ఇంద్రియములచే నిషిద్ధకార్యములకు గడంగి దుఃఖరూప సంసార అఖాతములో పడిపోవుచున్నారు. అట్టి శుష్కవేదాంతులవచనముల నెవరును విశ్వసింపరాదు. తమోగుణ, రజోగుణములను దాటినవాడు, లేక తనను, వానికంటె వేఱుగ దలంచువాడు మఱల తద్గుణసంబంధములైన నీచకార్యములం దెన్నటికిని ప్రవృత్తుడుకాడని ముమ్మాటికిని ఎఱుగవలెను.

ప్రశ్న:- తానుచేయు సమస్తకార్యములకు వాస్తవముగ కర్తయెవరు?
ఉత్తరము: - త్రిగుణములు ( త్రిగుణాత్మకమగు మనస్సు).
ప్రశ్న:- మనుజుడు తాను వాస్తవముగ నెట్టివాడు?
ఉత్తరము:- అకర్త, సర్వసాక్షి, నిర్గుణుడు.
ప్రశ్న:- ఈ ప్రకారమెఱిగినందువలన కలుగు ఫలితమేమి?
ఉత్తరము:- ఎపుడు జీవుడు తాను గుణములకంటె వేఱని, అకర్తయని యెఱుగునో, ఆ క్షణముననే యతడు భగవత్స్వరూపమును (మద్భావమ్) లెస్సగ బడయుచున్నాడు; ముక్తినొందుచున్నాడు.
ప్రశ్న:- దీనిని బట్టి మోక్షమునకు, భగవదైక్యమునకు ఉపాయమేమియని తేలుచున్నది?
ఉత్తరము:- 'త్రిగుణములే కర్త, తాను అకర్త’ యని భావించి, జీవుడు గుణములకంటె వేఱుగ తనను ఎఱుగుటయే మోక్షోపాయము.

శివుని అర్చించడం

ఏ నెలలో..ఏ పూలతో..శివుని అర్చించడం

శివలింగానికి కాని ఒక్క పుష్పముని రోజు సమర్పణ చేస్తే 80 లక్షల కోట్ల సంవత్సరముల వరకు
దుర్గతి సంభవించదు అని వేదవిదులచే చెప్పబడుచున్నది .

ఎవరు అయిన వ్యక్తీ తానూ స్వయముగా
పెంచి పోషించి పూయింపజేసిన చెట్ల యొక్క
పూలతో భక్తీ శ్రద్దలతో శివుని ని పూజించిన
అట్టి వారు శివసాయుజ్యము తప్పక పొందుతారు.

చెట్టు యొక్క పుష్పములు , ఆకులతో శివునికి సమర్పణ చేసిన ఆ చెట్టు కూడా పరమ పదము పొందును.

ఏవ్యక్తీ అయిన ఐదు పుష్పములతో శివుని పూజించినచో అట్టి వారికి పది అశ్వమేధలు చేసిన ఫలితము లభించును.

ఎవరు అయిన ఎనిమిది పుష్పములతో పరమ శివుని పూజ చేసిన వారు కైలాసమునకు వెళ్లుతారు .

శివ పూజ - మాసముల వారి పుష్పములు.

1) చైత్ర మాసము నందు నృత్యము ,
గీతములతో శివుని సేవించాలి ,
దర్బ పూవ్వులతో పూజ చేసిన అట్టి వారికి పలు విధములు అయిన సువర్ణములు లభించును .

2) వైశాఖ మాసము నందు శివునికి ఆవు నెయ్యితో అభిషేకము చేయించి ,, తెల్లని వర్ణము (రంగు) కలిగిన మందార పుష్పములతో పూజ చేసిన వారికి
అశ్వమేధ యాగము చేసినటువంటి ఫలము కలుగును .

3) జేష్ట్య మాసము నందు ఎల్ల వేళలయందు
శివునిని పెరుగుతో అభిషేకించి తామర పువ్వులతో పూజ చేసిన వారికి ఉత్తమ పరమ పదములు పొందును .

4) ఆషాడ మాసము నందు బహుళ చతుర్దశి తిదియ రోజు స్నానము చేసి శుచిగా తయారు అయ్యి
కొంచు అయిన గుగ్గిలము తో ధూపము ఇంట్లోఅంతా దేవుని మందిరములో కూడా వేసి
తొడిమలతో కూడి ఉన్న పుష్పములను మాల చేసి శివునికి వేసి అర్చించిన వారు బ్రహ్మ లోకమును అధిగమించి పరమ పదము పొందుతారు .

5) శ్రావణ మాసము నందు ఒంటి పూట మాత్రమె భోజనము చేసి , గన్నేరు పూలతో శివునిని అర్చించిన వారికి వెయ్యి గోవులను దానము చేసినటువంటి
ఫలము పొందును .

6) భాద్ర పద మాసము నందు ఉత్తరేణి పువ్వులతో
శివుని ని అర్చన చేసిన వారు హంస ద్వజము తో
కూడిన విమానమునండు పుణ్య పదమునకు వెళతారు.

7) అశ్వాయుజ మాసమున శివునికి జిల్లేడు పూలతో పూజించిన వారు మయూర ధ్వజము తో కూడిన విమానము నందు శివ పదమునకు చేరుదురు .

8)కార్తిక మాసము నందు శివునిని క్షీరము తో (పాల ) అభిషేకము చేసి , జాజి పువ్వులతో పూజ చేసిన వారు నిరంజనమైన శివ పదమును దర్సించుదురు.

9) మార్గశిర మాసము నందు పొగడ పూలతో శివునిని పూజించిన వారు శివుడు ఎక్కడ ఉండునో
అక్కడికి చేరుతారు .

10) పుష్య మాసము నందు ఉమ్మెత్త పువ్వులతో శివునికి పూజిస్తారో అట్టివారు పరమ పదముని పొందుతారు .

11) మాఘ మాసము నందు శివునికి బిల్వదళములతో పూజిస్తారో వారు సూర్య - చంద్రులు గల విమానము నందు వెళ్ళెదరు .

12) ఫాల్గుణ మాసము నందు శివునికి సుగంధ జలములతో అభిషేకము చేసి తుమ్మ పువ్వులతో
పూజ చేసిన వారికి ఇంద్రుని అర్ద సింహాసనము పొందుతారు .

ప్రతిదినము శివున్ని ఒక జిల్లేడు పుష్పముతో
పూజించిన వారికి పది సువర్ణ ముద్రికలను దానము చేసినంత ఫలము కలుగును.

పితృదేవతలు

మహాలయ అమావాస్య నాడు పితృదేవతలు తమ సంతతి ద్వారం దగ్గరే నిలబడతారు. ఆ రోజు వారికి శ్రాద్ధ కర్మ నిర్వర్తించక పొతే దీవెనకు బదులుగా శపించి వెళ్ళిపోతారు. నిజానికి, ప్రతి మాసంలోను అమావాస్య, పితరుల పుణ్య తిథి గా భావించబడినా, మహాలయ అమావాస్య కు విశేష ప్రాముఖ్యత ఉంటుంది. ఈ రోజు సమస్త పితృదేవతా విసర్జనం జరుగుతుంది. తమ పితరుల పుణ్య తిథి వివరాలు తెలియనివారు, పితృ పక్షం లో ఆ తిథి నాడు కారణవశాన శ్రాద్ధం పెట్టలేనివారు మహాలయ అమావాస్య నాడు శ్రాద్ధం, దానం, తర్పణం చేస్తారు. ఎవరూ శ్రాద్ధ విముఖులు కాకూడదు.శ్రాద్ధ మహిమను శాస్త్రాలు విస్తృతం గా పేర్కొన్నాయి. శ్రాద్ధం చేయటం వల్ల సంతానం ప్రాప్తిస్తుందని స్కాంద పురాణం లో చెప్పబడింది. ఆదర పూర్వకం గా శ్రాద్ధ కర్మతో సంతోషపెడితే వారు తమ సంతత వారి ఆయువు, విద్య ధనం, సంతానం, సమస్తం కలిగి ఉండేట్టు ఆశీర్వదిస్తారు. శ్రాద్ధ కర్మ లో నువ్వులు, గూడమిశ్రిత అన్నం సమర్పించిన దానం అక్షయం అవుతుంది. అన్ని దానాల లోను అన్న దానం ప్రధానమైనది, అన్నదానం ఎప్పుడు చేసిన మంచి ఫలితాన్నే ఇస్తుంది, కాని ఈ మహాలయపక్షం లో చేసే అన్నదానం వలన అనంతకోటి యజ్ఞ ఫలితం ప్రాప్తిస్తుంది. అలాగే మఖ నక్షత్రం పితరులకు సంబందించింది కనుక ఆ రోజు చేసిన శ్రాద్ధ కర్మ అక్షయఫలన్నిస్తుంది. ఏ రోజు శ్రాద్ధ కర్మ చేస్తే ఎటువంటి ఫలితం లబిస్తుందని వివిధ పురాణాల ఆధారం గా తెలుసుకోవచ్చు.

ఋణానుబంధము.....



తెలిసి తెలియక చేసే తప్పులు కూడా బంధాలు అవుతాయి...

ఇతరులతో పూర్వజన్మలో మనకు గల ఋణాను బంధాలు తీర్చుకోవడానికే ఈ జన్మలో భార్యగా, భర్తగా, సంతానంగా, తల్లిదండ్రులుగా, మిత్రులుగా, నౌకర్లుగా, ఆవులు, గేదెలు, కుక్కలు ఇలా ఏదో ఒక రకమైన సంబంధంతో మనకి తారస పడుతుంటారు.

ఆ ఇచ్చి పుచ్చుకునే ఋణాలు తీరగానే దూర మవడమో, మరణించడమో జరుగుతుంది. ఈ విషయాన్ని మనం చక్కగా అర్థం చేసుకో గలిగితే మన జీవిత కాలంలో మనకి ఏర్పడే సంబంధాల మీద మోజు కలుగదు. ఇతర జీవులతో మన ఋణాలు ఎలా ఉంటాయి అంటే...

మనం పూర్వ జన్మలో ఒకరి నుంచి ఉచితంగా ధనం కానీ, వస్తువులు కానీ తీసుకున్నా, లేదా ఉచితంగా సేవ చేయించుకున్నా ఆ ఋణం తీర్చుకోవడానికి ఈ జన్మలో మన సంపాదనతో పోషించబడే భార్యగా, సంతానంగా, మనతో సేవ చేయించుకునే వారి గాను తారసపడతారు.

ద్వేషం కూడా బంధమే. పూర్వజన్మలో మన మీద గల పగ తీర్చుకోవడానికి మనల్ని హింసించే యజమానిగా లేదా సంతానంగా ఈ జన్మలో మనకి వారు తారసపడవచ్చు.

మనం చేసిన అపకారానికి ప్రతీకారం తీర్చుకోవడానికి ఈ జన్మలో శత్రువులుగానో, దాయాదులుగానో, ఏదో ఒక రకంగా మనకు అపకారం చేసే వారిగా ఎదురవుతారు.

మనం చేసిన ఉపకారానికి బదులుగా ఉపకారం చేయడానికి ఈ జన్మలో మిత్రులు గానో, సహాయకులు గానో ఎదురవుతారు.

ఉదాహరణకు ఒక జరిగిన కథ...

కొల్లూరు లోని మూకాంబికా తల్లి ఆలయం దగ్గర అడుక్కునే ఒక కుంటి బిచ్చగాడు ఉదయం ఆరు నుంచి రాత్రి పది గంటల దాకా గుడి పక్కన బిచ్చం అడుక్కుంటూ ఉండేవాడు. ఆ వృత్తిలో నెలకి పదివేలకు పైనే సంపాదించేవాడు. కానీ తను సౌకర్యవంతమైన జీవితం గడిపితే బిచ్చం వేయరని సాధారణ జీవితం గడుపుతూ, రోడ్డు పక్కన ఎవరి పంచ లోనూ పడుకుంటూ, మూకాంబికా తల్లి ఆలయం లో పెట్టే ఉచిత భోజనాన్ని తింటూ, చిరిగిన దుస్తులు ధరిస్తూ ఉండేవాడు.

తన సంపాదనతో ఇద్దరి కొడుకులను ఎం.బీ.బీ.ఎస్ చదివిస్తున్నాడు. ఒకసారి మూకాంబికా తల్లి దర్శనానికి వచ్చిన ఒక మహానుభావుడు ఆ బిచ్చగాడిని చూసి ఇలా చెప్పాడు. పూర్వజన్మలో ఇతను ఇద్దరు వ్యక్తుల దగ్గర డబ్బులు తీసుకుని, వాళ్లు చాలా బాధలో ఉన్నప్పుడు ఇతను, ఇవ్వగలిగే స్థితిలో ఉండి కూడా ఇవ్వలేదు. అందుకే ఈ జన్మలో తాను కష్టపడి సంపాదిస్తూ వున్నా, తాను బాధలు పడుతూ, వాళ్లను చదివిస్తూ వాళ్ల రుణాన్ని తీర్చుకుంటున్నాడు. అని..

అంతే కాక మనకు తెలిసి తెలియక చేస్తున్న చిన్న చిన్న తప్పులు కూడా మనకు బంధాలు అవుతాయని నిరూపించే ఒక కథ...

ఒకసారి మహర్షి బస చేసిన అతిథిగృహం బయట ఉన్న చెత్తకుండీలో తిని పారేసిన విస్తరాకులు కోసం అనాథ బాలలు వీధి కుక్కలతో పోట్లాడుతున్నారు. అది చూసిన కొందరు భక్తులు బాధగా స్వామిని అడిగారు, స్వామి ఈ దారుణ పరిస్థితికి కారణం ఏమిటి అని. ఈ పిల్లలంతా వారి గత జన్మలో ఆహార పదార్థాలను అధికంగా దుర్వినియోగం చేశారు. అందుకని వారు ఈ జన్మలో ఆహారం కోసం పరితపిస్తున్నారు, అని స్వామి జవాబు చెప్పారు.

నీటిని దుర్వినియోగం చేస్తే ఎడారిలో పుడతారు. ఏ వనరులను దుర్వినియోగం చేసినా దాని ఫలితాన్ని తప్పక అనుభవించాల్సి ఉంటుంది అన్నారు మహర్షి...

ఒకమారు శ్రీ విద్యా ప్రకాశానందగిరి స్వామి వారు బందరుకి వెళ్తూ గురువైన శ్రీ మలయాళ స్వామి వారి అనుమతి తీసుకుని వెళుతూ ఉంటే, ఆయన వెనక్కి పిలిచి నీ చేతి సంచి ఏది అని అడుగుతే, పక్కనున్న మిత్రుడి చేతిలో ఉంది అని చెబుతారు. అప్పుడు మలయాళ స్వామి వారు నువ్వు మోయగలిగి ఉండి, ఈ జన్మలో నీ మిత్రుడు చేత సంచీని మోయిస్తె వచ్చే జన్మలో నువ్వు అతని బియ్యం బస్తాను మోయాల్సి ఉంటుంది అన్నారు.

