15, జులై 2025, మంగళవారం

నన్ను నేను వెతుక్కుంటున్నా...

 *నన్ను నేను వెతుక్కుంటున్నా...!!*


సమస్త విశ్వానికి వెలుగు రేఖలా

నా ఆత్మ జ్యోతిని మండించుకుంటూ

అందులో నన్ను నేను వెతుక్కుంటా 

కీర్తి శిఖరానికి చేరుకుంటా...


ప్రపంచమంతా ఒకటే గీతికగా 

అందులో జాతుల వరసలు కలుపుకుంటూ 

ఖండాంతరాలు దాటుకుంటూ 

నా ఊపిరిని విశ్వమంతా నింపుతా..


ఆత్మవిశ్వాసాన్ని గుండె నిండా నింపుకొని 

కాంతి రేఖల వెలుగులను సృష్టించుకుని 

భూమిపైన మొలకలా నిలబడుతూ 

మహావృక్షమై నీడనియ్యాలని తపిస్తా..


అడుగున పడ్డ బడుగు జీవిలా కదులుతూ 

మట్టిలోని విత్తనాల్తా పైకి లేస్తూ 

పుష్పించి పండునై రాలిపోతూ 

జీవిత గమ్యాన్ని చేరేందుకు ప్రయత్నిస్తా...


మనసు నిండా దయా ఫలాలను నింపుకొని 

మానవత్వపు కోణాన్ని పెంచుకుంటూ 

మనిషిలో మంచితనాన్ని వెతుక్కుంటూ 

వింత నాటకంలో విరాగిగా తిరుగుతా...


నా జీవిత పరమార్ధం తెలుసుకుంటూ 

అక్షరాలతో నా వేదన తీర్చుకుంటూ 

ప్రతినిత్యం వాక్యాలను సృష్టించుకుంటూ 

నన్ను నేను మర్చిపోతూ సాగుతున్నాను...


కొప్పుల ప్రసాద్ 

నంద్యాల 

9885066235

పుదీనా గురించి

 పుదీనా గురించి సంపూర్ణ వివరణ - ఉపయోగాలు .

     

ఆయుర్వేదం నందు పుదీనా కు ప్రత్యేక స్థానం ఉన్నది. 100 గ్రాముల పుదీనా ఆకు 56 క్యాలరీల శక్తిని ఇస్తుంది.  ఇవే కాకుండా మరెన్నొ పోషకాలు ఉన్నాయి . వాటి గురించి ఇప్పుడు మీకు వివరిస్తాను 


 •. 100 గ్రాముల పుదీనా ఆకులో ఉండే పోషకాలు - 

 

పిండిపదార్దాలు  - 8 .40 గ్రా , ప్రొటీన్స్ - 5 .90 గ్రా , 0 .70 గ్రా ఫ్యాట్స్ , క్యాల్షియం - 440 మి.గ్రా ,  ఫాస్ఫరస్ - 70 మి.గ్రా , ఐరన్ - 19 .2 మి.గ్రా , విటమిన్లు - A , B1 , B2 , నియాసిన్ , ఆక్సాలిక్ ఆసిడ్ ఉన్నాయి.  

            

.  పుదీనా ఆకు ఎక్కువుగా మాంసాహార వంటకాలలో వాడతారు . పచ్చడిగా మనవారు చాలాకాలం నుంచి ఉపయోగిస్తున్నారు. పుదీనా ఆకు నుంచి " పిప్పర్మెంట్ " నూనె తయారగును. దీనితో కూడా అనేక వైద్య ప్రయోజనాలు ఉన్నాయి. ఈ నూనెని ఘనీభవింపచేసిన మనము కిళ్ళీలలో వాడే " పిప్పరమెంట్ " తయారగును. పిప్పర్మెంట్ నోట్లో వేసుకొనిన వేడిగా ఉండి బయట గాలి కొద్దిగా సోకగానే చల్లగా ఉన్నట్లు అనిపిస్తుంది. 

 

•   పుదీనా ఆకుతో చికిత్సలు  - 

  

*  పుదీనా ఆకు రసములో 1 స్పూన్ నిమ్మరసం , కొద్దిగా తేనె కలిపి ప్రతిరోజూ 3 సార్లు చొప్పున తీసుకొనుచున్న అజీర్తి , కడుపునొప్పి , పొట్ట ఉబ్బరం , పొట్టలో గ్యాస్ , విరేచనాలు , విరేచనములో నులిపురుగులు , రక్తహీనత సమస్యల నుండి విముక్తి లభించును. 

 

*  పుదీనాకు కషాయం రోజుకి 2 లేక 3 పర్యాయాలు సేవిస్తున్న ఎక్కిళ్లు , దగ్గు , జలుబు , అజీర్తి తగ్గును. 

 

*  బహిష్టులో నొప్పికి పుదీనాకు కషాయం బహిష్టుకు 3 నుంచి 4 రోజుల ముందుగా సేవించటం మొదలుపెట్టిన బహిష్టునొప్పి రాదు . 

 

*  పుదీనాకు కషాయం నందు కొంచం ఉప్పు కలిపి గొంతులో పోసుకొని గార్గిలింగ్ ( గుడగుడ ) చేయుచున్న గొంతునొప్పి తగ్గును. 


 *   క్షయ , ఉబ్బసం , కొన్ని ఊపిరితిత్తుల వ్యాధులకు ఆయా మందులతో పాటు ఒకస్పూను పుదీనాకు రసములో 2 స్పూనుల వెనిగార్ , తేనె , కేరట్ రసము కలిపి రోజుకి 2 సార్లు సేవించిన మంచి టానిక్ లా పనిచేస్తుంది . 

 

*  నోటి దుర్వాసన గలవారు ప్రతిరోజు పుదీనాకు కొంచం నములుతున్న దుర్వాసన నిర్మూలమగును . ఇంకా దంతాలు పుచ్చుట తగ్గిపోయి దంతాలు గట్టిపడును. 

 

*  దంతాల నుండి చీముకారు సమస్య ఉన్నవారు పుదీనాకు నములుతున్న చీము కారుట తగ్గును. దంతాలు ఊడుట తగ్గును. 


 *  ప్రతిరోజూ నిద్రించుటకు ముందు పుదీనాకు ముఖమునకు రాసుకొనుచున్న ముఖంపైన మొటిమలు తగ్గిపోయి ముఖచర్మం మృదువుగా , అందముగా తయారగును. 


 *  గజ్జి , దురద వంటి చర్మవ్యాదులలో పుదీనాకు రసం పైపూతగా వాడుచున్న చర్మవ్యాధులు అంతరించును. నొప్పులు తగ్గును. 

 

*  పిప్పరమెంట్ తైలములో కొద్దిగా పంచదారను కలిపి 2 నుంచి 3 చుక్కలు కడుపులోకి తీసుకొనుచున్న కడుపుబ్బరం , ఆహారం అరగకుండా ఉండటం , అజీర్తి తగ్గును. 

 

*  కొబ్బరినూనెలో కొద్దిగా పిప్పరమెంట్ తైలం కలిపి కీళ్ళనొప్పులకు పైపూతగా రాయుచున్న గుణం కనిపించును. 


 *  గొంతునొప్పికి , గొంతులోని టాన్సిల్స్ కు పైపూతగా పిప్పరమెంట్ తైలాన్ని రాయుచున్న తగ్గును. 

 

*  పిప్పరమెంట్ నూనెలో కొద్దిగా లవంగ నూనె కలిపి పుచ్చుపళ్ళలో పెడుతున్న నొప్పి తగ్గుటయే కాక క్రమక్రమంగా పుచ్చు అంతరించును. 

 

*  నిమ్మరసములో కొద్దిగా పిప్పరమెంట్ తైలము కలిపి రాత్రిపూట ఒంటికి పట్టించుకుని పడుకున్న దోమలు దరిచేరవు . 

        

.       పైన చెప్పిన యోగాలే కాకుండా విరేచనాలు , జిగటవిరేచనాలు యందు పనిచేయును . హృదయమునకు మంచిది . గర్భాశయ దోషాలను పోగొట్టి రుతుస్రావం సరిగ్గా అగునట్లు చేయును . బాలింతలకు వచ్చు జ్వరం నందు పుదీనాకుల రసం తీసి రెండు చెంచాలు చొప్పున తాగించుట మంచిది . జలుబు నందు పుదీనాకు ముద్దగా చేసి నుదురుకు పట్టించి జలుబు , తలనొప్పి తగ్గును. 

            

.                     సమాప్తం 

 

     

.    ఆయుర్వేదములోని ఎన్నొ రహస్య మూలికల అనుభవ యోగాల గురించి నా గ్రంథాల యందు సంపూర్ణముగా , అందరికి అర్థమయ్యే సులభ భాషలో వివరించాను . వాటిని చదివి మరింత విజ్ఞానాన్ని పొందగలరు . 

  

 గమనిక  -

     

 నేను రాసిన " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు " మరియు " ఆయుర్వేద మూలికా రహస్యాలు " రెండు గ్రంథాలలో ఎన్నొ రహస్య చిట్కాలు , మా కుటుంబపరంగా  గత 250 సంవత్సరాల నుంచి మా పెద్దవారు మాకు అందించిన ఎంతో అనుభవసారాన్ని ఈ గ్రంథాలలో అందరి అర్థం అయ్యే విధంగా సామాన్య బాషలో వివరించాను. ఇంట్లో ఉండి మరియు అందుబాటులో ఉన్న వాటితోనే పెద్ద పెద్ద రోగాలు నయం చేసుకునే విధంగా అత్యంత సులభయోగాలు మన ప్రాచీన భారతీయులు రచించిన చెట్లను బట్టి భూమిలో నీటిని కనుక్కునే విధానాలు , వృక్షాలకు ఆయుర్వేద మూలికల ఉపయోగించి దిగుబడి పెంచే వృక్షాయుర్వేద చిట్కాలు , రైతులకు ఉపయోగపడే విధంగా ఏయే నక్షత్రాలలో పంటలు వేస్తే ఫలితాల ఎక్కువుగా ఉంటాయో తిథి, నక్షత్ర, వారాలతో సహా ఇవ్వడం జరిగింది. ఆయుర్వేదం నేర్చుకోవాలి అనుకునేవారికి ఇది మంచి దిక్సూచిలా ఉపయోగపడును. 

           

.  నా మూడొవ గ్రంథము నందు 50 రకాల మొక్కల గురించి అత్యంత విపులంగా ఇవ్వడం జరిగింది . ఈ మొక్కలన్నియు ప్రతి ఒక్కరికి తెలిసినవి మరియు మన ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటివే . ఈ గ్రంధములలో మీకు లభ్యమయ్యే సమాచారం మరే గ్రంథములలో లభ్యం అవ్వదని చెప్పగలను . మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల చిత్రములు కూడా ఇవ్వడం జరిగినది . ఏయే జబ్బులకు ఎటువంటి ఆహారపదార్థాలు తీసుకోవలెనో , తీసుకోకూడదో కూడా సంపూర్ణముగా మీకు ఇందులో లభ్యం అగును . ఔషధాలు మరియు తీసుకోవాల్సిన ఆహారవిహారాలు  ఒకేదగ్గర లభ్యం అగును . 

   

ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు గ్రంథము 288 పేజీలతో ఉండును . దీని విలువ 400 రూపాయలు , ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథము 384 పేజీలతో ఉండి 500 రూపాయలు , సర్వమూలికా చింతామణి గ్రంథము 352 పేజీలతో ఉండును . దీని విలువ 550 రూపాయలు . అందరికి అర్ధమయ్యేలా సులభ బాషలో ఉండును. గ్రాంథిక భాష ఉపయోగించలేదు . 

                

. ఈ గ్రంథములు కావలసిన వారు  9885030034 నంబర్ కు Phonepay or Googlepay or Paytm కు డబ్బు పంపించి ఇదే నంబర్ కు Whatsup నందు screenshot పెట్టి మీ పూర్తి Adreass ఇవ్వగలరు . కొరియర్ చార్జీ 100 రూపాయలు అదనం .

     

.  ఈ గ్రంథాలు కావలసినవారు క్రింద ఇచ్చిన నంబర్ కి ఫోన్ చేయగలరు .

    

.  కాళహస్తి వేంకటేశ్వరరావు  

 

. అనువంశిక ఆయుర్వేద వైద్యులు 

        

.  9885030034

సామెతల్లో ఆయుర్వేదం!

 సామెతల్లో ఆయుర్వేదం!15-07-2025

--------------------

.🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️

"తల్లిని చేసినవాడే కాయమూ పిప్పళ్ళు తెస్తాడు" ..అని ..కాయము అంటే బాలింతకు పాలు ఎక్కువగా రావటానికిమూలికలతో తయారు చేసే లేహ్యం ,పిప్పలి త్రిదోషాలను పోగొడుతుంది !

.

పేరులేని వ్యాధికి పెన్నేరు గడ్డ ! ...ఏ రోగమో ఎందుకొచ్చిందో తెలియక పోతే "అశ్వగంధ" పెద్ద మందు !

.

త్రిదోషహరం తిప్పతీగ అని సామెత !

.

"ఉత్తరేణు ఉత్తమం, మధ్యమం మారేడు,కనీసం కందిపుల్ల" ...ఇవి పళ్ళుతోముకోవడానికన్నమాట

.

వాస్తే వాయిలాకు పాస్తే పాయలాకు ..

.

అప్పుడే పుట్టిన శిశువుకు దొండాకు పసరు పోసేవారు లోపలి కల్మషాలు పోతాయని ...సామెత ఏమంటే ...."కొడితే చిన్నప్పుడు తాగిన దొండాకు పసరు కక్కుతావు "

.

పుండుమీదకు ఉమ్మెత్త ,నీరుల్లి నూరి నూనెలో వెచ్చజేసి గాయాలపై కట్టేవారట ...సామెత ఇలా ..."పుండుమీదకు నూనెలేదంటే గారెలొండే పెండ్లామా అన్నట్లు"..."ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదు "...

.

వెల్లుల్లి చాలా రోగాలు నయం చేస్తుంది. అది క్షయరోగాన్ని కూడా హరించే శక్తి కలది ...సామెత ...ఇలా ..."ఆశపడి వెల్లుల్లి తిన్నా రోగము అట్లానే ఉన్నది "

.

కరక్కాయ పువ్వు ,పిందె,పండు చాలా ఉపయోగకరమైనవి ...శ్వాస,కాస,ఉదర,క్రిమి,గుల్మ,హృద్రోగం ,గ్రహణి,కామిల,పాండు ..ఇన్ని రోగాలు హరిస్తుంది..అందుకే ..."మున్నూట ఇరవై రోగాలకు మూడు గుప్పిళ్ళ కరక్కాయ పొడి "..అని సామెత

.

ఆయుర్వేదం మితంగా తినమని చెపుతుంది ..సామెత ఇదుగో ..."పిడికెడు తిన్నమ్మ పీటకోడు లాగ ఉంటే చాటెడు తిన్నమ్మ చక్కపేడులాగుంది "...."ఒక పూట తింటే యోగి రెండు పూటలా తింటే భోగి మూడు పూటలా తింటే రోగి "

.

అలానే ...శిశువు పాలు వాంతి చేసుకోవడం ఆరోగ్యలక్షణమని చెప్పే సామెత ..."కక్కిన బిడ్డ దక్కుతుంది " అని...

.

ఇలా ఎన్నో సామెతలు ఒక్కొక్కటీ కనుమరుగవుతున్నాయి !

.

పిల్లవాడు భాషనే నేర్వనప్పుడు సామెత ఎలా వస్తుంది ?

.

సామెత తెలియనప్పుడు సంస్కృతి ఎలా తెలుస్తుంది ?

.

అందుకే భాషను చంపితే సంస్కృతి చస్తుంది!

జాతి జీవనాడి నశిస్తుంది!


ఇంగ్లీష్ మీడియం మోజులో పడ్డ తెలుగు జాతికి....

తెలుగు అంతరించాక మాత్రమే తెలుగు విలువ తెలుస్తుంది.🕉️🕉️🕉️

దక్షిణాయన పుణ్యకాలం

 *దక్షిణాయన పుణ్యకాలం లో ఏమి చెయ్యాలి* ?


జ్యోతిషశాస్త్రం ప్రకారం సూర్యుడు నవగ్రహాలకు రాజు.... అసలు జ్యోతిషంలో ఒక్క గ్రహం రాశి మారటానికి ఒక్కో కాల వ్యవధి వుంటుంది. అంటే చంద్రుడు మేష రాశి నుంచి వృషభరాశికి మారటానికి 2 1/2 రోజులు పడుతుంది. శనిగ్రహం 2 1/2 సం పడు తుంది. రాహు, కేతువులకి 1 1/2 సం, రవికి నెల రోజులు... ఇలా ప్రతి గ్రహానికి కొంత కాల పరిమితి వుంటుంది. అయితే ముఖ్యంగా సూర్యుడు నెలకి ఒక్కో రాశి చొన (మేషాది మీనరా శులు) పన్నెండు రాశులలోనూ పన్నెండు నెలలు సంచరిస్తే మనకి సంవత్సర కాలం పూర్త వుతుంది. 


సూర్యుడు మేష రాశి ప్రవేశాన్ని జ్యోతిష పరిభాషలో ‘మేష సంక్రమణం’ అని

సూర్యుడు వృషభ రాశి ప్రవేశాన్ని జ్యోతిష పరిభాషలో ‘వృషభ సంక్రమణం’ అని

సూర్యుడు మిథున రాశి ప్రవేశాన్ని జ్యోతిష పరిభాషలో ‘మిథున సంక్రమణం’ అని

 *సూర్యుడు కర్కాటక రాశి ప్రవేశాన్ని జ్యోతిష పరిభాషలో ‘కర్కాటక సంక్రమణం’ అని* 


ఇలా ఏయే రాశుల్లో ప్రవేశిస్తే ఆయా సంక్రమణ కాలంగా చెపుతారు. సంక్రమణం అనే మాటకి ‘జరగటం’, ‘ప్రవేశించటం’ అని చెప్పొచ్చు.


 *సూర్యుడు కర్కాటక సంక్రమణం చేసాడు అంటే సూర్యుడు కర్కాటక రాశిలోకి ప్రవేశించాడు అ ని అర్ధం. ఇది జూలై 15 నుంచి 17 తేది వరకు జరుగుతూ వుంటుంది. సాధారణంగా జూలై 16వ తేదీనే!* 


 *ఈ కర్కాటక సంక్రమణాన్ని ‘దక్షణాయన’ మని అంటుంటారు. (మనకి సంవత్సరానికి అయన ములు రెండు. ఒకటి ఉత్తరాయనం, రెండవది దక్షిణాయనం) ఇక తర్వాత సూర్యుని సింహరాశి ప్రవేశం, తర్వాత కన్యా రాశి ప్రవేశం (వినాయక చవితి వస్తుంది), తులారాశి ప్రవేశం (దసరాలు). ఇలా పన్నెండు రాశులలోనూ సూర్యుడు ప్రవేశించే కాలా న్ని సంక్రమణంగా చెప్తాం. (మకర సంక్రమణం (సంక్రాంతి)... మకరరాశి ప్రవేశం! కుంభరాశి ప్రవేశం (మహాశివరాత్రి)) అయితే సూర్యుని మకర సంక్రమణ మే ‘ఉత్తరాయన పుణ్యకాలం’.* 


ఏ తిథులతోను సంబంధం లేకుండాను, ఎవరినీ అడగక్కర్లేకుండాను సంవత్సరంలో వచ్చే పండుగలు ఉత్తరాయణ-దక్షిణాయన మనేవి. *జనవరి 14న వచ్చే ఉత్తరాయణాన్ని మకర సంక్రమణమనీ, జూలై 16న వచ్చే దక్షిణాయనాన్ని కర్కాటక సంక్రమణమనీ, వ్యవహరిస్తారు. ఈ రెండు ఆయనాలు కలిపితేనే సంవత్సరం అవుతుంది.* 


సూర్యుడు ప్రతి నెలలోను ఒక రాశినుండి మరొక రాశిలోకి ప్రవేశిస్తుంటాడు. దీనికే ‘సంక్రమణం’ అని పేరు. *సూర్యుడు కర్కాటక రాశిలోకి ప్రవేశించినప్పటినుంచి మకరరాశిలోకి ప్రవేశించేంతవరకు వుండే కాలం దక్షిణాయనం. ఈ ఆయనంలో సూర్యుడు భూమధ్య రేఖకు దక్షిణంగా సంచరిస్తాడు. దేవతలకు ఉత్తరాయణం పగలు కాగా, దక్షిణాయనం రాత్రిగాను చెప్తారు* . అదేవిధంగా ఉత్తరాయణం దేవతలకు, దక్షిణాయనం పితృదేవతలకు ప్రీతికరమని చెబుతారు. *దక్షిణాయన సందర్భంగా సంక్రమణ స్నానాలు చేయడం, విష్ణు సహస్రనామ పారాయణం చేయడంతోపాటు శ్రీ వరాహస్వామి వారిని పూజించడం శ్రేష్టమని చెప్తారు.* 


దక్షిణాయన ఆరంభ కాలమైన ఆషాఢంలో ఏ పండుగలు లేకపోయినా ఆ తర్వాత మాసాల్లో శ్రీకృష్ణాష్టమి, వినాయక చవితి, రాఖీపూర్ణిమ, ఆదిపరాశక్తి మహిమలను చాటే దసరా, నరక బాధలు తొలగించిన దీపావళి, శివకేశవులకు ప్రీతికరమైన కార్తీక, మార్గశిర మాసాలు, గోపికలు ఆనంద పారవశ్యాన్ని పొందే ధనుర్మాసం ఇవన్నీ దక్షిణాయనంలోనే వస్తాయి. ఆషాఢమాసంలో సూర్యుడు కర్కాటక రాశిలోకి ప్రవేశించడం ఖచ్చితంగా జరుగుతుంది. కర్కాటక రాశి ప్రవేశంతో దక్షిణాపథంవైపు సూర్యుడు పయనమవుతాడు. దక్షిణాయనంలో చేసే పితృకర్మలు సరాసరి ఆ పితృ దేవతలకు ఉత్తమమైనవి. *దక్షిణాయనంలో చేసే పితృకర్మలు సరాసరి ఆ పితృదేవతలకు సకల నరకాలనుండి తొలగిస్తాయి.* 


దక్షిణాయనంలో దేవతా ప్రతిష్ఠ, గృహ ప్రవేశం, ఉపనయనం, వివాహ కార్యాల్లాంటి శుభ కార్యాలను చేయడం మంచిది కాదంటారు. కానీ దక్షిణాయనంలో ఉగ్రదేవతా రూపాలను అంటే సప్త మాతృకలు, భైరవ, వరాహ, నృసింహ, మహిషాసుర మర్దని, దుర్గ లాంటి దేవతామూర్తులను ప్రతిష్టించవచ్చని వైఖానస సంహిత చెబుతోంది. కర్కాటక సంక్రమణ సమయంలో అంటే దక్షిణాయన ప్రారంభంలో పుణ్య స్నానాలు, జపతపాలు చేయడం ఎంతో మంచిది. ఆనాడు కులదైవాన్ని, లేదా శ్రీ మహా విష్ణువును పత్రాలతో పూజిస్తే ఆ ఏడాదంతా చేసే దోషాలు, పాపాలు వైదొలగుతాయి. వారి పితృదేవతలు స్వర్గాది సుఖలోకాలను చేరుకుంటారు.


సంక్రమణ కాలంలో చేసే పుణ్య స్నానాల వలన రోగాలు నివారించబడడమే కాకుండా దారిద్య్రం కూడా నిర్మూలించబడుతుంది. ముఖ్యంగా ఈ సంక్రమణ కాలం సాధకులకు మంచి ఆధ్యాత్మిక ఫలితాలనిస్తుంది. ఈ సమయంలో దానాలు కూడా విశేష ఫలాలనిస్తాయి. అందుకే *మోక్షానికి ఉత్తరాయణం, ఇహానికి దక్షిణాయనం ప్రతీకలుగా భావిస్తారు.* ఈరోజు పుణ్యనదీ స్నాన, దాన, జప, హోమం అక్షయ ఫలాన్ని ఇస్తుంది. మనందరము కూడా దక్షిణాయన సందర్భంగా మన ఆచార సంప్రదాయాలు పాటిద్దాం. భావి తరాలకు మన సంస్కృతిని తెలియజేద్దాం.

