28, ఏప్రిల్ 2025, సోమవారం

తంత్ర శాస్త్రం వివరణ

 తంత్ర శాస్త్రం వివరణ - చిట్టి తంత్రాలు - 2. 


. మునపటి పోస్ట్ నందు మంత్రం, యంత్రం, తంత్రం గురించి వివరించాను. ఇప్పుడు మీకు తంత్రంలోని బేదాల గురించి వివరిస్తాను. వీటిలో ముఖ్యమైనవి 7 రకాలు. అవి. 


•. సజీవ తంత్రాలు. - 


. జీవము గల పదార్ధాలు, జీవ రాశులతో చేయు తంత్రాలు. 


•. ఔషదీ తంత్రాలు. = 


. వనమూలికలు, దివ్య ఔషధులతో చేయబడినవి. 


•. గర్భిత తంత్రాలు. -. 


. భూమిలో నుండు వస్తువులతో ఆచరింబడునవి. 


•. మంత్రమయ తంత్రాలు. - 


. కొన్ని మంత్రాల కలయిక కలిగి ఉండునవి.  


•. యంత్రిక తంత్రాలు. -. 


. కొన్ని యంత్రాలతో పెనవేసుకొని ఉన్నవి. 


°. మిశ్రమ తంత్రాలు. -. 


. అనేక విధాలైన ప్రక్రియలతో సంభంధం కలిగినవి. 


°. స్వతంత్ర తంత్రాలు. -. 


. మంత్ర, యంత్రాలతో గాని, ఔషదాలతో గాని, జీవ పదర్దాల తో గాని ఏ విధమైన సంభంధం లేకుండా అతిసారమైన ప్రక్రియలతో కూడి ఉండునవి.  


. ఇవేకాక వాక్ తంత్రాలు, ఉచిత తంత్రాలు, ఆశా తంత్రాలు, కుతంత్రాలు అనేవి కూడా ఉన్నాయి. వీటిని యుద్ధముల యందు, ప్రజా విప్లవముల యందు పూర్వీకులు ప్రయోగించి ఉన్నారు.  


. ఇప్పుడు ఈ తంత్రాలలో కొన్ని ముఖ్యమైన వాటిని మీకు తెలియచేస్తాను. 


•. నాలుగు చిన్న మేకులు తీసుకొని నృసింహ మంత్రాన్ని చెప్తూ మీ సింహ ద్వారానికి ఇరుప్రక్కలా దించండి. ఎలాంటి దుష్టత్మాలు మీ ఇంట్లో ప్రవేశించవు.  


•. ఇంట్లో వచ్చే ముందు ద్వారానికి ఎదురుగా చెప్పులు విడవవద్దు. 


•. ఎప్పుడూ ఏదో సమస్యతో బాధపడే వారు భైరవుని పేరు మీద కొంచం మద్యాన్ని తీసుకొని భైరవాష్టాకం చదివి తాగేవారికి ఇవ్వండి. 


•. తాంబూలం లో కొద్దిగా జాజికాయ కలిపి వేసుకోవడం ద్వారా ముఖములో చక్కని వర్చస్సు పొందగలరు. 


•. కొన్ని తెల్ల ఆవాలు తీసుకొని భైరవ మంత్రం చదువుతూ మీ ఇంటికి ఎనిమిది ప్రక్కలా చల్లండి. భైరవుడు మీకు రక్షణగా ఉంటాడు.  


•. శుక్రవారం రాహు కాలంలో రెండు రొట్టెలు వాటిలో కొద్దిగా బెల్లం కలిపి ఆవుకి తినిపించండి. రాహు గ్రహ దోషాల నుండి విముక్తి కలుగును. 


•. గణపతి ప్రీతి కొరకు మీకు వీలైనప్పుడల్లా పిల్లలకు తీపి పదార్ధాలు పంచండి. 


 •. బ్యాంకు నందు డబ్బు వేసే ముందు లక్ష్మి మంత్రాన్ని జపించండి. 


•. డబ్బుని పొదుపు చేయడం భరణి నక్షత్రంలో మొదలుపెట్టండి. 


•. ఆర్ధికముగా అర్ధం కానీ పరిస్థితి ఏర్పడినప్పుడు నిత్యం సుందరాకాండ పారాయణం చేయండి. 


•. చిన్నపిల్లలు రాత్రిపూట 

దడుచుకుంటున్నచో తలగడ వైపు ఒక నిమ్మకాయ ఉంచండి.  


•. ఇంటిలో పెద్దవారు ఆకాల మరణం చెందుతుంటే సర్పశాపముగా భావించి తగు పరిహారాలు చేయించండి. 


•. తరచుగా ప్రమాదాలు జరుగుతుంటే. కుజ గ్రహ సంబంధ పూజలు చేయించుకోండి. 


•. ఆర్ధిక పరమైన ఇబ్బందులు ఎదురైనా శని గ్రహ పూజలు చేయించుకోవాలి.  


. ఇలా కొన్ని వందల తాంత్రిక సంబంధ చిట్కాలు ఉంటాయి. కొన్నింటిని మాత్రమే మీకు వివరించాను.  


. సమాప్తం.  


ఆయుర్వేదములోని ఎన్నొ రహస్య మూలికల అనుభవ యోగాల గురించి నా గ్రంథాల యందు సంపూర్ణముగా , అందరికి అర్థమయ్యే సులభ భాషలో వివరించాను . వాటిని చదివి మరింత విజ్ఞానాన్ని పొందగలరు . 

  

 గమనిక -

      

నేను రాసిన " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు " మరియు " ఆయుర్వేద మూలికా రహస్యాలు " రెండు గ్రంథాలలో ఎన్నొ రహస్య చిట్కాలు , మా కుటుంబపరంగా గత 250 సంవత్సరాల నుంచి మా పెద్దవారు మాకు అందించిన ఎంతో అనుభవసారాన్ని ఈ గ్రంథాలలో అందరి అర్థం అయ్యే విధంగా సామాన్య బాషలో వివరించాను. ఇంట్లో ఉండి మరియు అందుబాటులో ఉన్న వాటితోనే పెద్ద పెద్ద రోగాలు నయం చేసుకునే విధంగా అత్యంత సులభయోగాలు మన ప్రాచీన భారతీయులు రచించిన చెట్లను బట్టి భూమిలో నీటిని కనుక్కునే విధానాలు , వృక్షాలకు ఆయుర్వేద మూలికల ఉపయోగించి దిగుబడి పెంచే వృక్షాయుర్వేద చిట్కాలు , రైతులకు ఉపయోగపడే విధంగా ఏయే నక్షత్రాలలో పంటలు వేస్తే ఫలితాల ఎక్కువుగా ఉంటాయో తిథి, నక్షత్ర, వారాలతో సహా ఇవ్వడం జరిగింది. ఆయుర్వేదం నేర్చుకోవాలి అనుకునేవారికి ఇది మంచి దిక్సూచిలా ఉపయోగపడును. 

            

. నా మూడొవ గ్రంథము నందు 50 రకాల మొక్కల గురించి అత్యంత విపులంగా ఇవ్వడం జరిగింది . ఈ మొక్కలన్నియు ప్రతి ఒక్కరికి తెలిసినవి మరియు మన ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటివే . ఈ గ్రంధములలో మీకు లభ్యమయ్యే సమాచారం మరే గ్రంథములలో లభ్యం అవ్వదని చెప్పగలను . మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల చిత్రములు కూడా ఇవ్వడం జరిగినది . ఏయే జబ్బులకు ఎటువంటి ఆహారపదార్థాలు తీసుకోవలెనో , తీసుకోకూడదో కూడా సంపూర్ణముగా మీకు ఇందులో లభ్యం అగును . ఔషధాలు మరియు తీసుకోవాల్సిన ఆహారవిహారాలు ఒకేదగ్గర లభ్యం అగును . 

   

. ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు గ్రంథము 288 పేజీలతో ఉండును . దీని విలువ 400 రూపాయలు , ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథము 384 పేజీలతో ఉండి 500 రూపాయలు , సర్వమూలికా చింతామణి గ్రంథము 352 పేజీలతో ఉండును . దీని విలువ 550 రూపాయలు . అందరికి అర్ధమయ్యేలా సులభ బాషలో ఉండును. గ్రాంథిక భాష ఉపయోగించలేదు . 

                

. ఈ గ్రంథములు కావలసిన వారు 9885030034 నంబర్ కు Phonepay or Googlepay or Paytm కు డబ్బు పంపించి ఇదే నంబర్ కు Whatsup నందు screenshot పెట్టి మీ పూర్తి Adreass ఇవ్వగలరు . కొరియర్ చార్జీ 100 రూపాయలు అదనం .

      

. ఈ గ్రంథాలు కావలసినవారు క్రింద ఇచ్చిన నంబర్ కి ఫోన్ చేయగలరు .