ఇలాంటివి మనము తెలిసి తెలియక చాలా చేస్తూ ఉంటాం. మనం ఇతరుల నుంచి మొహమాటం చేతనో, మర్యాదకో, కృతజ్ఞత గానో, గౌరవంతోనో లేదా మరే ఇతర కారణాల ద్వారానో ఉచితంగా స్వీకరించిన వన్నీ కర్మ బంధాలయి జనన మరణ చక్రంలో మనల్ని బంధిస్తాయి. కొత్త వాళ్ల నుంచి పెన్ను లాంటి వస్తువులను తీసుకోవడం, మన పెట్టె లాంటివి మోయించడం, పక్క వాళ్ళు షాప్ కి వెళ్తుంటే నాకు ఫలానాది తీసుకురా అని చెప్పడం, ఇలాంటివి అనేక సందర్భాల్లో ఇతరుల సేవలను ఉచితంగా తీసుకుంటాం.

అవి కర్మ బంధాలవుతాయి అని తెలియక మన జీవితకాలంలో చేసే ఇలాంటి వేలకొద్దీ కర్మబంధాలో చిక్కుకుపోతుంటాము. ఆరడుగుల తాచుపాము విషం ఎంత ప్రమాదకరమో, అలాగే అంగుళం తాచుపాము విషం కూడా అంతే ప్రమాదకరం. అలాగే కర్మ ఎంత పెద్దదైనా, చిన్నదైనా దాని ఫలితం దానికి ఉండి తీరుతుంది తప్ప మాయం కాదు...

|| ఓం నమః శివాయ || 

*ఓం పూర్ణమదః*

*ఓం పూర్ణమదః* *పూర్ణిమదం పూర్ణాత్* *పూర్ణముదచ్యతే*
*పూర్ణస్య పూర్ణమాదాయ* *పూర్ణమేవావ శిష్యతే*
*ఓం శాంతిః శాంతిః శాంతిః*

దేవుడు పరిపూర్ణుడు. ఇది (ఈ ప్రపంచం) పరిపూర్ణమైనది. పరిపూర్ణమైన భగవంతుడి నుండే పరిపూర్ణమైన ప్రపంచం పుట్టింది. పరిపూర్ణం నుండి పరిపూర్ణాన్ని తీసివేసిన తర్వాత కూడా పరిపూర్ణతే మిగిలి ఉంది.

వివరణ: పరిపూర్ణం నుండి పరిపూర్ణం ఎలాపుడుతుంది? తీసివేసిన తర్వాత కూడా పరిపూర్ణమే ఎలా మిగులుతుంది? అనే అనుమానాలు మనకు వస్తాయి. కొన్ని ఉదాహరణల ద్వారా దీనిని చూడవచ్చు. ఒక దీపం నుండి ఎన్ని దీపాలను వెలిగించినా మొదటి దీపము అలాగే మిగతా దీపాలు కూడా సంపూర్ణప్రకాశమే కలిగి ఉంటాయి. అలానే విద్యాదానం విషయం కూడా చెప్పుకోవచ్చు. ఇలానే భగవంతుని పరిపూర్ణతకు కూడా తీసివేయడం వలనో లేక ఇవ్వడం వలనో లోపం కలుగదు.

ఈ మంత్ర సారాంశం ఏమిటంటే దేవుడి నుండి ఉద్భవించడం వలన ఈ ప్రపంచం కూడా భగవంతుని అంశ లేక భగవంతునిచే నిండి ఉన్నదని.

వేదమంత్రాలన్నీ ఓం శాంతిః అంటూ ముగుస్తాయి. మూడు సార్లు శాంతి అని ఎందుకు ముగుస్తాయంటే నిత్యజీవితములోని మూడు ఆటంకాల నుండి బయటపడుటకు. ఆ మూడు ఏమంటే

1.ఆద్యాత్మికం: శారీరక, మానసిక అనారోగ్యాలు మొదలగునవి

 2.ఆదిభౌతికం: ఇతర జీవరాసులవలన, ఇతర మానవులవలన కలుగు బాధలు

 3.ఆధిదైవికం: ప్రకృతి వలన అంటే వరదలు, భూకంపాలు, పిడుగులు, అగ్ని ప్రమాదాలు మొదలగునవి.

ఈ మూడు రకాలైన బాధల నుండి తప్పించుకోవడానికి మూడు సార్లు శాంతి అని పలుకుతాము.

ఇదే శ్రుతి వాక్యం. ఈ వాక్యాన్ని సరిగా అర్థం చేసుకుంటే.....
జీవితమంతా ఇందులోనే దాగుంది. మోక్ష మార్గం ఇందులోనే దాగుంది.....
సమస్త సాధనాల సారం ఇందులోనే ఉంది.

0 + 0 = 0....
0 ౼ 0 = 0....

కానీ.....
0+1 = ఎంత అంటే.....
మనం వెంటనే 1 అని సమాధానం ఇస్తాం.....
ఇక్కడ సున్నా ...
ఒకటితో కలవగానే అది 1 గా మారిపోయింది.

0+2 =2.....
సున్నా 2 తో కలవగానే సున్న మాయమై.....
అది రెండుగా మారిపోయింది. అంటే.....
సున్న దేనితో కలిస్తే అదిగా మారిపోతూంది.

గాఢ నిద్రలో మనం పూర్ణమైన భగవంతుడిగా ఉంటాం. మనకప్పుడు ఏ భావోద్వేగాలు ఉండవు. ఎప్పుడైతే సున్నలాంటి మనం నిద్రలేవగానే ప్రకృతితో కలుస్తామో.....
మనం ప్రకృతే ఐపోతున్నాం.

మనం దేనితో కలుస్తామో.....
దానిగా మారిపోతున్నాం.....

బాగా గమనించు....
నీ ఎదురుగా ఒక వ్యక్తి ఉన్నాడు.....
అతడు గతంలో నీకు ఎంతగానో సహాయం చేసాడు....
ఆ వ్యక్తి ని చూడగానే.....
నీలో అతనిపట్ల ఆత్మీయత కలుగుతుంది. నువ్వూ అతనికి ఎలాగైనా సహాయం చెయ్యాలని ఆలోచిస్తావు.

ఒక వ్యక్తి నిన్ను ఎంతగానో బాధించాడు.....
అతను కనబడగానే నువ్వు కూడా అతన్ని ఎలాగైనా బాధించాలని ఆలోచిస్తావ్....

ఎదుటి వ్యక్తి ప్రేమతో వస్తే.....
నీకూ అతనిపట్ల ప్రేమ కలుగుతోంది.....

ఎదుటి వ్యక్తి నిన్ను గౌరవిస్తే .....
నీకూ అతనిపట్ల గౌరవం కలుగుతుంది.....

అంటే.....
మనం ఎదుటి వ్యక్తిలోని ఏ గుణాన్నాయితే గమనిస్తున్నామో.....
మనం మనకు తెలీకుండానే ఆ గుణంతో కలిసిపోయి.....
ఆ గుణంగానే మారిపోతున్నాం.....

"మనం దేనితో కలుస్తున్నామో... అది గా మారిపోతున్నాం."

మనలో సున్న(0) లా ఉన్న పరమాత్మ తత్వం.....
ఎదుటి వ్యక్తీలోని కోపం తో కలవాగానే అది కోపంగా మారిపోయి మనకు కోపం వస్తుంది.

నువ్వు ప్రేమతో కలిస్తే ప్రేమగా.....
ద్వేషం తో కలిస్తే ద్వేషంగా..... మారిపోతావ్.

ఎదుటివారిలోని అహంకారాన్ని చూస్తే నీలో కూడా అహంకారం మొలుస్తుంది.

అందుకే.....
ప్రతి జీవిలోనూ.....
మనిషిలోనూ.....
పరమాత్మ ఉన్నాడని గ్రహించి......
ఆయనతో అనుసంధానం అవ్వు.

అంటే నీలోని పూర్ణాన్ని.....
ఎదుటి వ్యక్తీలోని పూర్ణంతో కలుపు.....
వచ్చేది పూర్ణమే.

ఎదుటి మనిషిని చూడగానే అతనిలోని దోషాలను గుర్తిస్తే.....
మనం అతనిలో దేన్ని ముందుగా చూస్తామో.....
మనం అదిగా మారిపోతామన్న
మహా సత్యాన్ని గమనించాలి.

అందుకే ఎలాంటి వారిలోనైనా.....
భగవంతుణ్ణి చూడగల్గి.....
ఆయనతో కలిస్తే....
మనం కూడా భగవత్ తత్వంగా మారిపోతాము.

సదా ఈ సృష్టిలోని ప్రతి వస్తువులోనూ పరమాణు స్వరూపంతో ఉన్న భగవంతునితో అనుసంధానమవుతూ..... ఉండాలి.
అంటే మంచి చెడు తటస్థ లక్షణాలో, అన్ని గుణాలలో, అన్ని ఆలోచనలలో, అన్ని అనుభూతులలో, అన్నీ మనోభావాలలో, అన్ని అనారోగ్య లక్షణాలలో, అన్ని అరోగ్య లక్షణాలలో, పూర్ణాన్ని అనుభూతి చెందాలన్నమాట.
ఇక్కడ పూర్ణం లేదా భగవంతుడు అంటే నిరాకారం, వ్యాపకం, నిశ్చలం, నిర్గుణం, సచ్చిదానంద స్వరూపం, ప్రశాంతత, తృప్తి, బ్రహ్మానందం.


హరిః ఓం తత్ సత్.

సేకరణ
ఈ #శార్వరీ నామ సంవత్సరంలో #అధికమాసం_లేదు
                   ఈ సంవత్సరం లో అసలు అధికమాసం అనేది లేదు. అదేమిటి అలా అంటారు? పంచాంగాలన్నీ అధికమాసం రాసాయి కదా! అంటారేమో! రాసాయి, నిజమే. అయితే, అది సశాస్త్రీయం కాదు అని జ్యోతిష సిద్ధాంతగ్రంధాధ్యయనం ద్వారా అవగతమౌతుంది. అసలు సిద్ధాంతజ్యోతిషం పై అవగాహన లేనివారికి కూడా సులభంగా అర్థమయ్యే లా వివరించే ప్రయత్నమే ఈ పోస్ట్.
             📌అసలు #అధికమాసం అంటే ఏమిటి?
ఏ నెలలో సూర్య సంక్రమణం జరుగదో ఆ నెల అధికమాసం. అయితే, సంక్రమణం అంటే ఏమిటి? అన్న ప్రశ్న ఉదయిస్తుంది. రవి ఒకరాశి నుండి వేరొక రాశి లోనికి మారడాన్ని సంక్రమణం అంటారు. సూర్యభగవానుని సంక్రమణం జరుగనిదే ఆ మాసానికి పవిత్రత చేకూరదు.
ఈ సంవత్సరం లో అధికమాసం రాసిన వారికి, వారి వారి గణితానుసారం సంక్రమణం జరుగలేదు, కాబట్టి వారంతా ఆశ్వయుజం అధికమాసం రాసారు.
#సంపూర్ణ_దృగ్గణితరీత్యా పంచాంగగణితం చేస్తే ఈ సంవత్సరంలో సంక్రమణాలు అన్నీ జరుగుతున్నాయి, కాబట్టి ఈ సంవత్సరంలో అధికమాసం లేదు.
        📌మరి, మిగిలిన వాళ్ళంతా #ఎందుకు రాసారు?
ఎందుకంటే వారి గణితం లో తేడా కాబట్టి.
            📌మీ గణితంలో తేడా లేదని మీరు ఎలా చెప్పగలుగుతున్నారు?
సిద్ధాంతగ్రంథానుసారం వర్తమాన గ్రహ స్థితిని అనుసరించి గణితంలో ఏ సంస్కారాలు చేసుకోవాలో (necessary corrections as per the changes in the motion of the planets) అవన్నీ మేము చేసుకోవడం జరిగింది. మిగిలినవారు అలా చేయలేదు. వివరాలు నేను లోగడ ఇంగ్లీష్ లో పెట్టడం జరిగింది. లింక్ ఇది, చదవండి 👇
https://m.facebook.com/story.php?story_fbid=2063413727038331&id=100001091702745
           📌 అయితే, మిగిలిన పంచాంగాలవారు తేడా చేస్తున్నారని లోగడ చెప్పిన వారెవరైనా ఉన్నారా?
ఉన్నారు. అందులో #లోకమాన్య_బాలగంగాధర_తిలక్ కూడా ఉన్నారు. ఆయన సమయంలో వారు గణితంలో సవరణలు చేసి #తిలక్_పంచాంగ్ పేరుతో ప్రచురించడం ప్రారంభించారు. నేటికీ ఆ పంచాంగం పూనా నుండి ప్రచురింపబడుతూ ఉన్నది. వారికీ ఈ సంవత్సరం అధికమాసం రాలేదు.
                                రవి సంక్రమణాలలో మూడున్నర రోజుల తేడా వస్తోంది. 1925 లో పూనాలో పంచాంగకర్తలంతా సమావేశమై ఆ సంవత్సరానికి అయనాంశ లను 22° 40` 39`` గా తీసుకోవాలని నిర్ణయించారు. అది తప్పని తిలక్ గారు గ్రహించి సవరణ లతో తన పేరుతో పంచాంగం ప్రచురించడం ప్రారంభించారు.
      1950వ దశకంలో #మద్రాసు_సంస్కృత_కళాశాల లో ప్రొఫెసర్ అయిన TS Kuppanna Sastry గారు తమ పరిశోధనా వ్యాసాలు ఎన్నో ప్రచురించారు. వాటిని ఒక పుస్తకరూపంలో మా యూనివర్సిటీ ( National Sanskrit University) ప్రచురించింది. Collected Papers on Jyotisha అన్న పేరుతో 1989 లో ప్రచురణ చేసింది. ప్రస్తుతపంచాంగాలన్నీ సంక్రాంతులను 3 1/2 రోజులు వెనకకు చూపించాలని రాసారు. అయితే, శాస్త్ర భీతి లేకపోవడం వలన పంచాంగకర్తలెవరూ అది పట్టించుకోలేదు. మా జ్యోతిషపరమగురువులు శ్రీపాద వేంకటరమణ దైవజ్ఞశర్మ గారు 1945 నాటికే ఈ విషయాన్ని గ్రహించి, తదనుగుణంగా సవరణలు చేయడం, మద్రాసు యూనివర్సిటీ లో దీనిపై ఉపన్యసించడం జరిగింది. వారి శిష్యులు, అస్మద్ గురువర్యులైన మ. మ. మథుర కృష్ణమూర్తి శాస్త్రి గారు ఆ గణితాన్నే అనుసరించి పంచాంగప్రచురణ ప్రారంభించారు.
నా అదృష్టం కొద్దీ నేను దానిని అభ్యసించడం జరిగింది.
     సవరణలు చేయని ఈ పంచాంగాలన్నీసంక్రాంతి పండుగ జనవరి 13/14/15 తేదీలలో రాస్తున్నాయి. కానీ, అసలు సంక్రాంతి జనవరి 10/11/12 తేదీలలో అయిపోతోంది. అందువల్ల వారి అధికమాసం లెక్కలు సశాస్త్రీయగణితం కాదని గ్రహించాలి. TS Kuppanna Sastry గారు కూడా ఈ సంక్రాంతులలో తేడాలను వివరించిన పేజీని కూడా ఫొటో తీసి పోస్ట్ లో పెట్టాను. ఇంగ్లీష్ లో ఉంది చదవండి.
✍Dr. Tukaram

సేకరణ

ఫలం యొక్క ఆకాంక్ష



ఆటకి, కర్మకి ఒక్కటే తేడా. ఫలం యొక్క ఆకాంక్ష ఉంటే ఆట కూడా ఒక కర్మ అయిపోతుంది. ఆకాంక్ష లేకపోతే కర్మ ఒక ఆట అవుతుంది. కాబట్టి "ఆకాంక్ష" అనేది కర్మకి, ఆటకి మధ్యగల తేడా.