ఆదిలోనే హంసపాదు*

 *ఆదిలోనే హంసపాదు*

ఏదైనా పని మొదలు పెట్టిన వెంటనే విఘ్నాలు కలిగితే ఈ సామెతను వాడతారు. దేవాలయాలలో జరిగే ఉత్సవాల సమయంలో ఉత్సవ మూర్తులకు వివిధ వాహనాలపై గ్రామోత్సవాన్ని నిర్వహిస్తారు. గ్రామోత్సవ సమయంలో వాహనాన్ని కొంతమంది భక్తులు తమ భుజంపై మోస్తూ ఉంటారు. గ్రామోత్సవం జరుగుతున్నంత సేపు వాహన బరువు మోత్తాన్ని తమ భుజంపై ఉంచడం చాలా కష్టం కాబట్టి కొంత వెసులు బాటు కోసం ఏర్పరచుకున్న పరికరాన్ని హంసపాదు అంటారు. హంసపాదు T, Y ఆకారానికి మధ్యస్తంగా ఉంటుంది. వాహనసేవ జరిగే సమయంలో వాహనాన్ని సరిగా నిలబెట్టేందుకు 4 నుంచి 8 హంసపాదులు అవసరమవుతాయి. ప్రారంభంలోనే అవాంతరం ఏర్పడితే ఈ సామెతను ఉపయోగిస్తారు.


అలాగే 

వ్రాసేటప్పుడు తప్పిపోయిన పదాన్ని చెప్పడానికి అక్కడ ఒక గుర్తు పెట్టి దానిని మరొక చోట లేదా పుట క్రిందనో చూపుతారు.

అంటే మొదట్లో నే అవాంతరం ఏర్పడినది అని తెలపడానికి ఈ సామెత వాడతారు.

ఇది సాధారణంగా తాటియాకు మీద ఘంటంతో వ్రాసేటప్పుడు గాని వ్రాసిన తరువాత గాని ఎక్కడ ఏమైనా మార్పులు చేర్పులు చేయవలసినప్పుడు చెరిపి వేయడానికి గాని చేర్చడానికి గాని వీలుపడదు. అప్పుడు అంచపాదం గుర్తు పెట్టి ఆవతల వ్రాస్తారు.

ఈ వ్యవహారాలు నేడు ఇప్పటికీ దస్తావేజులు వ్రాసే వ్రాయసగాండ్రు చేస్తూ ఉండడం పరిపాటే.

మూల తాటియాకు ప్రతులల్లో కూడా ఉంటాయి.

ధనవంతుడు కడలికరణి

 *2173*

*కం*

ధనవంతుడు కడలికరణి

కనబడు దాహార్తిదీర్చ కర్మరహితుడౌ

ఘనగుణి కూపంపు చెలువ

జనులందరిదప్పిదీర్చ సరసుడు సుజనా.

*భావం*:-- ఓ సుజనా! ధనవంతుడు సముద్రం వలెకనబడిననూ దాహార్తి తీర్చడానికి పనికిరాడు. గొప్ప గుణవంతుడు నుయ్యి వలె జనులందరి దప్పిక నూ తీర్చగలడు.

*** *కొంపెల్ల శ్రీనివాస శర్మ*

జగద్గురువులూ చతురులే*

 *జగద్గురువులూ చతురులే*

    ఒకసారి విద్వాంసుడు శృంగేరీ 34వ పీఠాధీశ్వరులు శ్రీ శ్రీ చంద్రశేఖర భారతీమహస్వామివారి దర్శనానికి శృంగేరీ వెళ్ళాడు. స్వామివారికి బిక్షావందనం చేసి...స్వామివారితో ఇలా అన్నాడట.

 "భగవద్గీతలో తాను నిష్టాతుడనని తనకెంతో ప్రావీణ్యం ఉన్నదని ఎన్నో దేవాలయాల్లో, సభల్లో భగవద్గీతమీద ప్రవచనాలు చేస్తానని, అందుకు తమరు కూడా శృంగేరీ పీఠ అనుబంధ శాఖల్లో తనకు అవకాశము ప్రసాదించవలసినదిగా స్వామివారిని ప్రార్ధించాడు.

 మహాస్వామివారు ఆ విద్వాంసుని గౌరవపూర్వక అభ్యర్ధనని విని సంతృప్తిగా తగిన ఏర్పాట్లను బెంగుళూరులో ప్రథమంగా చేయించారు.

 వారి మొదటిరోజు భగవద్గీత ప్రవచనానికి వందమంది వరకు శ్రోతలు హాజరయి ఆ ప్రవచనాన్ని విన్నారు.

 రెండోరోజు శ్రోతల సంఖ్య బాగా తగ్గింది. ముప్ఫయి మంది వరకు ఆశీనులై విన్నారు.

 మూడోరోజున కేవలం ఒక ఐదుగురు వరకే వచ్చారు. సమావేశ మందిరం వెల వెల బోయింది. ఈ విషయం జగద్గురువుల దరికి చేరింది.

ఆ విద్వాంసుడు శృంగేరీకి వెళ్ళాడు.

అదే రోజు రాత్రి స్వామివారి పూజానంతరం, ఆ పండితుడు జగద్గురువులతో " ఇదేం పట్టణమండీ! భగవద్గీత అంటే బొత్తిగా ఎవరికీ ఇష్టం లేనట్లు ఉంది" అని మిక్కిలి బాధతో స్వామివారికి వినమ్రపూర్వకంగా విన్నవించారు. 

అందుకు స్వామివారు చిరు దరహాసంతో తమ అమృత వాక్కుతో ఇలా అన్నారు " ఎందుకు తమరు అంతలా చింతిస్తారు! భగవద్గీతను శ్రీకృష్ణుడు ఈ విశ్వానికి తెలిసేలా చెప్పినప్పుడు విన్నది ఎంతమందో కాదు కదా! కేవలం అర్జునుడొక్కడేగా!" అని ఆయన్ని సముదాయించి పంపారట.

కామెంటు చేసెముందు

 కామెంటు చేసెముందు మీ పేరు ఫొను నెంబెరు తెలుపండి

కామకళ -- స్వరూపం _నిరూపణ🙏 నాల్గవ భాగం

 🙏కామకళ -- స్వరూపం _నిరూపణ🙏

                   నాల్గవ భాగం

       వికాసము పొందినటువంటి రక్త బిందువు వలన, ఆ బ్రహ్మమే అంకురముగా గల శబ్ద బ్రహ్మముగా ఆవిర్భవించింది. రక్త బిందువనగా మాయాశబలిత బ్రహ్మము(మాయచేత చలించు లేదా స్పందించు బ్రహ్మము ). ఆ బ్రహ్మమునుండి అనాహత శబ్దము పుట్టింది.అనాహతం అంటే ప్రతిధ్వని లేని ధ్వని. అనాహత మొట్టమొదట ఆవిర్భవించినది అనాహతం నుంచి ఆవిర్భావించినవి శబ్దాలే కనుక దానిని అనాహతం లేదా మ్రోగించని శబ్దం అని అంటారు. అదియే నాదబ్రహ్మ. ఆ నాదము వలన ఆకాశము, వాయువు, అగ్ని, జలము, పృథివి అనబడే పంచభూతాలతో కూడిన ప్రకృతి జనించినది. అకారాది హకారాంతము అంటే అ నుండి హ వరకు గల అక్షరాలు ఉత్పన్నమైనాయి. పంచభూతాలు రూపాలైనాయి. అక్షరాలు నామాలైనాయి.


       ఈశ్వరుడు అనేటటువంటి మాయా ప్రతిబింబశక్తి కారణమై, రజోగుణముతో ఉద్రిక్తము అయింది . అప్పుడు మహత్‌ అని ప్రసిద్ధమై, అందులో విక్షేపశక్తి (వ్యాపాక శక్తి) విజృంభించినది. ఆ విక్షేప శక్తి యొక్క ప్రతిబింబ రూపమే హిరణ్యగర్భుడయినది. ఇతడే దృశ్య-అదృశ్యమైన రూపము కలిగి, మహతత్త్వమునకు అభిమానిగా ఉన్నాడు.(సృష్టి మొత్తం ఒకే పురుషుడుగా ఉండుట) అందువలన ఆ హిరణ్యగర్భునికి మహత్‌, అహంకారము అని పేరు కలిగినది.


కామకళ నిరూపణ


మూలకూటత్రయ-కళేబరా - లలితా సహస్రనామంలోని నామము .

మూలస్య కుటత్రయమేవ కళేబరం (=స్థూలరూపం) యస్యాః సా 


మూల మంత్రం యొక్క మూడు విభాగాలు ఆమె శరీరాన్ని ఏర్పరుస్తాయి.అదే అమ్మవారి స్థూలరూపం అని గ్రహించండి 


మంత్రం యొక్క మూడు కూటాలు ఆమె భౌతిక లేదా సూక్ష్మ రూపాన్ని ఏర్పరుస్తాయి.


అసలు అర్థంలో మూల అనే పదానికి కామకళ అని పిలువబడే సూక్ష్మ శరీరం అని అర్ధం , మరియు విభజనలు కామకళ యొక్క భాగాలు. కామకళ లోని మొదటి భాగాన్ని ఊర్ధ్వ బిందువు అని , రెండవ భాగాన్ని రెండు సూర్య చంద్ర బిందువులని మరియు చివరి భాగాన్ని సార్ధకళ అని అంటారు .

త్రయ అంటే మూడు. పంచదశి మంత్రంలోని మూడు కూటాలు ఇక్కడ ప్రస్తావించబడ్డాయి. పంచదశికి 'కామకళ ' మూలమని మనం చూశాం. కాబట్టి, ఆమె భౌతిక మరియు సూక్ష్మ రూపాలు రెండూ 'కామకళ'ను సూచిస్తాయని ఇది సూచిస్తుంది. మూడు సూక్ష్మ రూపాలలో, మొదటి సూక్ష్మ రూపం పంచదశి మంత్రం, . రెండవ సూక్ష్మ రూపం , కామకళ రూపం ఇక్కడ చర్చించబడింది. క్లుప్తంగా చెప్పాలంటే, మూడు బిందువులు త్రికోణంగా కలిగిన హంస మరియు సోహం (హంస మంత్రం) కలయికను కామకళ అంటారు. ఇది లలితాంబిక యొక్క వాస్తవ భౌతిక రేఖాచిత్రం. ఇందులో ఉన్న బీజం 'ఈం '. ఈ బీజం చాలా శక్తివంతమైనది మరియు షోడశీ మంత్రంలో ఈ బీజాన్ని ఎలా ఉపయోగించాలో ఈ అంశం తెలుసుకొని శ్రీం బీజం చేర్చుకోవాలి . 


మంత్రాలు మూడు రకాలుగా వర్గీకరించబడ్డాయి - పురుష, స్త్రీ మరియు తటస్థ .


హుమ్ , వషట్ మరియు ఫట్‌తో ముగిసే మంత్రాలు పురుష మంత్రం.


స్వాహా మరియు వౌషట్ తో ముగిసేవి స్త్రీ దేవతా మంత్రాలు ;


నమః తో ముగియడం తటస్థ మంత్రాలు .


పురుష మరియు తటస్థ మంత్రాలను "మంత్రం" అని పిలుస్తారు మరియు స్త్రీ దేవతా మంత్రాలు " విద్య " అని పిలుస్తారు, అందుకే షోడశి మంత్రానికి శ్రీవిద్య అని పేరు.


జపం మూడు రకాలు:


1.వాచ్యం - వినబడేలా చేయబడింది


2. ఉపాంశు - గుసగుసల వలె జపించడం 


3. మానస – మానసికంగా చేస్తారు.

