తే.గీ.
దురద రోగిని దైవము వరము గోరు
మనగ,గోళ్ల బెంచు మనుచు నతడు గోరె!
మందభాగ్యుల తీరిది మహిని గనుము!
హితము జెప్పెద వినుము సుహృద్వరేణ్య!
------కోడూరి శేషఫణి శర్మ
ప్రపంచ కవులకు స్వగతం. మీ కవితలను ఇక్కడ పబ్లిష్ చేయవచ్చు. మీరు ముందుగా follow by Email బాక్సులో మీ మెయిల్ అడ్రసుని నింపి submit చేయండి. తరువాత followers ని click చేసి follower అవ్వండి. తరువాత మీ రచనను కొత్త కవులు పేజీలో అక్కడ సూచించిన విధంగా పంపండి. .
తే.గీ.
దురద రోగిని దైవము వరము గోరు
మనగ,గోళ్ల బెంచు మనుచు నతడు గోరె!
మందభాగ్యుల తీరిది మహిని గనుము!
హితము జెప్పెద వినుము సుహృద్వరేణ్య!
------కోడూరి శేషఫణి శర్మ
*ఆటపట్టు (జాతీయం) :*
ఆట = నాట్యం
పట్టు = స్థానం
▪️ నాట్యానికి స్థానము అని అర్థం.
పూర్వకాలంలో ప్రజల ప్రధాన వినోద సాధనం నాట్యం. తోలుబొమ్మలాటలు, వీధి నాటకాలు సామాన్య ప్రజల వినోద సాధనాలైతే..... నాట్యం ఉన్నత కుటుంబాల వారి వినోద మార్గం.
రాజ్యం నలుమూలల నుండి ఎంపిక చేసిన నాట్య కత్తెలను రాజుగారు కళా కేంద్రం అని పిలవబడే ఒక ప్రదేశంలో ఉంచేవారు. ఆ రాజ్యము సంస్కృతీ సంప్రదాయాలను ప్రతిబింబించే అన్ని రకాల నాట్యాలు ఇక్కడ ప్రదర్శితం అయ్యేవి. ఒకే నాట్యాన్ని పదే పదే చూస్తే.... కాస్త విసుగు అనిపిస్తుంది. విభిన్న రకాల నాట్యం చూడటం వలన రాజుకు, ఉన్నత వర్గాల వారికి కొత్తగా అనిపిస్తుంది. చూడాలనే ఆసక్తిని రేకెత్తిస్తుంది. ఇలాంటి నాట్య కేంద్ర నిర్వహణ రాజుగారికి ఆర్థికంగా భారమైనా .... నాట్య కేంద్రాన్ని పోషించడం రాజు గారి గౌరవానికి, కళాదృష్టికి నిదర్శనంగా ఉండేది. అలాంటి సకల నాట్యాలకు అనువైన ప్రదేశమే ఆటపట్టు. ఇది సాధారణ అర్థం. కానీ ప్రజలు ఈ సాధారణ అర్ధాన్ని మరుగుపరిచి, ఇప్పుడు 'నాట్యానికి నెలవు' అనే అర్థంలోనే కాకుండా "ఏదైనా ఒక అంశం ఫలానా చోట విరివిగా లభిస్తుంది" అని చెప్పేటప్పుడు *ఆటపట్టు* అనే జాతీయాన్ని వాడుతున్నారు.
ఉదా : భారతదేశము కుటుంబ వ్యవస్థకు ఆటపట్టు.
అహం బ్రహ్మాస్మి: నేనే బ్రహ్మను
'అహం బ్రహ్మ అస్మి' అంటే నేను 'బ్రహ్మ' అగుగాక అని, బ్రహ్మ జ్ఞానం సంపాదించాలని అంతరార్థం. నేనే బ్రహ్మను అంటే నాలోనే 'బ్రహ్మ' ఉన్నాడనే భావన రావాలి. నేనే బ్రహ్మను, నేను ఏం చేసిన అది బ్రహ్మాజ్ఞ అంటే కుదరదు!
మనం చేసేది మనసా, వాచా, కర్మణా అంతరాత్మ చెప్పిందే అయితే నిశ్చయంగా మనం 'బ్రహ్మమే"! దీని ప్రకారం బ్రహ్మ ఎవరో కాదు, నేనే అని ఈ ఉపనిషత్తు వాక్యం చెబుతుంద. ఇక మరో మహావాక్యం తత్వమసి. తత్వం అంటే నువ్వు, నువ్వు కూడా బ్రహ్మవే అని దీని అర్థం.
సామవేదంలోని చాందోగ్యోపనిషత్తు నుంచి వచ్చిన వాక్యం ఇది. మరో మహత్తర వాక్యం 'అయమాత్మా బ్రహ్మ'. అంటే ఈ ఆత్మే బ్రహ్మ అని అర్థం.
అధర్వణవేదంలోని ముండకోపనిషత్తు నుంచి ఈ వాక్యం వచ్చింది. ఈ మహత్తర వాక్యాల సారాన్నంతా మళ్లీ ఒకే వాక్యంలో చేర్చి చెప్పటం జరిగింది. అదే 'సర్వం ఖల్విదం బ్రహ్మ'. అంటే ఈ సృష్టిలో ఉన్నదంతా బ్రహ్మమే తప్ప మరేమీ కాదు!ఈ వాక్యాల సారం అర్థమయితే చాలు, భగవంతుడు మరెక్కడో లేడు-మన అందరిలోనూ, అన్ని జీవుల్లోనూ ఉన్నాడనే భావన వస్తుంది.
మన అంతరంగంలో అన్వేషిస్తే దీనికి సరైన సమాధానం లభిస్తుంది. బయట వెతికితే ఏమీ లభించదు .శంకరులు "అహం బ్రహ్మస్మి" అన్నారు. వెంటనే శిష్యులు కూడా "అహం బ్రహ్మస్మి" అన్నారు. మరి కొందరు అహంకారులు "అహం పరబ్రహ్మస్మి" అన్నారు.
ఇంకా కొందరు అహంకారులు "అహం పరాత్పర బ్రహ్మస్మి" అన్నారు. అనగా శంకరులు నేను బ్రహ్మము అనగా కొందరు శిష్యులు నేను బ్రహ్మమునే అనియు, మరి కొందరు శిష్యులు నేను బ్రహ్మము కన్న అధికమైన పరబ్రహ్మము అనియు, నేను పర బ్రహ్మము కన్న ఇంకా అధికమగు పరాత్పర బ్రహ్మమనియు అన్నారు. బ్రహ్మమగు శంకరులు చెప్పిన విషయాన్నిఎవరూ గ్రహించలేక పోయారు! ఈ తత్వసారాన్ని తెలుసుకోవాలంటే అహంకారాన్ని పూర్తిగా వదలివేయాలి! చాలా మంది అహంకారం, గర్వం ఒకటే అని అనుకుంటారు . గర్వం వేరు, అహంకారం వేరు. 'అహం' అన్నది 'నేను' అనే వ్యక్తిత్వ భావన ఎక్కువైతే వచ్చేది.
'నేను' కు మూలంలోకి వెళ్ళితే తప్ప 'అహం' అసలు స్వభావం తెలియదు.