ఎవరు కర్మలో ఆకర్మని, ఆకర్మలో కర్మని చూస్తారో వారు జ్ఞాని. కర్మలో ఆకర్మని చూడడం అంటే కర్మ చేస్తూ, నేను కర్తని కాదు అని అనుకోవడం. ఎప్పుడైతే ఒక సాక్షీభావం ఉంటుందో, అప్పుడే కర్మ చేస్తున్నా నేను కర్తని కాదు అనే భావన కలుగుతుంది. ఇక రెండోది కర్మ చేయకుండానే కర్మ చేస్తున్నాను అనే భావన కలిగి ఉండడం.

అనవసరమైన విషయాలు బంధాన్ని కలుగచేస్తాయి. ఏ కర్మ మనకి చుట్టుకుంటుందో అక్కడ మన పాత్ర తప్పక వుంటుంది. నీవు చేసే భోజనం నిన్ను బంధించదు, ఆ భోజనం చేయడానికి నీవు చూపే ఉత్సాహం నిన్ను బంధిస్తుంది.

అర్ధం చేసుకోవడం

అర్ధం చేసుకోవడం అనేది రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి బుద్దితో, రెండవది హృదయంతో. ఈశ్వరార్పణం అనేది ఎప్పుడూ బుద్ధితో జరగని పని. ఎందుకంటే బుద్ధి ఎప్పుడూ అహంకారాన్ని దాటిపోదు. కర్మ నాది, ఫలం నీది అనే సూత్రాన్ని బుద్ధి అర్ధం చేసుకోలేదు. హృదయం తో అర్ధం చేసుకోవడం అంటే, లభించిన ప్రతీది పరమాత్మ ప్రసాదమే అని గ్రహించడం. తర్కము కానీ, బుద్ధి కానీ ఎందుకు? Why? అని ప్రశ్నిస్తాయి. ఆ ఎందుకు అనే దానికి జవాబు దొరకకపోతే అవి వెనక్కి వచ్చేస్తాయి. ఎక్కడ ఈ ఎందుకు? అనే దానికి జవాబు దొరకదో, అక్కడ హృదయం శోధిస్తుంది.

ఏది బయట ద్వారా లోపలికి తీసుకోబడుతుందో, దానికి ఆహారం అని పేరు. అంటే భోజనం ఒక్కటే కాదు. మనం ఇంద్రియాల నుండి లోపలికి తీసుకునే ప్రతీది, ప్రాణాన్ని ప్రాణంలోకి సమర్పించడానికి అనువుగా ఉండాలి. మనం తీసుకునే ఆహారం, ప్రాణానికి ఉత్తేజం, ఉద్వేగం కలిగించి, ప్రాణం బయట వస్తువుల వైపు పరుగులు తీసేలా చేస్తుంది. ఆ పరుగుని ఆపగలిగితే ఈ ప్రాణం, మహాప్రాణంలో విలీనం అవుతుంది.

ఈ ప్రపంచంలో అజ్ఞానానికి మించిన మృత్యువు ఏదీ లేదు. శరీరంలో శరీరం గురించి తప్ప మరే తత్త్వము తెలియని వాడు అజ్ఞాని. "నేను" అనేది తెలుసుకోగలిగేదే జ్ఞానము. మనం ఉన్నాము అనే ఎరుక కలిగివుండి, ఆ మనం ఏమిటో తెలియక పోవడమే అజ్ఞానం. తెలియడం జ్ఞానం.

మనిషి జయించవలసిన ఆరు దోషాలు



🍁🍁🍁🍁


వ్యక్తి నిరంతరం తాను ‘ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితి’కి చేరడమే అభ్యున్నతి. అదే జీవన సాఫల్యం.

ఈ ప్రయాణంలో ఎదురయ్యే అతినిద్ర, బద్ధకం, భయం, క్రోధం, అలసత్వం, ఎడతెగని ఆలోచన అనే ఆరుదోషాలను జయించినప్పుడే లక్ష్యాన్ని చేరగలుగుతాడని భారతం చెబుతోంది.

 భారతంలోని ఉద్యోగ పర్వంలో విదురుడు చెప్పిన మాటలివి.

 నిజానికి జీవితం మన భావోద్వేగాలకు అనుకూలంగా నిర్మించబడిలేదు.

మన భావోద్వేగాలూ జీవితాన్నీ మార్చలేవు. ప్రతి ప్రయాణం గమ్యాన్ని చేరుస్తుందని చెప్పలేం. కానీ, ప్రయాణించిన దూరం గమ్యాన్ని దగ్గరగా చేస్తుంది. అనుకున్నది జరగడం, జరగకపోవడం సంభవమే. విజయంలో పొంగిపోతే అహంకారం పలకరిస్తుంది.

 అపజయంలో క్రుంగిపోతే ఆత్మన్యూనత వరిస్తుంది. మన ఉన్నతికి విఘాతం కలిగించే దోషాలను వదిలివేయడం, లోపాలను సవరించుకుంటూ, ముందుకు సాగడం వల్ల పరిణతి ఉన్నతి లభిస్తాయి.

ఈ క్రమంలో పైన చెప్పిన ఆరు దోషాలను విశ్లేషించుకుంటే....

 నిద్రలో శరీరం విశ్రాంతమౌతుంది. ప్రాకృతిక శక్తి మనలోకి ప్రవేశించి శక్తిమంతులను చేస్తుంది. కానీ.. అతినిద్ర లేదా నిద్ర లేమి వల్ల ఆరోగ్యం పాడవుతుంది. ఆరోగ్యమే మహాబాగ్యం. అది చెడిపోతే అన్నీ పోయినట్లే.

రెండో లక్షణం బద్ధకం.
ఇష్టమయిన దాని కోసం అవసరమైన దానిని వదిలివేయడం బద్ధకం. దానివల్ల వాయిదా వేసే జబ్బు కలిగి, సమయానికి ఏ పనీ పూర్తిచేయలేం.

అనుకోని పరిస్థితులు ఎదురైతే వాటిని అనుమోదించలేని సమయంలో కలిగేది భయం. భయం వల్ల ఏ పనిని సంకల్పించినా.. ‘‘ఇది నాకు సాధ్యపడుతుందా.. అపహాస్యం పాలవుతానేమో... అపజయం కలుగుతుందా’’ అనే అనుమానాలు వెన్నాడుతూ ఉంటాయి. అనుమానాల వల్ల ఉత్సాహం తగ్గుతుంది, ధైర్య సాహసాలు సన్నగిల్లుతాయి. బుద్ధి పనిచేయదు, శక్తి సామర్థ్యాలు మందగిస్తాయి. ప్రయత్నం మధ్యలోనే విడిచిపెడతాం.

 ఇక, క్రోధం అన్ని అనర్థాలకూ మూలకారణం. పరిస్థితులు మనం అనుకున్నట్లుగా లేనప్పుడు కోపం వస్తుంది. కోపం మనలోని భావోద్వేగానికి సంకేతం. కోపం దీర్ఘమైతే క్రోధంగా మారుతుంది. క్రోధం వల్ల మోహం కలుగుతుంది. మోహం వల్ల స్మృతి తపుఁతుంది. దాని వల్ల బుద్ధి సరిగా పనిచేయదు అలసత్వం వల్ల విద్య దక్కదు.

 విద్య లేనివానికి ధనం లేదు, ధనం లేక మిత్రులు ఉండరు, మిత్రులు లేకపోతే సుఖమూ ఉండదు.

 అలాగే.. ఎడతెగని ఆలోచనల వల్ల కార్యరంగంలోకి దిగడం కుదరదు. ఈ ఆలోచనలు ప్రతిబంధకాల వైపు మాత్రమే నడిపిస్తాయి. ప్రణాళికలు రూపొందాలంటే ఆలోచనలు అవసరమే కానీ, అవి ఆచరింపబడితేనే విజయం.

 ఇలా ఈ ఆరు దోషపు అలవాట్లను వదిలితేనే అభ్యున్నతి .

🍁🍁🍁🍁

*ధార్మికగీత - 22*


                                     *****
          *శ్లో:- అపూజితో౽ తిథిర్యస్య౹*
                  *గృహాత్ యాతి వినిశ్వసన్ ౹*
                  *గచ్ఛన్తి విముఖా: తస్య ౹*
                  *పితృభి స్సహ దేవతాః ౹౹*

అతిథియె నిత్య దేవుడిల ,
          హార్ధిక స్వాగత మిచ్చి యాతనిన్
సతతము తృప్తి నొందగను
           సల్పుట సేవలు గేస్టు ధర్మమౌ,
నతడటు తృప్తి పొందకను
           యాతని ద్రోవను నిష్క్రమించినన్ ,
నతనిని గూడి పోయెదరు
           యా గృహ దేవత పైతృదేవతల్ .

గోపాలుని మధుసూదన రావు

రామాయణమ్...63..64

రాముడొచ్చాడని తనకు తెలిపిన సుమంత్రునితో రాణులకు కూడా కబురుచేయించాడు దశరథుడు ! .
.
దశరథుడి రాణులందరూ కౌసల్యతో కలిసి వచ్చారు .
.
దశరథుడి భవన ప్రాంగణం మూడువందల యాభయిమంది రాణులతో ,ఆయన మంత్రులతో కిక్కిరిసి ఉన్నది.రాణులందరూ వచ్చిన తరువాత రాముని ప్రవేశపెట్టమన్నాడు దశరథుడు.
.
రాముడు అల్లంతదూరంనుండే తండ్రికి నమస్కారం చేసుకుంటూ వస్తున్నాడు. కొడుకును చూడగనే ఆపుకుంటున్న దుఃఖం ఒక్కసారిగా కట్టలు తెగింది . ఎదురువెళుతూ వెళుతూ దుఃఖభారంతో కూలబడిపోతున్నాడు ,లేవలేక పోతున్నాడు.
.
చప్పున వచ్చి ఆయన పడకుండా చెరోవైపు పట్టుకున్నారు రామలక్ష్మణులు.
.
మూర్ఛపోయిన తండ్రికి పరిచర్యలు చేశారిరువురూ ! తేరుకున్నపిదప దశరథుడు ,రామా నన్ను చంపివేసి అయినా సరే నీ రాజ్యము నీవు దక్కించుకో నాయనా ! అంటూ ఏడ్వసాగాడు ..
.
ఏమాత్రము మనో వైకల్యము లేని రాముడు ! తండ్రీ ! పదునాలుగేండ్లు ఎంతసేపు ! మరల తిరిగివచ్చి నీ పదములపైవ్రాలనా ! నీవు చక్రవర్తివి !ఇలా బేలకావలదు !
లోకం నిన్ను అసత్యవాది అని అనటం నేను భరించలేను తండ్రీ! .
.
నీవిచ్చిన మాటను చెల్లించటం నా కర్తవ్యము కాదా ! అసలు అదే నా కర్తవ్యము ! నా ధర్మము! ..
.
రాముడి మాటలకు దశరథుడు మారుమాటాడలేక నాయనా పోనీ ఈ ఒక్కరాత్రి ఉండిపోరా ! నీకిష్టమయినవన్నీ అనుభవించి వెళ్ళరా తండ్రీ అని దీనంగా బ్రతిమిలాడాడు. ! .కైకను దూషించాడు.
.
లోపల ఇంత విషము దాచుకొన్న ఈ స్త్రీ నేడు దానిని బయల్పరచినది .నివురుగప్పిన నిప్పు అని నా కిన్నినాళ్ళు తెలవలేదురా రామా!
.
తండ్రీ ఈ రోజు నీవిచ్చే ఈ భోగాలనుభవిస్తాను ,కానీ రేపటినుండీఎవరిస్తారు?.
.
 కోరికలన్నింటినీ విడిచి ఇప్పుడే అడవికి బయలుదేరతాను అనుమతించండి అని దోసిలి ఒగ్గి నిలుచున్న కొడుకును గాఢంగా కౌగలించుకొని మరల మూర్ఛితుడయ్యాడు దశరథుడు.
.
ఈ వ్యధలకు కారణమైన కైకను చూసి పట్టరాని కోపమొచ్చింది సారధి సుమంత్రునకు.
.
కైకమ్మా ! ఏ ఆడుదీ చేయకూడని పనిచేశావు ,నీ భర్తను క్షోభపెడుతున్నావు .అంతటి దశరధమహారాజుకు ఇంతటి వేదనరగిలించావు ! నీవు కులఘ్నివి! రాముడులేని ఈ రాజ్యములో మేమెవరమూ నివసింపము, ఆయనతోటే వెళ్లిపోతాము .నీవే ఎవరూలేని మరుభూములను తలపించే అయోధ్యను నీ కొడుకుతో కలిసి ఏలుకో !
.
భూమి ఎందుకు బ్రద్దలుకాలేదో నాకు అర్ధం కావడంలేదు ! లోకమంతా నిన్ను ఛీత్కరిస్తున్నది !
.
అయినా ,ఆడపిల్లకు తల్లిబుద్ధులు వస్తాయంటారు .ఆ తల్లికడుపున పుట్టిన నీకు ఇంతకన్నా మంచి బుద్ధి ఎలా వస్తుందిలే!..
.
.వేప చెట్టునుండి మధురమైనతేనె వస్తుందా?
.
నీ తల్లిగూర్చి చెపుతాను విను అంటూ సుమంత్రుడు పలికాడు.
.

జానకిరామారావు వూటుకూరు గారి
సౌజన్యం తో ....