             

. కాళహస్తి వేంకటేశ్వరరావు  

         

. అనువంశిక ఆయుర్వేద వైద్యులు 

                    

. 9885030034

Vaisakha Puranam -- 1

 Vaisakha Puranam -- 1


వైశాఖ పురాణం - 1.


1వ అధ్యాయము - వైశాఖమాస ప్రశంస


నారాయణం నమస్కృత్య నరం చైవనరోత్తమం |

దేవీం సరస్వతీం వ్యాసం తతోజయ ముదీరయేత్ ||


సూతమహర్షి శౌనకాది మహర్షులనుద్దేశించి యిట్లు పలికెను. మహర్షులారా! వినుడు రాజర్షియగు అంబరీషుడు బ్రహ్మ మానసపుత్రుడగు నారదుని జూచి నమస్కరించి మహర్షీ! మీరు అన్ని మాసముల మహత్త్వమును వివరించిరి. అన్ని మాసముల యందును వైశాఖ మాసము మిక్కిలి యుత్తమమైనది. శ్రీమహావిష్ణువునకు మిక్కిలి ప్రీతి పాత్రమైనదని చెప్పినారు. వైశాఖమాసము శ్రీమహావిష్ణువునకు యిష్టమగుటకు కారణమేమి? ఈ మాసమునందు విష్ణుప్రియములైన ధర్మములేవి? మానవులాచరింవలసిన దానములను, వాని ఫలములను వివరింపగోరుచున్నాను. పూజ, దానము మున్నగు వానిని యే దైవము నుద్దేశించి చేయవలయును? వాని ఫలమెట్టిది? పూజాద్రవ్యములెట్టివి? మున్నగు విషయములను దయయుంచి వివరింపగోరుచున్నానని సవినయముగ ప్రశ్నించెను.


నారదుడును రాజర్షీ! అంబరీషా! వినుమని యిట్లు పలికెను. పూర్వమొకప్పుడు నేను బ్రహ్మను మాసముల మహిమను మాస ధర్మములను వివరింపగోరితిని. బ్రహ్మయు 'నారదా! శ్రీమహావిష్ణువు లక్ష్మీదేవికి మాసధర్మములను చెప్పుచుండగ వింటిని. నీకిప్పుడు శ్రీమహావిష్ణువు లక్ష్మీదేవికి చెప్పిన విషయమునే చెప్పుదును. మాసములన్నిటిలోను కార్తికము, మాఘము, వైశాఖము ఉత్తమములు. ఆ మూడు మాసములలో వైశాఖమాసము మిక్కిలి ఉత్తమము. వైశాఖము ప్రాణులకు తల్లివలె సదా సర్వాభీష్టములను కలిగించును. ఈ మాసమందాచరించిన స్నానము, పూజ, దానము మున్నగునవి పాపములన్నిటిని నశింపజేయును. ఈ మాసమున చేసిన స్నాన, పూజా, జప, దానాదులను దేవతలు సైతము తలవంచి గౌరవింతురు. విద్యలలో వేదవిద్యవలె, మంత్రములలో ఓంకారమువలె, వృక్షములలో దివ్యవృక్షమైన కల్పవృక్షము వలె, ధేనువులలో కామధేనువువలె, సర్వసర్పములలో శేషునివలె, పక్షులలో గరుత్మంతునివలె, దేవతలలో శ్రీమహావిష్ణువువలె, చతుర్వర్ణములలో బ్రాహ్మణునివలె యిష్టమైన వానిలో ప్రాణమువలె, సౌహార్దములు కలవారిలో భార్యవలె, నదులలో గంగానది వలె, కాంతి కలవారిలో సూర్యుని వలె, ఆయుధములలో చక్రమువలె, ధాతువులలో సువర్ణమువలె, విష్ణుభక్తులలో రుద్రునివలె, రత్నములలో కౌస్తుభమువలె, ధర్మహేతువులగు మాసములలో వైశాఖమాసముత్తమమైనది. విష్ణుప్రియమగుటచేతనే వైశాఖమాసమును మాధవమాసమనియునందురు. విష్ణుప్రీతిని కలిగించు మాసములలో వైశాఖమాసమునకు సాటియైనదిలేదు. సూర్యుడు మేషరాశియందుండగా వైశాఖమున సూర్యోదయమునకు ముందుగ నదీ తటాకాదులలో స్నానమాచరించినచో శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవితో గలసి అతిప్రీతితో వానినుద్దరింపనెంచును. ప్రాణులు అన్నమును తిని సంతోషమునందినట్లు శ్రీమహావిష్ణువు వైశాఖ స్నానమాచరించిన వారి విషయమున సంప్రీతుడగుచున్నాడు. అట్లు వైశాఖ స్నానమాచరించినవారికి అన్ని వరముల నీయ సిద్దమై యున్నాడు. వైశాఖమాసమున ఒకసారి మాత్రమే స్నానమును, పూజను చేసినను, పాప విముక్తుడై విష్ణులోకమును చేరుచున్నాడు. వైశాఖమున వారమునాళ్లు స్నానాదికమును చేసినను ఈ మాత్రమునకే శ్రీహరియనుగ్రహ బలమున, కొన్నివేల అశ్వమేధయాగములను చేసినచో వచ్చునంతటి పుణ్యమునందును. స్నానము చేయు శక్తి లేక, స్నాన సంకల్పము దృఢముగనున్నచో నతడు నూరు అశ్వమేధయాగములు చేసినంత పుణ్యము నందును. సూర్యుడు మేషరాశిలోనుండగా వైశాఖస్నానము నది/ఏరులో చేయవలెనని సంకల్పించిన వాడై అశక్తుడై యున్నను, కొంతదూరమైనను యింటి నుండి ప్రయాణమైన వాడు వైశాఖమున నదీ స్నాన సంకల్పము దృఢముగనున్నచో విష్ణు సాయుజ్యము నందును.


అంబరీష మహారాజా! సర్వలోకములయందున్న తీర్థ దేవతలు బాహ్యప్రదేశముననున్న జలము నదియైనను, తటాకమైనను, సెలయేరైనను,అందుచేరియుండును. జీవి చేసిన సర్వపాపములను, జీవి అట్టిజలమున పవిత్ర స్నానమాచరించు వరకును, యముని యాజ్ఞననుసరించి జీవి సూక్ష్మ శరీరముననుసరించి రొద చేయుచుండును. జీవి వైశాఖమున అట్టి బాహ్యప్రదేశమున నున్న జలమున స్నానమాచరింపగనే ఆ జలమునధిష్టించి యున్న సర్వతీర్థ దేవతల శక్తి వలన ఆ జీవి చేసిన సర్వపాపములు హరించును. సర్వతీర్థదేవతలు సూర్యోదయమును మొదలుకొని ఆరు ఘడియల వరకు బాహ్య ప్రదేశమునందున్న ఆ నదీ జలమునాశ్రయించి యుండును. ఆ జలమున తామున్న సమయమున స్నానమాచరించిన వారికి హితమును కలిగింతురు. చేయనివారిని శాపాదులచే నశింపచేయుదురు. వారు శ్రీ మహావిష్ణువు ఆజ్ఞననుసరించి యిట్లు చేయుదురు. సూర్యోదయమైన ఆరు ఘడియల తరువాత తీర్థ దేవతలు తమ తమ స్థానములకు పోవుదురు. మరల సూర్యోదయమునకు ముందుగా బాహ్య ప్రదేశమందున్న జలము నావహించి స్నానమాడిన వారి పాపముల నశింపజేయుచుందురు.


వైశాఖ పురాణం ఒకటవ అధ్యాయము సంపూర్ణము.

మూడు విషయాలు

 🙏🕉️శ్రీమాత్రేనమఃశుభోదయం🕉️🙏       🏵️జీవితంలో మూడు విషయాలు గుర్తు పెట్టుకోవాలి.. నీ మీద నమ్మకం లేని వారికి సంజాయిషీ చెప్పాల్సిన అవసరం లేదు.. నీకు గౌరవం లేని చోట నువ్వు ఉండవలసిన అవసరం లేదు.. నీ కన్నీళ్లకు విలువ ఇవ్వని వారి కోసం ఆసలు బాధ పడనవసరం లేదు🏵️విలువ లేని వారితో వాదించడం, వాళ్ళ మాటలకు స్పందించడం వల్ల వాళ్ళ విలువ మనం పెంచడమే అవుతుంది.. ప్రాణం లేని బొమ్మకి కవితలు చెప్పినా, మారని మనిషికి నీతులు బోదించినా ఒక్కటే..నిజాలు చెప్పే వాళ్ళను దూరం చేసుకుంటారు.. ఉన్నది లేనట్లు లేనిది ఉన్నట్లు చెప్పే వారి మాయలో ఈజీగా పడిపోతారు.. నిజాన్ని తెలుసుకునే లోపు  మంచిగా మాట్లాడే నా అనుకునే వాళ్ళని దూరం చేసుకుంటావు🏵️నీకు తప్పు అనిపించేది ప్రతిదీ తప్పు కాదు.. అలాగే ఒప్పు అనిపించేది ఒప్పు కాదు.. ఆది కేవలం నువ్వు చూసే విధానం పైన ఆధారపడి ఉంటుంది.. జీవితం శాశ్వతం కాదు.. డబ్బు శాశ్వతం కాదు.. శాశ్వతంగా నిలిచేది ఒక్కటే.. మన మంచితనం.. ప్రేమగా ఒక పలకరింపు🏵️🏵️మీ *అల్లంరాజు భాస్కరరావుశ్రీ విజయ ఆయుర్వేదిక్ &జనరల్ ఏజన్సీస్ D .N.29-2-3 గోకవరం బస్టాండ్ దగ్గర స్టేట్ బ్యాంక్ ఎదురుగా రాజమండ్రి వైద్య సలహాలు ఉచితం మందులు అయిపోయినా వారికి రాలేను వారికి కొత్త వారికి మందులు కొరియర్ ద్వారా పంపబడును 9440893593.9182075510* 🙏🙏🙏

అమృతాన్ని ఆరగించాలి

 Sreenivasa Murthy Chittamuri:

అమృతాన్ని ఆరగించాలి

అన్నం పరబ్రహ్మ స్వరూపం' అనే మాట భారతీయులందరికీ తెలిసినదే.


