16, జూన్ 2023, శుక్రవారం

సంస్కృతభాషా పరిచయం

 ప్రతివానికి సంస్కృతభాషా పరిచయము


సంస్కృతశ్లోకం ఎవరయినా చదువుతున్నాసరే, సంస్కృతంలో ఎవరయినా ఉపన్యాసమిస్తున్నాసరే మనమందరమూ అనువాదకుని సాహాయ్యంలేకుండా గ్రహించగల్గినంత సంస్కృత భాషాపరిజ్ఞానం కల్గి ఉండాలి. దాదాపు ఎనిమిదివందల సంవత్సరాలక్రితం ఒక భారతదేశంలోనేకాక, దూరప్రాచ్యదేశాలు: నయాం, కంబోడియా, జావా, బాలీదేశాలలోకూడా సంస్కృతం రాజభాషగా ఉండేది. ఈదేశాలలో ఇప్పటికీ, సంస్కృత భాషలోని పురాతన శిలాశాసనాలూ, తామ్రశాసనాలూ కనపడుతున్నవి. అంతేకాదు. మనదేశంలోనే దక్షిణాదిజిల్లాలలో కనపడే ద్రావిడ శిలాశాసనానలలోకూడా శాసనం 'స్వస్తిశ్రీ' అన్న సంస్కృతపదాలతో ప్రారంభం. కామకోటిమఠంనుండి జారీచేయబడే శ్రీముఖాలుసైతం 'స్వస్తిశ్రీ' అన్న పదాలతోనే ప్రారంభమవుతవి. 


న్యాయస్థానాలలోకూడా వ్యవహారకాండ ధర్మశాస్త్రాలనే అనుగమించేది. బ్రిటీషువారు రాకపూర్వం, దక్షిణాదిని ముస్లిముల పరిపాలన కొద్దికాలమైనా, ఆ కాలములో కూడా వాదులు, ప్రతివాదులు హిందువులైతే, 'సాదర్ అమీన్' 'సాదర్ అదాలత్' అనబడే న్యాయస్థానాలలో పండితులసహాయాన్ని అభ్యర్థించి తీర్పు చెప్పేవారు. పార్టీలు ముస్లిములు అయితే కాజీలను పిలువనంపేవారు. మెయిన్స్ హిందూ లా (ఃశnn| ఐndష ంశూ) వ్రాయబడేసరికి ఈ పండితుల కందరికి నిరుద్యోగం ప్రాప్తించింది. కావేరీతీరంలోవుండే గ్రామస్థుల పూర్వవ్యవహారాలు తరచిచూస్తే, వారి విద్యావైదుష్యాలు, తిరువాన్కూరు మహారాజావారి ఆస్థానంలో ఏవిధంగా గౌరవాదరణలు పొందినవో వ్యక్తమవుతుంది. కొంతకొంత పుదుక్కోట ఆస్థానమూ ఈపండితులను ఆదరించింది. దక్షిణాత్య పండితులు పూనాలోని పీష్వాల సదస్సులోనూ తమతమ విద్వత్తునుచూపిపారితోషికాలనుపొందినట్లు తెలియవస్తున్నది. 


రాజులకాలం, జమిందారులకాలం చెల్లిపోయింది. అది గతచరిత్ర. ప్రస్తుతమున్నది ప్రజాప్రభుత్వం. ఇందుప్రతిపౌరుడూ ఒక రాజే ఒకనివద్దనున్న రాచరికం తునియలు చేయబడి ప్రతిపౌరునికిన్నీ పంచబడినది. అందుచే సంస్కృతభాషలో ఉన్న విజ్ఞానసంపదా, ఐహికజ్ఞానమూ ఆముష్మికజ్ఞానమూ జారవిడుచుకోకుండా సంస్కృతభాషా పరిచయం వృద్ధిచేసుకోవడం మనకు ఎంతైనా అవసరం. అట్లాచేస్తే దీనిమేలు మనదేశానికే కాదు, లోకానికే ఉపకారంగాకూడా పరిణమిస్తుంది. 


శంకరభగవత్పాదుల శిష్యకోటిలో తోటకాచార్యులనే ఆయన ఒకరు ఉండేవారు. చూడడానికి కాస్త మందకొడిగా ఉండేవారు. చూచేవారికి పాఠాలు ఆయనకు ఎక్కుతున్నట్టు కనిపించేది కాదు. అందుచేత ఇతరశిష్యులకు ఈయన అంటే కొంచెం చిన్నచూపు. ఆచార్యులవారు దీనిని గమనించారు. శిష్యులలో ఈఅహంకారం వృద్ధిఐతే వారికే చెరుపుకదా అని అనుకొన్నారు. వీరికి ఈ అహంకారం కూడదనుకొన్నారు. వారు సంకల్పసిద్ధులుగదా! వారు ఈవిధంగా అనుకొనేసరికి తోటకాచార్యులవారికి ఎక్కడలేని కవిత్వం పుట్టుకొచ్చింది. ఆనందంతో నృత్యంచేస్తూ 'విదితాఖిలశాస్త్ర సుధాజలవిధే'యని తోటకవృత్తాలను ఎనిమిదిటిని అశువుగా చెప్పారు. దీనిని చూచిన ఆచార్యులవారి శిష్యులు నివ్వెరపడి అశ్రుపూరిత నేత్రాలతో తమ తప్పిదాన్ని తెలుసుకొని క్షమాభిక్ష వేడుకొన్నారు. 


తోటకాచార్యులు వ్రాసిన ఈతోటకాష్టకంలో ఎన్నో గొప్ప వేదాంతసత్యాలుండటమేకాక, ఆచార్యులవారి అవతారోద్దేశమూ వివరించబడినది. సూర్యోదయముతో లోకమంతటా ఆవరించిన చీకట్లు ఏవిధంగా తొలగిపోతవో అదేవిధంగా జ్ఞానభాస్కరులవంటి ఆచార్యుల అవతరణతో అజ్ఞానతిమిరాలు విచ్చిపోయి అందరూ జ్ఞానసౌధం అధిరోహించి అంతిమ సత్యాన్ని కనుగొనడానికి అవకాశ మేర్పడింది. 


వ్యావహారికమనీ, పారమార్ధికమనీ జ్ఞానం రెండు రకాలు. మన మనస్సులు ఎంతవరకు కామక్రోధాదులవశంలో ఉంటవో, అంతవరకు మనము పారమార్ధికజ్ఞానపాత్రులం కాలేదన్నమాట. సత్కర్మలూ, సత్సంగమూ మనకు నిత్యానిత్య వివేకాన్ని ఇస్తవి. ఆ సత్యజ్ఞానం మనము ఎపుడైతే ప్రదర్శించగల్గుతామో, అప్పుడు మనం ఆధిరోహించిన సోపానపంక్తి తిరోభూతమవుతుంది. అట్లుకాక పరిపక్వం కానివానికి సిద్ధము కానివానికి సత్యజ్ఞానము నివ్వబోతే, అది హానికే కారకమవుతుంది. పాములనుపట్టేవాళ్ళ ఇంటిలోని పిల్లవాడుకూడాపాము పుట్టలోనుంచి పాముతోకనుపట్టుకొనిసులభంగా, నిరపాయంగా కౌశలంగా లాగగల్గుతాడు. ఆ పని సులభంగా ఉందని మనము చేయబోతే పాముకాటు తప్పదు. అదేవిధంగా, అసిద్ధంగా ఉన్నవానికి, పరిపక్వం కానివానికి, మనం సత్యజ్ఞానాన్ని అందిస్తే దానివల్ల వాడు బాగుపడడానికి అవకాశం లేకపోవడమేకాక, చెడుపుకు దారితీస్తుంది. అందుచేతనే మన శాస్త్రాలు- 'ఇది రహ్యసం' అని చెప్పడం. గీతాశాస్త్రమూ అదేవిధంగా ''రాజవిద్యా రాజగుహ్యం పవిత్ర మిదముత్తమమ్'' అని చెప్పుతున్నది. 


అందుచేత పారమార్ధికజ్ఞానం మనకు కలుగవలెనంటే మొదట వ్యావహారికజ్ఞానాన్ని అభ్యసించి, మనోవికాసం పొందాలి. మన శాస్త్రాలలో, మన పుస్తకాలలో ఉన్న జ్ఞానసంపద యొక్క వైవిధ్యం నిజంగా అసమానమైనది. నవీనజ్ఞానం ఉదయించకముందే, మన ఖగోళశాస్త్రజ్ఞులు భూమి గుండ్రని ఆకారంతో ఉన్నదనీ, అది సూర్యునిచుట్టూ భ్రమిస్తున్నదనీ వ్రాసిఉన్నారు. మరొకతరగతివారు భూమికాదు భ్రమించడం, సూర్యుడే భూమిచుట్టూతిరుగుతున్నాడని వ్రాసినారు. న్యూటన్ భూమ్యాకరణసిద్ధాంతాన్ని చెప్పిఉన్నది. మనము చదువవలెనేకాని మనకున్న విజ్ఞానసంపద కొలదిఐనది కాదు. 


మన మాతృభాషలలో పాండిత్యం సంపాదించడం మన ముఖ్యధర్మం. దానితోపాటు కొంత సంస్కృతభాషాపరిచయం మనలో ప్రతిఒక్కరికిన్నీ ఉండాలి. ఏడాది రెండేళ్ళలో ఎక్కువగా సంస్కృతవ్యాకరణం చదవలేకపోయినా, చిన్న ఉపన్యాసమూ, శ్లోకాని కర్థమూ తెలుసుకొనేంతటి సంస్కృతజ్ఞానం మనం అందరమూ కొంచెం శ్రమిస్తే పొందగలం. వీనికోసం 'స్టడీ సర్కిల్స్ ను' మనం ఏర్పరచుకోవాలి. ఇట్లు ప్రతిఒక్కరూ తమకు తీరిక అయిన కాలంలో సంస్కృత భాషాభ్యసనానికి ప్రారంభించి, సంస్కృతభాషలో కొంత వ్యావహారిక జ్ఞానం సంపాదించడం ఎంతైనా అవసరమని నాఅభిప్రాయం. అందువల్ల మహరులు బోధించిన గొప్పసత్యాలు మన సంస్కృతి సరిహద్దులలోనికి వచ్చి, మన వర్తనను చక్కజేసి సామాజిక క్షేమం ఆపాదింపగలుగుతవి.                        


