28, జులై 2022, గురువారం

శ్రావణ మాసం

 🦚 *ఓం శ్రీ శరవణభవాయనమః*🦚


*రేపటి నుంచి శ్రావణ మాసం ప్రారంభం శ్రావణ మాస విశిష్టత*


శ్రావణమాసం వచ్చిందంటే, పిల్లలనుండి పెద్దల వరకు ఆనందించని వారుండరు. నూతన వధువులకు, గృహిణులకు, బ్రహ్మచారులకు, గృహస్థులకు, లౌకికానందాన్నే కాక ఆధ్యాత్మికానందాన్ని కూర్చేది శ్రావణం. ఈ మాసంలో గృహాలన్నీ పసుపు కుంకుమలతో, పచ్చని మామిడాకు తోరణాలతో ఏర్పడిన లక్ష్మీ శోభతో నిండి, ఉజ్జ్వలంగా ప్రకాశిస్తాయి.

ఆధ్యాత్మిక దృష్టితో చూచినప్పుడు వర్షర్తువు అనగా శ్రావణ, భాద్రపద మాసముల కాలం, వేదాధ్యయన కాలంగా చెప్పబడినది. అసలు 'శ్రావణ'మనే ఈ మాస నామమునందే వేదకాలమనే అర్ధం ఉన్నది. శ్రవణమనగా "వినుట"అని అర్థం. వేదము గ్రంధమువలె పఠనం చేసేది కాదు. విని నేర్వదగినది. దీనిని వినిపించేవాడు గురువు. విని నేర్చుకొనే వారు శిష్యుడు. ఈ వేదమునకే 'స్వాధ్యాయ'మనేది మరో నామం.

వేదాధ్యయనం చేసే వానికి మోహం తొలగి, బ్రహ్మ స్వరూపం ద్యోతకమవుతుందని రామాయణమందు చెప్పబడినది. దీనిని బట్టి శ్రావణ మాసం వేదాధ్యయన సమయమని త్రేతాయుగమునందే చెప్పబడినట్లు తెలుస్తున్నది.

స్త్రీలకూ వేదపఠనంతో సమానమైన లలితా సహస్రనామాది స్తోత్ర పఠనాలు, నోములు, వ్రతాలు, మోహమును తొలగించి, సౌభాగ్యము నిచ్చేవి. అందుచేతనే ఈ మాసం రాగానే నూతన వధువులు మంగళ గౌరీ వ్రతమును ఐదు సంవత్సరాల పాటు నిర్వర్తిస్తారు.

పూర్ణిమకు ముందు వచ్చే శుక్రవారం నాడు వరలక్ష్మీ వ్రతం ఆచరిస్తారు. పూర్ణిమనాడు ఆడపిల్లలందరూ తమ సోదరులకు రాఖీలు కట్టి, వారితో సోదర ప్రేమను పంచుకొంటూ, ఈ ఆనందానికి సంకేతంగా వారినుండి బహుమతులను పొండి హృదయ పూర్వకంగా ఆనందిస్తారు. "గృహిణీ గృహముచ్యతే" అని చెప్పినందున, గృహిణులు ఆనందంగా ఉంటే ఆ గృహంలోని వారందరూ ఆనందంగానే ఉంటారు. శ్రావణం ఈ విధంగా సంతోషాన్ని కలిగించేదవుతున్నది.

ఈ మాసంలోనే బహుళ అష్టమినాడు శ్రీకృష్ణుడవతరించిన రోజు. కనుక కృష్ణాష్టమీ వ్రతాచరణం ఒక ముఖ్యమైన విషయంగా పరిగణించాలి. శ్రావణ పూర్ణిమనాడు, బ్రహ్మచారులు గాని, గృహస్థులు గాని, శ్రౌత స్మార్త నిత్య కర్మానుష్టాన సిద్ధికి నూతన యజ్ఞోపవీత ధారణ అనాదిగా ఆచారంగా వస్తున్నది.