' అహం బ్రహ్మస్మి ' అన్నారు పెద్దలు.' అహం ' అంటే 'ఆత్మ' అని వారి భావన. నిర్గుణబ్రహ్మస్థితి కలిగి 'సోహం' మంత్రమును శ్వాస, నిశ్వాసాల ద్వారా నిరంతరము జపించేవారికి ఆత్మతత్త్వము తెలుస్తుందని కొందరి అభిప్రాయం. 'సోహం' అనగా 'అదే నేను' అని అర్థం. 'అహం బ్రహ్మస్మి' అనే మహావాక్యానికి ఇది మంత్రరూపం. ఇది ప్రతివ్యక్తిలోను వారికి తెలియకుండా ఉఛ్వాసలో 'సో' అని, నిశ్వాసలో 'హం' అని నిత్య సాధన జరుగుతుంటుంది. దీన్నే'అజపాగాయత్రి' అని అంటారు.
పూర్వం కణాదుడనే తత్వవేత్త ఉండేవాడు. అతను ప్రతి పదార్థం అణువులతో నిర్మితమై ఉంటుందని, పదార్థాన్ని కోసినప్పుడు అణువులు విడిపోవడం వల్లే పదార్థం ముక్కలవుతుందని భౌతిక నిజాన్ని ఊహించాడు కానీ అతను కూడా భౌతికతకి వ్యతిరేకమైన ఆత్మని నమ్మాడు. ప్రతి పదార్థంలో ఆత్మ ఉంటుందని, పదార్థాన్ని కోసినప్పుడు
ఆత్మ కూడా ముక్కలవుతుందని నమ్మాడు. గ్రీక్ తత్వవేత్త ఆరిస్టాటిల్ ఆత్మకి కూడా చావు ఉంటుందని నమ్మాడు.
పదార్థం నశించినప్పుడు ఆత్మ కూడా నశిస్తుందని నమ్మాడు. ఆత్మని పదార్థం నుంచి వేరు చెయ్యలేము అని సూత్రీకరించాడు. "తానూ, దైవమూ ఒక్కటేనని, అలాంటి ప్రజ్ఞ కలిగినప్పుడు ఆ మనిషి దివ్యాత్మని అనుభవిస్తాడనే " ఆత్మ జ్ఞానాన్ని మహనీయులు కొందరు చెప్పారు..
ప్రతి మనిషిలోను భగవంతుడు కొలువై ఉంటాడు. అందుకే అన్నారు "అహం బ్రహ్మస్మి" అని !కానీ చాలా కొద్దిమంది మాత్రమే ఈ విషయాన్ని తెలుసుకుంటారు. సాధన చేసి అంధకారాన్ని పారద్రోలాలి! శ్రీకృష్ణ భగవానుడు, భగవద్గీతలో, ఆత్మ సిద్ధాంతాన్ని గురించి చెప్పాడు. ఆత్మ నాశనం కానిదని, శస్త్రం ఏదీ ఛేదించలేనిదని , అగ్ని దహించలేనిదని, నీరు తడపలేనిదని, వాయువు ఆర్పలేనిదని అని వివరించాడు.
అహం అనే మాటని "నేను" గా అనువదిస్తే వచ్చే అర్ధం నేను బ్రహ్మని (ఇక్కడ బ్రహ్మ అనే మాట త్రిమూర్తుల్లో బ్రహ్మ కాదు, పరమ చైతన్యం) అని అర్ధం! కాబట్టి ప్రతి ప్రాణి ఆ చైతన్యమే! దేవుడు మనలోనే ఉన్నాడు, మనం దేవుడిలో ఉన్నాం. ఆ దివ్య చైతన్యంలో మనం కూడా భాగం అవ్వటం గురించి సాధన చేయాలి.
ఆత్మ ఒక్కటే. అది పరిమితమైతే అహంకరణం, పరిమితం కానప్పుడు అది అనంతము, సత్యమూనూ అని శ్రీ రమణులు చెప్పారు. ''నేనెవ్వరు?'' అన్న విచారణా మార్గం సాధకులకు తెలియాలి. శివుడికి లింగభేదం లేదు. తనలో అటువంటి భేదాన్ని సృష్టించబోయిన మన్మధుడిని దహించాడు. కాముడిని జయించాడు. శివుడు అవసరమైతే విషం పుచ్చుకుంటాడు. సన్యాసిగా మన్మధుడిని కాల్చినవాడే, పార్వతిని వివాహమాడి
సంసారి అయ్యాడు.
మన్మధుడిని మళ్ళీ బ్రతికించాడు. ఈ భిన్న తత్వాల ఏకత్వమే అర్థనారీశ్వర తత్వం. శివుడు తన దేహాన్ని (ప్రకృతిని) ఆలిగా చేసుకున్నాడు. శివపార్వతుల (దేహత్మల) కలయికే మానవుడు. అంతా నేనే అయినపుడు, ఇతరులను హింసించడమంటే, నన్ను నేను హింసించుకోవడమే అవుతుంది!
పూర్ణ మదం: పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే
పూర్ణస్య పూర్ణ మాదాయ పూర్ణమే వా వశిష్యతే.
సాధనాత్ సాధ్య తే సర్వం
సమర్పణ
మారేపల్లి ఉదయ భాస్కర శర్మ
*పూత రేకులc దిన్న వెంటనే పుల్లనైన వటందురే*
ఈ సమస్యకు నా పూరణ.
"చేతగాదనె వండివార్చను"-చిట్టి చెప్పెను చిన్నగా
మూత బెట్టిన యట్ట డబ్బను ముందు నుంచెను మేతకై
పాత బడ్డవి మాసమయ్యెను పంచుకొన్నవి యందరున్
పూతరేకులc దిన్న వెంటనే పుల్లనైన వటందురే.
అల్వాల లక్ష్మణ మూర్తి.
*2165*
*కం*
మనసుండగ మార్గంబులు
ననేకములనుండు నిలను నందుత్తమమున్
కనుగొని నడయంగవలయు
పనులను నెరవేర్చనెంచ పదపడి సుజనా.
*భావం*:-- ఓ సుజనా! మనసుంటే అనేక మార్గములు దొరుకుతాయి,పనులను నెరవేర్చే ఆసక్తి గలవారు అందులోని గొప్ప (మంచి) మార్గము ను గుర్తించి నడవవలెను(ముందు కు సాగవలెను).
*సందేశం*:-- పనిచేసే ఆసక్తి ఉన్న వారికి అనేక మార్గాలు ఉంటాయి, అందులో అనువైన మంచి మార్గమును ఎంచుకొని పని నెరవేర్చవచ్చు. మనసుంటే మార్గములనేకములుండును. అంటే మనస్సే ప్రధానం.
*** *కొంపెల్ల శ్రీనివాస శర్మ*
*2165*
*కం*
మనసుండగ మార్గంబులు
ననేకములనుండు నిలను నందుత్తమమున్
కనుగొని నడయంగవలయు
పనులను నెరవేర్చనెంచ పదపడి సుజనా.