హ్రీం, శ్రీం సౌః వంటి బీజ మంత్రాలు అని పిలువబడే ఏక-అక్షర మంత్రాలు గుర్తుంచుకోవడానికి మరియు పఠించడానికి సులభమైనవి; అవి కూడా అత్యంత శక్తివంతమైనవి. ఒక చిన్న విత్తనంలో గంభీరమైన చెట్టు ఉన్నట్లుగా, ప్రతి బీజంలో అపారమైన ఆధ్యాత్మిక జ్ఞానం మరియు సృజనాత్మక శక్తి ఉంటుందని గ్రహించండి . ఈ బీజాలలో పురాతనమైనది మరియు విస్తృతంగా తెలిసినది ఓం. ఓమిత్యేకాక్షరం బ్రహ్మ అని ఉపనిషత్ చెబుతోంది.

ఓంను ప్రణవ మని పిలుస్తారు, 

ఓం అనేది విశ్వం యొక్క “ప్రాథమిక బీజం ”-ఈ ప్రపంచం మొత్తం, “ఓం తప్ప మరొకటి కాదు” అని ఒక పురాతన వచనం చెబుతోంది. ఇది అన్ని ఇతర మంత్రాలు ఉద్భవించే మూల మంత్రంగా కూడా పరిగణించబడుతుంది మరియు వేదాల యొక్క అనేక వేల శ్లోకాల యొక్క సారాంశాన్ని సంగ్రహిస్తుంది. కఠోపనిషత్తు ప్రకారం, ఓం అనేది "వేదాలన్నీ సాధన చేసే పదం."


అందుకని, ఓం అనేది ధ్యాన బీజం ., ఓం "మనలోని అనంతమైన అనుభవాన్ని" వ్యక్తపరుస్తుంది . ఈ విధంగా, ఓం జపించడం అనేది మనలో ఉన్న దైవాన్ని తాకడానికి సులభమైన మార్గం.

ఓం అనేది వైదిక కామకళ 

                     సశేషం

సమర్పణ

మారేపల్లి ఉదయ భాస్కర శర్మ

చమత్కారాలు

 సేకరణ 

_.🌹..(శుభోదయం)...🌹_ 

*_👌భాషా చమత్కారాలు🤗_*

-----------------------

*మహాకవి శ్రీశ్రీ మద్రాసులో ఓ చిన్న హోటల్ కెళ్ళాడు. "టిఫినేముంది?" అనడిగాడు.*

 

*"దోసై" అన్నాడు హోటల్ వాడు. "సరే వేసై" అన్నాడు శ్రీశ్రీ.*


*మరోసారి వైజాగ్ లో ఓ హోటల్ కి వెళ్ళి... "టిఫినేముంది?" అని అడిగాడు. "అట్లు" తప్ప మరేం లేవు సర్! అన్నాడు వాడు. "సరే అట్లే కానీ" అన్నాడు శ్రీశ్రీ.*


*ఇంకోసారి ఓ మిత్రుడు ఊరెళ్తూంటే వీడ్కోలివ్వటానికి మద్రాస్ సెంట్రల్ స్టేషన్ కెళ్ళాడు.* 


*ప్లాట్ ఫాం మీద ఓ పరిచయస్తుడు కనిపించి "ఊరికేనా?" అనడిగాడు.* 


*"లేదు ఊరికే..." అని బదులిచ్చాడు శ్రీశ్రీ.*


*ఒక ఊరిలో ఒక చోట ఒక బోర్డ్ పై "ఇక్కడ వేడి తేనీరు దొరుకును" అని వ్రాసి ఉండటంతో "అరే ! ఇక్కడ వేడితే కానీ నీరు దొరకదా?" అనడిగాడు.*


*ఓ ఇంటి ముందు "కుక్కలున్నవి జాగ్రత్త" అనే బోర్డ్ చూసి, ఆశ్చర్యం నటిస్తూ.. "అరే ఇంతకుముందు ఇక్కడ మనుషులుండే వారే...!!!" అనన్నాడు.*


*ఓ కుర్రాడు ఒక పద్యం వల్లె వేస్తున్నాడు "ఎవడు రాత్రి లోకకంఠకుడు," అని వల్లె వేయటం విని "ఒరే! మొద్దబ్బాయ్! అలాకాదురా ! అది _"ఎవడురా త్రిలోక కంటకుడు"_ అని సరి చేశాడు.*


*_"జమాల్ భాషా - తోక - మాల్ భాషా ఇట్లనెను"_ అనేది తప్పు. జమాల్ భాషాతో కమాల్ భాషా ఇట్లనెను అనేది రైటు.*


*ఓ హరిదాసు విశ్వనాథ సత్య నారాయణ గార్ని కలిసి ఓ హరికథ ఏర్పాటు చేయటానికి సహకరించమని అడిగాడు.* 


*_"మీ ఊరిలోనే చెప్ప కూడదటయ్యా!"_ అనన్నాడు సత్యనారాయణగారు.* 


*_"మా ఊరి వారు చెప్పిచ్చు కోరండి"_ అనన్నాడా హరిదాసు.* 


*_"అయితే మా ఊరి వారు చెప్పుచ్చు కుంటారే"_ అనన్నాడు సత్యనారాయణగారు*

--------------------

*"దోసె," ; "పూరీ"; " వడ" ; "సాంబారు" పదాలతో శివపార్వతుల కల్యాణం గురించిన పద్యం :*


_మత్తేభం._ 

*_జడలో దోసెడు మల్లె పూలు తురిమెన్ సౌందర్యమొప్పారగన్!_* 

*_నడయాడెన్ ఘలుఘల్లనన్ హొయలు చిందంజాజి పూరీతి;పా_*

*_వడ యట్టిట్టుల చిందులాడి పడగా భవ్యాత్మ యైనట్టి యా_*

*_పడతిన్ బార్వతి బెండ్లియాడితివి సాంబా! రుద్ర! సర్వేశ్వరా!_*


_----స్వస్తి! 🙏----_

*‘ధర్మం’ అంటే ఏమిటి?*

 *‘ధర్మం’ అంటే ఏమిటి?*



ఇది చాల క్లిష్టమైన ప్రశ్న! వెంటనే వివరించి చెప్పటానికి కుదరని గంభీరమైన ప్రశ్న! ఎందుకంటే ధర్మం అనే రెండక్షరాల శబ్దానికి చాలా లోతువుంది. చాలా సంక్లిష్టత ఉంది. చాలా నిగూఢత ఉంది. చాలా విశాలత ఉంది.


‘ధర్మంతు సాక్షాత్ భగవత్ ప్రణీతమ్’


ధర్మాలన్నియు సాక్షాత్ పరమాత్ముని నుండి లభించాయి.


ధరించునదిగాబట్టి ధర్మము అని ధర్మ శబ్దానికి ఉత్పత్తి అర్ధము. 

(ధృ – ధారణే). 


ధర్మము నిత్యసత్యమై వుండేదైనా దేశకాల ప్రాంతాదుల ననుసరించి ధర్మం మారుతుంటుంది.


ధర్మము – సామాన్యధర్మం, విశేషధర్మం అని రెండు రకాలు.


శ్లో|| ధృతిః క్షమా దమో స్తేయం, శౌచమింద్రియ నిగ్రహః|

హ్రీర్విద్యాసత్య మక్రోధః ఏతత్ ధర్మస్త్య లక్షణమ్||


“ధృతి – క్షమ – దమం – అస్తేయం – శౌచం – ఇంద్రియ నిగ్రహం – హ్రీః (సిగ్గు) – విద్య – సత్యం – అక్రోధం”, ఈ పది లక్షణాలు కలిగియున్న ధర్మమని శాస్త్రం చెబుతోంది. 


అంటే…,


1. మానవుడు ఏదైనా పని ప్రారంభిస్తాడు. తనకు సంబంధించినది కానివ్వండి, కుటుంబానికి సంబంధించినది కానివ్వండి, సమాజానికి సంబంధించినది కానివ్వండి! ప్రారంభించేటపుడు ఏ సమస్యలు ఉండవు. కాని ప్రారంభించిన కొన్ని రోజులకే నూటొక్క సమస్యలు ప్రారంభమవుతాయి. కువిర్శలు ప్రారంభమౌతాయి. ఎన్నెన్నో అడ్డంకులు కలిగి నిరాశ కల్గుతుంది. ఎన్ని అడ్డంకులు వచ్చినా ఆత్మబలంతో అకుంఠిత దీక్షతో ‘ధృతి’ చెడకుండా ముందుకి సాగిపోవాలి..

‘ఇది ధర్మం’.


2. మనిషి ఏ విషయంలోనైనా, ఏ పనిలోనైనా ఓర్పు కలిగి వుండాలి. క్షమాగుణంతో ఉండాలి. ప్రతిదానినీ ప్రతివారినీ, ప్రతి విషయాన్నీ, క్షమాశక్తితో ఎదుర్కొనాలి. కోపగించుకోకూడదు. ఓర్పుగుణం వున్నవారిని ఏ శక్తులూ ఏమీ చేయలేవు.    

‘ఇది ధర్మం’.


3. మనం ఒక పని చేసేటపుడు మన మనస్సు సంపూర్ణంగా ఆ విషయంలోనే లగ్నం కావాలి. ఒక పనిచేస్తూ మరొక దానిని గురించి ఆలోచించకూడదు. ఏ విషయంలోనైనా ముఖ్యం. చదువుతున్నా, వింటున్నా, పని చేస్తున్నా, మాట్లాడుతున్నా, మనస్సును పరిపరిమార్గాలకు పోనివ్వకుండా వుండాలి.

‘ఇది ధర్మం’.


4. తనకు తెలియని విషయాలను తాను తెలిసికొనక, పెద్దలు, పూర్వులు, చెప్పినదానిని అంగీకరించక, స్వతంత్ర నిర్ణయం తీసికొనలేక, నిస్తేజంగా నిర్వికారంగా, నిరాశగా, నిర్లిప్తతగా, నియమరాహితుడుగా, ఉండకూడదు.  

‘ఇది ధర్మం’.


5. మనిషి ఎల్లపుడూ మనస్సునూ, శరీరాన్నీ, మాటనూ ఆలోచననూ, సంసారన్నీ, ఇంటినీ, పరిసరాన్నీ, ధరించే వస్త్రాలనూ పరిశుభ్రంగా శుచిగా వుంచుకోవాలి. మనసు పరిశుభ్రంగా వుండాలి. మనిషి పరిశుభ్రంగా ఉండాలి. 

‘ఇది ధర్మం’.


6. చదువువున్నా, సంపదలున్నా, కీర్తివున్నా, బలంవున్నా ఇంద్రియ నిగ్రహం లేనివానికి ఏదో ఒకరోజు పతనం తప్పదు. కాబట్టి మనస్సును దాని ఇష్టానికి దాన్ని వదలివేయకుండా మన చెప్పుచేతల్లో ఉంచుకోవాలి. 

‘మనస్సును గెలిచినవాడు దేవేంద్రుడినైనా గెలుస్తాడు’ మనస్సును తమ చెప్పుచేతల్లో ఎవరుంచుకొంటారో వారిని భూతప్రేతాలుగాని, దెయ్యాలు గాని, యక్షకిన్నర కింపురుషులుగాని, గ్రహాలు గాని, రోగాలు గాని, కష్టసుఖాలుగానీ, మరణంగానీ, వశంలో వుంటాయి. 

కాబట్టి మనస్సును, మాటను, దృష్టిని, శరీరాన్నీ, చేతలనూ అదుపుచేయాలి.‘ఇది ధర్మం’.


7. ప్రతి విషయానికీ సంకోచపడటం, సిగ్గుపడటం, అనుమానపడటం, తనను తాను తక్కువగా భావించటం కూడదు. 

‘ఇది ధర్మం’.


8. మనిషి సత్యవ్రతం కలిగిఉండాలి. అకారణంగా, అనవసరంగా, ఒకరి మెప్పుకోసం, ఒకరిని మెప్పించటంకోసం, తన పనిని సాధించుకోవటం కోసం, తాను ఏ విధంగానైనా ప్రయోజనం పొందటంకోసం. తనవారిని తృప్తిపెట్టట్టంకోసం అబద్దాలు చెప్పకూడదు. అబద్ధం అవమానం కలిగిస్తుంది. అబద్ధం అల్పసుఖాన్ని మాత్రమే కల్గిస్తుంది. అబద్ధం మరొకనాటికి అవమానం పాలు చేస్తుంది. అబద్ధం మనిషి విలువను మట్టిచేస్తుంది. మన శక్తినీ, మనకీర్తినీ, మన గొప్పదనాన్నీ పాతాళానికి త్రొక్కివేస్తుంది. కాబట్టి సాధ్యమైనంతవరకూ సత్యధర్మాన్ని వదలకూడదు. 

