1, ఆగస్టు 2023, మంగళవారం

తల నీలాలు

 🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸


🙏🌹ఈరోజు విషయం తల నీలాలు స్త్రీలు ఇవ్వవచ్చా ....!!🙏🌹


🌿. *స్త్రీలు తల నీలాలు సమర్పించవచ్చాలేదా*


🌸నేను కొందరు పెద్దల ద్వారా తెలుసుకున్న విషయం స్త్రీలు తల నీలాలు ఇవ్వవచ్చా- ఇవ్వకూడదా అన్నవిషయాలు మీతో పంచుకోవాలి అనుకుంటున్న..🙏


🌿అసలు తల నీలాలు పూర్వం స్త్రీలు మరియు పురుషులు ఎక్కడ ఇచ్చిన దాఖలాలు లేవు అంటే ఎవరు తల నీలాలు ఎక్కడ ఇవ్వలేదు 


🌸పూర్వం పురుషులు కూడా వెంట్రుకలు పెంచుకొని తల పాగాలో చుట్టి  ఉంచుకునే వాళ్ళ తల నీలాలు ఎక్కడ ఎవరు ఇవ్వలేదు


🌿తల నీలాలు ఇవ్వడం ఎక్కడ ప్రారంభం అయ్యింది అన్న విషయం చూస్తే..


🌸తండ్రి చనిపోతే పురుషులు తన తండ్రి కర్మ కార్యాల కోసం పురుషులు తల నీలాలు ఇవ్వడం మొదలు ఆయ్యింది...


🌿ఇంకా స్త్రీలు తల నీలాలు తీసారా అన్న విషయం చూస్తే..


🌸 *ఎక్కడ కూడా స్త్రీలు తల నీలాలు తీయకూడదు అని ఒక సాంప్రదాయం ఉంది..*


🌿అదికాక స్త్రీలు ఎప్పుడు కూడా తలలో కత్తెర అనేదే పెట్టకూడదు అది శాస్త్రం చెప్పిన మాట


🌸కానీ ఈ రోజుల్లో కొనలు.. కడా..జుట్టు సమానంగా అని జుట్టు కత్తిరిస్తున్నారు మనం చూస్తున్నాం.. 


🌿మరికొందరు బేబి కటింగ్ కోసం స్వామి మొక్కు అని చెప్పి  భుజాలు వరకు కత్తిరించు కుంటున్నారు స్వామి మొక్కు 3 గుప్పెడులు యిస్తా అని మొక్కుకున్న అని చెప్పడం ఆది చాలా తప్పు..


🌸పూర్వం బాల్య వివాహాలు చేసే టైం లో భర్త చనిపోతే ఆ స్త్రీని శిరోజాలు తీయించి గుండు కొట్టి ఇంట్లో ఉంచేవాళ్ళు అది అప్పటి సాంప్రదాయం ఆ పద్దతులు కాలాను గుణంగా మాసిపోయాయి..  అది మంచికే అనుకోవాలి ఆ విషయం లో..


🌿ఇంకా అసలు విషయం లోకి వస్తే.. స్త్రీలు తల నీలాలు ఇవ్వవచ్చా... లేదా..


🌸మనకు నడుస్తున్న కాలం కలికాలం..

ఈ కలికాలంలో మనుషులను పాపాల నుండి కలి పురుషుడు బారినుండి రక్షించేందుకు స్వామి శ్రీ వెంకటేశ్వర స్వామిగా అవతారం దాల్చారు..


🌿దశావతారంలో లేని అవతారం శ్రీ వేంకటేశ్వర స్వామి అవతారం.. 


🌸మీకు స్వామి వైకుంఠం నుండి వచ్చిన విషయం మరియు స్వామి పుట్టలో ఉంటే ఆవు పుట్టలో పాలు వదులుతున్న అప్పుడు 

జరిగిన విషయాలు తెలుసు.. 


🌿స్వామి తల దెబ్బ తగిలి వకుళ మాత దగ్గరకు వెళ్లిన విషయాలు మరియు స్వామి నీలాద్రి కొండకు వచ్చిన విషయాలు తెలుసు అందరికి తెలుసు కాబట్టి ఈ విషయాలు చెప్పడం లేదు లేకుంటే అవన్నీ చెప్పుకుంటా పోతే చాలా పెద్ద వ్యాసం అవుతుంది అందుకే జెస్ట్ హింట్స్ ఇచ్చాను..


🌸ఇంకా స్వామి నీలాద్రి కొండకు రాగానే అక్కడి వాతావరణం ,,చల్లటి  గాలులకి ప్రశాంత వాతావరణానికి స్వామికి నిద్ర వచ్చి ఆలా పవలిస్తారు..


🌿అక్కడ వుండే నీలాద్రి యక్షుని స్వామిని గమనించి స్వామి తలకు తగిలిన గాయం కనిపిస్తుంది అక్కడ స్వామికి వెంట్రుకలు ఊడి ఉండడం గమనించిన నీలాద్రి 


🌸తన వెంట్రుకలు కొన్ని పికిలించి స్వామికి ఆ గాయం వద్ద సమర్పిస్తుంది నీలాద్రి  ఆ క్షణం లో రెండు రక్తపు చుక్కలు స్వామి మీద పడగానే స్వామి లేచి ఎవరమ్మ మీరు 


🌿మీకు ఏమిటి తలకు అ గాయం ఏమైనది అని అడుగగా అప్పుడు నీలాద్రి స్వామి మీ తలకు గాయం ఉండి వెంట్రుకలు  పోయి ఉన్నాయి నా స్వామికి లేని వెంట్రుకలు నాకు అవసరమా అని నా తల నీలాలు మీకు సమర్పించను స్వామి అని పలుకుతుంది...


🌸స్వామి అలా మీరు చేసిన పని మా అమ్మ అంగీకరించరు నాకు మీ శిరోజాలు వద్దు మీరే స్వీకరించండి అని స్వామి అంటారు..


🌿అప్పుడు నీలాద్రి అంటున్నది స్వామి నేను శిరోజాలు తీసుకుంటాను అవి ఇలాగా కాదు తమ భక్తులు మిమల్ని దర్శించి మీకు తల నీలాలు సమర్పిస్తారు అప్పుడు అవి మీ ద్వారా నాకు సంక్రమిస్తాయి అలా ప్రసాదించండి అని వేడుకుంటుంది నీలాద్రి..


🌸స్వామి సంతోషించి అటులనే ఈ కలియుగం పూర్తి అయ్యేవరకు నా భక్తులు నాకు సమర్పించే మొక్కులు వారి వెంట్రుకలు నీకు చెందుతాయి కలియుగం వరకు నా నుండి నీకు సంక్రమిస్తాయి అని స్వామి వరం ప్రసాదిస్తాడు నీలాద్రి కి...

అలా మొదలు అయ్యింది తల నీలాలు కార్యక్రమము మన అందరికి..


🌿అప్పటి నుండి పురుషులు ,పెద్దలు  చిన్నలు  అందరూ తల నీలాలు యిస్తున్నారు సంప్రదాయం మారింది అది అన్ని క్షేత్రాలకు పాకింది తల నీలాలు ఇవ్వడం..


🌸ఇంకా స్త్రీల విషయం చూసుకుంటే స్త్రీలు తల నీలాలు ఇవ్వకూడదు అని శాస్త్రం చెబుతోంది.. మరి తిరుపతిలో స్త్రీలు కత్తెర్లు యిస్తున్నారు  గుండు కొట్టించుకుంటున్నారు గా అంటారు..


🌿శ్రీవారు చెప్పిన మాట.. నీలాద్రి కి ఇచ్చిన వరం కలియుగం పూర్తి అయ్యేవరకు నా భక్తులు నాకు సమర్పించే వెంట్రుకలు నా నుండి నీకు సంక్రమిస్తాయి అన్న మాట..


🌸నా భక్తులకు ఈ కలికాలంలో వాళ్ళ బాధలు ,పాపాలు. ,కర్మలు అన్ని వాళ్ళ వెంట్రుకలు పట్టుకొని ఉంటాయి అవి వాళ్ళు మొక్కులు ద్వారా నాకు సమర్పిస్తారు అలా కలికాలం వరకు ఈ మొక్కులు కొనసాగుతూనే ఉంటుంది సాంప్రదాయంగా అంటారు


🌿కాబట్టి స్త్రీలు తమ తల నీలాలు 3 కత్తెర్లు గా స్వామి వారికి నీలాద్రి కాంప్లెక్స్ వద్ద ఇవ్వండి పూర్తిగా శిరోజాలు కాదు..


🌸మహిళ భక్తులు వాళ్ళ బాధలు ,,పిల్లలు ,,అనా రోగ్యాలు, ఇంకా మీ కష్టాలు.. మరియు మీరు కోరిన కోర్కెలు తీరింది అని అలా మొక్కు కుంటే మొక్కులు


🌿స్వామి మా బాధలు తీరాలి అని మేము మొక్కు కున్న మొక్కు తల నీలాలు ఇస్తాము అని కోరిన కోర్కెలు తీరాయి అని కొందరు


🌸అలా స్త్రీలు స్వామికి మేము ఏది చేసినా పాప భారం మీరే మోయలి స్వామి అని తలుచుకొని స్వామికి తల నీలాలు సమర్పించ వచ్చు అందుకు ఏ భయము వద్దు 


🌿ఏ శాస్త్రం తప్పు పెట్టడానికి లేదు అది ఒక తిరుమల లోనే ఈ పక్రియ స్వామి ఇచ్చిన వరం మనకు


🌸ఇంకా ఎక్కడైన  స్త్రీలు తల నీలాలు ఏ క్షేత్రంలో కూడా సమర్పించ రాదు


🌿ఒక కలియుగ వేంకటేశ్వర స్వామికే అది కూడా తిరుపతి లోనే వెంకట చలం లో నీలాద్రి వద్ద 


🌸స్త్రీలు మొక్కులు మొక్కు కుంటేనే మాత్రమే.. ఇవ్వాలి తల నీలాలు లేదా 3 కత్తెర్లు మాత్రమే ఇవ్వాలి 


🌿ఇంకా ఎక్కడా ఏ క్షేత్రంలోను స్త్రీలు తల నీలాలు ఎక్కడ ఇవ్వకూడదు 


🌸మళ్ళీ కత్తెర్లు ఇవోచ్చు అది ఏ క్షేత్రాలలో నైనా ఎక్కడైన  స్త్రీలు ఇవ్వవచ్చు

తల నీలాలు తప్ప


🌸నేను తెలుసుకున్న విషయాలు పెద్దలు ద్వారా తెలుసుకొని సేకరించి చెప్పిన మాటలు నా సొంత మాటలు కావు దయచేసి గమనించ గలరు..🚩🌞🙏🌹🎻


🌿Note : మళ్ళీ ఈ విషయాన్ని రచ్చ చేయొద్దు మీకు  నచ్చక పోతే మీకు తెలిసిన సాంప్రదాయం మీరు పాటించవచ్చు..🙏


🌹🙏ఓం నమో వెంకటేశాయ..🙏🌹


🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿

వాకిటి కాపరి తిమ్మడికి రాయలిచ్చిన పచ్చడాన్ని కాజేయటానికి

 (వాకిటి కాపరి తిమ్మడికి రాయలిచ్చిన పచ్చడాన్ని కాజేయటానికి



ముగ్గురు ఇతర దిగ్గజాలతో పధకం వేసి చివరి పాదంతో


పచ్చడం కొట్టేసాడు రామకృష్ణ కవి )



వాకిటి కావలి తిమ్మా !


ప్రాకటముగ సుకవి వరుల పాలిటి కొమ్మా !


నీకిదె పద్యము కొమ్మా !


నాకీ పచ్చడమె చాలు నయముగ నిమ్మా !!