*భావం*:-- ఓ సుజనా! మనసుంటే అనేక మార్గములు దొరుకుతాయి,పనులను నెరవేర్చే ఆసక్తి గలవారు అందులోని గొప్ప (మంచి) మార్గము ను గుర్తించి నడవవలెను(ముందు కు సాగవలెను).
*సందేశం*:-- పనిచేసే ఆసక్తి ఉన్న వారికి అనేక మార్గాలు ఉంటాయి, అందులో అనువైన మంచి మార్గమును ఎంచుకొని పని నెరవేర్చవచ్చు. మనసుంటే మార్గములనేకములుండును. అంటే మనస్సే ప్రధానం.
*** *కొంపెల్ల శ్రీనివాస శర్మ*
🍃🌸🍃 *కృతజ్ఞత*
“కృతజ్ఞత ”అంటే ఒకరు మనకు చేసిన మేలును మరచిపోకుండా ఉండటం. మనం ఒక ప్రమాదకరమైన స్థితిలో ఉన్నప్పుడో, ఏదో ఒక సహాయం మనకు అవసరమైనపుడో, మనం అడిగితే సహాయపడేవారు కొందరుంటారు.
మనం అడగకపోయినా మనకు అవసరమైన ఉపకారం చేసే ఉదారులు కొందరుంటారు. వీరికెప్పుడూ మనం కృతజ్ఞులమై ఉండాలి. కృజ్ఞత అనేది నాగరక సంస్కారం. కృతఘ్నత అనాగరక లక్షణం.
వాల్మీకి రాముణ్ణి వర్ణిస్తూ “ధర్మజ్ఞశ్చ , కృతజ్ఞశ్చ” అన్నాడు. సీతమ్మను అపహరించుకొనిపోతున్న రావణునితో పోరాడి ,ఆ సమాచారాన్ని రామునికి చెప్పి ప్రాణాలు కోల్పోయిన జటాయువుకు రాముడు కృతజ్ఞతతో అంతిమ సంస్కారం చేశాడు.
రావణసంహారంలో తనకు తోడ్పడిన వానరులకోసం - ఈ వానరులు ఎక్కడ ఉంటే అక్కడ త్రికాలాలలోనూ మధురఫలాలను ఇచ్చే వృక్షాలు ఉండేటట్లు, అక్కడి నదులలో నిరంతరం స్వాదు జలం ప్రవహిస్తూ ఉండేటట్లు వరం ఇవ్వ వలసిందిగా రాముడు ఇంద్రుణ్ణి కోరాడు.ఇదీ ఆయన కృతజ్ఞతా లక్షణం.
మహా భారతంలో - దగ్ధమైన లక్క గృహంలోంచి ప్రాణాలతో బయటపడి, ఏకచక్రపురంలో ఒక బ్రాహ్మణుని ఇంట్లో, తన కుమారులతో తలదాచుకుంటున్నకుంతి , తమకు ఆశ్రయం ఇచ్చిన ఆ బ్రాహ్మణునకు ఒక కష్టదశ సంభవించగా, అతనికి ప్రత్యుపకారం చేయటం తన ధర్మమని భావించిన సందర్భంలో - “ఒకరు తమకు చేసిన ఉపకారాన్ని గ్రహించటం పుణ్యం, దానికి సమమైన ప్రత్యుపకారాన్ని చేయటం మధ్యమం, వారు చేసిన ఉపకారానికి మించిన ప్రత్యుపకారం చేయటం ఉత్తమం” అంటుంది.
“ఏరు దాటాక తెప్ప తగలెయ్యటం” – అనే చందంగా కాకుండా, మన ఉనికికి , ఉన్నతికి కారకులైనవారి పట్ల మనం కృతజ్ఞులమై ఉండాలి. ఒకనాడు మనకు మేలుచేసిన మనిషి , విధివశాత్తూ ఒక కష్టంలో పడినట్టు మనకు తెలిస్తే -అతనియందు సకాలంలో, అవసరానికి తగినట్టుగా స్పందించకపోతే అది కృతఘ్నత ఔతుంది. ఈ విషయాన్ని మహాభారతం ఆనుశాసనిక పర్వంలో అంపశయ్యపై ఉన్న భీష్ముడు ఒక కథారూపంలో ధర్మరాజుకు చెప్పాడు.
ఒక బోయవాడు వేటకు వెళ్ళి "ఘనతర విషదగ్ధ శరం" తో ఒక మృగాన్ని కొట్టబోయాడు. అది గురి తప్పి ఒక చెట్టును తాకింది. పువ్వులతో, కాయలతో పచ్చగా ఉన్న ఆవృక్షం విష శరాఘాతం వల్ల నిలువునా శుష్కమైపోయింది. ఆ చెట్టే ఆశ్రయంగా ,దానితొర్రలో నివాసముంటున్న ఒక మహాశుకం దానిని వదలలేక దానిమీదనే ఉండిపోయింది.
దీనిని గమనించిన ఇంద్రుడు మానుషరూపంలో దాని దగ్గరకు వెళ్ళి –
"ఓ కీరమా! ఈ వృక్షం బెండువారిపోయింది. ఫలసంపదగల అనేక ఇతర వృక్షాలు ఈ అరణ్యంలో ఉండగా, ఇంకా దీనినే అంటిపెట్టుకున్నావెందుకు?" అని అడిగాడు.
అపుడాశుకం "ఈ చెట్టు తాను మధుర ఫలాలతో నిండి ఉన్న సమయంలో నాకు ఆశ్రయం ఇచ్చింది.ఈ వేళ ఇది ఎండిపోయిందని నేను దీనిని వదలి వెళ్ళిపోవటం కృతఘ్నత కాదా అనిమిషనాథా!" అంది. తాను మానుషరూపంలో వచ్చినా "పురాకృత సంజనిత విశేషము" చేతనే ఈ మహా శుకం తనను ఇంద్రునిగా పోల్చుకోగలిగిందని ఆశ్చర్య పోయి - "నీ మాటలకు మెచ్చాను, నీకేంకావాలో కోరుకో" అన్నాడు ఇంద్రుడు.
అపుడామహాశుకం "ఈ వృక్షానికి మేలుచెయ్యి చాలు" అంది. ఇంద్రుడు సంతోషించి అమృత సేచనంతో ఆ వృక్షానికి పూర్వం కంటే ఎక్కువ శోభను , ఫలసంపదను కలుగజేశాడు.
ఈ కథవల్ల ఉత్తములైన ఆశ్రితులు – ఆశ్రయ దాత క్షేమాన్ని కోరుకోవాలనీ , కృతజ్ఞత ఉత్తమ లక్షణమనీ తెలుస్తోంది. సజ్జనులు ఇతరులు తమకు చేసిన ఉపకారాన్ని మరచిపోరు..
*2164*
*కం*
ప్రతిగా స్పందించనపుడు
నతిగా వెంబడగవద్దు నతివల కెపుడున్.
మతిగల సుదతులు నిన్నట
నతమొందించగ తరిగొను నవనిన సుజనా.
*భావం*:-- ఓ సుజనా! ప్రతి స్పందన కనబరచని స్త్రీలకు అతి గా వెంటబడవద్దు. నీపై మనస్సు ఉన్న స్త్రీలు నిన్నే తనవైపు తిప్పుకోవడానికి ప్రయత్నించెదరు.
*సందేశం*:-- నీ ప్రయత్నాలు పట్టించుకొనని ఆడవారికి నీవంటే ఇష్టం లేదని తెలుసుకొనవలెను. వారి వెంటబడటం వలన లోకువగుదువు. నీవంటే ఇష్టం ఉన్న స్త్రీలు నీ చూపు చాలునని,అదే గొప్పగా భావిస్తారు.
*** *కొంపెల్ల శ్రీనివాస శర్మ*
శు భో ద యం🙏
సజ్జనులకీగుణములు
ప్రకృతి జన్యములే!!
"ఆపదలందుధైర్యగుణ మంచిత సంపదలందుదాల్మియున్
భూపసభాంతరమ్మునను బుష్కలవాక్చతురత్వ మాజిబాహాపటుశక్తియున్ యశమునందనురక్తియు
విద్యయందు వాం
ఛాపటుశక్తియువ్ బ్రకృతి జన్యగుణంబులు సజ్జనాళికిన్;
-సజ్జనపధ్ధతి-భర్తృహరి సుభాషితములు.🙏🙏🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷
*నమస్తే సదా వత్సలే మాతృ భూమే*
*కలియుగాబ్ది 5126*
*శ్రీ శాలివాహన శకం 1947 స్వస్తి శ్రీ చాంద్రమాన విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం - గ్రీష్మ ఋతువు - ఆషాడ మాసం - శుక్ల పక్షం - అష్టమి -హస్త - గురు వాసరే* (03.07.2025)
ప్రముఖ వేదపండితులు, తణుకు /తాలూకా ఇరగవరం వాస్తవ్యులు
*బ్రహ్మశ్రీ గుళ్ళపల్లి శివశర్మ ఘనపాఠీ* *(9491391009, 9440091234)* గారి నేటి వేద ఆశీర్వచనం.
.🙏🙏
భవదీయుడు
దశిక ప్రభాకరశాస్త్రి
9849795167
----------------------------------------------
*పిల్లలకి బతుకుతో పాటు భారతీయత కూడా నేర్పండి*
*"నేటి సుభాషితం"*
_(శ్రీ వాల్మీకి రామాయణం నుంచి, రోజుకొకటి)_
విషాదే మనః కార్యం
విషాదో దోషవత్తమః
విషాదో హన్తి పురుషం
బాలం క్రుద్ధ ఇవోరగః
(4.64.11)
*అర్థం:*
నిరుత్సాహం పనికి రాదు, అది అతి పెద్ద లోపం. కోపంతో ఉన్న పాము చిన్న పిల్లవాడిని చంపినట్లు ఆ నిరుత్సాహం ఒక వ్యక్తిని నాశనం చేస్తుంది.
శ్రీ ప్రయాగ రంగదాసు గారి మథుర గీతంతో శుభోదయం.
*శ్రీ రామ రక్ష సర్వ జగద్రక్ష*
ధర్మో రక్షతి రక్షితః
శుభ గురువారం.
*గుండె నిండా ఆకారమై...!!*
ఎక్కడ నీకోసం ఎదురు చూడాలి
నీ ముద్దు మాటల మైకంలో
తనువును ముంచి తేల్చాలి
మనసుకు సుఖస్నానం చేయించాలి...
నీ వొస్తావని ఆశతో నిలుచున్నాను
నడిరేయి స్వప్నంలా తలుచుకుంటూ
మధుర స్మృతులు ఆస్వాదిస్తూ
చెట్టు కొమ్మల్లో కోయిలలా కూర్చున్నాను...
రేయి మరిచిన కళ్ళలో నిస్పృహలు
నీటి మీద రూపం అదృశ్యమైతే
వెన్నెల వర్షంలో తడుస్తూ
చీకట్లో నీ రూపాన్ని ఎలా వెతకాలి..
మది నిండా నిండిన నీ అందం
నింగి సంద్రంలో వెలసిన చందనం
మరుపురాని గీతమై బాధిస్తుంటే
తనువులో నీకై అలజడి పెరుగుతుంది...
ప్రేమ గీతానికి రెక్కలు తొడిగి
చిత్తు కాగితాన్ని నింగికి విసిరితే
మబ్బుల్లో చిక్కుకొని విలపించే
విరహం వికటించి కవితలై కనిపించే..
కుంచె తీసి గీశాను నీ రూపం
ఊహకు అందని అపురూపంగా
వర్ణంలో సువర్ణ మై మెరుస్తూ
గుండె నిండా ఆకారమై నిలిచావు..
కొప్పుల ప్రసాద్
నంద్యాల
9885066235
శ్రీమద్భగవద్గీత: ఎనిమిదవ అధ్యాయం
అక్షరపరబ్రహ్మయోగం:శ్రీ భగవానువాచ:
పురుషః స పరః పార్థ భక్త్యా లభ్యస్త్వనన్యయా
యస్యాంతఃస్థాని భూతాని యేన సర్వమిదం తతమ్ (22)
యత్ర కాలే త్వనావృత్తిమావృత్తిం చైవ యోగినః
ప్రయాతా యాంతి తం కాలం వక్ష్యామి భరతర్షభ (23)
అర్జునా.. సమస్తభూతాలనూ తనలో ఇముడ్చుకుని, సకలలోకాలలో వ్యాపించి వున్న పరమాత్మను అచంచలమైన భక్తివల్లనే పొందవచ్చు. భరతవీరా.. యోగులు ఏ సమయంలో మరణిస్తే మళ్ళీ జన్మించరో, ఏ వేళ దేహం విడిచిపెడితే పునర్జన్మ పొందుతారో చెబుతాను విను.
💎🌅 *_-|¦¦|శుభోదయమ్|¦¦|-_* 🌄🪔
🪔 *_𝕝𝕝ॐ𝕝𝕝 సుభాషితమ్ 𝕝𝕝卐𝕝𝕝_* 💎
శ్లో|| *యథా ఖనన్ ఖనిత్రేణ*
*నరో వార్యధిగచ్ఛతి|*
*తథా గురుగతాం విద్యాం*
*శుశ్రూషురధిగచ్ఛతి||*
తా|| *మనుష్యుడెట్లు గునపముతో త్రవ్వి భూమి నుండి నీరు పొందునో అట్లే గురువుయందున్న విద్యను ఆ గురువుకి శుశ్రూష చేసి పొందవలెను.*
✍️🌸🌹💐🙏
🕉 మన గుడి : నెం 1161
⚜ మహారాష్ట్ర : లెన్యాద్రి
⚜ శ్రీ గిరిజాత్మజ్ గణపతి ఆలయం
💠 గిరిజాత్మజ్ అష్టవినాయక ఆలయం బౌద్ధ గుహ ప్రాంతంలో నిర్మించబడిన అష్టవినాయక ఆలయంలోని ఏకైక ఆలయం.
ఈ గుహలను గణేష్ గుఫా అని కూడా పిలుస్తారు. ఇక్కడ, గణేష్ను గిరిజాత్మజ్గా పూజిస్తారు. (పార్వతి దేవి కుమారుడు)
💠 విగ్రహం యొక్క 'గిరిజత్మజ్' పేరు 'గిరిజ' అంటే దేవి పార్వతి మరియు 'ఆత్మజ్' అంటే కుమారుడు అని వస్తుంది.