ఇక కర్షకులు మెరుపులతో, గర్జనలతో కూడిన మేఘాలు వర్షధారలతో దేశమును చల్ల పరచునపుడు కృష్యాది కార్యములు నిర్విఘ్నంగా సాగగలవని, తమ మనోరథాలు నెరవేరబోతున్నాయని ఆనందిస్తారు. ఈ విధంగా శ్రావణ మాసం సర్వులకూ ఆనందాన్నిస్తుంది.


🦚🚩🕉️ *స్కందమయీ* 🕉️🚩🦚

ఆశలు మాత్రం వదలడు.

 Bhaja Govindam Slokam_ Adi Shankaracharya


17) Behold there lies the man who sits warming up his body with the fire in front and the sun at the back; at night he curls up the body to keep out of the cold; he eats his beggar’s food from the bowl of his hand and sleeps beneath the tree. Still in his heart, he is a wretched puppet at the hands of passions.


This Stanza attributed to Subodha.


శ్రీ ఆదిశంకర విరచిత భజగోవిందం శ్లోకం


అగ్రే వహ్నిః పృష్ఠేభానుః

రాత్రౌ చుబుకసమర్పితజానుః |

కరతలభిక్షస్తరుతలవాసః

తదపి న ముంచత్యాశాపాసః ||17||


భావం: ఎదురుగా చలిమంట పెట్టుకొని,  వీపుపై సూర్యుని కిరణాలు పడేలా కూర్చొని, రాత్రిళ్ళు మోకాళ్ళకి గడ్డాన్ని ఆనించుకుని కూర్చుంటాడు; తిండి తినడానికి రెండు చేతులూ దొప్పలుగా చేసుకొని అందులో తింటాడు. చెట్టు నీడన ఉంటాడు. ఐనా ఆశలు మాత్రం వదలడు.

మాంచి మాట🌷

 🌹🌹🌹🌹🌷🌷🌹🌹🌹🌹

          *🌷మాంచి మాట🌷*                               

                    🌷🌷🌷

కృష్ణమాచార్యులు గారు అనే గురువుగారి  వద్ద బాలరాజు , శివమూర్తి  విద్యనభ్యసించారు. శిక్షణ పూర్తికాగానే వారిద్దరూ వేర్వేరుగా ఆశ్రమాలు స్థాపించారు .


బాలరాజు తన శిష్యులకు శాస్త్రం బోధించి నేర్పించేవాడు. వాళ్ళ సమయం వృథాకాకుండా తన సమక్షంలోనే చదివించేవాడు. ఏదైనా మార్పుచేస్తే సహించేవాడు కాదు తాను చెప్పిన శాస్త్రాన్ని వల్లె వేయించేవాడు. తాను చెప్పిందే తు.చ. తప్పకుండా చెప్పాలనేవాడు. 


శివమూర్తి తన శిష్యులను మిత్రుల వలే చూసేవాడు. వారు వారి పక్కవారిని అడిగి తెలుసుకొని, ఆ పైన సొంతంగా ఆలోచించి చదివేవారు. 


ఆ సంవత్సరం రాజస్థానంలో విద్యాసభలు జరిగాయి. 


బాలరాజు శిష్యులు శాస్త్రాన్ని పొల్లుపోకుండా చెప్పి అందరి మెప్పు పొందారు


శివమూర్తి శిష్యులు శాస్త్రాలలో ఉండే రహస్యాలూ, అనుపానులు అన్నీ చెప్పి లోపాలను ఎత్తి చూపారు .సవరణలు కూడా సూచించారు. 


రాజు వారి ప్రతిభకు ఆశ్చర్యపోయారు. రాజు వారికి కానుకలు బహుకరించాడు.


బాలరాజు వాళ్ళ గురువు గారి వద్దకు వెళ్ళి గురుదేవా! నేను మా శిష్యులకు బాగా పాఠం చెప్పి క్షణం వృథా కాకుండా శిక్షణనిచ్చాను. అయితే నా శిష్యులకన్నా శివమూర్తి శిష్యులకు మంచిపేరు ఎలా వచ్చింది? సెలవీయండి" అని అడిగాడు


దానికి ఆయన చిరునవ్వు నవ్వాడు. ""వత్సా! నీవు శిష్యులకు బాగా బోధించావు. కాదనటం లేదు. కాని, వాళ్ళ ఊహాశక్తికి అవకాశం ఇవ్వలేదు. కాబట్టి చిలుక పలుకుల్లా నీవు బోధించేదే వాళ్ళు అభ్యసించారు అలాకాక శివమూర్తి తాను బోధించి, ఆ తర్వాత వాళ్ళకు స్వేచ్ఛనిచ్చాడు. వాళ్ళు ఆలోచించి, అవగాహన చేసుకొన్నారు. యథేచ్ఛగా చర్చించుకొని శాస్త్రంలోని అంశాలు లోతుగా తెలుసుకొన్నారు. 

మళ్ళీ ప్రశ్నించి వాళ్ళు తెలుసుకొన్న దానికి తుది మెరుగులు దిద్దుతాడు గురువు.


దాంతో బాలరాజు  శిష్యులకు కేవలం బోధన చేయడమే కాకుండా వారిని స్వతంత్రం గా ఆలోచించనివ్వాలి అని తెలుసుకున్నాడు..



🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️


 ఆచార్యాత్ పాదమాదత్తే, పాదం శిష్యః స్వమేథయా ।

 పాదం సబ్రహ్మచారిభ్యః,

పాదం కాలక్రమేణ చ ॥


గురువు శిష్యునికి అందించే జ్ఞానము ఒక పావు భాగము మాత్రమే. శిష్యుడు సొంత తెలివి తేటలతో నేర్చుకొనేది మరో పావు భాగం. ఇక సమవయస్కులతో నేర్చుకొనేది మరొక పావు భాగం. మిగతా పావు భాగాన్ని కాలక్రమేణా అనుభవాలతో నేర్చుకొని పరిపూర్ణుడవుతాడు

*ఓం నమః శివాయ*


*సేకరణ: వాట్సాప్*

రామాయణానుభవం_ 113*

 🌹 *రామాయణానుభవం_ 113* 


*తతోరావణ నీతాయాః సీతాయాః శత్రు కర్శనః* 

*ఇయేష పదమన్వేష్టుం। చారణా చరితేపథి* .


జాంబవంతుని ద్వారా స్తోత్రము చేయబడి, వానరులందరికి తన సామర్ధ్యాన్ని వివరించిన తరువాత శత్రుహంత అయిన హనుమచారణులనే దేవగాయకులు సంచరించే ఆకాశమార్గం ద్వారా వెళ్లి రావణుని చేత అపహరింపబడి, నిర్బంధింపబడిన సీతాదేవి ఉన్న స్థలాన్ని వెతుకాలని సంకల్పించాడు.


*దుష్కరం నిష్ప్రతిద్వంద్వం చికీర్షన్ కర్మ వానరః* చేయసాధ్యం కానిది, సాటిలేనిది అయిన సాహసానికి పూనుకున్నాడు.

అబోతు కోడెవలె ధైర్యం తో తల ఎత్తి నిలి చాడు....


సింహము వంటి ఆయన గంభీర రూపానికి భయపడి పక్షులు పారిపోయాయి, మృగాలు మరణించాయి. ఆయన మడుగులో స్వైర విహారం చేస్తున్న మత్త గజము వలె కనబడుతున్నాడు.


తాను నిర్వహించబోయే కార్యము సిద్ధించడానికి హనుమ సకలలోక సాక్షియైన సూర్యునికి, మూడు లోకాల ప్రభువైన మహేంద్రునికి, తన తండ్రి అయిన వాయుదేవునికి, సృష్టికర్త అయిన బ్రహ్మదేవునికి మనసారా ప్రణమిల్లాడు.