--- “జగద్గురు బోధలు” నుండి


అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం

శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।।


టెలిగ్రామ్ ఆప్ ద్వారా కంచి పరమాచార్య వైభవం పొందాలనుకునేవారు ఈ టెలిగ్రామ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వగలరు.


t.me/KPDSTrust


#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం

సుగుణాలకు మూలం

 *సుగుణాలకు మూలం సౌశీల్యం, సత్ స్వభావాలే*


మనిషికి జీవితంలో ఏదో ఒక సందర్భంలో కష్టాలు వస్తాయి. స్వయంకృతాపరాధాలు కొన్ని, ప్రకృతి వైపరీత్యాల వల్ల కొన్ని, మానసిక రుగ్మతల వల్ల కొన్ని, సామాజిక కుటుంబ ఆర్ధిక సమస్యల వల్ల కొన్ని... వీటికి - ఆసహజంగా పెరిగిపోతున్న దానవత్వం, తరిగిపోతున్న మానవత్వం, కరిగిపోతున్న దైవ చింతనలే కారణాలని శంకర భగవత్పాదులు అనేక సందర్భాల్లో బోధించారు. మనిషి తనలో మానవత్వం మీదుగా ఆధ్యాత్మికోన్నతి సాధించడానికి తన బుద్ధిని, జ్ఞానాన్ని వికసింపజేసుకోవాలి. ఇది అంత సులభమైనది కాదు. ఎందుకంటే అడుగడుగునా స్వార్ధం అడ్డుపడుతూనే ఉంటుంది.


బృహదారణ్యకోపనిషత్తులో యాజ్ఞవల్క్యుడు తన భార్య మైత్రేయితో- మనిషి దేన్నైనా ప్రేమిస్తున్నాను అన్నాడంటే అది తన ఆనందం కోసం, కోరికలు తీరడం కోసమే అన్నాడు. తన స్వార్థానికి విఘాతం కలిగినప్పుడు మనిషిలోని దానవత్వం ప్రకోపిస్తుంది. స్వార్థాన్ని, అహాన్ని జయించలేనివారు తమతోపాటు ఇతరుల సుఖశాంతులను, సంతోషాన్ని హరిస్తారు.


కౌటిల్యుడు అర్థశాస్త్రంలో చెప్పిన మత్స్య న్యాయం (చిన్న చేపను పెద్ద చేప మింగడం) ప్రబలిపోతోంది. బలవంతుడు బలహీనుణ్ని అణచివేస్తాడు. చివరికి లోకవినాశనానికి దారితీసే స్వార్ధప్రవృత్తికి తోడు హింసాప్రవృత్తి పెట్రోగిపోతోంది. ఎల్లలులేని స్వార్ధం, అహంకారాలు అంతం కావాలంటే సన్మార్గ దర్శనం కావాలి. అందుకే దైవం మానుష రూపంలో అప్పుడప్పుడు అవతరిస్తూ ఉంటాడు. తన శక్తిసామర్ధ్యాలను కొందరు మహాపురుషుల్లో ప్రవేశపెట్టి ప్రక్షాళన కావిస్తుంటాడు.


సుగుణాలకు మూలం సౌశీల్యం, సత్ స్వభావాలేనని భర్తృహరిఅన్నాడు. సద్గుణాలను కలిగి ఉండటమే సచ్చీలత. అదే మనిషిని. సన్మార్గంలో నడిపిస్తుంది. సత్సాం గత్యం, సచ్చీలత, సద్ధంథ పఠనం, సద్వాక్కు సేవాతత్పరత, సత్ప్రవర్తన, సమత్వం, సమయపాలన... ఇవన్నీ సద్గుణ సంపదలు. ఆదికావ్యమైన రామాయణం, ధర్మశాస్త్రమైన మహాభారతం, భగ వద్గీత వంటి ఎన్నో ప్రామాణిక గ్రంథాల్లో విభిన్న పాత్రల ద్వారా రకరకాల మానవ నైజాలను వివిధ కోణాల్లో ఆవిష్కరించారు. సద్గంధ పఠనం వల్ల మనిషి ఉత్తమ వ్యక్తిగా, కుటుంబంలో ఉత్తమ సభ్యుడిగా, మంచి కొడుకుగా, మంచి సోదరుడిగా, మంచి మిత్రుడిగా చివరకు మంచి శత్రువుగా కూడా ఎలా మెలగాలో తనను తాను తీర్చిదిద్దుకోగలుగుతాడు. సభ్రంధ పఠనం నోరు తెరవని ఉపన్యాసకుడు, మౌనం వహించిన మహాకవి, అనుక్షణం అండగా నిలిచే ఆప్తమిత్రుడు, విజయానికి దిక్సూచి, సన్మార్గపు రహదారి.


అమ్మ జన్మనిస్తుంది. నాన్న జీవితాన్నిస్తాడు. స్నేహితులు సంతోషాన్ని ఇస్తారు. కానీ సద్ధంథ పఠనం... వారెవరూ ఇవ్వలేని తరగని గనిలాంటి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ఇస్తుంది. ఒంటరిగా ఉన్నా ఓటమిని, భయాన్ని దరిచేరనివ్వని సన్మార్గంలో నడిచే మనోధైర్యాన్నిస్తుంది.

విజ్ఞులు చేసే పని.

 *🌹ఇంటికి పెద్ద దిక్కు ఉండాలి🌹*


ఇంటికి పెద్దదిక్కు వుండాలి అంటారు.. ఎందుకంటే *నాలుగు మంచి మాటలు చెప్పడానికి మరియు ఎవరైనా తప్పు చేస్తే ఖండించడానికి* మాకు పెద్ద దిక్కే వద్దు, మంచి చెప్పే వాళ్లు వద్దు అని అంటే ఆ కుటుంబం ఎటు పోతుంది..  కళ్లు గానక ఊభిలోనికి కూరుకుపోతారు..


*ఇదే దుర్యోధనుని విషయంలో జరిగింది.*    దుర్యోధనునికి తల్లిదండ్రులు ప్రేమ వలన చెప్పలేక పోయారు. విదురుడు మంత్రిత్వం వలన చెప్పలేక పోయాడు. భీష్ముడు పాపం తాత గారు, చనువు ఎక్కువ అయినా ఎన్నో సార్లు చెప్పి చూశాడు కానీ ఆయన్నీ లెక్క చేయలేదు.. చివరికి సర్వం నాశనం!    రాజ్యమే కూలిపోయింది..


*🍁పెద్దలు లేని సంసారం, కుటుంబం ఏమవుతుందో తెలుసుకోవాలి🍁..* 


నూరుగురు కౌరవులు ఏమయినారో మనం గుర్తుంచుకోవాలి. 


*ధర్మాన్ని చెప్పేవాడు* *ఓక్కడైనా వుండాలి  అదే* *ధృతరాష్ట్రుని*

*గొప్పతనం*...

*ధృతరాష్ట్రుడు విదురుడ్ని ప్రక్కన బెట్టుకొన్నాడు*, *అందుకనే ఆయనకు శ్రీకృష్ణ విశ్వరూప దర్శనం లభించింది*. 


అదే శకుడ్ని దగ్గర పెట్టుకొన్న దుర్యోధనడు యొక్క స్థితి మనకు తెలుసు..


*దుర్మార్గుడైనా సరే ఓ మహాత్ముడ్ని, మంచి వాడ్ని చెంత పెట్టు కోవాలి.. దీనిని మనం బాగా పట్టుకోవాలి.

అదే ధర్మరాజు విషయంలో చూడండి.. అందరి మాట విన్నాడు, ఆయన మాట ఆయన తమ్ముళ్లు విన్నారు. ధర్మ ప్రవర్తనతో బ్రతికారు.


*దుర్యోధనుడు ఎవ్వరి మాట వినలేదు. తల్లిదండ్రుల మాట వినలేదు. గురువుల మాట వినలేదు. పెద్దల మాట వినలేదు. శ్రేయోభిలాషుల మాట వినలేదు. భగవంతుడి మాట కూడా వినలేదు చివరికి ఏమైయాడు*?


మంచి చెప్పే వాళ్లను బ్రతిమలాడికో నైనా తెచ్చు కోవాలి. *"అయ్యా మీరు మార్గ నిర్ధేశకులుగా ఉండండి, అధ్యక్షులుగా వుండండి, పెద్దలుగా వుండండి మాకు!"*  అని ప్రాధేయపడి వుంచుకోవాలి. *పెద్దవాళ్లను వుంచు కున్నందు వలన కుటుంబాలకు, సంస్థలకు, సభలకు గౌరవం లభిస్తుంది.*


*చెడ్డవాళ్లను డబ్బులు ఇచ్చి అయినా వదిలించు కోవాలి అంటారు*.. రాజు చెడ్డవాడు అయినా మహా మంత్రి మంచివాడుగా, ధర్మం చెప్పేవాడుగా వుండాలి.. అప్పుడే ఆ రాజు, ప్రజలు పది కాలాలు పాటు చల్లగా వుంటారు.. 


*ధర్మం చెప్పే పెద్దలు లేనందువలన లేదా చెప్పినా వినక పోవడం వలన సమాజం దెబ్బతింటుంది*.


ఎవడికి వాడు నేనే పెద్ద అంటే ఎలాగా? అలాంటి జ్ఞానవంతులు వుంటేనే ఓక్కోసారి పొరబాట్లు, తప్పులు జరిగిపోతూ వుంటాయి..


*అయ్యా శ్రీకృష్ణా! నేను ఏమి తప్పుజేసానని? అని భీష్ముడు శ్రీకృష్ణుల వారిని అడుగుతాడు*.


*ఓ తప్పు జరిగేచోట పెద్దలు వుండటమే తప్పు* అని అంటాడు. 


*ఓ తప్పును చూస్తూ ఖండించకుండా, అక్కడ నుంచి వెళ్లిపోకుండా మౌనం వహించి చూస్తూ వుండటమే భీష్ముడు చేసిన తప్పు*.


*ద్రౌపది వస్త్రాపహరణం సమయంలో భీష్ముడు ఏమీ చేయలేక అక్కడే వుండిపోయాడు*

*అదే విదురుడు చూడకుండా వెళ్లి పోయినాడు*.