మరాఠీలో 'లేని' అని అర్థం వచ్చే గుహలు గుహలకు లెన్యాద్రి అనే పేరును పొందాయి. కాబట్టి 'గిరిజత్మజ్ లేన్యాద్రి గణపతి' అనే పేరు వచ్చింది.
💠 గణపత్య గ్రంథం గణేశ పురాణం ప్రకారం , గణేశుడు ఆరు చేతులు మరియు తెల్లటి రంగు కలిగిన మయూరేశ్వరుడుగా అవతరించాడు. అతని వాహనం నెమలి. సింధు అనే రాక్షసుడిని చంపే ఉద్దేశ్యంతో త్రేతా యుగంలో శివుడు మరియు పార్వతికి జన్మించాడు .
💠 ఒకసారి పార్వతి (గిరిజ) తన భర్త శివుడిని ఎవరి గురించి ధ్యానం చేస్తున్నావని అడిగింది.
అతను "సమస్త విశ్వానికి ఆధారమైన" గణేశుడి గురించి ధ్యానం చేస్తున్నానని చెప్పి, "గం" అనే గణేశ మంత్రంతో పార్వతిని చెప్పాడు.
💠 ఒక కొడుకు కావాలని కోరుకుని, పార్వతి లెన్యాద్రిలో 12 సంవత్సరాలు గణేశుడి గురించి ధ్యానం చేస్తూ తపస్సు చేసింది. ఆమె తపస్సుకు సంతోషించిన గణేశుడు, తాను ఆమెకు కొడుకుగా జన్మిస్తానని వరం ఇచ్చాడు. దీని ప్రకారం, హిందూ నెల భద్రపద ( గణేశ చతుర్థి రోజు)పార్వతి గణేశుడి మట్టి విగ్రహాన్ని పూజించింది, అది సజీవంగా వచ్చింది.
ఆ విధంగా, గణేశుడు పార్వతికి లెన్యాద్రిలో జన్మించాడు.
తరువాత, శివుడు అతనికి గుణేశ అని పేరు పెట్టాడు.
💠 15 సంవత్సరాలు గుణేశుడు లెన్యాద్రిలో పెరిగాడు. గుణేశుడి చేతిలో తన మరణం జరుగుతుందని తెలిసిన సింధు, గుణేశుడిని చంపడానికి క్రూరుడు, బాలాసురుడు, వ్యోమాసురుడు, క్షేముడు, కుశలుడు మరియు మరెన్నో రాక్షసులను పంపాడు, కానీ వారందరినీ అతనిచే చంపబడ్డరూ.
💠 ఆరేళ్ల వయసులో, విశ్వకర్మ గుణేశుడిని పూజించి, అతనికి పాశ (పాశం), పరశువు (గొడ్డలి), అంకుశం (కొన) మరియు పద్మ (కమలం) అనే ఆయుధాలను ప్రసాదించాడు.
ఒకసారి, చిన్న గుణేశుడు మామిడి చెట్టు నుండి గుడ్డును కొట్టాడు, దాని నుండి నెమలి ఉద్భవించింది. గుణేశుడు నెమలిని ఎక్కి మయూరేశ్వరుడు అనే పేరును స్వీకరించాడు.
తరువాత మయూరేశ్వరుడు సింధు మరియు అతని సైన్యాధిపతులను మోర్గావ్ వద్ద చంపాడు ,
అందువల్ల లెన్యాద్రిని పవిత్ర స్థలంగా భావిస్తారు.
💠 ఈ ఆలయం ఒకే రాతి కొండ నుండి చెక్కబడింది, దీనికి పర్వతంలోని 18 బౌద్ధ గుహలలో, గిరిజాత్మజ్ గణపతి ఆలయం 7వ గుహలో ఉంది. వీటిని గణేష్-లేని అని కూడా పిలుస్తారు.
💠 ఈ ఆలయంలో ఎటువంటి సహాయక స్తంభాలు లేని విశాలమైన హాలు ఉంది. ఆలయ హాలు 53 అడుగుల పొడవు, 51 అడుగుల వెడల్పు మరియు 7 అడుగుల ఎత్తు ఉంటుంది.
💠 లేన్యాద్రి కుకాడి నది వాయువ్య ఒడ్డున ఉంది. ప్రస్తుత పేరు 'లెన్యాద్రి' అంటే 'పర్వత గుహ' అని అర్థం.
ఇది మరాఠీలో 'లెనా' అంటే 'గుహ' అని మరియు సంస్కృతంలో 'అద్రి' అంటే 'పర్వతం' లేదా 'రాయి' అని అర్థం. దీనిని జీరాపూర్ మరియు లేఖన్ పర్వత్ ('లేఖన్ పర్వతం') అని కూడా పిలుస్తారు.
💠 ఇక్కడ గణేశుడి తొండం ఎడమ వైపుకు తిప్పి, తూర్పు ముఖంగా, అతని కన్నులలో ఒకటి కనిపించేలా చూడవచ్చు. ఈ చిహ్నం సిందూరంతో కప్పబడి ఉంది మరియు గుహ యొక్క రాతి గోడపై నేరుగా రూపొందించబడింది.
💠 శ్రీ గిరిజత్మజ్ లేన్యాద్రి గణపతి గుహలలో చెక్కబడిన ఏకైక గణేష్ ఆలయం. లెన్యాద్రి ఒక పురాతన పురాణాన్ని కలిగి ఉంది, ఇది పాండవులు వారి 13వ సంవత్సర వనవాసంలో అజ్ఞాతవాసంలో నివసించినప్పుడు, వారు ఈ గుహలను కేవలం ఒక రాత్రిలోనే చెక్కారని చెబుతుంది.
💠 ఆలయ నిర్మాణం :
శ్రీ వరదవినాయక లేన్యాద్రి ఆలయం ఒకే రాతి కొండ నుండి చెక్కబడింది. ఇది దాదాపు 100 అడుగులు లేదా 30 మీటర్ల ఎత్తు ఉంటుంది.
ఆలయానికి చేరుకోవడానికి 300+ మెట్లు ఎక్కాలి. ఇది బౌద్ధ గుహలలో భాగం కాబట్టి, భూభాగం కొంచెం నిటారుగా ఉంటుంది.
💠 గిరిజాత్మజ్ గణపతి ఆలయంలో గణేశుడితో సంబంధం ఉన్న సాధారణ పండుగలు జరుపుకుంటారు:
గణేష్ జయంతి మరియు గణేష్ చతుర్థి .
💠 గణేష్ జయంతి సమయంలో, ఆలయం పువ్వులు మరియు దీపాలతో అలంకరించబడుతుంది.
గణేష్ జయంతిలో గణేష్ దర్శనం కోసం లక్షలాది మంది ప్రజలు ఇక్కడకు వస్తారు
💠 పూణే-లేన్యాద్రి దూరం NH60 హైవే ద్వారా 96 కి.మీ (2 గం 45 నిమి).