పర్వదినాలలో సముద్రము ఉప్పొంగినట్లు, రామకార్యసిద్ధి కొరకు హనుమ పొంగిపోతున్నాడు.


ఇక ఆ పర్వతం పై నుండి ఆకాశంలోకి ఎగురాలనుకొన్నాడు.

 ఆ కొండను తన కాళ్లతో చేతులతో బలంగా అదిమాడు. ఆ కొండ కొంత కదిలింది. ముందుగా చెట్ల పూలన్ని జలజల రాలాయి. ఏనుగు తొండాన్నుండి కారే మదధారలవలె ఆ కొండనుండి రంగు రంగుల ధారలు స్రవించసాగాయి.

 నల్లని మనశ్శిలలు కొండనుండి దొరలి క్రింద పడసాగాయి. 


హనుమ మరింత గట్టిగా కొండను నొక్కాడు. ఆ కొండ గుహలలోని జంతువులు ఆ ఒత్తిడిని తట్టుకోలేక ప్రాణభయంతో బిగ్గరగా అరవసాగాయి.


 బిలాలలోని సర్పాలు విషాన్ని వెడలగ్రక్కుతూ ఆ పర్వత శిలలను కాటువేయసాగాయి. 


ఆ పర్వతముపై విద్యాధరులు తమ తరుణులతో విలాసంగా మధ్యపానం చేస్తున్నారు. ఆకస్మికంగా జంతువుల అరుపులు, పడిపోయే కొండ రాళ్లను చూచి ఆ పర్వతము బ్రద్దలవుతున్నదనే భయంతో ఎక్కడి వస్తువులను అక్కడే వదలి ఆకాశంపైకి ఎగిరి ఆశ్చర్యంతో చూడసాగారు.


ఆ మహాపర్వతం పైనున్న మహానుభావులైన మహర్షులు “రామ కార్యార్థమై హనుమ కొండంత శరీరంతో నూరు యోజనాల విశాలమైన సముద్రాన్ని దాటబోతున్నాడ”ని తెలిపారు.


హనుమ తన శరీరాన్ని యోగాభ్యాస వశం చేశాడు, చేతులను కదలకుండా బిగించి, నడుమును సన్నగా చేసి, మెడను సంకోచింప జేసి ఎగరడానికి వీలుగా పాదాలను ముడిచి యోగ నియమాలను పాటించాడు.......


** 

బయల్దేరడానికి సిద్ధమై వానరవీరులందరూ వినేలా ఇలా ప్రకటించాడు.


*యధా రాఘవనిర్ముక్తః శరః శ్వసనవిక్రమః* *గచ్ఛేత్తద్వద్గమిష్యామి లఙ్కాం* |*రావణపాలితామ్*


రామబాణంలా వాయువేగంతో రావణపాలితమైన లంకకు వెళ్ళి వెదుకుతాను. అక్కడ సీత కనబడకపోతే అదే వేగంతో స్వర్గానికి వెళ్ళి వెదుకుతాను. అక్కడా సీత కనబడకపోతే. ఏమాత్రం అలసట లేకుండా లంకకు వచ్చి రావణుణ్ణి బంధించి, సీతతో సహా తెస్తాను. ఎలాగైనా సీతను తీసుకునే వస్తాను. ఆమె కనబడకపోతే రావణుడితో సహా లంకను పెల్లగించి. తీసుకు వస్తాను. అనుకున్న కార్యం సాధించి తీరాను." మనస్సునుంచి ఇతర ఆలోచనలు దూరం చేసాడు. సముద్రలంఘనం మీదనే బుద్ధి ఏకాగ్రం చేసి మహేంద్రపర్వతం నుంచి గాలిలోకి ఎగిరాడు.


ఆ మహాకపి తొడల వేగానికి పర్వతం మీద ఉన్న వృక్షాలు కూకటివేళ్ళతో భూమిని పెకలించుకుని బయటకు వచ్చి కొమ్మలన్నిటినీ కిందకు ముడిచి పెట్టుకుని, ఆయనవెంట గాలిలోకి ఎగిరాయి.


సారవంతమైన కొన్ని వృక్షాలు, రాజును సాగనంపే సైన్యంలా పరిమితదూరం ఎగిరి సముద్రంలో పడ్డాయి.


తేలికపాటి చెట్లు, ప్రియబంధువును సాగనంపేవారిలా చాలాదూరం ఎగిరి సముద్రంలో పడ్డాయి.


ఆ వృక్షాలకు ఉన్న పుష్పాలు రాలి, గాలికి పైకిలేచి హనుమంతుడి శరీరమంతా అలంకరించినట్లు అంటుకున్నాయి.


కుప్పించి ఎగిరిన పర్వతమంత మహాకపి, ఆ కపి వెనుక గాలిలోకి లేచిన విశాలమైన వృక్షసమూహాలు, వాటినుండి రాలి అయస్కాంతానికి తగులుకున్న ఇనుపరజనులా హనుమంతుడి శరీరానికి తగులుకున్న పుష్పాలు- అదో మహాద్భుతదృశ్యమై కనబడింది.


గుండ్రంగా, పచ్చగా ఉన్న ఆ మహాకపినేత్రాలు ఆకాశంలో సూర్యచంద్రులు ఏకకాలంలో, ఒకే కాంతితో ఉదయించినట్లున్నాయి. వృత్తాకారంలో ఉన్న తోకతో హనుమంతుడు ఆకాశంలో గూడుకట్టిన సూర్యుడిలా ఉన్నాడు.


ఆయన వేగానికి, బాహుమూలాలనుండి వస్తున్న గాలి చేసే చప్పుడు మేఘగర్జనలా ఉంది. మేఘమండలంలో ఉన్న మేఘాలను లాక్కుపోతున్నాడా అనిపించేలా నీలిమేఘాలన్నీ ఆయనను అనుసరించి కదిలాయి.....

*

[హనుమ తనను *యధా రాఘవ నిర్ముక్త శరః* 

రాముడు వదిలిన బాణం గా చెప్పుకొన్నాడు. ఇది కర్మయోగము యొక్క మూల సూత్రం. రాముని బాణం రాముని యొక్క పనిముట్టు.


రాముడు తన పనికై వినియోగించుకొనును. అపుడు రాముడు వేగముతో లాగి వదలగా రాముడు కల్పించిన వేగమే దాని వేగముగా ఆ బాణము పోవును; మధ్యలో ఆగదు. లక్ష్యమును చేరును.


 హనుమ తన్ను ఆ బాణముతో పోల్చుకొనుచున్నాడు. రాముని బాణము ఎట్లు సహజమగు వేగములేనిదో నేనును అంతే! రామునిపనిమీద రాముడు పంపగా రామునివేగము నా వేగమై పోవుదును గాని ఇది నా శక్తి కాదు. భగవత్పారతంత్ర్యమును భావించుకొనును....]

స్వచ్ఛమైన అశ్వగంధ

 అశ్వగంధ చూర్ణం ఉపయోగాలు - 


    కొంతకాలం క్రితం అశ్వగంధ గురించి కొన్ని వివరాలు మీకు అందించాను. ఈ మధ్యకాలంలో   అశ్వగంధ గురించి మరింత విలువైన సమాచారం తెలుసుకున్నాను . వీటిలో చాలా వరకు నేను నా పేషెంట్స్ కి ఇచ్చినప్పుడు కొన్ని ఇతర సమస్యలు తీరడం నా దృష్టికి వచ్చింది.  ఇప్పుడు నా స్వానుభావాలు మరియు కొన్ని అత్యంత పురాతన గ్రంథ పరిశోధనలో నాకు లభ్యమైనవి కూడా మీకు వివరిస్తాను . 