'అన్నాద్భవన్తి భూతాని...' అని ప్రాణికోటి ఉత్పత్తికి ఆధారం అన్నమని తెలిపారు. తిన్న అన్నంలో అత్యంత స్థూలభాగం మాలిన్యంగా వెలికి వస్తుందనీ, సూక్ష్మ సూక్ష్మాంశాలు క్రమంగా ప్రాణశక్తిగా, తేజస్సుగా, మనస్సుగా మారుతాయని ఉపనిషద్వచనం. అందుకే అన్న విషయంలో అనేక నియమాలను ఏర్పరచారు మన పూర్వీకులు, మన అలసత్వంతో, చాపల్యంతో వాటిని 'చాదస్తాల'ని కొట్టేసి - నియమరహిత ఆహారాన్ని సేవించి బుద్ధినీ, శరీరాన్ని కాలుష్యపరచుకుంటున్నాం.


అన్న వ్యాపారం పెరిగి - వీథికో 'శీఘ్రహారకేంద్రాలు' వెలిశాయి. జిహ్వచాపల్యంతో మనుషులు వాటి ముందు బారులు, గుంపులు కడుతున్నారు. ఇంటిలో వండుకొనే అవకాశం లేని దరిద్రులు, లేదా పనిపై ప్రయాణంలో భాగంగా క్రొత్త ఊరికి చేరుకున్నవారు కడుపు నింపుకొనడానికై వాటిని స్వీకరించడం ఫరవాలేదు. గతిలేని పరిస్థితులవి.


కానీ ఉన్న ఊళ్లో, వండుకొనే అవకాశం ఉన్న గృహిణులు కూడా ఇంటిల్లిపాదితో కలసి హెూటళ్లకి పోయేలా ప్రేరేపించి 'ఎంగిలి - అంట్ల' నియమాల్లేని కూడు కోసం కక్కుర్తిగా మందవిందులకు ఎగబడడం శోచనీయమే. పెళ్ళిళ్ళలో ఆప్యాయంగా వండి వడ్డించడాలు పోయి, 'బఫే' పేర్లతో అనాచార, అనారోగ్య ఆహారాన్ని విందుల పేర్లతో ఆరగించడం బాధాకరం.


మన గృహస్థ సంప్రదాయం ప్రకారం శుచిగా అన్నాన్ని వండి భగవంతునికి నివేదించి, అతిథులకు వీలైనంత పెట్టి తాము తినడం పవిత్రం.... అని భావిస్తాం.


'యజ్ఞ శిష్టాశినః అమృతభుజః' అని శాస్త్రవచనం. “యజ్ఞము చేయగా మిగిలినది అమృతం. దానిని అరగించాలి". పదార్థాన్ని భగవంతునికి నివేదన చేసి ప్రసాదంగా మార్చడం వలన, భగవత్ప్రసన్నతాశక్తి మనలో ప్రసరిస్తుంది. తద్వారా మంచి ఆరోగ్యం, మంచి ఆలోచనలు, మంచి సంతానం కలుగుతాయి.


ఆచార సంపన్నుల గృహాలలో అంట్లు ఎంగిళ్లు... అనే నియమాలుండేవి. సంస్కృతి, నాగరికత ఉన్నచోట్ల నియమాలు, నిబంధనలు పెరుగుతాయి. ఎంతో నాగరికతని సాధించిన దేశం కనుక - ఈ దేశంలో ఆహార నియమాలు బాగా ఉన్నాయి. వైజ్ఞానికంగా ఆలోచించినా - ఇంటి వంట ఒంటికి మంచిదని ఋజువవుతున్నదే. మంది భోజనాలు ప్రమాదకరమే. కేవలం బ్రతకడం కోసం కడుపులో కూడు పడేసుకోవడం పశుప్రవృత్తి. అంతేకాదు... ఇళ్లల్లో కూడా అంట్ల-ఎంగిలి నియమాలు వదులుకుంటున్నారు. కాస్త నాలికపై క్షణకాలం నిలిచే రుచికోసం ఉదరాన్ని హింసించి మానసిక శారీరక రోగాలకు బలవుతున్న దుఃస్థితులు నేడు కనిపిస్తున్నాయి.


చక్కగా స్నానం చేసి, తడిపి ఆరవేసిన పొడిబట్టను కట్టుకుని, శుభ్రపరచిన పొయ్యిపై భగవత్ స్మరణంతో వంట వండి, దేవుని దగ్గర దీపం వెలిగించి, ఆ అన్నాన్ని నివేదించితే అది అమృతమే అవుతుంది. దానిని ఆరగించడం శ్రేయస్కరం. వండేవారి మనః ప్రవృత్తి కూడా వంటపై ప్రభావం చూపిస్తుంది కనుక, శుచిగా దైవనామంతో వండుతున్నప్పుడు, ఆ దేవతాశక్తి అన్నానికి కూడా ఆవహిస్తుంది.


ఆహారాన్ని అరగించేటప్పుడు కూడా మనలో జఠరాగ్ని రూపంలో ఉన్న పరమేశ్వరునికే నివేదిస్తున్నాం అనే భావన ఉండాలి. అందుకే పరిషేచన, దేవతాస్మరణ చేసి అన్నాన్ని తినడం ఈ దేశ సంప్రదాయం.


మన కడుపులోని అగ్నిహోత్రంలో అన్నాన్ని ఆహుతులుగా సమర్పిస్తున్నామనే భావనలో ఎంతో సంస్కారం గోచరిస్తోంది. ఈ స్ఫురణతో అన్నాన్ని స్వీకరించడం యజ్ఞం చేస్తున్నట్లే. జఠరాగ్నిలో పచనమైన ఆహారం రసంగా, శక్తిగా పరిణమించి ఇన్ద్రియ దేవతలకు చైతన్యాన్ని ప్రసాదిస్తోంది.


ఈ దర్శనం చేతనే మనకి అన్న నియమాలు, అన్నదానాలు ఏర్పడ్డాయి. పవిత్రమైన అన్నం పవిత్రమైన ఆలోచనలనిస్తుంది. 'అభక్ష్య భక్షణ'(తినరానివి తినడం) మహాపాపం... అని మన శాస్త్రాలు పదే చెబుతున్నాయి. అన్నానికి భౌతికమైన దోషాలను పోగొట్టడానికై వండే ముందు పదార్థాలను శుభ్రపరచడం చేస్తాం.


అవికాక - అన్న సంపాదనలో మనకు తెలిసీ, తెలియక జరిగిన దోషాలు, అన్న పచనంలో తప్పనిసరిగా జరిగిన హింస... మొదలైన సూక్ష్మమైన దుర్లక్షణాలను - భగవన్నివేదన వలన పరిహరించవచ్చు. తద్వారా శుద్ధమైన సంస్కారాలు మనలో మేల్కొంటాయి.


స్నానం కూడా చేయకుండా, పడుకుని లేచిన వస్త్రాలతోనే వంట వండి, ఆ అనాచార భోజనాన్ని 'కేరీజ్'లో సర్దుకుని పరుగు పరుగున ఆఫీసులకి దౌడుతీసి, ఏదో కడుపు నింపుకునే పద్ధతి నుండి కాస్త శ్రద్ధను ఉపయోగించి సదాచార విధానంలోకి మళ్లేందుకు ప్రయత్నించాలి.