(ధూర్జటి ని స్తుతిస్తూ రాయలు :


స్తుతమతి యైన యాంధ్ర కవి ధూర్జటి పల్కుల కేల కల్గెనీ


యతులిత మాధురీ మహిమ ?


(దానికి రామకృష్ణుని కూమత్కార సమాధానం)


హా తెలిసెన్‌ భువనైక మోహనో


ద్దత సుకుమార వార వనితా జనతా ఘన తాప హారి సం


తత మధురాధరోదత సుధా రస ధారల గ్రోలుటంజుమీ 


చీపర బాపర తీగల


చేపల బుట్టల్లినట్లు చెప్పెడి నీ యీ


కాపు కవిత్వపు కూతలు


బాపన కవి వరుని చెవికి ప్రమదంబిడునే !! 

శర సంధాన బల క్షమాది వివిధైశ్వర్యంబులన్‌ గల్గి దు


ర్భర షండత్వ బిల ప్రవేశ కలన బ్రహ్మఘ్నతల్‌ మానినన్‌


నర-సింహ-క్షితి మండలేశ్వరుల నెన్నన్‌ వచ్చు నీ సాటిగా


నరసింహక్షితి మండలేశ్వరుని కృష్ణా ! రాజ కంఠీరవా !

( అర్జునుడు, సింహము, క్షితి - ఈ మూడింటిలోని లోపాలు గణించక పోతేనే


వీటిని నీతో పోల్చ వచ్చు అని భావం. ఐతే ఒక పాదం లో సింహం తో


పోల్చ రాదంటూనే పద్యం చివర ‘రాజ సింహమా’ అని పిలవడం ఏం సబబు ?


అని తప్పు చూపించి తెనాలి రామకృష్ణ కవి చెప్పిన పద్యం)

కలనన్‌ తావక ఖడ్గ ఖండిత రిపు క్ష్మా భర్త మార్తాండ మం


డల భేదంబొనరించి యేగునెడ తన్మధ్యంబునన్‌ తార కుం


డల కేయూర కిరీట భూషితుని శ్రీ నారాయుణుం గాంచి లో


గలగంబారుతునేగె నీవయనుశంకన్‌ కృష్ణరాయాధిపా !!


ఇంకో పద్యం)


నరసింహ కృష్ణ రాయని


కరమరుదగు కీర్తి యొప్పె కరిభిత్‌ గిరిభిత్‌


కరి కరిభిత్‌ గిరి గిరిభిత్‌


కరిభిత్‌ గిరిభి త్తురంగ కమనీయంబై !

(‘కుంజర యూధంబు..’ అనే సమస్యా పూరణ నిచ్చినందుకు కోపం తో)


గంజాయి తాగి తురకల


సంజాతుల గూడి కల్లు చవి గొన్నావా


లంజల కొడకా ఎక్కడ


కుంజర యూధంబు దోమ కుత్తుక సొచ్చెన్‌ !!

(అదే సమస్యను రాయల వారు అడిగినప్పుడు)




రంజన చెడి పాండవులరి


భంజనులై విరటు గొల్వ పాల్పడి రకటా


సంజయ విధి నే మందును


కుంజర యూధంబు దోమ కుత్తుక సొచ్చెన్‌ !!


(‘గొల్వు పాలై రకటా’ అని పాఠాంతరం)

(నంది తిమ్మన ను పొగడుతూ)




మా కొలది జానపదులకు


నీ కవనపు ఠీవి యబ్బునే ! కూపనట


ద్భేకములకు గగనధునీ


శీకరముల చెమ్మ నంది సింగయ తిమ్మా !

(మూడో పాదంలో ‘గగన ధునీ’ అనే ప్రయోగాన్ని ‘నాక ధునీ’ అని మార్చి ‘రాజ కవి’


(కృష్ణ రాయలు) ‘కవి రాజు’ (రామకృష్ణుడు) ప్రశంసను పొందాడని ప్రతీతి)


(వాకిటి కాపరి తిమ్మడికి రాయలిచ్చిన పచ్చడాన్ని కాజేయటానికి


ముగ్గురు ఇతర దిగ్గజాలతో పధకం వేసి చివరి పాదంతో


పచ్చడం కొట్టేసాడు రామకృష్ణ కవి )




వాకిటి కావలి తిమ్మా !


ప్రాకటముగ సుకవి వరుల పాలిటి కొమ్మా !


నీకిదె పద్యము కొమ్మా !


నాకీ పచ్చడమె చాలు నయముగ నిమ్మా !!

(ధూర్జటి ని స్తుతిస్తూ రాయలు :




స్తుతమతి యైన యాంధ్ర కవి ధూర్జటి పల్కుల కేల కల్గెనీ


యతులిత మాధురీ మహిమ ?




(దానికి రామకృష్ణుని కూమత్కార సమాధానం)


హా తెలిసెన్‌ భువనైక మోహనో


ద్దత సుకుమార వార వనితా జనతా ఘన తాప హారి సం


తత మధురాధరోదత సుధా రస ధారల గ్రోలుటంజుమీ 


ఈ పద్యాలు రామలింగని సమయ స్పూర్తిని, కవితా పటిమను చాటి చెపుతాయి.

Geeta


 

Vote


 

విషాన్ని కంఠంలోనే

 🔥⚜️🈸 #ఓం_నమః_శివాయః 🈸⚜️🔥



🔥 #పార్వతీ_దేవి శివుని యొక్క కంఠం పట్టుకొని విషాన్ని కంఠంలోనే ఆపిన దృశ్య  #శిల్పం.


 🔥 ఈ అపురూపమైన  శిల్పం కర్ణాటక లోని  #శ్రీ_కంఠేశ్వర ఆలయం  #నంజన్‌గూడ్ అనే ఊరిలోఉంది  కన్నడలో నంజు అంటే విషం అంటే నంజుండేశ్వర అనే పేరు "విషాన్ని తాగిన దేవుడు" (#హాలాహల), పాల మహాసముద్రం యొక్క  మధనం తర్వాత  #పరమేశ్వరుడు లోకాన్ని రక్షించటానికి తాగాడు. అప్పుడు మాత #పార్వతీ విషం స్వామి  ఉదరంలోకి వెళ్ళితే సమస్త లోకాలికీ ప్రమాదం అని (#శివుని_ఉదరం (పొట్ట)లోనే అన్ని లోకాలూ ఉంటాయి) #పార్వతీ_మాత తన శక్తితో #ఈశ్వరుని కంఠాన్ని  చేతులతో పట్టుకుని విషం లోపలికి  వెళ్ళకుండా ఆపింది ,విషం కంఠంలో ఉంది కనుక #నీలకంఠుడైయాడు.

       ఆలయంలో #శ్రీకంఠేశ్వరుడు లింగ రూపంలోనే ఉంటాడు. 

 🔥 నంజన్‌గూడ్ భారతదేశంలోని #కర్ణాటకలోని #మైసూర్‌కు సమీపంలో ఉన్న ఒక ముఖ్యమైన ఆలయ పట్టణం. #కబినీ_నది ఒడ్డున ఉన్న దీనిని #దక్షిణ_కాశీ అని కూడా అంటారు. ఇది కర్నాటకలోని మైసూర్‌కి చాలా దగ్గరలో ఉన్న చాలా పురాతనమైన #పుణ్యక్షేత్రం. మైసూర్ చుట్టుపక్కల ఆలయాన్ని మరియు సమీపంలోని ప్రదేశాలను సందర్శించడానికి ప్లాన్ చేసుకోవచ్చు.


           🔥⚜️🈸 #ఓం_నమః_శివాయః 🈸⚜️🔥

Education


 

సాంఖ్య దర్శనము

 *సాంఖ్య దర్శనము*


పురుషుడు", "ప్రకృతి" అనేవి రెండు విభిన్నమైన అంశాలు అనేది సాంఖ్యంలో ఒక మౌలికమైన సూత్రం. సృష్టిలో అన్నీ ఈ రెండింటిలో ఏదో ఒకదానికి చెందుతాయి.


*పురుషుడు*

అంతటా వ్యాపించి ఉన్న స్వతంత్ర, నిరాకార ఆత్మ తత్వం. అంతటా ఉంది. ఇంద్రియాలకు తెలియరానిది. మాటలలో చెప్పజాలనిది. (వేదాంతములో "బ్రహ్మము" కూడా ఇలాగే వర్ణించబడింది.) పురుషునకు ఏవిధమై మాలిన్యాలు అంటవు. పురుషుడు శాశ్వతము. పురుషుని ఎవరూ సృజించలేదు. పురుషుడు దేనినీ సృజింపడు.


*ప్రకృతి*

సృష్టి కారణమైన, శాశ్వతమైన అంశము. ప్రకృతి కూడా అనాదిగా ఉంది. ప్రకృతిని ఎవరూ సృజింపలేదు. కాని ప్రకృతికి సృజించే లక్షణం ఉంది. అన్ని పరిణామాలూ, అశాశ్వతమై పదార్ధాలూ కూడా ప్రకృతి వల్లనే సంభవిస్తున్నాయి. అన్ని జీవులూ యదార్ధంగా పురుషుని బాహ్య స్వరూపాలు. కాని ప్రకృతి వలన ఉద్భవించిన భౌతిక దేహాలు పురుషుని బంధిస్తాయి. పురుషునకు తన గురించి సరైన జ్ఞానం లేనందువలన, తాను శరీరం మాత్రమే అని భ్రమించడం వలన, "సంసార బంధం" ఏర్పడుతుంది. ఆత్మజ్ఞానం కలిగినపుడు ఆ బంధం నుండి విముక్తి లభిస్తుంది.


*ఈశ్వరుడు*

కపిలముని ప్రతిపాదించిన సాంఖ్యంలో ఈశ్వరునికి స్థానం లేదు. కారణం - ఈశ్వరుని ఉనికిని ఋజువు చేయడం సాధ్యం కాదు గనుకా, పరిణామము లేని ఈశ్వరుడు పరిణామాత్మకమైన సృష్టికి కారణమని చెప్పడం అసంబద్ధం గనుకా.


తరువాతి కాలంలో సాంఖ్యవాదులు తమ తమ యోగసిద్ధాంతాలలో "ఈశ్వరుడు" అనే తత్వాన్ని సాంఖ్యవాదంలో ప్రవేశపెట్టారు.


*వైవిధ్యం*


సాంఖ్యవాదం ప్రకారం సృష్టికి పురుషుడు, ప్రకృతి - రెండూ కారణాలే. పురుషుడు "ఆత్మ"కు, చైతన్యానికి మూలము. ప్రకృతి "పదార్ధము"నకు, పరిణామమునకు మూలములు.


*సృష్టి సిద్ధాంతం*


సాంఖ్యం "సత్కార్యవాదం"ను సమర్ధిస్తుంది. దీని ప్రకారం ఏదైనా పనిలో కారణము, ఫలితము కలిసి ఉంటాయి. ఉన్నదేదీ నశించదు. లేనిదేదీ ఉత్పన్నం కాదు. అంతా పరిణామమే. అందుకు కారణంలో ఫలితం అంతర్లీనంగా ఉంటుంది. వీరి "ప్రకృతి పరిణామ వాదం" ప్రకారం మూల ప్రకృతి అన్నిటికీ కారణం. అదే క్రమంగా విభజితమై వివిధ పదార్ధాలుగా పరిణామం చెందుతుంది. చివరిలో అన్నీ మళ్ళీ అవిభాజిత మూల ప్రకృతిలో లీనమౌతాయి. ఇలా చక్రగతిలో విభజన, విలీనం సంభవిస్తాయి.


వైవిధ్యం, ఘర్షణ అనేవి ప్రకృతిలో అంతర్లీనంగా ఉన్న లక్షణాలు. వీటివల్లనే ప్రకృతి 24 వేర్వేరు గుణాలు (తత్వాలు) గా విభజితమౌతుంది. ఆ గుణాలమధ్య ఉన్న మధనక్రియ పరిణామానికి మూలకారణం. ఇందుకు మూడు ముఖ్యమైన తత్వాలు.


