25, జులై 2023, మంగళవారం

యదార్థ సంఘటన.

 ఒక రోజు ఒక ముస్లిం తన భార్య మరియు ఎనిమిది మంది పిల్లలతో గ్రామపెద్ద వద్దకు వచ్చి గ్రామంలో నివసించడానికి వేడుకున్నారు.

 రాత్రి నిద్రలేచిన గ్రామాన్ని సంరక్షిస్తున్న వాచ్‌మెన్‌ వాళ్లను ఇక్కడ ఉండనివ్వకండి అని ఎంత వారించినా ఎవరూ వినకపోవడంతో ముస్లిం కుటుంబాన్ని గ్రామంలో ఉండేందుకు అనుమతించారు.

 రోజులు గడిచాయి, ముస్లింల ఎనిమిది మంది పిల్లలు పెద్దవారయ్యారు,ముస్లింలు సర్పంచ్ వద్దకు వెళ్లి, పిల్లలకు పెళ్లిళ్లు కాబోతున్నాయని, నాకు ఒకే ఇల్లు ఉందని ఇల్లులు కట్టుకోవడానికి కొంత భూమిని ఇవ్వమని వేడుకున్నారు, గ్రామస్థులు ఆ ముస్లిం కుటుంబాలకు బంజరు భూమిని ఇచ్చారు, ఇక అక్కడ అందరూ ఇల్లు కట్టుకున్నారు.

 కొంతకాలం తర్వాత, ఆ ఎనిమిది మందికి పెళ్లిళ్లు అయ్యాయి 74 మంది పిల్లలు పుట్టారు మరియు దాదాపు 30 సంవత్సరాలలో, ఆ గ్రామంలో ముస్లింల జనాభా 40% అయింది.

 ఇప్పుడు ముస్లిం అబ్బాయిలు వారి అలవాటు ప్రకారం హిందువులతో గొడవలు పెట్టుకోవడం మొదలుపెట్టారు మరియు హిందూ మహిళలను మరియు సోదరి కుమార్తెలను వేధించడం ప్రారంభించారు. క్రమంగా, ప్రతి హిందువు తన కుటుంబంతో స్వచ్ఛందంగా గ్రామాన్ని విడిచిపెట్టడం ప్రారంభించారు.

 ఒక రోజు గ్రామంలోని ప్రధాన దేవాలయాన్ని ముస్లింలు పడగొట్టారు మరియు వారు దానిపై మసీదు నిర్మించడం ప్రారంభించారు, అప్పుడు మిగిలిన హిందువులు వారిని ఆపడానికి ప్రయత్నించారు అప్పుడు ముస్లింలు అల్లా పనిని ఎవరు అడ్డుకుంటే, వారిని నరికివేయండి అని అన్నారు.

 మిగిలిన హిందువులు, ఎదురు మాట్లాడకుండా గ్రామాన్ని విడిచి పెట్టి వెళ్లిపోతు మేము మీ మాట వినలేదని ముస్లీమ్ లను నమ్మినము అని దాని కారణంగా మేము ఈ రోజు గ్రామాన్ని విడిచిపెట్టవలసి వచ్చింది అని దారిలో ఉన్న వాచ్‌మెన్‌తో చెప్పారు.

 ఆ గ్రామం పేరు *పంచవటి* కాని ప్రస్తుతం *రహీమాబాద్‌గా* మార్చబడింది. ఈ గ్రామం మహారాష్ట్రలోని అమరావతి జిల్లాలో ఉంది.

 *గమనిక - ఇది కథ కాదు, యదార్థ సంఘటన.*


హిందువులు కు జ్ఞానోదయం కలగాలని కోరుకుందాం సార్


ప్రతి హిందువు మన ధర్మ రక్షణ కోసం మన హిందువుల దగ్గర కొనడం అలవర్చుకొండి


ఆటో, హాస్పిటల్, మాంసపు కొట్టు, కిరాణం,డాక్టర్స్,మెకానిక్స్,మొదలైనవి మన హిందువుల దగ్గర కొనడం ప్రయత్న పూర్వకంగా అలవాటు చేసుకోండి.


80 శాతం ఉన్న మనల్ని చూసి ఇతరులు భయపడేది అటుంచి,మనల్ని భయబ్రాంతులకు గురి చేస్తున్నారు.

రాజకీయనాయకుల ను నమ్ముకొకండి వారు ఓట్లకోసం ఎవరిని దూరం చేసుకోరు

మన దర్మం కోసం పాటుపడే నాయకులను ఎన్నుకోండి.


మన ధర్మం రక్షింప బడాలని రోజుకు ఒకసారి దేవుణ్ణి ప్రార్థించండి


హిందువుల ఐక్యత వర్ధిల్లాలి

*సమస్త హిందూ జన సుఖినోభవంతు*

భారత్ మాతాకు జై.

ప్రణతి శ్రీకాళహస్తీశ్వరా ! మహేశ !

 ఏ వేదముల్ నేర్చె నెంచగా సాలీడు ?

          సర్పమే శాస్త్రముల్ చదువు కొనియె ?

హస్తి యే పాఠమ్ము లభ్యాస మొనరించె ?

         తిన్నడే మంత్రమ్ము తీర్చె మదిని ?

జగతీ తలమ్మునన్ జ్ఞానోదయ ప్రాప్తి 

          సమకూరునా ! డొల్ల చదువు కతన ? 

కాదయ్య పరమేశ ! కాదు కాదెప్పుడు

          చేరు నయ్యది నీదు సేవ చేత

నిరత సoసేవనా సక్తి నిల్ప మదిని

కల్గు జ్ఞానమ్ము జీవికి గరళకంఠ !

అన్యమున కూడ దెప్పుడీ యవనియందు 

ప్రణతి శ్రీకాళహస్తీశ్వరా ! మహేశ !          


గోపాలుని మధుసూదన రావు 🙏

దొరకునా ఇటువంటి సేవ!

 కాఫీ విత్ మధు ☕️


విజయవాడ ఆకాశవాణి కేంద్రం

డిసెంబర్ 1న వజ్రోత్రోత్సవ సంవత్సరంలోకి ప్రవేశించింది 


'రేడియో జంక్షన్'లో శబ్దమాంత్రికులు


ఇప్పుడవన్నీ జ్ఞాపకాలు. కానీ అప్పుడవి విద్వత్ జ్వలిత క్షణాలు. ఒక్కసారి ఇ కాదు, చాలాసార్లు గుర్తుకొస్తూ ఉంటాయి. 


నా చిన్నతనంలో విజయవాడ

రేడియోలో బందా కనకలింగేశ్వరరావు, పింగళి లక్ష్మీకాంతం, బాలమురళీ కృష్ణ, తెన్నేటి హేమలత, జలసూత్రం రుక్మిణీనాథ శాస్త్రి, ప్రయాగ నరసింహశాస్త్రి, వింజమూరి శివరామారావు, కందుకూరి రామభద్రరావు, ఆమంచర్ల గోపాలరావు, జి.వి.కృష్ణారావు, కూచిమంచి కుటుంబరావు, అన్నవరపు రామస్వామి, దండమూడి రామ్మోహనరావు, శ్రీరంగం గోపాలరత్నం, వింజమూరి లక్ష్మి, వి.బి. కనకదుర్గ, నండూరి సుబ్బారావు, సి. రామ్మోహనరావు, ఎ.బి. ఆనంద్, లింగరాజు శర్మ మొదలైనవారి పేర్లు ఎక్కువగా వినిపిస్తూ ఉండేవి. 


వీళ్ళలో చాలామందిని చూడను కూడా చూశాను. ఎక్కువమంది సూర్యారావు పేటలో మా మేనమామగారి ఇంటికి చుట్టుపక్కల ఉండేవారు. బందాగారు గొప్పనటులు. పౌరాణిక నాటకాలలో అనేక పాత్రలు పోషించారు. కృష్ణుడు, కర్ణుడు, బిల్వమంగళుడు ఇంకా ఎన్నెన్నో..! వారి మహత్తర నటనా జీవితం ఒక ఎత్తయితే; కూచిపూడి యక్షగానాలను, నాట్య సంప్రదాయాలను ఉద్ధరించడం మరోఎత్తు. కూచిపూడిలో 'కళాక్షేత్రం' నాట్య పాఠశాలను స్థాపించారు. కూచిపూడి నాట్య బృందాలను దేశ మంతటా తిప్పుతూ ప్రదర్శనలు ఇప్పించి కూచిపూడి నాట్యాన్ని జగద్విదితం చేశారు. 


ప్రయాగ నరసింహశాస్త్రి వినోదాల వీరయ్యగా, మొద్దబ్బాయిగా రకరకాల పేర్లతో శ్రోతల్లోకి చొచ్చుకు పోయి వినోదాన్ని పంచారు. జానపద గీతాలను చక్కని చతురోక్తులతో శ్రావ్యంగా పాడి రక్తికట్టించేవారు. 


ఇక గానగంధర్వుడు బాలమురళి గురించి ఎంత చెప్పినా తనివితీరదు. సంగీతమే బాలమురళిగా ఈ భూమి మీద అవతరించింది. వాళ్ల వల్ల రేడియోకి పేరు వచ్చిందా, రేడియో వల్ల వాళ్లకు పేరు వచ్చిందా? ఏమో! చెప్పలేను. 


విత్తు ముందా, చెట్టుముందా లాంటి ప్రశ్న అది. ఏది ఏమైనా వాళ్ళందరూ సంగీత సాహిత్య స్రష్టలు, ద్రష్టలు. వారి వారి రంగాలలో వెలుగులు ప్రసరింపచేసినవారు. 


తరువాత కాలంలో మరికొన్ని పేర్లు వినబడుతూ వచ్చాయి. వారు కూడా సంగీత సాహిత్యాది కళలను ఆపోసన పట్టిన అగస్త్యులే!. విద్యలకన్నిటికీ వెన్నెల మెరుగుగా, మెరుగు వెన్నెలగా రజని; 


కర్ణాటక సంగీత విద్వాంసులు ఓలేటి, అమరావతికథల సృష్టికర్త సత్యం శంకరమంచి; తన గంభీర స్వరంతో రేడియోలో రామాయణ, భారత, భాగవతాలు వినిపించి ప్రతీ ఇంటినీ నైమిశారణ్యం చేసిన ఉషశ్రీ, ఒక్క పాటేమిటి, ఒక్క పద్యమేమిటి, నాటకమేమిటి, ఏదైనా అలవోకగా రాయగల సరస్వతీ పుత్రుడు, సంస్కృతాంధ్ర పండితుడు ఇంద్రగంటి శ్రీకాంతశర్మ; 


హాస్యానికి రంగూ రుచీ వాసనలు అద్ది, తమలపాకుతో హాస్యం కానీ తలుపు చెక్కతో కాదు అని, రేడియో కోసం ప్రత్యేకంగా రెండు మూడు నిముషాలు నిడివి ఉండే సౌండ్ కార్టూన్స్ చెళుకులను గుప్పించిన పన్నాల సుబ్రహ్మణ్య భట్టు....


ఇలా ఎందరో సంగీత, సాహిత్య ప్రక్రియల ద్వారా ఆనందాన్ని కలిగించారు. 


విజయవాడ ఆకాశవాణి ప్రస్థానం 1948 డిసెంబర్ 1న ప్రారంభమై అద్వితీయంగా 74 ఏళ్లపాటు సాగి వత్సవ సంవత్సరంలోకి అడుగుపెట్టిన శుభ సందర్భంలో ఆ మరపురాని మనీషులందరినీ తలుచు కోవడం మహదానందంగా ఉంది.


1972లో అంటే విజయవాడ ఆకాశవాణి ప్రసారాలు ప్రారంభమైన 28 ఏళ్ల తర్వాత రేడియోలో చేరిన నవతరం మరొకటి ఉంది. మేలిమి బంగారం లాంటి ఆ సృజనకారులలో అగ్రగణ్యుడు 'మా రాముడు'. అదేనండి! రేడియో రామం! ఇల్లలికిన ఈగలాంటివాడు. వాడి ఇంటి పేరు వాడికే గుర్తులేదు. రేడియో రామంగానే ప్రసిద్ధుడు. 


స్వరాన్ని, శబ్దాన్ని ఎంత కావాలో అంతవరకే తూకం వేసి ఒడిసి పట్టుకుంటాడు. గొప్ప శబ్దమాంత్రికుడు. ఆకాశవాణి ప్రతి ఏటా జాతీయ స్థాయిలో నిర్వహించే నాటక, రూపక పోటీల్లో మొదటి బహుమతి వాడిదే. 


రేడియో నాటకాలకు, రూపకాలకు, పిక్చర్ అండ్ సౌండ్ అనే నూతన శబ్ద ప్రక్రియకు తలుపులు, కిటికీలు తెరిచినవాడు రామం. చాలామంది సినిమా యాక్టర్లు మేము

డాక్టర్లు కాబోయీ యాక్టర్లమయ్యామంటుంటారు. 


రాముడు రేడియోలో సౌండ్ ఇంజనీరు కావాలనుకుని వచ్చి మన అదృష్టం కొద్దీ ఎనౌన్సరయ్యాడు. మరో ఘనాపాటి మల్లాది సూరిబాబు. సుస్వర సంగీతలోలుడు. పాటల ఊట. రసికులు మెచ్చే పాటలు రేడియో కోసం ఎన్ని స్వరపరిచాడో లెక్కలేదు. 


కేంద్ర సంగీత నాటక అకాడమీ పురస్కారం అందుకున్నాడు. కలగా కృష్ణమోహన్ గురించి, సుధామ గురించి కూడా మాట్లాడుకోవాలి. 


కృష్ణమోహన క్కు పాటంటే ప్రాణం. స్వరాలతో ఆడుకోవడం సరదా. అతనో పాటల పూవుల వంతెన. సుధామ ఒక సాహితీ భాండాగారం, కవి విమర్శక పండితులు. ఇద్దరూ విజయవాడలో పనిచేశారు.


మా తరువాత విజయవాడ రేడియోలో చేరిన బహుముఖ ప్రజ్ఞాశాలి జయప్రకాష్. శబ్ద నాటక శిఖర మతను. రామం తరువాత ఆ వారసత్వాన్ని నిలబెడుతూ ఆకాశవాణి వార్షిక బహుమతులు ఎనిమిది గెల్చుకున్నాడు. విజయవాడ రేడియోను తలుచుకున్నప్పుడు తప్పనిసరిగా గుర్తుచేసుకుని శిరస్సు వంచి సభక్తికంగా, సగౌరవంగా నమస్కరించ వలసిన వాచికాభినయ ప్రతిభామూర్తులు, నట దిగ్గజాలు, స్వరకర్తలు మరి కొందరున్నారు. స్వర

సామ్రాజ్ఞి శారదా శ్రీనివాసన్, నండూరి విఠల్, అద్దంకి మన్నార్, ఎన్.సి.బి జగన్నాథాచార్యులు, ఎం.వీరభద్రరావు (సినిమాల్లోకి వెళ్ళాక సుత్తి వీరభద్రరావు), గొల్లపూడి మారుతీరావు, మల్లిక్... వీళ్ళంతా విజయవాడ ఆకాశవాణి ప్రాంగణంలో నిలిచి ఎదిగిన వెలుగు దీపాలు.


విజయవాడలో 'రజని' డైరెక్టరుగా ఉన్నకాలం స్వర్ణయుగం. అప్పుడు ఆయన చుట్టూరా కవులు, గాయకులు, పండితులు ఉండేవారు. ఏదో ఒక మాట పుచ్చుకుని, పాట అందుకుని పాడుతూ ఉండేవారు. 


అక్కడి చెట్లు కూడా ఆపాటకు తలలూపుతూ ఉండేవి. ఏనాటి ముచ్చట్లివన్నీ! 40 ఏళ్ళ క్రితం మాటలు. ఇటీవల వరకు పనిచేసి విజయవాడ రేడియోకు వన్నెతెచ్చిన వాళ్ళలో సి.ఎస్. రాంబాబు, మల్లేశ్వరరావు కూడా ఉన్నారు. 


చిక్కని కవితలు, కథలు అల్లుతారు. ఏ సమస్యనీ, ఏ సందర్భాన్నీ వదిలిపెట్టరు. దేనినైనా చిత్రిక పట్టగలరు. నేను వార్తల మనిషిని. నాకు సహచరులుగా, సహోద్యోగులుగా, పెద్దలుగా పనిచేసిన వారిలో అతి ముఖ్యులు కొందరున్నారు. ఆర్.వి.వి.కృష్ణారావు, బి.నారాయణరావు, భండారు శ్రీనివాసరావు, కొప్పుల సుబ్బారావు, మామిళ్ళపల్లి రాజ్యలక్ష్మి, తిరుమలశెట్టి శ్రీరాములు, డి.వెంకట్రామయ్య... వాళ్ళందరూ హృదయులు, సంస్కారవంతులు, మంచితనం మూర్తీభవించిన మూర్తిమత్వం వాళ్ళది. 


ఇంకా ఏవరినైనా స్మరించకుండా వదిలిస్తే మన్నించండి! రేడియోకు అనిర్వచనీయమైన ఆకర్షణ ఉండేది. ఇందులో పనిచేసిన మాకంటే బయటనున్న వారికి సంగతి బాగా తెలుసు. 


విశ్వనాథ సత్య రాయణ, జంధ్యాల పాపయ్యశాస్త్రి, పీసపాటి నరసింహమూర్తి, విన్నకోట రామన్నపంతులు, రామచంద్ర కాశ్యప, పుచ్చా పూర్ణానందం, తుమ్మల కారామమూర్తి, ఆచంట వెంకటరత్నం నాయుడు,

గోపాలకృష్ణ, సి. రాఘవాచారి, నండూరి రామ్మోహనరావు, పురాణం సుబ్రహ్మణ్య శర్మ,తు ర్లపాటి కుటుంబరావు, వావిలాల గోపాల కృష్ణయ్య, చలనచిత్ర దర్శకులు జంధ్యాల, సినీనటి అన్నపూర్ణ (ఒకప్పుడు ఉమ), ఎ.వి.ఎస్. పొట్టి ప్రసాద్, గుండు హనుమంతరావు.. ఒకరా ఇద్దరా...! 


విజయవాడ రైల్వేజంక్షన్ ఎలాగో రేడియో జంక్షన్ అలా!. ఇలా అందర్నీ దర్శించే భాగ్యం కలిగింది. దొరకునా ఇటువంటి సేవ!


ప్రయాగ రామకృష్ణ

కోరను

 కోరను భోగభాగ్యములఁగోరను బుత్ర కళత్ర మిత్రులన్ కోరను దేహసౌఖ్యములఁ గోరను దుచ్ఛసుఖంబు లెన్నడున్ గోరను స్వర్గమైన, మదిగోర ననిత్యపు దృశ్య సంపదల్, కోరెద నీ పదాబ్జములకుంఠిత భక్తి వెలుంగనీశ్వరా !