‘ఇది ధర్మం’.


9. మానవునికి ఆహారం ఎంత ముఖ్యమో, వివేకం కూడా అంతే ముఖ్యం. వివేకవంతుడు కావాలంటే విద్యావంతుడు కావాలి. శాస్త్రాలు, పురాణాలు ఇతిహాసాలు విన్నంత మాత్రాననే వివేకం సిద్ధించదు. విన్న విషయాలను స్వానుభవానికి మళ్ళించుకోవాలంటే మనిషికి విద్య కావాలి. 

‘విద్యావిహీనః పశుః’ అని ఆర్యవాణి. మనిషిగా పుట్టి మట్టిబొమ్మగా జీవితం గడపకూడదు. ఎంతటి పెడతానం పెనవేసుకొనివున్నా, స్థితిగతులు ఎంతటి బాధాకరమై వున్నా, భిక్షమెత్తి అయినా చదువుకోవాలి!’ అని ఋషివాక్యం. విద్య ప్రతి వ్యక్తికీ నిర్బంధంగా ఉండాలి. 

‘ఇది ధర్మం’.


10. పగ, హింస, కోపం, ప్రతీకార మనస్తత్వం ఇవన్నీ మనిషిని పతనావస్థకు నెడతాయి. పగ, ప్రతీకారాలు మనిషిని అశాంతికి గురిచేసి అనారోగ్యాన్ని కల్గిస్తాయి. తన అభివృద్ధికి తానే ఆటంకంగా నిలవాల్సివస్తుంది. “తనను కన్నవారికీ, తాను జన్మనిచ్చిన వారికీ, తనను నమ్మి బ్రతికేవారికీ అన్యాయం కల్గుతుంది.”

సందేహాలు

 🔵 నిత్య జీవితంలో చాలామందికి ఏర్పడే సందేహాలు ,

▫▫▫▫▫▫▫▫▫▫▫▫▫

🔵1. చీటికి మాటికి ప్రతిజ్ఞలు చేయుట, ఒట్టు పెట్టుట దోషం.

🔲2. నిలబడికాని, అటూఇటూ తిరుగుతూ కాని అన్నం తినటం వల్ల క్రమంగా దరిద్రుడౌతాడు. రాబోయే జన్మలో బిచ్చగాడు అవుతాడు.

🔴3. నోట్లో వ్రేళ్ళు పెట్టుకొనుట, గోళ్ళుకొరుకుట చేయరాదు.

🔷4. దేవాలయ ప్రాంగణంలో ఉమ్మడం, పొగత్రాగడం

5. ఆదివారం, శుక్రవారం, మంగళవారం తులసిఆకులు కోయరాదు.


6. చీకటి పడ్డాక పువ్వులు, ఆకులు చెట్లనుండి త్రుంచరాదు.

7. గురువుద్వారా మంత్రోపదేశం పొందనివాడు ఎప్పటికీ తరించలేడు. కనుక ఉపదేశం పొందితీరాలి.

8. చెట్లు, దేవతా విగ్రహాలు ఈశాన్యంలో ఉంటే వాటిని బరువులుగా భావించి తీసివేసేవారు, తీసివేయమని సలహా ఇచ్చేవారు ఏడు జన్మలు ఉబ్బసపు రోగులుగా పుడతారు. ఈ పనులు చేయుట దైవద్రోహం కనుక చేయరాదు.

9. గురువులకు, అర్చకులకు, పౌరాణికులకు సరిగా పారితోషంఇవ్వక, వారికి ఋణపడేవారు నూరుజన్మలు కుక్కలుగా, చండాలురుగా పుట్టి కష్టనష్టాల పాలవుతారు.

10. శివలింగార్చన ఆడువారు కూడా చేయవచ్చు.


11. ఇంట్లో విగ్రహాలుంటే ఏమీ ప్రమాదం లేదు. పరులకు అపకారం కోరి పూజ చేసేవారికి మాత్రమే నియమాలు. తక్కిన వారికి పూజా విషయాలలో పెద్ద పెద్ద నియమాలు లేవు.

12. నిద్రనుండి లేవగానే ముందుగా అరచేతులను దర్శించి వామన నామస్మరణ చేయాలి.

13. పాచి ముఖంతో అద్దం చూసుకొనరాదు.

14. హారతి ఇచ్చాక దేవునిపై నీరు చల్లాలి. హారతి ఇచ్చే పాత్రపై కాదు.

15. తీర్థం తీసుకున్నాక, ఆ చేతిని కడుక్కోవాలి తప్ప, అరచేతిని తలపై రాసుకొనరాదు.


16. స్నానం చేశాక శరీరం తుడుచుకొని తడి-పొడి తువ్వాలు కట్టుకొని పూజ చేయరాదు. పూజా మందిరంలో ప్రవేశించరాదు. పూర్తిగా ఆ తుండును తడిపి నీరు పిండి మాత్రమే కట్టుకోవాలి. లేదా వేరే శుభ్రమైన వస్త్రాలు పూజకు ధరించాలి.

17. ఉపవాసం ఉన్నపుడు, జాగరణ చేసినపుడు పరులదోషాలు తలుచుకోరాదు.

18. శివాలయంలో నందికి దగ్గరగా దీపారాధన చేయరాదు. కొంచెం దూరం ఉంచాలి.

19. తల వెంట్రుకలతో కూడిన అన్నం పండితులకు, గురువులకు పెట్టరాదు. సాధ్యమైనంత జాగ్రత్త వహించాలి. పొరపాటున అన్నంలో వెంట్రుకలు వస్తే ఆ అన్నం తీసివేసి మళ్ళీ వడ్డించి నేయి వేయాలి.

20. అన్నం తింటున్న వారెవరినీ తిట్టరాదు, దెప్పి పొడవరాదు.


21. నిజం తెలుసుకోకుండా ఎవరినీ నిందించరాదు, అభాండాలు వేయరాదు. అలా చేస్తే అవతలి వారి పాపాలన్నీ అభాండాలు వేసిన వారి తలకు చుట్టుకుంటాయి.

22. ఇస్తానని వాగ్దానం చేసి దానమివ్వనివాడు వందజన్మలు దరిద్రుడై పుడతాడు, వాగ్బంగం చాలా దోషం.

23. అన్నం తినేటప్పుడు కంచానికి బాగా దగ్గరగా కూరలు, మజ్జిగ మున్నగునవి ఉన్నపాత్రలు పెట్టరాదు. మనం తినేటప్పుడు ఎంగిలి ఆ పాత్రలలో పడితే ఆ పదార్థాన్ని మరొకరికి వడ్డిస్తే, వాడికి "యముడు" మల ముత్రాదులు ఆహారంగా ఇస్తాడు.

24. తరచుగా కాలినడకన పుణ్యక్షేత్రాలు దర్శిస్తే మంచి జన్మలు కలుగుతాయి. దీనిని కాయిక తపస్సు అంటారు.

25. గురువునకు ఉపదేశ సమయాలలో కాని, పురాణాదులు వినేటప్పుడు కాని పాదాలు ఒత్తితే 7 జన్మల పాపాలు తొలుగుతాయి.


26. గురువుగారి బట్టలు ఉతికి ఆరవేసిన వారికి 3 జన్మల పాపాలు తొలగుతాయి.

27. మంత్రోపదేశం చేసిన గురుని ఆజ్ఞ పాటించేవారికి ఏ పాపమూ అంటదు. పునర్జన్మ ఉండదు. (ఇది తప్పక పాటించవలసిన ముఖ్య పవిత్ర నియమము. దీనికి సాటి మరొకటి లేదు). పరాశర సంహితలో ఈ విషయాలున్నాయి.

28. అష్టమి, పూర్ణిమ, చతుర్థశి కాలలో స్వయంపాకం దానం చేస్తే అన్నపానాలకు ఏనాడు లోటుండదు.

29. ఎక్కువ వేడిగా, ఎక్కువ చల్లగా ఉండే పదార్థాలు స్వీకరించరాదు.

30. భోజనం చేసిన వస్త్రాలు ఉతికి ఆరవేయకుండా వాటితో దైవపూజ చేయరాదు.


31. శవాన్ని స్మశానం దాకా మోసినా, శవాన్ని ఇంటి దగ్గర ఉండటానికి అనుమతినిచ్చినా నరకానికి పోకుండా స్వర్గానికి పోతాము.

32. గృహప్రవేశ కాలంలో గాని, ఏడాదిలోపు గాని ఆ ఇంట మణిద్వీప పరాయణం చేయడం మంచిది. ఇది వాస్తుదోషాలను పరిహరిస్తుంది.

33. భోజనానికి ముందు, అనంతరం కూడా కాళ్ళు కడుక్కోవాలి.

34. సకల పురాణేతిహాస కోవిదుడు కాని వాని వద్ద మంత్రోపదేశం పొందరాదు.

35. పుట్టిన రోజునాడు దీపాలు కానీ, కొవ్వొత్తులు కానీ ఆర్పరాదు. నోటితో అగ్నిని ఊదుట ఘోరపాపం. అటువంటివారు గ్రహణపు మొర్రితో మళ్ళీ జన్మమెత్తి దుఃఖాలు పొందుతారు.


36. తలకి నూనె రాసుకొని ఆ చేతులతో పాదాలకు ఆ నూనెజిడ్డు పులమరాదు.

37. శుక్ర, శనివారం వంటి వార నియమాలు పెట్టుకున్నవారు హోటలు టిఫిన్లు తినుటగానీ, ఆనాటి అల్పహారాదులలో ఉల్లి వాడుట కాని నిషేదము. ఇది ప్రయాణ మధ్యంలో ఉన్న వారికి వర్తించదు.

38. చీటికి, మాటికి యజ్ఞోపవీతం తీసి పక్కనపెట్టడం, తాళి తీసేస్తుండటం రెండూ భయంకర దోషాలే.

39. క్రూరుడు, దుష్టుడు కాని మగనితో తాళికట్టించుకొన్న భార్య, కాపురం చేయక ఏడిపించటం, చెప్పిన మాట వినకపోవటం, తాళి తీసి భర్త చేతిలో పెట్టడం చేయరాదు. ఇలా చేసిన స్త్రీలకి వంద జన్మలలో వైధవ్యం కానీ, అసలు పెళ్లి కాకపోవడం జరుగుతుంది.

40. దీపాలు పెట్టేవేళ తలదువ్వుకోరాదు. ఇలా చేసిన స్త్రీలకి వందల జన్మలలో వైధవ్యం కాని, అసలు పెళ్లి జరగకపోవడం వంటివి జరుగుతాయి.


41. దిగంబరంగా నిద్రపోరాదు.

42. కలియుగంలో ఆలయంలో జంతువధ నిషేధం.

43. విజయదశమి, శివరాత్రి దినాలలో మాంసాహారం, ఉల్లి పనికిరాదు.

44. ఆచమనం చేసిన నీటిని దైవనివేదనలకు, అర్చనలకు వాడరాదు, కనుక వేరొక పాత్రలో శుద్ధ జలాన్ని ఈ కార్యాలకు వినియోగించుకోడానికి తెచ్చుకోవాలి.

45. దీపారాధనకు అగ్గిపెట్టె వాడకూడదని ఏ శాస్త్రాలు చెప్పలేదు. కనుక అగ్గిపెట్టెతో దీపం వెలిగించుకోవచ్చు.


46. దీపారాధనకు ఒక కుంది మాత్రమే వాడినపుడు మూడు వత్తులు వేయాలి.

47. కొబ్బరికాయ కొట్టాక వెనుకవైపు పీచు తీయాలనే నియమం కూడా తప్పనిసరి కాదు. శుభ్రత కోసం పీచు తీయవచ్చు, తీయకపోతే దోషం లేదు.