సత్వము - సమతుల్యతను పెంపొందించే గుణము.

రజస్సు - వృద్ధిని, ప్రయత్నాన్ని పెంపొందిస్తుంది.

తమస్సు - అలసత్వాన్ని పెంచుతుంది. ప్రయత్నాన్ని నిరోధిస్తుంది.

సృష్టిలో అన్ని జీవులలో ఈ గుణాల వలన ఉత్పన్నమయ్యే లక్షణాలు:


ప్రకృతి

మహత్

అహంకారం

మనస్సు

పంచ జ్ఞానేంద్రియాలు

పంచ కర్మేంద్రియాలు

పంచ తన్మాత్రలు

పంచ మహాభూతాలు


ఈ గుణాల మధ్య తులనాన్ని బట్టి జీవుల, పదార్ధాల లక్షణాలు మారుతాయి. పరిణామం జరుగుతుంది. సాంఖ్య సిద్ధాంతాలు పతంజలి యోగసూత్రాలలోను, మహాభారతంలోను, యోగవాసిష్టం లోను విస్తృతంగా ప్రస్తావించబడ్డాయి.


అన్ని జీవులలోను ఆత్మ పురుషుని స్వరూపము. మనసు, బుద్ధి, అహంకారము ప్రకృతి లక్షణాలు.


*మోక్షము*


అజ్ఞానమే బంధాలకు, కష్టాలకు కారణం - అని మిగిలిన చాలా సిద్ధాంతాలలాగానే సాంఖ్యం కూడా చెబుతుంది. "పురుషుడు" (అనగా జీవాత్మ) శాశ్వతమైన, నిర్మలమైన చైతన్యము. ప్రకృతి వల్ల కలిగే సత్వరజస్తమోగుణాలు, మనసు, అహంకారము, మహాత్‌లు ఈ జీవుని శరీరంలో బంధించివేస్తున్నాయి. జ్ఞానం వల్లం ఈ బంధం నుండి విముక్తులు కావచ్చును. అందువలన మోక్షం లభిస్తుంది.


ఇక్కడ సాంఖ్యానికి, వేదాంతానికి మధ్య విభేదాలను గమనించవలసి ఉంది. అద్వైత వేదాంతం ప్రకారం బ్రహ్మమే అన్నిటికీ కారణం. వేరే పదార్థం లేదు. కాని సాంఖ్యం ప్రకారం ప్రకృతి, పురుషుడు అనేవి రెండూ అనాదిగా వేర్వేరు. శాశ్వతమైన దానినుండి అశాశ్వతమైనది జనిస్తుందనే వాదాన్ని సాంఖ్యం అంగీకరించదు.

*ఓం... శబ్దంతో

 *ఓం….!*

                  ➖➖➖✍️   


*'ఓం'...  తో   అలసట  మాయం...!శాస్త్రీయంగా  నిరూపించిన  బాలిక..!!*


*ఓం... శబ్దంతో.... *

*శరీరంలో అలసట దూరమవుతుందని పద్నాలు గేళ్ల బాలిక ప్రయోగాత్మకంగా నిరూపించింది.*


*పశ్చిమ్ బెంగాల్ ప్రభుత్వం నిర్వహించిన సైన్ కాంగ్రెస్‌లో తన ప్రదర్శనతో ఆ బాలిక శాస్త్రవేత్త లను అకట్టుకుంది.*


*కోల్‌కతాలోని అడమ్స్ వరల్డ్ స్కూల్‌లో తొమ్మిదో తరగతి చదువుతున్న అన్వేష రాయ్ ఓంకారంపై పరిశోధన చేసింది.*


*ఓం శబ్దాన్ని వినడం వల్ల రక్తంలో ఆక్సిజన్ శాతం పెరిగి, కార్బన్‌డైయాక్సైడ్, లాక్టిక్ యాసిడ్ నిల్వలు తగ్గతాయని, తద్వారా అలసట ఉండదని అన్వేష తన ప్రయోగం ద్వారా కలకత్తా, జాదవ్‌పూర్ యూనివర్సిటీలకు చెందిన ఫిజిక్స్, ఫిజియాలజీ ప్రొఫెసర్ల సమక్షంలో నిరూపించింది.*


*అన్వేష ప్రాజెక్ట్ విన్నూత్నంగా ఉందని, అంతే కాకుండా ఆమోదయోగ్యంగా కూడా ఉందని కలకత్తా యూనివర్సిటీకి చెందిన ఫిజియాలజీ విభాగం హెడ్ ఫ్రొఫెసర్ దేవశీష్ బందోపాధ్యాయ అన్నారు.*


*అన్వేష అనే పేరులోనే అన్వేషణ ఉందని, బెంగాలీలో అన్వేషణ్ అంటె వెదకడమని ఆ బాలిక తెలిపింది.*


*ఓంకారం నుంచి వెలువడే ప్రత్యేక పౌనఃపున్యం(Frequency)కలిగి శబ్దాలు శరీరంలోని న్యూరోట్రాన్స్‌మిటర్స్‌తోపాటు హార్మోన్ల (సెరోటినిన్, డోపమైన్) స్థాయిని పెంచుతాయి...*


*ఈ ప్రక్రియకు రక్తంలో ఆక్సిజన్ స్థాయిలు పెరగడమే కారణమని అన్వేష రాయ్ తెలియ జేసింది.*


*అలాగే తక్కువ పరిమాణంలో లాక్టిక్ యాసిడ్ విడుదల అవుతుందని దీంతో అలసట అనేది ఉండదని అన్వేష తెలిపింది.*


*గత దశాబ్దంలో సంగీతం సాధన ద్వారా శరీరానికి వ్యాయామం చేకూరి, మానసిక ప్రశాతంత కలుగుతుందని పరిశోధకులు నిరూపించినట్లు పశ్చిమ్ బెంగాల్ స్టేట్ సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగం సెక్రెటరీ రిన వెంకట్రామన్ అన్నారు.*

*కానీ ఓంకారం శరీరంపై నిర్దిష్ట ప్రభావం చూపుతుందని అన్వేష నిరూపించిందని ఆయన తెలిపారు.*


*ఇప్పటివరకు ఎవరూ ఓం శబ్దంపై ప్రత్యేక పరిశోధనలు చేపట్టలేదని స్టేట్ సైన్స్ అండ్ టెక్నాలజీకి చెందిన సీనియర్ శాస్త్రవేత్త దీపాంకర్ దాస్ తెలిపారు.*


*ఇటీవల రాష్ట్రస్థాయి సైన్స్ కాంగ్రెస్ నిర్వహించిన వర్క్‌షాప్‌నకు 165 విద్యార్థులను ఎంపిక చేశామని ఆయన అన్నారు.*

*వర్క్‌షాప్‌లో భాగంగా అన్వేష ఉత్తరాఖండ్‌లో పర్యటించి నపుడు బగేశ్వర్ నుంచి 68 కిలోమీటర్లు దూరాన ఉన్న కేదారీనాథ్‌కు కాలినడకన రోజూ నీటిని తీసుకెళ్తున్న కొంతమంది పూజరుల్లో ఎలాంటి అలసట కనపడకపోవడంతో ఆశ్చర్యపడింది.*


*అలాగే వాళ్లు దోవపొడువునా ఓంకారాన్ని జపిస్తూ ముందుకు సాగడం గుర్తించింది.*


*దీంతో ఓంకారంపై తన ప్రయోగాన్ని నిర్వహించాలని భావించింది.*


*దీనిపై పరిశోధనకు అక్కడే శ్రీకారం చుట్టింది.*

*ఓం శబ్దం ద్వారా శరీరంలో 430 హెర్జ్‌ల పౌనఃపున్యాలను వెలువడుతున్నట్లు గుర్తించి వివిధ ల్యాబొరేటరీల్లో ఐదు ప్రయోగాలను నిర్వహించింది.*


*17 మంది యువతీ, యువకులకు  ఓం కారాన్ని 30 నిమిషాల పాటు వినిపించి వారి శరీరంలోని ఆక్సిజన్, కార్బన్‌ డయాక్సైడ్ శాతాలను లెక్కించింది.*


*ఓం శబ్దంతో వారి శరీరంలో ఆక్సిజన్ పరిమాణం పెరిగి, కార్బన్ డయాక్సడ్ శాతం తగ్గినట్లు అన్వేష తెలిపింది...*


*ప్రతి రోజు  ఉదయం ,  సాయంత్రం  కనీసం  11 సార్లు  దీర్ఘ  ఓంకారం  చేయండి.*


*మీ  బంధు మిత్రులతో  చేయించండి ...*✍️

*ఓం ,  ఓం , ఓం…*

.          *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

                       🌷🙏🌷


 🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏


🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

Photo






 


 

Value of vote


 

Adi shankaraacharya


 

అది నాకు తెలుసు

 నానక్ ముందు సిక్కు లేరు!


యేసు ముందు క్రైస్తవుడు లేడు!


మహమ్మద్‌కు ముందు ముస్లిం లేడు!


రిషభదేవునికి ముందు జైనుడు లేడు!


బుద్ధుడికి ముందు బౌద్ధుడు లేడు!


కార్ల్ మార్క్స్ ముందు వామపక్షవాది లేడు!


కానీ :--

కృష్ణుడి కంటే ముందు రాముడు...


రాముని ముందు జమదగ్ని...


జమదగ్ని ముందు అత్రి..


అత్రికి ముందు అగస్త్యుడు...


అగస్త్యుడికి ముందు పతంజలి...


పతంజలి ముందు కనద్....


కనడ ముందు యాజ్ఞవల్క్యుడు....


యాజ్ఞవలక్యుడు ముందు...


"సనాతన వేద"లన్నీ ధర్మబద్ధమైనవే..!


 *"రాజకీయ చదరంగం"లో ఈ -"12 ఎత్తుగడలు", జాగ్రత్తగా -"చూడండి మరియు అర్థం చేసుకోండి"....?*


01. "మొఘలులు" "భారతీయులు" అయ్యారు...?

మరి, "భారతీయుడు.," "కాఫిర్".. ..?


02. "గియాసుద్దీన్ ఖాన్" :-

మోతీలాల్, జవహర్‌లాల్ "నెహ్రూ"

-ఇందిర, రాజీవ్, -మినో, "గాంధీ" అయ్యారా..?

మరియు.., "భారతీయుడు", "మూర్ఖుడు"....?*


03. "మోమిన్" "కాశ్మీరీ" అయింది... ?

మరి, "కాశ్మీరీ పండితులు", "శరణార్థులు"....?


04. "బంగ్లాదేశీ" "బెంగాలీ" అయింది...?

మరి, "బెంగాలీ", "హిందూ వెలుపల".....?


05. "సైనికుల" "కిల్లర్స్" మరియు "స్టోన్ పెల్టర్స్"....,

"ఉద్యమం" అయింది.....? మరియు "సైన్యం",

"మానవ హక్కుల ఉల్లంఘన"....?*


06. "తుక్డే-తుక్డే గ్యాంగ్" "దేశభక్తుడు" అయింది...?

మరియు, "దేశభక్తులు",

"బ్రాండెడ్ హార్డ్ కోర్ తీవ్రవాది......?*


07. "పైర్ కలప",

"పర్యావరణ ఆందోళన" మారింది...

మరియు, "ఖననం"లో, "భూమిని వృధా చేయాలి",

"జన్మహక్కు" అయింది...?


08. "రాఖీ"లో ఉపయోగించబడింది

- "ఉన్ని" నుండి, "గొర్రెలు" "బాధ" పొందిందా..?,

మరియు,

"బక్రీద్"లో - "వేలాది మేకల వధ",

"మత స్వాతంత్ర్యం" అయింది...?