రామాయణమ్.64
...
నా అహంకారము నాదే ! కట్టుకున్నవాడు కాటికిపోయినా ఫరవాలేదు.......ఇది నీ తల్లి బుద్ధి ! నీకూ అదే సంక్రమించినది.
.
ఒక మహాపురుషుడు నీ తండ్రికి ఒక వరమిచ్చాడు. ఆ వర ప్రభావమువల్ల నీ తండ్రి సకలప్రాణుల సంభాషణ అర్ధం చేసుకోగలడు. వరమిచ్చిన మహానుభావుడే ఇంకొక విషయము కూడా చెప్పాడు .తను విన్న సంభాషణ ఎవరికైనాసరే తెలియచేస్తే తనకు మరణం కలుగుతుంది ,సంభాషణ వినటం వరకే అధికారం కానీ విన్నదానిని బయటపెట్టరాదన్నమాట.
.
నీ తల్లీ తండ్రి ఏకాంతంగా ఉన్న సమయమది.మంచము మీద ప్రాకుతున్న" జృంభ" అనే చీమ మాటలాడింది.దాని అర్ధము తెలుసుకొన్న నీ తండ్రికి నవ్వువచ్చి బిగ్గరగా నవ్వాడు ..
.
ఆ నవ్వు తనను గురించే పరిహసిస్తూ నవ్వాడనకొని నీ తల్లి ఆ పరిహాసాన్ని సహించలేక కారణమడిగింది.
.
నిన్ను చూసి కాదులే ! చీమ బలే తమాషాగా మాట్లాడింది అందుకు నవ్వు వచ్చింది ,అని అన్నాడు నీ తండ్రి.
.
చీమ మాట్లాడిన మాటలు తనకు చెప్పమంది మీ అమ్మ ! చెబితే తనకు ప్రాణగండమున్నదికావున నీ తండ్రి నిరాకరించాడు !
.
అప్పుడు నీ తల్లి పట్టినపట్టు వీడక ....నీవు బ్రతికి తే నాకేమిటి చస్తే నాకేమిటి ? ఆ సంభాషణ నాకు నీవు చెప్పి తీరవలసిందే అని అహంకారపూరితంగా మాట్లాడింది..
.
నీ తల్లి మంకుపట్టు మానలేదు. మీ నాన్నకు ఏమిచేయాలో తోచక తనకు వరమిచ్చిన మహానుభావుడి సలహా కోరాడు.
ఆయన ఎట్టి పరిస్థితుల్లోనూ చెప్పవద్దు ఏమైనా కానీ అని మరల చెప్పాడు.
.
స్త్రీ కి భర్తక్షేమము కన్న ముఖ్యమైనదేదీ లేదు ,భర్తకన్నా తన అహంకారమే ముఖ్యమనుకొన్న స్త్రీ నీ తల్లి ! అట్టి నీ తల్లిని మూర్ఖపు ప్రవర్తన వల్ల నీ తండ్రి తిరస్కరించాడు.తిరస్కరించి తను క్షేమంగా ఉన్నాడు
.
మరల నీవిపుడు దానిని పునారావృతము గావించుచున్నావు !
.
దశరథ మహారాజు ఏ దోషములూ లేని ఉత్తముడు ! నీ కోరిక ఆయనను క్షోభపెడుతున్నది.అది ఆయన పాలిటి మృత్యుపాశము. ఆయన ఇచ్చిన మాట ఇప్పుడు ఆయన మెడకు చుట్టుకొన్నది ఆ పాశములు నీవు విసరినవే !
వాటిని వెనుకకు తీసుకో !
.
రాముడు అన్నదమ్ములలో జ్యేష్ఠుడు ,ఉదారుడు!
ఎంతటి క్లిష్టతరమైన కార్యములనయినా నిర్వహింపగల సమర్ధుడు.
స్వధర్మాన్ని కాపాడుకొనేవాడు
ప్రాణులను అందరినీ రక్షించేవాడు
మహాబలశాలి!
అటువంటి రామునికి పట్టాభిషేకము జరిగేటట్లుగా చూడు!
అనవసరమైన అపవాదులు ,చెడ్డపేర్లు మోయకమ్మా ! అని పలికి సుమంత్రుడు మరల నమస్కరిస్తూ నిలబడ్డాడు.
.
ఇంత పలికినా సుంతకూడా మార్పురాలేదు కైక ముఖకవళికలలో !
.
జనులేమనుకొన్న నాకేమి? నా పంతమే నాదిగానీ ! అన్నట్లుగా నిశ్చలంగా బెల్లంకొట్టిన రాయిలాగ నిలబడి ఉన్నది.
.
దశరథుడది చూసి దీర్ఘంగా నిశ్వసిస్తూ ,సుమంత్రా ! రాముని వెంట సకలసంభారాలు పంపించు,చతురంగబలాలు అతనిని అనుసరించనీ ! కోశాగారము సమస్తమూ రాముని వెంటే!
గీత,నృత్త,వాద్య బృందాలన్నీ రాముని తోటే వెళ్ళాలి .
సకల భోగవస్తువులన్నీ నా రాముడి వెంటే ఉండాలి ,వనవాసము పదునాలుగేండ్లు విహారయాత్రకావాలి వెంటనే ఏర్పాట్లుగావించు అని ఆజ్ఞాపించాడు.
.

జానకిరామారావు వూటుకూరు గారి
సౌజన్యం తో ....

*ధర్మధ్వజం*
హిందు చైతన్య వేదిక

.

*ధర్మధ్వజం*
హిందు చైతన్య వేదిక

.

తెలుసు కుందాం




*🟥జింక చర్మము మీద కూర్చుని గతమ్లో తపస్సు చేసేవారు ఎందుకు?*

🟢వేదాలలో ఋగ్వేదము రంగు "తెలుపు " , సామవేదము రంగు " నలుపు " . ఆ రెండు వేదాల రంగులే ..... పగలూ ,రాత్రి . అందుకే పూర్వము ఆ వర్ణాలు గల జింక చర్మము మీద తపస్సు చేసేవారు. జింక చర్మము మీద తపస్సు అనేక వ్యాధులను దూరము చేస్తుందని ఆయుర్వేద శాస్త్రాల సారాంశము ద్వారా తెలుస్తోంది.

ఈ కాలములో జింక చర్మము మీద తపస్సు చాలా పెద్ద నేరము . పూర్వం కాలము లో కాలం చెల్లిన జింక చర్మాలను మాత్రమే ఋషులు ఉపయోగించేవారు .

మహాలయ అమావాస్య

*మహాలయ అమావాస్య 17/09/2020 గురువారం*

మానవుడు తాను చేసిన పాపుణ్యాల ఆధారంగా నరక స్వర్గ లోకాలు ప్రాప్తిస్తాయి. స్వర్గం చేరటానికి అనేక ద్వారాలు దాటు కుంటూ వెళ్లాలి. కొన్ని మన పుణ్య కార్యాల వలన మన పాపాలను కడుక్కుంటూ స్వర్గం వైపు వెళుతుంటాం. మన మరణం తరువాత ఆత్మ పూర్తిగా స్వర్గాన్ని చేరలేదు. వారి పాపాలు కడగటానికి వారి సంతానం శ్రాద్ధ కర్మాదులు నిర్వహించి వారిని పాప విముక్తులను చేయాలి. దీనికి సంబంధించి మత్స్య పురాణం లో ఓ కధ ఉన్నది. అసలు అమావాస్య కి శ్రాద్ధ కర్మలకు గల సంబంధం వివరించబడింది.

ప్రతిమాసంలోను వచ్చే అమావాస్య అన్నా, మహాలయ అమావాస్య అన్నా పితృదేవతలకు ఎంతో ఇష్టమని, ఆ రోజున శ్రాద్ధ కర్మాదులను చేస్తే మంచి ఫలితం ఉంటుందని పెద్దలంతా అంటుంటారు. పితృదేవతలు ఏడుగణాలుగా విభజించపడ్డాయి. వీరిలో మూడు గణాలవారికి ఆకారం ఉండదు. వైరాజులు, అగ్నిష్వాత్తులు, బర్హిషదులు అనేవారికి ఇలా ఆకారం ఉండకపోవడం విశేషం. అలాగే సుఖాలినులు, హవిష్మంతులు, ఆజ్యపులు, సోమపులు అనే నాలుగు గణాలకు ఆకారం ఉంటుంది.

ఈ ఏడుగణాలవారూ ప్రాణులందరిలో అమితమైన సామర్థ్యాన్ని, చైతన్యాన్ని కలిగిస్తుంటారు. అందుకే ఈ పితృదేవతలకు కావల్సిన శ్రాద్ధవిధులను నిర్వర్తించాలని అంటారు. మూర్తి (ఆకారం) లేని పితరులు వైరాజుడు అనే ప్రజాపతి కుమారులు. అందుకే వీరిని వైరాజులు అని అంటారు. ఈ అమృతాలైన పితృగణాలవారు శాశ్వతాలైన లోకాలను పొందగోరి ఓసారి యోగసాధనకు ఉపక్రమించారు. అయితే ఏకాగ్రత లోపించి యోగం కోల్పోతారు. ఈ కారణంగా వీరంతా పితృదేవతలుగా మారారు. ఈ పితృదేవతల మానసపుత్రికే మేన. ఈమె హిమవంతుడిని పెళ్లాడింది. హిమవంతుడికి మైనాకుడు అనే కుమారుడు జన్మించాడు. మైనాకుడికి క్రౌంచుడు జన్మించాడు. ఆ క్రౌంచుడి పేరుమీదనే క్రౌంచద్వీపం ఏర్పడింది. మేనా హిమవంతులకు ముగ్గురు కుమార్తెలు కూడా ఉన్నారు. ఉమ, ఏకపర్ణ, అపర్ణ అని ఆ ముగ్గురు కుమార్తెల పేర్లు. ఆ కన్యలు మంచి యోగసిద్ధి కలవారు. హిమవంతుడు ముగ్గురిలో పెద్దదైన ఉమను రుద్రుడికి, ఏకపర్ణను భృగువుకు, అపర్ణను జైగీషవ్యుడికి ఇచ్చి వివాహం చేశాడు. ఇలా వైరాజ పితృదేవతల సంతతి వృద్ధి చెందింది. సోమపథాలు అనే లోకాలలో మరీచి అనే ప్రజాపతికి జన్మించిన పితృదేవతా గణాలు నివసిస్తుంటాయి.

ఈ పితృదేవతలకు ఒక మానస పుత్రిక ఉంది. ఈమె పేరుమీదనే అనంతర కాలంలో అమావాస్య తిథి వచ్చింది. ఈమె జీవనకథనంలో నేటివారికి ఉపయుక్తమయ్యే ఓ సందేశం కూడా ఇమిడివుంది.

అగ్నిష్వాత్తుల మానసిక పుత్రిక పేరు అచ్చోద. ఆమె నదీరూపంగా ఉండేది. అచ్చోదను పితృదేవతలు ఒక సరస్సులో సృష్టించారు. ఓరోజున వారంతా కలిసి ఆమె దగ్గరకు వచ్చారు. ఏదైనా వరం కోరుకోమని తమ కూతురును అడిగారు. అయితే దివ్యపుష్పమాలికలు, దివ్యగంధాలు, మంచి అలంకారాలు చేసుకుని ఎంతో సుందరాకృతిలో ఉన్న మావసుడు అనే ఒక పితరుని చూసి అచ్చోద కామపరవశురాలైంది. ఇంద్రియ నిగ్రహాన్ని కోల్పోయి తండ్రి అయిన మావసుడినే కోరిన కారణంగా ఆమె అప్పటిదాకా సంపాదించిన యోగశక్తి అంతా నశించింది. దాంతో ఆమె తన దివ్యత్వాన్ని కోల్పోయింది. అసంబద్ధంగా ఇంద్రియ నిగ్రహాన్ని కోల్పోయి ప్రవర్తించినందువల్లనే ఆమెకు ఇంతటి నష్టం ప్రాప్తించింది. పితృదేవతలు అచ్చోద తమకు ఎంతో అభిమానపాత్రురాలైన మానసపుత్రికే అయినా ధర్మాన్ని అనుసరించి శిక్ష విధించడంలో… అంటే ఆమెకు దివ్యత్వం నశించాలని శపించడంలో వెనుకాడలేదు. మావసుడు మాత్రం అచ్చోదను కామించక ఇంద్రియ నిగ్రహంతోనే ప్రవర్తించాడు. అచ్చోద మావస్య కాలేదు. అంటే మావసుడికి ప్రియురాలు కాలేదు. అందుకే ఆమె అమావస్య అయింది. అమావస్య అంటే మావసుడికి ప్రియురాలు కానిది అనేది ఇక్కడి అర్ధం. అలా తదనంతర కాలంలో అచ్చోదకే అమావాస్య అనే పేరు ప్రాప్తించింది. ఈమె అంటే పితృదేవతలకు ఎంతో ప్రాణం. తమ మానస పుత్రిక మీద ఉండే మమకారంతో అచ్చోద అమావస్య (అమావాస్య తిథి) అయిన రోజున తమకు ఎవరైనా అర్పించిన శ్రాద్ధానికి అనంత ఫలితాన్ని ఆనాటి నుంచి పితృదేవతలు ఇస్తూ వ చ్చారు.

🌹🙏🌹

ప్రముఖ ప్రజాపతులును

🌺 *ఓం నమో నారాయణాయ* 🌺


*222. ఇ వ్విధంబున వామనుం డయి హరి బలి నడిగి, మహిం బరిగ్రహించి, తనకు నగ్రజుండగు నమరేంద్రునకుం ద్రిదివంబు సదయుం డయి యొసంగె; న త్తరి దక్ష భృగు ప్రముఖ ప్రజాపతులును, భవుండును, గుమారుండును, దేవర్షి, పితృగణంబులును, రాజులును, దానును గూడికొని చతురాననుండు గశ్యపునకు నదితికి సంతోషంబుగా లోకంబులకు లోకపాలురకు "వామనుండు వల్లభుం" డని నియమించి యంత ధర్మంబునకు యశంబునకు లక్ష్మికి శుభంబులకు దేవతలకు వేదంబులకు వ్రతంబులకు స్వర్గాపవర్గంబులకు "నుపేంద్రుండు ప్రధానుం" డని సంకల్పించె నా సమయంబున.*


*భావము:* ఈ విధంగా విష్ణువు వామనావతారం ఎత్తి, బలిచక్రవర్తి వద్ద భూదానం తీసుకున్నాడు. తన అన్న అయిన ఇంద్రుడికి దయతో స్వర్గలోకాన్ని ఇచ్చాడు. ఆ సమయంలో దక్షుడు, భృగువు మొదలైన ప్రజాపతులు; శివుడు; కుమారస్వామి; నారదుడు మున్నగు దేవర్షులు; పితృదేవతలు; రాజులుతో పాటు కలిసి బ్రహ్మదేవుడు "లోకాలకూ దిక్పాలకులకూ వామనుడు ప్రభువు" అని శాసనం చేసాడు. ఈ విషయం కశ్యపుడికి అదితికి సంతోషం కలిగించింది. పిమ్మట, "ధర్మానికి కీర్తికీ సంపదలకూ శుభాలకూ దేవతలకూ వేదాలకు స్వర్గానికి మోక్షానికి ఉపేంద్రుడైన వామనుడే అధికారి" అని నిర్ణయించాడు.



*223. కమలజుఁడు లోకపాలురు నమరేంద్రునిఁగూడి దేవయానంబున న య్యమరావతికిని వామను నమరం గొనిపోయి రంత నట మీఁద నృపా!"*


*భావము:* పరీక్షన్మహారాజా! అటుపిమ్మట బ్రహ్మదేవుడూ దిక్పాలకులూ దేవేంద్రుడితో కలిసి ఎంతో ఆదరంతో వామనుణ్ణి విమానంపై కూర్చోపెట్టుకుని అమరావతికి తీసుకుని వెళ్లారు.