పరమశివాయటంచు నిను బ్రస్తుతిఁజేసినవారిని నెల్లరన్ వరములొసంగి ప్రోతువని వాంఛలు దీరఁగ వేడుచుందురో పరమదయాసముద్ర! నను పాలనసేయఁగ రమ్మటంచు నే కరములు మోడ్చివేడెదను, కావఁగ రావగదయ్య! ఈశ్వరా!

నే కర్మిష్ఠియున్ జేయునే !

 తొలి సంధ్యన్ తను నిద్రలేచి హల 

           మున్ తోడ్పాటుగా బట్టియున్

బొలమున్ దున్నగ నేగు హాలికుడు

           ముప్పొద్దున్ శ్రమన్ జేయుచున్ 

విలువౌ శ్రీహరినామ మెప్పుడును 

            తా విన్పించగా బల్కెడున్ , 

గలిలో యింతకు మించి సుస్మరణ

           నే  కర్మిష్ఠియున్ జేయునే !

మత్స్యకారుని పాపం

 మత్స్యకారుని పాపం


ఒక సాధువు ఒక ఊరి బయట నివసించేవాడు..ఆయన ఉదయాన్నే లేచి నదివద్దకు వెళ్ళి నదిలో స్నానం చేసి నది ఒడ్డున ధ్యానం చేసుకునేవాడు..ఇదీ అతని దినచర్య...


ఒక రోజు ఆయన తన దినచర్య మొదలుపెట్టటానికి నది వద్దకు వెళ్ళగా..అక్కడ ఆయన కళ్ళకు కనపడింది ఏమిటంటే...ఒక మత్స్యకారుడు ఒక మహిళ ఒడిలో తల పెట్టుకుని నిద్ర పోతున్నాడు..అతని పక్కనే ఒక ఖాళీ మద్యం సీసా కూడా పడి ఉంది..సాధువుకి అదంతా చూసి చిరాకు, కోపం వచ్చాయి..ఒక రోజుని మొదలుపెట్టాలంటే మంచిపనులతో మంచిగా మొదలుపెట్టాలి...అంతేకానీ..ఈ మనిషి ఎంత పాపిష్టివాడు, మహాపాపి...ఇంత పొద్దున్నే పద్ధతి లేకుండా పడి ఉన్నాడు...బహుశా నాస్తికుడు కూడా అయి ఉండవచ్చు అనుకుని...సరే నాకెందుకులే అనుకుని...తన స్నానం, ధ్యానం సంగతి చూసుకుంటున్నాడు...


సాధువు ధ్యానం కోసం కళ్ళు మూసుకుని భగవన్నామస్మరణ చేసుకుంటుండగా...ఒక శబ్దం వినిపించింది....కాపాడండి, కాపాడండి అని ఎవరో అరుస్తున్నారు...ఏమిటా ఆ అరుపులు అని సాధువు కళ్ళు తెరిచి చూడగా...నదిలో ఒక మనిషి మునిగిపోతూ కాపాడమని అరుస్తున్నాడు...సాధువు ఏమి చెయ్యాలో ఆలోచించేలోపే మహిళ వళ్ళో తలపెట్టుకుని నిద్రపోతున్న మనిషి లేచి, పరుగున వెళ్ళి నదిలో మునిగిపోతున్న మనిషిని కాపాడి ఒడ్డుకి తెచ్చాడు...మునిగిపోయే మనిషికి ఏ ప్రమాదము లేదు అని అర్ధం అయి సాధువు సంతోషపడ్డాడు...


కాపాడిన మనిషిని చూసి సాధువు ఆశ్చర్యపోయాడు, అయోమయం పడుతున్నాడు..ఇతన్ని చెడ్డవాడు అనుకున్నాను, ఇప్పుడు ఒక ప్రాణం కాపాడాడు..మంచివాడు అనిపిస్తున్నాడు..ఇతను మంచివాడా, చెడ్డవాడా అని అర్ధం కాక అతని వద్దకే వెళ్ళి అడిగారు...నువ్వు ఒకరిని కాపాడి చాలా మంచిపని చేసావు...కానీ ఇందాకా  నువ్వున్న పరిస్థితిలో...నిన్ను చూసిన నాకు నీ మీద ఒక చెడ్డ అభిప్రాయం వచ్చింది...అని తన మనసులో మాట బయటపెట్టాడు...అప్పుడు ఆ మనిషి చెప్పాడు...స్వామీ..నేను చాలారోజులు ప్రయాణించి పొద్దున్నే మా ఊరు చేరాను...నేనొచ్చే సమయానికి మా అమ్మ నాకోసం భోజనం, నీరు తీసుకొచ్చింది...హాయిగా మా అమ్మ కమ్మటి చేతిభోజనం కడుపునిండా తినేసి, మంచినీళ్ళు తాగాను...చల్లటి ఉదయంవేళ హాయైన గాలి..కడుపునిండా తిన్న భోజనం..నాకున్న అలసటకి నిద్ర వచ్చేసింది...మా అమ్మ వడిలో తలవాల్చి కంటినిండా నిద్రపోయాను...హాయిగా మంచినిద్ర పోయి లేచాక ఇప్పుడు అలసట కూడా లేదు అని చెప్పాడు...మరి ఆ ఖాళీ మద్యం సీసా ఏమిటీ అనడిగాడు సాధువు...ఆ మనిషి నవ్వుతూ చెప్పాడు...ఓ అదా..నాకు మంచినీరు తేవటానికి ఏదీ దొరక్క మా అమ్మ ఆ సీసాలో నీళ్ళు తెచ్చింది అంతే...అన్నాడు..అది విన్న సాధువుకి తాను ఇంతకుముందు ఈ మనిషి గురించి ఎంత తప్పుగా అనుకున్నాడో...అని అనుకుని కొంచెం బాధనిపించి కళ్ళు తడి అయ్యాయి...మనసులోనే అతనికి క్షమాపణ చెప్పుకుని...ఇంకెప్పుడూ తొందరపడి ఎవరిగురించీ ఏ అభిప్రాయమూ ఏర్పరుచుకోకూడదు..అని ఒక కొత్తపాఠం నేర్చుకున్నాడు..


అంతేకదా మనం కూడా ఒక సంఘటన చూసి అందరూ తమ దృష్టికోణంలో తలా ఒక రకంగా ఊహించేసుకుంటాము...అందులో నిజం ఏంటి, అబద్ధం/భ్రమ ఏంటీ అనేది అవసరం అని చూసుకోము...దానివల్ల కొంతమంది అమాయకులు ఎంత బలి అవుతారో అని అంచనా కూడా వేయరు చాలామంది...చూసే కళ్ళను, వినే చెవులను కూడా ఒక్కోసారి పూర్తిగా నమ్మకూడదు...ఒకటి అనే అభిప్రాయానికి వచ్చే ముందు కొంచెం మంచీచెడు ఆలోచిస్తే బావుంటుంది...

మంచిని ఎందుకు ఆపాలి?

 ఆరు ప్రఖ్యాత అపద్ధాలు

(Six Famous Lies )


కాంగ్రెస్, కమ్యూనిస్టు , సెక్యులరిస్టు పార్టీలు, వాటిని, వాటి నాయకులను సమర్థిస్తూ, పని గట్టుకొని భారతీయ లేదా హిందూ సంస్కృతిని, జాతీయవాదాన్ని, దేవీ దేవతలను కించపరిచే మేధావులను, మీడియా సంస్థలను ఇంగ్లీషులో liberal Eco System అని పిలుస్తారు.


2014లో ప్రధానిగా నరేంద్ర మోదీ ప్రమాణస్వీకారం చేసినప్పటినుండి వీరు తెగ బాధ పడిపోతున్నారు. ఆయన్ని, ఆయన ప్రభుత్వాన్ని, ఆయన పార్టీని దేశంలోనూ, విదేశాల్లోనూ బద్నామ్ చేయడానికి వీరు చేయని కుట్రలేదు. వీళ్ళ కుట్రలు, ఉద్దేశ్యాలు, వీళ్ళ చివరి లక్ష్యం తెలియని వారు, Facebook , Twitter ,Whatsapp, YouTube లాంటి social media వేదికల్లో ఆధారాలు లేని పోస్టులు, కామెంట్లు పెడుతుంటారు.


పైన చెప్పుకొన్న ఈ వర్గపు మనుషులు నరేంద్రమోది ప్రభుత్వానికి వ్యతిరేకంగా చెప్పిన ఆరు ప్రఖ్యాత అపద్దాలను ఇక్కడ తెలుసుకొందాం.


మొదటి అపద్ధం🙆‍♀️


రఫాల్ వివాదం


ఫ్రాన్స్ తో మోదీ ప్రభుత్వం  చేసకొన్న రఫాల్ యుద్ధ విమానాల ఒప్పందం లో అవినీతి జరిగిందని, ప్రధాని తనకు  అనుకూలంగా వుండే వాళ్ళతో  జత కట్టి పెద్ద ఎత్తున ముడుపులు అందుకున్నారని, పార్లమెంటు లో రాహుల్ గాంధీ, ఇతర ప్రతిపక్షాలు నానా గొడవ  చేసారు. సుప్రీంకోర్టు జోక్యం చేసుకొంది. స్వయంగా  నేనే కమిటీ వేసి నిగ్గుతేలుస్తాను అంది. మాకేమీ అభ్యంతరం  లేదు అన్నది  ప్రభుత్వం.


సుప్రీంకోర్టు చివరకు  ఏమన్నది ?


రఫాల్ ఒప్పందం పారదర్శకంగా వుంది, ఎక్కడా  అవినీతి జరిగినట్టు  సాక్ష్యాలు లేవు. ఒక సారి కాదు, రెండు మార్లు అలా చెప్పింది. చెంప  దెబ్బ తిన్న రాహుల్ గాంధీ  సుప్రీం కోర్టుకు లిఖిత పూర్వకంగా  క్షమాపణ చెప్పాడు.


కాంగ్రెస్ -కమ్యూనిస్ట్  గుంపు సైలెంట్ అయిపోయింది


రెండవ  అపద్దం🙆‍♂️


పెగాసస్ వివాదం


నరేంద్రమోది  ప్రభుత్వం నా ఫోన్ ను, అలాగే ప్రతిపక్షాల ఫోన్లను పెగాసస్  spyware  ద్వారా tap చేస్తోందని  రాహుల్ గాంధీ , ఆయన  పార్టీ, ఇతర ప్రతి పక్షాలు  పార్లమెంట్ ను స్థంబింప చేసాయి , విదేశాల్లో కూడా ఇదే విషప్రచారం చేసారు. వేలాదిమంది  చేత  సోషియల్ మీడియా లో చెప్పించారు.మళ్ళీ సుప్రీంకోర్టు జోక్యం చేసుకొంది.తమ  

 ఫోన్లలో పెగాసస్ వుంది అని ఎవరు అంటున్నారో వాళ్ళు తమ ఫోన్లను  తమకు  ఇవ్వాలని కోర్టు అడిగింది. కేకలేసిన వేలాది మంది  లో కేవలం 29 మంది  మాత్రమే ఫోన్లు ఇచ్చారు. సుప్రీం కోర్టు  వాటిని దర్యాప్తు చేయిస్తే వాటిలో పెగాసస్  spyware  లేదు అని తేల్చింది.


మరోసారి  సెక్యులర్ గుంపు నిశ్శబ్దం లోకి జారుకొంది.


మూడవ  అపద్ధం🙆‍♀️


చైనా , పాకిస్తాన్ లు మన  భూమిని  ఆక్రమించుకొన్నాయి


నరేంద్రమోది ప్రభుత్వం  తన  చేతకానితనంతో చైనాకు ,  పాకిస్తాన్ కు మన భూభాగాన్ని తాకట్టు పెట్టింది అని మిద్దెలెక్కి అరిచారు.

కానీ స్వయంగా  2012 లో అప్పటి UPA - Congress   ప్రభుత్వం రాజ్యసభలో  పాకిస్తాన్ 78 వేల  చదరపు  కి. మీ భూబాగాన్ని , చైనా  38 వేల  చదరపు  కి. మీ.  భారత భూభాగాన్ని ని తమ  ఆ ధీనం లో వుంచుకొన్నాయని ఒప్పుకొన్నది.  2012 లో ప్రధాని  ఎవరు? ప్రభుత్వం ఎవరిది ?

ఆ భూభాగమంతా  1948 నుండి 1962 వరకూ  కాంగ్రెస్ హయాంలో పోగొట్టుకొన్నదే. అంతే కాదు, పాకిస్తాన్ తనది  కాని POK లో 5180 కి. మీ భూమిని  దుష్ట చైనా కు ఇచ్చుకొంది . ఇదంతా  2014 కు ముందు చరిత్ర. ఇపుడు చైనా   పాకిస్తాన్ లు అలాంటి  సాహసం చేస్తే వాళ్లకు  దిమ్మ తిరిగి పోయే జవాబు  ఇస్తున్నారు మన వీర  సైనికులు.


లౌకిక వీరులు తెర వెనక  దాగారు.


నాల్గవ అపద్దం 🙆‍♂️


బీబీసీ వివాదం


గుజరాత్ అల్లర్ల విషయం లో బీబీసీఅపద్ధాలు , , అర్ధసత్యాలతో వండిన  డాక్యుమెంటరీ ని అడ్డం పెట్టుకొని గొడవ చేశారు.తప్పుడు కథనాలు  అల్లారని ప్రభుత్వం దాన్ని ఆపేస్తే, బీబీసీ ని 24 క్యారెట్ల బంగారం గా చూపించే  ప్రయత్నం చేసారు. విషయం ఎంతవరకు  వెళ్లిందంటే అమెరికా కూడా ఒక దశ లో మన కేంద్ర ప్రభుత్వం పై  కొంచెం అసహనం ప్రదర్శించింది కూడా. మొదటినుండి  అనుమానం తో వున్న ప్రభుత్వం బీబీసీ మీద  నిఘా  పెడితే, అది 40 కోట్ల ట్యాక్స్ ఎగ్గొట్టిందని  తేలింది. స్వయంగా బీబీసీ నే ఈ తప్పును అంగీకరించింది.


గ్యాంగ్ సెలైంట్ అయ్యింది.


అయిదవ  అపద్దం 🙆‍♀️


ద్రవ్యోల్బణం పై  దుష్ప్రచారం


నరేంద్ర మోదీ ప్రభుత్వం ద్రవ్యోల్బణాన్ని అదుపు చేయలేకపోయిందని , ధరలు విపరీతంగా పెరిగాయని  అంటున్నారు. కొన్ని వస్తువుల ధరలు  పెరిగాయి. కానీ అమెరికా, ఇంగ్లాండ్, జర్మనీ , చైనా  లాంటి దేశాల్లో పెరిగిన ధరలతో్  పోలిస్తే మన దేశంలో   ధరల పెరుగుదల  5శాతాన్ని మించలేదు. ఆదేశాల్లో 40, 50 ఏళ్లలో ఎన్నడూ లేని స్థాయికి ధరలు  చేరుకొన్నాయి. ఇంగ్లాండ్ ప్రభుత్వం ఎంతటి  ఆర్థిక ఇబ్బందుల్లో వుందంటే ఉద్యోగులకు జీతాలు సరిగ్గా ఇవ్వలేని స్థితిలో వుంది.  అమెరికా లోని ప్రఖ్యాత  నగరం  న్యూయార్క్ నుండి పౌరులు  ఇతర  ప్రాంతాలకు వలస వెళుతున్నారు.

అంతే కాదు, భారత్  ఆర్థికంగా  చాలా  బలంగా  వుందని , రాబోయే రోజుల్లో ప్రపంచ మూడవ  ఆర్థిక శక్తి గా  ఎదగబోతోందని  ప్రపంచ  బ్యాంక్, ఐ ఎం ఎఫ్ లు అంచనా వేస్తున్నాయి. ఇతర  ప్రతిష్టాత్మక సంస్థలు కోవిడ్ సమయంలో, ఆ తరువాత  భారత్ తన ఆర్థిక విధానాలను చక్కగా  రూపొందించుకొని , ఆచి తూచి  అడుగులు వేసిందని  మెచ్చుకొంటున్నాయి.

ద్రవ్యోల్బణం  గురించి కాంగ్రెస్ మౌనంగా  వుంటేనే మంచిది. ఎందుకంటే  ద గ్రేట్  మన్మోహన్ సింగ్ గారు ప్రధాని గా వున్న సమయం లో ద్రవ్యోల్బణం డబుల్ డిజిట్ లో వుండింది. ఆహార  ద్రవ్యోల్బణం  (food inflation ) 18 శాతానికి  చేరిన  సంగతి  తెలియనిదా ?


సెక్యులర్ దుకాణం వారు ఇది చెప్పరు.


ఆరవ  అపద్ధం 🙆‍♂️


నిరుద్యోగం


నరేంద్ర మోదీ పాలనలో నిరుద్యోగం  పెరుగుతోందని  ఈ మనుషులు  ఆరోపిస్తారు.

నిజానికి 2017నుండి 2023 వరకూ కేవలం  MSME విభాగంలోనే 6.5 కోట్ల మందికి ఉపాధి  లభించింది.

ముద్ర యోజన ద్వారా  40 కోట్లమంది  రుణాలు  పొందారు. ఆశ్చర్యం ఏమిటంటే  40 కోట్ల మంది  ముద్ర యోజన లబ్ధిదారుల్లో 27 కోట్ల మంది  మహిళలే. Digital economy  ద్వారా 2014 నుండి 2023 వరకూ  6.15కోట్ల మంది కి ఉపాధి  లభించింది. PM Employment Generation లో భాగంగా  పర్యాటకం  , ఖాదీ, ఆవాస్  మొదలైన  రంగాల్లో  అనేకమందికి ఉపాధి  లభించింది.


సెక్యులర్ వాదులు ముఖం  చాటేసారు.


ఒక  దాని తరువాత  ఈ బూటకపు సెక్యులర్ వాదుల  ఆరోపణలు  కుప్పకూలిపోతున్నాయి.

కానీ ఈ మనుషులు ఇలాంటివి వండుతూనే  వుంటారు. జాతీయవాదులు , దేశభక్తులు  వాటిని తిప్పిగొడుతూనేవుండాలి. 


వాళ్ళు చెడును  ఆపనపుడు మనం  మంచిని  ఎందుకు ఆపాలి?

P Sateesh

జీవితమంటే ఇవ్వడమే

 🌹🙏 *జీవితమంటే ఇవ్వడమే.*.!!


🌹🔥🌹🔥🌹🔥🌹🔥


🌿నువ్వు ఇవ్వదగినదేదో ఇవ్వు... అది వెయ్యింతలై నీకు తిరిగి దక్కుతుంది. కాని, నీ దృష్టి దాని మీదే ఉండకూడదు. ఇది స్వామి వివేకానంద సూక్తి...


🌸 మానవజన్మ ఇచ్చేందుకే కలిగింది. ఎంతసేపూ నాకు ఏమిటని అనుకోవడం స్వార్థం. నీకేం కావాలి అని అడగడం పరమార్థం. ఇలా అడగడంలో ఏమైనా ఇవ్వడంలో మనిషి పొందే సంతృప్తి, ఆనందం అనుభవైకవేద్యం, 'నువ్వు ఎంత ఇస్తున్నావనేది కాదు. ఎంత ప్రేమగా ఇస్తున్నావనేది ముఖ్యం' అంటారు మదర్ థెరెసా...