కావున పెద్దలు ఓ తప్పు జరిగిన చోట వుంటే ఆ పాపం వారి ఖాతాలో కూడా వేస్తారు. 


*అందువలన చెప్పిన మాట విననప్పుడు పెద్దలు ఆ స్థలం నుంచి వెళ్లిపోతారు*.


*🙏ఇది విజ్ఞులు చేసే పని.🙏*


🌺🍀🌺🍀🌺

మందేస్తే 🥃మైండ్ పని చేయద

 *నిన్న రాత్రి మందుపార్టీ అయ్యాక  - కార్ 🚘 నడుపుకుంటూ ఇంటికి బయలుదేరా.*

..

దూరంగా *డ్రంక్ n డ్రైవ్ చెకింగ్* జరగటం గమనించి - కార్ పక్కకు ఆపేసి గబుక్కున దిగి , వెనక సీట్లో కూర్చున్న.


ఇన్స్పెక్టర్ వచ్చి చూస్తే డ్రైవింగ్ సీట్లో ఎవరు లేరు.

..

*ఆఫీసర్ :*

 కార్ ముందుకు తీసుకురండి. బ్రేత్ అనలైజర్ టెస్ట్ చేయాలి.


*నేను :* 

సర్ ! మిమ్మల్ని చూసి - మా డ్రైవర్ దిగి పారిపోయాడు.

 

*ఆఫీసర్ :* 

అయితే మీరు కార్ తీసుకొని , ముందుకు రండి . చెక్ చేస్తాం


*నేను :*

 ఒక నిజమైన బారతీయుడిగా , నేను తాగి నడపకూడదు..


*ఆఫీసర్ :*

 ఆహా ఎంత మంచి వారండి మీరు .. అని వాళ్ళ డ్రైవర్ ని పిలిచి *ఈ సర్ ని , వాళ్ళ ఇంటిదగ్గర దింపి రమ్మని చెప్పాడు.*


( *మందేస్తే 🥃మైండ్ పని చేయదని - ఎవడాడు చెప్పినోడు* )..😏😏🙄😜😜


👆 *ఇది మనోళ్ళకేమైనా ఉపయోగపడుతుందేమో చూడండి!*😂

🙏💐🙏🙏💐🙏

*మాత భవాని దేవాలయం

 *మాత భవాని దేవాలయం, రాజస్థాన్... పులులు కాపలాగా ఉండే ఏకైక దేవాలయం...*.      



                                                          🚩                                                                                         *జవాయి, రాజస్థాన్‌లోని మాత భవానీ గుడి మెట్లపై మీకు ముప్పై వరకూ పులులు కనిపిస్తాయి*,

*పూజారి రాగానే మెట్లపై నుండి దూరంగా వెళ్లిపోతాయి, అవి ఏ మానవుడిపై ఎప్పుడూ దాడి చేయలేదు. చరిత్రలో ఇప్పటి వరకు మనుషులపై ఒక్క దాడి చేయని చరిత్ర వీటి సొంతం,  మనుషులు  రావడం చూసి, నీటిలోకి దిగుతాయి, మహిళలు పొలాల్లో పని చేస్తూనే ఉంటారు, పులులు ఎవరిని ఏమీ అనవు*.

*భద్రకాళీ మాతకి నమస్కారము*

శ్రీబాలాత్రిపురసుందరీసహితమల్లేశ్వరస్వామి

 *శ్రీబాలాత్రిపురసుందరీసహితమల్లేశ్వరస్వామివారిని ప్రార్థించుచూ నేను వ్రాసిన స్తోత్రము.*

(1)శ్రీమన్నరేంద్రపురవాస!మహేశ!శంభో!,

     గోదావరీతటవిరాజితపార్వతీశ!।

    గౌరీపతే!త్రిపురసుందరశాన్తచిత్త!,

    మల్లేశదేవ!మమ దేహి కరావలంబమ్।।

భావం=శ్రీమన్నరేంద్రపురవాసుడా!ఓమహేశా!ఓశంభో!గోదావరీతీలమునందు విరాజిల్లుచున్న ఓపార్వతీశుడా!ఓగౌరీపతీ!బాలాత్రిపురసుందరీశాంతచిత్తుడా!ఓమల్లేశ్వరస్వామీ!నాకు చేయూతనిమ్ము.

(2)శ్రీకాపిలేయమునిపూజితసుందరేశ!,

     కాసారతీరపరమేశ్వర!దివ్యరూప!।

     హేముక్తినాథ!సురపూజిత!లోకబంధో!,

    మల్లేశదేవ!మమ దేహి కరావలంబమ్।।

భావం=శ్రీకపిలమహర్షిచేత పూజింపబడినటువంటి సుందరేశుడా!,కాసారతీరమందున్న ఓ పరమేశ్వరా!,ఓదివ్యరూపుడా!,ఓముక్తినాథుడా !,దేవతలచేతపూజింపబడేవాడా!,ఓలోకబంధూ!,ఓమల్లేశ్వరస్వామీ నాకు చేయూతనిమ్ము.

(3)శ్రీగౌతమీతటవిశోభితవిశ్వరూప!,

     శ్రీసుందరీహృదయవల్లభ!సౌమ్యమూర్తే!।

దేవాధిదేవ!జగదీశ్వర!చిత్స్వరూప!,

మల్లేశదేవ! మమ దేహి కరావలంబమ్ ।।

భావం=శుభకరమైనగౌతమీతీరమునందు విశేషముగా శోభించు ఓవిశ్వరూపుడా!,శ్రీబాలాత్రిపురసుందరీహృదయసౌమ్యవల్లభమూర్తీ!, ఓదేవాధిదేవుడా!, జగదీశ్వరుడా!, జ్ఞానరూపుడా!, ఓమల్లేశ్వరస్వామీ!నాకు చేయూతనిమ్ము.

(4)కైలాసవాస!జితమన్మథఘోరరూప!,

    శైలాత్మజాహృదయతోషణసంవిహారిన్!।

వాగర్థరూపనిజవైభవసంవితాన!,

మల్లేశదేవ మమ దేహి కరావలంబమ్।।

భావం=ఓకైలాసవాసా!సంసారకారణభూతుడైన మన్మథుని భస్మముచేసిన ఘోరరూపముగలవాడా!,బాలాత్రిపురసుందరీదేవియొక్కహృదయమునందు సంతోషముతో విహరించేవాడా!,వాగర్థరూపమైన(బ్రహ్మవిద్యారూపమైన) తనయొక్కవైభవమును విస్తరింపజేసేవాడా!,ఓమల్లేశ్వరస్వామీ నాకు చేయూతనిమ్ము.

(5)శ్రీకంఠరూప!భవనాశక!నీలకంఠ!,

     దుర్గాపతే!గిరిజయార్చిత! దీనబంధో!।

     సంసారమగ్ననరఘోషనివృత్తరూప!

    మల్లేశదేవ!మమ దేహి కరావలంబమ్।।

భావం=(తాను విషాన్నిస్వీకరించి బయటికి వదలకుండా. మింగకుండా కంఠమునందే దాచి చతుర్దశభువనములకు శుభమును కలిగించుటద్వారా శ్రీకంఠుడు) ఓశ్రీకంఠరూపుడా!,భవనాశకుడా!,ఓనీలకంఠుడా!,ఓదుర్గాపతీ!,గిరిజాదేవపూజలందుకుంటున్న ఓ దీనబంధూ!,సంసారమునందు కూరుకుపోయిన నరులఘోషను నివారించేవాడా!,ఓమల్లేశ్వరస్వామీ!,నాకు చేయూతనిమ్ము.

(6)భూతేశ!భూతగణసేవిత భూతనాథ!,

     కాత్యాయనీశ!వృషకేతన!శంభులింగ!।

    హేభీమలింగ!కరుణాకర!దివ్యకీర్తే!,

   మల్లేశదేవ మమ దేహి కరావలంబమ్ ।।

భావం=ఓభూతేశుడా!భూతగణములచే సేవించబడే ఓభూతనాథుడా!,ఓకాత్యాయనీ వల్లభుడా!,ఓవృషభధ్వజుడా!,ఓశుభకరమైనలింగమూర్తీ!,ఓభయంకరలింగమూర్తీ !,ఓకరుణాకరుడా!,ఓదివ్యకీర్తిమయుడా ఓమల్లేశ్వరస్వామీ నాకుచేయూతనిమ్ము।       (7)హేచంద్రచూడ!,భుజగాంకిత!శూలపాణే!,

హేమన్మథాంతక!,విరాజితభస్మదేహ!।

హే కంచినాథ!నటరాజ!చిదంబరేశ!,

మల్లేశదేవ మమ దేహి కరావలంబమ్ ।।

భావం=చంద్రుడు ఆభరణముగా కలిగినవాడా!,ఓభుజగభూషణుడా!,చేతియందు శూలముకలిగినవాడా!,మన్మథునిభస్మముగావించినవాడా!,భస్మముతో ప్రకాశించు శరీరముకలిగినవాడా!,ఓకాంచీపురాధీశుడా!,ఓనటరాజా!,ఓచిదంబరేశుడా!,ఓమల్లేశ్వరస్వామీ నాకు చేయూతనిమ్ము.

(8)బాలేందురంజితశిర:! ప్రథితాsభ్రకేశ!, దాక్షాయణీసతతశోభితసవ్యభాగ!।శ్రీమన్నరేంద్రపురశోభితమల్లినాథ! ,

మల్లేశదేవ మమ దేహి కరావలంబమ్ ।।

భావం=బాలచంద్రునితో ప్రకాశించేటటువంటి శిరస్సుకలిగినవాడా!వ్యోమకేశునిగాప్రసిద్ధినిపొందినవాడా! ,దాక్షాయనీదేవితో ప్రకాశించేటటువంటి వామభాగముకలిగినవాడా!,నరేంద్రపురమునందు శోభించు ఓమల్లినాథుడా!,ఓమల్లేశ్వరస్వామీ !,నాకు చేయూతనిమ్ము ।।

                  *ఫలశ్రుతి *.                