48. కొబ్బరికాయను నీళ్ళతో కడిగి కొట్టడం చాలా తప్పు, కొబ్బరికాయను పీచు ఒలిచివేశాక నీళ్ళతో కడగరాదు.

49. మాడిన అన్నం, అడుగంటిన పాయసం, కంపు వచ్చే నేయి ఇటువంటివి నైవేద్యానికి పనికిరావు.

50. ఆలయ ప్రాంగణంలో అర్చకునిపై కేకలు వేయరాదు. అర్చకునిలో దోషం ఉంటే బయటకు పిలిచి మందలించాలి లేదా మరింత దుష్టుడైన అర్చకునినైతే మూడు మాసాల జీతమిచ్చి ఆ పదవినుంచి తొలగించి వేయాలి.

అయిదు ప్రశ్నలకు

 ఈ అయిదు ప్రశ్నలకు 

సరైన జవాబులు వెతికి పట్టుకోగలవాడే జ్ఞానవంతుడు. 


ఆ జవాబులకు తగినట్టుగా 

జీవించటమే బుద్ధిమంతుడి లక్షణం. 


1 నేనెవరు, 

2 నా లక్ష్యం ఏమిటి, 

3. ఈ లక్ష్యం చేరేది ఎలా, 

4 మార్గం ఏమిటి, 

5 వీటికి విరోధి ఎవరు? 


ఈ ప్రశ్నపంచకాన్ని అర్థపంచకం అంటారు. 


మొదటి ప్రశ్న సమాధానంపై మిగతా నాలుగు ప్రశ్నల జవాబులు ఆధారపడి ఉంటాయి.


నేను జీవుడిని, నాకు ఆధారం దేవుడు. నేను అస్వతంత్రుడిని, భగవంతుడు సర్వస్వతంత్రుడు అన్న ఎరుక కలగటమే తొలి ప్రశ్నకు జవాబు. 


మనం ఏమిటన్నది మొదట తెలుసుకోవటం 

స్వరూప జ్ఞానం. జీవుడినైన నేను దేవుడికి దూరమయ్యాను, తిరిగి చేరువ కావటం నా లక్ష్యం అన్నది రెండో ప్రశ్నకు జవాబు. ఇది ఫలస్వరూప జ్ఞానం.


ఈ లక్ష్యం భగవంతుడి అనుగ్రహంవల్లే నెరవేరాలి. మార్గదర్శనం చేయించగల సమర్థుడు... ఆయనను నమ్మి మనస్ఫూర్తిగా ఆదుకొమ్మని ఆకాంక్షిస్తే, ఏదో ఒక దారి కనిపించకపోదు. 


అది కర్మ కావచ్చు, 

భక్తి కావచ్చు, 

జ్ఞానం కావచ్చు. అర్హతకు తగిన మార్గం తప్పకుండా కనిపిస్తుంది. ఇది పరస్వరూప జ్ఞానం.


మార్గం అంటే ఉపాయం. 


ఏ మార్గంలో ఎలా వెళ్లాలో ముందుగా ఆలోచించి, అడుగు వేయడం చాలా అవసరం. చిత్తశుద్ధి, ఏకాగ్రబుద్ధి కలిగి, చేపట్టిన పనులు చేస్తే భగవంతుడు మెచ్చుతాడు. కృష్ణార్పణంగా చేసే కర్మలే నిష్కామ కర్మలు.


 ‘కర్మ నీ వంతు, ఫలితం నా పూచీ’ అని కృష్ణుడు చెప్పనే చెప్పాడు. నదులన్నీ సముద్రంలో చేరే చందాన ఆ కర్మలు మోక్ష ద్వారానికి దారి తీస్తాయి, దగ్గరికి చేరుస్తాయి. 


ఈ దారిలో ఎదురుపడే విరోధులు ఎవరు? 


అహంకార 

మమకారాలు, 

రాగద్వేషాలు, 

స్వపర భేదాలు. వీరందరూ ఇంటి దొంగలు. 


మనలోని అజ్ఞానపు చీకటి గది వీరి నివాసం. 


యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహారాలు సాధనా రూప దీపాలు. వీటి వల్ల మనసుకు పట్టిన మకిలి దూరం అవుతుంది. మనసు నిలకడ ధారణ. తైల ధారలా సాగే మనోయానమే ధ్యానం. ధ్యానం పరాకాష్ఠ చెందడమే సమాధి. విరోధిని అధిగమించిన సమాధి అయిదో ప్రశ్నకు సమాధానం. అదే స్వస్వరూప జ్ఞానం. 


అంటే స్వతహాగా మనం అజ్ఞానులమని తెలుసుకోవటం. అజ్ఞానం తొలగితే అంతా జ్ఞానమయమే. 


శరణాగతికే మరో పేరు ఉపాయ స్వరూప జ్ఞానం.


భారత, 

భాగవత, 

రామాయణాలు జ్ఞాన భాండారాలు. నిత్యపారాయణ గ్రంథాలు కూడా. మనమేమిటో, మన స్వరూప, స్వభావాలు ఎలాంటివో, ఏ విధంగా మనం మన జీవితాలను మలచుకోవాలో, సర్వగమ్యమైన జీవిత పరమార్థం ఎలా సాధించాలో... వీటికి తగిన సమాధానాలు వాటిలో ఉన్నాయి. 


భారతం అంటే స్థూల శరీరం. 

భాగవతం సూక్ష్మశరీరం. 

రామాయణం కారణ శరీరం. 


భారతం చదివి మానవుడిగా, 

భాగవతం చదివి దేవుడిగా, 

రామాయణం చదివి ఆదర్శ మానవుడిగా మెలగటం నేర్చుకోవాలి. 


నేర్చినది జీవితానికి అనువదించాలి లేక ఆచరించాలి. అందుకే వ్యాస వాల్మీకులు వేదసారాన్ని సులభ సుందరంగా అక్షరానువాదం చేసి మనకు నిత్య సంసేవనంగా అందజేశారు. ఇహం లేనిది పరం దక్కదు. కర్మ చేయక జ్ఞానం దొరకదు. కర్మ జ్ఞానాలు భక్తిలో ఊరితేగాని పరిపూర్ణం కావు. 



ప్రతి మనిషిలో మూడు భాగాలున్నాయి. 


ఒకటి పశు భాగం. 

రెండోది ప్రాణ భాగం. 

మూడోది ఆత్మ భాగం. 


శరీరం, ప్రాణం, ఆత్మ... ఈ మూడూ మనుగడకు, అస్తిత్వానికి ఆధారభూతాలు.


 ‘నేను జీవుడిని... నాకు ఆధారం ఆ దేవుడు’ అన్న మొదటి సమాధానమే భవ్య దివ్య జీవన సంవిధానానికి మూలాధారం.

మంగళవారం🍁* *🌹15 జూలై 2025🌹* *దృగ్గణిత పంచాంగం*

 *卐ॐ ఓం శ్రీ 🌹గురుభ్యోనమః ॐ卐*      

    *🍁మంగళవారం🍁*

  *🌹15 జూలై 2025🌹*       

    *దృగ్గణిత పంచాంగం*  

             

*స్వస్తి శ్రీ విశ్వావసు నామ సంవత్సరం* 

*ఉత్తరాయణం - గ్రీష్మ ఋతౌః*

*ఆషాఢమాసం - కృష్ణపక్షం*


*తిథి  : పంచమి* రా 10.38 వరకు ఉపరి *షష్ఠి*

*వారం    : మంగళవారం* (భౌమవాసరే)

*నక్షత్రం   : శతభిషం* ఉ 06.26 వరకు ఉపరి *పూర్వాభాద్ర*

*యోగం : సౌభాగ్య* మ 02.12 వరకు ఉపరి *శోభన*

*కరణం   : కౌలువ* ప 11.21 *తైతుల* రా 10.38 ఉపరి *గరజి*

*సాధారణ శుభ సమయాలు:* 

*ఉ 06.00 - 08.00 సా 04.30 - 06.30*

అమృత కాలం  : *రా 09.59 - 11.33*

అభిజిత్ కాలం  : *ప 11.47 - 12.39*

*వర్జ్యం      : మ 12.39 - 02.13*

*దుర్ముహూర్తం  : ఉ 08.19 - 09.11 రా 11.08 - 11.52*

*రాహు కాలం   : మ 03.29 - 05.06*

గుళికకాళం       : *మ 12.13 - 01.51*

యమగండం     : *ఉ 08.58 - 10.36*

సూర్యరాశి : *మిధునం*  

చంద్రరాశి : *కుంభం/మీనం*

సూర్యోదయం :*ఉ 05.50*

సూర్యాస్తమయం :*సా 06.54*

*ప్రయాణశూల   : ఉత్తర దిక్కుకు పనికిరాదు*


*వైదిక విషయాలు:*

ప్రాతః కాలం          :  *ఉ 05.43 - 08.19*

సంగవ కాలం         :      *08.19 - 10.55*

మధ్యాహ్న కాలం    :     10.55 - 01.32

అపరాహ్న కాలం    : *మ 01.32 - 04.08*

*ఆబ్ధికం తిధి: ఆషాఢ బహుళ పంచమి*

సాయంకాలం        :*సా 04.08 - 06.44*

ప్రదోష కాలం         :  *సా 06.44 - 08.56*

రాత్రి కాలం           :*రా 08.56 - 11.52*

నిశీధి కాలం          :*రా 11.52 - 12.36*

బ్రాహ్మీ ముహూర్తం :*తె 04.15 - 04.59*

------------------------------------------------

        *🌷ప్రతినిత్యం🌷*

         *_గోమాతను 🐄 పూజించండి_* 

        *_గోమాతను 🐄 సంరక్షించండి_*


  *🚩శ్రీ ఆంజనేయ స్తోత్రం🚩*


*గతి నిర్జిత వాతాయ* 

*లక్ష్మణ ప్రాణదాయచ*

*వనౌకసాం వరిష్ఠాయ* 

*వశినే వననాసినే!*


            🍁 *ఓం శ్రీ*🍁

🌹 *ఆంజనేయాయ నమః*🌹


🍁🪷🌹🛕🌹🌷🪷🌷🍁

*సర్వే జనాః సజ్జనో భవంతు !*

*సర్వే సజ్జనా స్వజనో భవంతు !!*

*సర్వే స్వజనా సుకృతో భవంతు !*

*సర్వే సుకృత జనః సుఖినో భవంతు !!*

<><><><><><><><><><><><><><>


         🌷 *సేకరణ*🌷

      🌹🌿🍁🍁🌿🌹

        *న్యాయపతి వేంకట*

       *లక్ష్మీ నరసింహా రావు*

      🌷🍃🍁🍁🍃🌷

వేద ఆశీర్వచనం

 *నమస్తే సదా వత్సలే మాతృ భూమే*


*కలియుగాబ్ది 5126*

*శ్రీ శాలివాహన శకం 1947 స్వస్తి శ్రీ చాంద్రమాన విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం - గ్రీష్మ ఋతువు - ఆషాడ మాసం - కృష్ణ పక్షం -‌ పంచమి - శతభిషం & పూర్వాభాద్ర-‌‌ భౌమ వాసరే* (15.07.2025)


ప్రముఖ వేదపండితులు, తణుకు /తాలూకా ఇరగవరం వాస్తవ్యులు 

*బ్రహ్మశ్రీ గుళ్ళపల్లి శివశర్మ ఘనపాఠీ* *(9491391009, 9440091234)* గారి నేటి వేద ఆశీర్వచనం.





.🙏🙏 

భవదీయుడు

దశిక ప్రభాకరశాస్త్రి 

9849795167

----------------------------------------------

*పిల్లలకి బతుకుతో పాటు భారతీయత కూడా నేర్పండి*

వ్యంగ్యాస్త్రాలు

 గొప్పవారి వ్యంగ్యాస్త్రాలు,చమత్కారాలూ కూడా గొప్పగానేవుంటాయి.🙂

ఒకసారి కవిసమ్మేళనం జరుగుతోంది.కవులందరూ విచ్చేసారు.మహాకవి శ్రీ విశ్వనాధ సత్యన్నారాయణ గారూ కూడా సభకు విచ్చేసారు. ఆయన్ని చూసి కవులందరూ వారిని సగౌరవంగా స్వాగతించారు.