*224. బల్లిదంపుదోడు ప్రాపున నింద్రుని కింద్రపదము చేరు టిట్లు గలిగెఁ; దనకు నాఢ్యుఁడైన తమ్ముఁడుఁ గలిగినఁ గోర్కులన్న కేల కొఱఁత నొందు?*


*భావము:* ఈ విధంగా బలవంతుడైన తమ్ముడి ప్రాపువల్ల, ఇంద్రుడికి ఇంద్రపదవి తిరిగి లభించింది. శ్రేష్ఠుడైన తమ్ముడుంటే అన్నగారి కోరికలు నెరవేరకుండా ఉంటాయా.

రామాయణమ్.78


...
ఆ రాత్రి కీకారణ్యములో మొదటిరాత్రి వారు మువ్వురికి.
.
సాధారణమానవుడై జరిగిన విషయాలు తలచుకొని దుఃఖితుడయ్యాడు మరలా రామచంద్రమూర్తి.
.
లక్ష్మణా నా తల్లి కౌసల్య పూర్వజన్మలో ఏ తల్లిబిడ్డలను విడదీసినదో కానీ ఆవిడకు పుత్రవియోగము ప్రాప్తించినది.అంతటి మహాధార్మికుడైన మనతండ్రికి ఈ వయస్సులో ధర్మము,అర్ధము కంటే కామమే ప్రధానమైనదికదా ! .
.
ఈ లోకంలో ఎవడైనా తనకు అత్యంత విధేయుడైన కుమారుడిని ఒక ఆడుదాని మాటమీద విడిచేవాడుంటాడా?.
.
ముదిమివయస్సులో నేను దూరమయ్యానన్న దిగులుతో రాజు మరణిస్తాడు,భరతుడు రాజ్యాన్ని నిష్కంటకంగా ఏలుకుంటాడు.
.
చూడబోతే ఈ కైక నన్ను అడవులపాలుచేయడానికి,దశరధుడినిచంపడానికి,భరతుడిని రాజు చేయడానికే మన ఇంట చేరినదేమో అని అనిపిస్తున్నది.
.
కైక తనకు కలిగిన ఈ సౌభాగ్యముతో కన్నుమిన్నుగానక కౌసల్యా,సుమిత్రలను కష్టపెడుతుందేమో!
.
 లక్ష్మణా నీవు రేపు తెల్లవారగనే తిరిగి అయోధ్యకు వెళ్ళిపో! అనాధ అయిపోయిన నా తల్లిని రక్షించుము .
.
ఇది అమ్మకు దగ్గర ఉండి సేవ చేయవలసిన సమయము.
తల్లికి అనంతమైన శోకము కలిగిస్తున్నాను నేను.
 ఏ ఆడుదీ నా వంటి కొడుకును కనకుండుగాక,
వ్యర్ధజన్ముడను నేను.
.
లక్ష్మణా నేను కోపిస్తే అయోధ్యనేమిటి,సమస్తభూమండలాన్నే స్వాధీనమొనర్చుకొనగలను .
,కానీ ఇది పరాక్రమము చూపే సందర్భముకాదు కదా!.
.
ఇలా అంటూ కంటినిండా నీరునింపుకొని దైన్యముతో ఇంకా ఏమీ మాటాడలేక అలాగే కూర్చుండిపోయాడు రాముడు.
.
 విలపిస్తున్న రాముడిని ఓదార్చాడు లక్ష్మణుడు.
.
అన్నా నీవే ఇలా దిగులుపడితే నేనూ ,వొదినగారూ ఏం కావాలి? నీవు దగ్గరలేక పోతే నేను గానీ ,సీతమ్మకానీ నీటినుండి బయటకు తీసిన మత్స్యములమైపోతామయ్యా!
క్షణకాలము కూడా భూమిపై మనలేము.
.
శత్రుసంహారకుడవైన ఓ రామా ! నిన్ను విడిచి నా తల్లి సుమిత్రనుకానీ,శత్రుఘ్నుని కానీ,తండ్రినికానీ ఆఖరికి అది స్వర్గమైనా కానీ నేను వెళ్ళను.
.
సర్వలోకాలను ఆనందింపచేయువారలలో శ్రేష్ఠుడైన రాముడు(రామో రమయతాం శ్రేష్ఠః) తమ్ముడి మాటలతో తేరుకొని మనస్సును దృఢం చేసుకొని వనవాసము పూర్తిగావించుకొనుటకు సంకల్పించుకొన్నాడు.
.
అప్పుడు ఆ అన్నదమ్ములిరువురూ పర్వతచరియలపై నిర్భయముగా సంచరించే రెండు సింహాలలాగ ప్రకాశించారు.
.
NB
.
ప్రతి మనిషి జీవితంలో ఇలాంటి ఘట్టాలు దాదాపు గా ఏదో ఒక సందర్బంలో ఎదురవుతూనే ఉంటాయి .మనసు నీరవుతూనే ఉంటుంది అయినా ఎన్నుకున్న మార్గంలో ముందుకు నడిచే వాడే ధీరుడు...
.
అనుకోలేదాయన అడవులకు వెళ్ళాల్సి వస్తుందని కానీ పిడుగులాంటి ఆ నిర్ణయం తనకు తనే చేసుకున్నాడు . మార్పును ఆహ్వానించాడు .ఆ మార్పుకు అలవాటుపడే క్రమంలో రాముడి మనస్సుకు దర్పణమిది!
.
CHANGE MANAGEMENT!.

రామాయణమ్.79
..
రాత్రి గడిచి తెల్లవారింది. పక్షుల కిలకిలారావాలు,నెమళ్ళక్రేంకారాలు,అడవికోడి కూతలతో అరణ్యంలో సందడిసందడిగా ఉంది.సీతారాములు నిదురలేచారు.మరల నడక సాగించారు.
.
కొంతదూరము వెళ్ళగనే వారికి పెద్దపెద్ద జలరాశులు కలుసుకున్న చప్పుడు వినపడ్డది. ఆ జలతరంగ ఘోషను శ్రద్ధగా ఆలకించారు .వారికి అర్ధమయ్యింది అది గంగా యమునల సంగమక్షేత్రమని అతి దగ్గరలోనే ప్రయాగ కలదనీ.
.
వారు నడుస్తున్న ప్రాంతంలో మనుషులచే విరవబడినట్లుగా కర్రముక్కలు కనపడ్డాయి. తలెత్తి పరీకించి చూసారు. దూరంగా పొగ ఆకాశంలోకి వెడుతూ కనపడ్డది.
.
ఉత్సాహంగా నడక సాగించారు .ఒక ఆశ్రమ పరిసరప్రాంతాలలో తామున్నట్లు గ్రహించారు.అది భరద్వాజమహర్షి ఆశ్రమము.
.
ఆశ్రమంలో అడుగు పెట్టగానే ధనుర్ధారులైన వారిని చూసి ఆశ్రమంలోని మృగాలు భయపడ్డాయి.
.
వారు మువ్వురూ శిష్య గణంతో శోభిల్లుతున్న భరద్వాజ మహర్షికి వినయంగా నమస్కారములు చేసి తమను తాము పరిచయం చేసుకున్నారు.
.
మహర్షీ నన్ను రాముడంటారు దశరధమహారాజు పుత్రుడను,ఈ కల్యాణి సీత జనకరాజపుత్రి అనిందిత నా సహధర్మచారిణి.
.ఈతడు నా సోదరుడు లక్ష్మణుడు నా తండ్రి నన్ను అరణ్యములకు పంపగా తనంతతానే నన్ను అనుసరిస్తూ వస్తున్నాడు.
.
మహర్షీ ! నా తండ్రి ఆజ్ఞమేరకు మేము అరణ్యవాసము చేస్తూ కందమూలఫలములములు స్వీకరిస్తూ కాలం గడిపెదము.అని పలికిన రాముని చూసి రామా నీ గురించి అంతా విన్నాను.
.
ఎంతో కాలానికి మా ఆశ్రమానికి వచ్చావు మా ఆతిధ్యం స్వీకరించు అని మధుర ఫలరసాలతో కూడిన కమ్మని ఆహారం ( తాపసులు భుజించేది,అరణ్యంలో లభ్యమయ్యేవి) వారికి అందచేసి వారుండటానికి బస ఏర్పాటు చేశాడు భరద్వాజ మహర్షి.
.
మరల రాత్రి రానే వచ్చింది .ఎంతో దూరము నడచిన అలసట వల్ల సీతారాములు గాఢంగా నిదురించారు.
.
ఆ రాత్రి తెల్లవారిన పిదప రాముడు మహర్షి వద్ద సెలవు తీసుకొని మహర్షి సూచించిన చిత్రకూటపర్వతం వైపు నడక సాగించారు.ఆ పర్వతము మనోహరమై ఉండి క్రూరమృగ బాధలేని ,తాపసులు నివాసముండే ప్రాంతము .అక్కడికి పది క్రోసుల దూరంలో ఉన్నది.
.
అంతకు ముందు భరద్వాజుడు తన ఆశ్రమంలోనే వనవాసం పూర్తిచేసుకొమ్మని చెప్పినప్పటికీ అది తమ కోసల ప్రజలు తేలికగా రాదగ్గప్రాంతం కావున సున్నితంగా వలదని అనువైన ప్రదేశం చిత్రకూటమని తెలుసుకొని ఆ దిశగా శ్రీ రామ ప్రయాణం సాగింది.

భీష్ముడి శపథం

ఆదిపర్వము – 21



ఒకరోజు శంతనుడు యమునా నదీ తీరంలో విహరిస్తున్నాడు. దూరం నుండి మంచి పరిమళం వస్తూ ఉంది. ఆ పరిమళం వస్తున్న వైపుగా వెళ్లగా, అక్కడ ఒక అందమైన కన్యను చుసాడు శంతనుడు. ఆమె యోజన గంధి(సత్యవతి). ఆమె ఒంటి మీద నుండి వచ్చే పరిమళాన్ని, ఆమె సౌందర్యాన్ని చూసి పరవశించిపోయాడు శంతనుడు.

“ఓ సుందరీ, నీవు ఎవరు? ఒంటరిగా ఇక్కడ ఎందుకు పడవ నడుపుతున్నావు?” అని అడిగాడు.

“ఓ రాజా, నేను దాశ రాజు కూతురిని. తండ్రిగారి ఆజ్ఞ మేరకు పడవ నడుపుతున్నాను” అని బదులు చెప్పింది సత్యవతి.

శంతనునికి ఆమెను వివాహం చేసుకొన వలెనని కోరిక కలిగింది. వెంటనే శంతనుడు దాశ రాజు దగ్గరకు వెళ్లి, తన కోరిక వెల్లడించాడు.

“మహారాజా, ఆడపిల్ల పుట్టిన వెంటనే ఒక వరుని చేతిలో పెట్టడం సంప్రదాయం.. నా కుమార్తెను నీ నీ వంటి వరునికి ఇవ్వడానికి అభ్యంతరం ఏముంది. కాని, నాది ఒకకోరిక ఉన్నది” అని అన్నాడు దాశరాజు.

“అదేమిటో చెప్పు” అని అడిగాడు శంతనుడు.

“నా కుమార్తెకు పుట్టబోయే సంతానానికి రాజ్యాధికారం దక్కాలి” అని కోరాడు దాశరాజు.

దానికి శంతనుడు ఒప్పుకోలేదు. గాంగేయుడికి తప్ప వేరే వారికి రాజ్యం ఇవ్వడం ఇష్టం లేదు. వేరే ఏదైనా కోరుకో అన్నాడు శంతనుడు.

“నాకు మరేమీ ఇష్టం లేదు” అన్నాడు దాశరాజు.

విచారంతో శంతనుడు హస్తినాపురానికి తిరిగి వచ్చాడు. అప్పటినుండి శంతనుడు రాచకార్యాలు సరిగా చూడ్డంలేదు, ఎప్పుడూ ఏదో విచారంగా ఉంటున్నాడు. గాంగేయుడు ఇది చూసాడు.

“తండ్రీ, మీ మనోవేదనకు కారణమేమి?” అని అడిగాడు

“గాంగేయా, ఒకే పుత్రుడు కలవాడు, అసలు సన్ర్తానం లేని వాడు సమానమే అని ధర్మశాస్త్రాలు చెపుతున్నాయి. నీకు తోడుగా మరికొంత మంది కొడుకులను కనాలని కోరికగా ఉంది. పైగా, నువ్వు అస్త్ర, శస్త్ర విద్యలలో ఆరితేరిన వాడవు. శత్రువుల పట్ల క్రూరుడవు. అత్యంత సాహసికుడవు. కాబట్టి, నీకు ప్రమాదం ఎప్పుడూ పొంచి ఉంది. నువ్వు ఎన్నాళ్లు బతుకుతావో తెలియదు. కాబట్టి, ఇంకా కొంతమంది పుత్రులు ఉంటే బాగుంటుంది అని అన్నాడు.

తండ్రికి మరల వివాహం చేసుకొనె వలెనని కోరికగా ఉంది అని గాంగేయునికి అర్థం అయింది. మంత్రులతో ఆలోచించి అసలు విషయం తెలుసుకున్నాడు. దాశరాజు దగ్గరకు వెళ్లాడు.

“దాశరాజా, నీ కుమార్తె యోజన గంధిని నా తండ్రి శంతనునికి ఇచ్చి వివాహము చేయుము” అని అడిగాడు.

“చాలా సంతోషము, నీవు నీ తండ్రి కొరకు కన్యను అడగడానికి వచ్చిన ధర్మాత్ముడివి. ఈ కన్య సామాన్యురాలు కాదు. ఉపరిచర వసువు వీర్యానికి జన్మించింది. ఆ ఉపరిచర వసువు ఈ కన్యను శంతన మహారాజుకే ఇమ్మని చెప్పాడు. అందుకే ఇది వరకు దేవలుడు అడిగినా ఇవ్వలేదు. కాని నాది ఒక కోరిక. నా కూతురికి పుట్టే పుత్రులు సవతి కుమారులూవుతారు. కాబట్టి ఆ దోషం లేకుండా చెయ్యి” అని చెప్పాడు దాశరాజు.

గాంగేయునికి దాశరాజు ఆంతర్యం అర్థం అయింది. వెంటనే అక్కడ ఉన్న వారిననందరిని పిలిచి “ఇక్కడ చేరిన రాజులు అమాత్యులు, ప్రజలు అందరూ వినండి. నా తండ్రికి కాబోయే భార్య అయిన ఈ యోజన గంధికి పుట్టబోయే పుత్రులే ఈ రాజ్యానికి వారసులు అవుతారు. అతనే మన అందరికి ప్రభువు” అని చెప్పాడు.

కాని దాశరాజుకు ఒక సందేహం కలిగింది.

“గాంగేయా, నీవు రాజ్యాధికారాన్ని వదులుకున్నావు. కాని నీకు పుట్టబోయే పుత్రులు ఊరుకోరు కదా. వారు నీ మాటను అంగీకరిస్తారా?” అని అడిగాడు.