మహాభారతంలాంటి ఇతిహాసాల్లో కూడా అన్న నియమాలు చాలా చెప్పబడ్డాయి. సాత్విక - రాజస-తామసాహారాల గురించి భగవద్గీతలో పరమాత్ముడే అద్భుతంగా వివరించాడు. భౌతిక, నైతిక, ఆధ్యాత్మిక ప్రగతికి సాత్వికాహారం శ్రేష్ఠం. వండిన వెంటనే ఎక్కువ ఆలస్యం కాకుండా భుజించడం శ్రేష్ఠమని కృష్ణవచనం. నాలుగు గంటలకు పైగా ఉన్న అన్నం చెడుతుంది. ఎంత 'చల్ల బీరువా'లో దాచినా దాని రసం క్షీణిస్తుంది. వైద్య, ఆరోగ్య శాస్త్రాలు కూడా వీటిని నిషేధించాయి.


మాంసాహార నిషేధం కలిగినవారు కూడా అతి లవణ, అతి కటు, అతి ఆమ్లా(పులుపు) కాని శాకాహారాన్ని భుజించడం మంచిదంటారు. మాంసాన్ని స్వీకరించేవారు కూడా ఆదివారం, శుక్రవారం లాంటి పవిత్ర దినాలలో మాంసాన్ని భుజించరాదని శాస్త్రం చెబుతోంది. పూర్ణిమ, అమావాస్య, సప్తమి, ఏకాదశి, ద్వాదశి, పండుగ దినాలు, జన్మదినం వంటి ప్రత్యేక దినాలలో- మాంసాహారం తినరాదన్నారు. అంతేకాదు - ఆషాఢం నుండి నాలుగు నెలలు (చాతుర్మాస్యం) మాంసం తినకూడదని మహాభారతం చెబుతోంది. ఇది 'నిర్మూలన' కన్నా 'నియంత్రణ'ని అందిస్తుంది. దీని ద్వారా రాజస - తామస భావాల నిగ్రహణ సాధ్యమౌతుంది. క్రమక్రమంగా మాంసం తినే అలవాటున్న జాతులవారు కూడా మాంసాన్ని మానడం వలన యజ్ఞఫలం లభిస్తుందని వ్యాసుని మాట.


ఇక - ఏ ఆహారం స్వీకరించినా... 1. నిలబడి తినరాదు. 2. ఎంగిలి తినరాదు. 3. తినే పళ్లానికి ఎడమ చేయి తగల్చరాదు. 4. పళ్లానికి ఎడమ చేయి తగిలితే తిరిగి కడుక్కోవాలి. కడగకుండా అదే చేత్తో, లేదా తింటున్న చేత్తో ఆహార పదార్ధాన్ని ముట్టుకుంటే అది కూడా ఎంగిలవుతుంది. ఆ ఎంగిలి భోజనం మరొకరు తినరాదు. 5. చెమ్చాలతో తిన్నా ఆ చేయి ఎంగిలి చేయే. 6. ఆహారం (ఫలహారమైనా, అన్నమైనా) స్వీకరించాక పళ్ళెరాన్ని తీశాక, ఆ చోట నీటితో శుద్ది పెట్టాలి. ఆ నీటిలో పెరుగు చుక్కలైనా పసుపైనా వేసి శుద్ధి చేయాలి. 7. తాను తింటూ వడ్డించరాదు.... ఇవన్నీ శాస్త్ర నియమాలు.


'ఇవి చాదస్తాలు' అని పొగరెక్కిన బుద్ధులతో ఎంగిలి మంగలాలను దేవుకుంటున్న పశుప్రాయులు తాము ఏం కోల్పోతున్నారో తెలుసుకోవడం లేదు. తప్పనిసరై, ఆరోగ్యాది హేతువుల కోసం కొన్ని నియమాలను అతిక్రమించవచ్చు. అలాంటి పరిస్థితుల్లో ఇబ్బందిలేని కొన్ని చిన్న చిన్న ప్రాయశ్చిత్తాలు కూడా చెప్పారు. ఆహారశుద్ధి వలన సత్త్వ(ప్రాణశక్తి )శుద్ధి, సత్త్వశుద్ధి వలన చిత్తశుద్ధి... సమకూరతాయని సంప్రదాయం. 'ఆత్మశుద్ధి లేని ఆచారమదియేల?' అని అన్నప్పటికీ, ఆచారం లేనిదే ఆత్మశుద్ధి రాదన్నదీ వాస్తవమే. న్యాయంగా ఆర్జించినది, శుచిగా వండినదీ, ఈశ్వరునికి నివేదించినదీ మాత్రమే మనిషి తినవలసిన ఆహారం.


అతిథులకు, పేదలకు కూడా అటువంటి ఆహారాన్నే సమర్పించాలి, అది మనుష్య యజ్ఞం. మనమెంత నియమంగా వండినా, ఎక్కడ ఎలా తిన్నా భగవంతుని స్మరించితే అది పూర్ణశుచిని పొందుతుంది. "అన్నం బ్రహ్మా రసో విష్ణుః భోక్తా దేవో మహేశ్వరః" అని స్మరించి, ఇష్టదేవతా ప్రార్ధనతో భోజనం చేయడం ఉత్తమం. ఆచారం ఆయువును రక్షిస్తుంది. సదాచార సంపన్నమైన ఆహారం వలన మానవజాతిని తీర్చిదిద్దగలిగే బుద్ధిశక్తి సంపన్నులు ఆవిర్భవిస్తారు.

Beautiful Lines

 Beautiful Lines👍

-------------------------------

"భూమి " అనే రెండక్షరాల పైన పుట్టి 

"ప్రాణం "అనే రెండక్షరాల జీవం పోసుకుని 

రెండక్షరాల "అవ్వ "తాత "

"అమ్మ ""నాన్న " "అన్న ""అక్క "

అనే బాంధవ్యాల నడుమ పెరుగుతూ 

రెండక్షరాల "గురు " వు దగ్గర 

రెండక్షరాల "విద్య "ని నేర్చుకుని 

రెండక్షరాల "డబ్బు " ని సంపాదించి 

రెండక్షరాల "భార్య" "బిడ్డ" అనే 

బంధాలను ఏర్పరచుకొని

రెండక్షరాల "ప్రేమ"ను పంచుతూ 

రెండక్షరాల "స్నేహం" పెంపొందించుకుంటూ 

రెండక్షరాల "బాధ "ని భరిస్తూ 

రెండక్షరాల "కోపం "ను దూరం చేసుకుని 

రెండక్షరాల "నేను "అనే అహంకారాన్ని మరచి 

రెండక్షరాల "మనం "అనే మమకారాన్ని పెంచి 

రెండక్షరాల "జాలి..దయ '" లను కొండంత పెంచుతూ 

రెండక్షరాల "తీపి "అనుభవాలను గుర్తు చేసుకుంటూ 

రెండక్షరాల "చేదు "సంఘటనలను మర్చిపోతూ 

రెండక్షరాల "ముప్పు " వచ్చి

రెండక్షరాల "చావు " వచ్చే వరకు 

రెండక్షరాల "ముఖం "పైన 

రెండక్షరాల "నవ్వు "ఉంటే 

రెండక్షరాల "స్వర్గం "మన 

అరచేతిలో ఉన్నట్లే..!!

ఈ సత్యాలను తెలుసుకుని జీవించగలిగేతే 

ఉన్నప్పుడైనా, పోయాకైనా మన కోసం 

నలుగురుంటారు.....🙏😊


*ఇది నిజంగా అద్భుతం *


భారతదేశంలోని నేటి 29 రాష్ట్రాల పేర్ల మొదటి అక్షరా లను ఒక దోహాలో క్రమంగా పేర్కొన్నాడు.అత్యంత ఆశ్చర్యం

కలిగిస్తుంది ఈ అంశు. దోహాలోని అక్షరాల వరుసనూ కింద పేర్కొన్న రాష్ట్రాల మొదటి అక్షరాలనూ పరిశీలించండి.


"రామ నామ జపతే 

అత్రి మత గుసి ఆవు"


"పంక మే ఉగోహమి 

ఆహి కే ఛబి ఝాఉ"


రా - రాజస్థాన్

మ - మహారాష్ట్ర

నా - నాగాలేండ్

మ - మణిపూర్

జ - జమ్మూ కాశ్మీర్

ప - పశ్చిమ బెంగాల్

తే - తెలంగాణ

అ - అస్సామ్

త్రి - త్రిపుర

మ - మధ్యప్రదేశ్

త - తమిళనాడు

గు - గుజరాత్

సి - సిక్కిం

ఆ - ఆంధ్రప్రదేశ్

ఉ - ఉత్తర ప్రదేశ్

పం -పంజాబ్

క - కర్నాటక

మే -మేఘాలయ

ఉ - ఉత్తరాఖండ్

గో - గోవా

హ - హరియాన

మి - మిజోరమ్

అ - అరుణాచల ప్రదేశ్

కే - కేరళ

ఛ - ఛతీస్ ఘడ్

బి - బిహార్

ఝా - ఝార్ఖండ్

ఉ - ఉడిసా


ఇది నిజంగా అధ్బుతమైన అక్షరాలు 

రామ నామ మంత మధురానుభూతిని కలిగిస్తుంది.

శ్రీమద్భగవద్గీత

 శ్రీమద్భగవద్గీత:  ఐదవ అధ్యాయం

కర్మసన్యాసయోగం: శ్రీ భగవానువాచ:


సన్న్యాసః కర్మయోగశ్చ నిఃశ్రేయసకరావుభౌ 

తయోస్తు కర్మసన్న్యాసాత్ కర్మయోగో విశిష్యతే (2)


జ్ఞేయః స నిత్యసన్న్యాసీ యో న ద్వేష్టి న కాంక్షతి

నిర్ద్వంద్వో హి మహాబాహో సుఖం బంధాత్ ప్రముచ్యతే (3)


అర్జునా.. కర్మత్యాగమూ, కర్మయోగమూ కూడా మోక్షం కలగజేస్తాయి. అయితే ఈ రెండింటిలో నిష్కామకర్మయోగం మేలు. దేనిమీదా ద్వేషం, కోరిక లేనివాడు నిత్యసన్యాసి. సుఖదుఃఖాది ద్వందాలు లేకుండా అలాంటివాడు సులభంగా భవబంధాల నుంచి విముక్తి పొందుతున్నాడు.

శ్రీ దులాడియో ఆలయం

 🕉 మన గుడి : నెం 1094


⚜ మధ్యప్రదేశ్  : ఖజురహో


⚜  శ్రీ దులాడియో ఆలయం



💠 దులాడియో దేవాలయం భారతదేశంలోని మధ్యప్రదేశ్‌లోని ఖజురహోలో ఉన్న ఆలయం.  

ఈ ఆలయం లింగ రూపంలో ఉన్న శివునికి అంకితం చేయబడింది 


💠 'దులోడియో' అంటే "పవిత్ర వరుడు" అని అర్థం.

ఈ ఆలయాన్ని "కున్వర్ మఠం" అని కూడా అంటారు.  

ఈ ఆలయం తూర్పు ముఖంగా ఉంది మరియు  1000–1150 నాటిది.  చండేల కాలంలో నిర్మించిన దేవాలయాలలో ఇది చివరిది.  

ఈ ఆలయం ఏడు రథాల ప్రణాళికలో (సప్తరధ) వేయబడింది.  


💠 ఖజురహోలోలో  శివునికి ఉన్న 22 దేవాలయాలలో దులాడియో దేవాలయం ఒకటి, మధ్య భారతదేశంలోని చండేలా పాలకులచే సృష్టించబడిన 87 దేవాలయాలలో ఇవి కూడా ఉన్నాయి.  


💠 కున్వర్ మఠం అని కూడా పిలువబడే దులాడియో ఆలయం, జైన దేవాలయాల సమూహానికి నైరుతి దిశలో 700 మీటర్ల దూరంలో , ఖుదర్ నదికి సమీపంలో ఉంది.


💠ఇది ఖజురాహోలోని గొప్ప దేవాలయాలలో చివరిదని నమ్ముతారు, ఇది 1130 లో చందేల్ల రాజు మదనవర్మన్ పాలనలో నిర్మించబడింది.


💠 ఆలయ లోపలి భాగం ఖజురాహోలో కనిపించే మునుపటి దేవాలయాల కంటే చాలా సరళంగా ఉంటుంది మరియు పాశ్చాత్య భారతీయ నిర్మాణ సంప్రదాయాల ప్రభావాలను చూపిస్తుంది.

గర్భగుడిలో లింగం యొక్క కేంద్ర చిహ్నం ఉంది, ఇది ఆలయానికి సమకాలీనమైనదిగా పరిగణించబడదు కానీ తరువాత భర్తీ చేయబడింది.


💠 ఆలయ గర్భగుడిలో ఒక అందమైన శివలింగం ఉంది. 

ఆలయం యొక్క ఆసక్తికరమైన లక్షణం ఏమిటంటే, పవిత్రమైన శివలింగం ఉపరితలంపై చెక్కబడిన 999 లింగాలు ఉన్నాయి. 

శివలింగం యొక్క ప్రదక్షిణ  తీసుకోవడం 1000 ప్రదక్షిణలకు సమానమని నమ్ముతారు. 


💠 శివలింగంతో పాటు, ఆలయంలో గణేశుడు, పార్వతి దేవి మరియు గంగా దేవి వంటి ఇతర దేవుళ్ళు మరియు దేవతల విగ్రహాలు ఉన్నాయి.


💠 ఈ ఆలయంలోని శిల్పాలు ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్ సమీపంలోని జామ్సోర్‌లోని ఒక ఆలయ అవశేషాలలో లభించిన శిల్పాలతో బలమైన గుర్తింపును కలిగి ఉన్నాయి . ఈ సారూప్యత నుండి రెండు ప్రదేశాలలోని శిల్పాలు ఒకే శిల్పుల చేతిపని అని మరియు అవి 1060 నుండి 1100 వరకు, కీర్తివర్మన్ పాలనలో సృష్టించబడ్డాయని ఊహించబడింది . 


💠 ఆలయంలోని అనేక ప్రదేశాలలో లిఖించబడిన వాసల అనే పేరును బట్టి, ఆ పేరు శిల్పాలను సృష్టించిన ప్రధాన శిల్పి పేరు అని ఊహించవచ్చు.


💠 ఈ ఆలయాన్ని నిరంధార ఆలయంగా వర్గీకరించారు . 

నిరంధార అంటే సంచార మార్గం లేని ప్రదేశము అని అర్ధం.

ఇందులో సంచార స్థలం లేని గర్భగుడి, వసారా, ప్రధాన హాలు ( మహా-మండపం ) మరియు ప్రవేశ ద్వారం ఉన్నాయి. 

ఆలయములో  ప్రదక్షిణ మార్గం లేదు, ఇది 12వ శతాబ్దంలో చందేల పాలనలో నిర్మించబడిన దేవాలయాలలో చివరిది కావడం వల్ల కావచ్చు, ఆ సమయంలో వాటి నిర్మాణ దశ గరిష్ట కాలం గడిచిపోయింది.


💠 ఆలయ శిఖరం మూడు వరుసల చిన్న శిఖరాలలో సృష్టించబడింది .

 దీని లక్షణాలు సాధారణంగా ఖజురాహో సముదాయంలోని ఇతర దేవాలయాల కోసం స్వీకరించబడిన వాటికి అనుగుణంగా ఉంటాయి. స్మారక చిహ్నాల భౌతిక లక్షణాల ప్రకారం వర్గీకరణ ఒక ఎత్తైన స్థావరాన్ని కలిగి ఉంటుంది, ఇది ఒక ఉప నిర్మాణం, దానిపై గొప్పగా అలంకరించబడిన నిర్మాణం పైకి లేచి గొప్ప శిల్పాలతో కప్పబడి ఉంటుంది. 

నిర్మాణ శైలి నాగర , ఇది శివుని నివాసమైన కైలాస పర్వతాన్ని సూచిస్తుంది .


💠 ఆలయంలోని ప్రధాన హాలు చాలా పెద్దది మరియు అష్టభుజాకార ఆకారంలో ఉంటుంది. 

దీని పైకప్పు సొగసైన చెక్కబడిన దివ్య నృత్యకారులు ( అప్సరాలు ) ఉన్నారు. అప్సరసలతో చెక్కబడిన ఇరవై బ్రాకెట్లు ఉన్నాయి, ప్రతి బ్రాకెట్‌లో ఒకదానికొకటి రెండు లేదా మూడు అప్సరసలు ఉన్నాయి మరియు పైకప్పులో వృత్తంలో అమర్చబడి ఉన్నాయి. 


💠 చెట్ల చుట్టూ నృత్యం చేసే ఆడపిల్లలు మరియు శృంగార భంగిమల్లో ఉన్న మహిళలు కూడా ఆలయ నిర్మాణంలో భాగం.

 ఇది "ఖజురహో నిర్మాణ మరియు శిల్ప నైపుణ్యం యొక్క చివరి ప్రకాశం" అని చెప్పబడింది. 

ముఖభాగంలోని పై వరుసలలో అతీంద్రియ జీవుల ( విద్యాధార ) శిల్పాలు శక్తివంతమైన రీతిలో ఉన్నాయి. 


💠 సమయాలు:

 ఉదయం 6 నుండి సాయంత్రం 5 వరకు.



రచన

©️ Santosh Kumar

17-07-గీతా మకరందము

 17-07-గీతా మకరందము.

           శ్రద్ధాత్రయ విభాగ యోగము

   

  -పూజ్యశ్రీశ్రీశ్రీ విద్యాప్రకాశానందగిరి స్వాములవారు,

శ్రీశుకబ్రహ్మాశ్రమము, శ్రీకాళహస్తి.


అవతారిక - ఇక మూడువిధములైన ఆహారము, యజ్ఞము, తపస్సు, దానములను గూర్చి చెప్పుచున్నారు - 


ఆహార స్త్వపి సర్వస్య 

త్రివిధో భవతి ప్రియః | 

యజ్ఞస్తపస్తథా దానం 

తేషాం భేదమిమం శృణు || 


తాత్పర్యము:- ఆహారముకూడ సర్వులకును (సత్త్వాది గుణములనుబట్టి) మూడు విధములుగ ఇష్టమగుచున్నది. ఆలాగుననే యజ్ఞము, తపస్సు, దానముకూడ జనులకు మూడువిధములుగ ప్రియమై యుండుచున్నది. ఆ యాహారాదుల ఈ భేదమును గూర్చి (చెప్పెదను) వినుము.


వ్యాఖ్య:- ఆహారాదులను నాలుగింటిని గుఱించి చెప్పదలంచి భగవానుడు వానిలో ఆహారమును గూర్చియే మొట్టమొదట ప్రస్తావించుట గమనింపదగినది. జీవుని ఆధ్యాత్మిక సాధనక్రమములో ఆహారశుద్ధి ప్రప్రథమమైనది. ఆహారశుద్ధిచే చిత్తశుద్ధి, చిత్తశుద్ధిచే జ్ఞానోదయము సంభవించును. ఆహారము శుద్ధముగలేనిచో మనస్సున్ను మలినముగానుండుటవలన దానివలన లక్ష్యప్రాప్తి చేకూరకయేయుండును.


ప్రశ్న:- ఆహారము, యజ్ఞము, తపస్సు, దానము జనులకు ఎన్నివిధములుగ ప్రియమై  యుండును? 

ఉత్తరము:- వారివారి గుణముననుసరించి మూడు విధములుగ ప్రియమైయుండును (సత్త్వగుణము గలవారికి సాత్త్వికాహారము - ఈ ప్రకారముగ).

తిరుమల సర్వస్వం -222*

 *తిరుమల సర్వస్వం -222*

 *శ్రీవేంకటేశ్వరుని సేవలో దాసభక్తులు-1* 


 శ్రీమహావిష్ణువు కలియుగ అవతారమైన శ్రీవేంకటేశ్వరుని ప్రాభవాన్ని, మహిమలను, ఆశ్రితపక్షపాతాన్ని ఎందరెందరో భక్తులు, కవులు, వాగ్గేయకారులు రసరమ్య భరితంగా వర్ణించారు. అటువంటి వారిలో శ్రీనివాసుణ్ణి తమ అమూల్యమైన పదబంధాలతో కీర్తించి తరించిన *'కర్ణాటక హరిదాసులు'* అగ్రగాములుగా నిలిచారు. వారు రచించి, ఆశువుగా కీర్తించిన వేలాది కృతులను *'దాససాహిత్యం'* గా పేర్కొంటారు. ఈ దాసపరంపరకు చెందినవారు శ్రీవేంకటాచలాధీశుణ్ణి కన్నడభాషలో వర్ణించినందువల్ల, ఆ సాహితీసంపదను అత్యధిక సంఖ్యలో ఉన్న శ్రీవారి తెలుగు భక్తులకు సులభంగా అర్థమయ్యే అచ్చ తెలుగుభాషలోకి అనువదించి, ప్రచారం చేసే బృహత్తర కార్యక్రమాన్ని *‘దాససాహిత్య ప్రాజెక్టు’* పేరుతో తి.తి.దే. చేపట్టింది. *'అన్నమాచార్య ప్రాజెక్టు'* ద్వారా అన్నమయ్య కీర్తనలను అందరికీ అర్థమయ్యే సాధారణ తెలుగులోకి ఎలా తర్జుమా చేసి జనబాహుళ్యం లోకి తెచ్చారో, అదే విధంగా *‘దాససాహిత్య ప్రాజెక్టు'* ద్వారా కన్నడభాషలో ఉన్న కీర్తనలను కూడా తెనిగీకరించుతారన్నమాట!



 *దాస సాహిత్యం ప్రాముఖ్యత* 


 కొన్ని శతాబ్దాల క్రితం వరకు వేదాలు, ఉపనిషత్తులు, మహాభారతం, భాగవతం, అష్టాదశ పురాణాలు సామాన్య మానవులకు అంతగా ప్రవేశం లేని సంస్కృతభాషలో నిక్షిప్తమై ఉండేవి. కర్ణాటక ప్రాంతానికి చెందిన కొందరు మహాపండితులు దేవనాగరిలిపిలో ఉన్న సాహిత్యాన్ని సాధారణ జనస్రవంతి లోకి తీసుకు వెళ్ళే ఉద్దేశ్యంతో, ఆ సాహిత్య నిక్షేపాలన్నిటినీ విస్తృతంగా వాడుకలో ఉన్న సాధారణ కన్నడభాషలోకి అనువదించి; కుల, వర్ణ, లింగ వివక్షత లేకుండా ప్రజలలో ప్రచారం చేయాలని సంకల్పించారు. దానితో బాటుగా ఎందరో హరిదాసులు శ్రీవేంకటేశుని మహిమలను వీనులవిందుగా వర్ణించి తరించారు. తమను తాము భగవంతునికి దాసులుగా భావించుకుని, శ్రీవారిసేవకే తమ జీవితాలను సమర్పించుకున్న ధన్యజీవులను 'హరిదాసులు' లేదా 'దాసభక్తులు' గా అభివర్ణిస్తారు. హరికథలు, కీర్తనలు, దేవరనామాలు, భజనలు వంటి కళారూపాల్లో ప్రత్యక్షంగా, లేదా దృశ్య శ్రవణ మాధ్యమాల సాయంతో విస్తృతంగా శ్రీవేంకటేశ్వరతత్వాన్ని ప్రచారం చేయటం ద్వారా; పండితులకే పరిమితమైన ‘వ్యాససాహిత్యం’ అందరికీ అందుబాటులో ఉండే 'దాససాహిత్యం' గా రూపుదిద్దుకుంది. తద్వారా గడచిన కొద్ది శతాబ్దాలలో వేదాల, ఉపనిషత్తుల, ఆధ్యాత్మికతత్వ సారం కర్ణాటక ప్రాంతంలో నలుదెసలా విస్తారంగా వ్యాప్తి చెందింది. తరువాతి కాలంలో విజయనగరసామ్రాజ్య పతనం మరియు పురందరదాసు, కనకదాసుల వంటి ప్రఖ్యాత దాసభక్తుల నిర్యాణంతో; ప్రోత్సాహం కరువై ఈ ఉద్యమం మరింత ముందుకు సాగలేదు. పై నేపథ్యంలో అప్పటికే విస్తృతప్రచారంలో ఉన్న దాససాహిత్యాన్ని తెలుగుభక్తుల చెంతకు తీసుకురావడం కోసం తి.తి.దే. చేపట్టిన *దాససాహిత్య ప్రాజెక్టు* యొక్క పూర్వాపరాలు తెలుసుకునే ముందు, కొందరు ప్రముఖ దాసభక్తులను స్మరించుకోవాలి.


 *దాసభక్తులు* 


 దాససాహిత్య వ్యాప్తిని తమ భుజస్కంధాలపై వేసుకుని కర్ణాటక దేశమంతా విస్తృతంగా పర్యటించిన కర్ణాటక హరిదాసులను తలచుకునేటప్పుడు మొట్టమొదటగా శ్రీపాదరాయలు వారిని, తరువాత వ్యాసరాయలు వారిని ముఖ్యంగా పేర్కొనాలి. ఆ తరువాత కర్ణాటక సంగీత పితామహులుగా పేరుగాంచిన ఆనాటి *పురందరదాసు, కనకదాసు, విజయదాసు, గోపాలదాసు, జగన్నాథ దాసు* లతో పాటుగా ఈమధ్య కాలం నాటి *శ్యామసుందర దాసు* కూడా స్మరణకు తెచ్చుకోదగ్గవారు. వీరిలో కొందరు అతి ముఖ్యులైన దాసభక్తుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.


 *శ్రీపాదరాయలవారు* 


 కర్ణాటక దాసులను మననం చేసుకునేటప్పుడు,


*‘నమః శ్రీపాదరాజయ నమస్తే వ్యాసయోగినే!* 

*నమః పురంధరార్వాయ విజయార్యతే నమః'*


అంటూ మొట్టమొదటగా దాససాహిత్యానికి ఆద్యుడయినటువంటి శ్రీపాదరాయలు వారిని ప్రస్తావించడం అనూచానంగా వస్తున్న సాంప్రదాయం. భౌతికమైన ఈ మాయా ప్రపంచం నుంచి తనను రక్షించువాడు, ఇహలోకం లోని క్లేశాలను దూరం చేయువాడు ఆ వేంకటాచాలాధీశుడే అని శ్రీపాదరాయలు వారు నమ్మారు. శ్రీవారి మూలరూపం మరియు శ్రీమహావిష్ణువుకు యొక్క అవతార రూపాలకు బేధం లేదని ప్రతిపాదించి, శ్రీమహావిష్ణువును ఉపాసన చేసి తన జీవితాన్ని పండించుకున్నారు.