🌿 ఇతరులనుంచి సహాయం పొందడంలో కన్నా వాళ్లకు చేతనైనంత సాయం అందించడంలో కలిగే సంతోషమే గొప్పది.


🌸సముద్రం ఇచ్చిన నీరు గ్రహించి సూర్యుడు ఆవిరి చేస్తున్నాడు.

ఫలితంగా ఏర్పడిన మేఘాలు వర్షిస్తున్నాయి. ఆ నీరు గ్రహించిన నేల- మనిషికి చెట్టు. ఫలాలు, కలప ఇస్తోంది. వీటిలో దేనికి స్వార్ధం ఉంది? ప్రకృతి నుంచి పంచభూతాలనుంచి మనం నేర్చుకో వలసింది ఇదే!


🌿ఎంత నిరుపమానమైన త్యాగం చేసి రుషులు, మునులు, పండితులు, బుధులు, నేతలు సమాజ కల్యాణానికి

తమను తాము సమర్పించుకున్నారు. 


🌸జగతి ప్రగతి కోసం అంకిత మైపోయారు! మనకు మెతుకు ఇవ్వడానికి రైతు శ్రమిస్తున్నాడు. మనకు బతుకునివ్వడానికి తన ప్రాణాన్ని పణం పెడుతున్నాడు. ఇలా ఎందరెందరో జీవితం అంటే ఇవ్వ డమన్న మాటలకు సాక్షీభూతులై కనపడుతున్నారు. 


🌿ఆనందంగా ఉన్న సమయంలో మనతో కలిసి నవ్విన మనిషిని మరిచిపోవచ్చు కాని, కష్టకాలంలో మనతో పాటు విలపించిన మనిషిని మాత్రం మరిచిపోకూడదు ఆదే మానవత్వం.


🌸 ప్రతి మనిషికీ మరణం ఉంటుంది కాని, మానవత్వానికి ఉండదు. కర్ణుడు, శిబి, రంతిదేవుడు, హరిశ్చంద్రుడు జీవితానికున్న పరమార్ధాన్ని అర్ధం చేసుకుని ఆచరించిన వారు. 'నాది అనుకున్నదేదీ నాది కాదు' అన్న సత్యం గ్రహించినవారు. త్యాగశీలికి కులం, మతం, వర్గం, ప్రాంతం, సమయం, సందర్భం... ఇవేవీ అడ్డుకావు. 


🌿మనిషి, పక్షి, పశువు ఇలాంటి తారతమ్యాలను అతడు చూడడు. లోగిలిలోని కుక్క మనం పెట్టేముద్ద తిని, నమ్మకంగా అక్కడే ఉంటుంది. యజమాని వెంటనంటే ఉంటుంది. ఆమాత్రం విశ్వాసం మానవుడిలో ఉంటే చాలు, మానవత్వం వికసిస్తుంది. 


🌸పొందిన ఉపకారానికి ఎన్నో రెట్లు ప్రత్యుపకారం చేయడమే మనిషి గౌరవాన్ని కీర్తిని

మంచిమాట, సలహా ఇతరులకు చెప్పడానికి మనిషి ఆసక్తి చూపాలి. మేలుచేయడానికి, త్యాగం చేయడానికి తపించాలి. 


🌿సాటి మనిషిని, నిస్సహాయుణ్ని ఆదుకునేందుకు ఆవేదన చెందాలి. ఎవరైనా చెయ్యి చాపితే, సగం మరణించినవాడని, అలా చెయ్యి చాపినప్పుడు 'లేదు' అనేవాడు ముందే మరణించిన వాడితో సమానమనీ అంటాడు కబీర్ కుటుంబంలోనే పరస్పర త్యాగశీలత అలవడితే, అది సమాజంలో విస్తరించి ప్రపంచమంతా..పరివ్యాప్తమవుతుంది...



*సర్వేజనాసుఖినోభవంతు*🙏🙏

మనం మనలాగే ఉండాలి

 మనం మనలాగే ఉండాలి.. విజ్ఞానం🌹

అది బ్రిటిష్ కాలం.. ఒక పిల్లవాడు స్కూల్ నుండి ఏడుస్తూ ఇంటికి వచ్చాడు. " స్కూళ్ళో కొందరు పోకిరీ పిల్లలు పిలక పంతులు అని వెక్కిరిస్తున్నారమ్మా .. పిలక తీసేస్తానమ్మా " అని చెప్పి ఏడ్చాడు. 


చూడు నాన్నా.. " నీ పిలక వలన వాళ్ళకి ఏ నష్టమూ లేదు. పిలక ఉన్నందుకు నువ్వు బాధ పడక్కరలేదు. ఎవరో మూర్ఖులు ఏదో అన్నారని మన అస్తిత్వాన్ని మనం పోగొట్టుకోకూడదు. వాళ్ళు వెక్కిరించారని నువ్వు పిలక తీసేస్తే నీ మీద నీకు గౌరవం లేనట్టే. అవన్నీ పట్టించుకోకుండా చదువు మీద దృష్టిపెట్టు నీ వలన దేశానికి చాలా ఉపయోగముంది." అంది. 


కొంతకాలం తరువాత .." అమ్మా  స్కూళ్ళో పిల్లలు నన్ను జంధ్యం మాష్టారు .. జంధ్యం మాష్టారు అంటూ వెక్కిరిస్తున్నారు.. అస్తమానూ జంధ్యం పట్టుకొని లాగుతూ అల్లరి చేస్తున్నారు " అంటూ మళ్లీ ఏడ్చాడు. 


" నీ జంధ్యం బయటకు రాకుండా చొక్కాలు కుట్టిస్తాను నాయనా.. బాధపడకు. వాళ్ళ చేతలు ,వాళ్ళ మాటలు పట్టించుకోకు. నువ్వు గొప్పవాడివి కావాలంటే ఇలాంటి చిన్న చిన్న విషయాలకు కుమిలిపోకూడదు. రాళ్లు 

అడ్డొచ్చాయని ప్రవాహం ఆగిపోతుందా.. ?  " అని అనునయించింది. 


మరికొంత కాలం గడిచాక ఆ పిల్లాడు ఇంకా పెద్ద చదువులు చదవడానికి దూరప్రాంతానికి వెళ్ళాడు. మళ్ళీ అలాంటి సమస్యే ఎదురయ్యింది. " అమ్మా ! ఇక్కడి వాళ్ళు కోడిగుడ్లు తినమని  నన్ను పొరుపెడుతున్నారు.


బెదిరిస్తున్నారు. సభ్యత లేకుండా మాట్లాడుతున్నారు. నేను తినే భోజనంలో కోడిగుడ్డుని కలిపేస్తున్నారు. మనసుకి చాలా కష్టంగా ఉందమ్మా " అని ఉత్తరం రాశాడు.

 


"వాళ్ళు ఎన్నిరకాల పన్నాగాలు పన్నినా నువ్వు చలించకు. వాళ్ళు కాకుల వలే గోలచేస్తే చెయ్యనీ , దోమల వలే రొదపెడితే పెట్టని..  వాళ్ళు అలాగే మిగిలిపోతారు. కానీ నువ్వు దేశచరిత్రలో మహానుభావుడిలా నిలిచిపోవాలి.  ఏకాగ్రత కోల్పోకు.. నీ చదువుని ఒక తపస్సులా భావించు. 


ఉదయాన్ని చూడాలంటే చీకటిని భరించాలి.ధృఢమైన సంకల్పంతో ముందుకెళ్లు.  " అని ఆమె తిరుగు ఉత్తరం రాసింది.


తల్లి రాసిన ఉత్తరం చదివిన అతడు కొండంత బలంతో చదువు పూర్తిచేశాడు. కేంబ్రిడ్జి కి వెళ్ళాడు. ప్రపంచదేశాలు నివ్వెరపోయేలా భారతదేశపు ఖ్యాతిని ఆకాశంలో నిలబెట్టాడు.


అతడే విశ్వవిఖ్యాత శాస్త్రవేత్త

 " సి.వి.రామన్ " . తన తల్లి చెప్పిన విలువలను , హితోక్తులను ఆయన తన జీవితకాలం పాటించారు. విదేశాలకు వెళ్లినా , ప్రోఫెసర్ గా పనిచేస్తున్నా, మద్రాస్ ఐ.ఐ.టి. కి వైస్ ఛాన్సేల్లెర్ గా ఉన్నా కూడా ఆయన ఎప్పుడూ తన పిలకని తీయలేదు. భారతీయతను వదిలిపెట్టలేదు తలపాగానే ధరించేవారు. 


" Raman the great."

అమ్మ

ప్రపంచ ప్రఖ్యాత శాస్త్రవేత్త సర్ సి.వి రామన్ గారికి తన తల్లి మాట అంటే శిరోధార్యమే.

🙏🙏


                                  ---------Good afternoon ----------

ప్లాస్టిక్ ను మానేద్దాం

 *కుళ్ళిపోవడానికి ఎంత సమయం పడుతుంది?*


మానవుడు -- 1 వారం

పేపర్ టవల్ - 2-4 వారాలు

అరటి తొక్క - 3-4 వారాలు

పేపర్ బాగ్ - 1 నెల

వార్తాపత్రిక - 1.5 నెలలు

ఆపిల్ కోర్ - 2 నెలలు

కార్డ్బోర్డ్ - 2 నెలలు

కాటన్ గ్లోవ్ - 3 నెలలు

ఆరెంజ్ పీల్స్ - 6 నెలలు

ప్లైవుడ్ - 1-3 సంవత్సరాలు

ఉన్ని సాక్ - 1-5 

సంవత్సరాలు

మిల్క్ కార్టన్లు - 5 సంవత్సరాలు

సిగరెట్ బట్స్ - 10-12 సంవత్సరాలు

తోలు బూట్లు - 25-40 సంవత్సరాలు

టిన్డ్ స్టీల్ క్యాన్ - 50 సంవత్సరాలు

ఫోమేడ్ ప్లాస్టిక్ కప్పులు - 50 సంవత్సరాలు

రబ్బరు-బూట్ ఏకైక - 50-80 సంవత్సరాలు

ప్లాస్టిక్ కంటైనర్లు - 50-80 సంవత్సరాలు

అల్యూమినియం కెన్ - 200-500 సంవత్సరాలు

ప్లాస్టిక్ సీసాలు - 450 సంవత్సరాలు

పునర్వినియోగపరచలేని డైపర్స్ - 550 సంవత్సరాలు

మోనోఫిలమెంట్ ఫిషింగ్ లైన్ 600 సంవత్సరాలు


*ప్లాస్టిక్ సంచులు 200-1000 సంవత్సరాలు.*


మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాము, దయచేసి ఈ సమాచారాన్ని మీ నెట్‌వర్క్‌లో మీకు వీలైనంతగా పంచుకోండి.


గ్లోబల్ గ్రీన్ హౌస్ ప్రభావానికి సంబంధించిన ప్రధాన కారణాలలో ప్లాస్టిక్ ఒకటి అని ప్రజలలో అవగాహన ఏర్పడడానికి తోడ్పడండి. 


- దయచేసి హరిత పర్యావరణానికి మద్దతు ఇవ్వండి.


ప్లాస్టిక్ ను వాడడం మానేద్దాం                 


Save Nature.

BIO-CLOCK

 *😁 BIO-CLOCK 😁*


మనం ఉదయాన్నేఎక్కడికన్నా ప్రయాణం చేయ్యల్సి వస్తే తెల్లవారుజామున 4:00 గంటలకు అలారం సెట్ చేసి నిద్రపోతాము. 

కానీ కొన్నిసార్లు మనం అలారం లేకపోయినా అనుకున్న టైంకి నిద్ర లేస్తాము. 

ఇదే *బయో-గడియారం*. 


చాలామంది 80-90 సంవత్సరాల వయస్సులో చనిపోతారని సాధారణంగా నమ్ముతారు. 


50-60 సంవత్సరాల వయస్సులో అన్ని రోగాలు వస్తాయని మనసులో 

గాఢంగా నమ్మి   

చాలామంది తమ 

సొంత బయోక్లాక్‌ ను 

ఏర్పాటు చేసుకున్నారు. 


అందుకే సాధారణంగా 50-60 వద్ద ప్రజలు అనారోగ్యం పాలవుతారు  

*మనం మనకు తెలియకుండానే బయోక్లాక్‌* ను 

మానసికంగా తప్పుగా సెటప్ చేస్తాము. 


చైనాలో చాలా మంది ప్రజలు 

120 సంవత్సరాల వరకు ఆరోగ్యంగా జీవిస్తారని నమ్మి ,

అలా మానసికంగా సంసిద్దులై 

వారి బయోక్లాక్ ను అలా ఏర్పాటు చేసుకున్నారు.


*కాబట్టి ..!*


1. మనము మన బయో-గడియారాన్ని మానసికంగా పాజిటివ్ ఆలోచనలతో సర్దుబాటు చేసి, రోజు క్రమం తప్పకుండా *ధ్యానం* చేస్తే తద్వారా మనం *కనీసం* 100 సంవత్సరాల వరకు *ఆరోగ్యంగా * జీవించవచ్చు.


2. 40 నుండి 90 సంవత్సరాల వయస్సులో ఎటువంటి వ్యాధి వచ్చే అవకాశం లేదని మనం నమ్మాలి. 

వృద్దాప్యం అనేది 120 సంవత్సరాలకు మొదలు అవుతుందని బలంగా నమ్మాలి.


3. వెంట్రుకులకు సహజ సిద్ధమైన మంచి రంగు 

వెయ్యండి.

యవ్వనంగా కనిపించే ప్రయత్నం చేయండి. 


*ముఖ్యంగా డ్రెస్ విషయంలో కూడ  యువతి, యువకుల మాదిరి డ్రెస్ వేసుకునే ప్రయత్నం సాధ్యమైనంత వరకు చేయండి. తద్వారా మనలో కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతాయి. యెట్టి పరిస్థితులలో వృద్ధాప్యంగా కనిపించడానికి మన మనసుని అనుమతించవద్దు*.


4. మనం తీసుకునే భోజనం కల్తీ అనీ, కలుషితం, అనుకుంటూ 

'నెగటివ్ థాట్స్' తో 

తీసుకోవద్దు. 

*ధ్యాన శక్తి వల్ల నేను తీసుకునే ఆహారం పరమ పవిత్రమైనది గా మారింది, ఇది నాకు నిత్య యవ్వనాన్ని, సంపూర్ణ ఆరోగ్యాన్ని నిండు 120 ఏళ్ల జీవితాన్ని ఇస్తుంది అని పరిపూర్ణంగా నమ్మండి.* 

లేదంటే

~ 'ఋణాత్మక ఆలోచన'~ ల వల్ల 

మన శరీరంలో 

నెగటివ్ ఎంజైములు విడుదలై 

మన జీర్ణ వ్యవస్థను, 

మన శరీర నిర్మాణాన్ని పూర్తిగా దెబ్బతీస్తుంది.


5. ఎప్పుడూ చురుకుగా , Active గా ఉండండి. 

నడవడానికి బదులుగా 

వీలైతే జాగింగ్ చేయండి. 


5. *వయసు పెరిగే కొద్దీ ఆరోగ్యం పెరుగుతుందని నమ్మండి*. 

(ఇది నిజం కూడ).


6.ఆనందానికి, వ్యాధికి పడదు. ఒకటి ఉన్నచోట ఇంకొకటి ఉండదు. 

కనుక ఆనందంగా ఉండండి 

తద్వారా ఆరోగ్యంగా ఉండండి. 

*(ప్రతిరోజు హాస్య భరిత సినిమాలు చూడండి మనసులో కాకుండా పైకి నవ్వండి*).


7. ప్రతి సమస్యకు కారణం మన మనస్సు. 

మన ఆలోచనా విధానం. ముఖ్యంగా 

సరదాకు కూడ.... 

"~నాకు Old age వస్తుంది"~

అనే మాటను అనకండి. 


8. ఖాళీగా ఏ రోజూ కూర్చోకండి. ప్రతీరోజూ ఏదో ఓ పనిచేస్తూ పనిలో నిమగ్నమైపోండి. 

మరీ ముఖ్యంగా మీకు సంతోషాన్నీ , ఆనందాన్నీ ఇచ్చే పనులు చేయండి. 


9 . పాజిటివ్ ఎనర్జీ ఇచ్చే మంచి బలమైన ఆహారాన్ని అవసరం మేరకు తినండి. 


కాబట్టి మీ మానసిక 

'బయో క్లాక్' ని

ఎక్కవ ఆయుర్దాయం కోసం సెట్ చేసుకోండి ....

ఆలోచనా దృక్పధాన్ని మార్చుకోండి.      

HEALTH IS WEALTH👍

విలువలతో బతుకగ

 *1799*

*కం*

విలువలతో బతుకగ నీ

విలువలు నుపచయమునొందు విపరీతముగన్.

విలువలు విడచిన బతుకులు

కలువలువిడు పంకమువలె ఖలమగు సుజనా.

*భావం*:-- ఓ సుజనా! విలువలతో బతికి తే నీ విలువలు విపరీతంగా పెరుగుతాయి. విలువలు విడచిన బతుకు లు కలువలు లేని బురదవలె నీచమగును.

*** *కొంపెల్ల శ్రీనివాస శర్మ*

పంచభూత లింగములు

 మన గుడి 




🌺 పంచభూత లింగములు 🌺


పంచభూత లింగములు: పృధ్వీ లింగము, జల లింగము, తేజో లింగము, ఆకాశ లింగము, వాయు లింగము వీటిని పంచభుత లింగములు అంటారు.


4. ఆకాశ లింగము: 


నటరాజ స్వామి - శివకామ సుందరి దేవి, చిదంబరం; తమిళనాడు.


తమిళనాడులో మద్రాసుకు సుమారు 240 కి. మీ దూరంలో ఆకాశలింగము ఉంది. శివుడు ప్రళయ రుద్రతాండవం చేస్తున్న విగ్రహం అతి పెద్దది (నటరాజ స్వామి). ఈ చిదంబర క్షేత్రంలో మహావిష్ణువు ఆలయం మరియు శివాలయం (నటరాజ స్వామి) ఒకే చోట కనపడతారు. విల్లుపురం నుంచి తంజావూరు వెళ్లే మార్గంలో ఉంది. విల్లుపురం నుంచి చిదంబరం దూరం 83 కి. మీ మాత్రమే.


చిదంబరం దేవాలయం :

భారతదేశంలోని దక్షిణ రాష్ట్రమైన తమిళనాడు యొక్క మధ్యస్థ తూర్పు భాగంలోని, కడలూర్ జిల్లాలోని కారైకల్ ‌కి ఉత్తరంగా 60 కిలో మీటర్ల దూరంలో, మరియు పాండిచ్చేరికి దక్షిణంగా 78 కిలో మీటర్ల దూరంలో ఉన్న ఆలయనగరమైన చిదంబరం నడిబొడ్డున ఈ ఆలయం నెలకొని ఉన్నది. 


తమిళ సంగం సాహిత్య రచనల ప్రకారం, సనాతన విశ్వకర్మ ల యొక్క వంశస్థుడైన విదువేల్విడుగు పెరుమ్తకన్, ఈ ఆలయం యొక్క పునః సృష్టికి ప్రధాన రూపశిల్పి. ప్రాచీన మరియు పూర్వ-మధ్యస్థ కాలంలో, ప్రత్యేకించి పల్లవ, చోళ రాజుల కాలంలో, ఈ ఆలయంలో పలు నూతన రూపకల్పనలు జరిగాయి.


హిందూమత సాహిత్యం ప్రకారం, చిదంబరం అనేది శివుని యొక్క ఐదు పవిత్రమైన ఆలయాల్లో ఒకటి. పంచ భూతాలకి ఒక్కొక్క ఆలయం నిర్మించబడంది. చిదంబరం ఆకాశతత్త్వానికీ, తిరువనైకవల్ జంబుకేశ్వర జలతత్త్వానికీ, కంచి ఏకాంబరేశ్వర భూమితత్త్వానికీ, తిరువణ్ణామలై అరుణాచలేశ్వర అగ్నితత్త్వానికీ మరియు కాళహస్తీశ్వర స్వామి వాయుతత్త్వానికీ నిదర్శనాలు.


ఆలయం:

ఈ ఆలయాల సముదాయం నగరం నడిబొడ్డున వ్యాపించి ఉన్నది. శైవుల మరియు వైష్ణవుల యొక్క దేవతలు కొలువున్న అతికొద్ది దేవాలయాల్లో ఈ ఆలయం ఒకటి. నటరాజు అయిన శివుడుకి, గోవిందరాజ పెరుమాళ్ళుకి అంకితమైన ప్రాచీన మరియు చారిత్రాత్మక దేవాలయం ఇది. ఏ విధంగా కోవెల (గుడి) అంటే వైష్ణవులకు, శ్రీరంగం లేదా తిరువరంగం స్మరణకి వస్తుందో అదే విధంగా శైవులకి చిదంబర ఆలయమే స్మరణకి వస్తుంది.


పద వివరణ:

చిదంబరం అను పదం, "చైతన్యం" అని అర్ధం వచ్చిన చిత్ , మరియు "ఆకాశం" (ఆకాయం నుంచి పుట్టిన) అని అర్ధం వచ్చిన అంబరం ; సూచించిన చిదాకశం , చైతన్యం ఆరోపించబడినట్టి ఆకాశం, దీనినే అన్ని వేదాలు మరియు శాసనాల ప్రకారం, మానవుడు చేరుకోవలసిన అంతిమ లక్ష్యంగా చెప్పబడినది.


మరొక సిద్ధాంతం ఏమనగా, ఇది చిత్ + అంబళం నుంచి పుట్టినది. అంబళం అనగా కళలను ప్రదర్శించుట కొరకు ఒక "వేదిక". చిదాకశం అనేది పరమేశ్వరుని యొక్క చిద్విలాసం లేదా ఆనందం మరియు నటరాజుని చిద్విలాసం లేదా ఆనంద నటన యొక్క చిహ్నాత్మక వర్ణన. చిదంబరాన్ని దర్శిస్తే విముక్తి లభిస్తుందని శైవులు నమ్ముతారు.


ఇంకా మరొక సిద్ధాంతం ప్రకారం, "ఆట లేక దైవ నృత్యం" అని అర్ధం వచ్చే చితు మరియు "వేదిక" అని అర్ధం వచ్చే అంబళం నుంచి వచ్చిన చిత్రాంబళం నుంచి ఈ పదం పుట్టినది.


సర్వాలంకృతభూషితుడైన నటరాజుని చిత్రం, ఈ ఆలయం యొక్క ప్రత్యేకత. పరమ శివుడు, భరతనాట్య నృత్యం యొక్క దైవంగా వర్ణించినది మరియు శివుడికి శాస్త్రీయ రూపమైన లింగానికి భిన్నంగా మనుష్య రూపాన్ని ఆరోపించిన మూర్తితో శివుడిని నెలకొల్పిన అతికొద్ది దేవాలయాల్లో ఇది ఒకటి. పరమ శివుడు నిలుపునట్టి ఈ విశ్వం యొక్క కదలికలు, నటరాజు యొక్క జగత్సంబంధమైన నృత్యాన్ని పోలి ఉంటుంది. ఆలయంలో ఐదు ఆవరణలు ఉన్నాయి.


అరగాలూరు ఉదయ ఇరరతెవన్ పొంపరప్పినన్ (అలియాస్ వనకోవరైయన్) క్రీ.శ.1213 లో చిదంబరం లోని శివుని ఆలయాన్ని పునర్నిర్మించాడు. అదే బాణ సామ్రాజ్య ప్రముఖుడు తిరువన్నమలై ఆలయాన్ని కూడా నిర్మించాడు. ఈ ఆలయాన్ని సనాతనంగా నడిపిస్తున్న దిక్షితార్ అని పిలువబడే, అంతర్వివాహీకులైన శైవ బ్రాహ్మణులు, అధికారిక పురోహితులు కూడా దీక్షితార్లకి మరియు తమిళనాడు ప్రభుత్వానికీ మధ్య జరిగిన దీర్ఘకాలిక యుద్ధానికి ఇది చరమాంకం. ప్రభుత్వం దీక్షితార్లు కానివారిని తేవరం స్తోత్రాలను దేవుని యొక్క 'గర్భగుడి'లో గానం చేయుటకు అనుమతించినప్పుడు, దీక్షితులు, వారికి మాత్రమే నటరాజుని గర్భగుడిలో పూజించే హక్కు కలదని తెలియజెప్పి అభ్యంతరం చెప్పుటతో మొదలైనది.


చిదంబరం యొక్క పురాణం మరియు దాని ప్రాముఖ్యత:

చిదంబర కథ పరమశివుడు తిల్లైవన సంచారంతో మొదలౌతుంది, (వనం అనగా అర్ధం అడవి మరియు తిల్లై వృక్షాలు - వృక్షశాస్త్ర నామం ఎక్సోకేరియా అగాల్లోచ , ఒక ప్రత్యేకమైన నీటి చెట్టు- ఇది ప్రస్తుతం చిదంబరం దగ్గరలోని పిఛావరం నీటిచలమల్లో పెరుగుతోంది. ఆలయ చెక్కడాలు తిల్లై వృక్షాలు క్రీశ 2వ శతాబ్దంలోనివిగా వర్ణిస్తాయి).


తిల్లై వనాలలో కొంతమంది మునులు లేదా 'ఋషులు' నివసించేవారు, వారు మంత్రశాస్త్రం యొక్క ప్రాముఖ్యతను నమ్మారు మరియు భగవంతుడిని కొన్ని క్రతువులు మరియు 'మంత్రాల'తో నియంత్రించవచ్చని భావించారు. దేవుడు, 'పిచ్చతనాదర్' రూపంలో, ఒక సాధారణ యాచకుడివలే, ఎంతో అందమైన మరియు ప్రకాశవంతమైన అడవిలో సంచరిస్తాడు.


అతనిని మోహిని అవతారంలోనున్న అతని సహవాసియైన విష్ణువు అనుసరిస్తాడు. ఋషులు మరియు వారి భార్యలు, ఎంతో ప్రకాశవంతమైన ఈ యాచకుడు మరియు అందమైన ఆతని సహవాసిని చూసి ముగ్ధులౌతారు.


ఆనందభరితులైన వారి యొక్క ఆడవారిని చూసి, ఋషులు ఆగ్రహిస్తారు మరియు మంత్రాలతో కూడిన క్రతువులను ఆచరించి అసంఖ్యాకమైన 'సర్పాల'ను ఆమంత్రిస్తారు. యాచకుడైన ఆ భగవంతుడు సర్పాలను ఎత్తి వాటిని మెడకు మరియు నడుముకి దట్టంగా చుట్టుకొని ఆభరణములవలె ధరిస్తాడు. మరింత ఆగ్రహించిన ఋషులు, ఒక భయానకమైన పులిని ఆమంత్రించగా, దాన్ని కూడా శివుడు చీల్చి, ఆ పులి చర్మాన్ని నడుము చుట్టూ శాలువా వలె ధరిస్తాడు. పూర్తిగా విసుగు చెందిన ఋషులు, వారి యొక్క ఆధ్యాత్మిక శక్తిని మొత్తం కూడదీసుకొని, ఒక శక్తివంతమైన రాక్షసుడు ముయాలకన్ - అను, అజ్ఞానానికి మరియు గర్వానికి చిహ్నమైన ఒక శక్తివంతమైన రాక్షసుడిని ఆమంత్రిస్తారు. పరమ శివుడు ఒక చిరునవ్వుతో, రాక్షసుడి యొక్క వెన్ను మీద కాలు మోపి, కదలకుండా చేసి ఆనంద తాండవం (ఆద్యంతరహితమైన చిద్విలాస నృత్యం) చేస్తాడు మరియు ఆతని నిజ స్వరూపాన్ని చూపిస్తాడు. భగవంతుడు వాస్తవమని మరియు అతను మంత్రాలకు మరియు ఆగమ సంబంధమైన క్రతువులకు అతీతుడని గ్రహించి, ఋషులు లొంగిపోతారు.


పరమ శివుని యొక్క ఆనంద తాండవ భంగిమ, యావత్ ప్రపంచంలో ప్రసిద్ధమైన భంగిమలలో ఒకటిగా, అనేకులు ఇతర మతస్థులు కూడా హిందూ మతానికి చెందిన దీన్ని కొనియాడి గుర్తించారు. ఈ దివ్య నృత్య భంగిమ భరతనాట్య నర్తకుడు ఎలా నర్తించాలో తెలియజేస్తుంది.


అతని పాదం క్రింద ఉన్నది అజ్ఞానం అను భావాన్ని నటరాజుని పాదం క్రింద ఉంచిన రాక్షసుడుతో సూచిస్తుంది. చేతిలోని నిప్పు (నాశనం చేయు శక్తి) అనగా దుష్టశక్తులను నాశనం చేయునది. ఎత్తిన చేయి అతను సర్వ జగత్తుకి రక్షకుడని తెలియజేస్తుంది. వెనుక ఉన్న వలయం విశ్వాన్ని సూచిస్తుంది.


చేతిలోని ఢమరుకం జీవం యొక్క పుట్టుకను సూచిస్తుంది.

ఇట్టి ప్రధాన సంగతులను నటరాజ మూర్తి మరియు దివ్యమైన నృత్య భంగిమ వర్ణిస్తాయి. ఆదిశేషువు అనే సర్పం, తల్పం వలె మారి విష్ణువుగా సాక్షాత్కరించిన భగవంతుని సేవిస్తుండగా, ఆనంద తాండవం గురించి విని దానిని చూసి తరించవలెనని ఉత్సాహపడతాడు. అంతట భగవంతుడు ఆదిశేషువుని దీవించి, అతనికి యోగ స్వరూపుడైన 'పతంజలి' రూపాన్ని ప్రసాదించి తిల్లై అడవులకి వెడలి పొమ్మని, అతను అచిరకాలంలోనే నృత్యంలో విన్యాసాలు చేయగలడని చెబుతాడు.


కృత యుగంలో పతంజలి హిమాలయాల్లో తపస్సు చేసి మరొక ముని వ్యాఘ్రపథార్ ని కలుస్తాడు. వ్యాఘ్ర అనగా అర్ధం "పులి" "పాదం" – అతను దేవుని పూజకు తెచ్చు పూల మీద తుమ్మెదలు వ్రాలుటకు ముందే అనగా వేకువ జాములో చెట్లను ఎక్కి కోయుటకు వీలుగా అతనికి అట్టి పాదాలు మరియు పులి యొక్క కంటిచూపు మాదిరి చూపు వచ్చెనని తెలియజేయు కథ ద్వారా ఆ పేరు అతనికి వచ్చినది. పతంజలి యోగి మరియు అతని యొక్క ఉత్తమ శిష్యుడైన ఉపమన్యు యోగి యొక్క కథలు విష్ణు పురాణం అదే విధంగా శివ పురాణంలో కూడా వర్ణించబడ్డాయి. వారు తిల్లై వనంలోకి వెళ్లి ప్రార్ధించిన శివలింగ రూపంలోని పరమశివుడు, ప్రస్తుతం పూజిస్తున్న తిరుమూలాటనేస్వరర్ లోని దేవుడు ఒక్కడే 

(తిరు - శ్రీ, మూలటనం - స్వయంభువుడైన, ఈశ్వరర్ - ఈశ్వరుడు). పరమ శివుడు, నటరాజుగా అతని యొక్క చిద్విలాస నృత్యాన్ని (ఆనంద తాండవం) ఈ ఇద్దరు మునులకు పూసం నక్షత్రం ఉన్న రోజున, తమిళ మాసం తాయ్ (జనవరి – ఫెబ్రవరి)లో ప్రదర్శించాడని పురాణాలు చెబుతాయి.


చిదంబర ఆలయం యొక్క బంగారపు పై కప్పు కలిగిన గర్భ గుడిలో దైవం మూడు రూపాలలో సాక్షాత్కరిస్తాడు. "స్వరూపం" - సకల తిరుమేని అని పిలిచేటి ఈశ్వరుని మనిషిగా ఆపాదించిన రూపమైన నటరాజస్వామి.


"అర్ధ-స్వరూపం" - చంద్రమౌళేశ్వరుని యొక్క స్పటిక లింగరూపంలోని, అర్ధ- ఈశ్వర మానుష్య శరీరమైన, సకల నిష్కళ తిరుమేని . "నిరాకార స్వరూపం" - చిదంబర రహస్యం లోని అంతరాళం మాదిరి, గర్భగుడిలోని శూన్య స్థలం, నిష్కళ తిరుమేని.


పంచభూతాల యొక్క స్థలాలలో ఒకటైన చిదంబరంలో, ఆకాశం లేదా ఆగయం గా సాక్షాత్కరించిన స్వామిని పూజిస్తారు ("పంచ" అనగా అర్ధం ఐదు, భూత అనగా అర్ధం మూలకం: భూమి, నీరు, నిప్పు, గాలి, మరియు అంతరాళం మరియు "స్థల" అనగా ప్రదేశం). మిగతావి ఏవనగా కాంచీపురంలోని ఏకాంబరేశ్వర ఆలయం, ఇక్కడ భూమిగా సాక్షాత్కరించిన స్వామిని పూజిస్తారు. తిరుచిరాపల్లి, తిరువనైకావల్ లోని జంబుకేశ్వర ఆలయంలో, నీరుగా సాక్షాత్కరించిన స్వామిని ఆరాధిస్తారు. తిరువన్నామలైలోని అన్నమలైయర్ ఆలయంలో, అగ్నిగా సాక్షాత్కరించిన స్వామిని పూజిస్తారు. శ్రీకాళహస్తిలోని కాళహస్తి ఆలయంలో వాయువు గా సాక్షాత్కరించిన స్వామిని పూజిస్తారు.


చిదంబరం అనేది కూడా పరమ శివుడు నర్తించిన ఐదు ప్రదేశాలలో ఒకటి మరియు అన్ని ప్రదేశాలలో వేదికలు ఉన్నాయి.


పోర్ సభై కలిగి ఉన్న చిదంబరం కాక, మిగతావి ఏవనగా, తిరువాలన్గాడులోని రతిన సభై (రతినం అనగా – రత్నం/ఎరుపు), కోర్తళ్ళంలోని చిత్ర సభై (చిత్ర – ఛాయా చిత్రం), మదురై మీనాక్షి అమ్మవారి ఆలయంలోని రజత సభై లేదా వెల్లి అంబళం (రజత / వెల్లి – వెండి) మరియు తిరునెల్వేలి నెల్లైఅప్పార్ ఆలయంలోని తామిర సభై (తామిరం – రాగి).


​శివోహంభవ: 

ఈ ఆలయంలోని గర్భాలయంలో వెనుకభాగంలో ఓ చక్రం ఉంటుంది. దానికి ముందు భాగంలో బంగారం బిల్వ పత్రాలు వేలాడుతూ కనిపిస్తాయి. అయితే వీటిని భక్తులకు కనబడకుండా ఓ తెరను అడ్డుగా ఉంచుతారు అక్కడి పూజారులు. అయితే ప్రత్యేకమైన సందర్భాల్లో మాత్రం భక్తులకు ఆ తెరను తీసేసి భక్తులకు చూపిస్తారు. ఈ ప్రదేశాన్నే శివోహంభవ అంటారు. శివ అంటే దైవం, అహం అంటే మనం. మన మనసు దైవంలో ఐక్యమయ్యే ప్రదేశమని అర్థం. ఏ రూపం లేకుండా అజ్ఞానాన్ని తొలగించుకుంటూ దైవ సన్నిధి అనుభూతి చెందడమే ఈ పుణ్యక్షేత్రం ప్రాశస్త్యం. అదే చిదంబర రహస్యమని పండితులు చెబుతారు.


ఈ గుడిలోని మరో ప్రత్యేకత ఏంటంటే.. ఈ దేవాలయం గోపురం పైన 21600 బంగారం రేకులతో తాపడం చేశారు. అంటే ప్రతి ఒక్క మనిషి ప్రతిరోజూ 21600(15x60x24=21600). ఆ బంగారం రేకులను తాపడం చేసేందుకు 72 వేల బంగారం మేకులను వాడారు. ఇవి మన శరీరంలో ఉండే నాడులు అని ఆయుర్వేదం ద్వారా తెలుస్తోంది.


​ఎన్నో విశేషాలు..

చిదంబరం ఆలయంలోని నటరాజ స్వామి విగ్రహం కాలి బోటన వేలు, భూమి అయస్కాంత క్షేత్రానికి మధ్య బిందువు అని పాశ్యాత్య శాస్త్రవేత్తలు ఎనిమిదేశల్ల పరిశోధనల అనంతరం స్పష్టం చేశారు. అందుకే ఈ ఆలయం అయస్కాంత క్షేత్ర మధ్య బిందువుగా ఉంది. అంతేకాదు ఈ దేవాలయానికి ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 9 ప్రవేశ ద్వారాలు ఉన్నాయి. ఇవి మానవునికి ఉండే నవ రంధ్రాలకు ప్రతీకగా భావిస్తారు. ఈ గుడిలో ‘పొన్నాంబళం’ ఎడమవైపున ఉంటుంది. ఇది గుండె ఉండే స్థానం. ఇక్కడికి వెళ్లేందుకు ‘‘పంచాక్షర పడి’’ఎక్కాలి. ఇది న+మ+శి+వా+య పంచాక్షరిని సూచిస్తుంది.


ఈ ఆలయంలో ‘‘కనక సభ’’లో 4 స్తంభాలు, 4 వేదాలకు ప్రతీకలు. పొన్నాంబళంలో ఉండే 28 స్తంబాలు 28 శైవ ch ఆగమాలకు ప్రతీకలు. ఇక్కడి 9 కలశాలు 9 రకాల శక్తికి ప్రతీకలు. ఆ పక్కనే ఉన్న మంటపంలోని 18 స్తంబాలు 18 పురాణాలకు ప్రతీకలు. నటరాజు భంగిమను పాశ్చాత్య శాస్త్రవేత్తలు కాస్మిక్ డ్యాన్స్ అని అభివర్ణించారు. మూలవర్ చెప్పిన ఈ విషయాలన్నీ శాస్త్ర సమ్మతాలని నిరూపించేందుకు పాశ్చాత్య శాస్త్రవేత్తలకు ఎనిమిదేళ్లకు పైగా సమయం పట్టడం గమనార్హం.

స్వర్ణప్రాశ్య లేహ్యము

 స్వర్ణప్రాశ్య లేహ్యము గురించి సంపూర్ణ వివరణ -


         ఈ లేహ్యము ప్రాచీనమైన ఒక మూలికల సమూహము మరియు భస్మాలను కలిపి తయారుచేయడం జరుగును . ఈ లేహ్యము నందు సుమారు 36 రకాల మూలికలు మరియు స్వర్ణభస్మం , రజతభస్మం , ముత్యభస్మం , శతపుటి అభ్రకం మొదలైన భస్మాలను కూర్చి స్వచ్ఛమైన తేనెతో కలిపి ఈ లేహ్యం తయారగును . ఇందులో కలిపే మూలికలను ఒక్కొక్కటి శుద్ది చేయుచూ ఉపయోగించవలెను . 


  ఈ లేహ్యం ఉపయోగించటం వలన ప్రయోజనాలు - 


 *  శరీరము నందలి మేహ సంబంధ దోషాలు నివారణ అగును . 


 *  నీరసం , నిస్సత్తువ తగ్గును . 


 *  శరీరము నందు కండరాలు బలహీనపడి ఉన్నవారు మరియు శరీరము బక్కచిక్కి ఉన్నవారికి ఈ లేహ్యం వాడుచున్న కండరాలు బలంగా తయరగును . కండరాలు వృద్ధిచెందును . 


 *  గుండె సంబంధ దోషాలు , గుండెల్లో దడ , గుండె మంట నివారణ అగును . 


 *  నోటివెంట రక్తము పడుట తగ్గును . 


 *  శరీరము నందు రక్తము వృద్ది అగును . 


 *  రక్తము శుద్దిచేసి రక్తము నందలి టాక్సిన్స్ నిర్వీర్యం చేయును . 


 *  థైరాయిడ్ గ్రంథి మీద పనిచేయును . గ్రంథి పనితీరు మెరుగుపరచును . 


 *  మెదడు నందలి న్యూరాన్లకు మంచిశక్తిని ఇచ్చి బుద్ధిబలమును , జ్ఞాపకశక్తిని పెంచును . 


 *  ఎముకలు బలపడును . మరింత గట్టిగా తయారగును . శరీరము నందలి క్యాల్షియం లోపములు తగ్గును. 


 *  ఊపిరితిత్తులు బలహీనంగా ఉన్నవారు , ఆయసముతో ఇబ్బందిపడువారికి ఇది అత్యంత పుష్టిని కలుగచేయును . 


 *  కాలేయమునకు బలమును ఇచ్చును. 


 *  ఆడవారిలో గర్భసంబంధ దోషములను నివారించును . 


 *  వయస్సు పెరుగుతున్న కొలది వచ్చు బలహీనత మరియు ఎముకల సులువుగా విరిగిపోవడానికి కారణం అయిన క్యాల్షియం లోపాన్ని పోగొట్టును . 


 *  గర్భాశయాన్ని , అండాశయాలు శుద్దిచేయును . 


 *  నరాల సంబంధ దోషాలను నివారించును . 


 *  కాళ్ళు పట్టుకుపోవడం , కండరాల నొప్పులు నివారించును . 


 *  చర్మాన్ని కాంతివంతముగా ఉంచును . 


    

         పైన చెప్పినవే కాకుండా శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచును . ఈ మధ్యకాలంలో కరోనా వచ్చి తగ్గినవారిలో తీవ్రమైన బలహీనత ఏర్పడుచున్నది. అటువంటి సమస్యతో ఇబ్బందిపడేవారు ఈ లేహ్యాన్ని వాడటం మూలన త్వరగా శరీరబలాన్ని పొందవచ్చు. మాములుగా ఉన్నటువంటి వ్యక్తులు కూడా దీన్ని వాడుట మూలాన శరీరం నందలి రోగనిరోధక శక్తి పెరుగును రోగాలపాలు కాకుండా ఉంటారు . 


      ఈ లేహ్యంను చిన్నవారు మొదలుకొని స్త్రీపురుషులు మరియు వయస్సు మీదపడిన పెద్దవారు సహా అందరూ వాడవచ్చు . ఎటువంటి దుష్ఫలితాలు ఉండవు . 


ముఖ్య గమనిక - 


      కరోనా వచ్చి తగ్గి శరీర బలహీనతతో ఇబ్బంది పడువారు ఈ లేహ్యాన్ని వాడుట వలన అత్యంత త్వరగా బలాన్ని పొందగలరు. 


           ఈ లేహ్యం కావల్సినవారు డైరెక్టుగా కాల్ చేయగలరు . 

   సంప్రదించవలసిన నంబర్       9885030034 . 


               కాళహస్తి వేంకటేశ్వరరావు 


           అనువంశిక ఆయుర్వేద వైద్యులు 


                      9885030034

Story


 

Tv


 

హిందూ ధర్మం జ్ఞానం

 హిందూ ధర్మం జ్ఞానం మీద ఆధారపడి నడిచింది. జన్మం మీద కాదు. 


(వజ్రసూచికోపనిషత్తు ప్రకారం ..) 


1. ఋష్యశృంగుడు .. జింకలు పట్టుకునే జాతులకు పుట్టినవాడు.


2. కౌశికుడు .. గడ్డి కోసుకునే జాతికి చెందినవాడు.


3. జంబూక మహర్షి .. నక్కలు పట్టుకునే జాతివారు ..


4. వాల్మీకి .. ఓ కిరాతకుల జాతికి చెందిన వాడు. ఈతను రచించిన రామాయణం .. హిందువులకు పరమ పవిత్రమైన గ్రంథం. ఈయన్ని ఆదికవిని చేసి పూజిస్తారు.


5. వ్యాసుడు .. ఓ చేపలుపట్టే బెస్తజాతికి చెందినవాడు. హిందువులకు పరమపవిత్రమైన వేదములు .. ఈయన చేత విభజన చేయబడ్డవే. అందుకే ఇతణ్ణి వేదవ్యాసుడు .. అని పూజిస్తారు. 


6. గౌతముడు .. కుందేళ్లు పట్టేజాతికి చెందినవాడు.


7. వశిష్టుడు .. ఓ వేశ్యకు పుట్టినవాడు. కనీసం తండ్రి ఎవరో కూడా తెలియదు. ఈతని భార్య మాదిగ స్త్రీ అయిన అరుంధతీదేవి. ఈరోజుకు కూడా నూతన దంపతులచేత అరుంధతీవశిష్టులకు నమస్కారం చేసే సాంప్రదాయాన్ని పాటిస్తున్నారు. ప్రతి పూజలోనూ హిందువులచేత .. అరుంధతీవశిష్ఠాభ్యాం నమః .. అని పూజలందుకుంటున్నారు. 


వీరి కుమారుడు శక్తి. ఇతని భార్య ఓ మాదిగ వనిత .. ఛండాలాంగని. వీరికుమారుడే పరాశరుడు. ఈతను ఓ బెస్తవనిత మత్స్యగంధిని వివాహమాడి వ్యాసుణ్ణి కన్నారు. 


8. అగస్త్యుడు .. మట్టి కుండల్లో పుట్టినవాడు.


9. మతంగ మహర్షి.. ఒక మాదిగవాని కుమారుడు. బ్రాహ్మణుడయ్యాడు. ఈతని కూతురే .. మాతంగకన్య .. ఓ శక్తి దేవత. కాళిదాసుతో సహా ఎందరో మహానుభావులు ఈ మాతను ఉపాసించారు. ఉపాసిస్తూ ఉన్నారు. ఈమే శ్యామలాదేవి.


ఇంకా ..


1. ఐతరేయ మహర్షి ఒక దస్యుడి మరియు కిరాతకుడి కుమారుడు .. అంటే నేటి లెక్కల ప్రకారం SC or ST. జన్మ బ్రాహ్మణుడు కాదు. కానీ అత్యున్నతమైన బ్రాహ్మణుడు అయ్యాడు. అతను వ్రాసినవే ఐతరేయ బ్రాహ్మణం మరియు ఐతరేయోపనిషత్తు. ఐతరేయ బ్రాహ్మణం చాలా కష్టమైనది. ఇది ఋగ్వేదాన్ని అర్థం చేసుకోవడానికి ఉపయోగిస్తారు.


2.  ఐలుష ఋషి ఒక దాసీ కుమారుడు. అతను ఋగ్వేదంమీద రిసెర్చ్ చేసి చాలా విషయాలు కనిపెట్టాడు. అతన్ని ఋషులందరూ ఆహ్వానించి తమకు ఆచార్యుణ్ణి చేసుకున్నారు ( ఐతరేయ. బ్రా. 2.19)


3. సత్యకామ జాబాల మహర్షి ఒక వేశ్య కుమారుడు. తండ్రి పేరే కాదు.. కనీసం తండ్రి ఎవరో కూడా తెలియదు. కానీ జ్ఞానం చేత బ్రాహ్మణుడు అయ్యాడు.


ఉన్నతవంశాలలో పుట్టినవారిని కూడా వారిధర్మం నిర్వర్తించకపోతే .. వారిని నిర్మొహమాటంగా బహిష్కరించారు ... వారిలో కొందరు


1. భూదేవి కుమారుడు .. క్షత్రియుడైన నరకుడు .. రాక్షసుడైనాడు.


2. బ్రహ్మవంశజులైన హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపుడు, రావణుడు,.. బ్రాహ్మణులైనా .. రాక్షసులయ్యారు ..


3. రఘువంశ మూలపురుషుడైన రఘుమహారాజు కుమారులలో ఒకడు అయిన ప్రవిద్ధుడు .. రాక్షసుడైనాడు. 


4. త్రిశంకుడు క్షత్రియుడు. కానీ చండాలడు అయ్యాడు.


5. విశ్వామిత్రుడు క్షత్రియుడు.. బ్రాహ్మణుడైనాడు .. వీరి వంశస్తులే .. కౌశికస గోత్ర బ్రాహ్మణులయ్యారు. విశ్వామిత్రుని కుమారులు కొందరు శూద్రులయ్యారు.


6. నవ బ్రహ్మలలో ఒకడైన దక్ష ప్రజాపతి కుమారుడు పృషధుడు. బ్రహ్మ జ్ఞానం లేని కారణాన శూద్రుడిగా మారిపోయాడు ( విష్ణుపురాణం 4.1.14)


7. నేదిష్టుడు అనే మహరాజు కుమారుడు .. నాభుడు. ఇతనికి క్షాత్ర జ్ఞానం లేని కారణాన, వర్తక జ్ఞానం కారణాన వైశ్యుడిగా మారవలసి వచ్చింది  ( విష్ణుపురాణం 4.1.13). 


8. క్షత్రియులైన రథోతరుడు, అగ్నివేశ్యుడు, హరితుడు .. బ్రహ్మ జ్ఞానం వలన బ్రాహ్మణులైనారు. హరితుని పేరుమీదే .. ఇతని వంశబ్రాహ్మణులకు హరితస గోత్రం వచ్చింది (విష్ణుపురాణం 4.3.5).


9. శౌనక మహర్షి కుమారులు .. నాలుగు వర్ణాలకు చెందినవారుగా మారారు (విష్ణుపురాణం 4.8.1).


10. అలాగే గృత్సమదుడు, వీతవ్యుడు, వృత్సమతి ... వీరి కుమారులు కూడా నాలుగు వర్ణాలకు చెందినవారు అయ్యారు.


*ఈ సందేశాన్ని కూడా మీ బంధువులకు స్నేహితులకు సన్నిహితులకు షేర్ చేయండి*


*తెలియని విషయాలు తెలుసుకునే అదృష్టాన్ని వారికి అందించటంలో సహాయపడండి*

ఇదే మన సనాతన ధర్మం యెుక్క గోప్పతనం

మహాభారతంలో ఒక కధ

 ॐ            సైన్స్ : తద్దినం ఎందుకు ? 

     (తప్పక చదవవలసిన సేకరణ వ్యాసం) 


    మహాభారతంలో ఒక కధ ఉంది... 

    కకుద్మి అనే ఒక రాజు ఉండేవాడు. అతనికి రేవతి అనే అందమైన కూతురు ఉండేది. అయితే ఆ అమ్మాయి అందానికి తగిన వరుణ్ణి వెతకడం ఆ రాజుకి పెద్ద తలనొప్పి అయ్యింది. అందుకని ఆ రాజు తనకున్న తపశ్శక్తిని ఉపయోగించి తన కూతుర్ని వెంట పెట్టుకుని బ్రహ్మ లోకానికి వెళ్తాడు. అయితే ఆ సమయానికి బ్రహ్మ లోకంలో సంగీత కార్యక్రమం జరుగుతుండడం వల్ల కొద్దిసేపు వేచి ఉన్నాడు.

    ఆ సంగీత కార్యక్రమం ముగిసిన తర్వాత బ్రహ్మ దగ్గరికి వెళ్లి తన కూతురికి తగిన వరుణ్ణి తన రాజ్యంలో గాని పక్క రాజ్యంలో గానీ ఉంటే చెప్పమని ప్రార్ధిస్తాడు. అప్పుడు బ్రహ్మ ఆ రాజుతో నువ్వు నీ కూతుర్ని తీసుకురావడం చాలా మంచిది అయ్యింది అన్నాడు. 

    అదేంటి? అని అడిగాడు రాజు. నీకు తెలియదా? భూమిపై సమయానికి, బ్రహ్మ లోకంలో సమయానికి వ్యత్యాసం ఉందని. 

    నువ్వు ఇక్కడ ఉన్న ఈ కాస్త సమయంలో భూమి పై 27 మహాయుగాలు (చతుర్యుగాలు) గడిచి పోయాయి. ఇప్పుడు అక్కడ నీవారు గానీ, నీ రాజ్యం గానీ లేదు అన్నాడు.

    దిగ్భ్రాంతి చెందిన ఆ రాజు బ్రహ్మను వేడుకుని ఇప్పుడు తాను ఏం చేయాలో సెలవియ్యమన్నాడు. 

    అప్పుడు బ్రహ్మ.. ఇప్పుడు భూమిపై 28 వ చతుర్యుగము నడుస్తోంది. అక్కడ మహావిష్ణువు అవతారం అయిన శ్రీ కృష్ణుని అన్న బలరాముడు నీ కూతురికి తగిన జోడి. కాబట్టి అతనికిచ్చి నీ కూతుర్ని వివాహం చెయ్యి అన్నాడు బ్రహ్మ...


    ఇప్పుడు ఒక ప్రముఖ హాలీవుడ్ చిత్రం గురించి మాట్లాడదాం...

    ఆ చిత్రం పేరు "Interstellar". ఈ చిత్రం 2014 లో వచ్చింది. 

    ఈ చిత్రం గురించి క్లుప్తంగా చెప్పాలంటే ఈ చిత్రం లో కథానాయకుడు గతంలో నాసాలో పైలట్ గా చేసి ప్రస్తుతం తన ఊరిలో వ్యవసాయం చేస్తూ ఉంటాడు. అతనికి ఒక కూతురు, కొడుకు ఉంటారు. కూతురంటే అతనికి ప్రాణం. 

    ఒకరోజు అతని కూతురు తన గదిలో ఉన్న పుస్తకాల అర నుండి తరచూ పుస్తకాలు వాటంతట అవే పడడం గమనించి ఆ గదిలో దెయ్యం ఉందని తండ్రితో చెబుతుంది. అప్పుడు ఆమె తండ్రి అదేమీ కాదని వివరించి, గతంలో నాసాలో పనిచేసిన తన ప్రొఫెసర్ని కలిసి దీని గురించి వివరిస్తాడు.

    తన కూతురు గదిలో ధూళి చారలు ఏర్పడ్డాయని, తన జేబులోంచి పడిన నాణాన్ని ఆ దూళి చారలు ఆకర్షించాయని, వాటిని పరిశీలించి చూసి దానిని డీకోడ్ చేశానని, ఎక్కడో ఇతర లోకాల్లో ఉన్న జీవులు భూమిపై ఉన్నవారికి సహాయం చేయడానికి ప్రయత్నిస్తున్నారని చెబుతాడు ఆ హీరో. 

    అయితే భూమిపైకి వస్తున్న ఆ పాజిటివ్ తరంగాలపై పరిశోధన చేయగా, అవి శని గ్రహానికి(Saturn) దగ్గరలో ఉన్న ఒక పాలపుంతలోని (Galaxy) ఒక గ్రహం నుండి వస్తున్నాయని చెబుతాడు ఆ ప్రొఫెసర్.

    అయితే అది భూమి ఉన్న పాలపుంత కాకపోవడం వల్ల ఆ పాలపుంతలోకి వెళ్ళడానికి ‘వార్మ్ హోల్’ (Warm hole) ద్వారా చేరుకోవచ్చని, కొంతమంది బృందాన్ని తయారు చేసి, ఒక వ్యోమ నౌక మీద వారి అందరినీ పంపిస్తాడు ఆ ప్రొఫెసర్ హీరోతో పాటుగా.  

    వార్మ్ హోల్ అంటే ఒక గాలక్సీ నుండి ఇంకో గాలక్సీకి వెళ్ళడానికి దగ్గరి దారి. అయితే వారి లక్ష్యం ఏంటంటే, ఆ పాలపుంతలో మానవ జీవనానికి అనువుగా ఉండే గ్రహాన్ని కనిపెట్టి భూమిపై మనుషుల్ని అక్కడికి తరలించాలని.. వగైరా వగైరా(etc etc..).. 

    అప్పటికి ఆ హీరో కూతురు వయస్సు 10 సంవత్సరాలు (ఇక్కడ ఈ విషయం గుర్తుంచుకోవాలి). 

    ఆ తరువాత కధ ఎన్నో మలుపులు తిరిగి చివరికి ఆ హీరో ఆ పాలపుంతలో ఉన్న కృష్ణ బిలంలోనికి (Black hole) ప్రవేశిస్తాడు. 

    అయితే అది 4D లోకం. మనం ఉన్నది 3D ప్రపంచం.  నాలుగవ డైమెన్షన్ కాలం. అంటే నాలుగవ డైమెన్షన్ ప్రపంచంలో మనం కాలంలో కూడా ప్రయాణించవచ్చన్న మాట! అంటే ఇప్పుడు ఆ హీరో కాలంలో ప్రయాణించగలడన్న మాట.  

    అయితే ఆ హీరో కాలంలో ప్రయాణించి తన కూతురు గదిలోకి వెళ్తాడు. అప్పుడు గదిలో ఉన్న తన కూతురికి ఏదో చెప్పడానికి ప్రయత్నిస్తూ పుస్తకాల అరలో నుంచి పుస్తకాలను కింద పడేస్తాడు.

    ఇప్పుడు అర్ధం అయ్యిందా... అంటే వేరే లోకం నుండి భూమిపై ఉన్నవారికి సహాయం చేయడానికి ప్రయత్నిస్తున్నది భవిష్యత్తులో ఉన్న హీరోనే.

    ఇక ఆ తరువాత కొంత కధ నడిచాక ఆ హీరో భూమిపైకి తిరిగి వస్తాడు. అయితే అప్పటికే తన కూతురు ముసలిది అయిపోతుంది. కానీ హీరో వయసు మాత్రం మారదు. ఎందుకంటే హీరో వెళ్లిన గ్రహంలో ఒక గంట భూమిపై ఏడు సంవత్సరాలతో  సమానం.


    పైన మహా భారతంలోని కథను చదివి మనం దాన్ని ఒక కథగానే తీసుకుంటాం. కానీ ఆ కథలో నేటి సైన్స్ కన్నా ఎంతో ముందే  "సమయ విస్ఫారణం" (Time dilation), "కృష్ణ బిలం" (Black hole), "వెచ్చని రంధ్రం” (Warm hole) వంటి ఆధునిక సైన్స్ చెబుతున్న వాటిని ఎప్పుడో మన హిందూ సనాతన ధర్మము యందు చెప్పడం జరిగింది.


    అందుకే స్వామీ వివేకానంద అన్నారు.. "సైన్స్ అభివృద్ధి అయ్యేకొద్దీ సనాతన ధర్మం మరింత బలపడుతూ ఉంటుంది" అని.


    ఇతర లోకాలకు, మనకు ఉన్న ఈ కాల వ్యత్యాసాన్నే "సమయ విస్ఫారణం” (Time dilation) అని నేటి సైన్స్ చెబుతుంది. 

    మనం మహాభారతంలో చదువుకున్నాం. పాండవులు చివరి రోజులలో స్వర్గాన్ని చేరుకోవడానికి హిమాలయాలు మీదుగా ప్రయాణం చేయడం. కానీ, స్వర్గం ఉండేది భూమిపై కాదు.   మరి స్వర్గాన్ని చేరుకోవడానికి భూమిపై ఉన్న హిమాలయాలకు వెళ్లడం ఏంటి? అని అనుమానం వస్తుంది.  నాక్కూడా వచ్చింది.


    పైన చెప్పిన వార్మ్ హోల్ సిద్ధాంతం ఇక్కడ మనం అర్ధం చేసుకోవాలి. హిమాలయాల్లో స్వర్గానికి చేరుకునే వార్మ్ హోల్స్ ఉన్నాయన్న మాట.    

    అలాగే ఆది శంకరాచార్యుల వారు బదరీనాథ్ వద్ద అంతర్ధానం అయిపోయారని ఆయన చరిత్ర చెబుతుంది. 

    అంటే అక్కడ వార్మ్ హోల్ ద్వారా ఆయన పరంధామం చేరుకున్నారని అర్ధం అవుతుంది.


    మన హిందూ సనాతన ధర్మము ప్రకారం, మరియు గరుడ పురాణం బట్టి చూసినా చనిపోయిన వారికి 11 -15 రోజుల వరకూ ప్రతీరోజూ పిండ ప్రధానం చేస్తారు. ఆ తరువాత సంవత్సరం వరకూ నెలకొక్కసారి చేస్తుంటారు. ఆ తరువాత సంవత్సరానికి ఒకసారి చేస్తుంటారు. ఎందుకో తెలుసా? 

    చనిపోయిన 11 – 15 రోజుల వరకూ జీవుడు భూమిపైనే ఉంటాడు. అందుకే ప్రతీరోజు పిండ ప్రధానం చేస్తాం. ఆ తరువాత జీవుడు స్వర్గానికి గానీ నరకానికి గానీ చేరుకోవడానికి ఒక సంవత్సర కాలం పడుతుంది గరుడ పురాణం ప్రకారం. 

    ఆ సమయంలో భూమిపై నెలరోజుల కాలం ఆ లోకంలోని వారికి ఒకరోజుతో సమానం. అందుకే నెలకొకసారి చేస్తే వారికి రోజు కొకసారి పెట్టినట్టు.  

    ఇక సంవత్సరం తరువాత స్వర్గానికి గానీ నరకానికి గానీ చేరుకుంటారు. అప్పుడు సంవత్సరానికి ఒకసారే పెడతాం. ఎందుకంటే అక్కడ ఒక రోజు, భూమిపై ఒక సంవత్సరంతో సమానం. 

    ఇలానే ఎన్నో లోకాలూ, ఎన్నో డైమెన్షన్లూ ఉన్నాయి. ఈ లోకాల మధ్య ఉన్న కాల వ్యత్యాసమే "సమయ విస్ఫారణం"(Time Dilation) అంటాం.


    ఇట్లానే.. బ్రహ్మ దేవుఁడు శ్రీకృష్ణుని స్నేహితులను అపహరించినపుడు కూడా ఒక క్షణం పాటు అది ఒక సంవత్సరం అయ్యింది. అప్పుడు కృష్ణుడే అన్ని రూపాలుగా మారి అందరి పిల్లలుగా, జంతువులుగా మారి బ్రహ్మకు గుణపాఠం చెప్తాడు.


ఇలా 

   *మన పురాణాలలో ఎన్ని విషయాలు ఉన్నాయో కూడా తెలియని ఈ ప్రస్తుత సమాజం, మన సంస్కృతిని కాదని ఏ తల తోక లేని పరమతం మాయలో పడుతున్నారు. మన తరువాత ఎప్పుడో వచ్చిన ఎడారి మతాలు ఇలాంటి విజ్ఞానంలో మన హిందూ సనాతన ధర్మమునకు దరిదాపుల్లో కూడా రాలేవు*.


     కుదిరితే ఈ వ్యాసం అందరికి పంపండి.  

    *కనీసం చదువుకున్న వాళ్లకు* అర్థం అవుతుంది.


నా జతపరపుమాట 


    దశరథుడు తన అంత్యక్రియలు జరిగిన 14 సంవత్సరాలకి, 

    అదే దేహంతో స్వర్గంనుండీ, విమానంలో వచ్చి, 

    రాముణ్ణి తన ఒళ్ళో కూర్చోపెట్టుకొనడం, సీతారామలక్ష్మణులతో మాట్లాడడం కూడా కట్టుకథ కాదు. (యుద్ధకాండ 122వ సర్గ)


|| ఓం నమః శివాయ ||

మంచి మాట..లు

 

💐🌹🍇🥭

*మంగళవారం :25-07-2023*

ఈ రోజు ** మంచి మాట..లు 

        మనకు *ఇష్టం* ఉన్న చోట *కష్టం* ఉంటుంది *కష్టం* ఉన్న చోట *బాధ* ఉంటుంది *కష్టం బాధ*  ను అర్థం చేసుకున్న చోట *ప్రేమ* ఉంటుంది వీటన్నీటిని అర్థం చేసుకునే *మంచి మనసుంటే* జీవితం *అద్భుతంగా* ఉంటుంది .


       నీకు *కావాలి* అనుకున్నప్పుడు *ఏది నీ* దగ్గరకురాదు , *నీ సొంతం* అనుకున్నది ఎప్పటికి నిన్ను *విడిచిపెట్టి పోదు* , నీకు రావాలని , నీకే చెందాలని *రాసిపెట్టి* ఉంటే రాకుండా ఆగదు  . ఇప్పటి వరకు జరిగేవన్నీ నీ *తలరాతలో* నీ *కర్మ* లో భాగమే,, అంతా నీ *మంచికే నేస్తమా* .


    మనలో మనం *గొడవ* పడినంత మాత్రాన *విడి పోయేంత* బలహీనమైంది కాదు *బంధం*,అంటే మనం ఎదుటి వారితో గొడవ పడిన ప్రతీసారి ఆ బంధం మరింత *గట్టిగా* అవుతుంది . బంధానికి అలవాటు పడినవారికే తెలుస్తుంది ఆ బంధం విలువ , *ప్రేమించిన* వారికే తెలుస్తుంది *ఆ ప్రేమ* విలువ . లేనిపోని *అనుమానాలు* లేనిపోని *ఆవేశాలతో* మీ బంధం,, బంధుత్వాన్ని  *వదులు కోకండి* .


     మనం *ఎడుస్తూ* కూర్చుంటే మనలో *కన్నీళ్ళు* కరిగిపోతాయి . *కాలం* కదిలి పోతుంది *కష్టం* మిగిలిపోతుంది , అందుకే ఎడుపుని *గుండెలో* దాచిపెట్టు *గెలుపు* కోసం *పరిగెత్తు* , అలుపు లేకుండా *ప్రయత్నించు* నీ ఏడుపుకి కారణం *ఐన వాళ్ళే* నీ గెలుపునీ *చూసి* తలదించుకోవాలి . *నీ జీవితం నువ్వే నిర్ణయించుకో* .


         *రాయి* లాగా కూర్చోకు భూమికి భారం అయ్యేలా, *గడియారం* లాగా పని చేస్తూండండి, *విజయం* ఏదోనాడూ తప్పక నిన్ను *వరించకమానదు*.. నేటి ఆధునిక సమాజంలో *జీవించాలంటే*  పరిగెత్తాలి.. కుదరకపోతే నడవాలి.. అది కుదరకపోతే.. పాకుతూ అయినా పోవలిసిందే.. మంచం *అసహ్యించుకునేలా* *పరుండితే* బతకడం కష్టం

శ్రీరాముడు అరణ్యవాసంలో

 శ్రీరాముడు అరణ్యవాసంలో 108 గుండాలు తవ్విన ప్రాతం ....


అరణ్యవాసంలోభాగంగా శ్రీరాముడు, సీత, లక్ష్మణుడితో కలిసి గోదావరి తీరం వెంట వస్తూ అలసిపోయి ఈ గుట్ట ప్రాంతంలో సేదదీరాడు. ఈప్రాంతం నచ్చి ఇక్కడే 108 రోజుల పాటు నివాసముండి, నీటి కోసం 108 గుంటలు తవ్వాడు. ఈ గుంటలే నేటి గుండాలు! అలా వీటికి రాముడి గుండాలు అనే పేరొచ్చింది. దీని ఆధారంగానే సింగరేణి బొగ్గుగనులు విస్తరించిన ఈ ప్రాంతానికి రామగుండం అనే పేరొచ్చిందని చెబుతారు.కొండపై సుమారు 30ఎకరాల విస్తీర్ణంగల చదునైన ప్రదేశం ఉంది.


కరీంనగర్‌జిల్లాలోని రామగుండంలో ఉన్న ఈ రాముడి గుండాలు ప్రకృతి రమణీయప్రదేశం. కరీంనగర్ నుంచి గోదావరిఖని వెళ్లే దారిలో రామగుండం బీ పవర్‌హౌజ్ గడ్డ వద్ద (తహశీల్ కార్యాలయం) దిగి, ఆటోలో రెండు కిలోమీటర్లు ప్రయాణిస్తే ఇక్కడికి చేరుకోవచ్చు. వర్షాకాలం నాలుగు నెలల్లో(జూన్ నుంచి నవంబర్‌వరకు) సహజసిద్ధంగా పారే జలపాతం, 108 గుండాల్లోంచి ఈగుతూ కిందకు దూకుతుంది. గుట్టపై గల బండ కొన్నిచోట్ల మెత్తటి శిలాపదార్థంతో ఉండడం వల్లే ఈ గుండాలు ఏర్పడ్డాయని భావిస్తున్నారు. నేరుగా పారే జలపాతం అకస్మాత్తుగా ఒక రంధ్రం(గుండం)లోకి వెళ్లిపోయి ఇంకో రంధ్రం(గుండం)లోంచి బయటకొస్తుంది. అంటే మాయమై మళ్లీ పుట్టినట్టు అనిపిస్తుంది. ఇలాంటి వింత భారతదేశంలో ఈ ఒక్కచోటే ఉన్నట్లు తెలుస్తోంది. ఈ 108 గుండాలను జీడిగుండం, పాలగుండం, నేతి గుండం, అమతగుండం, మోక్షగుండం, కాలగుండం, ధర్మగుండం, పసుపుగుండం, యమగుండం.. అనే పేర్లతో పిలుస్తారు. సంరక్షణ లేక కొన్ని గుండాలు దెబ్బతిన్నా మిగిలినవి మాత్రం కనువిందు చేస్తాయి. ఇంకా రాముని పాదాలు, శంఖు చక్రం, శ్రీరామచంద్రమూర్తి, గాయత్రి, భైరవస్వామి, శ్రీ సంతోషిమాత, వేంకటేశ్వర ఆలయాలు, బోగందాని మఠం, మునులు తపస్సు చేసినట్లుగా భావించే లోయలు ఇక్కడి దర్శనీయ స్థలాలు. గుట్టపై నుంచి చూస్తే గోదావరినది, పంటపొలాలు, ఎన్టీపీసీ, సింగరేణి బొగ్గుగనుల దశ్యాలు కట్టిపడేస్తాయి. జైశ్రీరామ్🚩

Copied post....

*🪔శ్రీ వేంకటేశ్వర దివ్య చరిత్ర-3🪔

 🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹

*🪔శ్రీ వేంకటేశ్వర దివ్య చరిత్ర-3🪔*


 🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁


 *బ్రహ్మలోకమున భృగువు* 


అది సత్యలోకము, అది మహాసభ, అందు చతుర్ముఖుడగు బ్రహ్మ, ఆయన ధర్మపత్నియగు సరస్వతీదేవి సభలోనున్న ఉన్నతాసనములందున్న వారయి వెలుగొందుచుండిరి. 


మిరుమిట్లు గొలిపే ఆ సభలో ఒకవైపున రాజర్షులు, బ్రహ్మర్షులు, దేవర్షులు, మున్నగువారుండిరి, మరియొక వైపు దేవతలు, యక్షులు, గరుడులు, గంధర్వులు, కిన్నెరులు, కింపురుషులు ఆసీనులయియున్నారు. 


వారికందఱకు సృష్టి విజ్ఞాన సంపన్నుడయిన బ్రహ్మ వేదములందలి అంతర్భూతములయిన రహస్యముల నెన్నింటినో బోధించుచుండెను. 


ఆ సమయమునకు భృగమహర్షి అచ్చటకు వచ్చెను. చరచరా సభను ప్రవేశించినాడు. సభాసదుల నొక్కసారిగా కలయజూచెను. 


బ్రహ్మకాని మరెవ్వరుకానితనను కూర్చును’డని అడుగకయే తనంతట తానుగా నా సభలో గల నొక ఆసనము పై గర్వముగా కూర్చునినాడు.


 సభాసదులకు భృగుమహాఋషి వచ్చుట వలన కలిగిన ఆనందముకన్న ఆయన ఆ విధముగా కూర్చోనుట వలన కలిగిన ఆశ్చర్యమే ఎక్కువగానుండెను.


బ్రహ్మకు భృగుమహర్షి ప్రవర్తన అవమానకరము, సభాసంప్రదాయములను పాటించి పెద్దవాడయిన తనకు నమస్కరించకమునుపై భృగువు ఆసీనుడగుట కోపము వచ్చి యిట్లనెను.


 భృగూ! ఏమిటి నీ యీ వింత ప్రవర్తన, నీ ఇచ్చవచ్చినట్టున్నూ, నీకు నచ్చినట్లున్నూ సభలో ప్రవర్తించుట అమర్యాదకరము కదా! యీ సభలో మునిగణము కన్న మిన్నయని నీవు నీవు భావించుచుంటివా! 


వీరిలో నీవ వెవరకన్న గొప్పవాడవు? త్రిమూర్తులను సైతము పసిపాపలుగా మార్చివేసిన ఆ యత్రిమహామునికంటే అధికుడవా?


ఇంద్రునే శపించిన యీ గౌతమమహర్షి కంటె గొప్పవాడవా? 


చూడు, నివురుగప్పిన నిప్పువలె ఆ యాసనము పై జమదగ్ని ఎట్లు వినయముగా కూర్చొనియున్నాడో? 

శక్తిసంపన్నుడైన ఆ జమదగ్ని కన్న నీవు ఊడబొడిచినదేమున్నది? 


సభాకార్యములందెట్లు మెలగవలెనో తెలియని తెలివితక్కువ వాడవని నిన్ను నేనిదివరకొనుకొనలేదు’’ అని బ్రహ్మ పెట్టవలసిన నాలుగు చివాట్లూ పెట్టినాడు. 


భృగువు ఇదంతయు విని, ఈ బ్రహ్మ నేను నమస్కారము చేయనంత మాత్రముననే దూషించుచున్నాడు కదా! 


సత్త్వగుణ సంపన్నునకు దూషణ భూషణ తిరస్కారములు సమముగనే కనిపించునుగదా! 


నమస్కారము చేయనంతమాత్రమునకే వుగ్రుడైన బ్రహ్మ. సత్త్వగుణ ప్రధానుడు కాడని నిర్ణయించుకొని బ్రహ్మకు తిరిగి జవాబు చెప్పకుండగనే సభను వీడి వెడలిపోయెను. 


సభాసదులు మరింతగ ఆశ్చర్యపడిరి.


 *నందనందన గోవిందా, నవనీత* *చోర గోవిందా, పశుపాలక శ్రీ గోవిందా,* *పాపవిమోచన గోవిందా;* 


 *గోవిందా హరి గోవిందా, వేంకట* *రమణా గోవిందా, గోవిందా హరి గోవిందా, వేంకట* *రమణా గోవిందా. ||* 

||


శ్రీవేంకటేశ్వరునిదివ్య లీలల లో మరికొన్ని తదుపరి సంపుటిలో తెలుసుకుందాం.

 *ఓం నమో వెంకటేశాయ*


*సేకరణ:- మన ఆత్మీయ సభ్యులు శ్రీ కె వి రమణమూర్తిగారి వాట్సాప్ పోస్ట్.* 


🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁

ఆర్య చాణక్య*♦️ *పార్ట్ - 125*

 🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹

.    *🌹చారిత్రాత్మక కథాస్రవంతి🌹*

.           ♦️ *ఆర్య చాణక్య*♦️


*పార్ట్ - 125*


🔴 *రాజనీతి సూత్రాణి - తృతీయ అధ్యాయం* : 


📕 *సర్వసాధారణ నీతులు* : 📕


1. బాలాదపి యుక్తమర్థం శృణుయాత్ 

(బాలుడు చెప్పినా మంచి విషయం వినాలి.) 


2. నత్యమప్యశ్రద్దేయం న వదేత్ 

(నిజమే అయినా వినేవాళ్ళు నమ్మరనే సందేహం ఉన్నప్పుడు అది వాళ్ళకి చెప్పకపోవడమే మంచిది.) 


3. నాల్పదోషాద్భహుగుణా స్త్యజ్యంతే 

(చాలా మంచి గుణాలు ఉన్నవాళ్ళని ఒక చిన్న దోషం ఉన్నంత మాత్రాన విడిచి పెట్టకూడదు.) 


4. విపశ్చిత్స్వపి సులభా దోషాః 

(మహాపండితులలో కూడా కొన్ని లోపాలు ఉండవచ్చు.) 


5. నాస్తి రత్న మఖనింతమ్ 

(ఖండించని రత్నం ఉండదు. ఎంతటి వాళ్ళకైనా కొన్ని కష్టాలు తప్పవు.) 


6. మర్యాదాతీతం న కాచిదపి విశ్వసేత్ 

(అవధులు దాటిన విషయం ఎన్నడూ నమ్మకూడదు. మర్యాద లేనివాడిని ఎన్నడూ నమ్మకూడదు.) 


7.  అప్రియే కృతం ప్రియమపి ద్వేష్యం భవతి (అప్రియుడికి ఏదైనా ప్రియమైనది చేసినా దాన్ని అతడు ద్వేషిస్తాడు.) 


8. నమన్యపి తులాకోటిః కూపోదకక్షయంకరోతి (ఘటీయంత్రానికీ (బావిలోనుంచి నీళ్ళు తోడడానికి కుండలు కట్టిన చక్రానికి) సంబంధించిన చివరి భాగం వంగుతున్నా నూతిలోని నీళ్ళన్నీ తోడేస్తుంది.) 


9. సతాం మతం నాతిక్రామేత్ 

(సత్పురుషుల అభిప్రాయం కాదనకూడదు.) 


10. గుణవదాశ్రయాన్నిర్గుణోపి గుణీ భవతి (గుణవంతుణ్ణి ఆశ్రయించడం వల్ల గుణవిహీనుడు కూడా గుణవంతుడు అవుతాడు.) 


11. క్షీరాశ్రితం జలం క్షీరమేవ భవతి 

(పాలను ఆశ్రయించిన నీరు పాలే అవుతుంది.) 


12. మృత్పినే పి పాటలిపుష్పం స్వగంధముత్పాదాయతి 

(పాటలిపుష్పం మట్టిముద్దలోనికి కూడా తన సువాసనను సంక్రమింపచేస్తుంది.) 


13. రజత కనకసంగావత్ కనకం భవతి 

(బంగారంతో కలిసిన వెండి కూడా బంగారం అవుతుంది.) 


14. ఉపకర్తర్యపకర్తు మిచ్చత్యబుథః 

(తెలివి తక్కువవాడు ఉపకారం చేసినవాడికి కూడా అపకారం చెయ్యాలని అనుకొంటాడు.) 


15. న పాపకర్మణా మాకృశభయమ్ 

(పాపం చేసేవాళ్ళకి ఇతరులు తిడతారనే భయం ఉండదు.) 


16. ఉత్సాహవతం శత్రవో పి వశీభవంతి (ఉత్సాహవంతులకి శత్రువులు కూడా వశం అవుతారు.) 


17. విక్రమధనా హి రాజానః 

(రాజులకి పరాక్రమమే ధనం.) 


18. నాస్త్యలసస్య ఐహికమాముష్మికం వా 

(సోమరికి ఐహికమూ లేదు, పారలౌకికమూ లేదు.) 


19. నిరుత్సాహాదైవం పతతి 

(నిరుత్సాహపడితే దైవం కూడా వ్యతిరేకిస్తుంది.) 


20. మత్సార్థీన జాలముపయాజ్వార్థం 

(చేపలు పట్టేవాని వలె వలపన్ని ధనం సంపాదించాలి.) 


21. అవిశ్వస్తేషు విశ్వాసో న కర్తవ్య 

(తన మీద నమ్మకం లేనివాళ్ళని నమ్మకూడదు.) 


22. విషం విషమేవ సర్వకాలమ్ 

(విషం ఏనాటికీ విషమే.) 


23. అర్ధసమాదానే వైరిణాం సంగ ఏవ న కర్తవ్య (ధనం సేకరించేటప్పుడు శత్రువులతో సంబంధమే పెట్టుకోకూడదు.) 


24. అర్థసిద్దౌ వైరిణం న విశ్వసేత్ 

(కార్యసిద్ధి విషయంలో శత్రువును నమ్మకూడదు.) 


25. అర్ధాధీన ఏవ నియతసంబంద 

(ఇద్దరి మధ్య ఒక నిశ్చితమైన సంబంధం ఉన్నదంటే అది ఏదో ఒక ప్రయోజనం యొక్క మూలంగా ఏర్పడుతుంది.) 


26. శత్రోరపి సుతః సఖా రక్షిఇతవ్య 

(శత్రువు కుమారుడైన స్నేహితుడైతే వాడ్ని రక్షించాలి.) 


27. యావచ్చత్రో శ్చిద్రం పశ్యతి తావద్దస్తేన వా స్కందేన వా సంవాహ్యచిద్రేతు ప్రహరేత్ 

(శత్రువులో ఉన్న లోపం కనబడేవరకు వాడ్ని చేతులమీద కాని, భుజాలమీద కాని మోయ్యాలి. లోపం కనబడగానే వాడిమీద దెబ్బతీయాలి.) 


28. ఆత్మచ్చిద్రం న ప్రకాశయేత్ 

(తన లోపాలను బయట పడనీయకూడదు.) 


29. చిత్ర ప్రహారిణ శత్రవో పి 

(శత్రువులు కూడా ఏవో లోపాలు కనబడినప్పుడే దెబ్బతీస్తారు.) 


30. హస్తగతమపి శత్రుం న విశ్వసేత్ 

(చేతికి చిక్కినా శత్రువును నమ్మకూడదు.) 


31. స్వజనస్య దుర్వంత్తిం వారయేత్ 

(తన వాళ్ళలో ఉన్న చెడ్డ నడవడికను నివారించాలి.) 


32. స్వజనావమానో పి మనస్వినాం దుఃఖమావహతి 

(తనవాళ్ళకి అవమానం జరిగినా ఆత్మాభిమానవంతులు బాధపడతారు.) 


33. ఏకాంగదోష పురుషమపసాదయతి 

(ఒక్క అవయవ దోషం కూడా మనిషిని కృంగదీస్తుంది.) 


34. శత్రుం జయతి సువృత్తతా 

(సచ్చరిత్ర శత్రువును జయిస్తుంది - శత్రువుల నుండి కూడా మెప్పును తెస్తుంది.) 


35. నికృతిప్రియా నీచాః 

(అపకారం చేయడమే నీచులకు ఇష్టం.) 


36. నీచస్య మతిర్న దాతవ్యా 

(నీచుడికి సలహాలు ఇవ్వకూడదు.) 


37. నీచేషు విశ్వాషో న కర్తవ్య 

(నీచుల్ని నమ్మకూడదు.) 


38. సుపూజితో పి దుర్జనః పీడయత్యేవ 

(దుర్జనుడ్ని ఎంత గౌరవించినా పీడించడం మానడు.) 


39. చందనాదీనపి దావో గ్నిర్ధహత్యేవ 

(దావాగ్ని చందనవృక్షాదులను కూడా కాల్చి తీరుతుంది.) 


40. కదాపి కమిపి పురుషం న బాధేత 

(ఎప్పుడూ, ఎవర్నీ అవమానించకూడదు.) 


41. క్షంతవ్యమితి పురుషం న బాధేత 

(క్షమించడమే యుక్తం; అందుచేత ఎవర్నీ బాధించకూడదు.) 


42. భర్తధికం రహస్యుక్తం వక్తుమిచ్చన్యంతబుద్దయః (తెలివితక్కువవాళ్ళు ప్రభువు రహస్యంగా చెప్పిన విషయాన్ని అదీ ఇదీ కలిపి నలుగురికీ చెప్పడానికి ప్రయత్నం చేస్తుంటారు.) 


43. అనురాగస్తు ఫలేన సూచ్యతే 

(ఎంత అనురాగం ఉందో ఫలాన్ని పట్టి తెలుస్తుంది.)


44. ఆజ్ఞాఫలమైశ్వర్మమ్ 

(ఐశ్వర్యం ఉన్నందుకు ప్రయోజనం అధికారం చెలాయించడం.) 


45. దాతవ్యమపి బాలిశః పరిక్లేశేన దాస్యతి (మూర్ఖుడు ఇవ్వవలసినది కూడా ఎంతో కష్టం మీద ఇస్తాడు.) 


46. మహదైశ్వర్యం ప్రాప్యాపి అధృతిమాన్ వినశ్యతి (ధైర్యం లేనివాడు, చిత్తస్థైర్యం లేనివాడు గొప్ప ఐశ్వర్యం లభించినా కూడా నశిస్తాడు.) 


47. నాస్త్యధృతే రైహికమాముష్మికం వా 

(చిత్తస్ధైర్యం లేనివానికి ఐహికమూ లేదు, ఆముష్మికమూ లేదు.) 


48. న దుర్జనైః సహ సంసర్గ కర్తవ్య 

(దుర్జనుల సహవాసం చెయ్యకూడదు.) 


49. శౌండహస్తగతం పయో ప్యవమన్యతే జనః 

(కల్లు అమ్మేవాడి చేతిలో ఉన్న పాలను కూడా మనుష్యులు నిరాకరిస్తారు.) 


50. కార్యసంకటేష్వర్ధవ్యవసయినీ బుద్దిః 

(పనులలో కష్టాలు ఏర్పడినప్పుడు విషయార్ధారణ చేయగలిగిందే బుద్ధి.) 


51. మితభోజనమ్ స్వాస్థ్యమ్ 

(మితంగా భుజించడమే ఆరోగ్యం.) 


52. పథ్యమప్యపథ్యాజీర్నే నాశ్నీయత్ 

(హితమైన పదార్థాన్ని అజీర్ణంగా ఉన్నప్పుడు తినకూడదు.) 


53. జీర్ణభోజినం వ్యాధిర్నోపర్పతి 

(తిన్నది జీర్ణమైన తర్వాతనే మళ్ళీ భుజించేవాడి దగ్గరికి రోగాలు రావు.) 


54. జీర్ణశరీర వర్ధమానం వ్యాధిం నోపేక్షేత 

(శరీరంలో జీర్ణమైన తర్వాత వార్ధక్యంలో వచ్చిన వ్యాధిని ఉపేక్ష చేయకూడదు.) 


55. అజీర్నే భోజనం దుఃఖమ్ 

(అజీర్ణంగా ఉన్నప్పుడు భోజనం చేయడం దుఃఖహేతువు.) 


56. శత్రోరపి విశిష్యతే వ్యాధి 

(శత్రువుని మించినది వ్యాధి.) 


57. దానం నిధానమనుగామి 

(దానం అనేది కూడా వచ్చే నిధి.) 


58. పటుతరే పి తృష్ణాపరే సులభమతిసంధానమ్ (ఎంత తెలివైనవాడైనా దురాశ కలవాడ్ని మోసగించడం సులభం.) 


59. తృష్ణయా మతిశ్చాద్యతే 

(దురాశ ఆలోచనాశక్తిని కప్పివేస్తుంది.) 


60. కార్యబహుత్వే బహుఫలమాయతికం కుర్యాత్ (చాలా కార్యాలున్నప్పుడు ఎక్కువ ఫలాన్ని ఇచ్చేపనీ, భవిష్యత్తులో లాభకరమైన పనీ చెయ్యాలి.) 


61. స్వయమేవాస్కన్నం కార్యం నిరీక్షేత (చెడిపోయిన పనిని తానే చక్కదిద్దుకోవాలి. లేదా తానే పని చెడిపోకుండా చక్కదిద్దుకోవాలి.) 


62. మూర్ఖేసు సాహసం నియతమ్ 

(మూర్ఖులలో సాహసం తప్పకుండా ఉంటుంది.) 


63. ముర్ఖేసు వివాదో న కర్తవ్య 

(మూర్ఖులతో వాగ్వాదం పెట్టుకోకూడదు.)


64. మూర్ఖేషు మూర్ఖవదేవ కథయేత్ 

(మూర్ఖులతో మూర్ఖుడులాగే మాట్లాడాలి.) 


65. ఆయసైరాయసం భేధ్యమ్ 

(ఇనుపదానిని ఇనుపదానితోనే చేదించాలి.) 


66. నాస్త్యధీమతః సఖా 

(తెలివితక్కువవాడికి స్నేహితుడు ఉండడు.) 

(ఇంకా ఉంది)...🙏


సేకరణ:-  మన ఆత్మీయ సభ్యులు శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్. 


🎄🌲🪻🎄🌲🪻🎄🌲🪻🎄

👉 *రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*

🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

మంగళవారం, జూలై 25, 2023* రాశి ఫలాలు

 .       *🌹ఓం శ్రీ గురుభ్యోనమః🌹*

.  *శ్రీరస్తు - శుభమస్తు - అవిఘ్నమస్తు*


*మంగళవారం, జూలై 25, 2023*

*శ్రీ శాలివాహన శకం: 1945*

*శ్రీ శోభకృత్ నామ సంవత్సరం*

*దక్షిణాయనం - వర్ష ఋతువు*

*అధిక శ్రావణ మాసం - శుక్ల పక్షం*

*తిధి*      :  *సప్తమి ఉ10.03* వరకు 

.                *🌹రాశి ఫలాలు🌹* 

 

*మేషం*


సమాజంలో  ప్రముఖ వ్యక్తులతో  విలువైన విషయాలు గూర్చి చర్చిస్తారు. చిన్ననాటి మిత్రులతో దూర ప్రయాణ సూచనలున్నవి. వృత్తి  వ్యాపారాలు లాభాలబాటలో  సాగుతాయి. నిరుద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి.  ఉద్యోగస్తులకు  పదోన్నతులు పెరుగుతాయి. జీవిత భాగస్వామితో  శుభకార్యాలలో పాల్గొంటారు.


*వృషభం*


బంధు, మిత్రుల నుంచి శుభకార్య ఆహ్వానాలు  అందుకుంటారు. ఆర్థిక పరంగా అనుకూల వాతావరణం ఉంటుంది. శత్రు సంభందమైన  సమస్యలు నుండి ఉపశమనం కలుగుతుంది. చేపట్టిన పనులలో ఆలోచనలు  కార్యరూపం దాలుస్తాయి. వృత్తి  వ్యాపారాలు సంతృప్తికరంగా సాగుతాయి. ఉద్యోగాలలో   నూతన అవకాశాలు అందుకుంటారు. 


*మిధునం*


ఆదాయానికి మించిన ఖర్చులు ఉంటాయి. కుటుంబ వాతావరణం గందరగోళంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాలలో ఇతరులతో  మాటపట్టింపులు ఉంటాయి. నిరుద్యోగ  ప్రయత్నాలు మందకొడిగా సాగుతాయి. దూరప్రయాణాలలో శ్రమాధిక్యత పెరుగుతుంది. ఉద్యోగ వాతావరణం కొంత చికాకు కలిగిస్తుంది.


*కర్కాటకం*


ఇంటా బయట అదనపు  బాధ్యతల వలన చికాకు పెరుగుతుంది.     మానసిక అనారోగ్య సమస్యలు భాదిస్తాయి. నూతన  ఋణాలు చెయ్యవలసి వస్తుంది. బంధు, మిత్రులతో స్పల్ప మాట పట్టింపులుంటాయి. వృత్తి వ్యాపారాలు స్వల్పంగా  లాభిస్తాయి.   ఉద్యోగస్తులకు  ఆకస్మిక స్థానచలన సూచనలున్నవి.


*సింహం*


కుటుంబ సభ్యులతో దైవ సేవా కార్యక్రమాలలో  పాల్గొంటారు.  అన్నివైపుల నుండి ఆదాయం అందుతుంది. వ్యాపార విస్తరణకు లభించిన  అవకాశాలు సద్వినియోగం చేసుకోవాలి. ప్రయాణాలలో నూతన వ్యక్తుల పరిచయాలు లాభిస్తాయి. వృత్తి, ఉద్యోగాలు ఆశించిన విధంగా రాణిస్తాయి.   ఆర్ధిక అనుకూలత కలుగుతుంది.


*కన్య*


అవసరానికి మించిన  ఖర్చులు  పెరుగుతాయి. కీలక విషయాలలో ద్విస్వభావ  ఆలోచనలు చెయ్యడం మంచిది కాదు. ముఖ్యమైన వ్యవహారాలు కొంత  నిదానంగా పూర్తవుతాయి. వృత్తి వ్యాపారాలలో మందకొడిగా సాగుతాయి. ఉద్యోగాలలో అధికారులతో సమస్యలు తప్పవు నిరుద్యోగులకు కొన్ని విషయాలలో నిరాశ పెరుగుతుంది.


*తుల*


ఆర్థిక వ్యవహారాలు సంతృప్తి కలిగిస్తాయి. స్నేహితుల నుండి ఊహించని సహాయం అందుతుంది. నూతన వ్యాపారాల్లో మరింత పురోగతి  సాధిస్తారు. ఇంటా బయట   మరింత ఉత్సాహంగా ముందుకు సాగుతారు. వృత్తి  ఉద్యోగాలలో అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది. దూరపు బంధువుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి.


*వృశ్చికం*


ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోవడం  మంచిదికాదు. నిరుద్యోగులు కొంత ఓర్పుతో ప్రయత్నాలు చేయాలి. నేత్ర   సంబంధిత అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. ఆర్ధిక  విషయంలో  లోటుపాట్లు ఉంటాయి. కుటుంబ సభ్యుల ప్రవర్తన  ఆశ్చర్యం కలిగిస్తుంది. వృత్తి వ్యాపారాలు అంతంతమాత్రంగా  సాగుతాయి.


*ధనస్సు*


సంఘంలో గౌరవ మర్యాదలు  పెరుగుతాయి. నిరుద్యోగులకు అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది. భూ సంబంధిత వివాదాలు పరిష్కారమై   ఊరట చెందుతారు. ఆలోచనలు  కార్యరూపం దాల్చుతాయి.   వ్యాపారాలకు నూతన పెట్టుబడులు అందుతాయి. ఆర్థిక వ్యవహారాలలో  ఆశించిన పురోగతి సాధిస్తారు.


*మకరం*


ధనపరంగా  అనుకూల వాతావరణం ఉంటుంది.  దైవ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తారు. దూర ప్రయాణాలు  లాభసాటిగా సాగుతాయి. సమాజంలో  ప్రముఖుల నుండి   ఆహ్వానాలు అందుతాయి. వృత్తి వ్యాపారాలలో  సమస్యలు అధిగమించి లాభాలు అందుకుంటారు. నిరుద్యోగులకు  లభించిన  అవకాశాలు సద్వినియోగం చేసుకోవాలి.


*కుంభం*


దూరప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. గృహమున కొందరి ప్రవర్తన  మానసికంగా  చికాకు కలిగిస్తుంది. జీవితభాగస్వామితో పుణ్య క్షేత్రాలు సందర్శిస్తారు. చేపట్టిన వ్యవహారాలలో ప్రతికూల వాతావరణం ఉంటుంది. ఉద్యోగాలలో తొందరపాటు  నిర్ణయాలు చేసి ఇబ్బందిపడతారు. వ్యాపారమున ఆర్ధిక ఇబ్బందులు కలుగుతాయి. 


*మీనం*


కుటుంబ వ్యవహారాలలో  అధిక కష్టంతో అల్ప ఫలితం పొందుతారు.  నిరుద్యోగ  ప్రయత్నాలు నిరాశ పరుస్తాయి. ఆర్ధిక ఇబ్బందులు బాధిస్తాయి. వాహనప్రయాణలో అప్రమత్తంగా  వ్యవహరించాలి.  వ్యాపారాలలో ఒడిదుడుకులు పెరుగుతాయి. వృత్తి ఉద్యోగాలలో  అదనపు పనిభారం ఉంటుంది. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు బాధిస్తాయి.


🎄🌲🪻🎄🌲🪻🎄🌲🪻🎄

👉 *అహింసా పరమో ధర్మః - ధర్మ హింసా తథైవ చ !!*

👉 *ధర్మో రక్షతి రక్షితః - వృక్షో రక్షతి రక్షితః*


🐐🐂👩‍❤️‍👨🦀🦁💃⚖️🦂🏹🐊🏺🦈                                                                   

*ఇష్టదేవతానుగ్రహప్రసాదసిద్ధిరస్తు,*🙏🏻

*లోకాసమస్తా సుఖినోభవంతు,*🙏🏻

*సర్వేజనాః సుఖినోభవంతు,*🙏🏻


సేకరణ:- మన ఆత్మీయ సభ్యులు శ్రీ కె వి రమణమూర్తిగారి వాట్సాప్ పోస్ట్. 


🐄 *గోమాత రక్షణ వేదమాత పోషణ మనందరి బాధ్యత*🙏🏻

🐐🐂👩‍❤️‍👨🦀🦁💃⚖️🦂🏹🐊🏺🦈

అమంగళకరమైన పనుల

 అమంగళకరమైన పనుల అస్సలు చేయకండి


1. మిట్ట మధ్యాహ్నం స్నానం చేయడము. 

2. నాలుకతో తడిచేసి బొట్టు పెట్టుకోవడం.

3. కాళ్లు దాటుకుంటూ నడవడం.  

4. ఎడమ చేతితో పిల్లలను కొట్టడం.

5. ఓడిలో కంచం పెట్టుకొని భోజనం చేయటం.

6. వడ్డించిన తర్వాత ఆలస్యంగా భోజనానికి రావడం.

7. అన్నం తింటూ వేళ్ళు చేతులు నాకడం. 8. అదే పనిగా కాళ్ళు ఊపడం.

9. మంచం మీద కూర్చొని భోజనం చేయడం.

10. నిలబడి భోజనం చేయడం. 

11. స్నానం చేసి విడిచిన బట్టలు కట్టుకోవడం. 

ఈ పనులను అసులు చేయకూడది

పద్మనాభ స్వామి ఆలయం విముక్తి

 ఈ రోజు కేరళ కమ్యూనిస్ట్ ప్రభుత్వ బారి నుండి పద్మనాభ స్వామి ఆలయం విముక్తి పొందింది...

రాజ్యాంగం ప్రకారం ఆలయాల మీద ప్రభుత్వాలకు ఏ హక్కు లేదు...

రెండు లక్షల కోట్ల ఆస్తులు, గొప్ప వారసత్వం కలిగిన పద్మనాభస్వామి ఆలయం ఇకపై ప్రభుత్వానికి చెందినది కాదు, ఇప్పుడు దీనిని ట్రావెన్కోర్ రాయల్ ఫ్యామిలీ చూసుకుంటుంది... సుబ్రమణియన్ స్వామి ఈ కేసుతో పోరాడి ఆలయాన్ని  పొందారు...

 ఆలయ నిర్వహణ సభ్యులందరూ ఇప్పుడు హిందువులే అవుతారు. 

ఈ సమాచారం ట్రావెన్కోర్ కిరీట యువరాజు ఆదిత్య వర్మ తన తల్లి గౌరీ లక్ష్మికి వివరించినప్పుడు, 

ఇద్దరూ ఆనందంతో కేకలు వేశారు..

ఇది ఆరంభం దేవాలయాల ప్రభుత్వ యాజమాన్యాన్ని వదిలించుకోవడానికి పోరాటం ఇంకా చాలా కాలం. హిందువులు ఐక్యత గురించి ఆలోచిస్తే, ఇదే పరిస్థితి, మీరు ఐక్యమయ్యే రోజు, భూమిని తిప్పగల సామర్థ్యం మీకు ఉంది, మీరు దేశంలోని అన్ని దేవాలయాలను విడిపించాలి. # జై సనాతన ధర్మం # భారత్ మాత కి జై 👏👏🙏

శుకమహర్షి జన్మ వృత్తాంతం

 *నిత్యాన్వేషణ:*


శుకమహర్షి జన్మ వృత్తాంతం ఏమిటి?


శుకమహర్షి మహర్షి వేదవ్యాసుని కుమారుడు.శుకుడు పుట్టుకతోనే బ్రహ్మజ్ఞాని.

*జన్మరహస్యము:*

ఒకసారి కైలాసంలో పార్వతీదేవి శివుడితో "స్వామీ,ఈ సృష్టి యొక్క రహస్యం ఏమిటి?జనన మరణాలు ఏ విధంగా సాగుతున్నాయి?అసలు సృష్టి ఏ విధంగా జరుగుతోంది?" మొదలైనవి అడిగింది. అప్పుడు ఈశ్వరుడు "అన్నీ చెప్తాను. కాని ఒక ఏకాంత ప్రదేశంలో చెప్పాలి" అంటూ కైలాసం వదిలి ఏకాంత ప్రదేశమునకు బయలుదేరారు. పరమశివుడు మొదట నందిని, ఆభరణాలైన పాములను ఒక్కటొక్కటిగా వదిలివేస్తూ పార్వతితో బయలుదేరి చివరకు అమరనాథ గుహను చేరుకున్నారు. అక్కడినుండి పంచభూతములను, గుహలో ఉన్న రామచిలకలను బయటికి పంపివేశినాడు. పార్వతికి రహస్యాలను చెప్పడం మొదలు పెడతాడు. కాని గుహలో ఒక రామచిలక గుడ్డు పగిలి ఒక చిన్న చిలక ఈ విషయాలను విన్నది. ఈ విషయం పసిగట్టిన శివుడు ఆ చిలుక జన్మలో ఆ జ్ఞానం యొక్క విలువ అర్థం కాదని అందువలన ఆ చిలుక అప్పుడు మరణించి మరుసటి జన్మలో ఒక ఋషిగా పుట్టునట్లు అనుగ్రహించాడు. ఆ చిలకే తర్వాతి జన్మలో శుకమహర్షి. అందుకే కొన్ని చిత్రాలలో శుకుడి ముఖము చిలుకలా కనిపిస్తుంది. పుట్టుకతోనే బ్రహ్మజ్ఞాని అయినప్పటికీ మాయ వలన ఇతడు మనలాగే బాల్యం గడిపాడు. అప్పుడు వ్యాసుడు అతనికి బ్రహ్మజ్ఞానం ఉపదేశించాడు. మిగిలినది తెలుసుకోవడానికి మిథిలా నగరపు రాజు జనకుడి దగ్గరకు పంపాడు. జనకుడు బ్రహ్మజ్ఞాని మరియు రాజర్షి. ఇతడికి విదేహుడు అనే పేరు ఉంది. విదేహుడు అనగా జీవించే ముక్తిని పొందినవాడు. శుకుడు అతనివద్దకు బయలుదేరాడు. జనకునికి ఈ విషయం దివ్యదృష్టి ద్వారా తెలిసి శుకుడిని పరిక్షించాలనుకొన్నాడు. తదనుగుణంగా ద్వారపాలకులకు ఆదేశాలిచ్చాడు. శుకుడు రాగానే ద్వారపాలకులు రాజు ఆదేశాల ప్రకారం శుకుడికి ఏ విధమైన గౌరవం ఇవ్వకుండా కేవలం కూర్చోవడడానికి ఒక పీఠం మాత్రం ఇచ్చి ద్వారం దగ్గరే కూర్చుండబెట్టారు. ఈ విధంగా మూడు రొజులు శుకుడు గడిపాడు. శుకుడు ఏ మాత్రం చలింపక అలానే కూర్చున్నాడు. మూడు రోజుల తర్వాత సకల రాజలాంఛనాలతో లోనికి తీసుకెళ్ళారు.శుకుడిని ఒక రాజపీఠం పై కూర్చుండబెట్టినారు. రాజ నర్తకుల నాట్యాలు ప్రారంభమైనవి. కానీ శుకుడు ఏ విధంగానూ చలింపలేదు. అప్పుడు జనకుడు శుకుడికి  అంచుల వరకు నూనెతో నిండిన ఒక పాత్రను ఇచ్చి సభలో ఏడు సార్లు తిరిగిరమ్మన్నాడు.శుకుడు అలా తిరుగుతున్నప్పుడు నాట్యకత్తెలు అతన్ని ఎన్నోవిధాలుగా మోహింపచేసేందుకు ప్రయత్నించారు. కాని శుకుడు ఏ మాత్రం తొణకక తిరిగివచ్చి కూర్చున్నాడు. అప్పుడు జనకుడు నేను నీకు ఏమీ భోదించనవసరం లేదు, నీవు బ్రహ్మజ్ఞానివి అన్నాడు. కానీ మీ తండ్రి ఆజ్ఞ ప్రకారము చెపుతాను అని వ్యాసమహర్షి చెప్పినదే చెప్పి పంపివేసాడు. శుకమహర్షి మనోనిగ్రహం ఇలాంటిది.తన ఆజ్ఞ లేనిదే తన మనసు లోకి ఎలాంటి అలోచనను రానివ్వంటువంటి మనోనిగ్రహం కలవాడు శుకుడు.

ఇది జరిగిన తర్వాత శుకుడు తన ఇంటికి వెళ్ళాడు. ఆప్పుడు అక్కడ తండ్రి వేదవ్యాసుడు లేడు. అప్పుడు శుకుడు పంచభూతాలను పిలిచి " నేను ఆడవులకు వెళ్ళిపోతున్నాను. నా తండ్రి వచ్చి నన్ను పిలిస్తే ఓం అని అరవండి" అని చెప్పి వెళ్ళిపోయాడు. వేదవ్యాసుడు వచ్చి ఓ కుమారా!శుకా అని పిలువగా పంచభూతాలు ఓం అని అరిచాయి. అప్పుడు వేదవ్యాసుడు పంచభూతాలతో "మీరు నా కొడుకు గురించి చెప్పకపోతే శపిస్తాను" అని ఆగ్రహించాడు.పంచభూతాలు విషయం చెప్పాయి.శుకుడిని వెతుకుతూ వ్యాసుడు బయలుదేరాడు. కొద్ది దూరంలో ఆకాశ మార్గంలో శుకుడు వెళ్తూ కనిపించాడు. వ్యాసుడు పిలుస్తున్నా శుకుడు పట్టించుకోకుండా వెళ్తున్నాడు. దారిలో ఒకచోట దేవకన్యలు స్నానం చేస్తున్నారు. వారి నవయవ్వనంలో ఉండి దిగంబరం గా వెళ్తున్న శుకుడిని చూసి కూడా ఏ మాత్రం పట్టించుకోకుండా స్నానం కొనసాగించారు. వెనుకనే వేదవ్యాసున్ని చూసి సిగ్గుపడి బట్టలు వేసుకోవడం మొదలుపెట్టారు. ఇది చూసి వ్యాసుడు ఆశ్చర్యంతో" ఓ అమ్మాయిలారా! మీరు యవ్వనంలోని నా బిడ్డను చూసికూడా సిగ్గుపడలేదు. కాని ముసలివాడినైన నన్ను చూసి సిగ్గుపడుతున్నారు. ఎందుకు?" అని అడిగాడు.అప్పుడు దేవకన్యలు "మీ కుమారుడు నవయవ్వనం లో ఉన్నా అతడు జితేంద్రియుడు, ఎలాంటి బంధాలు లేనివాడు. కాని మీరు మీ పుత్రుడికి బ్రహ్మజ్ఞానం ఉపదేశించికూడా ఇంకా కొడుకు అనే భ్రాంతిని వదలలేకపోయారు. అందువలన మిమ్ములను చూసినప్పుడు మాకు సిగ్గు కలిగింది. మీ కొడుకుని చూసినప్పుడు మాకు ఎలాంటి వికారము కలుగలేదు" అన్నారు.

ఇదీ శుకమహర్షి చరిత్ర.

*శుకుడి విశేషాలు:*

1.తిరుమల శ్రీవేంకటేశ్శ్వరస్వామికి పద్మావతితో పెళ్ళికి ముహూర్తం పెట్టింది శుకమహర్షియే. 

2.శుకుడి గురించి పరమశివుడు పార్వతితో " ఓ దేవీ!భగవద్గీత సారాంశము శ్రీకృష్ణుడికి తెలుసు, నాకూ మరియు శుకుడికి పూర్తిగా తెలుసు. వేదవ్యాసుడికి తెలిసుండవచ్చు కొద్దిగా" అని అన్నాడు.

3.మహాభాగవతాన్ని పరీక్షిత్ మహారాజుద్వారా ప్రపంచానికి అందించినది శుకమహర్షియే.

శ్రీనాధ కవితా వైభవం!

 శ్రీనాధ కవితా వైభవం!


            

             ఉ:  ఎక్కడ లేరె  వేల్పులు సమీప్సిత దాతలు,  ముద్దుకూన !  నీ


                   వెక్కడ ?  ఘోర వీర  తపమెక్కడ ? యీపటు  సాహసిక్యమున్


                   తక్కు ,'శిరీషపుష్ప మవధాన పరత్వమునన్    మధువ్రతం


                  బెక్కిన  నోర్చునో?  విహగ  మెక్కిన  నోర్చునొ ?  నిశ్చయింపుమా?


                    హరవిలాసం--  4: ఆ:   శ్రీనాధ మహాకవి!


                        ఓముద్దుకూనా!పార్వతీ !కోరిన కోర్కెలు  దీర్చుటకు,   దేవత  లెందరోగలరుగదా! పరమేశ్వరుని గూర్చియే తపమేల? సుకుమారివి నీవిక్కెడ?  ఘోర మైన  యీకఠోర తపమెక్కడ?   ఈదుస్సాహసమును  వీడుము, దిరిసెనపూవుపై  తుమ్మెద వ్రాలిన  నోర్చునుగాని, గ్రద్దవ్రాలిన నోర్వ నేరదుగదా!  యని దీనిభావము.


                    పార్వతి  పరమేశ్వరుని  భర్తగా బడయఁ గోరి  తపమాచరింపఁ  బోవుచు ,తండ్రి హిమవంతుని  యనుజ్ఙ బడయుటకేగ, గిరిజ నిశ్చయమును విని,  సుకుమారివి  నీవు తపమొనరింపలేవు. ఈదుస్సాహసమున  వీడుమని  హిమవంతుడామెకు నచ్చజెప్పు సందర్భము. 


                "దిరిసెన పూవు  మిగుల మృదువైనది. అది తుమ్మెద సోకు నోర్చునుగాని, బలమైన పక్షి సోకు నోర్వజాలదని చెప్పుచు, అన్యాపదేశముగా  శంకరునితో  నీకు  పొందు అనుచితము. అనిసూచించెను.


                  పార్వతిని  శిరీషపుష్పముతో బోల్చి  యామె సుకుమార ప్రకృతిని, శంకరుని యందు విహంగోపమమును, జెప్పి యతని మొఱటుతనమును  కవి నిరూపించెను.


                             ఈరీతిని శ్రీనాధుని కవిత్వము  వ్యంగ్య  వైభవ  విలసితమై  యొప్పారును!


                                                  నిదర్శనాలంకారము.


                                                           స్వస్తి!🙏🙏🌷🌷👌

విన్నదేదో

 .   

                  *_-|¦¦|శుభోదయమ్|¦¦|-_*


                        _*సుభాషితమ్*_


𝕝𝕝శ్లోకం𝕝𝕝


*క్షత్రియో బాహువీర్యేణ*

*తరేదాపదమాత్మనః౹*

*ధనైర్వైశ్యశ్చ శూద్రశ్చ* 

*మంత్రైర్హోమైశ్చ వై ద్విజః౹౹*


తా𝕝𝕝 

క్షత్రియుడు తనకు ఆపద కలిగినప్పుడు బాహుబలంతో బయటపడాలి... ధనంతో వైశ్య శూద్రులు... *మంత్రాలు, హోమాలతో బ్రాహ్మణుడు* 

ఆపదల నుంచి ముక్తులు కావాలి.....

-----------------------------------------------------------


𝕝𝕝శ్లోకం𝕝𝕝


*_యచ్ఛ్రుతం న విరాగాయ*, 

*న ధర్మాయ, న శాంతయే_*

*_సుశబ్దమపి శబ్దేన* 

*కాకవాశితమేవ తత్....._*


తా𝕝𝕝

*విన్నదేదో వైరాగ్యాన్ని కలిగించకపోతే, ధర్మాచరణకు ప్రోత్సహించకపోతే, శాంతిదాయిని కాకుంటే* – అది ఎంత గొప్ప సుశబ్ద మైనా , కేవలం కాకి అరుపుగానే భావించాలి.....

ధనముల కన్నను


*కం*

ధనముల కన్నను భువిలో

మనసుల నవగతమునొందు మనుషుల నొందన్

ఘనముగ బతుకంగ దగును

మనుగడ సూక్ష్మంబిదియని మరువకు సుజనా.

*భావం*:-- ఓ సుజనా! ధనముల కన్నా మన మనస్సు ను అర్థం చేసుకునే మనుషుల ను సంపాదించగలిగితే గొప్పగా బతకగలమనే మనుగడ సూక్ష్మము ఇదే అని మరువవద్దు.

*** *కొంపెల్ల శ్రీనివాస శర్మ*


*కం*

నడిచే దైవము గోవగు

నడిపించెడివాడు భువిని నారాయణుడౌ.

ఎడబాయని హితము శివుడు

కడవరకీ కరణి తలువ ఘనుడగు సుజనా.

*భావం*:-- ఓ సుజనా! నడిచే దైవము ఆవు,నిన్ను నడిపించేవాడు నారాయణుడు, నిన్ను విడిచిపెట్టకుండా ఉండే శ్రేయోభిలాషి శివుడు అని చివరి వరకూ నమ్మినచో గొప్పవాడవగుదువు.

*** *కొంపెల్ల శ్రీనివాస శర్మ*

మనసుకు బాధాకరంగా ఉండదు.

 *1795*

*కం*

మనసుకు నచ్చిన వారలు

మనసు కు గాయంబుజేయ మదినొచ్చదయా.

మనలకు నహితులు మనకిడు

ఘనసత్కారంబుగూడ కటువే సుజనా.

*భావం*:-- ఓ సుజనా! మనసుకు నచ్చిన వారు మన మనసు ను గాయం చేసిన నూ మనసుకు బాధాకరంగా ఉండదు. మనకు నచ్చని వారు మనకు గొప్ప సత్కారాలు చేసిన నూ కటువుగా నే అనిపిస్తుంది.

*** *కొంపెల్ల శ్రీనివాస శర్మ*

3 D Art