రచన
©️ Santosh Kumar
*తిరుమల సర్వస్వం -289*
చరిత్రపుటల్లో శ్రీనివాసుడు-4
శిలాశాసనాలు
వేద, పురాణ, ఇతిహాస వాంగ్మయం; తమిళసాహిత్యం తరువాత తిరుమల ఆలయ చరిత్రను వెలికి తీయగలిగే సాధనాలు - ఆలయకుడ్యాల నిండా, కొన్ని చోట్ల నేల పైనా, తిరుపతి - తిరుచానూరు - మరికొన్ని స్థానిక దేవాలయాల లోనూ తామర తంపరలుగా చెక్కబడి ఉన్న శాసనాలే! వాటిలో సింహభాగం తమిళంలో, అతి కొద్ది శాసనాలు తెలుగు, కన్నడ భాషల్లో ఉన్నాయి. ప్రాచీన చరిత్ర వెలికితీత దృష్ట్యా వాటి విలువను గుర్తించిన అప్పటి ఆలయ యాజమాన్యం, ఇరవయ్యవ శతాబ్దపు ప్రథమార్థంలో - అంటే, ఆలయం మహంతుల ఆజమాయిషీలో ఉన్నప్పుడు - ఈ శాసనాల లోని సమాచారాన్ని సేకరించి తద్వారా అప్పటివరకూ మరుగున పడి ఉన్న ఆలయ చరిత్రను పునర్నిర్మించే బాధ్యతను ఆలయ పురాతత్వవేత్త సాధు సుబ్రహ్మణ్య శాస్త్రి గారికి అప్పగించింది. ఈ కార్యక్రమంలో వారికి ఎదురైన అనేక అడ్డంకుల్లో కొన్నైనా తెలుసుకుంటేనే వారు పడిన శ్రమను గౌరవించిన వారమవుతాము -
వెయ్యికి పైగా ఉన్న శాసనాలలో అతికొద్ది మాత్రమే గ్రాంథిక భాషలో ఉండగా, మిగిలిన వాటిలో అప్పటి వాడుక భాషలు, స్థానిక మాండలీకాలు ఉపయోగించ బడ్డాయి. శతాబ్దాలు గడిచిన కొద్దీ వాడుక భాషలో, లిపిలో అనేక మార్పులు, చేర్పులు చోటు చేసుకుని అవి గణనీయంగా రూపాంతరం చెందాయి. పైగా,
మాండలీకాలకు ప్రామాణిక నిఘంటువులు లభించవు.
శతాబ్దాల పర్యంతం దేవాలయానికి తరచూ మరమ్మతులు, విస్తరణలు జరిగి నప్పుడల్లా - శాసన ఫలకాలను తొలగించడమో, నష్టపరచడమో, స్థానభ్రంశం చేయడమో జరిగేది. ఒకరిద్దరు పాలకులు తప్ప మిగిలిన వారు శాసన ఫలకాల సంరక్షణపై శ్రద్ధ వహించలేదు. ఇది అన్నింటికన్నా పెద్ద అవరోధం.
అత్యధిక సంఖ్యలో లభించిన దానశాసనాలలో దాతల ప్రశస్తి మాత్రమే ఉండడంతో, అవి ఆలయ చరిత్ర తెలుసుకోవడంలో అంతగా తోడ్పడలేదు.
శాసనాలలో చరిత్ర వక్రీకరణలు, స్వోత్కర్షలూ కూడా ఉన్నాయి. జైత్రయాత్రలకు, యుద్ధవిజయాలకు సంబంధించిన శాసనాలు విజేతల వాణినే వినిపించేవి కానీ వాస్తవాలకు అంతంతమాత్రం గానే అద్దం పట్టేవి. కొందరు సామంతులు, స్థానిక రాజప్రతినిధులు, ఆస్థాన విద్వాంసులు తమ తమ ప్రభువుల మెప్పు కోసం అభూత కల్పనలు కూడా సృష్టించేవారు. ఉదాహరణకు - విజయనగర ప్రభువైన సదాశివరాయలుచే లిఖించబడినట్లుగా చెప్పబడే శాసనంలో ఆయనను తూర్పు, దక్షిణ, పడమర, ఉత్తర మహాసముద్రాలకు కూడా ప్రభువుగా వర్ణించబడింది. నిజానికి అతని సామ్రాజ్యానికే కాదు, యావత్ భారతావనికి కూడా ఉత్తర మహాసముద్రం లేనే లేదన్నది జగమెరిగిన సత్యం. ఇటువంటి అసంబద్ధ విషయాలెన్నింటినో ఒడబోస్తే గానీ నిజాలు నిగ్గు తేలవు.
కొన్ని దశాబ్దాల పాటు అవిరళ కృషి జరిపి, అవరోధాలన్నింటినీ అధిగమించి, శాసనాలను తర్జుమా చేయడంలో ఎట్టకేలకు శాస్త్రి గారు సఫలీకృతులయ్యారు. దాదాపు గత ఒకటిన్నర సహస్రాబ్దులుగా ఆలయం గురించి, క్షేత్రం గురించి మనకు తెలిసిన దాంట్లో అత్యధిక భాగం శాస్త్రి గారి పరిశోధన చలవే!
పల్లవరాజుల పరిపాలన
➖➖➖➖➖➖
ముఖ్య చారిత్రక ఆధారాలైన శిలాశాసనాలలో దురదృష్ట వశాత్తూ ఏడవ శతాబ్దం ముందు వరకూ ఆలయ నిర్మాణము, నిర్వహణకు సంబంధించి ఏ సమాచారమూ లభించలేదు. అంతకు ముందు ఆలయం, ఆ పరిసర ప్రాంతాలు బాణచక్రవర్తుల ఏలుబడిలో ఉండేదన్న విషయం చూచాయగా తెలియడమే తప్ప, మరే వివరాలు లభ్యం కాలేదు.
ఏడు నుండి తొమ్మిదవ శతాబ్దం వరకూ పల్లవ వంశానికి చెందిన రాజ కుటుంబీకులు, రాజప్రతినిధులే ఆలయ పరిపాలనను నిర్వహించేవారు. వారి ఆధ్వర్యంలో, తిరుచ్చొక్కనూర్ (ఈనాటి తిరుచానూరు) లో గల 108 మంది శ్రీవైష్ణవ బ్రాహ్మణుల సభయ్యార్ (కమిటీ అనుకోవచ్చు) ఆలయ దైనందిన వ్యవహారాలను, కైంకర్యాలను పర్యవేక్షించేది. రహదార్ల మరమ్మతులు, ఆలయభూముల కౌలు వ్యవహారాలు, మేలిమి బంగారం రూపంలో విరాళాలు సేకరించడం, ఆలయ దైనందిన నిర్వహణ కూడా సభయ్యార్ విధుల్లో భాగమే. అప్పుడు తిరుచానూరు గ్రామం తమిళ ప్రాంతానికి - తిరువేంగడానికి గల రహదారిలో ఉండటంతో పాలనా సౌలభ్యం కోసం సభయ్యార్ ను ఆ గ్రామంలో ఏర్పాటు చేశారు. అప్పట్లో ఈనాడు శ్రీవారిమెట్లుగా పిలువబడే నడక మార్గమే ఎక్కువగా వాడుకలో ఉండేది. పదవ శతాబ్దపు ప్రథమార్థంలో పల్లవ రాజవంశానికి చెందిన సామవై అనే భక్తురాలు భోగశ్రీనివాసుని ప్రతిమ తయారుచేయించడమే గాక, ఆలయానికి అనేక కానుకలను సమర్పించింది. ఆ వివరాలను సంబంధిత అధ్యాయాలలో మున్ముందు తెలుసుకుందాం.