09.

"బుజ్జగింపు" "సెక్యులర్" అయింది.....?

అయితే, "సారూప్యత" "కమ్యూనల్" అయింది....?


10.

"ఆర్‌ఎస్‌ఎస్" "ఉగ్రవాదిగా" మారింది...?

మరియు, "ఒసామా జీ"..., "హఫీజ్ సాహెబ్"..., మరియు -"హురియత్",

"శాంతి శిఖరం"......


11. "భారతమాత చిరకాలం జీవించు", "కమ్యూనల్" అయింది...? మరియు,

"భారత్ తేరే తుక్డే హోంగే"

"వ్యక్తీకరణ స్వేచ్ఛ? పోయింది!


12. “విభజించు మరియు పాలించు” అనేది “నియమం”….?మరియు..,

“సబ్కా సాథ్ సబ్కా వికాస్” “జుమ్లా”..?


కొంచెం ఆలోచించు"...? మరియు "అర్థం చేసుకోండి"... అది :-

"అన్నింటికీ" ఒకటి - "హిందూ మెజారిటీ దేశంలో" ....,

"ఇదంతా" ఎలా జరిగింది????


మీరు ఇప్పుడే చదువుతారా?

లేక మీరు కూడా ఫార్వర్డ్ చేస్తారా?

కాదు కాదు,,???


అది నాకు తెలుసు


"హిందూ" ఎవరు "ఉండండి", "మనం"...?!!!


ఇలా నిద్రపోతున్నావా? కాబట్టి -

అది కూడా తెలియదా..?,

"ఎప్పుడు"...

"ముస్లిం దేశం"కి "పౌరులు" అయ్యారు...?


"మజ్బూర్ హిందువు" అయినందున, నేను మిమ్మల్ని "అభ్యర్థిస్తున్నాను" - - కనీసం "10 మంది", లేదా - తప్పనిసరిగా "సమూహం"కి పంపబడాలి. జై శ్రీరామ్

సుఖం ఎరుగనివారు

 ప్రపంచంలో సుఖం ఎరుగనివారు

ఎవరైనా ఉన్నారా? అంటే

ఉన్నారంటున్నాయి శాస్త్రాలు

వారిని "దుఖఃభాగులు" అంటారు

వారి వివరాల్లో కెళితే వారు ఆరు రకాలు-


1. ఈర్ష్యాళువు - 

వీళ్లు ఎవరి వృద్ధిని లేక ఎదుగుదలను చూడలేరు

అలాంటివారిని ఈర్ష్యాళువు అంటారు.


2. జుగుప్సావంతుడు.

వీళ్లు దేన్ని చూచినా అసహ్యించుకుంటారు

వారివానికి సుఖం ఎక్కడుంటుంది.


3. నిస్సంతోషి -

వీడొక విచిత్రమైన వాడు వీడికి సంతోషమనేది ఉండదు

దాంతో వీనికి సుఖమెక్కడ


4. క్రోధనుడు-

వీడు ప్రతివిషయానికి చిటపటలాడుతూ ఎప్పుడూ 

కోపంతో ఉండే కోపిష్ఠి వీడికి సంతోషమెక్కడ


5. నిత్యశంకితుడు 

అన్నిచోట్లా, అందరినీ శంకించేవాడు వీడు

అంటే ప్రతిదీ అనుమానమే ఇంకేముంది

సుఖం.


6. పరభాగ్యోపజీవి.

ఎప్పుడూ ఇతరుల సొమ్ముపై ఆధారపడి బ్రతికేవాడు

వీడికి ఎప్పూ ఎవరోఒకరు ఇస్తూవుంటేనే లేదంటే 

దుఖఃమే ఇది సాధ్యమా కాదుకదా అందుకే వీనికీ

సుఖం సున్నా.


ఈ ఆరుగురురూ ఎప్పుడూ సుఖాన్నీ, 

ఆనందాన్ని, లేకుండా బాధతో అసంతృప్తితో

జీవిస్తుంటారు కాబట్టి వీరిని "దుఖఃభాగులు" అంటున్నాయి

ఏకైక ఆశ్రయం

 న జానామి పుణ్యం, న జానామి తీర్థం,

న జానామి ముక్తిం, లయం వా కదాచిత్,

న జానామి భక్తిం, వృతం వాపి మతం,

గతిస్త్వం, గతిస్త్వం, త్వమ్ ఏక భవానీ.


ధర్మంగా ఎలా ఉండాలో నాకు తెలియదు. పవిత్ర స్థలాలకు వెళ్ళే మార్గం నాకు తెలియదు. మోక్షానికి మార్గం నాకు తెలియదు. నా మనస్సును భగవంతునితో ఎలా విలీనం చేయాలో నాకు తెలియదు. నాకు భక్తి కళ తెలియదు. ఎలా ఆచరించాలో నాకు తెలియదు. తపస్సు, ఓ, అమ్మా! కాబట్టి నీవే నాకు ఆశ్రయం మరియు నా ఏకైక ఆశ్రయం నీవే అమ్మా...భవానీ🙏

దేవుడు ఒకడు

 నిత్యాన్వేషణ:


దేవుడు ఒకడు అని తన అద్వైత తత్వశాస్త్రం చెప్పినప్పటికీ ఆది శంకరాచార్యులు వివిధ దేవతల గురించి శ్లోకాలు ఎందుకు రాశారు?



నాకు వీలైనంత చెబుతాను.

ఆది శంకరాచార్యులు చెప్పింది ఇది.


"బ్రహ్మ సత్యం జగన్మిథ్యా, జీవో బ్రహ్మైవ నాపరః".


బ్రహ్మము అన్నదే సత్యం. జగత్తు ఒక మిథ్య. జీవుడికి బ్రహ్మానికి వ్యత్యాసం లేదు. రెండున్నూ ఒకటే.

ఆయన చెప్పింది ఇది. దేవుడు ఒకడని కాదు.

బ్రహ్మం అంటే ఏంటి ? - ఇదొక పెద్ద ప్రశ్న. ఉపనిషత్తులలో సమాధానం దొరుకుతుంది. ఉపనిషత్తులకు ఆది శంకరులు వ్యాఖ్యానం వ్రాశారు.

స్థూలంగా - అర్థమయ్యే భాషలో చెప్పాలంటే ప్రపంచంలో అన్నింటిని నడిపించే ఒక మూలకారణం.

ప్రతి మనిషి తన మెదడుకు లోబడి నడుచుకుంటాడు. అలా కాక మెదడు, ఆలోచనలు కేవలం పనిముట్లుగా ఉపయోగింపబడే స్థితికి ఎవరైనా చేరుకోగలరా? ఆ స్థితికి చేరుకోగలిగితే దుఃఖము, కోపము, ద్వేషము, అలజడి - ఇత్యాది మనోవికారాలు ఏవీ ఉండవు. ద్వైధీభావరహిత స్థితి.

ఆ స్థితిలోని వ్యక్తి సచ్చిదానంద స్వరూపుడు గా ఉంటాడు. అలాంటి స్థితి బ్రహ్మం. ఆ స్థితి పొందిన జీవుడికి, ఆతడి స్థితికి మధ్య ద్వైధీభావాలు ఉండవు.అదే "జీవో బ్రహ్మైవ న అపరః" అన్న మాటకు అర్థం.

ఆ స్థితియే సత్యం. మిగిలిన జగత్తు మిథ్య. జగత్తు మిథ్య - అంటే కనిపించే వ్యావహారిక ప్రపంచం కాదు. మానసిక ప్రపంచం. జగత్తు మిథ్య అంటే మనస్సులో ఉద్భవించే కామక్రోధలోభమోహాదులు, డబ్బు సంపాదన, పేరుకై వెంపర్లాటలు వగైరా వగైరా. ఇవన్నీ పరమ వ్యర్థం. ఆ స్థితికై యోగ అని, తంత్ర అని, భక్తి అని, ధ్యానం అని ఏవేవో పద్ధతుల ద్వారా సాధారణ మానవుడు ప్రయత్నిస్తూ, తనకు ఏది నప్పుతుందో తెలుసుకుంటూ, అంతర్ముఖుడవాలని మహనీయుల ఉవాచ.

ఇందాక చెప్పినట్టు బ్రహ్మం అనే తత్వానికి ఎంతో అందమైన అర్థాలు ఉన్నాయి. ఈశావాస్యోపనిషత్ లో ఈ శ్లోకం చూడండి.

*తదేజతి తన్నైజతి త్ద్దూరే తద్వంతికే౹*

*తదంతరస్య సర్వస్య తద్ సర్వస్యాస్య బాహ్యతః॥*


అన్నిటికి మూలకారణం అన్నది -

అది కదులుతుంది. అది కదలదు కూడాను. అది సమీపంలో ఉంది, కానీ చాలా దూరం. అది అంతటా వ్యాపించింది. అది మనలో ఉంది, మనకు బయటా ఉన్నది.


ప్రశ్నోపనిషత్ లో కూడా చక్కని వివరణను ఓ కథ ద్వారా చెప్పారు.

ఈ విషయాలు తనంతట తానుగా తెలుసుకోగలిగి ఆ మార్గంలో వెళ్ళేవాడు ఉత్తమాధికారి. గురువు ప్రోద్బలంలో నడిచే వాడు మధ్యమాధికారి. అర్చనలు, పూజలు కర్మకాండల ద్వారా మొదలు పెట్టి ఎదిగేవాడు అధమాధికారి. (ఇవి స్థాయీభేదాలు. అధమా అంటే నీచం అని ఉత్తమం అంటే ఉన్నతం అని కాదు.)

ఆ క్రమంలో భాగంగా దేవతారాధన, అన్ని జీవాలలో, అంతటా ఒక బలీయమైన శక్తిని, ఓ మూలకారణాన్ని చూడమని అధమాధికారి అయిన సాధారణ మానవుడికి ఉపదేశిస్తూ, అనేక దేవతలను ఉపాసించే క్రమాన ఆయా దేవతల స్తోత్రాలను శంకరులు రూపొందించారు. విజ్ఞుడు, విరాగి, లౌకిక వ్యవహారాలు పట్టించుకోని వాడు ఎలానూ పూజలు గట్రా చేసుకుంటూ ఉన్న స్థితి దాటి ఇంకేదో వెతుకుతూ పోతాడు.

**

ఇది నా అవగాహన. అయితే ఆదిశంకరుల స్తోత్రాల్లో అపూర్వమైన భావనాబలం, ఆర్తి, సౌందర్యభావనలు కనిపిస్తాయి. పూర్తిగా భక్తి గట్రా లేని (నా బోంట్లు) వారు కూడా ఆ స్తోత్రాలు కూడా ఆస్వాదించవచ్చు.

***

బతికుండగానే పిండం

 ఎవరికివారు బతికుండగానే పిండం పెట్టుకోవచ్చా 


దీనిపై శాస్త్రాభిప్రాయం ఏమిటో మీముందు ఉంచే ప్రయత్నమే ఈ వ్యాసం. ఏ పని చేయవచ్చు ఏ పని చేయకూడదు అనే విషయంలో శాస్త్రమే మనకు ప్రమాణమని శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీత లో తెలియచేస్తూ 



"తస్మాచ్ఛాస్త్రం ప్రమాణం తే కార్యాకార్యవ్యవస్థితౌ " అని (16అ-24శ్లో) పేర్కొనడం జరిగింది. దీనికి శంకర భగవత్పాదులు తమ గీతాభాష్యంలో "కర్మాధికారభూమి ప్రదర్శనార్థమ్" - అని ఆశ్లోకంలోని "ఇహ" అనే పదాన్ని వివరించారు. అనగా ఏయే కర్మలు చేయడానికి అధికారమున్నదో తెలుసుకోవడానికి శాస్త్రమే మనకు దిక్కు అని చెప్పకనే చెప్పడం జరిగింది. 



