🎻🌹🙏సూర్యభగవానుని శిష్యుడు.....!!
🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸
🌿గొప్ప జ్ఞానిగా పేరుపొందిన సకలుని పుత్రుడు వైశంపాయనుడు. ఈయన వేదవ్యాసుని శిష్యుడు. సకల
వేదవేదాంగాలలో నిష్ణాతుడు.
🌸ఒకనాడు వైశంపాయనుడు తన శిష్యులతో " ఈనాడు మనం అందరం భయం లేకుండా యజ్ఞయాగాదులు ప్రశాంతంగా చేసుకోగలగడానికి కారణం మిధిలా నగరాన్ని పాలిస్తున్న జనక మహారాజు కనుక మీరు రోజుకు ఒకరు చొప్పున ఆ మహారాజు భవనానికి వెళ్ళి మంత్రాక్షింతలతో మహారాజును వారిని ఆశీర్వదించి రావాలి" అని ఆదేశించాడు.
🌿గురువుగారి ఆనతి ప్రకారం శిష్యులు అందరూ ఒక్కొక్క రోజు మహారాజుని ఆశీర్వదించి రాసాగారు.
🌸వైశంపాయనుని శిష్యులలో ఒక శిష్యుడు మహాజ్ఞాని. అతను
మహావిష్ణువు ఆనుగ్రహంతో జన్మించినవాడని పురాణ గ్రంధాలు కీర్తిస్తున్నాయి.
🌿ఈయన జనకుని ఆశీర్వదించే రోజు వచ్చినది. అతను జనక మహర్షి భవనానికి వెళ్ళాడు.
కాని ఆ సమయాన మహారాజు అక్కడ లేకపోవడంతో
మంత్రాక్షింతలను అక్కడి మండపంలో వేసి వెళ్ళిపోయాడు.
🌸 జనకమహారాజు తిరిగి వచ్చి చూసేసరికి ఆశ్చర్యకరంగా ఆ మండపమంతా విరిసిన పరిమళ పుష్పాలతో కళకళలాడుతూ కనిపించింది. ఆ శిష్యుని అక్షితల ప్రభావం వలన పుష్పవనంగా మారిన ఆ ప్రాంతం మహారాజు మనసుని ఉత్సాహభరితం చేసింది.
🌿అక్షంతలు జల్లి వెళ్ళిపోయిన ఆ జ్ఞానిపై జనకమహారాజు కి ప్రత్యేకమైన అభిమానం కలిగింది. ఇంక మీదట "నిత్యము జ్ఞానసిధ్ధి పొందిన ఆ శిష్యుడే వచ్చి మంత్రాక్షింతలతో ఆశీర్వదించేలా ఏర్పాట్లు చేయమని
జనకమహారాజు వైశంపాయనుని కోరాడు.
🌸కాని జ్ఞానియైన ఆ శిష్యుడు గురువుగారు మొదట ఏర్పాటు చేసిన
పధ్ధతి ప్రకారం నిత్యం ఒక్కొక్క శిష్యుడుగా వెళ్ళి
ఆశీర్వదించడమే సముచితమని
చెప్పాడు.
🌿ఈ విధంగా నడచుకోవడం మహారాజు మాటను అతిక్రమించి నట్లు కాదని వినయంగా తెలిపి తోటి శిష్యులకు సమంగా అవకాశాలు కలిగించాడు.
🌸తర్వాతి కాలంలో ఈ శిష్యుడే జనక మహారాజుకు బ్రహ్మవిద్యను ఉపదేశించినట్లు పురాణ గ్రంధాలు తెలుపుతున్నవి. ఆవిధంగా ఆయన బోధించిన కాలంలో జనకపురి ఆశ్రమాన్ని కణ్వమహర్షి.
ఈయన ఆ జ్ఞాన శిష్యుని ప్రధమ శిష్యుడు.
🌿ఆయనే శ్రీ మన్నారాయణుని అంశయైన యజ్ఞవల్కుడు.
భూలోకంలో ఈయన అవతరించడమే
ఒక అద్భుతం.
🌸భరతఖండంలో ఉత్తర భాగాన
వర్ధమానపురం వున్నది. ఇక్కడే సకలుడు అనే ఋషి నివసించేవాడు. ఆయనకి సునంద అనే పుత్రిక, వైశంపాయనుడనే పుత్రుడు
వున్నారు.