*శ్రీనివాసుని శ్రీచరణాలను సేవిద్దాం, సకల శుభాలనూ పొందుదాం*
*రచన*
*పల్లపోతు కృష్ణ బాలాజీ గారు- వాణి శ్రీ దంపతులు*
ఫోన్ నెంబర్
99490 98406
18-35-గీతా మకరందము.
మోక్షసన్న్యాసయోగము
-పూజ్యశ్రీశ్రీశ్రీ విద్యాప్రకాశానందగిరి స్వాములవారు,
శ్రీశుకబ్రహ్మాశ్రమము, శ్రీకాళహస్తి.
అll ఇక తామసధైర్యమును పేర్కొనుచున్నారు-
యయా స్వప్నం భయం శోకం
విషాదం మదమేవ చ |
న విముఞ్చతి దుర్మేధా
ధృతిస్సా పార్థ! తామసీ ||
తా:- ఓ అర్జునా! ఏ బుద్ధిచేత దుర్బుద్ధియగు మనుజుడు నిద్రను, భయమును, దుఃఖమును, సంతాపమును (దిగులును), మదమును విడువకయుండునో - అట్టి ధైర్యము తామసమైనది.
వ్యాఖ్య: - ధైర్యము గొప్పసుగుణమే. కాని అది దుర్విషయములందు వినియోగింపబడునపుడు నిష్ఫలమైపోవును. తమోగుణయుతుడు ఒకానొక ధైర్యమవలంబించి తన అతినిద్రను, భయమును, దుఃఖమును, దిగులును, మదమును వదలకయే యుండును. ధైర్యమను గొప్ప సుగుణము అట్టి నిద్రాభయాది నికృష్టవస్తుసంపాదనమున వినియోగింపబడుటచే నిరర్థకమైపోయినది. కాబట్టి ఆ ధైర్యమునే సద్వస్తుసంపాదనమునకు, సచ్ఛీలసముపార్జనకు, మోక్షప్రాప్తికి, దైవకరుణను సంపాదించుటకు వినియోగించుట ఉత్తముని ధర్మమైయున్నది. వాల్మీకికి అపారధైర్యము, పట్టుదల కలదు. కాని మొట్టమొదట ఆ ధైర్యమును, పట్టుదలను దుర్వృత్తులందు, పరమహింసాకార్యములందు ఉపయోగించి విఫలుడయ్యెను.
కాని మహనీయుల సాంగత్య ప్రభావముచే తిరిగి ఆ ధైర్యమునే రామనామజపమందును, దైవధ్యానమందును వాడుకొని ధన్యుడయ్యెను.
“దుర్మేధా” - అనిచెప్పుటవలన అతనికి మేధ (తెలివి) యున్నప్పటికిని దానిని వక్రమార్గమున ప్రవేశపెట్టెనని భావము.
"స్వప్నమ్” - (నిద్ర) ఇచట నిద్రయని చెప్పినచోట "అతినిద్ర' యని భావించుకొనవలెను. ఏలయనిన మితనిద్ర సర్వులకును అవసరమే అయియున్నది.
ప్ర:- తామసధైర్య మెట్టిది?
ఉ:- ఏ ధైర్యముచే దుర్బుద్ధిగలవాడు నిద్రను, భయమును, శోకమును, దిగులును, మదమును విడువకయుండునో అది తామసధైర్యమని చెప్పబడును.
*సంపూర్ణ మహాభారతము**సరళ వ్యావహారిక భాషలో...!*
*శల్య పర్వము ద్వితీయాశ్వాసము*
*426 వ రోజు*
*కురుక్షేత్రం*
బలరాముడు వృద్ధాశ్రమంలో ఉండగా కురుక్షేత్రంలో కౌరవులందరూ మరణించిన విషయం తెలిసి చాలా బాధపడ్డాడు. తరువాత కురుక్షేత్ర సమీపంలో ఉన్న శమంతక పంచకం' వెళ్ళి అక్కడి మునులను అడిగి కురుక్షేత్రంలో జరిగిన విషయాలు తెలుసుకున్నాడు. వారు " ఈప్రదేశమును కురుమహారాజు దున్నడం వలన ఈ ప్రదేశానికి కురుక్షేత్రం అనే పేరు వచ్చింది. కురుమహారాజు అక్కడ పుట్టిన వారందరూ స్వర్గలోకం వెళ్ళాలన్న కోరికతో భూమిని దున్నాడని తెలుసుకున్న ఇంద్రుడు భూమిని దున్నితే స్వర్గ లోకం ప్రాప్తిస్తుందా ! అని హేళన చేసాడు. అయినా కురుమహారాజు పట్టు విడువక దున్నసాగాడు. అతడి పట్టుదలను చూసి దేవేంద్రుడు ఆ ప్రదేశంలో ఉపవసించి మరణించిన వారికి స్వర్గలోకం ప్రాప్తిస్తుందని వరమిచ్చాడు " అని ఆ ప్రదేశ ప్రాశస్త్యం గురించి చెప్పారు. అప్పుడు అక్కడకు వచ్చిన నారదుడు అక్కడకు వచ్చి " ఈ 18 రోజుల యుద్ధంలో కురుసైన్యంలో అశ్వత్థామ, కృపాచార్యుడు, కృతవర్మ అనే రథికత్రయం తప్ప మిగిలిన వారంతా మరణించారు. సుయోధనుడు మాత్రం ఒంటరిగా కృష్ణద్వైపాయన మడుగులో జలస్తంభన విద్య ద్వారా దాక్కొని ఉండగా ధర్మరాజు మాటలకు బయటకు వచ్చి భీమునితో యుద్ధము చేయ సిద్ధముగా ఉన్నాడు. వారిరువురు నీ శిష్యులు కనుక నీవు వెళ్ళి వారి యుద్ధం తిలకించు " అని చెప్పాడు. వెంటనే బలరాముడు కురుక్షేత్రం చేరుకున్నాడు. అని వైశంపాయనుడు జనమేజయునికి చెప్పాడని సంజయుడు వివరించి " మహారాజా ! బలరాముని చూసి నీ కుమారుడి ముఖం వికసించింది. తన పక్షమున తన గురుదేవుడు ఉన్నాడనుకుని సంతసించాడు. సుయోధనుడు ధర్మనందనుడిని జూసి " ధర్మనందనా ! ఇక్కడికి సమీపంలో శమంతక పంచకంలో మరణించిన వారికి ఉత్తమలోకాలు ప్రాప్తిస్తాయి కనుక యుద్ధం అక్కడ జరగడం మంచిది కదా ! " అన్నాడు. బలరాముడు ఆ మాటను సమర్ధించడం వలన అందరూ అక్కడకు వెళ్ళారు.