  ఇదే విషయంలో కాశీలో కొన్ని దశాబ్దాల క్రితం పండితులమధ్య ఆసక్తికర చర్చలు జరిగాయి. అనంతరం మహామహోపాధ్యాయ, ఆహితాగ్ని, కాశీహిందూవిశ్వవిద్యాలయం లోని ధర్మశాస్త్ర విభాగాధ్యక్షులు అయిన పం.ప్రభుదత్తజీ శాస్త్రి గారు "జీవచ్ఛ్రాద్ధ" పద్ధతి పేరుతో గ్రంథం కూడా రాయడం జరిగింది. అనంతరం జీవచ్ఛ్రాద్ధపద్ధతి అందరికీ ఆమోదయోగ్యమైనదేనని మహామహోపాధ్యాయ పం. శివకుమారమిశ్రా గారు, జ్యోతిర్వింద్వాంసులైన గణేశదత్త శాస్త్రి, ప్రియానాథ, గౌరీదత్త, కుబేర శర్మ గార్లు దీనికి ఉపాదేయత కల్పించడం జరిగింది. 



ఇవన్నీ సరే, పెట్టవచ్చా, కూడదా?


పెట్టవచ్చునంటే పెట్టుకున్నవారు ఎవరైనా ఉన్నారా? అని అడుగుతారేమో..  నిరభ్యంతరంగా జీవశ్రాద్ధము అందరూ చేసుకోవచ్చు.



ప్రయాగలోని " శ్రీ హరిరామగోపాలకృష్ణ సనాతనధర్మ సంస్కృత మహావిద్యాలయం" లోని రిటైర్డ్ ప్రిన్సిపాల్ పండిత శ్రీ రామకృష్ణ శాస్త్రి గారు, కాశీలో తమకుతామే శ్రాద్ధం పెట్టుకున్నారు. చేయించినవారు "శ్రీజోషణ్ రామ్ జీ పాండేయ్" గారు. జీవచ్ఛ్రాద్ధం పెట్టుకున్న రామకృష్ణ శాస్త్రి గారిని - ఆ విధానమంతా పుస్తకరూపంలో అందించమని గీతా ప్రెస్, గోరఖ్పూర్ వారు అడగడం, ఆయన రాసి ఇవ్వడం, దానిని గీతాప్రెస్ వారు అచ్చువేయడంకూడా జరిగింది.  



హేమాద్రి, వీరమిత్రోదయం లాంటి ధర్మశాస్త్ర గ్రంథాలు అయితే అలా పెట్టుకోమని ఆజ్ఞాపించాయి. 


జీవన్నేవాత్మనః శ్రాద్ధంకుర్యాత్ అన్యేషుసత్స్వపి


( హేమాద్రి - 1710పేజీ , వీరమిత్రో.శ్రాద్ధప్ర.363పేజీ) 


  


కొడుకులు ఉన్నవారు కూడా తమకు తాము శ్రాద్ధం పెట్టుకోవాలని దానర్థం.లింగ పురాణం, ఆది పురాణం, ఆదిత్య పురాణం, బౌధాయనగృహ్యశేషసూత్రాలు, కృత్యకల్పతరు ఇత్యాది గ్రంథాలు కూడా ఈ శ్రాద్ధమును తెలిపాయి. 



ఇక సందేహాలు-సమాధానాలు చూద్దాం........ 


1. అలా పెట్టుకున్నవారు లోకవ్యవహారాలకు పనికొస్తారా


సమాధానము : చక్కగా పనికి వస్తారు. పనికిరారనేది ఒక భ్రాంతి మాత్రమేనని పండితులు తెలియజేసారు. అదీగాక, లింగపురాణం అయితే, దంపతులు జీవచ్ఛ్రాద్ధం ఆచరించాక పిల్లలు కలిగితే, పిల్లవాడు బ్రహ్మవేత్త అవుతాడని, ఆడపిల్ల పుడితే సాక్షాత్తు పార్వతీదేవి వలె విలసిల్లుతుందని తెలియజేస్తోంది. వారికి జాతకర్మాది సంస్కారాలను ఆ తల్లిదండ్రులు అందరువలెనే ఆచరించవచ్చునని కూడా లింగ పురాణం తెలిపింది. 



2. తాను పెట్టుకుంటే భార్య విధవ అయినట్లేనా..


సమాధానం: ముందు భార్యకి చేసి, అనంతరం తాను చేసుకున్నట్లయితే ఆ శంక కూడా ఉండదు కదా! 



3. తనకి పెట్టుకునే శక్తి లేనట్లయితే, వేరే వారిచే పెట్టించవచ్చా...


సమాధానం : నిరభ్యంతరముగా పెట్టించవచ్చు.



4. పెట్టుకున్న వారికి అశౌచాదులు ఉంటాయా...


సమాధానం : అశౌచం, సూతకం ఉండవు. స్నానంతో శుద్ధి



5. ఎక్కడ పెట్టుకోవాలి...



"పర్వతే వా నదీతీరే వనే వాయతనేऽపి వా 


జీవచ్ఛ్రాద్ధం ప్రకర్తవ్యం మృత్యుకాలే ప్రయత్నతః "


   అని లింగ పురాణ వచనం. అనగా పర్వతములయందు గానీ, నదీతీరమునందుగానీ, అడవియందుగానీ, ఇంటియందుగానీ ఈ జీవచ్ఛ్రాద్ధం ఆచరించాలి. 



6. అలా పెట్టుకున్నవారు ఇక చనిపోయినట్లే లెక్కా.. 


సమాధానం :- కాదు. ఆ భావన తప్పు. ఎందుకంటే వారికి శ్రాద్ధప్రక్రియ లో "ప్రేత" శబ్దం వాడ వద్దని, జీవ శబ్దమే వాడమని శ్రాద్దమయూఖము, శ్రాద్ధ పద్ధతి అనే గ్రంథాలు చెబుతున్నాయి. 



7. ఈ ప్రక్రియను గూర్చి సంక్షిప్త వివరణ


ఈ జీవచ్ఛ్రాద్ధపద్ధతి ని ఏ నెలలోనైనా  కృష్ణద్వాదశి నాడు మొదలుపెట్టి శుక్లప్రతిపత్ నాటితో పూర్తి చేయాలి. మొత్తం 5 రోజుల కార్యక్రమం ఇది. పరిశీలించండి.


• మొదటిరోజు : అధికారప్రాప్తికై ప్రాయశ్చిత్తానుష్ఠానము, దాని పూర్వాంగ,ఉత్తరాంగ కృత్యాలు, దశమహాదానాలు, అష్టమహాదానాలు, పంచధేనుదానము మొదలైనవి 


• రెండవరోజు : సాలగ్రామ పూజ, జలధేనుస్థాపన-పూజ, వసురుద్రాదిత్యపార్వణశ్రాద్ధము , రాత్రి జాగరణ మొదలైనవి. 


• మూడవరోజు : పుత్తలనిర్మాణము , షట్పిండదీనములు, పుత్తలదాహము, దశగాత్రపిండదానము, శయనాదులు. 


• నాల్గవరోజు : మధ్యమషోడశీ, ఆద్యశ్రాద్ధము, శయ్యాదానం, వృషోత్సర్గం, వైతరణీగోదానం, ఉత్తమషోడశశ్రాద్ధము మొదలైనవి. 


• ఐదవరోజు : సపిండీకరణశ్రాద్ధము, అనంతరం గౌరీ-గణపతులకు పూజ, కలశ పూజ, శయ్యా-పద దానములు, బ్రాహ్మణభోజనాదులు. 


అందువలన ఈ ప్రక్రియను అందరూ నిరభ్యంతరంగా ఆచరించుకొనవచ్చునని తెలియజేయబడుతోంది. 


✍తుకారాం

ధూర్తుల విషయంలో

 🕉️ _*సుభాషితమ్*_ 🕉️


శ్లో॥

*ముఖం పద్మ దళా కారం*

*వచశ్చందన శీతలమ్l*

*హృత్కర్తరి సమం చాzతి*

*వినయం ధూర్త లక్షణమ్ll*


భావము॥

చక్కని ముఖ వైఖరి, చల్లని మెత్తని మాటలు, కత్తెర బోను వంటి హృదయము, అతి వినయము.. ఇవన్నియు ధూర్త లక్షణములు.

ఇట్టి ధూర్తుల విషయంలో మిక్కిలి జాగరూకతతో మనం ప్రవర్తించాలి.

అంతరాత్మ దర్శనం....

 *అంతరాత్మ దర్శనం.....*



వాస్తవ ప్రపంచంలో తప్పు చేసేవాడొకడు. దాని మూలంగా బాధపడేవాడొకడు. దాని గురించి ఫిర్యాదిచ్చేవాడొకడు, బందించి తీసుకేల్లెవాడొకడు, కాపలాకాసేవాడొకడు, బోనులో నిలబెట్టేవాడొకడు, ప్రశ్నలడిగేవాడొకడు, సాక్ష్యం చెప్పేవాడొకడు, తీర్పిచ్చేవాడొకడు, దాన్ని అమలు పరిచేవాడొకడు. అని ఇంతమంది ఉంటారు.


అంతిమ సత్య ప్రపంచంలో మాత్రం ఇంతమంది ఉండరు. అక్కడ నీకు నువ్వే ముద్దాయివి. నీకు నువ్వే బాధితుడివి. నీకు నువ్వే ఫిర్యాదివి. నీకు నువ్వే రక్షకభటుడివి. నీకు నువ్వే చెరసాల అధికారివి. నీకు నువ్వే ప్రాసిక్యూటరువి. నీకు నువ్వే డిఫెన్సు లాయరువి. నీకు నువ్వే సాక్షివి. నీకు నువ్వే న్యాయమూర్తివి. అక్కడ నువ్వు తప్ప నీకింకెవ్వరు కనిపించరు. అదొక ఒంటరి లోకం. అందుచేత అది ప్రపంచంలోకెల్లా అత్యంత క్రూరమైన న్యాయస్థానం.


నూటికి 99.99 శాతం మంది మనుషులు (మనస్సులు) దాన్ని బ్రతికి ఉండగా కనీసము ఊహించలేరు. జరిగిన సంఘటనల తాలూకు గుప్తమైన స్మృతుల చిత్రాలు (దృశ్యాలు) గా మనస్సు యొక్క లోలోపలి పొరల్లో నుంచి సర్వసమగ్రంగా వెలికి తియ్యబడుతాయి. ఆ గుప్తమైన చిత్రాలు (సంఘటనలు) గుర్తుకు రావడానికి 'చిత్రగుప్తుడు' అని పేరు.


దేవుడు లేడనవచ్చు. శాస్త్రాలు అబద్దమనవచ్చు. కాని తానున్నాడు. తాను మాత్రం అబద్దం కాదు. తానూ కుట్ర కాదు. తానూ నిజం. అందుకే చేశాడు ఈశ్వరుడు ఈ ఏర్పాటు. ఆ ఒంటరి నిర్జయ న్యాయస్థానం. అక్కడ న్యాయ సూత్రాలంటూ ఏమి ఉండవు. నీకు నువ్వు ఏర్పరచుకున్న చట్టం ప్రకారమే నువ్వు విచారించబడతావు. నువ్వు గతంలో ఇతరులకు చెప్పిన నీతుల్ని బట్టి నువ్వు కూడ విచారించబడతావు.