 శ్రీకృష్ణదేవరాయలుతో పాటుగా ముగ్గురు విజయనగర సామ్రాట్ లకు రాజగురువుగా సేవలందించి, శ్రీవెంకటేశ్వర భక్తితత్వాన్ని దక్షిణభారత దేశమంతటా చాటిచెప్పిన శ్రీ వ్యాసరాయల వారి గురించి మనం ఇంతకు ముందే తెలుసుకున్నాం. స్వామిపుష్కరిణీ తటాన, వారు పెక్కు సంవత్సరాల పాటు త్రికాల సంధ్యావందనాదు లొనర్చిన *'వ్యాసరాజ ఆహ్నీకమండపాన్ని',* ఈనాడు కూడా తిరుమలలో ప్రధానాలయపు ఉత్తర మాడవవీధిలో, ఆదివరాహస్వామి ఆలయానికి ఎదురుగా చూడవచ్చు.

*శ్రీనివాసుని శ్రీచరణాలను సేవిద్దాం, సకల శుభాలనూ పొందుదాం* 


*రచన* 

*పల్లపోతు కృష్ణ బాలాజీ గారు- వాణి శ్రీ దంపతులు*

ఫోన్ నెంబర్

99490 98406

మహాభారతము

 *సంపూర్ణ మహాభారతము**సరళ వ్యావహారిక భాషలో...!*

*ద్రోణ పర్వము పంచమాశ్వాసము*


*360 వ రోజు*


*అశ్వత్థామ నారాయణాస్త్రం ప్రయోగించుట*


అశ్వత్థామ నారయణాస్త్రాన్ని ధ్యానించి విల్లు సంధించాడు. నారయాణాస్త్రాన్ని పాండవసేనల మీద ప్రయోగించాడు. ఆ అస్త్రధాటికి భూమి దద్దరిల్లింది. దిక్కులు పిక్కటిల్లాయి. సముద్రములు పొంగాయి. ఆ దివ్యాస్త్రం నుండి అనేక ఆయుధములు పుట్టి పాండవ సేన మీదకు వస్తున్నాయి. పాండవ సేన దానిని శాయశక్తులా ఎదుర్కొంటున్నారు. కాని దాని ధాటికి తాళ లేక పోతున్నారు. నారయణాస్త్రం పాండవ సేనను నాశనం చేస్తుంది. అది చూసి ధర్మరాజు అర్జునుడి వంక చూసాడు. అర్జునుడు మాటాడ లేదు. ధర్మరాజు అర్జునుడు, కృష్ణుడు వినేలా ధృష్టద్యుమ్నుడు సాత్యకులతో ఇలా అన్నాడు. " ఆ ద్రోణుడు ఎంత క్రూరుడంటే నాడు నిండు కొలువులో ద్రౌపదిని అవమానిస్తుంటే చూస్తూ ఉఉరుకున్నాడు కాని ఒక్క మాట అన లేదు. బాలుడైన అభిమన్యుని మరణానికి కారణమయ్యాడు. సూర్యాస్తమయం అయితే అర్జునుడు అగ్ని ప్రవేశం చేయాలని తెలిసీ మనలను అర్జునుడికి సాయంగా వెళ్ళ నీయక అడ్డుకున్నాడు. మరి అలాంటి ధర్మపరునితో మనం సరి తూగగలమా ! ఈ నారాయణాస్త్ర సాక్షిగా చెప్తున్నాను. మీరంతా పారి పోయి మీ ప్రాణాలను దక్కించుకొండి. అప్పుడు అర్జునుడు కోరిక నెరవేరుతుంది. శ్రీకృష్ణుడేమి చేస్తాడో ఆయన ఇష్టం " అని నిష్టూరంగా అన్నాడు. ఇక కృష్ణుడు ఊరక ఉండలేక రధము మీద నిలబడి " ఓ సైనికులారా ! పాండవ వీరులారా ! భయపడకండి. మీరంతా మీ మీ రథములు వాహనములు గజములు హయములు దిగి ఆయుధములు కింద పడవేయండి. నారాయణాస్త్రానికి ఇదే విరుగుడు. వేరు ఉపసంహారం లేదు " అన్నాడు.


*నారాయణాస్త్రాన్ని భీముడు ఎదుర్కొనుట*


శ్రీకృష్ణుడి మాటలకు సైనికులు తమ తమ వాహనములు దిగుతుండగా భీముడు " మహా వీరులారా ఆగండి వాహనములు దిగకండి వీరోచితంగా పోరాడండి. నేను ఉన్నాను, మహాస్త్రాలను ప్రయోగిస్తాను, నా గదతో అందరిని గెలుస్తాను " అని ఎలుగెత్తి అరచి తన గధ తీసుకుని అశ్వత్థామ మీదకు ఉరికాడు. అశ్వత్థామ నారాయణాస్త్రాన్ని భీముని మీదకు మళ్ళించాడు. భీముని మాట వినక అందరూ తమతమ వాహనములు దిగి ఆయుధములు కింద పెట్టారు. ఆ నారాయణాస్త్రము వారిని విడిచి ఆయుధధారి అయిన భీముని వెంటబడింది. అది చూసి భీముడు వారుణాస్త్రాన్ని ప్రయోగించాడు. వారుణాస్త్ర ప్రభావానికి నారాయణాస్త్రం శక్తి కొంత తగ్గింది. వెంటనే అశ్వత్థామ దాని శక్తిని పెంచాడు. ఆ నారాయణాస్త్రం భీముడిని భీకర అగ్నిజ్వాలలను విరజిమ్ముతూ చుట్టుముట్టింది. అది గమనించిన కృష్ణార్జునులు తమ ఆయుధములను రధము మీద ఉంచి రధము దిగి భీముని రధము వద్దకు పరుగెత్తి అతడిని రధము మీద నుండి కిందకు దించుటకు ప్రయత్నించారు. భీముడు రధము దిగక మూర్ఖంగా అలాగే ఉన్నాడు. అప్పుడు కృష్ణుడు " భీమసేనా ! మహా వీరా! ఈ అస్త్రమును ఉపసంహంరించే శక్తి అశ్వత్థామకు కూడా లేదు. దీనికి ఆయుధములు కింద పెట్టడమే విరుగుడు. నా మాట విని ఆయుధములు విడిచి రథము దిగవయ్యా " అంటూ కృష్ణుడు బతిమాలుతూ భీముని చేతి నుండి ఆయుధములు లాగాడు. అర్జునుడు, కృష్ణుడు కలసి ఒక్క తోపుతో రధము నుండి కిందకు తోసారు. ఇక పాండవ సైన్యంలో ఎవరి చేతా ఆయుధములు లేక పోయే సరికి ఆ ఆయుధము శాంతించి వెను తిరిగింది. వెంటనే అందరిని ఆయుధములు ధరించి యుద్ధముకు సిద్ధం కమ్మని కృష్ణుడు ఆదేశించడంతో పాండవసైన్యం తిరిగి కౌరవ సైన్యంపై విజృంభించింది.


*రేపు *

*భారతంలో ఉండేది భూమిపై ఎక్కడైనా ఉంటుంది భారతంలో లేనిది భూమిపై ఎక్కడా లేదు*

*రోజూ భారతం చదవండి భగవద్ అనుగ్రహం పొందండి*

10 గ్రాముల బంగారం మార్కెట్ ధర Gold

 1925 నుండి 2025 వరకు 100 సంవత్సరాల 

10 గ్రాముల బంగారం మార్కెట్ ధర 

____________________

సంవత్సరం రూపాయలు 

1925. 18.75

1926. 18.43

1927. 18.37

1928. 18.37

1929. 18.43

1930. 18.05

1931. 18.18

1932. 23.06

1933. 25.05

1934. 28.81

1935. 30.81

1936. 29.81

1937. 30.18

1938. 29.93

1939. 31.75

1940. 36.05

1941. 37.43

1942. 44.05

1943. 51.05

1944. 52.93

1945. 62.00

1946. 83.87

1947. 88.62

1948. 95.87

1949. 96.18

1950. 97.18

1951. 98.00

1952. 76.81

1953. 73.00

1954. 77.00

1955. 79.00

1956. 90.00

1957. ‌ 90.00

1958. ‌ 95.00

1959. 102.00  

1960. 111.00

1961. 119.00

1962. 119.00

1963. 97.00

1964. 63.00

1965. 72.00

1966. 84.00

1967. 102.00

1968. 162.00

1969. 176.00

1970. 184.00

1971. 193.00

1972. 202.00

1973. 278.00

1974. 506.00

1975. 540.00

1976. 572.00

1977. 576.00

1978. 685.00

1979. 937.00

1980. 1330.00

1981. 1700.00

1982. 1645.00

1983. 1800.00

1984. 1970.00

1985. 2130.00

1986. 2140.00

1987. 2570.00

1988. 3130.00

1989. 3140.00

1990. 3200.00

1991. 3466.00

1992. 4334.00

1993. 4140.00

1994. 4598.00

1995. 4680.00

1996. 5160.00

1997. 4725.00

1998. 4045.00

1999. 4680.00

2000. 4400.00

2001. 4300.00

2002. 5000.00

2003. 5600.00

2004. 5850.00

2005. 7000.00

2006. 8400.00

2007. 10800.00

2008. 12500.00

2009. 14500.00

2010. 18500.00

2011. 26400.00

2012. 29500.00

2013. 29600.00

2014. 28734.00

2015. 26845.00

2016. 29560.00

2017. 29920.00

2018. 31730.00

2019. 36080.00

2020. 48480.00

2021. 50000.00

2022. 53000.00

2023. 60000.00

2024. 80000.00

2025. 96000.00

___________________


తేదీ.17.04.2025 వ నాటి వరకు ధర.