మల్లేశ్వరాష్టకం పుణ్యం,

య: స్మరేద్ధృది సర్వదా।

శివలోకం చ సంప్రాప్య,

శివైక్యం లభతే ధృవమ్।।

భావం=ఈమల్లేశ్వరాష్టకమును హృదయమునందు ఎల్లప్పుడు ఎవడు స్మరించెదడో అతడు శివలోకమును జేరి శివునియందు ఐక్యమవుతాడు. ఇది నిశ్చయము.

శ్రీ నిత్యపూజ స్వామి ఆలయం

 🕉 మన గుడి : 








⚜ కడప జిల్లా : నిత్యపూజకోన


⚜ శ్రీ నిత్యపూజ స్వామి ఆలయం



💠 కొండల్లో, అడవుల్లో వెలసిన శివాలయాలకు వెళ్ళాలంటే భక్తులు ఉత్సాహం చూపుతారు. 

అటువంటి కొండల్లో కోనల్లో వెలసినదే నిత్యపూజ కోన క్షేత్రం. 


💠 చుట్టూ పచ్చని ప్రకృతి అందాలు, ఆహ్లాదకరమైన వాతావరణం, పెద్ద పెద్ద కొండలు గుట్టల మధ్య ప్రయాణం ఇదీ నిత్యకోనకు వెళ్లే మార్గం లోని అనుభూతులు. 

దీనికి తోడు గలగల పారే జలపాతాలు, భారీ చెట్ల మధ్య లో సవ్వడులు చేసే సెలయెర్లు అక్కడి అందాలను మరింత పెంపొందించాయి.


💠 ఈ క్షేత్రానికి నిత్యపూజకోన అనే పేరు రావటానికి కారణం అక్కడ దేవతలు స్వామిని నిత్యం పూజిస్తుంటారు కాబట్టి. 

కోరిన కోర్కెలను తీర్చే నిజమైన స్వామిగా పూజలందుకుంటున్న నిత్య పూజ స్వామి (శివుడు) లీలలు అంతా ఇంతా కావు. 


💠 సాక్షాత్తూ శివుడే నిత్యానంద ఋషి అవతారమెత్తిన కొండ సొరంగ మార్గంలోని గుహలో తపస్సు చేస్తూ శివలింగం గా మారినట్లు స్థానిక పూజారులు చెబుతారు.


💠 ఉద్భవలింగంగా మారిన స్వామివారిని కొండ కింది భాగాన కొలువుదీరిన అక్కదేవతలు, ఉద్భవలింగంగా అహర్నిశలు పూజలు చేస్తూ ఆయన సేవలకు తమ జీవితాన్ని అంకింతం చేశారన్న వార్తలు కూడా పూర్వీకుల ప్రచారంలో ఉన్నాయి.


💠 ఈ క్షేత్రంలో వారంలో ఒకరోజు (సోమవారం) అన్నదానం నిర్వహిస్తారు. క్షేత్రంలోని పరిసర ప్రకృతి అందాలు పర్యాటకులను, భక్తులను మంత్రముగ్ధుల్ని చేస్తాయి. వానాకాలం అయితే చెప్పాల్సిన పనే లేదు నీళ్ళల్లో నడుచుకుంటూ వెళ్లాల్సివస్తుంది.


⚜ అక్కదేవతల కోన ⚜


💠 ఇక్కడ చెప్పవలసినది మరొకటుంది అదే అక్కదేవతల కోన. 

నిత్య పూజయ్య స్వామిని దర్శించుకున్న తర్వాత అక్కదేవతల కోన వెళ్ళటానికి ఒక దారి కూడా ఉన్నది. ఈ ప్రదేశంలోని ఒక చిన్న గుడిలో అక్కదేవతలు కొలువై ఉంటారు. వీరు నిత్యం స్వామిని కొలుస్తుంటారని ప్రతీతి.


💠 సిద్దవటం కోట మధ్య యుగం నాటిది. పెన్నా నది ఒడ్డున ఈ కోట 36 ఎకరాల్లో విస్తరించి ఉన్నది. కోటకు పశ్చిమం వైపున, తూర్పు వైపున రెండు ద్వారాలున్నాయి.

సిద్దవటం కోట ముఖద్వారానికి ఇరువైపులా ఆంజనేయుడు, గరుత్మంతుడు శిల్పాలు ఉన్నాయి. పడమటి వైపు ఉన్న ద్వారానికి ఇరువైపులా నాట్య భంగిమలో అందమైన శిల్పాలు ఉన్నాయి.

 

💠 కోటలో సిద్ధవటేశ్వరస్వామి ఆలయం, ఎదురుగా నంది విగ్రహం, కామాక్షి ఆలయం ఉన్నాయి.


💠.ఇక్కడ ప్రతి ఏట శివరాత్రి ఉత్సవాల నాడు అన్నదాన కార్యక్రమాలు జరుగుతుంటాయి , 

ఇక్కడ ప్రకృతి మహా సోయగంగ ఉంటుంది. పచ్చని చెట్లు, అందమైన జలపాతం ఈ పుణ్య క్షేత్రం ప్రత్యేకత. వరాన్ని సిద్దించే స్వామి కావున సిద్దేశ్వర స్వామి అని ఈ క్షేత్రానికి ఆ పేరు వచ్చింది.


💠 కడప నుండి సిద్దవటం 33 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. అక్కడి నుండి దట్టమైన అడవి మార్గాన వెళితే నిత్య పూజ కోన క్షేత్రానికి చేరుకోవచ్చు. కొండ కింద ఉన్న పంచలింగాల వరకు బస్సులు, షేర్ ఆటోలు తిరుగుతుంటాయి. బస్సు మార్గంలో అయితే 12 కిలోమీటర్లు వెళ్ళవచ్చు. కడప నుండి ప్రతి సోమవారం ఒక ఆర్టీసీ బస్సు ఉన్నది.

కాలభైరవ ఆవిర్భావం..

 


కాలభైరవ ఆవిర్భావం....!!

ప్రాచీనకాలం నాటి శైవక్షేత్రాలకి వెళితే అక్కడ తప్పనిసరిగా కన్పించే విగ్రహం భైరవుడు, భయాన్ని కలిగించేలా ఆయన రూపం వుంటుంది. 

కాశీ క్షేత్రపాలకుడిగానే కాకుండా అనేక క్షేత్రాల్లో ఆయన క్షేత్ర పాలకుడిగా కనిపిస్తుంటాడు. 

అసితాంగ భైరవుడు .. రురు భైరవుడు .. చండ భైరవుడు .. క్రోధ భైరవుడు .. ఉన్మత్త భైరవుడు .. కపాల భైరవుడు .. భీషణ భైరవుడు .. సంహార భైరవుడు .. అనే ఎనిమిది నామాలతో ... వివిధ ముద్రలతో భైరవుడు దర్శనమిస్తూ వుంటాడు.

భైరవ అనే పేరే ఆయనలోని అపారమైన శక్తిని ఆవిష్కరిస్తున్నట్టుగా వుంటుంది. 

ఎదుట నిలిచినది ఎలాంటి శక్తి అయినా ఆయన ధాటిని తట్టుకుని నిలబడటం కష్టమనిపిస్తుంది. 

ఆయా క్షేత్రాలకి భైరవుడు పాలకుడని తెలిసినప్పుడు ... శునకాన్ని వాహనంగా కలిగిన ఆయన రూపాన్ని చూసినప్పుడు ఆయన గురించి తెలుసుకోవాలనే ఆసక్తి కలగకపోదు. 

వీరభద్రుడిలా భైరవుడు కూడా శివుడు నుంచి ఆవిర్భవించినవాడే.

తనని అవమానపరచడమే కాకుండా, తనకి సతీదేవిని దూరం చేసిన దక్షుడిపై శివుడు ఉగ్రుడవుతాడు. 

వీరభద్రుడిని సృష్టించి దక్షుడి శిరస్సును ఖండింపజేస్తాడు. అలాగే తన విషయంలో అవమానకరంగా వ్యవహరించిన బ్రహ్మదేవుడిపై కూడా శివుడు ఆగ్రహావేశాలను వ్యక్తం చేస్తాడు. 

ఆ సమయంలోనే 'భైరవుడు' ని సృష్టించి బ్రహ్మదేవుడి తలను ఖండించమని ఆదేశిస్తాడు.

మహా పరాక్రమవంతుడైన భైరవుడు క్షణమైనా ఆలస్యం చేయకుండా బ్రహ్మదేవుడికి గల అయిదు శిరస్సుల్లో, ఏ శిరస్సు అయితే శివుడిని అవమానపరుస్తూ మాట్లాడిందో ఆ శిరస్సును ఖండించి వేస్తాడు. 

ఆ తరువాత బ్రహ్మహత్యాపాతకం నుంచి బయటపడటానికి తాను ఏం చేయాలో చెప్పమని భైరవుడు అడుగుతాడు. 

ఖండించినటు వంటి బ్రహ్మదేవుడి యొక్క కపాలంతో అనేక ప్రాంతాలను దర్శిస్తూ ఉండమనీ, ఎక్కడైతే ఆ కపాలం పడుతుందో, అక్కడితో ఆయన పాపం ప్రక్షాళన అవుతుందని శివుడు చెబుతాడు.

భైరవుడి చేతిలోని బ్రహ్మదేవుడి కపాలం కిందపడిన ప్రదేశమే నేడు 'బ్రహ్మ కపాలం' గా పిలవబడుతోంది. 

ఆ తరువాత శివాజ్ఞ ప్రకారం కాశీ క్షేత్రానికి చేరుకున్న భైరవుడు అక్కడ క్షేత్రపాలకుడిగా ఉండిపోతాడు... 

ఆ తరువాత అనేక శైవక్షేత్రాల్లో ఆయన మూర్తిని క్షేత్రపాలక శిలగా ప్రతిష్ఠించారు. 

ఆ క్షేత్రాల్లో భైరవుడు కూడా అత్యంత భక్తి శ్రద్ధలతో పూజించబడుతూ వుంటాడు, ఈ స్వామిని ఆరాధించడం వలన దుష్ట శక్తుల నుంచి రక్షణ లభిస్తుందనీ, పాడిపంటలు వృద్ధి చెందుతాయని భక్తులు ప్రగాఢ విశ్వాసాన్ని ప్రకటిస్తుంటారు.

తెలిసినది కాదు తెలియనిది కాదు

  తెలిసినది కాదు తెలియనిది కాదు 

మన మహర్షులు వారి అత్యంత గొప్ప మేధ శక్తితో మనకు భగవంతుని స్వరూపాన్ని ఆవిష్కరింప చేశారువారు పేర్కొన్న జ్ఞ్యాన బాండాగారం మనకు ఉపనిషత్తుల రూపంలో లభ్యమవుతున్నది. అతి సామాన్యమైన విషయంతో అనన్తమైన బ్రహ్మ పదార్ధాన్ని తెలుసుకోవటం కొరకు  అసామాన్యమైన జ్ఞ్యానం కలిగి  ఉండాలి  

భగవంతుడు: మన మహర్షులు భగావంతునికి క్రింది లక్షణాలు ఉంటాయి అని చెప్పారు

1) త్రిగుణాతీతుడు. మనుషులమైన మనము సత్వ, రజో, తమో గుణాలలో ఏదో ఒక గుణం కలిగి ఉంటాము. కొన్ని సందర్భాలలో ఒక గుణం ఇంకొక గుణంతో మిళితమై లేక అధిగమించి గోచరించవచ్చు. ఏది ఏమైనా గుణాలలో మాత్రమే మనిషి కనపడతాడుకానీ భగవంతునికి రకమైన గుణం ఉండదు అంటే ఆయనకు రాగ ద్వేషాలు వుండవు

2) కాలాతీతుడు: భూమి మీద వున్న ప్రతిదీ అది నిర్జీవమైనది కావచ్చు లేక జీవమైనది కావచ్చు ఒక కాలంలో ఉద్బవించి (జన్మించి) కొంత కాలం వుండి  తరువాత నశించి పోతుంది. ఉన్నంతకాలం మార్పు చెందుతూ ఉంటుంది. కానీ భగవంతుడు కాలములో లేడు ఆయన త్రికాలలో ఉంటాడు అంటే భూతకాలంలో వున్నాడు, వర్తమానంములో వున్నాడు భవిష్యత్తులో ఉంటాడు. అందుకే భగవంతుని నిత్యుడు అని అన్నారు

3) రూప రహితుడు: మనకు భూమి మీద ప్రతిదీ ఏదో ఒక రూపంలో కనబడుతూ వున్నది. అందుకే మనం వాటిని గుర్తించగలుగుతున్నాము. కానీ భగవంతుడు రూపం లేకుండా ఉంటాడు. అందుకే ఆయన కాలంలో లేడు

4) నామరహితుడు: అంటే పేరులేని వాడుఏదైనా రూపం ఉంటేనే పేరు ఉంటుందిరూపమేలేనప్పుడు ఇక పేరు అనే సమస్యే లేదు

5) భగ కలిగిన వాడుమనము అదృషవంతుడు, ధనవంతుడు, ఐశ్వర్యవంతుడు, బలవంతుడు అనే మాటలు అంటూ ఉంటాముఅంటే ఏది ఉంటే వానికి ఉన్నదాని ప్రక్కన వంతుడు అని పెట్టి అది  కలిగినవాడుగా మనం పేర్కొంటాముఉదా : ధనం వున్నవానిని ధనవంతుడు అని అదృష్టం వున్నవానిని అదృష్టవంతుడు ఇలా మనం ఉపయోగిస్తూవుంటాము. మరి భగవంతుడు" అంటే ఎవరు? భగ అనే ఆరుగుణాలు వున్నవాడు క్రింది శ్లోకాన్ని చుడండి

"మాహాత్మ్యస్య సమగ్రస్య ధైర్యస్య యశస శ్రియఃజ్ఞాన వైరాగ్యయేశ్చైవ షణాం - భగ, ఇత్యుక్త భగోzస్యాస్తీ తి భగవాన్ " అని శాస్త్ర నిర్వచనం .అంటే

1) మాహాత్మ్యం 2) ధైర్యం 3) యశస్సు4) సంపద5) జ్ఞానం 6) వైరాగ్యం ఆరింటిని షడైశ్వైర్యాలు అంటారు.వీటికే "భగ" అని పేరు. ఆరు ఐశ్వైర్యాలను సంపూర్ణంగా కలిగి ఉండడం వల్లనే "భగవంతుడు" అని పేరు.

భగ అనే ఆరు లక్షణాలు భూమిమీద వున్న జీవకోటికి కానీ, మానవులకు కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ వుండవుమనం ఒక్కొక్క లక్షణాన్ని పరిశీలిస్తే విషయం తెలుస్తుంది.  

1) మాహాత్మ్యం  పవిత్రత వల్ల మాహాత్మ్యం సిద్ధిస్తుంది." పవిత్రానాం పవిత్రం యో మంగళానాంచ మంగళం" అని వేదశాస్త్ర పురాణేతిహాసాలు దేవుడిని కీర్తిస్తున్నాయి.దేవుడు "సంపూర్ణ పవిత్ర స్వరూపుడు" కాబట్టి సంపూర్ణ మాహాత్మ్యం కలిగి ఉంటాడు.అనుభవ పూర్వకంగా చూసుకున్నా మనం విషయంలో పవిత్రంగా ఉంటామో విషయంలో మాహాత్మ్యం సిద్ధిస్తుంది. ఉదాహరణకు...తల్లిదండ్రులు తమ సంతానం విషయంలో ఎలాంటి కల్మషం లేని పవిత్రతతో ఉంటారు.కాబట్టి పిల్లల విషయంలో తల్లిదండ్రులకు తమ దీవెనలు ఫలించగలిగే మాహాత్మ్యం సిద్ధిస్తుంది..... ఇలా విషయంలో మనం పవిత్రతను కలిగి ఉన్నామో విషయంలో ' మాహాత్మ్యం' ఏర్పడడాన్ని మనం గమనించవచ్చు!ఎక్కడ మాహాత్మ్యం ఉంటుందో అక్కడ నమస్కార యోగ్యత ఏర్పడుతుంది.నమస్కారం వల్ల అవతలి వ్యక్తి మాహాత్మ్యాన్ని - ఆశీర్వాదాన్ని మనం స్వీకరించ గలుగుతాము.అందుకే పవిత్రంగా జీవించే సాధువులకూ, మహాత్ములకూ, బ్రాహ్మణులకూ, పెద్దలకు నమస్కరించే పద్ధతి సనాతన ధర్మం లో సాంప్రదాయ సిద్ధంగా వస్తూ ఉంది.

2) ధైర్యం ఇక ధైర్యం దేనివల్ల కలుగుతుంది.భయం లేకపోవడం వల్ల.భయం ఎలా పుడుతుంది?ప్రధానంగా 50% భయాలు అజ్ఞానం వల్లనే కలుగుతాయి. ఎక్కడ తెలియనితనం ఉంటుందో అక్కడ భయం ఉంటుంది.అది తెలిసిన తర్వాత భయం పోతుంది.ఇక మిగతా భయాలు మనకున్న ఆరోగ్యం - ఆయుస్సు - సంపదలు - పరివారం - అధికారం - కీర్తి - సౌఖ్యం ...మొ॥ ఐశ్వర్యాలు ఎక్కడ నశించి పోతాయో అనే కారణం నుండి పుడుతాయి.

ఇక దేవుడు వేదస్వరూపుడు.అంటే జ్ఞానస్వరూపుడు.ఇక అతనికి అజుడని పేరు.అంటే పుట్టక లేని వాడు .అలాగే అచ్యుతుడు.. అంటే నాశనం లేనివాడు.శ్రీధరుడు అంటే సమస్త ఐశ్వర్యాలను ధరించినవాడు.కాబట్టి సంపూర్ణ ధైర్యం అనెడి ఐశ్వర్యం అతనిని సేవిస్తూ ఉంటుంది.

3) యశస్సుయశస్సు అంటే స్వచ్చమైన కీర్తి ."క్రియాశీలత వల్ల కీర్తి... నిష్క్రియత్వం వల్ల అపకీర్తి " ఏర్పడుతుంది.నీరు నిరంతరం ప్రవహిస్తూ క్రియాశీలంగా ఉండడం వల్ల " నది "లా మారి అందరిచే పూజించబడుతూ "కీర్తి"ని పొందుతుంది.ఆగిపోయిన నీరు " నిష్క్రియత్వం" వల్ల మురికి గుంటలా మారి అందరిచే అసహ్యించబడుతూ.. అపకీర్తిని పొందుతుంది.మనష్యుల పరిస్థితి అయినా అంతే! విషయంలో మనిషి క్రియాశీలతను కలిగి ఉంటే విషయంలో కీర్తి లభిస్తుంది.ఉదాహరణకు.. చదువు విషయంలో క్రియాశీలతను కలిగి ఉన్న వ్యక్తికి విద్య విషయంలో కీర్తి లభిస్తుంది.ధన సంపాదన విషయంలో క్రియాశీలతను కలిగి ఉన్న వ్యక్తికి ధనవంతుడనే కీర్తి లభిస్తుంది..... ఇలా విషయంలో క్రియాశీలత ఉంటుందో విషయంలో సహజంగానే కీర్తి లభిస్తుంది.ఇక సంపూర్ణ క్రియాశీలుడైన ఈశ్వరున్ని యశస్సు అనెడి ఐశ్వర్యం నిరంతరం సేవిస్తూ ఉంటుంది.