“దాశరాజా నాకు పుత్రులు కలిగితేనే కదా ఆ సమస్య వచ్చేది. అందుకే నేను ఈ రోజు నుండి బ్రహ్మచర్య వ్రతాన్న్ని స్వీకరించాను. ఆజన్మాంతం బ్రహ్మచారిగానే ఉంటాను. నీ కూతురిని నా తండ్రికి ఇచ్చి వివాహం చెయ్యడానికి అభ్యంతరం లేదుగా” అని అన్నాడు గాంగేయుడు.

గాంగేయుడు చేసిన ఈ భీషన్ణమైన ప్రతిజ్ఞ “భీష్మ ప్రతిజ్ఞ గా” చరిత్రలో నిల్చిపోయింది. దేవతలు పూలవాన కురిపించారు. ఆరోజు నుండి గాంగేయుడు “భీష్ముడు”గా ప్రసిద్ధి చెందాడు.

దాశరాజు వెంటనే తన కూతురు యోజన గంధి(సత్యవతి)ని శంతనునికి ఇచ్చి వివాహం జరిపించాడు. తన కుమారుడైన గాంగేయుడు, తన కోర్కె తీర్చడం కోసం చేసిన త్యాగాన్ని శంతనుడు ఎంతగానో ప్రశంసించాడు.

“కుమారా, నీకు ఒక వరం ప్రసాదిస్తున్నాను. నీకు స్వచ్ఛంద మరణం ప్రసాదిస్తున్నాను. నువ్వు నీ ఇష్టం వచ్చినప్పుడు మరణించవచ్చు” అని వరం ఇచ్చాడు.

*తపశ్శక్తి*



మనిషి స్వప్రయత్నంతో అనుకున్నవి సాధించగలడు. అయినా కొన్ని పనులు అసాధ్యంగానే ఉండిపోతాయి. అనితర సాధ్యమైనవి సైతం కార్యరూపం దాల్చాలంటే తపస్సును ఒక మార్గంగా చెబుతారు పెద్దలు. తపస్సుచేసి సృష్టించే శక్తిని బ్రహ్మ పొందాడని ఉపనిషత్తులు చెబుతాయి. నరనారాయణులు సైతం తపస్సు ఆచరించారట. పరమశివుణ్ని పతిగా పొందేందుకు గౌరీదేవి, గంగను భువికి తెచ్చేందుకు భగీరథుడు, పాశుపత దివ్యాస్త్రాన్ని పొందేందుకు అర్జునుడు, మృత్యువును జయించాలని మార్కండేయుడు తపస్సుచేసి సాధించారని మన పురాణాలు చెబుతాయి.
రామనామం రామపాదం రామకార్యాలనే తపస్సుగా చేసుకుని, ఒక వానరుడు సముద్రాన్నే లంఘించగలిగాడు. సీతాన్వేషణలో సఫలమై రావణవధకు నాంది పలికాడు. రుద్రావతారుడిగా కీర్తి గడించాడు. హనుమ అనే ఈ వానర వీరుడి సుందర లీలల వర్ణనే రామాయణ మహాకావ్యంలో సుందరకాండగా ప్రత్యేకత సంతరించుకుంది. పఠించిన ఉత్తర క్షణం భక్తులను అనుగ్రహించే పారాయణ గ్రంథమైంది. మహిషాసుర, భస్మాసుర, హిరణ్యకశిపులవంటి ఎందరో రాక్షసులూ ఘోర తపస్సుతోనే శక్తులను, వరాలను పొందగలిగారు.
తపస్సు అంటే అనుకున్నది సాధించేవరకు మనసు చేసే ఎడతెగని ప్రయత్నం. మనసు సామాన్య స్థితిలో చంచల స్వభావంతో అనేక విషయాల్లో సంచరిస్తూనే ఉంటుంది. అదే మనసుకు ఒకే విషయాన్ని గ్రహించి, మిగిలినవన్నీ విస్మరించే ఉన్నత లక్షణమూ ఉంది. మనసును సామాన్య స్థితి నుంచి ఉన్నత స్థితికి తీసుకువెళ్ళడమే తపస్సుగా పెద్దలు చెబుతారు. ఒక వస్తువుపై మనసును నిలకడగా కాసేపు ఉంచగలిగితే అది ధారణ అవుతుంది. మరింత సమయం మనసును నిలువరించగలిగితే అది ధ్యానమవుతుంది. మనసు అనే వింటి నారిని తపస్సు అనే విల్లులో బాగా లాగి కట్టాలి. అప్పుడే బుద్ధి జాగృతమై లక్ష్యాన్ని ఛేదిస్తుంది.
మనసును నియంత్రించడమన్నది చాలా పెద్ద సమస్య. మహాభారతంలోని శాంతిపర్వం మనసును, ఇంద్రియాలను తాదాత్మ్యంచేసి బాహ్యం నుంచి అంతరంగానికి తీసుకుపోయేదే తపస్సుగా చెప్పింది. మనోనిగ్రహం ఒక్కరోజు కృషితో పొందేది కాదు. నిరంతర అభ్యాసం కావాలి. బాహ్య అంతఃకరణాలైన మనసు ఇంద్రియాలను సమాధానపరచడమే తపస్సుగా ఆదిశంకరులు బోధించారు.
మనిషిలోని మనోబలాన్ని, సంకల్పశక్తిని పెంచేదే తపస్సు. పెంపొందిన ఈ మనఃశక్తిని ఎలా వినియోగించుకోవాలి అనేది మాత్రం మనిషి లక్ష్యంపైనే ఆధారపడి ఉంటుంది. లక్ష్యాన్ని బట్టి తపస్సును సాత్విక, రాజసిక, తామసాలనే మూడు విధాలుగా భగవద్గీత చెబుతుంది. మంచి చెడు తేడాలతో సంబంధం లేకుండా అసురులవలే అనుకున్నవన్నీ సాధించాలని చేసే తీవ్రమైన ప్రయత్నాలన్నీ తామసమని, పదవి కీర్తికోసం చేసేవి రాజసికమని, చిత్తశుద్ధి కోసం చేసేవి సాత్వికమని గీత చెబుతుంది.
తపస్సు, తపస్సుతో పొందేది రెండూ దైవంగానే చెబుతుంది తైత్తిరీయం. దుష్టత్వాన్ని దహించే మనసును కడిగి శక్తిని ప్రజ్వలింపజేసేదే తపస్సు. నిష్కామ, నిస్వార్థ కార్యాలన్నీ తపస్సే. యజ్ఞమూ తపస్సే, యుద్ధమూ తపస్సే. చిత్తశుద్ధికోసం చేసే జపం, చిత్తశుద్ధితో చేసే ప్రతీపని తపస్సే అవుతుంది. సాధనా తపస్సే, సేవా తపస్సే!
తపస్సు అంటే వెంటనే మనకు స్ఫురించేది- నుదుట విభూది రేఖలు, మెడలో రుద్రాక్షలు, కళ్లు మూసుకుని చేసే మంత్ర జపాలు. ఇవి తపస్సుకు అంగాలు మాత్రమే. మన లక్ష్యాన్ని అనుక్షణం గుర్తుచేసే చిహ్నాలు. తప్పటడుగు వెయ్యకుండా మనసును నియంత్రించేందుకు దోహదపడేవి. మనసును ఏకాగ్రపరచడం, నిస్వార్థ సేవతో జీవించడం తపస్సుకు పరమావధి.

సమాజంలోని వ్యక్తులను

​సమాజంలోని వ్యక్తులను మూడు తరగతులుగా విభజిస్తే

పరహితం కోరేవారిని సజ్జనులని, పరహాని తలపెట్టేవారిని దుర్జనులని,
స్వలాభం చూసుకునేవారు తటస్థులని చెప్పవచ్చు. 
సజ్జనులకు క్షమ, దుర్జనులకు హింస బలమని పెద్దల మాట. 
​“ అహంకారం, క్రూరత్వం, స్వార్ధంతో ప్రవర్తిస్తూ, పరులకు నష్టం కలిగించే వారిని, పాముకి కోరల్లో, తేలుకు తోకలో విషమున్నట్టే శరీరమంతా విషమున్నట్టు ప్రవర్తించేవారే దుర్జనులని” చాణక్య నీతి తెలిపింది.

       “పూల సువాసన మట్టికి అందుతుంది కానీ మట్టి వాసన పూవుకి అంటుకోదని” కవుల వచనం. “మంచి వారి సహవాసంతో చెడ్డవాడు సజ్జనుడుగా మారవచ్చు కానీ దుర్మార్గుని దుర్గుణాలు మంచివానికి అంటవని , రాక్షసుల మధ్య సంచరించినా విభీషణుడు, ప్రహ్లాదుడు దుర్జనులు కాలేదని పురాణాలు లిఖించాయి.

​‘చేదు పుచ్చకాయ వండినా చేదు పోనట్టు’ ‘దుర్మార్గుడు వయోవృద్ధుడైనా బుద్ధి మారదని’ శాస్త్రాలు చెప్పాయి. దుర్యోధనుడికి కురువృద్ధులు, పాండవ రాయబారి కృష్ణుడి హితోక్తులు రుచించలేదని భారతం, నారాయణ మంత్రాన్ని ప్రహ్లాదుడు స్మరించడాన్ని హిరణ్యకశిపుడు జీర్ణించుకోలేదని భాగవతం, ఆప్తుల హితవుల్ని రావణుడు పెడచెవిన పెట్టినట్టు రామాయణం తెలిపాయి.   

​“గర్వంతో విర్రవీగే వారిని, విచక్షణ లేని వారిని , చెడు మార్గంలో నడిచే వారిని గురువైనా వదలక దండించాలని” శాంతి పర్వంలో చెప్పినట్టు, దుష్టుల ఆగడాలను సాగనివ్వక చరమ గీతం పాడేందుకు లోకబాంధవుడు అవతరించి జగాలకు వెలుగు ప్రసాదిస్తాడు. హిరణ్యాక్ష హిరణ్యకశిపులు, రావణ కుంభకర్ణులు, కంస, నరకాసురాది అసురులను నరసింహ, రామ, కృష్ణావతారాలలో సంహరించి శిష్ట రక్షణ చేసినట్టు పురాణేతిహాసాలు లిఖించాయి. 

​ ‘సత్యమార్గము చేత శిష్టుడగును , దుష్ట మార్గము చేత దుష్టుడవునని’ సత్యసాయిబాబా గారన్నట్టు తల్లిదండ్రుల పెంపకం , ఎంచుకున్న మార్గాలే మనుషుల్ని మంచి, చెడులుగా విభజిస్తాయి.

 ​ ‘బొగ్గును పాలతో కడిగినా తెలుపుగా మారనట్లే,’ ‘సాయాలెన్ని పొందినా చెడ్డ గుణాలను నీచుడు మానలేడని‘ వేమన చెప్పినట్టు, ఆశ్రయమిచ్చిన నాడీ జంఘుని ప్రాణాలు తీసిన దుష్ట బ్రాహ్మణుడి కథ నిరూపించింది.

​‘చల్లని స్తితిలో మసిని అంటించడం, వేడిగా ఉన్నప్పుడు చేతులు కాల్చడం బొగ్గుల నైజమైనట్టు’ దుర్జనులతో విరోధం, స్నేహమూ నష్ట కారకాలని గ్రహించి మెలిగితే బాధలకు దూరంగా ప్రశాంతంగా నివసించగలరు.

హనుమంతునికి ఐదు అరటి పండ్లు సమర్పిస్తే?

మంగళవారం.. హనుమంతునికి ఐదు అరటి పండ్లు సమర్పిస్తే?
శ్రీరామచంద్రుని భక్తాగ్రేసరుల్లో ఆంజనేయ స్వామి అగ్రగణ్యుడు. రామాయణంలో సీతాన్వేషణలో శ్రీరామునికి ఇతోధికంగా సాయపడిన వానరుడు హనుమంతుడు. చైత్రశుద్ధ పౌర్ణమి నాడు ఆయన అంజనాదేవి, కేసరి దంపతులకు జన్మించాడు. వాయుదేవుని అనుగ్రహంతో పుట్టడంతో అశేష బలసంపన్నుడిగా అవతరించారు.

చిరంజీవిగా వుంటూ శ్రీరామనామం శబ్దం విన్నంతనే అక్కడకు ప్రత్యక్షమవుతాడని కోట్లాది భక్తుల నమ్మకం. అలాంటి హనుమంతుడిని మంగళవారం పూట
పూజించడం ద్వారా అప్పుల బాధలను, ఆర్థిక ఇబ్బందులను దూరం చేసుకోవచ్చు.

మంగళవారం సూర్యోదయానికి ముందే లేచి ఇంటిల్లపాదిని శుభ్రం చేసుకుని... శుచిగా స్నానమాచరించి... పూజకు అగరబత్తులు, అరటిపండ్లు, శుభ్రమైన నీరు, పువ్వులు, కుంకుమ సిద్ధం చేసుకోవాలి. పూజ చేసేవారు ఎరుపు రంగు దుస్తులు ధరించాలి. నిష్ఠతో హనుమాన్ యంత్రాన్ని పఠించాలి. మంగళవారం పూట శాకాహారాన్ని మాత్రమే తీసుకోవాలి. ఐదు అరటి పండ్లను హనుమాన్‌కు సమర్పించినా సరిపోతుంది. ఇలా 21 మంగళవారాలు సూర్యోదయానికి ముందే లేచి శుచిగా హనుమాన్ పూజ చేయాలి. హనుమాన్ చాలీసాతో 15 నిమిషాలు హనుమంతుడిని ధ్యానించాలి.

బెల్లం ముక్కను, అరటిపండ్లు, తమల పాకులు సమర్పించి స్వామికి దీపారాధన చేయాలి. ఇలా ప్రతీ మంగళవారం పూట హనుమంతుడిని పూజిస్తే.. సమాజంలో గౌరవం, ధైర్యం లభిస్తుంది. ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. ఉపాధి అవకాశాలు చేకూరుతాయి. సంతానం కలుగుతుంది. ఈతి బాధలుండవు. ముఖ్యంగా పురుషులు ఈ వ్రతాన్ని చేస్తే విశిష్ట ఫలితాలను పొందవచ్చు.

ఘృత సూప సమన్వితం'

ఒకసారి భోజరాజుకీ కాళిదాసుకీ మాట పట్టింపు వచ్చింది.'విద్వాన్ సర్వత్ర పూజ్యతే'అంటూ ఆస్థానం వదిలి
వెళ్ళిపోయాడు.కాళిదాసు వెళ్ళిపోయాక గానీ భోజరాజు  కు ఆయన విలువ తెలిసి రాలేదు.ఏమీ తోచడం లేదు
మంచి కవిత్వం వినిపించే వాళ్ళు లేరు.ఆయన కాళిదాసు జాడ కనుక్కున్న వాళ్లకు లక్ష దీనారాలు బహుమతి ప్రకటించాడు.
ఇదిలా వుండగా పోరుగూరి నుండి యిద్దరు పేద బ్రాహ్మణులు భోజరాజు దగ్గర ఏదైనా బహుమతి దొరుకుతు౦దే మోననీ ఆశతో ధారానగరానికి వచ్చి ఊరిబయట వున్న దేవాలయం లో కూర్చున్నారు.ఏదైనా మంచి శ్లోకం వ్రాసుకొని పోదామని ప్రయత్నిస్తున్నారు.ఎంత సేపు ఆలోచించినా వాళ్లకు తోచడం
లేదు.వాళ్లకు ఆకలి వేసింది.అప్పుడు ఒక పాదం స్ఫురించింది.
'భోజనం దేహి రాజేంద్రా ఘృత సూప సమన్వితం' రాజా!మాకు మంచి నెయ్యి వేసిన పప్పు తో కూడిన భోజనం కావాలి. రెండో పాదం ఎంత ఆలోచించినా కుదరడం లేదు.ఆ మండపం లోనే ఒక మూల కాళిదాసు మారువేషం లో కూర్చుని వున్నాడు.అయన దగ్గరికి వెళ్లి స్వామీ మీరు చూడబోతే పండితుల్లా కనిపిస్తున్నారు.మేము పేద వాళ్లము.భోజరాజు గారి దగ్గర ఏదైనా బహుమానం దొరుకుతుందేమో నని ఆశ
.తో వచ్చాము.మాకు శ్లోకం లో ఒక్క పాదమే వచ్చింది.రెండో పాదం చెప్పి పుణ్యం కట్టుకోండి అని బ్రతిమలాడారు. కాళిదాసు రెండో పాదం యిలా వ్రాశాడు.
'మాహిషం చ శర శ్చంద్ర చంద్రికా ధవళం దధి'
మంచి బర్రె పాల నును తోడు పెట్టి తయారు చేసిన శరత్కాలపు వెన్నెల వలె తెల్లగా వుండే గడ్డ పెరుగుకూడా కావాలి.
వాళ్ళిద్దరూ కాళిదాసుకు కృతజ్ఞతలు చెప్పి రాజాస్థానానికి వెళ్ళారు.అక్కడ తమ శ్లోకం విని పించారు.
భోజనం దేహి రాజేంద్రా ఘృత సూప సమన్వితం
మాహిషం చ శరశ్చంద్ర చంద్రికా ధవళం దధి
భావము:-రాజా!-అన్నము లోకి  మాకు పప్పు నెయ్యితో కూడిన భోజనము , మంచి బఱ్ఱె పాలతో తోడు పెట్టినశరత్కాలపు వెన్నెలవలె తెల్లగావుండే  గడ్డ పెరుగు కావాలి
రాజు అదివిని మొదటి పాదం లో ఏమీ విశేషం లేదు.రెండో పాదానికి అక్షర లక్షలు యిస్తాను.కానీ అది మీరు వ్రాసిన దిగా అని పించడం లేదు.అది ఎవరు వ్రాశారో నిజం చెప్పండి.అని గద్దించి అడిగారు.వాళ్ళు భయపడి పోయి అసలు సంగతి చెప్పి వేశారు.రాజుగారిని క్షమాపణ అడిగారు.అప్పుడు భోజుడు అది వ్రాసినది కాళిదాసే నని గ్రహించాడు.అంత మంచి ఉపమానం కాళిదాసు తప్ప వేరెవరూ రాయలేరు అని ఆయన విశ్వాసం.ఆ వ్రాసిన వారిని మీరు చూపించండి ఆయన ఎక్కడ వున్నారు?అని అడిగారు రాజు గారు.అప్పుడు వాళ్ళు ఊరిబయట దేవాలయం లోని మండపం లో కూర్చుని వున్నారని చెప్పారు.అప్పుడు భోజ రాజు స్వయంగా వెళ్లి కాళిదాసుకు క్షమాపణ చెప్పి పిలుచుకొని వచ్చి.తాను అన్న మాట ప్రకారం కాళిదాసు జాడ తెలిపిన వారిద్దరికీ లక్ష దీనారాలు బహుమతి గా యిచ్చి పంపించి వేశారు.
ఆ బ్రాహ్మణు లిద్దరూ సంతోషంగా వెళ్ళిపోయారు.
--------------------***------------------------

శివామృతలహరి

    శ్రీ.చిల్లర కృష్ణమూర్తి గారు వ్రాసిన
 #శివామృతలహరి శతకంలోని ఒక పద్యం;

మ||

అవివేకంబను ఆజవంజవ మహా వ్యామోహ జాలమ్మునన్
దవిలెన్ మామక హృచ్ఛకుంతము; నిర్ధంబైన నా జన్మకున్
కవిగానైన ప్రయోజనంబు గులుగన్ గాంక్షించి వర్ణించెదన్
శివతత్త్వంబఖిలార్థ సాధకమగున్ ; శ్రీ సిద్ధలింగేశ్వరా!

భావం;(నాకు తెలిసినంత వరకు)

పక్షి ఎలాగైతే గింజలపైన ఆశ కొద్దీ వచ్చి వాలి వలలో చిక్కుకుంటుందో,
అలాగే నా హృదయమనే పక్షి కూడా,ఏదో తెలియని తనం వల్ల సంసారమనే ఒక పెద్ద మోజు కలిగించే వలలో చిక్కుకున్నది. దానివలన, అర్థం లేకుండా పోయిన నా జన్మను సార్థకం చేసుకోవాలని కోరిక కలిగి,అన్నింటినీ సాధించిపెట్టే శక్తి శివతత్వానికి ఉంది అని ఒక కవిగా,నా పద్యాలలో వర్ణించి ప్రపంచానికి చాటి చెప్తాను స్వామి! శ్రీ సిద్ధ లింగేశ్వరా!

నారద భక్తి సూత్రాలు



*🌻. చలాచలభోధ*

*🌻 భక్తా ఏకాంతినో ముఖ్యాః || 🌻*

ఎవరు కేవలం ప్రేమార్ధమే భగవంతుని ప్రేమిస్తారో వారు ఏకాంత భక్తులు.

భక్తి త్రివిధాలు :
1) బాహ్య భక్తి
(2) అనన్య భక్తి
(3) ఏకాంత భక్తి

1. బాహ్య భక్తి :
ఇది గౌణభక్తి క్రిందికి వస్తుంది. ఈ భక్తి కాయికంగాను, వాచికంగాను ఉంటుంది. సాధనచేత మానసికంగా మార్చుకోవాలి.

ఈ బాహ్య భక్తిలోనే శ్రవణం, కీర్తనం, విష్ణు స్మరణం, పాదసేవనం, వందనం, సఖ్యం, దాస్యం, అర్చనం, ఆత్మ నివేదనం అని నవ విధాలు. పూజలు, వ్రతాలు, జపతపాలు, క్రతవులు కూడా బాహ్య భక్తి క్రిందకే వస్తాయి. ఈ బాహ్య భక్తి అనన్య భక్తిగా మారాలంటే అందరిలోనూ భగవంతుడిని చూడాలి.

దీనికి చేసే సాధనలో ముందుగా తనకంటే వేరైన వారిని నాలుగు తరగతులుగా విభజించి వారిలో ఒక్కొక్క రకం వారితో 1) ముదిత (2) కరుణ (3) మైత్రి (4) ఉపేక్ష అనే పద్ధతులుగా వ్యవహరించాలి.

ముదిత :
భాగవతోత్తములందు, పుణ్యాత్ములందు, సద్గుణ సంపన్నులందు, ముముక్షువులందు కలిగే సంతోషమే ముదిత.

కరుణ :
దుఃఖమందు, నికృష్ట గుణములున్న వాడియందు, అజ్ఞానులందు కలిగే సానుభూతిని కరుణ అంటారు.

మైత్రి :
దైవ భక్తులందు, ఉపాసకులందు, కర్మిష్టులందు, తనతో సమానమైన గుణములున్న వారితో, వీరంతా నావారు అనే బుద్ధిని మైత్రి అంటారు.

ఉపేక్ష :
పాపాత్ములు, పామరులు, మూర్ఖులు, నీచగుణాలున్న వారు కుటిలులు, దుర్మార్గులు, దుర్వ్యసనపరులందు ద్వేష రహితులై ఉదాసీనంగా ఉండాలి. దీనిని ఉపేక్ష అంటారు.

2. అనన్య భక్తి :
సర్వం భగవత్స్వరూపంగా భావించుకుంటూ అన్య చింతన వదలి మనస్సును తదేక నిష్ఠతో ఏకాగ్రం చేసి భగవంతుని నిరంతరం దర్శించడాన్ని అనన్య భక్తి అంటారు.

3. ఏకాంత భక్తి :
భగవదాకారం పొంది భగవంతుడు భక్తుడు వేరు కానట్టి స్థితిని ఏకాంత భక్తి అంటారు. ఇతడు భాగవతోత్తముడు, సత్పురుషుడు. ఇది ముఖ్యభక్తి క్రిందికి వస్తుంది.

 ఏకాంత భక్తిని పతివ్రత యొక్క పతిభక్తితో పోల్చవచ్చును. వీరిలో విశేషమేమంటే వీరు ముక్తిని కూడా కోరరు. వీరు భగవంతుని ప్రేమ కోసమే ప్రేమిస్తారు.

అనపేక్షః శుచిర్ధక్షః ఉదాసీనో గతవ్యధః
సర్వారంభ పరిత్యాగీ యో మద్భక్తస్సమే ప్రియః
- భగవద్గీత (12:16)

ముఖ్యభక్తుడెవడంటే, ఏ మాత్రం కాంక్ష లేనివాడు, శరీరేంద్రియ మనసులందు శుచియై ఉన్నవాడు, దక్షుడు, పక్షపాత రహితుడు, ఎట్టి దుఃఖాలకు చలించనివాడు, సమస్త కర్మలందు కర్తృత్వాభిమానం లేనివాడు. అట్టి ముఖ్యభక్తుడు నాకు ప్రియుడు అని శ్రీకృష్ణ పరమాత్మ చెప్తున్నాడు.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

*పితృ దోషము

*పితృ దోషము నుండి బయటపడే సులువైన పరిష్కారం "*
॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰
పితృ దోషం' ...
మన తాతలు తండ్రులు సంపాదించిన ఆస్తిపాస్తులను వంశపారంపర్యంగా అనుభవించటానికి మనం ఎలా హక్కు అర్హత పొందుతామో ...
అలాగే...
తాతలు తండ్రులు చేసిన పాపపుణ్యాలు కూడా ఆ వంశానికి వర్తిస్తాయి.
మన పెద్దలు పుణ్యాలు మంచిపనులు చేస్తూ ఉంటే వారి వంశం సుఖ సంతోషాలతో ఉంటుంది.
అలాగే అదే పూర్వీకులు పాపాలు గనుక చేసి ఉంటే అది తెలుసుకోవచ్చు, తెలియకపోవచ్చు ఏదైనా గాని వారు చేసిన పాప కర్మలు ఆ వంశపారంపర్యంగా ఆ కుటుంబంలోని వారు అనుభవించక తప్పదు -
 మేము తెలిసి తెలియక ఏ తప్పూ చేయలేదు కానీ బాధలను కర్మలను అనుభవిస్తున్నాము అనే బాధ పడేవారు ముఖ్యంగా తెలుసుకోవలసినది ముఖ్యమైనది ఒక్కటే!
అదే
*" పితృ దోషం "*
ఇది ప్రతి ఒక్కరికీ ఉపయోగపడే విషయం.
అందుకే ఈ పోస్టు పెడుతున్నాను.
పితృ దోషం ఉన్నవారు ఈ జన్మలో వారు ఏ పాప కర్మలను చేయకపోయినా కుటుంబం ఇబ్బందులపాలు అవుతూ కష్టాలకు లోనవుతూ ఉంటుంది.
ఎందుకంటే మన పెద్దలు చేసిన పాప ఫలాలు.
వారి ఆస్తులను పంచుకున్నప్పుడు వారి పాపాలను కూడా కచ్చితంగా పంచుకొని తీరవలసిందే.
పితృదోష వలన కలిగే దుష్పరిణామాలు కొన్ని చర్చించుకుందాము...
చిన్న వారు అకాలమరణం పొందడం
శరీరంలోని ఆర్గాన్స్ ఫెయిల్ అయ్యి ఆస్పత్రి పాలవడం.
అప్పులపాలు అవ్వడం లేనిపోని అపనిందల పాలు అవ్వడం మన ప్రమేయం లేకుండా
ప్రమాదాలకు గురయ్యి జీవితాంతం కర్మలను అనుభవించడం.
మన కళ్ళ ముందు మన పిల్లలు చెడు వ్యసనాలకు బానిస అయ్యి కీర్తి ప్రతిష్టలకు భంగం కలిగించడం
ఇలా వీటన్నిటికీ కారణం పితృ దోషం కారణం
దీని నుండి విముక్తి పొందడానికి ఏకైక పరిష్కారం.
*స్మశాన నారాయణుడిని ప్రసన్నం చేసుకోవడమే ...*
*అయితే ఈ స్మశాన నారాయణుడి ఆలయాలు ఈ భారతదేశంలో రెండే రెండు ఉన్నాయి.*
*1. కాశీ*
*2. పాపనాశి ( అలంపురం 'జోగుళాంబ గద్వాల జిల్లా)*
అలంపురంలోని ఈ స్మశాన నారాయణుడి ఆలయం గురించి కేరళ తాంత్రిక శాస్త్రంలో చెప్పడం జరిగింది.
విచిత్రం ఏమిటంటే ఈ స్మశాన నారాయణ ఆలయం అలంపురంలో ఉన్నదన్న విషయం ఎవరికీ తెలియదు .
అయితే ఈ స్మశాన నారాయణుడిని ప్రసన్నం చేసుకుని మన బాధల నుండి విముక్తి పొందాలంటే మనమేమి చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం -
*స్మశాన నారాయణుని ప్రసన్నం చేసుకోవాలంటే....*
*పాలు అన్నముతో చేసిన పాయసం,*
*అన్నము, ముద్దపప్పు, నేయి,*
*వడ ఇవి నైవేద్యంగా పెట్టాలి !ఈ విధంగా స్మశాన నారాయణుడికి నైవేద్యం పెడతారో ఆ ప్రసాదాన్ని* *వారి ఇంటి పేరు గల వంశస్థులు మాత్రమే దానిని స్వీకరించాలి. ఇతరులకు ఇవ్వరాదు.*
*స్వామికి తెల్లటి కండువా అలంకరించాలి.*
ఈ వంటలను స్వయంగా వండుకొని తీసుకొని వెళ్ళి నివేదన చేయాలి లేదా ( వెళ్ళడానికి వీలు లేనివారు ఖర్చులను ఇచ్చి అక్కడి పూజారి చే చేయించ వచ్చును )
అలంపురం తెల్లవారుజామునే వెళ్లి తుంగభద్రా నదీ స్నానం చేసి అమ్మవారిని అయ్యవార్ల ను దర్శనం చేసుకున్న తరువాత ఈ స్మశాన నారాయణుడిని సేవించుకొని ఇక వేరే చోటకి వెళ్లకుండా నేరుగా ఇంటికి చేరుకోవాలి.
ఈ ఆలయ ప్రాముఖ్యము గురించి తంత్ర గురు "భరణి స్వామి " ద్వారా తెలుసుకోవడం జరిగింది. ఈ అలంపుర స్మశాన నారాయణుడి దాని ప్రాముఖ్యము కేరళ తంత్ర శాస్త్రంలో లిఖించబడి ఉన్నదట !
ఎంతోమంది పితృదోషం తో బాధపడే వారు ఉన్నారు . అలాంటివారికి ఈ విషయం ఉపయోగపడుతుందని ఈ గ్రూపులో పెట్టడం జరిగింది !
చేరుకొనే విధానం :
అలంపూర్ "హరిత హోటల్ " కు ప్రక్కన ఒక చిన్న దారి ఉంటుంది . ఆ చిన్న దారి ఎడమవైపున 1.2 కిలోమీటర్ల దూరంలో పాపనాశేశ్వర ఆలయ సముదాయం ఉంటుంది . ఆలయ సముదాయంలో ఒక ప్రత్యేక ఆలయం "స్మశాన నారాయణుని ఆలయం "
ఇంకొక ముఖ్య విషయం : స్మశాన నారాయణుడి ఆలయ సమూహాలలో ప్రధాన దైవం శ్రీ పాపనాశిశ్వరుడు ' 7వ శతాబ్దం నాటి అతి పురాతన ' అతిపెద్ద మరకత లింగం ' దక్షిణ కాశి అంటారు . ఈ స్వామిని దర్శించుకున్నంతనే పాపాలు నాశనం అవుతాయని ప్రతీతి !
*ఈ ఆలయ విశేషాల గురించి ' స్మశాన నారాయణుడి పూజ గురించి సంప్రదించవలసిన ఆలయ పూజారి నంబర్లు :*
*9182883807,*
*7995464344.*

పదిమందికి ఉపయోగపడే విషయం . కాబట్టి దయచేసి వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి.

*సర్వేజనా సుఖినోభవంతు*
       *శుభమస్తు..✋*
-------------------------------------

👆49వ పద్యం


మ.
మలభూయిష్ఠమనోజధామము సుషుమ్నాద్వారమో! యారు కుం
డలియో! పాదకరాక్షియుగ్మములు షట్కంజంబులో! మోము తా
జలజంబో! నిటలంబు చంద్రకళయో! సంగంబు యోగంబొ? గా
సిలి సేవింతురు కాంతలన్ భువిజనుల్, శ్రీకాళహస్తీశ్వరా!

పోత‌న త‌ల‌పులో...54



హస్తినాపురంలో కొన్ని మాసాలపాటు ఉండి, పిమ్మట కృష్ణ ప‌ర‌మాత్మ తన నగరానికి బయలుదేరాడు.
                     ***
కనకసౌధములపైఁ గౌరవకాంతలు-
  గుసుమవర్షంబులు గోరి కురియ,
మౌక్తికదామ సమంచితధవళాత-
  పత్త్రంబు విజయుండు పట్టుచుండ,
నుద్ధవసాత్యకు లుత్సాహవంతులై-
  రత్నభూషితచామరములు వీవ,
గగనాంతరాళంబు గప్పి కాహళభేరి-
  పటహశంఖాదిశబ్దములు మొరయ,

                 ***
సకలవిప్రజనులు సగుణనిర్గుణరూప
భద్రభాషణములు పలుకుచుండ,
భువనమోహనుండు పుండరీకాక్షుండు
పుణ్యరాశి హస్తిపురము వెడలె.

                     ***
భువనమోహనుడు, పుండరీకాక్షుడు అయిన శ్రీకృష్ణుడు ఘనీభవించిన పురజనుల పురాకృత పుణ్యంలా హస్తినాపుర వీథుల వెంట సాగిపోతున్నాడు. అంతఃపుర కాంతలు బంగారు మేడలపై నిలబడి నందనందనునిపై పుష్ప వర్షాలు కురిపించారు. విజయుడు వెనుక నిలబడి ముత్యాలసరాలతో విరాజిల్లే శ్వేతచ్ఛత్రాన్ని పట్టాడు. ఉద్ధవుడు, సాత్యకి ఉత్సాహంతో అటునిటు నడుస్తు రత్నఖచితాలైన పిడులు పట్టుకొని వింజామరలు వీస్తున్నారు. బాకాలు, నగారాలు, తప్పెటలు, శంఖాలు ఆకాశం దద్దరిల్లేలా మ్రోగుతున్నాయి. వేదవేత్తలైన బ్రాహ్మణులు సగుణ నిర్గుణ స్వరూప నిరూపకంగా స్వస్తివచనాలు పలుకుతున్నారు.

🏵️పోత‌న ప‌ద్యం🏵️
🏵️పరమ పవిత్రం🏵️

శక్తి ప్రకృతి

కేతువు రూపంలో యున్న విష్ణు విష్ణు శక్తి ప్రకృతి రూపంలో వున్న అమ్మ రూపంలో సృష్టి కారక లక్షణముగా మారుటను పరిశీలించిన, ఋక్కు యీ విధంగా తెలుపుచున్నగి. కేతుం కృణ్వన్న కేకవేసి, ఆపేశో మర్త్యా అపేశసే, సముషధ్భిః అజాయథా.కేతు లక్షణమైన శక్తి జీవ రూపంలో దేహ రూపంలో మెటీరియలైజ్ చెంది పదార్ధ రూపమైన, శక్తిగా మారి అగ్ని రూపంలో మనకు తెలియదు అనగా అది రజోగుణ రూపమైన అగ్నితో పరంగా మారుటకు దేహమే కారణం. లేనియెడలలేనియెడలఅగ్ని యెుక్క వస్తు తత్వం తెలియదు అనగా మాగ్నెట్ రూపంలో మనలో యున్న శక్తి లక్షణముగా తెలియవలెనని జీవ డిఎన్ఏ గా మారుటయె. భౌతికంగా కొంత మాత్రమే తెలియును కాని లక్షణ రూపం వాసనల ద్వారా యున్నవి మనకు తెలియవు. ఏ వక వ్యక్తి వాసనలు అనగా కోరికలు వేరొక వ్యక్తితో సమ మని భావించజాలము. సం ఉష త్ భిః ఙా యథా. సం పూర్ణమైన మానవ శక్తి ఉష కాంతిగా మారి లక్షణముగా తెలియవలెనని అది దే రూపంలో అనగా మానవ రూపంలోనే మనకు తెలియును. భః భిః ఆ రువాత గాని భుః పంచభూతాత్మకమైన ప్రకెృతి లేక మానవలదేహంగా మారదు. సం ఎల్లప్పుడు కలిగిన పూర్ణం సత్యమని దానిని తెలియుట యే ఙ్ఞానము.అది స్థరమైనది ధృవ లక్షణము అనగా సత్యమని శక్తి లక్షణము ధూపము అనగా శక్తి ఉత్తరమున గలది సత్యమని తెలియుచున్నది. ఆపేశో మర్త్యా అపేశషే. శ, ష లు ప్రక్క ప్రకనే యుండుట సూత్రము పరిశీలించిన శాశ్వత అనే శక్తి ష ఉష కాంతిగా మారిన హాని ఈ శక్తి యెుక్క లక్షణము తెలియదు సూర్యుని కాంతిచేత భూమిపై చేరి పదార్ధముగా లక్షణమైన జీవుని లేదా పంచభూతాత్మకమైన ప్రకృతిగా మారిన గాని దాని లక్షణము మనకు తెలియదు. సత్యము అనగా సూర్య శక్తియే అది ప్రకాశ మైనప్పుడు తెలియదు. మర్త్య మరుత్తు గా మారిన అనగా జీవ లక్షణమే మార్తాండ అండ లక్షణముగా మారి పిండము గా మారుటయె మర్త్య లక్షణము.

మొగలిచెర్ల అవధూత

మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామివారితో అనుభవాలు..
మాయమైన మాయరోగం..

"బాబూ! నేను పరంధామయ్యను నెల్లూరు నుంచి మాట్లాడుతున్నాను.." అని ఫోన్ చేశారు.."చెప్పండి.." అన్నాను..

పరంధామయ్య గారు వయసులో పెద్దవారు..శ్రీ స్వామివారు మాలకొండలో తపస్సు చేసుకునే రోజుల్లోనే దర్శించుకున్న వ్యక్తి..శ్రీ స్వామివారంటే అపరిమిత భక్తి విశ్వాసాలు కలిగిన వారు..శ్రీ స్వామివారు సిద్ధిపొందిన తొలినాళ్లలో తరచూ మొగలిచెర్ల కు వచ్చి శ్రీ స్వామివారి సమాధిని దర్శించుకొని వెళ్లేవారు..శ్రీ స్వామివారి దయవల్లే తనకు సంతానం కలిగిందని చెప్పేవారు..రోజులు గడిచేకొద్దీ..పనుల వత్తిడి వల్లనో..లేక మరే కారణమో తెలీదు కానీ..పరంధామయ్య గారు క్రమేపీ మొగలిచెర్ల రావడం తగ్గి పోయింది..సంవత్సరానికోకసారి వచ్చి వెళుతున్నారు..ఆ పరంధామయ్య గారు చాలా రోజుల తరువాత ఫోన్ చేశారు..

" బాబూ..మా అబ్బాయి మాట్లాడతాడట..ఒకసారి వాడితో మాట్లాడు.." అన్నారు..పరంధామయ్య గారి స్వరం లోని ఆందోళన నాకు అర్ధం అవుతూనే వున్నది..తీవ్రమైన వత్తిడి లో ఉన్నట్లు తోచింది.."సరే!" అన్నాను..

"ప్రసాద్ గారూ..మా ఆవిడకు నెలలు నిండాయి..రెండు రోజుల్లో డెలివరీ అవుతుందని డాక్టర్ గారు చెప్పారు..దాదాపుగా నాలుగు నెలల నుంచీ తాను బెడ్ రెస్ట్ లోనే ఉంది..ఆపరేషన్ చెయ్యాలి అని డాక్టర్ చెప్పారు..ఒకసారి స్వామి వారి వద్ద మా పేరుతో అర్చన చేయించండి..మాకు కొంచెం ధైర్యంగా ఉంటుంది..మా గోత్రము, మా పూర్తి పేర్లు మీకు మెస్సేజ్ చేస్తాను..ఏమీ అనుకోకుండా..దయచేసి ఈ పని చేసి పెట్టండి..నేను కంగారు పడుతుంటే నాన్నగారు నన్ను స్వామివారికి మొక్కుకోమని చెప్పారు.." అన్నాడు..అలాగే అన్నాను..

ఆరోజే వాళ్ళపేరుతో అర్చన చేయించాను..ప్రక్కరోజు ఉదయం పరంధామయ్య గారే మొగలిచెర్ల వచ్చారు..శ్రీ స్వామివారి సమాధిని దర్శించుకున్నారు..నమస్కారం చేసుకొని ఇవతలికి వచ్చి.."ఒకసారి స్వామిని దర్శనం చేసుకోవాలని అనిపించింది బాబూ..అందుకోసం వచ్చాను..కోడలు కు ఆపరేషన్ చేయాలని చెప్పారు..సమస్య ఏమిటో చెప్పటం లేదు కానీ..ఈ ఒక్క సంతానం తోనే సరి పెట్టుకోవాలని..ఇక పిల్లలు పుట్టకుండా కూడా ఆపరేషన్ చేస్తామని కూడా డాక్టరమ్మ గారు చెప్పారు..చాలా కొద్దిమందిలో ఇటువంటి సమస్య వస్తుందట..ఈ మాయరోగం మా అమ్మాయికి వచ్చింది..ఏం చేస్తాము?..నాకు ఏ కష్టం వచ్చినా ఈ స్వామే తీర్చాడు..ఆయన్నే నమ్ముకున్నాను..ఇప్పుడు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలని మొక్కుకున్నాను.."అన్నారు..శ్రీ స్వామివారి విభూతి, గంధం..తీసుకొని వెళ్లిపోయారు..

సరిగ్గా పదిహేను రోజుల తరువాత పరంధామయ్య గారు మళ్లీ మొగలిచెర్ల వచ్చారు..ఈసారి ఆయన ముఖం లో సంతోషం తాండవిస్తోంది..మందిరం లోపలికి రాగానే..కాళ్ళూ చేతులూ కడుక్కొని..నేరుగా శ్రీ స్వామివారి సమాధి వద్దకు వెళ్లారు..సమాధి వద్ద నమస్కారం చేసుకొని..ఉత్సవ విగ్రహం వద్దకు వచ్చి, తన కొడుకు, కోడలు పేరుతో అర్చన చేయించారు..

"స్వామివారు సాక్షాత్తుగా నా వెనుకే వున్నారు బాబూ..ఆరోజు విభూతి, గంధం ఇక్కడినుండి తీసుకెళ్లి..అబ్బాయి చేతికిచ్చి..అమ్మాయి నుదుటికి రాయమని చెప్పాను..వీడు అమ్మాయికి విభూతి రాసి..మిగిలింది అమ్మాయి తలగడ క్రింద పెట్టాడు..తెల్లవారుఝామున అమ్మాయికి నొప్పులు వచ్చాయి..హాస్పిటల్ కు తీసుకెళ్లాము..చిత్రంగా మామూలు గా కాన్పు అయింది..ఖచ్చితంగా ఆపరేషన్ చేయాలి అని చెప్పిన ఆ డాక్టర్ గారి చేతుల మీదుగానే కాన్పు అయింది..ఆడపిల్ల పుట్టింది..ఇద్దరూ క్షేమంగా వున్నారు..ఏ ఇబ్బందీ జరుగలేదు..ఆ అంటు తీరిపోగానే..నేను ఇలా స్వామివారి దర్శనానికి వచ్చేసాను..అంతా స్వామి దయ.." అన్నారు..

"అదేదో అరుదైన లోపం వల్ల ఆపరేషన్ అన్నారు కదా.." అన్నాను.."అదేబాబూ నేను చెప్పేది..ఏ లోపం లేదు..అంతా సవ్యంగా ఉంది అని ఆ డాక్టరే చెప్పింది.." అన్నారు పరంధామయ్య గారు సంతోషంతో..

మరో రెండేళ్ల తరువాత పరంధామయ్య గారికి మనుమడు పుట్టాడు..ఒక శనివారం నాడు పిల్లలను తీసుకొని మాలకొండ వెళ్లి శ్రీ లక్ష్మీనృసింహుడి దర్శనం చేసుకొని..అక్కడినుండి మొగలిచెర్ల లోని శ్రీ స్వామివారి పల్లకీసేవ లో పాల్గొని..ఆరోజు రాత్రి, ఆ ప్రక్కరోజు ఆదివారం మధ్యాహ్నం అన్నదానం చేసి..సంతోషంతో తిరిగి వెళ్లారు..

సర్వం..
శ్రీ దత్తకృప!.

(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగలిచెర్ల గ్రామం..లింగసముద్రం మండలం.. ప్రకాశం జిల్లా..పిన్: 523 114..సెల్..94402 66380 & 99089 73699).