శ్రీ జాషువా మాత్రం ఏదో పుస్తక పథనంలో ఉండిపోయారు.

ఆదిచూసిన విశ్వనాధ వారు జాషువా ను ఉద్దేశించి,

"పక్షి నారాకను గమనించలేదు" అన్నారు.

అది విని కవులందరూ ఇంతటి మహాకవి జాషువాని పక్షి తో పొలుస్తారా అని ముక్కున వేలు వేసుకున్నారు.😕

కానీ జాషువా మాత్రం చిరునవ్వుతో లేచి విశ్వనాధారికి నమస్కరించి ,"మీలాంటి కిరాతకుల దృష్టి ఎప్పుడూ పక్షులమీదే కదా" అన్నారు

.

విశ్వనాధుని ఈ జాషువా అంత మాట అంటాడా అని కవులందరూ నిశ్చేస్టు లయ్యారు. 🤔😕

కానీ జాషువా అన్న మాటకి విశ్వనాధులు పగల పడి నవ్వేశారు. 😄

దీని అంతరార్ధం ఏమిటంటే.. జాషువాని పక్షి తో ఎందుకు పోల్చేరంటే జాషువాకి ఆ సభలో "కవి కోకిల"(పక్షి కదా) అనే బిరుదు ఇస్తున్నారు. అందుకే జాషువాకి కోపం రాలేదట.🙂

ఇక జాషువా విశ్వనాధుని కిరాతకుడు అన్నారు.

కిరాతకుడు అంటే విశ్వనాదులవారు "శ్రీ రామాయణ కల్పవృక్షం" అని రామాయణం రాస్తున్నారు అందుకు జాషువా ఆయన్ని (కిరాతకుడు)వాల్మీకి తో పోల్చాడు.🙂

ఇంకో విషయం. జాషువా విశ్వనాధుల వారి అనుంగు శిష్యుడు !!🙂

శ్రీమద్భగవద్గీత

 శ్రీమద్భగవద్గీత: తొమ్మిదవఅధ్యాయం

అక్షరపరబ్రహ్మయోగం:శ్రీ భగవానువాచ:


పితా௨హమస్య జగతో మాతా ధాతా పితామహః 

వేద్యం పవిత్రమోంకార ఋక్సామ యజురేవ చ (17)


గతిర్భర్తా ప్రభుః సాక్షీ నివాసః శరణం సుహృత్ 

ప్రభవః ప్రలయః స్థానం నిధానం బీజమవ్యయమ్ (18)


ఈ జగత్తుకు తండ్రి, తల్లి, కర్మఫలదాత, తెలుసుకోదగ్గవస్తువు నేనే. ఓంకారం, ఋగ్వేదం, సామవేదం, యజుర్వేదం కూడా నేనే. ఈ జగత్తుకు గతి, పతి, ప్రభువు, సాక్షి, నివాసస్థానం, ఆశ్రయం, ఆప్తుడు, సృష్టికర్త, సంహారకుడు, ఆధారం, ప్రళయం, స్థానం, శాశ్వతబీజం నేనే.

న్యాయ మార్గాన్ని అనుసరించేవాడికి

 💎🌅 *_-|¦¦|శుభోదయమ్|¦¦|-_* 🌄🪔

🪔 *_𝕝𝕝ॐ𝕝𝕝 సుభాషితమ్ 𝕝𝕝卐𝕝𝕝_* 💎


   శ్లో𝕝𝕝 *యాన్తి న్యాయప్రవృత్తస్య*

             *తిర్యఞ్చోఽపి సహాయతామ్l*

             *అపన్థానం తు గచ్ఛన్తం*

             *సోదరోఽపి విముఞ్చతిll*


          *... _శ్రీమద్రామాయణమ్_ …*


తా𝕝𝕝 *"న్యాయ మార్గాన్ని అనుసరించేవాడికి సమస్త ప్రాణులు సహాయం చేస్తాయి... తప్పుడు మార్గంలో వెళ్ళేవాడిని సోదరుడు కూడా విడిచిపెడతాడు"....*


 ✍️🌹💐🌸🙏

18-47-గీతా మకరందము

 18-47-గీతా మకరందము.

        మోక్షసన్న్యాసయోగము

    

      -పూజ్యశ్రీశ్రీశ్రీ విద్యాప్రకాశానందగిరి స్వాములవారు,

శ్రీశుకబ్రహ్మాశ్రమము, శ్రీకాళహస్తి.

అII స్వధర్మాచరణము చాల ఉత్తమమైనదని వచించుచున్నారు -


శ్రేయాన్స్వధర్మో విగుణః పరధర్మాత్స్వనుష్ఠితాత్ | 

స్వభావనియతం కర్మ 

కుర్వన్నాప్నోతి కిల్బిషమ్ || 


తా:- తనయొక్క ధర్మము (తన అవివేకముచే) గుణములేనిదిగ కనబడినను (లేక, అసంపూర్ణముగ అనుష్ఠింపబడినను) చక్కగా అనుష్ఠింపబడిన ఇతరుల ధర్మముకంటె (లేక, ఇతర ధర్మములకంటె) శ్రేష్ఠమైనదే యగును. స్వభావముచే ఏర్పడిన (తన ధర్మమునకు తగిన) కర్మమును చేయుచున్నయెడల మనుజుడు పాపమును పొందనేరడు.


వ్యాఖ్య:- స్వకీయకర్మ, లేక తన ధర్మము ఆచరించుట ఒకింత కఠినమైనను, తేలికగా ఆచరింపబడినట్టి ఇతరుల కర్మను గ్రహించుటకంటె అది ఎంతయో మేలని చెప్పబడినది. కావున నిజధర్మమును ఒకింత కష్టమైనను వదలరాదు. స్వకీయకర్మను పైశ్లోకమందు తెలుపబడిన చందమున ఈశ్వరార్పణబుద్ధితో చేసినచో మనుజుడు పాపమును బొందకుండును.

(లేక, ఇచట స్వధర్మమనగా ఆత్మకు సంబంధించిన ధర్మమనియు చెప్పవచ్చును. ఆత్మచింతనాదులు, ఆత్మధ్యానాదులు ఒకింత ప్రయాసముగా తోచినను, పరధర్మములైన దృశ్యవస్తుధర్మములను, లేక, దృశ్యవస్తుచింతనమును గ్రహించుటకంటె ఎంతయో మేలైనవి. ఆత్మచింతనాదులు (స్వధర్మము) ప్రారంభమున ఒకింత కష్టముగ తోచినను తుదకు అనంత సౌఖ్యమును ప్రసాదించును. దృశ్యవస్తువులు (పరధర్మము) ప్రారంభమున సుఖవంతములుగ తోచినను తుదకు పరమదుఃఖమునే కలుగజేయును. కావున పరధర్మముకంటె స్వధర్మమే మేలని చెప్పబడినది).


ప్ర:- జీవునకు ఏ కర్మము, ఏ ధర్మము శ్రేష్ఠమైనది?

ఉ:- ఒకింతకష్టముగా తోచినను స్వకీయకర్మమే శ్రేష్ఠమైనది.

ప్ర:- దేనిచే మనుజుడు పాపమును బొందకుండును?

ఉ:- స్వభావముచే ఏర్పడిన కర్మమును, స్వధర్మమును (ఈశ్వరార్పణబుద్ధితో) చక్కగ నాచరించినపుడు పాపమును బొందకుండును.

తిరుమల సర్వస్వం -301*

 *తిరుమల సర్వస్వం -301*

చరిత్రపుటల్లో శ్రీనివాసుడు-16


ఆలయాన్ని కంఠహారం లా చుట్టి ఉన్న శేషాచల పర్వతసానువుల్లో- సుమారు లక్ష మంది యానాదులుగా పిలువబడే ఆటవిక తెగ వారు సంచారం జీవనం సాగించేవారు. వారు పోడు వ్యవసాయం, పశుపోషణ చేస్తూ లక్క, ఎర్రచందనం, తుమ్మబంక, కందమూలఫలాలు, వనమూలికలు, కుంకుడు కాయలు, తేనె, ఏనుగు దంతాలు, పులిగోర్లు, జింకచర్మాలు, కొమ్ములు వంటి ఆటవిక ఉత్పత్తులను భక్తులకు, మైదాన ప్రాంతవాసులకు నగదు మరియు వస్తుమార్పిడి రూపంలో అమ్మడం ద్వారా జీవనం సాగించేవారు. వారు కూడా శ్రీనివాసుణ్ణి తమ ఇలవేల్పుగా, పెరట్లోని పెన్నిధిగా భావించి, తరచూ దర్శించు కునేవారు. కొన్ని ప్రత్యేక పర్వదినాల్లో సమూహాలుగా ఆలయానికి వచ్చి - తమదైన శైలిలో నృత్యగానాలతో అర్చనాదికాలు గావించి, అటవీ ఉత్పత్తులను కానుకలుగా సమర్పించుకునే వారు. కాలక్రమేణా రవాణా సౌకర్యాలు అభివృద్ధి చెందడం, కొండవాలుల్లో జనావాసాలు ఏర్పడడం, ఆలయ నిర్మాణాలు అనూహ్యస్థాయిలో విస్తరించడం, అటవీ ఉత్పత్తులకు గిరాకీ సన్నగిల్లడం, ప్రత్యామ్నాయ జీవనోపాధి సులభంగా లభించడం మొదలగు కారణాలు వల్ల ఆ సంచార జాతులవారు సుదూర ప్రాంతాలకు తరలి పోయారు. ప్రస్తుతం శేషాచల శ్రేణులపై గిరిజనుల ఉనికి నామమాత్రం గానే ఉంది.


గగనాన్ని చుంబించే పర్వత పంక్తులన్నీ కఠిన శిలలతో, అరుదైన వృక్ష, జంతు, పక్షి జాతులతో, జలజలా పారే సెలయేళ్ళతో, శరవేగంగా దుమికే జలపాతాలతో, అంతు చిక్కని అగాధాలతో, గుంపులు గుంపులుగా తిరుగుతూ ఘీంకరించే గజరాజులతో, అంధకార బంధురంగా ఉండే గుహలతో నిండి ఉండేవి. మానవమాత్రులకు దుర్భేద్యంగా ఉండే ఆ గుహల్లో చిరుతలు, ఎలుగుబంట్లు, సివంగులు వంటి క్రూరమృగాలు నివసించేవి. కొన్నింటిలో కొండజాతి ప్రజలు తమ పెంపుడు జంతువులతో సహజీవనం చేసేవారు. అలాంటి ఒకానొక గుహ నుండి శ్రీశైలం, అహోబిలం క్షేత్రాలకు బిలమార్గం ఉండేదని ప్రతీతి. కానీ ఎవరూ ఆ మార్గం ద్వారా ప్రయాణించే సాహసానికి పూనుకోలేదు.  


ఆ రోజుల్లో నాగపాతాళ నాయకుడనే ఔత్సాహికుడు బ్రాహ్మణబృందం తోనూ, రక్షకదళం తోనూ వచ్చి శేషాచల పర్వతాల నడుమ నున్న లోయల్లోనూ, దట్టంగా అలుముకున్న కీకారణ్యాల లోనూ యుగాల పర్యంతం అలరారుతున్న తీర్థాలను అన్వేషించే సాహసానికి ఒడిగట్టగా - వారిని దేవభటులు అడ్డగించారని, దాంతో వారందరూ విగతజీవులై పోయారని ఒక కథనం జనబాహుళ్యంలో విస్తృతంగా ప్రచారంలో ఉండేది. ఈ వృత్తాంతం - దేవాలయాన్ని దర్శించుకోవడానికి వచ్చిన భక్తులు అత్యుత్సాహంతో కొండకోనల్లోకి వెళ్ళే దుస్సాహసం చేసి, ప్రాణాంతకమైన ప్రమాదాలు కొని తెచ్చుకోకుండా నివారించడంలో సహాయపడేది.


దాదాపు అర్ధశతాబ్దం పాటు క్రైస్తవ పాలకుల అధీనంలో ఉన్న తిరుమలక్షేత్ర పాలనాపగ్గాలు - శ్రీవారి పరమభక్తుడైన హాథీరామ్ బావాజీ వారసులైన మహంతులకు దఖలు పడ్డాయి. 


మహంతుల నిర్వహణలో తిరుమల ఆలయం

--------------------------------------

ఈ విషయాన్ని చెప్పుకునే ముందు, ఆలయ అజమాయిషీ - ఈష్ట్ ఇండియా కంపెనీ వారి నుండి మహంతుల చేతిలోకి ఎందుకు, ఎలా వచ్చిందో పరిశీలిద్దాం...


పరాయి చెరనుండి ఆలయానికి విముక్తి

------------------------------

హిందూ దేవాలయాల, ధార్మిక సంస్థల - మరీ ముఖ్యంగా, కుల వర్గ ప్రాంతీయ బేధాల కతీతంగా హిందువులందరూ ఆరాధించే తిరుమల ఆలయ - వ్యవహారాల్లో ఈస్ట్ ఇండియా కంపెనీ వారి జోక్యం మితిమీరడంతో; హిందూ సాంప్రదాయ వాదుల్లో తీవ్రమైన అసంతృప్తి ప్రబలింది. క్రమంగా - వారి సహనం హద్దులు దాటి, బ్రిటీష్ ప్రభుత్వంపై వ్యతిరేకత నివురుగప్పిన నిప్పులా వేగంగా విస్తరించడంతో; ముందుచూపు కలిగిన, వివేకవంతులైన కొందరు బ్రిటిష్ అధికారులు కళ్ళు తెరిచారు. లండన్ లోనూ, కలకత్తా లోనూ ఉన్న ఈస్టిండియా కంపెనీ ఉన్నతాధికారులకు అనేక రహస్య నివేదికలు పంపారు. ఈ వ్యవహారాన్ని తెగే వరకు లాగవద్దని, తిరుమల ఆలయ వ్యవహారాలలో అలవి మాలిన జోక్యం పనికిరాదని సందేశాలు ఇచ్చారు. ఇండియా లోని గవర్నర్ జనరల్ కు - దాదాపుగా అన్ని హిందూ మరియు మహమ్మదీయ ధార్మిక సంస్థలకు సంబంధించి ఇలాంటి నివేదికలే అందాయి. వాటన్నింటిని సమీక్షించిన ఆంగ్లేయ పాలకవర్గం - భారతదేశంలోని అన్ని మతపరమైన సంస్థలలో క్రమంగా జోక్యం తగ్గించుకోవాలని తీర్మానించింది. తదనుగుణంగా, అప్పుడు తిరుమల దేవాలయం యొక్క వ్యవహారాలను పర్యవేక్షిస్తున్న నార్త్ ఆర్కాట్ జిల్లా కలెక్టరుకు - ఆలయ నిర్వహణ విధుల నుండి తప్పుకొని; ఆ బాధ్యతను తగిన వ్యక్తులకు గానీ, వ్యవస్థకు గానీ అప్పగించ వలసిందిగా తాఖీదు అందింది.  


*శ్రీనివాసుని శ్రీచరణాలను సేవిద్దాం, సకల శుభాలనూ పొందుదాం* 


*రచన* 

*పల్లపోతు కృష్ణ బాలాజీ గారు- వాణి శ్రీ దంపతులు*

ఫోన్ నెంబర్

99490 98406

మహాభారతము

 *సంపూర్ణ మహాభారతము**సరళ వ్యావహారిక భాషలో...!*

*సౌప్తిక పర్వము ప్రథమాశ్వాసము*


*438 వ రోజు*


*అశ్వత్థామకు భూతం ఎదురు వచ్చుట*


రథికత్రయం పాండవశిబిరాల వైపు వేగంగా కదినారు. అశ్వత్థామ అతి వేగంగా తన రథమును నడుపసాగాడు. కృతవర్మ, కృపాచార్యులు కొంచం వెనుక పడ్డారు. అప్పుడు ఒక భూతం అశ్వత్థామ ఎదుట నిలిచింది. అశ్వత్థామ ఆ భూతానికి బెదరక దాని మీద అస్త్రప్రయోగం చేసాడు. వాటిని అన్నింటిని ఆ భూతం నోరు తెరచి మింగింది. అశ్వత్థామ వద్ద ఉన్న అస్త్రములు అన్నీ అయిపోయాయి. అశ్వత్థామకు ఏమీ చేయాలో తోచక కత్తి తీసుకుని ఆ భూతమును ఎదుర్కొన్నాడు. ఆ కత్తి ఆభూతమును తాకగానే మాడిపోయింది. అశ్వత్థామ తన వద్ద ఉన్న తోమరములు, చక్రాయుధములను ఆ భూతము మీదకు విసిరాడు. అవన్నీ ఆభూతమునకు తాకగానే తునాతునకలు అయ్యాయి. అశ్వత్థామ తన గదను ఆ భూతము మీదకు విసిరాడు. ఆ భూతం ఆ గదను మింగింది. వెనకకు తిరిగి చూసాడు కృతవర్మ, కృపాచార్యుడు కను చూపు మేరలో లేరు. కృపాచార్యుడి మాట వినక ముందుకు దూకినందుకు తనకు తగిన శాస్తి జరిగింది అని చింతించాడు. గోవులను, బ్రాహ్మణులను, బాలురను, వృద్ధులను, అంధులను, మిత్రులను, సఖులను, తోబుట్టువులను, జడులను, ఏమరుపాటున ఉన్న వారిని, నిద్రిస్తున్న వారిని, ఆడువారిని అస్త్రశస్త్రములతో కొట్టడం మహా పాపం. అది ధర్మవిహితం కాదని పెద్దలు చెప్తారు. అట్టి ధర్మమార్గం విడిచి అసుర మార్గం అవలంబించిన వారికి కార్యసిద్ధి కలుగదు. బ్రాహ్మణుడిగా పుట్టి ఇట్టి అపనిందలకు గురి కాగల కార్యమూ నేను చేయవచ్చునా ! అందుకేనేమో నాకు ఈ భూతం దాపురించింది. నాకిక ఎవరు దిక్కు " అని చింతించాడు.


*అశ్వత్థామ ఈశ్వరుడిని ధ్యానించు*


చివరకు అశ్వత్థామ ఈ సమయంలో నాకు ఆ పరమేశ్వరుడే దిక్కు. అని అచంచలమైన మనసుతో అశ్వత్థామ పరమేశ్వరుడిని ధ్యానించాడు. ఈశ్వరా ! నేను ఈ గండం గడచి గట్టెక్కిన నిన్ను నానా భూతోపహారములతో కొత్తవిధంగా అర్చిస్తాను. నీకు ప్రీతి కలిగిస్తాను " అని అనేక స్తోత్రములతో శివుని ప్రార్థించాడు. అప్పుడు అశ్వత్థామ ముందు ఒక బంగారు వేదిక కనపడింది దాని మీద అగ్నిగుండం మండుతూ ఉంది. ఆ అగ్ని నుండి అనేక ఆకృతులతో ప్రథమగణాలు బయటకు వచ్చాయి. వాటికి అశ్వత్థామ భయపడ లేదు. అతడి మనసు ఈశ్వరుడి మీద లగ్నమై ఉంది. ఎంతకీ ఈశ్వరుడు ప్రత్యక్షం కాలేదు. తన విల్లంబులతో ఆ అగ్ని గుండంలో దూకబోయాడు అశ్వత్థామ కాని తనను దహించుటకు సరిపోయిన అగ్ని ప్రజ్వరిల్ల లేదు. అశ్వత్థామ తన విల్లు, అమ్ములు, అస్త్రములు, శస్త్రములు, బాణములు, అనేక విధములైన ఆయుధములు వేసి అగ్నిని చక్కగా ప్రజ్వలింప చేసాడు. అశ్వత్థామ పరమేశ్వరా ! నాకు ఏమిచేయాలో తోచడం లేదు. నా శత్రువులను చంపే బలం, శక్తి ప్రసాదించు లేని ఎడల నేను ఆత్మబలిదానం చేసుకుంటాను అని హర హర మహాదేవ " అంటూ మంటలలో దూకబోయాడు. అప్పుడు అశ్వత్థామకు ఈశ్వరుడు ప్రత్యక్షమై " అశ్వత్థామా ! ఆగు నీ భక్తికి అకుంఠిత దీక్షకు ఆనందించాను నీవు కోరినవరం ఇచ్చాను. కాని ఒక్క మాట నేనూ విష్ణాంశ సంభూతుడైన శ్రీకృష్ణుడూ ఒక్కటే . కృష్ణుడు నన్ను పూజిస్తాడు, కృష్ణుడంటే నాకు ఇష్టం, ఆ కృష్ణుడి మీద గౌరవంతో నేను నిన్ను పాండవ శిబిరముల వైపు పోకుండా ఆపాను. నీ మనసులో మాట తెలుసుకోవాలని నేను ఇన్ని ఆటంకాలు కల్పించాను. ఇంతెందుకు ఆ పాంచాలురకు పోగాలము దాపురించింది. ఈ రోజు వారు నీ చేతిలో చస్తారు, ఇదిగో ఈ ఖడ్గంతో వారిని సంహరించు " అని ఈశ్వరుడు ఒక మహనీయమైన ఖడ్గం అశ్వత్థామకు ఇచ్చి తాను కూడా అశ్వత్థామకు తెలియకుండా అతడిలో ప్రవేశించాడు. అశ్వత్థామలో నూతనోత్సాహం, ధైర్యం, తెగింపు ఉద్భవించాయి. తన రథం దగ్గరకు వెళ్ళగానే తాను అగ్నిలో వేసి దహించిన ఆయుధములు, అస్త్రములు, శస్త్రములు యదాతధంగా రధములో ఉన్నాయి. అశ్వత్థామ రథం మీదకు ఎక్కాడు. ఇంతలో కృపాచార్యుడు, కృతవర్మ వచ్చి చేరారు.


*రేపు *

*భారతంలో ఉండేది భూమిపై ఎక్కడైనా ఉంటుంది భారతంలో లేనిది భూమిపై ఎక్కడా లేదు*

*రోజూ భారతం చదవండి భగవద్ అనుగ్రహం పొందండి*

చరితం రఘునాథస్య

 చరితం రఘునాథస్య 

శతకోటి ప్రవిస్తరమ్ 

ఏకైకమక్షరం పుంసాం 

మహాపాతకనాశనమ్

అర్థం:

రాముని చరిత్ర వంద కోట్ల శ్లోకాలతో విస్తరించింది, దాని ప్రతి అక్షరం కూడా మానవుల గొప్ప పాపాలను నాశనం చేస్తుంది.

(శతకోటి శ్లోకాల బృహద్గ్రంధాన్ని 24000 శ్లోకాలతో, శ్రీ వాల్మీకి మహర్షి సంక్షిప్తం చేసారని పండితులు చెపుతుంటారు)


శ్రీ వాల్మీకి రామాయణంలోని ప్రతి అక్షరం పాపనాశనం చేయగల శక్తి గలవి. అంటే ప్రతి అక్షరం కూడా ఉపాసనా యోగ్యమైన బీజాక్షరాలే.


'శ్రీ వాల్మీకి రామాయణం', నిత్యం పారాయణ చేయడం, సాధారణంగా చాలామందికి సాధ్యం కాకపోవచ్చు.


అందుకే రోజుకొకటి చొప్పున (అందునా ముఖ్యమైనవి, మన జీవితంలో ఉపయోగపడే నీతి బోధ ఉన్నవాటిని) ప్రతి ఉదయం పోస్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాను. 'ఒక్క శ్లోకం చదివినా', ఆరోజు రామాయణ పారాయణ చేసిన ఫలితం కలుగుతుందని పెద్దలు చెబుతారు.

కావున ఈ నా పోస్ట్ ల లోని శ్లోకాలు ప్రతిరోజూ తప్పకుండా చదివి శ్రీ సీతారాముల దివ్య అనుగ్రహం పొందగలరు.

ఇంతవరకు సుమారు వందకు పైగా శ్లోకాలు *'నేటి సుభాషితం'* పేరుతో పోస్ట్ చేయడం జరిగింది. 

ప్రస్తుతం సుందరకాండలో ఉన్నాము.


జై శ్రీ రామ్