*భీమ సుయోధనులు సమరం*
శ్రీకృష్ణుడు, బలరాముడు, పాండవులు, యాదవులు, పాంచాలురు చతురంగబలాలు చుట్టూ ఉండగా మధ్యలో భీమ సుయోధనులు యుద్ధానికి సన్నద్ధ మయ్యారు. భీముడు " ధర్మరాజా ! ఈ నీచుడు ఎన్నో పాపాలు చేసాడు. ఇతడికి ఈ రోజుతో ఆయుస్షు తీరింది. నాడు సభలో నేను చేసిన శపధం ఈ రోజు వీడి తొడలు విరిచి నెరవేర్చుకుంటాను " అన్నాడు. సుయోధనుడు కూడా " ఈ రోజు నీకూ నా చేతిలో చావు మూడింది. నాతో గధా యుద్ధం చేయడానికి ఈశ్వరాదులే వెనకడుగు వేస్తాడు. ఇక నీ వెంత ! నిన్ను చంపి సర్వం సహా కురు సామ్రాజాధిపత్యం వహిస్తాను " అన్నాడు. ఇలా ఒకరిని ఒకరు దూషించుకుంటుండగా యుద్ధ ప్రారంభసూచిక మ్రోగింది. భీమసుయోధనులు మహా ఉద్రేకంతో యుద్ధం చేయతలపడ్డాడు. బలరాముడు ఆసక్తిగా చూస్తుండగా ఒకరిని ఒకరు బెదిరించుకుంటూ గుండ్రంగా తిరుగుతూ గదలతో మోదుకుంటూ ఒకరికి ఒకరు తీసిపోకుండా యుద్ధం చేస్తున్నారు. వారి పదఘట్టనలతో భూమి కంపిస్తుంది. వారి కిరీటములు కింద పడ్డాయి, ఆభరణములు క్రిందరాలాయి కవచాలు విరిగి పోయాయి. ఒకరి గదను ఒకరు చుట్టి లాగుతున్నారు. అంతలోనే వెనక్కు తగ్గుతున్నారు. ఏనుగుల మాదిరి ఢీకొట్టుకుంటున్నారు, ఒకరు కొట్టే దెబ్బలు ఒకరు తప్పించుకుంటూ తిరిగి దెబ్బతీస్తూ ఉన్నారు. గదాఘాతముల వలన ఇద్దరి శరీరాలు రక్తసిక్తమయినా వెనక్కి తగ్గ లేదు. కాసేపు సొమ్మసిల్లి తిరిగి బలం పుంజుకుని తిరిగి యుద్ధం చేస్తున్నారు. వారిద్దరి మధ్య జయాపజయాలు నిర్ణయించడం చాలా కష్టం అయింది.
*రేపు *
*భారతంలో ఉండేది భూమిపై ఎక్కడైనా ఉంటుంది భారతంలో లేనిది భూమిపై ఎక్కడా లేదు*
*రోజూ భారతం చదవండి భగవద్ అనుగ్రహం పొందండి*
*卐ॐ ఓం శ్రీ 🌹గురుభ్యోనమః ॐ卐*
*🪷గురువారం🪷*
*🌹03 జూలై 2025🌹*
*దృగ్గణిత పంచాంగం*
*స్వస్తి శ్రీ విశ్వావసు నామ సంవత్సరం*
*ఉత్తరాయణం - గ్రీష్మ ఋతౌః*
*ఆషాఢమాసం - శుక్లపక్షం*
*తిథి : అష్టమి* మ 02.06 వరకు ఉపరి *నవమి*
*వారం : గురువారం* (బృహస్పతివాసరే)
*నక్షత్రం : హస్త* మ 01.50 వరకు ఉపరి *చిత్త*
*యోగం : పరిఘ* సా 06.36 వరకు ఉపరి *శివ*
*కరణం : బవ* మ 02.06 *బాలువ* రా 03.17 ఉపరి *కౌలువ*
*సాధారణ శుభ సమయాలు:*
*ఉ 11.00 - 12.00 సా 04.00 - 06.30*
అమృత కాలం : *ఉ 07.09 - 08.56*
అభిజిత్ కాలం : *ప 11.45 - 12.38*
*వర్జ్యం : రా 10.50 - 12.38*
*దుర్ముహూర్తం : ఉ 10.01 - 10.53 మ 03.15 - 04.07*
*రాహు కాలం : మ 01.50 - 03.28*
గుళికకాళం : *మ 08.56 - 10.34*
యమగండం : *ఉ 05.39 - 07.17*
సూర్యరాశి : *మిధునం*
చంద్రరాశి : *కన్య/తుల*
సూర్యోదయం :*ఉ 05.46*
సూర్యాస్తమయం :*సా 06.55*
*ప్రయాణశూల : దక్షిణ దిక్కుకు పనికిరాదు*
*వైదిక విషయాలు:*
ప్రాతః కాలం : *ఉ 05.39 - 08.16*
సంగవ కాలం : *08.16 - 10.53*
మధ్యాహ్న కాలం : *10.53 - 01.30*
అపరాహ్న కాలం : మ *01.30 - 04.07*
*ఆబ్ధికం తిధి :ఈరోజు శూన్యం*
సాయంకాలం :*సా 04.07 - 06.44*
ప్రదోష కాలం : *సా 06.44 - 08.55*
రాత్రి కాలం :*రా 08.55 - 11.50*
నిశీధి కాలం :*రా 11.50 - 12.34*
బ్రాహ్మీ ముహూర్తం :*తె 04.12 - 04.56*
-------------------------------------------------
*🌷ప్రతినిత్యం🌷*
*_గోమాతను 🐄 పూజించండి_*
*_గోమాతను 🐄 సంరక్షించండి_*
*🌷ఓం శ్రీ గురుదత్తాయ నమః🌷*
*సర్వ అపరాధ నాశాయ, సర్వ పాప హరాయ చ |*
*దేవ దేవాయ దేవాయ, శ్రీ దత్తాత్రేయ నమోస్తుతే ||*
నా అన్ని అపరాధాలను (తప్పులు, దోషాలను) నాశనం చేయగలవాడవు.
నా యొక్క పాపాలను తొలగించగలవాడవు.
దేవతలకు కూడా దేవుడవు, అత్యున్నత దైవ స్వరూపుడవు.
*ఓ శ్రీ దత్తాత్రేయ స్వామీ* నీకు నమస్కారము
ఓ మహానుభావా దత్త ప్రభో శరణాగతుడనై నిన్ను ఆశ్రయించు చున్నాను
*॥జై గురుదేవ దత్త ॥*
🌹🪷🌹🛕🌹🌷🪷🌷🌹
*సర్వే జనాః సజ్జనో భవంతు !*
*సర్వే సజ్జనా స్వజనో భవంతు !!*
*సర్వే స్వజనా సుకృతో భవంతు !*
*సర్వే సుకృత జనః సుఖినో భవంతు !!*
<><><><><><><><><><><><><><>
🌷 *సేకరణ*🌷
🌹🌿🌹🌹🌿🌹
*న్యాయపతి వేంకట*
*లక్ష్మీ నరసింహా రావు*
🌷🍃🌹🌹🍃🌷
🌹🌷🌹🌷🌹🌷🌷🌹