 స్వచ్ఛమైన అశ్వగంధ తయారీ విధానం - 


      మెట్టభూములు మరియు అడవులలో లభ్యమగు మంచి ముదురు పెన్నేరు గడ్డలను తెచ్చి మట్టి , ఇసుక , దుమ్ము వంటి వ్యర్థపదార్థాలు లేకుండా శుభ్రపరచుకొని నీడ యందు ఎండించవలెను . పూర్తిగా ఎండిన తరువాత  కత్తితో ముక్కలుగా కొట్టి ఒక గిన్నెలో వేసి అవి మునుగునంత వరకు దేశి ఆవుపాలు పోసి సన్నటిసెగపైన పాలు ఇగురునంత వరకు ఉడికించవలెను . అలా ఉడికించిన తరువాత గడ్డలను బాగుగా ఎండించవలెను . ఆ దుంపల యందు తడి పూర్తిగా ఆరిపోయేంత వరకు ఎండించవలెను . లేనిచో ఆ దుంపలకు బూజు పట్టును . ఇలా పూర్తిగా ఎండిన దుంపలను మరలా ఉడికించి ఎండించవలెను . ఇలా మొత్తం 11 సార్లు చేసి ఆ తరువాత బాగుగా ఎండించి చూర్ణం చేసి వస్త్రగాలితం చేసుకుని వచ్చిన మెత్తటి చూర్ణాన్ని తడి తగలకుండా జాగ్రత్తగా నిలువచేసుకోవలెను . 


 మోతాదు - 


     2 నుంచి 3 గ్రాముల మోతాదులో ఉదయము మరియు సాయంత్రం భోజనానికి అరగంట ముందు ఆయా సమస్యను బట్టి వైద్యులు సూచించిన అనుపానంతో వాడవలెను . 


       అశ్వగంధ 7 సార్లు శుద్ది చేయవలెను అని చెప్పుదురు . 11 సార్లు శుద్ది చేసిన ప్రశస్తముగా ఉండును . మరియు బలంగా పనిచేయును . 


  ఔషధోపయోగాలు  - 


 *  శరీరానికి అమితమైన బలాన్ని ఇచ్చును . శుష్కించు శరీరం కలవారు దీనిని వాడుట వలన శరీరానికి కండపట్టి బలంగా తయారగుదురు . 


 *  నిద్రలేమితో బాధపడువారికి ఈ అశ్వగంధ అత్యంతద్భుతముగా పనిచేయును . అశ్వగంధ ప్రధానముగా నరాల మీద పనిచేసి నరాలకు బలాన్ని చేకూర్చును . దీనిని వాడుట వలన ప్రశాంతమైన నిద్ర లభించును . 


 *  క్షయరోగముతో ఇబ్బంది పడువారికి ఇది అత్యంత బలవర్ధకమైనది . ఊపిరితిత్తులకు బలాన్ని చేకూర్చుటయే కాక శరీర రోగనిరోధక శక్తి పెంచుటలో అత్యంత వేగముగా పనిచేయును . 


 *  విరిగిన ఎముకలు త్వరగా కట్టుకొనుటకు ఈ అశ్వగంధ బాగుగా పనిచేయును . 


 *  స్త్రీలు మరియు పురుషలలో కలుగు వంద్యదోషాలను నివారించును . 


 *  రక్తము నందలి దోషములను పోగొట్టును . 


 *  కీళ్లనొప్పులు నుంచి ఉపశమనం కలిగించును . 


 *  నాడీవ్యవస్థ కు చెందిన వ్యాధుల పైన బాగుగా పనిచేయును . 


 *  పక్షవాతం మొదలగు వాతవ్యాధుల యందు దీని పనితీరు అద్బుతముగా ఉంటుంది . 