4) సంపద సంపద అంటే సమృద్ధి, సాధించబడినది అనే రెండు అర్థాలు.తృప్తి పరిచేది - అవసరాలను తీర్చేది సంపద.సంపద రెండు రకాలుగా సృష్టించబడుతుంది.

i)ఇతరుల అవసరాలను నెరవేర్చగలిగే శక్తి పెరుగుతున్న కొద్ది సంపద సృష్టి జరుగుతూ ఉంటుంది.ఒక కూలి నుండి బిల్ గేట్స్ వరకు ఎవరినైనా గమనించండి. వారు ఇతరుల అవసరాలను ఎంతగా నెరవేరుస్తూ ఉంటారో అంతగా వారి వద్ద సంపద వృద్ధి పొందుతూ ఉంటుంది.శారీరకంగా - మానసికంగా -బౌద్ధికంగా - ఆథ్యాత్మికంగా ..... రకంగానైనా ఇతరుల అవసరాలను తీర్చగలిగే శక్తే, శ్రీమంతుడు కావడానికి ప్రధాన కారణం.
ఇక రెండవది
ii)
క్రియాశక్తి వల్లలక్ష్మీదేవి క్రియాశక్తి స్వరూపమని పురాణాలు వర్ణిస్తున్నాయి.సంపద అనేది శ్రమకు ప్రతిఫలం . శ్రమించడం వల్ల కూడా సంపద సృష్టి జరుగుతుంది.శ్రమించే తత్వం పెరుగుతూ తనలో ఉన్న ఇచ్చాశక్తినీ... జ్ఞాన శక్తిని క్రియా రూపంలోకి మార్చడం వల్ల సంపద సృష్టించబడుతూ వుంటుంది. రెండు రకాలుగా కాకుండా ఇతరుల చే సృష్టించబడిన సంపదను కొల్లగొట్టేవారు కొందరుంటారు. వీరు ఇహ-పర లోకాలలో పతనం చెందుతారని శాస్త్రం చెబుతుంది.ఎందుకంటే....సంపద అంటే డబ్బు - బంగారం కాదు. అవి సంపదకు బదులుగా వినియోగించే వినిమయాలు మాత్రమే!ఒక దేశంలోని డబ్బుకు మరో దేశంలో విలువ ఉండదు. అలాగే భూలోకంలో ఉండే వినిమయాలు మరో లోకంలో చెల్లబడి కావు.కానీ, ఇతరుల అవసరాలను తీర్చగలిగే నెైపుణ్యశక్తి.... క్రియాశక్తి జీవుడు లోకంలో ఉన్నా సంస్కార రూపంలో వెన్నంటి ఉండి అతన్ని ఐశ్వర్యవంతుడు గా నిలుపుతుంది.

ఇక సమస్త సృష్టి అవసరాలు తీర్చడం వల్లా.., సంపూర్ణ క్రియాశీలత్వం వల్ల ఈశ్వరున్ని సంపద అనెడి ఐశ్వర్యం సేవిస్తూ ఉంటుంది.

5) జ్ఞానంఈశ్వరుని యొక్క సర్వవ్యాపకత్వం - సర్వశక్తిమత్వమే సర్వజ్ఞత్వానికి కారణమౌతుంది.తత్వశాస్త్ర దృష్ట్యా జ్ఞానం అనేది పొందబడేది ... కోల్పోయేది కాదు. అది ఎప్పుడూ ఉండేది. అది ఆత్మ స్వరూపంగా ఉంటుంది.దాన్ని మనకున్న ఏకాగ్రతను బట్టి కొంచెం కొంచెంగా అనుభవంలోకి తెచ్చుకుంటాము.ఒక వ్యక్తిలో ఉన్న ఏకాగ్రత శక్తిపైన అతని జ్ఞానం ఆధారపడి ఉంటుంది. విషయంలో ఏకాగ్రత చూపుతాడో విషయ సంబంధ జ్ఞానం లభిస్తుంది.ఏకాగ్రత సంపూర్ణ స్థాయికి చేరినపుడు సంపూర్ణ జ్ఞానం అనుభవంలోకి వస్తుంది. అలాంటి వ్యక్తులను ఆత్మజ్ఞానులు అంటాము. వారి వ్యక్తిగత చైతన్యం విశ్వ స్థాయికి ఎదగడం వల్ల వారికి కూడా సర్వజ్ఞత్వం సిద్ధిస్తుంది. విశ్వంలోని సమస్త నియమాలను సృష్టించి ఒక నియతిని ఏర్పాటు చేయడం వల్ల ఈశ్వరునికి నియంత అనే మరో పేరుంది. నియమాలపై ఏకాగ్రత నిలిపి పరిశోధించడాన్నే మనం శాస్త్ర విజ్ఞానం అంటున్నాము.ఇలా సర్వవ్యాపకుడు - విశ్వరూపుడు - నియంత అయిన పరమాత్మను జ్ఞానం అనెడి ఐశ్వర్యం సదా సేవిస్తూనే ఉంటుంది.

6) వైరాగ్యంసంతృప్తితో కూడిన త్యాగమే వైరాగ్యం.ఈశ్వరునికి నిరంజనుడని పేరు.అంటే దేనికీ అంటకుండా కేవల సాక్షి మాత్రంగా ఉండే వైరాగ్య సంపన్నుడని అర్థం.వైరాగ్యం అనేది సమృద్ధిని దాటిన స్థితి.హిమాలయాల్లో "పరుసవేది " అనే మూలిక ఉంటుందట. వేరుతో లోహాన్ని ముట్టినా లోహం బంగారంగా మారుతుందట. అలాంటి పరుసవేది ని కలిగి ఉన్న వ్యక్తి గుట్టలు గుట్టలుగా బంగారాన్ని ప్రోగుచేస్తాడా? వేరును మాత్రం దగ్గరుంచుకుని అవసరమున్నంత వరకే వాడుకుంటాడు. అతనికి ధనాన్ని సంపాదించాలనే కోరిక - ఆశ వంటివి ఏమీ ఉండవు.అంటే ధన విషయంలో వైరాగ్యం లభించినదన్న మాట!అసంతృప్తితో - అశక్తతతో వచ్చేది వైరాగ్యం కాదు. అది లేమితనం - బలహీనత.ఒక నపుంసకుడు సన్యాసిగా మారితే అది వైరాగ్యం కాదు.ఒక నిజమైన పురుషుడు సన్యాసిగా మారితేనే అది నిజమైన వైరాగ్యం.మన దేశంలో చాలా మంది మిథ్యా వైరాగ్య సంపన్నులు ఉంటారు. నాకు ధనం మీద ఆశ లేదు అంటుంటారు. మళ్లి కష్టపడకుండా - తేరగా ధనం వస్తే సంతోషిస్తారు. ఒక కోటి రూపాయలు కష్టపడి సంపాదించి దానిపై బంధం లేకుండా సంతృప్తితో దానం చేయగలిగితే అది వైరాగ్యం అవుతుంది.వైరాగ్యం అనేది తేలికగా వచ్చే ఐశ్వర్యం కాదు. అది ఇంతకు ముందు చెప్పినట్లు సమృద్ధిని దాటిపోయిన స్థితి.ఎవరో కొందరు వివేకానందుడు లాంటి మహాత్ములు మాత్రమే నిజమైన వైరాగ్య సంపన్నులుగా ఉంటారు.

ఇక దేవునిది అన్ని విషయాల్లో సమృద్ధిని దాటిన స్థితి.కాబట్టి వైరాగ్యం అనెడి ఐశ్వర్యం అతడిని నిరంతరం సేవిస్తూ ఉంటుంది.ఇలా ఆరు ఐశ్వర్యాలను కలిపి 'భగ' అని పేరు. వీటిని కలిగి ఉండడం వల్ల భగవంతుడని పేరు.మనలో కూడా ఆరు ఐశ్వర్యాలు అంశ మాత్రంగా ఉంటాయి. మన ప్రవర్తనను బట్టి ఆయా ఐశ్వర్యాలు వృద్ధి పొందుతాయి.

భూమిమీద పుట్టిన ప్రతి మానవుడు కూడా ఆరు ఐశ్వర్యాలు వారి వారి ప్రారబ్ధఫళంగా అంశమాత్రంగా కలిగి వుంటారు. ఉదాహరణకు సంపద అనే ఐశ్వర్యం తీసుకున్నామనుకోండి కొందరు వారి దైనందిక జీవనం గడపటానికి వలసినంత సంపద కూడా లేకుండా ఉంటే మరి కొందరు చాలా సంపద కలిగి అనేక భవనములు, వాహనములు ఇత్యాదివి కలిగి భూమిమీద పొందగల అనేక భోగాలు అనుభవిస్తూ ఉండవచ్చుకానీ ఇలాంటి ఐశ్వర్యవంతులు ఎవరు కూడా భూమిమీద శ్రేష్ఠమైన ఐశ్వర్యవంతులు అని చెప్పలేము ఎందుకంటె ఒకరిని మించిన ఐశ్వర్యం ఇంకొకరికి ఉండిఉండవచ్చుఅలా కాదు ఫలానా వాడు భూమిమీద ఉన్న ఐశ్వర్యవంతులలో శ్రేష్ఠుడు అని అంటే అతనుకూడా శ్రేష్ఠుడు అని చెప్పటానికి వీలులేదు ఎందుకంటే అతనికంటే తక్కువ ఐశ్వర్యవంతులుగా వున్న వారి ఐశ్వర్యాలు కలిపితే ఐశ్వర్యం ఇతని ఐశ్వర్యం కన్నా ఎక్కువగా ఉంటుందివెరసి ఏదో ఒక స్థాయిలో మాత్రమే ఐశ్వర్యం కలిగి ఉండగలరు. అదేవిధంగా భగవంతుని ఆరు గుణాలను మానవులు ఏదో కొంత స్థాయిలో మాత్రమే కలిగి వుంటారుకానీ భగవంతునితో సమానంగా కానీ పొతే పడే స్థాయిలో కానీ ఎవ్వరు ఉండలేరుకానీ వారికి కలిగిన ఐశ్వర్యతోటె విఱ్ఱవీగుతు తన అంతటి వాడు ఏరే ఎవ్వరు లేరని అహంభావంతో ఉండివారి పతనాన్ని వారే ఆహ్వానిస్తారు.  

ఇలా సర్వ సంపన్నుడు ఐన భగవంతుని తెలుసుకోవటం ఎలా

సామాన్య మానవులు కలిగిన సంపదలకు ఒక అవధి వున్నది కాబట్టి అది హాద్దు కలిగి వున్నదిఅంతేకాకుండా సంపద కేవలం ఒక్క భూమి మీద ఒక ప్రాంతంకు మాత్రమే పరిమితి కలిగి వున్నదికాబట్టి మనం ఐశ్వర్యవంతుని, అతని ఐశ్వర్యాన్ని చూడగలుగుతున్నాము. మరి చరాచర సృష్టి మొత్తము భగవంతుని సంపదే వున్నది అంటే ఇంకొక విధంగా చెప్పాలంటే అది  మనం కంటితో కాంచగలిగేది కాంచలేని సంపద, అటువంటి  సంపద కలిగిన ఐశ్వర్యవంతుని చూడటం ఎలాఎప్పుడైతే మనం కంటితో చూడలేని సంపద అని అన్నమో అప్పుడే ఐశ్వర్యవంతుడు కూడా కంటితో చూడలేని వాడని అర్ధం అవుతుంది. అదేవిధంగా ఇతర గుణాలకు కూడా అనువర్తించుకోవచ్చు. వెరసి తేలింది ఏమిటంటే షడ్గుణవంతుడైన వాడు మన కంటికి కనిపించటానికి అవకాశం లేదు ఎందుకంటె మనం చరాచర జగత్తులో చూసేది ప్రతిదీ ఏదో ఒక అవధిని కలిగి వున్నదిఆకార విషయానికి వస్తే ఒక మనిషి 5 నుంచి 6 అడుగుల ఎత్తులోవుండి ఉంటాడు అంటే అతని ఎత్తుకు ఒక అవధి వున్నదిఅదే విధంగా త్రిగుణాలలో ఏదో ఒక గుణం కలిగి ఉంటాడు అంటే అతని గుణాలకు ఒక అవధి  వుంది. అంతేకాకుండా భూమిమీద యేదోకొంత సంపద కలిగి ఉంటాడు అంటే సంపదకు అవధి వుంది. అలాగే దేర్యం కూడా ఒక హాద్దులో ఉంటుందికాబాట్టి భగవంతుడు మానవరూపంలో లేడు, ఉండటానికి వీలులేదు

భగవంతుడు ఉన్నట్లు ఎందుకు నమ్మాలి: ఇది చాలామంది మందిలో మెదిలే ప్రశ్నఅవును నిజమే మన కంటికి కనబడని భగవంతుని ఉన్నట్లు ఎందుకు నమ్మాలి. దానికి సరైన వివరంకావాలి. మన మహర్షులు వారి అనంత మేధాసంపత్తితో చక్కటి వివరం ఇచ్చారు.

ఒకటి ఉన్నది ఉన్నట్లుగా తెలుసుకోవటమే ప్రమాణం.

ప్రమాణము అంటే ఒక విషయం యొక్క సత్యాసత్యాలను నిర్ధారించుకోవడం. హిందూ సాంప్రదాయంలో అందుకు వివిధ పద్ధతులు వివరించబడ్డాయి. అవి:

1.     ప్రత్యక్ష ప్రమాణం: ప్రత్యక్ష ప్రమాణం అంటే స్వయంగా గ్రహించడం. నీవు రామారావుని చూసావు అంటే అతని ఉనికిని నీ నేత్రాలు తెలుసుకొన్నాయి అది ప్రత్యక్ష ప్రమాణంమనం పురాణాలలో వింటూవుంటాము  అతని భక్తికి మెచ్చి భగవంతుడు ప్రత్యక్షం అయ్యాడు అని అంటే దాని అర్ధం ఇంద్రియ గోచరము కానీ భగవంతుడు ఇంద్రియ గోచరుడు అయ్యాడు అని విషయంమీద అనేక సందేహాలు ఉత్పన్నం అవుతాయి దానికి కారణం సాధకునికి సాధనలో పటుత్వం లేకపోవటమే. ముముక్షువులకు సాధనలో తీవ్రత పెరుగుతువుంటే అతనికి కలిగే సందేహాలు వాటంతట అవే నివారణ అవుతాయి.

2.     అనుమాన ప్రమాణం: పొగను గమనించి నిప్పు ఉండవచ్చునను కోవడం అనుమాన ప్రమాణం. అరణ్యంలో దూరంగా మనకు పొగ కనిపించిందంటే అక్కడ నిప్పు వున్నదని తెలుసుకోవచ్చుఅంతే కాదు అరణ్యంలో నిప్పు ఉండటానికి అవకాశం లేదు ఎందుకంటె అరణ్యంలో వృక్షాలు, జంతువులూ మాత్రమే ఉంటాయిజంతువులకు నిప్పుని తయారుచేసే జ్ఞ్యానం ఉండదు కాబట్టి తప్పకుండా అక్కడ మనుషులు వుండివుంటారు అనేది కూడా మనకు అనుమాన ప్రమాణంతో తెలుసుకోవచ్చు.

3.     శబ్ద / ఆప్తవాక్య ప్రమాణం: తాను నమ్మే ప్రమాణ గ్రంథంలో ఉన్నందువలన గానీ, తను విశ్వసించే వారెవరైనా చెప్పినందువలన గానీ అంగీకరించడం శబ్ద / ఆప్తవాక్య ప్రమాణం.

4.     ఉపమాన ప్రమాణం: ఏదైనా ఒక ఉపమానాన్ని చెప్పి ఒప్పించడం ఉపమాన ప్రమాణం.

5.     అర్థాపత్తి ప్రమాణం: వాచ్యంగా చెప్పక పోయినప్పటికీ ధ్వనివల్ల విషయాన్ని బోధపరచడం అర్థాపత్తి. ఫలానా వ్యక్తి పగలు భోజనం చేయడం లేదు అంటే అతడు రాత్రి భోజనం చేస్తున్నాడనుకోవచ్చు.

6.     అనుపలబ్ధి ప్రమాణం: ఒక వస్తువు కోసం ఒకరు మిగతా అందరితో పాటు వరుసలో నిలుచున్నాడు. కాని, అతని వంతు రాకముందే సరకు అయిపోయింది. సరకు అయిపోయి నందువల్ల తనకు వస్తువు దొరకలేదని తెలియడం అనుపలబ్ధి ప్రమాణం.

7.     సంభవ ప్రమాణం: రోజు ఏకాదశి అయితే నిన్న దశమి, మొన్న నవమి అని చెప్పకపోయినా తెలియడం సంభవ ప్రమాణం.

8.     ఐతిహ్య ప్రమాణం: ఏదైనా వస్తువును చూసినప్పుడు, దానిని గురించి గతంలో తాను విన్న విషయాలు జ్ఞాపకానికి వచ్చి తదనుభూతి కలగడం ఐతిహ్య ప్రమాణం.

మనకు ప్రత్యక్ష జ్ఞ్యానం లేకపోయినను ఒక విషయాన్నీ తెలుసుకొనే విధానమే పైన పేర్కొనిన ప్రమాణాలు. భగవంతుని కూడా మనం ఇందులో ఏదో ఒక లేక ఒకటికన్నా ఎక్కువ ప్రమాణాల వలన ఆయా సమయాలలో తెలుసుకోగలం. నాకు ఒక కోరిక ఎన్నో రోజులనుండి తీరటం లేదు అప్పుడు ఎవరో చెప్పారు నీవు సతయనారాయణస్వామి వ్రతం ఆచరించు నీ కోరిక నెరవేరుతుంది అని వెంటనే నేను స్వామి వ్రతం చేసాను నా కోరిక తీరింది. ఇక్కడ మన కంటికి ఏది కనిపించటం లేదు కానీ కార్యం  నెరవేరింది. అప్పుడు నేను నా కోరిక తీరటానికి స్వామే కారణమ్ అయన అనుగ్రహంతోటే నాకు ఫలితం వచ్చింది అని నమ్ముతాను. దీనిని బట్టి తెలిసేది ఏమిటంటే భగవంతుని లీలలు మనకు ఇంద్రియాల ద్వారా తెలుసుకోలేము అని

కార్య కారణ సంబంధం

మన కంటిముందు ఒక కార్యము (పని) కనబడుతూ వున్నది అంటే దానికి కారణమైన కారకుడు వుండివుండాలి అనేది  కార్య కారణ సంబంధం :నీ కంటిముంది ఒక చక్కటి కట్టడం కనపడుతున్నది అది చాలా పురాతనమైనదిదానిని ఎవరు కట్టారో నీకు తెలియదుకానీ అది ఎవరో కట్టి వుంటారు అన్నది మాత్రం ప్రమాణం ఎందుకంటె నీ ముందు కార్యం (పని అంటే నిర్మాణం) కాన పడుతూవున్నది. అంటే అది నిర్మించిన పనివాడు కూడా వుంది ఉంటాడు. అదే విధంగా నీకు పర్వతాలు, నదీనదాలు, సాగరాలు, ఎడారులు, కనపడుతూ వున్నాయి అంటే అవి ఒక కార్యం (పని) అటువంటప్పుడు కార్యం చేసిన కారకుడు అంటే నిర్మాత వుంది ఉండాలి కదా అటువంటి నిర్మాతనే కార్యకర్తగా భగవంతునిగా మన మహర్షులు ఆవిష్కరించారు

నియతి నియంత:

మనం నిత్యం కార్యాలయాలలో కొన్ని నియమాలను చూస్తూవుంటాం అవేమిటంటే ఉదయం 10. గంటలకు కార్యాలయంలోకి ఉద్యోగులు రావటం, 1 గంట దాకా పనిచేయటం, తరువాత భోజన విరామం తరువాత మరల సాయంత్రం 5 గంటలవరకు పనిచేయటంఇలా నియమాలను సారంగా ఉద్యోగులు పనిచేయటం ఒక నియతి అంటే ఒక క్రమ పద్దతిమరి క్రమ పద్దతిని నియమించింది ఎవరు అంటే అది యాజమాన్యం అంటే ప్రభుత్వంప్రభుత్వం ఆదేశాలను జారీ చేస్తే అన్ని కార్యాలయాలు పద్దతి ప్రకారంగా పనులు చేస్తుంటాయి. అంటే ఇట్లా ఉన్న నియతికి కారణం ప్రభుత్వం అని మనకు తెలుస్తున్నదిఎప్పుడైతే నియతి కనిపిస్తున్నాదో అప్పుడు నియంత  ఉన్నట్లు మనకు జ్యోతకమవుతున్నది

మనం   ప్రకృతుడిలో  రోజు అలాంటి నియతినే చూస్తూవున్నాము. రోజు నీవు ఒక విత్తును నాటావు అది ఒక నాలుగు రోజులలో మొలకెత్తి మొలకగా కనిపిస్తున్నది, తరువాత చెట్టుగా మారి దానికి మొగ్గలు, పూలు, కాయలుగా రోజుకొక విధంగా రూపాంతరం చెంది చివరకు ఒకరోజు నశించిపోతుంది. దృగ్గోచరం నీవు నేను రోజు చూస్తున్నాము

వర్షపు నీరు ప్రవహించి పల్లానికి వెళుతున్నాయి, అవి ఒక వాగుగా, నదిగా మారి చివరకు సముద్రాన్ని చేరుకుంటున్నాయి. మనకు వేసవి కాలం తరువాత, వర్షాకాలం ఆతరువాత శీతాకాలం మరల వేసవికాలం ఒక క్రమపద్ధతిలో వస్తున్నాయి. అంటే ఇక్కడ ఒక నియతి వున్నది

ఇంకొక విషయం ప్రకృతికి కొన్ని నియమాలు వున్నాయి అవి ఆకాశంలో నీళ్లు లేవు కానీ మేఘాలు వర్షితున్నాయి, నిప్పు ముట్టుకుంటే కాలుతున్నది, భూమికి ఆకర్షించే గుణం వున్నది. చంద్రుడు తన కళలతో విరాజిల్లుతున్నాడు సూర్య చంద్రులు తూర్పున ఉదయించి పడమర అస్తమిస్తున్నారు. ప్రతిరోజూ రాత్రిపగళ్ళు ఏర్పడుతున్నాయి. ఇలాంటివన్నీ నియతులేఇంతక్రమపద్ధతిలో కాలచక్రం ఎలా నడుస్తున్నది అంటే దానిని నడిపే కర్త ఎవరో ఒకరు ఉండాలి కర్తే భగవంతుడు.. 

భగవంతుని తెలుసుకోవటమే బ్రహ్మజ్ఞానం మరి అది పొందటం ఎలా

ముందుగా మనం బౌతికంగా వున్నవిషయాలను తెలుసుకుందాము.  

తెలిసిన విషయాలు

ప్రతి మానవుని జ్ఞ్యానం ఒక పరిమిత స్థాయికి మాత్రం చేరుకొని ఉంటుంది. జ్ఞ్యానం అంటే తెలిసిన విషయాలు అని సాదారణ అర్ధం చెప్పుకుందాం. నిజానికి బౌతికంగా కనిపించే వస్తువులమీద కూడా ప్రతివానికి ఒక పరిమితమైన జ్ఞ్యానమే ఉంటుంది. సంపూర్ణ జ్ఞ్యానం ఒక్కరికే ఉండదు కొంతమంది జ్ఞ్యానవంతుల జ్ఞ్యానాన్ని సమీకరిస్తేనే సంపూర్ణ భౌతిక జ్ఞ్యానం కలుగుతుంది

ఉదాహరణకు ఒక కారుని తీసుకుందాము. మీ ఇంట్లోని బాలునికి నీ కరుగురించి కలిగిం జ్ఞ్యానం ఏమిటనే మీ కారుని గుర్తించటం కారులో నీతో ప్రయాణం  చేయటం. అదే నీకు కారుని నడపటం వరకు మాత్రమే జ్ఞ్యానం వుందిదానికి రిపేరు వస్తే బాగుచేయటానికి రిపేరరు వద్దకు తీసుకొని వెళ్ళాలి, అతనికి కూడా కొంతవరకే జ్ఞ్యానం ఉంటుంది. దానిని తయారుచేసిన వారందరి సంపూర్ణ జ్ఞ్యానాన్ని సమీకరిస్తేనే కారుకి సంబందించిన సంపూర్ణ జ్ఞ్యానం లభించదు. భౌతికమైనదే ఇంత జటిలంగా ఉంటే ఆధ్యాత్మికమైనది ఇంకా యెంత కఠినంగా ఉంటుంది

ప్రతి మనిషికి కలిగిం జ్ఞ్యనం రెండు రకాలుగా చెప్పవచ్చు ఒకటి అతనికి కలిగిన జ్ఞ్యానం రెండవది అతను పొందవలసిన జ్ఞ్యానం మొదటిది తనకు కలిగిన జ్ఞ్యానం అంటే ఒక మనిషి తానూ పంచేంద్రియాలద్వారా తెలుసుకున్న జ్ఞ్యానం, అది తన స్వన్తంగా తెలుసుకున్నది, గ్రంథపఠనం వలన తెలుసుకున్నది, గురువులద్వారా శ్రవణం చేసి తెలుసుకున్నది కావచ్చుఏది ఏమైనప్పటికి ప్రతిదీ ఇంద్రియాలకు లోబడినది, జగత్తులో కనిపించేది, వినిపించేది, అనుభవంలోకి వచ్చేది మాత్రమే అవుతుందికానీ అంతకుభిన్నంగా మాత్రం ఉండటానికి వీలులేదు. తెలిసినదానిని జ్ఞ్యానం తెలియనిదానిని అజ్ఞ్యానం అని మనం అంటామునీకు జ్ఞ్యానంగా వున్నది ఇంకొకరికి అజ్ఞ్యానంగా ఉండవచ్చు అదేవిధంగా నీకు అజ్ఞ్యానంగా వున్నది ఇంకొకరికి జ్ఞ్యానంగా గోచరించవచ్చువెరసి భూమిమీద వున్నవారికి ఒక్కొక్కరికి ఒక్కోక పరిధిలో జ్ఞ్యానం ఉంటుంది అన్నది సత్యం. భూమిమీద వున్న మానవుల అందరి జ్ఞ్యానాన్ని మనం ఒక సంపూర్ణ జ్ఞ్యానంగా అంటే ఇక్కడ అన్ని శాస్త్రాల జ్ఞ్యానం అనుకుంటే అందులో ఒక మనిషికి  తెలిసిన జ్ఞ్యానాన్ని అతని జ్ఞ్యానంగా తెలియని జ్ఞ్యానాన్ని అజ్ఞ్యానంగా పరిగణిస్తున్నాము. ఇది మన భౌతిక మైన సాదారణ ఆలోచన. అంటే ప్రతి మనిషికి ఉన్న అజ్ఞ్యానాన్ని తొలగించుకోవాలంటే దానికి సంబందించిన జ్ఞ్యానవంతుని ద్వారా శిక్షణపొంది జ్ఞ్యానవంతుడు  అవవచ్చు. అంటే ఒక మనిషికి తెలియని జ్ఞ్యానాన్ని మనం ఒక గురువునుంచి పొందవచ్చు అని అనుకుంటాము. ఒక్క మాటలో చెప్పాలి అంటే దేనిగురించి ఐనా అజ్ఞానం ఉందంటే దానికి సంబందించిన జ్ఞ్యానం ఉన్నవారి వద్దనుండి పొందవచ్చు అంటే ఒక విష్యంగూర్చిన జ్ఞ్యాననఁ ఉంటె నీకున్న జ్ఞ్యానంములోనన్న లేక నీకున్న అజ్ఞ్యానంలో నయినా ఉండి  ఉండాలి తత్భిన్నంగా ఉండటానికి వీలులేదు

ఇది చదువుతుంటే అర్ధం ఐనట్లే అనిపిస్తుంది అర్ధంకానట్లు కూడా కనిపిస్తుంది. ఎందుకంటె మనం ఇప్పుడు తెలుసుకునే జ్ఞ్యానం బ్రహ్మ జ్ఞ్యానానికి సంబంధించింది అంటే జ్ఞ్యానం తెలుసుకుంటే మరొకటి తెలుసుకొనవసరంలేదో అదే బ్రహ్మ జ్ఞ్యానం. దీనిని అర్ధంచేసుకోవటానికి సునీత సూక్ష్మ ఆవగాహన కలిగి ఉండి శ్రర్ధ, అకుంఠిత దీక్ష సంపూర్ణంగా తెలుసుకోవాలనే జిగ్న్యాస కలిగివుంది ఇతర విషయాలమీద మనస్సు పోకుండా ఏకాగ్రత చిత్తం కలిగి ఉండాలి. విషయవాంఛలకు లోనయివుండే మనస్సు ఏకాగ్రతను ఏర్పరచుకోవడం చాలా కష్టం. సాధారణ మానవులకు దైవ చింతన అనేది కేవలం దైవభక్తి వరకు మాత్రమే పరిమితం అయివుంటుందిఅదికూడా నేటి సమాజంలో అనేక దొంగగురువులు, దొంగ సాధువులు  తారసపడుతున్నారువారు వారి ఆధ్యాత్మికతలో ఏమాత్రం అభివృద్ధి సాధించకపోయినా కొన్ని మహిమలు అవి ఏరకంగా వస్తాయో ఇక్కడ వివరించనవసరంలేదు ఎందుకంటె అవి సాధనావల్ల, సిద్దించిన సిద్దులు కావు కాబట్టి వాటికి ప్రచారం ఎక్కువగా వుంది అందరిని తాను మహిమాన్వితుడనని నమ్మించటం చాలా తేలిక . రోజుల్లో అటువంటి బాబాలు, స్వామీజీలు కుప్పలు తెప్పలుగా వెలుస్తున్నారు, సాధారణ ప్రజల్ని మోసగిస్తూ వాళ్ళ పబ్బం  గడుపుకుంటున్నారు. కాబట్టి ముముక్షువులు జాగరూకతకలిగి ఉండాలి

ఇక విషయానికి వస్తే బ్రహ్మ జ్ఞ్యానం భూమిమీద వున్న జ్ఞ్యానం కాదు కాబట్టి అది గురువులద్వారా పొందేది కాదు. ఎవరైనా నేను సద్గురువును నీకు ఆత్మా జ్ఞనాన్ని ఉపదేశిస్తాను అంటే నమ్మవలదుఅది కేవలం సాధకుడి అకుంఠిత దీక్షతో సాధించేది మాత్రమే

సాధకుడు తన సాధనతో ప్రారంభంలో కొన్ని శక్తులు వస్తాయి అవికేవళం తాత్కాలికమేనవి మాత్రమే కానీ సంపూర్ణ దీక్షతో నిరంతన సాధనతో సాధకుడు సమాధి స్థితికి చేరుకున్న తరువాత అష్టసిద్ధులు  వస్తాయి. అష్ట సిద్దులు లభించిన తరువాత సాధకుడు వాటిని దుర్వినియోగం చేయకుండా తన సాధనను ఇంకా ఇంకా కొనసాగిస్తే అప్పుడు మాత్రమే అనిర్వచనమిలేం మోక్షం లభిస్తుంది

ఓం తత్సత్,

 ఓం శాంతి శాంతి శాంతిః 

మీ 

భార్గవ శర్మ