నువ్వు బతికుండగా ఎంత పండితుడవైతే అంతా నిర్దాక్షిణ్యంగా ఉంటుంది నీమీద జరగబోయే విచారణ. నిన్ను నువ్వే దర్యాప్తు చేస్తావు. కర్కశంగా దర్యాప్తు చేస్తావు. నువ్వంటే నువ్వు కాదు. నీలో ఉన్న అంతరాత్మ చేస్తుంది. అందుకే దానికి ఆ పక్షపాత రహిత ధోరణి. ఆ నిస్వార్ధం. అది ప్రపంచానికి నిజమైన ప్రభుత్వం. అది తప్పొప్పుల విచారణలో బహు క్రూరమైనది. మానవ మనస్సులా అది తనను తానూ మోసం చేసుకోదు. మానవ మనస్సు మొద్దబ్బాయిలాంటిది. తప్పించుకోవడానికి అడ్డదార్లు వెతికే ఖైదీలాంటిది. దేవుడికే లంచమిద్దామని ఆలోచిస్తుంది.


కాని ఆ న్యాయమూర్తి (అంతరాత్మ) లంచం తీసుకోదు. తనకు లంచంగా ఇవ్వజుపిన వాటిని భద్రంగా దాచిపెట్టి శిక్షాకాలం పూర్తయ్యాక ఖైదీకే వడ్డీతో సహా అప్పగిస్తాది. వీటికి వేరు వేరు ఖాతాలు నిర్వహించబడుతాయి. ఒక ఖాతా ప్రాతిపదిక మీద ఇంకో ఖాతా రద్దయ్యే ప్రసక్తే లేదు. ఆ అంతరాత్మ ఎవరో కాదు. స్వయంగా నువ్వే. అక్షరాల నువ్వే. కాని లక్షలాది మంది ఈ సత్యాన్ని తాము బ్రతికుండగా గ్రహించలేరు. ఇదొక పార్శ్వం.


ఒకవేళ బతికుండగానే గ్రహించగలిగితే.. అది అసంభవం కాదు. నూటికో కోటికో ఒక్కరు మాత్రమె ఉంటారు అలాంటివాళ్ళు. వాళ్లకు అంతరాత్మ గ్రాంధిక భావన కాదు. కాలు చెయ్యి ఉండడం ఎంత నిజమో అంతే వాస్తవంగా వాళ్ళు దాన్ని అనుభవిస్తారు. సాధారణంగా మోక్షం పొందడానికి ఎవరైతే తపన పడతారో, ఎవరైతే భగవంతుడి దర్శనం కోసం తాపత్రయ పడతారో, వారికి అంతరాత్మ దర్శనం కలుగుతుంది. అంతరాత్మ దర్శనమిచ్చినప్పుడు మనిషి దిగ్భ్రాంతి చెందుతాడు.


ఎందుకంటే ఆ మహా మహనీయ తేజోమూర్తి దర్శనం మన పరిభాషలో వర్ణింప సఖ్యం కానటువంటిది. ఆ భగవత్ స్వరూపం తానే అని తెలుసుకోవడం వల్ల దిగ్భ్రాంతి చెందుతాడు, ఎంతో గగుర్పాటుకు లోనవుతాడు. ఆ అంతరాత్మ దర్శనం ముగిసిన తరువాత తిరిగి మరల ఈ లోకంలోకి వచ్చినపుడు ఒకరకంగా మానవుడు దుఃఖిస్తాడు. ఎందుకంటే.. లక్షల కోట్లాది సంవత్సరాల వయసు గల ఆ సనాతన ధర్మమూర్తి నువ్వేనా స్వామి.. నువ్వు అసలు లేనే లేవనుకున్నాను ఇంతకాలమూ.


కృష్ణుడు రాముడు అంతా బోగస్ అనుకున్నాను స్వామి.. నిన్నిక్కడే పెట్టుకొని ఎక్కడెక్కడో వెతుకుతున్నాను. నాలోనే ఉన్నావని తెలుసుకోలేకపోయాను స్వామి. అని ఆ దేవదేవుడైన అంతరాత్ముడి దర్శనం పొందిన తర్వాత తానూ వేటికి భయపడదు సరికదా పాపాలకు పడే శిక్షల నుండి తప్పించుకుందామనే ఆలోచన శాశ్వతంగా అంతరించిపోతుంది. తండ్రి మాట మీద బడికి వెళ్ళడానికి సిద్ధమయ్యే బుజ్జి కొడుకులా తప్పులకు శిక్ష అనుభవించడానికి ఆనందంగా సిద్దపడుతాడు.


ఈ దర్శనంతో క్రూరమైన, ఒంటరి, నిర్మానుష్య న్యాయస్థానం అనుకున్నది కాస్తా హఠాత్తుగా నాన్నగారి ఆఫీసులా మారిపోతుంది. ఇది ఇంకో పార్శ్వం. అలా ఆ పరమాత్ముడి దర్శనంతో అన్నీ సమస్తం పటాపంచలు. అది కలిగాక వెయ్యి నాస్తిక(అంటే దేవుడే లేడు) గ్రంధాలు చదివినా ఏ మార్పు ఉండదు. లక్షమంది నాస్తికుల మధ్య ఉన్న ప్రభావం ఉండదు. అందరిలోనూ తానే కనిపిస్తాడు అంటే అంతటా తను తన అంతరాత్మనే దర్శిస్తాడు.


ఆ స్థితిలో మనిషి మెయిన్ రోడ్డు మీద పడి సాష్టాంగ నమస్కారాలు చేసిన ఆశ్చర్యపోనవసరం లేదు. అంతా అంతరాత్మే. స్కూటర్లు, కార్లు, బస్సులతో సహా మనుషులంతా అంతా నేనే అనిపిస్తుంది. ఆ స్థితిలో అతడు తనని తానే పూజించుకునే అవకాశం కూడా వుంది...


*|| ఓం నమః శివాయ ||*

Shiva

 


Shankara

 


Modiji


 

Sri. Sarmada

 


Archana


 

అనుభవిస్తే కానీ నశించదని

 శ్లోకం:☝️

*అన్యక్షేత్రే కృతమ్పాపం*

  *తీర్థక్షేత్రే వినశ్యతి |*

*తీర్థక్షేత్రే కృతమ్పాపం*

  *వజ్రమాపే చ లిప్యతి ||*


భావం: ఇతర ప్రాంతాలలో చేసిన పాపం పుణ్యక్షేత్రానికి వచ్చిన తర్వాత నశిస్తుంది. కాని పుణ్య తీర్థ క్షేత్రాలలో చేసిన పాపం వజ్ర సమానంగా మారుతుంది. అంటే పుణ్యతీర్ధాలలో చేసిన పాపానికి ప్రాయశ్చిత్తం లేదు, అది అనుభవిస్తే కానీ నశించదని భావం.

శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో

 ఆగస్టులో శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో విశేష ఉత్సవాలు


తిరుపతి, 30 జూలై 2023: తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో ఆగస్టు నెలలో జరుగనున్న విశేష ఉత్సవాల వివరాలు ఇలా ఉన్నాయి.


– ఆగస్టు 1 మరియు 28వ తేదీలలో ఉత్తరాషాడ నక్షత్రం సందర్భంగా శ్రీపద్మావతి అమ్మవారు గజ వాహనంపై భక్తులను కటాక్షిస్తారు.


– ఆగస్టు 4, 11, 18వ తేదీల్లో శుక్రవారం సందర్భంగా సాయంత్రం అమ్మవారు తిరుచ్చిపై విహరించి భక్తులను కటాక్షించనున్నారు.


– ఆగస్టు 6న ఉత్తరాభాద్ర నక్షత్రం సందర్భంగా శ్రీ సుందరాజస్వామివారు తిరుచ్చి వాహనంపై భక్తులను అనుగ్రహిస్తారు.


– ఆగస్టు 20న సూర్యనారాయణస్వామివారు తిరుచ్చి వాహనంపై భక్తులకు దర్శనమిస్తారు.


– ఆగస్టు 25న వరలక్ష్మీ వ్రతం సందర్భంగా శ్రీపద్మావతి అమ్మవారి స్వర్ణరథోత్సవం జరుగుతుంది.


టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.

దైవాన్ని కోరాలి

 *దైవాన్ని కోరిక ఎలా కోరాలి*


*1.నువ్వు బతికి* *ఉన్నంత కాలం* *ధార్మిక* *కార్యాలు నీ సంపదతో చేయాలి అని* *కోరుకోవాలి, అంటే ఎప్పుడూ నువ్వు ఇచ్చే స్థితిలో ఉండాలి అని అర్థం అంటే ఎప్పటికీ నీకు సంపాదన ఉంటుంది.*


2. *నా ఇంట్లొ దైవానికి నిత్య నైవేద్యం ఉండాలి అని కోరుకోవాలి అంటే నీ ఇంట్లో ధాన్యం ఎప్పుడూ నిలువ ఉంటుంది.*


3. *నా ఇంట్లో నేను నిత్య పూజ రోజు చేయాలి అని కోరుకోవాలి అంటే నీ ఆరోగ్యం బాగుంటే నువ్వు ఎప్పుడూ ఆనందంగా ఉంటే నీ ఇంట్లో నిత్య పూజ చేస్తావు..*


4. *నా ఇంటికి ఎవ్వరు వచ్చినా కడుపునిండా భోజనం చేసి వెళ్ళాలి అని కోరుకోవాలి అంటే నీకు అనుకూల వతి అయిన ధర్మపత్నీ (పతి) భాగస్వామి అవుతుంది.*


5. *నేను నా చివరి దశ వరకు నీ క్షేత్రానికి దర్శనానికి రావాలి అంటే నీకు సంపూర్ణ మైన ఆరోగ్యాన్ని ఇవ్వమని అడగటం..*


6. *భాగవతులతో నీ గడప నిండుగా ఉండాలి అని కోరుకోవాలి అంటే నీకు సమాజంలో తగిన గౌరవం మంచి పేరు రావాలి అని కోరుకోవడం...*


7. *కుటుంబం అంతా సంతోషం గా క్షేత్ర దర్శనంకి రావాలి అని కోరాలి అంటే నువ్వు ఆరోగ్యంగా, ఆర్ధికంగా, కుటుంబం లో అన్యోన్యంగా ఉంటేనే జరుగుతుంది ఇంక ఏమీ కావాలి జీవితానికి..*


*8 *చివరిగా నేను పండు ముత్తైదువుగా సంతోషంగా కాలం చేయాలి అని కోరుకోవాలి అంటే భర్తకు సంపూర్ణ ఆయువు ఆరోగ్యం కోరుకోవడం..*

*మనకు తల్లిదండ్రులు ఆ దైవమే వారిని కాకా ఎవరిని అడుగుతాము కానీ ఆ అడిగే కోరిక ఇలా ఉంటే ఆ దైవం కూడా అనుగ్రహిస్తుంది.*


*శుభమస్తు*

సన్యాసాశ్రమం

 శాస్త్రం విధించిన సన్యాసాశ్రమం


మన దేశంలో నానావిధాలవారు సన్యాసులెందరో వున్నారు. వీరెవ్వరూ ఫలప్రదం, లాభకరం అయినపని ఏదీ చేయరు. గృహస్తులు పెట్టే భిక్షవల్లజీవిస్తూ వుంటారు. ఈ భిక్షసన్యాసులందరు పరోపజీవనులనీ, వీరివల్ల దేశానికేమీ లాభించదనీ మనపరిపాలకులలోనే కొందరు అభిప్రాయపడుతూ వుంటారు. ఈ సన్యాసి జనసమూహాన్ని కూడగట్టి ప్రజోపయోగకరమైనపని చేయిస్తే మంచిదను తలంపుతో “అఖిల భారత సాధు సంఘమ”నే సమాజాన్ని ఇటీవల నెలకొల్పారు. వీరిలో కొందరిని సంచార ప్రచారకులుగా నియమించి వారికి కొంత ప్రతిఫలం ముట్టచెప్పుతూ ప్రజాహితం సాధించాలని ఆలోచించారు.