 *  మెదడులోని న్యూరాన్ల పైన దీని ప్రభావం ఉంటుంది. దీనిని వాడుట మూలన మెదడు చురుకుగా పనిచేయును . జ్ఞాపకశక్తి మెరుగుపడును . 


 * అగ్నిమాంద్యము , మలబద్దకం నివారించును .


 *  బాలింతలకు వచ్చు సూతికారోగము నివారించును . 


 *  శరీరంలోని టాక్సిన్స్ బయటకి పంపి శరీరాన్ని శుద్ది చేయును . 


 *  కఫ సంబంధ దోషములైన శ్వాస ( ఆయాసం ) , శోష మొదలైన వాటిని నివారించును . 


 *  గ్రంధి సంబంధ రోగాలు ఉదాహరణకి థైరాయిడ్ వంటి వాటిపై అమోఘముగా పనిచేయును . 


 *  గుండెసంబంధ సమస్యల కలవారు అశ్వగంధ వాడవలెను . 


 *  కొంతమంది పిల్లలు శారీరకంగా ఎండుకుపోయి ఉంటారు. అటువంటివారికి తేనె అనుపానంగా ఈ అశ్వగంధ చూర్ణమును ఇచ్చిన మంచి కండపట్టి పుష్టిగా తయారగుదురు . 


 *  వృద్ధాప్యము నందు వచ్చు సమస్యలను ఎదుర్కోవడానికి అశ్వగంధ నిత్యము సేవించవలెను . 


 *  స్త్రీల శారీరక బలహీనతని పోగొట్టును . ప్రదర రోగములను నివారించును . 


 *  మూర్చరోగులకు ఇది వరం వంటిది . 


 *  స్త్రీలలో కలుగు బహిష్టు సంబంధ సమస్యలను నివారించును . 


 *  స్త్రీ మరియు పురుషులలో హార్మోన్స్ మీద ఇది చాలా అద్బుతముగా పనిచేయును . 


      పైన చెప్పిన అనేక ఉపయోగాలు మాత్రమే కాకుండగా అనేకమంది HIV వ్యాధిగ్రస్తులకు ఇది నేను ఇవ్వడం జరిగింది. దీనిని ఉపయోగించిన తరువాత వారిలో CD4 కౌంట్ నందు మార్పు కనిపించింది. అంతకు ముందు ఉన్నటువంటి నీరసం , నిస్సత్తువ తగ్గిపోయాయి.  ఇలా మరెన్నో వ్యాధులపైన దీనిని ప్రయోగించాను . అద్బుతమైన ఫలితాలు వచ్చాయి . 


         కరోనా చికిత్సలో కూడా ఇది చాలా అద్బుతముగా పనిచేసింది . నేను ఎంతో మంది రోగులకు ఇచ్చాను . కరోనా నుంచి కోలుకొనిన తరువాత వచ్చే దుష్ప్రభావాలనుంచి కాపాడుకోవడానికి ఇది వాడుట అత్యుత్తమం . 


      మీకు ఇక్కడ మరొక్క ముఖ్యవిషయం చెప్పవలెను . నేను మామూలుగా ఆయుర్వేద షాపుల్లో దొరికే శుద్ధిచేయని మామూలు అశ్వగంధ చూర్ణము ఉపయోగించినప్పటికంటే నేను పాలల్లో ఉడకబెట్టి తయారుచేసిన అశ్వగంధ చూర్ణం వాడుట వలన ఫలితాలు అతి తక్కువ సమయములో వేగముగా ఫలితాలు వచ్చాయి . ఈ అశ్వగంధ చూర్ణం వాడువారు పాలు , పెరుగు , వెన్న , పప్పు తరచుగా వాడవలెను . తాంబూలం , మద్యము , కర్బుజా పండు , పనసపండు , చల్లనినీరు , చద్ది అన్నం నిషిద్దం .