మీరు పుట్టిన సంవత్సరం 

మీకు పెళ్లైన సంవత్సరం 

మీకు పిల్లలు పుట్టిన సంవత్సరం 

మీ పిల్లల పెళ్లిళైన సంవత్సరం 

మీరు పదవీ విరమణ చేసిన సంవత్సరం లో 

బంగారం ధర ఎంత ఉందో చూడండి.

ఈ రోజు ధర ఎంత ఉందో చూడండి.

మీ మనవళ్లు మనవరాళ్లు పుట్టినప్పుడు వారి పెళ్లిళ్ల సందర్భంగా బంగారం ధర 

 ఎంత ఉంటుందో ఊహించుకోండి.

ముందు తరాల వారి అవసరాలను దృష్టిలో ఉంచుకుని దుబారా ఖర్చులు తగ్గించుకుని 

కొంచెం కొంచెం బంగారం కొని దాచండి.

ఎందుకంటే ఒక్కో చుక్క నీరే సముద్రమౌతుంది.

        

          😊 🙏🙏🙏🙏😊

వైశాఖ మాసం :

 *వైశాఖ మాసం :


వైశాఖ మాసానికి మరో పేరు మాధవ మాసం. మాసాలన్నింట్లో వైశాఖమాసం ఉత్తమమైనది. విశేషదానాలకి ఎంతో పుణ్య ప్రదమైన మాసం గా పురాణాలలో చెప్పబడింది. శ్రీ మహా విష్ణువు కు ప్రీతి కరమైన ఈ వైశాఖ మాసం లో తులసి దళాలతో శ్రీ మహావిష్ణువు ను లక్ష్మీ దేవితో కలిపి పూజించిన వారికి ముక్తి దాయకం. ఈ మాసం లో *ఏక భుక్తం, నక్తం అయాచితం గా భుజించడం ఉత్తమం గా చెప్పబడింది.* వైశాఖ మాసం దేవతలతో సహా అందరికీ పూజనీయమైనది. యజ్ఞాలకు, తపస్సులకు పూజాదికాలకు, దాన ధర్మాలకు ఎంతో ఎక్కువ ఫలమిచ్చి శాంతినిచ్చి కోరికలను తీరుస్తుంది.


ఎవరైతే ఈ మాసం లో సూర్యోదయానికి ముందే లేచి స్నానం చేస్తారో, వారికి ఉత్తమగతులు కలుగుతాయి. ఉదయాన్నే స్నానం చేసి ఎక్కువ నీటి తో రావి చెట్టు మొదళ్ళను తడిపి ప్రదక్షిణాలు చేస్తే పూర్వీకులంతా తరిస్తారు. ఈ మాసం లో శివునికి ధారపాత్ర ద్వారా అభిషేకం జరిగేలా ఏర్పాటు చేయడం శుభ ఫలితాలనిస్తుంది.

మన సంస్కృతి ఉత్కృష్టమైనది. మనకు ఈ ప్రకృతి.. అందులోని చరాచరాలన్ని పూజనీయాలే! అంతేకాకుండా మనం కాలగణనకు ఉపయోగించే తిథులు, నక్షత్రాలు, వారాలు, మాసాలు అన్నీ ఎంతో గొప్పదనాన్ని, ప్రత్యేకతను సంతరించుకున్నటువంటివే. 

చాంద్రమానం పాటించే మనకు చైత్రం మొదలుకుని ఫాల్గుణం వరకు పన్నెండు నెలలు ఉన్నాయి. ఒక్కో మాసానికి ఒక్కో ప్రత్యేకత, విశిష్టత ఉన్నాయి.

కార్తీక మాఘమాసాల తర్వాత అంతటి మహత్యాన్ని స్వంతం చేసుకున్న పుణ్యప్రదమైన మాసం వైశాఖం. ఈ నెలలోనే పూర్ణిమ తిథినాడు విశాఖ నక్షత్రం ఉండడం వల్ల ఈ మాసానికి *వైశాఖ మాసం* అనే పేరు ఏర్పడింది. ఆద్యాత్మికత, పవిత్రత, దైవశక్తి ఉన్న నెలల్లో వైశాఖమాసానికి ప్రత్యేక స్థానం ఉంది.


ఇది శ్రీ మహావిష్ణువుకు అత్యంత ప్రీతిపాకరమైన నెల. అందువల్లనే వైశాఖ మాసానికి మాధవమాసం అని పేరు. అత్యంత పవిత్రమైన మాసంగా

పేరుపొందిన *వైశాఖమాస మాహత్మ్యంను పూర్వం శ్రీమహావిష్ణువు స్వయంగా శ్రీమహాలక్ష్మికి వివరించినట్టు పురాణాలు పేర్కొంటున్నాయి.* అత్యంత పవిత్రమైన మాసంగా చెప్పబడుతూ ఉన్న వైశాఖమాసంలో ప్రతి దినమూ పుణ్యదినమే.

అటువంటి ముప్పై పుణ్యదినాలు కలిగిన ఈ మాసంలో ఆచరించాల్సిన విధులు పురాణా గ్రంధాల్లో వివరించబడ్డాయి. ముఖ్యంగా స్నాన, పూజ, దానధర్మాల వంటి వాటిని ఈ నెలలో ఆచరించడం వల్ల మానవుడికి ఇహలోకంలో సౌఖ్యం, పరలోకంలో మోక్షం సిద్ధిస్తాయని పురాణ కథనం.


వైశాఖమాసంలో నదీ స్నానం ఉత్తమమైనదిగా చెప్పబడింది. అందుకు అవకాశం లేని స్థితిలో గంగ, గోదావరి వంటి పుణ్యనదులను స్మరించుకుంటూ కాలువల్లోగానీ, చెరువులోగాని, బావుల వద్దగానీ అదీ కుదరకపోతే ఇంట్లోనే స్నానం చేయాలి నీటియందు సకల దేవతలు కొలువుతీరి ఉంటారని పురాణాలు చెబుతున్నాయి.

వైశాఖమాసంలో సూర్యుడు మేషరాశిలో సంచరిస్తూ ఉంటాడు. కనుక ఎండలు అధికంగా ఉండి మానవులను ఇబ్బందులను గురిచేస్తూ ఉంటాయి. కనుక వేడిమినుంచి ఉపసమనం కలిగించేవాటిని దానం ఇవ్వాలనేది శాస్త్రవచనం, నీరు, గొడుగు, విసనకర్ర, పాదరక్షలు వంటివి దానం చేయడం శ్రేష్టం. అట్లే దాహంతో ఉన్నవారికి మంచినీటిని ఇవ్వడం, చలివేంద్రాలను ఏర్పాటు చేయడం వల్ల దేవతానుగ్రహం కలుగుతుంది.

సంధ్యావందనాలు ఆచరించడంతో పాటు శ్రీమహావిష్ణువును తులసీదళాలతో పూజించవలెను. శ్రీమహావిష్ణువు వైశాఖమాసం మొదలుకొని మూడునెలలపాటూ ఈ భూమి మీద విహరిస్తూ ఉంటాడు. అతనికి అత్యంత ప్రీతికరమైన తులసీదళములతో అర్చించడం వల్ల సంతుష్టుడై సకల సౌభాగ్యాలను, సౌఖ్యాన్ని ప్రసాదిస్తాడని చెప్పబడుతున్నది.

వేద ఆశీర్వచనం

 *నమస్తే సదా వత్సలే మాతృ భూమే*


*కలియుగాబ్ది 5126*

*శ్రీ శాలివాహన శకం 1947 స్వస్తి శ్రీ చాంద్రమాన విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం - వసంత ఋతువు - వైశాఖ మాసం - శుక్ల పక్షం - ప్రతిపత్ - భరణి -‌‌ ఇందు వాసరే* (28.04.2025)


ప్రముఖ వేదపండితులు, తణుకు /తాలూకా ఇరగవరం వాస్తవ్యులు 

*బ్రహ్మశ్రీ గుళ్ళపల్లి శివశర్మ ఘనపాఠీ* *(9491391009, 9440091234)* గారి నేటి వేద ఆశీర్వచనం.





.🙏🙏 

భవదీయుడు

దశిక ప్రభాకరశాస్త్రి 

9849795167

----------------------------------------------

*పిల్లలకి బతుకుతో పాటు భారతీయత కూడా నేర్పండి*