అవును, దేశంలో ఈ సన్యాసిమూక ఎక్కువగా నున్నమాటనిజమే. వీరు పరోపజీవనం చేస్తున్నమాట నిజమే. అలావుండటం మంచిది కానిమాట సత్యమే. కాని సన్యాసులు పరోపజీవనం చేయకూడదనే అభిప్రాయాన్నీ, సన్యాసులు భిక్షాటనవల్లనే జీవించాలనే శాస్త్రవిధిని- ఈరెంటినీ సమన్వయించడం ఎలాగూ అనేదే ప్రశ్న.


నాలుగాశ్రమాలవారిలో సన్యాసులకు, బ్రహ్మచారులకూ మాత్రమే భిక్షాజీవనం అర్హమనీ, విహితమనీ శాస్త్రం చెప్పుతున్నది. బ్రహ్మచారులు గురుకులవాసం చేసేటప్పుడు చాలా కొలది గృహములందు 'భవతిభిక్షాందేహి' అని ఇల్లాండ్రనడిగి, తమకోసం గురువుకోసం అన్నమును తెచ్చుకోవాలి. దీనివల్ల రెండు ప్రయోజనాలు కలుగుతున్నవి. విద్యార్థి తన చదువుకోసం వినియోగించుకోడానికి ఎంతో కాలమూ, శక్తి దీనివల్ల కలిసివస్తవనేది ఒకటి; రెండోది విద్యార్జనకవసరమైన వినయమూ, చిత్తశుద్ధీ దీనివల్ల అలవడుతవనేది. గురుకుల వాసమందు ఈ భిక్షాటనం రాచబిడ్డలకూ విధింపబడింది. బ్రహ్మచారులిలా తెచ్చిన భిక్షాన్నమును గురువుకర్పిస్తే దానిని గురువు అందరికీ పంచిపెడతాడు. విద్యార్థులు గురువులకు జీతాలివ్వడమనేది ఆనాడులేదు. విద్య పూర్తి చెందిన పిమ్మట శిష్యుడు గురువునకు శక్తి కొలది దక్షిణ సమర్పిస్తాడు. దేశంలో ఉన్న రాజులవల్ల, సంపన్నులవల్ల శిష్యులు ఈ దక్షిణను సంపాదించి భక్తిపూర్వకంగా గురువులకు అర్పించేవారు.


సన్యాసి గూడా ఇలా భిక్షాన్నంవల్ల జీవించవలసిందే. చిత్తవృత్తులను విషయజాలమునుండి మరలించి పరమాత్మ ధ్యానమందు నిరంతరంగా లగ్నం చేసివుంచడమే అతనికి విహిత కృత్యం, సన్యాసులు జీవనార్థం ఏదో వృత్తి నవలంబించి అందరివలె లాభకరమైన పనులుచేస్తూ ఉంటే, వారికి విహితమైన బ్రహ్మనిష్ఠకు భంగం కలిగితీరుతుంది. సన్యాసి సప్తభిక్ష చేసి జీవించాలని శాస్త్రం విధించింది. సప్తభిక్ష అంటే ఏడు ఇండ్లయందు మాత్రమే భిక్షనర్థించాలి. ఆ అర్థించడం గూడా ఇంటి ముందు నిలిచి అడగాలి. ఆ నిలవడం గూడా గోదోహనకాలమాత్రం నిలవాలి అంటే, ఆవును పాలుపిదుకుట కెంతకాలము పట్టునో అంతసేపే నిలవాలి. ఈ విధంగా లభించిన భిక్షాన్నముచే అతడు జీవించాలి భిక్ష దొరకనినాడు ఉపవసించాలి. సన్యాసి అల్పాహారముతో బ్రతకాలని, కష్టించి విద్యార్జనం చేయవలసిన బ్రహ్మచారి కడుపునిండా తినవలెనని కూడా దీనివల్ల ఏర్పడుతున్నదని మనం గ్రహించాలి.


''యతిశ్చ బ్రహ్మచారీ చ పక్వాన్నస్వామినా వుభౌ||''


అనే శాస్త్రం యతులకు, బ్రహ్మచారులకు పక్వాన్న జీవనం విధిస్తున్నది. కనుక వారికి అన్నం పెట్టే బాధ్యతను గృహస్థులకు కూడా విధిస్తున్నదన్నమాట. ఇలాభిక్షాన్నముచే జీవించే ఈ ఉభయుల వల్లా సంఘానికి కలిగే హాని ఏమీ లేకపోగా, ఎంతో మేలు కలుగుతున్న విషయం మనం గమనించాలి భిక్షాటనంచేస్తూ చదువుకొన్న విద్యార్థి వినీతుడగుటేకాక, అట్లు సంపాదించిన విద్యావినయములచే సద్గృహస్థుడై సంఘానికి మిక్కిలి ఉపయోగిస్తాడు. ఇక సన్యాసుల మాట అడుగుతారా? సంసారభారం మోయలేక భిక్ష వల్ల అనాయాస జీవనం జరుగుతుందికదా అని కావులుగట్టిన వారందరు సన్యాసులు కారు. అట్టివారు భిక్షార్హులు కారు. ఐహికాముష్మిక ఫ భోగవిరాగియై ఆలుబిడ్డలను, ఇల్లూవాకిలిని, సౌఖ్యములను విడనాడి, యధావిధిగా ఆశ్రమస్వీకారం చేసినవారే నిక్కపు సన్యాసులు. అట్టిసన్యాసం అందరికి సుకరంగాదు. అట్టియతులే భిక్షార్హులు. బ్రహ్మనిష్ఠతో కాలంగడిపే అట్టి మహనీయులు ఉత్తమగతులకు మార్గం చూపెట్టుతూ వుంటారు. కనుక వారి వల్ల లోకాలకి మేలే కలుగుతుంది. అట్టి యతులు అరుదుగా ఉంటారు. వారిని భరించడం సంఘాని కొక కష్టంలోదికాదు.


లోకంలో మనకు కన్పించే సన్యాసులందరు అట్టి మహనీయులు కారు. బౌధ్ధమతాన్ని అవలంబించినకొన్ని దేశాలలో ప్రజలందరు నియమనిగ్రహముల కోసం కొన్నాళ్ళు భిక్షుక వృత్తి స్వీకరించాలనే నియమం ఉన్నది. వ్రతపరిసమాప్తియైన పిమ్మట కొందరు గృహస్థాశ్రమం స్వీకరిస్తారు. తక్కినవారు భిక్షులుగానే ఉండిపోతారు. అట్టి యథార్ధభిక్షులనుచూచి, పనిపాటులొల్లని సోమరులు గూడా కొందరాదేశాలలో కావులుగట్టి భిక్షాటనం వల్ల ఆశ్రమజీవనం చేస్తూ ఉండడం కద్దు.


ఆట్లే మన దక్షణ దేశంలో కొందరు పరదేశులమనీ, ఉత్తరదేశంలో సాధులమనీ బయలుదేరి భిక్షాటనముచే సుఖంగాజీవిస్తూ ఉంటారు. సన్యాసులకువిహితమైన వ్రతపాలనంకానీ, నియమనిష్ఠలుకాని, సంప్రదాయంకాని, ఆశ్రమస్వీకారంగాని వీరికక్కరలేదు. పొట్టకోసం దేవులాటేతప్ప వీరికి బ్రహ్మనిష్ఠతో పనిలేదు. పరోపజీవనం చేసే ఈ సోమరులను పరిహరించవలసిందే. మేము కాదనము. కానీ ఈ కలుపు మొక్కలను ఊడబెరికేయత్నంలో పైరు మొక్కలనుగూడా పీకివేయవలదనే మేము చెప్పేది. లోకసంగ్రహార్థం ఆశ్రమస్వీకారం చేసిన యధార్థ యతులను సోమరులని తెగనాడదగదు. దండ కమండులు ధారణంవల్ల, వైరాగ్యవర్తనంవల్ల గుర్తింపదగిన యదార్థసన్యాసులు ఒకానొక అచ్చమైన సంప్రదాయంలో వారై ఉంటారని కూడా మనం గ్రహించాలి.


సన్యాసులకొక సంఘమంటూ అక్కరలేదు. ఏకాంతవాసం చేయుటేతప్ప సంఘాలుగాకూడటం సన్యాసుల లక్షణంకాదు. సంఘములుగగూడిన సన్యాసులు ఆశ్రమధర్మభ్రష్ఠులై తామూ లోకసామాన్యంలో చేరిపోతారు.


కాబట్టి సన్యాసులకు, బ్రహ్మచారులకేతప్ప ఇతరులకు భిక్షాజీవనం పనికిరాదు. పనిపాటులొల్లక భిక్షాటనంచేసే సోమరితనాన్ని మాన్పుటకు రెండు ఉపాయములు కన్పిస్తున్నవి (1) బహుజనులకు విరివిగా పనికల్పించటం (2) సంపన్నల భోగానుభవాలకు నిరుపేద కష్టజీవనానికి వుండే వ్యత్యాసాన్ని తగ్గించడం వీనిలో మొదటిపని ప్రభుత్వానిది, రెండవది ప్రజలది జీవనపుటంతస్తు (స్టాండర్డు ఆఫ్ లివింగ్) పెరుగవలెనంటూ నేడుపఠించే మంత్రాలకు ఫలితమేమిటంటే, భోగసక్తి పెరగడమే భోగాలను విడనాడి, గ్రాసవాసోదైన్యం లేకుండా, మితంగా, సౌమ్యంగా బ్రతకడమే నిజమైన సోషలిజమనిపించుకుంటుంది. శీతావాతాతపముల నుండి రక్షించే సముచిత వస్త్రధారణం, జిహ్వచాపల్యం కోసం కాక శరీరధారణం కోసం భుక్తి. ఇదే సోషలిజపు లక్షణము దేహధారణ మాత్రమైన భుక్తియే అపరిగ్రహమనిపించుకొంటుంది. దేశసంపదను విజ్ఞానాభివృద్ధికి, దేశరక్షణకు వినియోగించాలేకాని భోగానుభవాలకై వెచ్చించకూడదు. జీవనవ్యయాన్ని సరళజీవనానికిసరిపడేటట్లుతగ్గించాలిగాని పెంచకూడదు. అలాచేస్తే ప్రజలందరకు సరిపడ్డ కూడు గుడ్డలు, నివాసమూ లభిస్తవి.


నేడు అదనపు సంపదగల దేశాలు, పురుషులు ఆ సంపదను రాజకీయంగా తమతో ఏకీభవించే దేశాలకు, యుధ్ధంలో తమకు తోడ్పడే దేశాలకు పంచిపెట్టడం జరుగుతూ ఉంది. ఇది కూడనిపని. అదనపుసంపదను పేదదేశాలకు, ప్రజలకు ఇవ్వడం న్యాయం. ఏ దేశానికాదేశం తమకున్న సంపదతో తృప్తి పడటం నేర్చుకుంటే, జీవనపుటంతస్థుననుభవించే దేశాలు ఆ యంతస్తును కాపాడుకోవడాని కెప్పటికప్పుడు విదేశ విపణులను ఆక్రమించుకొంటూ వుండటం, ఆ కృత్రిమపు వాపు ఎప్పుడు బుస్సున తీసిపోతుందో అని భయపడతూ వుండడం తప్పదు. మింటిఎత్తు పెరిగినవానికి పడిపోతానేమో అనే భీతి వెంటాడుతూనే వుంటుంది. ఇతర దేశాలను అనుకరిస్తే, ఎప్పటికైనా మనకూ ఈ దురవస్థ పట్టుతుంది.


ఇంతకూ సన్యాసానికి, సంఘటనకు చుక్కెదురనేది ప్రస్తుతం. సన్యాసులను పోషించే భారాన్ని సంఘం వహించక తప్పదు. పొట్టకోసం భిక్షాటనం చేసేవారికి పనిపాటులు చూపించాలి. యధావిధిగా ఆశ్రమ స్వీకారం చేసిన సన్యాసులను, పరోపజీవనం చేసే సోమరులను నిందింపరాదు. సన్యాసులను సంఘటితపరచి, ప్రభుత్వం చేయవలసిన పనులను వారిచే చేయింప బూనడం కూడా యుక్తంగాదు.


అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం

శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।।


--- “జగద్గురు బోధలు” నుండి


#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం

శయన నియమాలు

 *శయన నియమాలు*

~~~


*పడుకోవాలంటే పాటించే 15 సూత్రాలు*


🔹1. నిర్మానుష్యంగా, నిర్జన గృహంలో, ఒంటరిగా పడుకోవద్దు. దేవాలయం మరియు స్మశానవాటికలో కూడా పడుకోకూడదు. *( మనుస్మృతి )*


🔹2. పడుకోని ఉన్న వారిని అకస్మాత్తుగా నిద్ర లేపకూడదు *( విష్ణుస్మృతి )*


🔹 3. విద్యార్థి, నౌకరు, మరియు ద్వారపాలకుడు వీరు అధిక సమయం నిద్రపోతున్నచో, వీరిని మేల్కొలప వచ్చును.*( చాణక్య నీతి )*


🔹4. ఆరోగ్యవంతులు ఆయు రక్ష కోసం బ్రహ్మా ముహూర్తంలో నిద్ర లేవాలి (దేవీ భాగవతము). పూర్తిగా చీకటి గదిలో నిద్రించవద్దు. *( పద్మ పురాణము )*


🔹5. తడి పాదములతో నిద్రించవద్దు. పొడి పాదాలతో నిద్రించడం వలన లక్ష్మి (ధనం) ప్రాప్తిస్తుంది. *(అత్రి స్మృతి)*


విరిగిన పడకపై, ఎంగిలి మొహంతో పడుకోవడం నిషేధం. *( మహాభారతం )*


🔹6. నగ్నంగా, వివస్త్రలులై పడుకోకూడదు. *( గౌతమ ధర్మ సూత్రం )*


🔹7. తూర్పు ముఖంగా తల పెట్టి నిద్రించిన విద్య, పశ్చిమ వైపు తల పెట్టి నిద్రించిన ప్రబల చింత, ఉత్తరము వైపు తల పెట్టి నిద్రించిన హాని, మృత్యువు, ఇంకా దక్షిణ ముఖంగా తల పెట్టి నిద్రించినచో ధనము, ఆయువు ప్రాప్తిస్తుంది. *( ఆచార మయూఖ్ )*


🔹8. పగటిపూట ఎపుడు కూడా నిద్రించవద్దు. కానీ జ్యేష్ఠ మాసంలో  1 ముహూర్తం (48నిమిషాలు) నిద్రిస్తారు.(పగటిపూట నిద్ర రోగ హేతువు మరియు ఆయు క్షీణత కలుగ చేస్తుంది)


🔹9. పగటిపూట సూర్యోదయము మరియు సూర్యాస్తమయం వరకు పడుకొనే వారు రోగి మరియు దరిద్రులు అవుతారు. *( బ్రహ్మా వైవర్తపురాణం )*


🔹10. సూర్యాస్తమయానికి ఒక ప్రహారం (సుమారు మూడు 3 గంటల) తరువాతనే పడుకోవాలి.


🔹11. ఎడమవైపు పడుకోవడం వలన స్వస్థత లభిస్తుంది.


🔹12. దక్షిణ దిశలో పాదములు పెట్టి ఎపుడు నిద్రించకూడదు. యముడు మరియు దుష్ట గ్రహముల నివాసము వుంటారు. దక్షిణ దిశలో కాళ్ళు పెట్టడం వలన చెవుల్లో గాలి నిండుతుంది. మెదడుకు రక్త సరఫరా మందగిస్తుంది. మతిమరుపు, మృత్యువు లేదా అసంఖ్యాకమైన రోగాలు చుట్టుముడుతాయి.


🔹13. గుండెపై చేయి వేసుకుని, చెత్తు యొక్క బీము కింద, కాలుపై కాలు వేసుకుని నిద్రించ రాదు.


🔹14. పడక మీద త్రాగడం- తినడం చేయకూడదు.


🔹15. పడుకొని పుస్తక పఠనం చేయడానికి వీల్లేదు. పడుకొని చదవడం వలన నేత్ర జ్యోతి మసక బారుతుంది.


🔸*ఈ 15 నియమాలను అనుసరించేవారు యశస్వి, నిరోగి, మరియు దీర్ఘాయుష్మంతుడు అవుతారు* 🔸

*సేకరణ*

*🙏🙏సర్వే జనాః సుఖినోభవంతు 🙏🙏*

పంచాంగం 01.08.2023 Tuesday

 ఈ రోజు పంచాంగం 01.08.2023  Tuesday,

 

స్వస్తి  శ్రీ చాన్ద్రమాన శోభకృన్నామ సంవత్సర: దక్షిణాయనం వర్ష ఋతు అధిక శ్రావణ మాస శుక్ల పక్ష: పౌర్ణమి తిధి భౌమ  వాసర: ఉత్తరాషాఢ నక్షత్రం ప్రీతి యోగ: భద్ర తదుపరి బవ కరణం ఇది ఈరోజు పంచాంగం. 


పౌర్ణమి రాత్రి 12:00 వరకు.

పూర్వాషాఢ సాయంత్రం 04:01 వరకు.

సూర్యోదయం : 05:59

సూర్యాస్తమయం : 06:46

వర్జ్యం : రాత్రి 07:30 నుండి 08:54 వరకు.

దుర్ముహూర్తం: పగలు 08:32 నుండి 09:24 నుండి తిరిగి రాత్రి 11:15 నుండి 12:00  వరకు.


రాహుకాలం : మధ్యాహ్నం 03:00 నుండి 04:30 వరకు.


యమగండం : పగలు 09:00 నుండి 10:30 వరకు.  

 


శుభోదయ:, నమస్కార:

కువలయము

 శుభోదయం🙏


వెన్నెల వెలుగులు 

                                                     ---------------------------- 


                     చ :  వడిగొని  ఱేకు లుప్పతిల  వాలిన కేసరముల్  దలిర్పఁ  ,బు

                              

                            ప్పొడిఁ దలమెక్కి,  తేనియలు పొంగి  తఱంగలుఁ గాఁ జెలంగి  పైఁ


                            బడు  నెలదేఁటిదాఁటులకుఁ  బండువులై   నవసౌరభంబు  లు


                            గ్గడువుగ  నుల్ల  సిల్లె   ఘన కైరవ షండము  నిండు  వెన్నెలన్ ;


                               ఆవెన్నెలలో  సరోవరాలలో   కానవచ్చే ప్రకృతి విలాసాన్ని  కవి వర్ణిస్తున్నాడు. సరోవరాలలో  చంద్రుని కిరణాలు

ప్రసారం కాగానే  కలువలు  రేకులు విప్పుతున్నాయి. ఆరేకుల వెనుకే  కింజల్కాలు ప్రక్కలకు వ్రాలుతున్నాయి. ఆకింజల్కాలనుండి పుప్పొడి రాలుతోంది. ఆపుప్పొడి ప్రక్కనుండి మకరందం జారులు వారుతోంది.. అపుప్పొడి పీకవరకూ మెక్కి, తేనెత్రాగి  తుమ్మెదలు

అటూ ఇటూ పరిభ్రమిస్తున్నాయి. ఆవాతా వరణానికి పండుగ శోభను కలిగిస్తూ  కలువలనుండి గమ్మత్తుగా మత్తుగా , పరిమళాలు నలువైపుల  నలుముకుంటున్నాయి .


      ఇదీ ప్రకృతిలోని పరిణామము!


                దీనినే    కవి తన భాషలో భావనాత్మకముగా వర్ణించినాడు. వడిగొని రేకులుప్పతిల-గబగబా రేకులు విచ్చు కున్నాయట. వెంటనే కేసరములు వాలాయట,కలువలు,  రేకులు విప్పగానే తుమ్మెదలు సిధ్ధంగా ఉన్నాయి ఆహారంకోసం ఆనందంకోసం. పుప్పొడిఁ దలమెక్కాయట.పీకల వరకూ మెక్కాయన్నమాట. తేనెకెరటాలుగా వస్తోంది తప్పించుకుంటానికి అటునిటు గెంతుతున్నాయి. వాటికి 'పండుగులవలె' కలువల నుండి సువాసనలు వ్యాపిస్తున్నాయట; ఇదంతా జరుగ టానికి ప్రధానమైనవి కైరవ షండములు.( కలువల సముదాయము. )


                     కలువకు  'కుముద' మని మరోపేరు. కు- అంటే భూమి , భూమికి ఆనందాన్ని కలిగించేవి అనియర్ధం.

                     కలువకు కువలయము  అనేది పర్యాయపదం. దానికి భూమి యని యర్ధం!


                          కలువకూ చంద్రునకూ  ప్రకృతిగత సంబంధం. భూమికీ కలువకూ సామ్యం. అందువలన కలువలు వికసించాయీ అంటే  భూలోక  మంతా ఆనందంగా ఉన్నదని వ్యగ్యం! చంద్రుని రాకతో  మనస్సుకు ప్రశాంతత కల్గుతుంది." చంద్రమా మనసోజాతః"-అనివేదం!  ఆఆనందమయ జగత్తునే కవి యిక్కడ ఆవిష్కరించాడు.


                   కలువలు, తుమ్మెదలు,పుప్పొడి, తేనె, పరిమళాలు, ఇత్యాదులన్నీ '  రసమయ' జగదా విష్కరణలోని భాగాలు. 


                                       ఇదంతా ప్రకృతి  సౌందర్య స్వరూపం! 


                   మొత్తంమీద  సంధ్యాకాలం -సూర్యస్తమయం- చంద్రోదయం- వెన్నెల వెలుగులు. వీనియన్నింటి యందు ఎఱ్ఱన కవి

త్రిగుణాత్మక మైన ప్రకృతి దర్శనముతో బాటు త్రిగుణాత్మక స్వరూపుడైన పరమేశ్వరుణ్ణి కూడా దర్శించినాడని మొన్ననే విన్న వించాను.

సాంధ్య వర్ణనలోని చీకటి  తమోగుణం. సంధ్యాకాంతి.(ఎఱుపు) రజోగుణం. వెన్నెలలోని తెల్లదనం  సత్వగుణం. యీమాదిరిగా నున్నప్రకృతిలో పరమాత్మ దర్శన మన్నమాట! 


                              స్వస్తి!🙏🙏🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷

ॐ శ్రీ శివ సహస్రనామ స్తోత్రమ్

 ॐ   శ్రీ శివ సహస్రనామ స్తోత్రమ్ 


                             శ్లోకం:34/150 


హైమో హేమకరో యజ్ఞ 

స్సర్వధారీ ధరోత్తమః I 

లోహితాక్షో మహాక్షశ్చ 

విజయాక్షో విశారదః ॥ 34 ॥  


* హైమః = బంగారు (వికార) మయమైనవాడు, 

* హేమకరః = బంగరమును చేయువాడు, 

* యజ్ఞః = యజ్ఞపురుష రూపుడు, 

* సర్వధారీ = సమస్తమును ధరించువాడు, 

* ధరోత్తమః = (ప్రపంచమును) ధరించువారిలో ఉత్తముడు, 

* లోహితాక్షః = ఎర్రని వర్ణముగల కన్నులు కలవాడు, 

* మహాక్షః = గొప్పదైన దృష్టి కలవాడు, 

* విజయాక్షః = విజయంపై దృష్టి కలవాడు, 

* విశారదః = బాగుగా తెలిసినవాడు. 


                    కొనసాగింపు ... 


https://youtu.be/L4DZ8-2KFH0 


                    =x=x=x= 


  — రామాయణం శర్మ 

           భద్రాచలం