🌿సరస్వతీ దేవి అంశ అయిన సునందని బ్రహ్మరధుడు వివాహం చేసుకున్నాడు.
చాలాకాలం దాకా వీరికి సంతానం కలుగలేదు. ఆయన
శ్రీమన్నారాయణుని ధ్యానిస్తూ
తపస్సు చేశాడు.
🌸బ్రహ్మరధుని తపస్సు కి మెచ్చి మహావిష్ణువు ప్రత్యక్షమైనాడు. బ్రహ్మరధుడు 'సద్గుణవంతుడు , సకలశాస్త్రపారంగతుడైన, ఒక పుత్రుని ప్రసాదించమని నారాయణుని
వరం కోరాడు.
🌿నారాయణుడు అనుగ్రహించాడు.
కాలక్రమంలో సునందా దేవి గర్భవతి అయినది.కాని ప్రసవం కాలేదు.
నెలలు నిండాయి. సంవత్సరాలు గడిచాయి. అయినా ప్రసవం
మాత్రం జరుగలేదు. గర్భంలోని శిశువుని కారణమడుగగా,
శ్రీ మన్నారాయణుని అనుగ్రహం నాకు లభిస్తేనే జన్మిస్తాను"
అనే మాటలు వినపడ్డాయి.
🌸బ్రహ్మరధుడు తిరిగి తపస్సు చేశాడు. ఐదు సంవత్సరాల గర్భవాసానికి తరువాత మహావిష్ణువు అనుగ్రహంతో బిడ్డ క్షేమంగా జన్మించాడు. శతభిషా నక్షత్రం, ధనుర్లగ్నం కూడిన శుభదినమున శ్రీ మన్నారయణుడే అవతరించాడు. ఇదే యజ్ఞవల్క్యుని అవతార దినం.
🌿పెద్దలు ఆ పిల్లవానికి పెట్టిన పేరు "సానందరుడు'' మహర్షులు పరమానందంతో
యజ్ఞవల్క్యుడని పిలుస్తారు.
దేవగురువైన బృహస్పతి నాలుగు వేదాలు, సకల విద్యలు , సకల కళలు యీయనకు నేర్పి ఉపనయనం చేశాడు.
🌸పిదప వేద వ్యాసుని వద్ద వేదాధ్యయనం చేశాడు యజ్ఞవల్క్యుడు. ఋగ్వేదమును యజుర్వేదమును, 59 భాగాలు అభ్యసించాడు. తన తల్లి సోదరుడైన వైశంపాయన మహర్షి వద్ద
జ్ఞానయోగమును అభ్యసించాడు.
🌿వైశంపాయనుని వద్ద శిష్యునిగా వున్న సమయంలో జనకుని అనుగ్రహించిన సంఘటనలు జరిగాయి.
🌸వేదాలలో ప్రధాన భాగాలు అభ్యసించిన పిదప 15 భాగాలు మిగిలి వున్నవి ఆ భాగాలు
సూర్యభగవానునికి మాత్రమే తెలుసు .
యజ్ఞ వల్క్యుడు గాయత్రీ దేవిని
ఉపాసించి తపస్సు చేశాడు.
🌿 గాయత్రీ దేవి సూర్యభగవానుని ద్వారా మిగిలిన భాగాలు నేర్చుకునేటేందుకు సహాయం చేసినది.
అనేక కఠోర పరీక్షల తరువాత సూర్యదేవుడు యజ్ఞవల్క్యుని తన శిష్యునిగా చేసుకొన్నాడు. తనకి తప్ప మరి ఎవరికి తెలియని యజుర్వేద రహస్యాలను నేర్పేడు.
🌸యజ్ఞవల్క్యుడు గృహంలో నివసిస్తూనే తన శిష్యులకు శుక్ల యజుర్వదమును, వేదాలను నేర్పేరు.
🌿" యజ్ఞ వల్క్య స్మృతి' అనే గ్రంధాన్ని వ్రాశారు. ఈనాటి చట్ట ప్రమాణాలు, మొదలైన విజ్ఞానమును తెలిపే ఆది గ్రంధంగా వున్నది...స్వస్తీ...🚩🌞🙏🌹🎻
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి