18, సెప్టెంబర్ 2021, శనివారం

వ్యాక్సినేషన్

 *వ్యాక్సినేషన్ ప్రక్రియ*

--------------------------------------------

ప్రతి రోజు మన దేశాన్ని దుమ్మెత్తి పొసే, విషం చిమ్మే భారత వ్యతిరేక శక్తులు ' సైలెంట్ ' అయిపోయాయి. ఎందుకో ?  


పాపం , కోవిడ్ దెబ్బకు భారత్ సర్వనాశనం అవుతుంది , వ్యాక్సీన్లు తయారుచేసుకోలేక , బయటినుండి కొనలేక , ముందు నుయ్యి , వెనుక గొయ్యి తరహాలో భారత కేంద్రప్రభుత్వం దారుణంగా విఫలమయ్యి , దేశంలోనూ , ప్రపంచదేశాల్లోనూ చెడ్డపేరు తెచ్చుకొంటుంది , అపుడు మనం శవాలపైకి రాబందులు వచ్చి వాలినట్టు వాలిపోయి , పీక్కుతిని సంతోషిద్దాం అనుకొన్న శక్తుల మెరుపుకలలు , పీడకలలుగా మారిపోయాయి. 


మన దేశం ఈరోజు ఉదయం 7 గంటల సమయానికి 73 , 80 , 43 , 125 మందికి వ్యాక్సీన్ వేసింది. ఈ సందర్భంగా భారత కేంద్రప్రభుత్వానికి , శాస్త్రవేత్తలకు , డాక్టర్లు , ఇతర వైద్య సిబ్బందికి , [ కేరళ , మహారాష్ట్ర మినహా ] అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు హృదయపూర్వక అభినందనలు . ఎందుకంటే కేరళ , మహరాష్ట ప్రభుత్వాల తప్పుడు నిర్ణయాలే అక్కడ కోవిడ్ కేసులు , మరణాలు విపరీతంగా పెరిగేందుకు కారణమయ్యాయి కాబట్టి . 


ఆ భారత వ్యతిరేక శక్తులు ఏవి ?  


.ఫిబ్రవరి 26 , 2021 నాడు ' The Hindu అనే ఇంగ్లీషు దినపత్రిక ఇలా వ్రాసింది[ వ్యాసం చివర లింక్ కూడా ఇచ్చాను] : '' జూలై 2021 చివరి కల్లా దేశంలో 40 కోట్ల మందికి టీకాలు వేస్తామని కేంద్ర ప్రభుత్వం చెపుతోంది. కానీ అది అయ్యేపని కాదు.'' 


 **కానీ జరిగిందేమిటి ? జూలై 17 కల్లా 40 కోట్ల మందికి టీకా వేయగలిగాం*. జూలై లో ఇంకా 14 రోజులు మిగిలివుండగానే లక్ష్యం చేరుకొన్నాం. పాపం ,కమ్యూనిస్టు ' ది హిందూ ' పత్రిక ఎంత బాధపడి వుంటుందో ! ఇదే పత్రిక ఈ సంవత్సరం చైనా స్వాతంత్రదినోత్సవం రోజున ఇక్కడ భారత్ లో తన పత్రికలో అత్యధిక పేజీలు కేటాయించి చైనా చేసిన ప్రగతి ని తెగ మెచ్చుకొంది. అంత పెద్ద ఎత్తున చైనా ప్రభుత్వం ' ది హిందూ ' పత్రికకే యాడ్ లు , అందుకయ్యే డబ్బులు ఇచ్చింది ? ఎందుకంటే చైనాది , ది హిందూ పత్రికది ఒకే సిద్ధాంతం కాబట్టి ! భారత - వ్యతిరేక కమ్యూనిస్టు సిద్ధాంతం . 


మరో కమ్యూనిస్టు పత్రిక The Wire వ్రాసింది : '' చూడండి , న్యూజిలాండ్ ఎంత చక్కగా టికాలో వేస్తున్నదో ! అందుకే ఓ న్యూజిలాండ్ ప్రధాని అయిన Jacind Ardern గారూ , మీరు ఇండియాకు వచ్చి ఇక్కడి కేంద్ర ప్రభుత్వానికి సలహాలు ఇవ్వండి ''   


అవునా ? ఈ మూర్ఖ జర్నలిస్టులకు దిల్లీ నుండి వెళ్ళి న్యూజిలాండ్ లో వుంటున్న మన భారత మహిళ చక్కటి జవాబు ఇచ్చింది : *మీకు తెలియని విషయాలు వ్రాయకండి. నేను న్యూజిలాండ్ లో వుంటున్నాను. ఇక్కడి పరిస్థితి మీరు అంటూన్నట్టు లేదు. ఇప్పటికి మూడు మార్లు ' వచ్చి వ్యాక్సీన్ వేయించుకోండి ' అని నాకు మెసేజ్ వచ్చింది. వెళ్ళిన ప్రతి సారీ ' స్టాకు లేదు , మళ్ళీ పిలుస్తాం* '' అని చెప్పారు. నాకు ఇంకా వ్యాక్సీన్ వేయలేదు. నాలాగా ఇంకా చాలామంది వున్నారు.''  


అయినా , న్యూజిలాండ్ జనాభా ఎంతండీ ? కేవలం 49.4 లక్షలు మాత్రమే. మన దేశంలో ఒక్క రోజు రైళ్ళలో ప్రయాణం చేసేవారి సంఖ్యనే 2.2 కోట్లు. ఏనుగును ఎలుకపిల్ల తో పోలుస్తారా ? వ్యాసం వ్రాసేముందు జర్నలిస్టులు home work చేయాల్సిన అవసరం లేదా ? మన దేశం జనాభా ఎంత ? వాతావరణం లో వైవిద్యతలు , ప్రతికూలతలు ఎన్ని ? విస్తీర్ణం ఎంత ? ప్రాంతాల మధ్య దూరం ఎంత ? వరదలు , వానలను అధిగమించి మన వైద్య సిబ్బంది చేస్తున్న ఈ మహా యఙ్ఞాన్ని గుర్తించి , గౌరవించాల్సిన బాధ్యత మనపై లేదా ?   


*చుక్కల్లాంటి ఈ లెక్కలు చూడండి* ! 


రోజుకు మన ఉత్తరప్రదేశ్ వేస్తున్న టీకాలు - 11. 73 లక్షలు 

వాళ్ళ అమెరికా వేస్తున్న టీకాలు - 8.07 లక్షలు 


మన గుజరాత్ - 4.8 లక్షలు

వాళ్ళ మెక్సికో - 4.56 లక్షలు 


మన కర్నాటక - 3.82 లక్షలు 

వాళ్ళ రష్యా - 3.68 లక్షలు 


మన మధ్య ప్రదేశ్ - 3.71 లక్షలు 

వాళ్ళ ఫ్రాన్స్ - 2.84 లక్షలు 


మన హర్యానా - 1.52 లక్షలు 

వాళ్ళ కెనడా - 0.85 లక్షలు 


*తిక్క కుదిర్చే మరిని లెక్కలు* ! 


ఇంగ్లాండు టీకా మొదలుపెట్టింది - 8 డిశెంబరు 2020 

ఈరోజు దాకా వేసిన టీకాలు - 9 22 90 799 

అమెరికా - 14 డిశెంబరు 2020 

ఈ రోజు దాకా - 37 94 72 220 

ఇటలీ - 27 డిశెంబరు 2020 

ఈరోజు దాకా- 8 072 3 168   

జర్మనీ - 27 డిశెంబరు 2020 

ఈరోజు దాకా - 10 39 81 687 

ఫ్రాన్స్ - 27 డిశెంబరు 

ఈరోజు దాకా - 9 0854 758 

భారత్ - 16 జనవరి 2021 

ఈ రోజు దాకా - 73 80 43 125 


చైనా రోజుకు సగటున వేస్తున్న టీకాలు - 61 52 286 

*భారత్ రోజుకు సగటున వేస్తున్న టీకాలు - 76 58 911*  


మరికొంత మంది [కేంద్ర ప్రభుత్వమంటే గిట్టని వారు ] అంటారు - 2 డోసులు తీసుకొన్న వారి శాతం అమెరికా లో చాలా ఎక్కువగా వుంది , ఇండియాలో చాలా తక్కువగా వుంది. కావచ్చు. లోపాలనే చూపాలనుకొనేవారు , మనం విజయాలు సాధించినపుడు ఎందుకు మౌనంగా వుంటారు ? 

అమెరికా మరియు ఇతర దేశాల్లో వ్యాక్సీన్ ను అనుమానించి , వ్యాక్సీన్ వేయించుకోవద్దని చెపుతూ , కేంద్ర ప్రభుత్వం పంపిన వ్యాక్సీన్ ను నలభై , యాభై రోజులు వాడకుండా పెట్టుకొన్న రాష్ట్ర ప్రభుత్వాలు వున్నాయా ? *కేంద్ర ప్రభుత్వాన్ని అడుగడుగునా ఇబ్బంది పెట్టిన ప్రతిపక్ష పార్టీలు , నాయకులు , The Hindu , The Wire , The Print , NDTV లాంటి మీడియా సంస్థలు , అరుంధతీరాయ్ , రాణా అయూబ్ , బర్ఖా దత్ , సిద్దార్థ వరదరాజన్ , శేఖర్ గుప్తా లాంటి మేధావులు [ అట ] విదేశాల్లో వున్నారా* ? 

కానీ భారత్ లో గజానికో గాంధారిపుత్రుడు ! 


*కీర్తి పతాకం ఎగరేసిన మన భారత శాస్త్రవేత్తలు* ! 


గతం 


BCG టీకా ను విదేశాల్లో 1927 తీసుకువస్తే ఇండియాలో 1951 లో తయారుచేసి , 1978 లో అందుబాటులోకి తెచ్చారు. పోనీలే 1947 దాకా మనకు స్వాతంత్రం లేదు అనుకొంటే , DPT టీకా విదేశాల్లో 1948 లో వచ్చింది , ఇండియాలో 1978 లో అందుబాటు లోకొచ్చింది. OPV విదేశాల్లో 1961 లో వస్తే , ఇండియాలో 1978 దాకా రాలేదు , TT ఇంజక్షన్ విదేశాల్లో 1926 లో వస్తే ఇండియా లో 1983 లో అందుబాటు లోకొ వచ్చింది. 57 ఏళ్ళు పట్టింది ! Measles టీకా 1963 లో విదేశాల్లో ప్రవేశపెడితే , ఇండియాలో 1985 లో వచ్చింది , Hepatitis B టీకా విదేశాల్లో 1982 లో వస్తే , ఇండియా లో 2002 దాకా రాలేదు , Rotavirus టీకా విదేశాల్లో 2006 లోవస్తే , ఇండియా లో 2014-15 లో వచ్చింది. కానీ , కానీ , కానీ *COVID-19 టీకా మాత్రం విదేశాల్లో 2020 డిశెంబరు లో అందుబాటులోకి వస్తే భారత్ లో 2021 జనవరి లోనే అందుబాటులోకి వచ్చేసింది*. అంటే కేవలం 30 రోజుల తేడాతోనే ! 

1947 నుండీ ఈదేశాన్ని 2014 దాకా ఎక్కువ కాలం ఎవరు పరిపాలించారు ? ఆ సమయంలో సైన్సుకు , సైంటిస్టులకు ప్రోత్సాహం , ప్రేరణ ఇచ్చివుండింటే , అవసరమైన నిధులు , వసతులు ఇచ్చివుండింటే , విద్యాసంస్థలను తమ నాయకత్వాన్ని , తమ పార్టీని పొగిడేవాళ్ళతో కాక , ప్రతిభ , అంకితభావం , దేశభక్తి వున్న మేధావులతో నింపివుండింటే మన సైన్సు ఎంత గొప్పగా వుండిండేది !

 మన శాస్త్రవేత్తలు ఇతర దేశాల శాస్త్రవేత్తలతో పోటీపడి ఇప్పుడు 2020-21 లో తమ ప్రతిభను చూపి , అతితక్కువ సమయంలో అద్భుతమైన టీకాను కనుక్కొని దేశాన్ని కరోనా నుండి కాపాడగలిగారు ? ఆ శాస్త్రవేత్తలకు , సంస్థలలకు ప్రేరణ , స్పూర్తి ఇచ్చి , ప్రోత్సహించి , పూర్తీ స్వేచ్చను కల్పించి, జాప్యం లేకుండా దండిగా నిధులను అందించిన దేశ నాయకత్వాన్ని - మన పార్టీలు , సిద్ధాంతాలు పక్కనపెట్టి - అభినందించకపోతే తప్పు మనదే అవుతుంది. 


*ఇపుడు మనం చూస్తున్నది బానిసమనస్తత్వం కలిగిన ' ఇండియా ' కాదు , సమృద్ధ , సుధృఢ , ఆత్మనిర్భర ' భారత్. ' , వివేకానందుడు , అరవిందఘోష్ , సుభాష్ బోస్ , అంబేడ్కర్ , సివి రామన్ , హోమీబాబా ,Abdul Kalam కలలుగన్న భారతదేశం కోసం పనిచేద్దాం*🚩🚩🚩 

        భారత్ మాతాకీ జై.

భార్యాభర్తల కథ

 🌹🌹🌹🌹🌷🌷🌹🌹🌹🌹

*ఓ భార్యాభర్తల కథ.*(అనేక మలుపులతో)

😃😂😃😊😂😃

*ఒక మహిళ షాపింగ్కు వెళ్ళింది. అంతా పూర్తయ్యాక క్యాష్ కౌంటర్ వద్దకు వచ్చి, బిల్లు చెల్లించడానికి తన హేండ్ బ్యాగ్ తెరిచింది. క్యాషియర్ ఆమె బ్యాగ్లో ఒక టీవీ రిమోట్ గమనించాడు.* 


*అతను ఉండబట్టలేక ఆడిగేసాడు. "మీరు ఎప్పుడూ మీ టీవీ రిమోట్ను మీతో తీసుకువెళతారా?"అని.*


*ఆమె "లేదు, ఎప్పుడూ కాదు. ఈరోజు మావారు క్రికెట్ మ్యాచ్ ఉందని చెప్పి నాతో పాటు షాపింగ్ కి రాలేదు అందుకే నేను రిమోట్ తీసుకుని వచ్చేసా..." అంటూ తన క్రెడిట్ కార్డ్ ఇచ్చింది.*


*నీతి: మీ భార్య మాట వినండి. ఇంకా, ఆమెకు అవసరమైన పనుల్లో సహకారం అందించండి.....* 


*కథ ఇంతటితో అయిపోలేదు ...* 


*క్యాషియర్ నవ్వుతూ ఆమె కొన్న వస్తువులన్నీ తిరిగి తీసుకున్నాడు.* 


*ఊహించని ఈ సంఘటన చూసి ఆమె నిర్ఘాంతపోయి "ఏమైంది..!!" అని క్యాషియర్ అడిగింది.*


*అతను చెప్పాడు, “మీ భర్త మీ క్రెడిట్ కార్డును బ్లాక్ చేసారు .....”* 


*నీతి: మీ భర్త అభిరుచులను ఎల్లప్పుడూ గౌరవించండి.* 


*భార్య ఈసారికి తన భర్త క్రెడిట్ కార్డును పర్స్ నుండి తీసి స్వైప్ చేసింది.* *దురదృష్టవశాత్తు అతను తన సొంత కార్డును బ్లాక్ చేయలేదు.* 


*నీతి: మీ భార్య యొక్క శక్తిని మరియు జ్ఞానాన్ని తక్కువ అంచనా వేయవద్దు ..* 


*కథ ఇంకా అయిపోలేదు ...*


*స్వైప్ చేసిన తర్వాత, యంత్రం 'మీ మొబైల్ ఫోన్కు పంపిన పిన్ను నమోదు చేయండి' అని సూచించింది .......*


*నీతి: ఒక్కోసారి మనిషి ఓడిపోయినప్పుడు, సాంకేతికత రక్షిస్తుంది..!* 


*కథ కొనసాగుతుంది ....* 


*ఆమె మరలా నవ్వి, తన పర్సులో మెసేజ్ శబ్దంతో మోగిన మొబైల్ ను  బయటకు తీసింది.*

*అది తన భర్త ఫోన్. ఆమె దానిని రిమోట్ కంట్రోల్తో బాటుగా తీసుకుని వచ్చేసింది.. ఎందుకంటే, తన షాపింగ్ సమయంలో భర్త తనకు కాల్స్ చేసి విసుగించకుండా ఉండేందుకు. చివరకు ఆమె తన షాపింగ్ పూర్తి చేసుకొని సంతోషంగా ఇంటికి తిరిగి వచ్చింది.* 


*నీతి: ఎప్పుడూ మీ భార్యని తక్కువ అంచనా వేయవద్దు!*


*కథ కొనసాగుతుంది ....* 


*ఆమె ఇంటికి చేరుకునేసరికి బయట అతని కారు లేదు.* 


*ఒక నోటు తలుపు మీద అతికించబడి  ఉంది.* 

*అందులో ఇలా రాసుంది...*


*"రిమోట్ దొరకలేదు. మ్యాచ్ చూడటానికి ఫ్రెండ్స్ తోబాటు బయటకు వెళ్తున్నాను. నేను వచ్చేసరికి ఆలస్యం అవుతుంది. నీకు ఏదైనా అవసరమైతే నా ఫోన్ కు కాంటాక్ట్ చెయ్యు...."*

*ఇంటి తాళాలు కూడా తనతోబాటే తీసుకుపోయాడు*


*నీతి: మీ భర్తను నియంత్రించడానికి ప్రయత్నించవద్దు.*🙏🙏

సంసారం - సరిగమలు*

 భాస్కర రాజు గారి ప్రేరణతో ------


 *సంసారం - సరిగమలు*

           *కారణాలు*

       *****************

   (పద్య నడక - కందము)

1.

పతిని గనక విడిచుండెడి

స్థితి గతు లెఱుగని సతులకు

                 స్థిరమెటులమరూ !?

సతిని గనక పరసతులను

అతికుతులతొ వెంబడించి

                        చతికిల బడరా !


2.

గతి సుగతి ప్రగతి ప్రదముగ

బతుకుతు కొనసాగుతున్న

                  పరువము పదిలం !

కుతు లెఱుగని సతి పతులది

గతులెటులనొ సుగతి ప్రగతి

                    గాంతు లెటులనో !


3.

విసుగులతో లొసుగులతో

కసురు కొనెడి సతి పతులది

                    కాపురమెటులో !

కసుబుసు లాటలె ఎపుడును

ఇసుమంతయు ఇంపు సొంపు

                   ఇముడ దింటిలో !


4.

కుతి గలిసిన మతి గలిగిన

సతి పతులదె అసలు సిసలు

                     సంసారముహో !

ప్రతి కాపుర మిటులుండిన శ్రుతి మితి మీరద హాయిగ

                   శృంగార ముగన్ !


5.

ఈ నడవడి గల ఇంటిలొ

ఆనద ఆ స్వర్గము అహ !

                    ఆనందము నన్ !

జ్ఞానము ఆ యింటిలొ అ -

జ్ఞానమ్మును రూపు మాపు

                    జాణ యగునుగా !


6.

శ్రుతి కుతి గల సతి పతులే

అతిగా రాణించి ప్రేమ

                       పారాయణులై

భృతి అతి రుచి గల నిపుణత

చతికిల బడకుండ నెపుడు

                       సాగద ప్రీతిన్ !


7. 

మితి మీరిన చెడు మతులతొ

స్థితి గానక నిక్కి నీల్గు

                   స్థితిలో యటులే 

హితమెవరిది వినరు కనరు !

చితి సహితము ఈసడించు

స్థితి అది గాదా !


        ****************

రచన :---రుద్ర మాణిక్యం (✍️కవి రత్న) జగిత్యాల.

****************************

కాశ్మీర్ పై UN లో జరిగిన చిన్న చర్చ...

 కాశ్మీర్ పై UN లో జరిగిన చిన్న చర్చ...


ఎప్పటి లానే భారత్ పై పడి ఏడ్చిన పాకిస్థాన్ ప్రతినిధి...


ఇక భారత ప్రతినిధి తన వాదన వినిపించడానికి నిలబడ్డారు. ఐతే తన వాదన వినిపించే ముందు భారత మునీశ్వరులైన కశ్యప ముని గురించి ఒక చిన్న విషయం సభకి చెప్పేందుకు అనుమతి కోరారు...


అనుమతి లభించగానే చెప్పటం ప్రారంభించారు...


"ఎవరి పేరుమీదనైతే కాశ్మీర్ పేరు ఏర్పడిందో, ఆ మహర్షి దేశాటన చేస్తూ కాశ్మీర్ ప్రాంతానికి చేరారు...


కాశ్మీర్ ప్రాంత సౌదర్యాలకి ముగ్దులైన వారు, స్నానం ఆచరించడానికి, తన వస్త్రాలని ఒడ్డుపై వదలి, ఆ దగ్గరలో ఉన్న సుందర కొలనులోకి దిగారు...


ఐతే స్నానమాచరించి ఒడ్డుకి చేరిన వారికి, వారు వదలి వెళ్ళిన వస్ర్తాలు కనపడలేదు...వాస్తవానికి ఆ వస్ర్తాలను ఒక పాకిస్థానీయుడు దొంగిలించాడు..."


ఈ మాట చెప్పగానే పాకిస్థాన్ ప్రతినిధి లేచి తన నిరసన తెలియజేస్తూ ఇలా అన్నాడు...


"ఇదంతా అవాస్తవం. అభూత కల్పన. అసలు ఆ సమయానికి పాకిస్థాన్ అనేదే లేదు..."


భారత ప్రతినిధి చిరునవ్వుతో ఇలా అన్నారు...

"ఇదీ విషయం... ఈ పాకిస్తానీయులు కాశ్మీర్ మాది అంటారు..."అసలు పాకీస్తాన్ అనేదే లేదు అని మరచిపోతుంటారు అని అన్నారు.

😜😂😃


వెనువెంటనే సభ యావత్తు చప్పట్లతో నిండిపోయింది.. 

😂😝😜👏👏👏


ఎవరు ఎవరిది లాక్కుపోయారు...? ఎవరు దేనిని తమదని వాదిస్తున్నారు...? దేని గురించి మన సైన్యం అహర్నిశలు శ్రమ పడవలసి వస్తోంది ? 


అటువంటి రావణకాష్టాన్ని ఓట్ల దృష్టితో చూడకుండా, ధైర్యంగా ముందుకెళ్ళి ఒక logical end కి తీసుకొచ్చిన ప్రస్తుత కేంద్ర ప్రభుత్వ చర్య, ఏకోణంలో చూసినా అభినందనీయం..

ప్యారిస్ ఆఫ్ ఆంధ్రా

 ప్యారిస్ ఆఫ్ ఆంధ్రా అని ఏ పట్టణానికి పేరో తెలుసా. కొన్ని విషయాలను సంకేత రూపేణ తెలుపగలను. కాని ఆ పట్టణాన్ని కనుక్కోవడం మీ వంతే మరి. సరేనా. ప్రారంభిద్దాం. 


1. మూడు కాలువల మధ్య ఈ ప్రాంతం ఏర్పడింది.    


2. ప్యారిస్ లో వలే ఈ పట్టణంలో కూడా మెయిన్ రోడ్ కి రెండు వైపులా పెద్ద కాలువలు ఉండటం వలన ఈ పట్టణానికి ఈ పేరు స్థిరపడ్డది. 


3.వైకుంఠ పురం అనే అద్భుతమైన వేంకటేశ్వర స్వామి ఆలయం ఇక్కడ ఉంది. ఇంకా అనేక ప్రసిద్ధ ఆలయాలు ఉన్నాయి.  


4. ఎక్కడా లేనటువంటి దొంగరాముడి గుడి ఇక్కడ ఉండటం ఓ విశేషం. ఒక్క రాత్రిలో దొంగతనంగా రాముడి గుడి కట్టడం వల్ల ఆ పేరు వచ్చిందిట.  


5. బంగారు నగల ఆభరణాలకి ప్రసిద్ధి పొందిన పట్టణం ఇది.    


6. ఆంధ్రప్రదేశ్ లో మొట్టమొదటి ముద్రణా యంత్రం ఇక్కడ 1930లో స్థాపించబడింది. పేరు కాకుమాన్ ప్రెస్.  


7.ఫౌంటెన్ పెన్నుల తయారీకి కూడా వెరీ ఫేమస్.  


8.వివిధ కళాకారులకి, సాహితీవేత్తలకి నిలయం ఈ పట్టణం. వివిధ రంగాల్లో సుమారు 200 మంది ప్రముఖులను మనకి అందించిన గొప్ప పట్టణం.  


9.వారిలో కొంతమంది ప్రముఖుల పేర్లు తెలుసుకుందాం. వికటకవి తెనాలి రామకృష్ణ, ఆంధ్రప్రదేశ్ లోనే తొలి మహిళా డాక్టర్ సత్యవతీ దేవి, పాప్యులర్ షూ మార్ట్ వ్యవస్థాపకుడు చుక్కపల్లి పిచ్చయ్య, అవార్డు విన్నింగ్ రచయిత్రి వాసిరెడ్డి సీతాదేవి, వై నాయుడమ్మ, తొలి తెలుగు సూపర్ స్టార్ కృష్ణ, కళా వాచస్పతి కొంగర జగ్గయ్య, హంపీ సుందరి నటి జమున, గుణచిత్ర నటుడు గుమ్మడి, నటి ఊర్వశి శారద, తొలి తెలుగు సినీ డ్రీంగర్ల్ కాంచనమాల, హాస్యనటుడు ఏ వి యస్, తొలి తెలుగు నేపథ్య గాయకుడు ఎం ఎస్ రామారావు, విజయా సంస్థ అధినేత చక్రపాణి. ఇంకా కమ్యూనిస్టు వీరులు నండూరి ప్రసాదరావు, ఎం ఎస్ బాలగంగాధర రావు.


ఇప్పుడైనా గుర్తుకొచ్చెనా నేను ఏ పట్టణం గురించి చర్చిస్తున్నానని.

శ్రీమద్భాగవతము

 *18.09.2021*

*వందేమాతరం*


*భక్తపోతన గారి శ్రీమద్భాగవతము:* 🙏  

*రోజుకో పద్యం: 2265(౨౨౬౫)*


*10.1-1383-వ.*

*10.1-1384-*


*క. చేతులఁ దాళము లొత్తుచుఁ*

*జేతోమోదంబుతోడ సిగముడి వీడం*

*బాతర లాడుచు మింటను*

*గీతము నారదుఁడు పాడెఁ గృష్ణా! యనుచున్.* 🌺



*_భావము: అలా కంస సంహారం జరిగిన సమయంలో, నారదమహర్షి ఆకాశసంచారం చేస్తూ, చేతిలోని చిడతలతో వాయిస్తూ, మహానందభరితుడై, సిగముడి వీడిపోయినా గమనించుకోని వాడై, శ్రీకృష్ణలీలలను గానము చేస్తూ నృత్యము చేశాడు._* 🙏



*_Meaning: Sage Narada having observed the destruction of Kamsa, the evil man, from the sky, danced and sang in praise of the mystic and noble deeds of the Almighty Sri Krishna._* 🙏



*-ప్రభాకర శాస్త్రి దశిక (9849795167)*

*శ్రీ రాజమౌళి నిడుమోలు (8977500180) &*

*Kiran (9866661454).*

మనమే మనమని

 *"ఈ పద్యం చూడండి...."*


  *"మనమే మనమని మనమన మనుమని మనుమని మనుమనిమన నమ్మేనా?"*

*"మన మేనమామ మామను మునునేమిన మౌనిమౌని మనమున మౌనమే!"*


 


భావం


*"మనమే = మనం అందరమూ....,"*


 *"మనమని = శాశ్వతం కాదని"*

,

 *"మనమన = బుద్ధీ హెచ్చరిస్తూన్నా"*


*"మనుమని మనుమని మనుమని"* = 

*"పౌత్రునకు పౌత్రునకుృ పౌత్రుని (తన తర్వాత తరాల 7 తరాలు గురించి)"*


*"మననమ్మేనా? = తాపత్రయ పడడమేనా? (కాదు),"*


*"మన మేనమామ =మన మేన మామ అయిన చంద్రుడికి,"*


*"మామను = మామగారైన దక్షప్రజాప్రతిని,"*


*"మును+నేమిన = పూర్వం శిక్షించిన,"*


*"మౌనిమౌని = మునీశ్వరులకి మునీశ్వరుడైన, మునులలో అగ్రగణ్యుడైన శివుని"*


*"మౌనమే = మౌనంగా"*


 *"మనమున = మనస్సు నందు ధ్యానించుట మేలు!!"*


*"అనగా జన్మ పరంపరను కోరడం కంటే జన్మ రాహిత్యమును పొందడానికి మోక్షప్రదాత అయిన శివుని ఆశ్రయించడం మేలు!!"*


*"ఎంతో లోతైన జన్మ రాహిత్యాన్ని భావం చెడకుండా మోక్ష పదమైన మకారంతో మలిచారు."*


 *" తెలుగు భాష గొప్పదనం ఎంత అని చెప్పగలం, మాధుర్యాన్ని ఆస్వాదించడం మినహా..."*

🙏🙏🙏🙏🙏🙏🙏🙏

ప్రమాదకరమైనది కోపం.

 🌷మనిషి స్వభావాల్లో ఎక్కువ ప్రమాదకరమైనది కోపం.

దానికి విరుగుడు హాస్యం. హాస్యచతురత అలవడితే కోపాన్ని నియంత్రించుకోవడం సాధ్యపడుతుంది. అవతలివారి కోపాన్ని చల్లార్చేందుకూ హాస్యం ఉపకరిస్తుంది.


కొన్ని ఉదాహరణలు చూద్దాం.


🌷పేద కుర్రవాడొకడు హోటల్లోకి చొరబడి, మస్తుగా ఫలహారాలు సేవించాడు. సొమ్ము చెల్లించమనేసరికి డబ్బులు లేవని బిక్కమొహం వేశాడు.


 🌷ఆ యజమానికి కోపం ముంచుకొచ్చింది. చాచిపెట్టి

గూబమీద కొట్టాడు. పిల్లవాడు ఆ దెబ్బకు గిర్రున తిరిగి కిందపడ్డాడు.


🌷 కాసేపటికి తేరుకొని, మెల్లగా 'అయ్యా! ఈ లెక్కన నేను రోజూ రావచ్చా' అని అడిగాడు. యజమానికి ముందు నవ్వు వచ్చింది. ఆ తరవాత కన్నీళ్లు వచ్చాయి. కుర్రవాడి మీద అంతలా కోపం ప్రదర్శించినందుకు సిగ్గుపడ్డాడు.


🌷హాస్యప్రవృత్తి మనిషిని ఆరోగ్యవంతుణ్ని చేస్తుంది. 'రోజుకు ఒకసారైనా మనసారా బిగ్గరగా నవ్వని రోజు జీవితంలో వృథా అయినట్లే' అన్నాడొక రచయిత.


'🌷నవ్వడం ఒక యోగం, నవ్వించడం ఒక భోగం, నవ్వలేకపోవడం ఒక రోగం' అని ప్రముఖ సినీదర్శకులు జంధ్యాల చెప్పిన మాట తెలుగునాట విశేషంగా ప్రాచుర్యంలోకి వచ్చింది.


🌷సృష్టిలో నవ్వగలిగే జీవి మనిషి ఒక్కడే! కనుక నవ్వు మనిషిసొత్తు.


🌷నవ్వు నాలుగు విదాల చేటు అనేది నమ్మదగిన మాటకాదు. నవ్వుకుని వదిలేయవలసిన మాట.


'🌷నాలో హాస్యప్రవృత్తి లేకుంటే నేను ఏనాడో ఆత్మహత్యకు పాల్పడవలసి వచ్చేది' అన్నారు గాంధీజీ.


🌷కోపంలోంచి, నిరాశలోంచి తేలిగ్గా బయటపడటానికి మనిషి హాస్య చతురతను అలవరచుకోవాలి.


🌷 ఒక మంత్రిగారి సుపుత్రుడు కళాశాలలో బాగా అల్లరి చేసేవాడు. ఉపాధ్యాయులను ఏడిపించేవాడు. వాణ్ని ఏమీ చెయ్యలేక ఒక తెలుగు మాస్టారు 'ఓరి ఇరవై అయిదూ, ఇరవై ఆరూ! నోర్మూసుకు కూర్చో' అనేవారు.


🌷అది తిట్టో ఏమిటో అర్థమయ్యేదికాదు. చివరికి కళాశాల ఫేర్‌వెల్‌ ఫంక్షన్ లో కొందరు విద్యార్థులు 'గురువుగారూ ఇవాళ చివరిరోజు కదా, ఇవాళైనా ఆ ప్రహేళిక విప్పండి' అని అడిగారు.


 🌷దానికి ఆయన 'తెలుగు సంవత్సరాల పేర్లు వెతుక్కోండి' అన్నారు.


తీరాచూస్తే ఇరవై అయిదు-ఖర, ఇరవై ఆరు- నందన!


        "ఖర నందన"


అంటే, రోజూ వాణ్ని 'గాడిదకొడకా' అని ఆయన కసితీరా తిట్టేవారన్నమాట.



 🌷హాస్యస్ఫురణ కారణంగా ఒకోసారి అనుకోని ప్రయోజనాలు చేకూరుతాయి.


🌷మనిషి విరగబడి నవ్వినప్పుడు మెదడు నుంచి విడుదలయ్యే రసాయనాలు రక్తపోటును తగ్గించి, గుండెను తేలికచేస్తాయని సైన్సు నిరూపించింది. అందుకే వైద్యులు బాగా నవ్వమని సలహా ఇస్తున్నారు. నవ్వును ఒక చికిత్స (లాఫింగ్‌ థెరఫీ)గా ప్రయోగిస్తున్నారు.


 🌷దీని ద్వారా సంబంధాలు మెరుగుపడతాయి. ఆరోగ్యం బాగుపడుతుంది. ఆయుర్దాయం పెరుగుతుంది.


' 🌷ఖరీదైన సౌందర్య లేపనాలకన్నా మనిషి మొహాన్ని ఆకర్షణీయంగా చూపించేది- పెదాలపై చక్కని నవ్వే'

గరికపాటివారి హాస్య ప్రసంగం


🌷🌷🌷🌷🌷🌷

ఈరోజు_శనిత్రయోదశి_విశేషం

 *శనివారం, సెప్టెంబర్ 18, 2021*


🕉️🍁🕉️🍁🕉️🍁🕉️🍁 *ఈరోజు_శనిత్రయోదశి_విశేషం*


రేపటి దినము చాలా విశేషమైనదిగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే త్రయోదశి శనివారంతో కలిసిరావడం. 

మనము శని దేవుడిని కేవలం శని అని పిలవము. *శనీశ్వరుడు* అంటాము. అంటే ఆయన ఈశ్వర స్వరూపమైన గ్రహంగా భావిస్తాము. అలాంటి ఈశ్వర స్వరూపమైన శని ని ఈ పవిత్ర దినమున పూజించిన వారికి ఆయన అనుగ్రహం లభిస్తుంది అనడంలో సందేహంలేదు. ఉదయం శనీశ్వరుడిని ప్రదోషంలో ఈశ్వరుడిని ఒకేదినములో పూజించిన వారికి కష్టాలు తప్పినట్లే !

 రేపు అవకాశం ఉంటే ఉదయం శనికి తైలాభిషేకం, ప్రదోషంలో శివుడికి రుద్రాభిషేకం చేయించండి.

వీలుంటే హోమం నల్లనువ్వులు కిలో మరియు నలుపు వస్త్రము దానం చేయడం మంచిది.


రేపు మీరు చదువుకోవలసిన స్తోత్రం💐

కోణస్ధః పింగళో బబ్రుః కృష్ణో రౌద్రంతకో౹ యమః సౌరిః శనైశ్చరో మందహ పిప్పలాదేన సంస్తుత:౹౹


ఓం నమో శనైశ్వరా పాహిమాం, ఓం నమో మందగమనా పాహిమాం, ఓం నమో సూర్య పుత్రా పాహిమాం, ఓం నమో చాయాసుతా పాహిమాం, ఓం నమో జేష్టపత్ని సమేత పాహిమాం, ఓం నమో యమ ప్రత్యది దేవా పాహిమాం, ఓం నమో గృధ్రవాహాయ పాహిమాం !!


*శని జపం చేసుకునే విధానం*

( *ఇది వేదం అర్హులైన వారికి మాత్రమే*)

అస్యశ్రీ శనిగ్రహ మహా మంత్రస్య హిళింభి ఋషిః౹ శనైశ్చర

గ్రహోదేవతా౹ ఉష్టిప్ చంధః! శనైశ్చర గ్రహ ప్రసాద సిద్దర్ధ్యే౹

శనిపీడా నివారణార్ధే శనిమంత్ర జపే వినియోగః౹౹


#కరన్యాసం

ఓం శమగ్ని - అంగుష్టాభ్యాసం నమః

ఓం అగ్నిభిస్కరత్ - తర్జనీభ్యాం నమః

ఓం విష్ణుశంనస్తపతుసూర్యః - మధ్యమాభ్యాం నమః

ఓం శంవాతః - అనామికాభ్యాం నమః

ఓం వాత్వరపాః - కనిష్ఠికాభ్యాసం నమః

ఓం అపశ్రిధః - కరతల కరపృష్టాభ్యాసం నమః #అంగన్యాసము:

ఓం శమగ్ని: - హృదయాయ నమః

ఓం అగ్నిభిస్కరత్ - శివసేస్వాహ

ఓం శంనస్తపతుసూర్యః - శిఖాయైవషట్

ఓం శంవాతః - కవచాయహు

ఓం వాత్వరపాః - నేత్రత్రయాయ వౌషట్

ఓం అపశ్రిధ్ర - అస్త్రాయఫట్

ఓం భూర్భువస్సువరోమితి దిగ్భంధం

ఓం శమగ్ని -- శ్రిదః !!


#వ్యాస_ప్రోక్త_సోత్రం (అందరూ చదువుకోవచ్చు)

నీలాంజన సమాభాసం౹ రవిపుత్రం యమాగ్రజం౹౹ 

ఛాయా మార్తాండ సంభూతం౹ తం నమామి శనైశ్చరం౹౹


*శని కవచ స్తోత్రము*

 శనైశ్చరశ్శిరో రక్షేత్! ముఖం భక్తార్తి నాశనః కర్ణౌకృష్ణాంబరః పాతు!


నేత్రే సర్వ భయంకరః!! కృష్ణాంగో నాసికాం రక్షేత్! కర్ణౌ మేచ శిఖండిజ:! భుజౌమే సుభుజః పాతు!


హస్తా నీలోత్పల ప్రభః! పాతుమే హృదయం కృష్ణ:! కృక్షిం శుష్కోధర స్తధాః! కటిం మే వికటః పాతు!


ఊరూ మే ఘోర రూపవాన్! జానునీ పాతు దీర్ఘోమే! జంఘేమే మంగళ ప్రభః! గల్పౌ గణాకరః పాతు!


పాదౌ మే మంగుపాదకః! సర్వాణిచ మామాచంగాని! పాతు భాస్కరనందనః!


*ఫలశ్రుతి*

య ఇదం కవచం దివ్యం సర్వ పీదాహరం ణాం పఠతి శ్రద్ధయా యుక్తః! సర్వాన్ కామానవాప్నుయాత్!


శని మంగళాష్టకమ్ మందః కృష్ణవిభస్తు పశ్చిమ ముఖః సౌరాష్టవో కాస్యవః!


నక్రేశో ఘటన సుహృద్భుధ భ్రుగుర్వైరీంద్వ వక్ష్యాసుతః!! స్థానం పశ్చిమ దిక్ర్పజాపతిర్యమౌదేవౌ ధనస్త్వాసనం!


షట్రష్ట స్శుభకృచ్ఛమీ రవిసుతః కూర్యాత్సదా మంగళం!!


#శన్యష్టోత్తర_శతనామావళి 

ఓం శనైశ్చరాయ నమః 

ఓం శాంతాయ నమః

ఓం శరణ్యాయ నమః 

ఓం వరేణ్యాయ నమః 

ఓం సర్వేశాయ నమః

ఓం సౌమ్యాయ నమః 

ఓం సురవంద్యాయ నమః 

ఓం సురలోక విహారిణే నమః

ఓం సుఖాననోవిష్టాయ నమః 

ఓం సుందరాయ నమః 

ఓం ఘనాయ నమః

ఓం ఘనరూపాయ నమః 

ఓం ఘనాభరణధారిణే నమః 

ఓం ఘనసారవిలేపాయ నమః

ఓం ఖద్యోతాయ నమః 

ఓం మందాయ నమః 

ఓం మందచేష్టాయ నమః

ఓం మహనీయగుణాత్మనే నమః ఓం మర్త్యపావనపాదాయ నమః

ఓం మహేశాయ నమః 

ఓం ఛాయాపుత్త్రాయ నమః 

ఓం శర్వాయ నమః

ఓం శ్రతూణీరధారిణే నమః 

ఓం చరస్థిరస్వభావాయ నమః 

ఓం చంచలాయ నమః

ఓం నీలవర్ణాయ నమః 

ఓం నిత్యాయ నమః 

ఓం నీలాంబసనిభాయ నమః

ఓం నీలాంబరవిభూషాయ నమః ఓం నిశ్చలాయ నమః 

ఓం వేద్యాయ నమః

ఓం విధిరూపాయ నమః 

ఓం విరోధాధార భూమయే నమః

ఓం వేదాస్పదస్వాభావాయ నమః ఓం వజ్రదేహాయ నమః 

ఓం వైరాగ్యదాయ నమః

ఓం వీరాయ నమః 

ఓం వీతరోగభయాయ నమః 

ఓం విపత్పరంపరేశాయ నమః

ఓం విశ్వనంద్యాయ నమః 

ఓం గృద్రహహాయ నమః 

ఓం గుధాయ నమః

ఓం కూర్మాంగాయ నమః 

ఓం కురూపిణే నమః 

ఓం కుత్సితాయ నమః

ఓం గుణాధ్యాయ నమః 

ఓం గోచరాయ నమః 

ఓం అవిద్యామూలనాశాయ నమః

ఓం విద్యావిద్యాస్వరూపిణే నమః ఓం ఆయుష్యకారణాయ నమః 

ఓం ఆపదుద్దర్త్రే నమః

ఓం విష్ణుభక్తాయ నమః 

ఓం వశినే నమః 

ఓం వివిధాగమనేదినే నమః

ఓం విధిస్తుత్యాయ నమః 

ఓం వంద్యాయ నమః 

ఓం విరూపాక్షాయ నమః

ఓం వరిష్టాయ నమః ఓం వజ్రాంకుశధరాయ నమః 

ఓం వరదాయ నమః

ఓం అభయహస్తాయ నమః 

ఓం వామనాయ నమః 

ఓం జేష్టాపత్నీసమేతాయ నమః

ఓం శ్రేష్టాయ నమః 

ఓం అమితభాషిణే నమః 

ఓం కస్టౌఘనాశకాయ నమః

ఓం ఆర్యపుష్టిదాయ నమః 

ఓం స్తుత్యాయ నమః 

ఓం స్తోత్రగమ్యాయ నమః

ఓం భక్తివశ్యాయ నమః 

ఓం భానవే నమః 

ఓం భానుపుత్త్రాయ నమః

ఓం భావ్యాయ నమః 

ఓం పావనాయ నమః 

ఓం ధనుర్మందల సంస్థాయ నమః

ఓం ధనదాయ నమః 

ఓం ధనుష్మతే నమః 

ఓం తనుప్రకాశ దేహాయ నమః

ఓం తామసాయ నమః 

ఓం అశేషజనవంద్యాయ నమః 

ఓం విశేషఫలదాయినే నమః

ఓం వశీకృతజనిశాయ నమః 

ఓం పశూనాంపతయే నమః 

ఓం ఖేచరాయ నమః

ఓం ఖగేశాయ నమః 

ఓం ఘననీలాంబరాయ నమః 

ఓం కాఠిన్యమానసాయ నమః

ఓం అరణ్యగణస్తుత్యాయ నమః ఓం నీలచ్చత్రాయ నమః 

ఓం నిత్యాయ నమః

ఓం నిర్గుణాయ నమః 

ఓం గుణాత్మనే నమః 

ఓం నిరామయాయ నమః 

ఓం నింద్యాయ నమః

ఓం వందనీయాయ నమః 

ఓం ధీరాయ నమః 

ఓం దివ్యదేహాయ నమః 

ఓం దీనార్తి హరణాయ నమః

ఓం దైన్య నాశకరాయ నమః 

ఓం ఆర్యజనగణణ్యాయ నమః 

ఓం క్రూరాయ నమః

ఓం క్రూరచేష్టాయ నమః 

ఓం కామక్రోధకరాయ నమః 

ఓం కళత్రపుత్త్రశత్రుత్వ కారణాయ నమః

ఓం పరిపోషితభక్తాయ నమః 

ఓం భక్త సంఘమనోభీష్ట ఫలదాయ నమః 

ఓం శ్రీమచ్ఛనైశ్చరాయ నమః


*శని దశనామ స్తోత్రము *

కోనస్తో పింగళ బబ్రుః కృష్ణో రౌద్రాంతకో యమః శౌరి శనైశ్చరో మందః పిప్పళాధీసు శని స్తుతాః


*దశరథ శని స్తోత్రము* 

కోనంతకో రౌద్ర యమాతః బబ్రుః కృష్ణః శనిః పింగళ మందః శౌరీః నిత్య స్మ్రుత్యో హరతే చ పీడః తస్మై నమః శ్రీ రవినందనయా॰


సురా అసురా కింపురుష రాజేంద్ర గంధర్వ విద్యాధర పన్నగాశ్చ పీఢ్యంతి సర్వే విషమ స్థితేన తస్మై నమః శ్రీ రవినందనయా॰


నర నరేంద్ర పశవో మృగేంద్ర వన్యాశ్చ యే కీట పతంగ బ్రింగాః పీఢ్యంతి సర్వే విషమ స్థితేన తస్మై నమః శ్రీ రవినందనయా॰


దేశాచ దుర్గాని వనాని యత్ర శేనానివేశ పుర పట్టణాని పీఢ్యంతి సర్వే విషమ స్థితేన తస్మై నమః శ్రీ రవినందనయా॰


తిలైర్యవైర్మశా గుదాన్నదానై అయోహీన నీలాంబర దానతోవా ప్రీనతి మన్త్రైర్నివాశరేచ తస్మై నమః శ్రీ రవినందనయా॰


ప్రయాగ కూలే యమునా తటేచ సరస్వతీ పుణ్యజలే గుహాయం యో యోగినం ధ్యానగతోపి శూక్ష్మాశ్ తస్మై నమః శ్రీ రవినందనయా॰


అన్య ప్రదేశాత్ స్వగృహం ప్రవిష్తాశ్ తదీయవరేశా నర సుఖేశాత్ గృహద్ గతో యో న పునః ప్రయాతి తస్మై నమః శ్రీ రవినందనయా॰


స్రష్ట స్వయంభూర్ భువన త్రయస్య త్రత హరీశో హరతే పినాకీ ఏకాస్ త్రిధా రిగ్ యజుః సామ వేదాః తస్మై నమః శ్రీ రవినందనయా॰


కోనస్తో పింగళ బబ్రుః కృష్ణో రౌద్రాంతకో యమః శౌరి శనైశ్చరో మందః పిప్పళాధీసు శని స్తుతాః


ఏతాని దశ నామాని నిత్యం ప్రాధయ పటే శనైశ్చర కృత పీడా న కదాచిద్ భవిష్యతి


*దశరథ ప్రోక్త శని స్తోత్రము* 

నమః కృష్ణాయ నీలాయ శిఖిఖండ నిభాయచ౹ నమో నీల మధూకాయ నీలోత్పల నిభాయచ౹ నమో నిర్మాంస దేహాయ దీర్ఘశ్రుతి జటాయచ౹ నమో విశాల నేత్రాయ శుష్కోదర భయానక౹ నమః పౌరుష గాత్రాయ స్థూల రోమాయతే నమః౹ నమో నిత్యం క్షుదార్తాయ నిత్య తృప్తాయతే నమః౹ నమో ఘోరాయ రౌద్రాయ భీషణాయ కరాళినే౹ నమో దీర్ఘాయ శుష్కాయ కాలదంష్ట్ర నమోస్తుతే౹ నమస్తే ఘోర రూపాయ దుర్నిరీక్ష్యాయతే నమః౹ నమస్తే సర్వభక్షాయ వలీముఖ నమోస్తుతే౹ సూర్యపుత్ర నమస్తేస్తు భాస్వతే అభయ దాయినే౹ అధో దృష్టే నమస్తే-స్తు సంవర్తక నమోస్తుతే౹ నమో మందగతే తుభ్యం నిష్ప్రభాయ నమో నమః౹ తపసా జ్ఞానదేహాయ నిత్యయోగరతాయచ౹ జ్ఞాన చక్షుర్నమస్తేస్తు౹ కాశ్యపాత్మజ సూనవే తుష్టోదదాసి రాజ్యం త్యం క్రుద్ధో హరపి తత్‌క్షణాత్౹ దేవాసుర మనుష్యాశ్చ సిద్ధ విద్యాధరోరగాః౹ త్వయావలోకితాస్సౌరే దైన్యమాశువ్రజంతితే౹ బ్రహ్మాశక్రో యమశ్చైవ మునయస్సప్తతారకాః౹ రాజ్యభ్రష్టాః పతం తీహ తవ దృష్ట్యావలోకితాః౹ త్వయావలోకితాస్తే-పి నాశయాంతి సమూలతః౹ ప్రసాదం కురుమే సౌరే ప్రణత్వాహి త్వ మర్ధితః౹౹


   🌹🌷 *సేకరణ*🌷🌹

🕉️🕉️🕉️🛕🛕🕉️🕉️🕉️

           *న్యాయపతి*     

         *నరసింహారావు*

ముఖ్యమైన సందేశం

 చాలా ముఖ్యమైన సందేశం - దయచేసి జాగ్రత్తగా చదవండి, ముందుకు & దీన్ని అనుసరించండి .... 🙏 హై అలర్ట్ -

 సోదర సోదరీమణులందరూ,


 దయచేసి "మీ అన్ని కాంటాక్ట్‌లకు పాస్ చేయండి.


 డాక్టర్ అంజలి మాథుర్,

 ఛైర్మన్ & CMO,

 ఇండో అమెరికన్ హాస్పిటల్ (IAH),

 దక్షిణ డకోటా (యునైటెడ్ స్టేట్స్) ...


 ఈ సందేశం భారతదేశంలోని వైద్యుల బృందం (ప్రజా ప్రయోజనాల కోసం ఫార్వార్డ్ చేయబడింది).


 1) APPY FIZZ తాగవద్దు. ఇందులో క్యాన్సర్ కలిగించే ఏజెంట్ ఉంటుంది ..


 2) కోక్ లేదా పెప్సీ తాగే ముందు లేదా తర్వాత మెంటోస్ తినవద్దు ఎందుకంటే మిశ్రమం సైనైడ్‌గా మారడంతో వ్యక్తి వెంటనే చనిపోతాడు.


 3) కుర్కురే తినవద్దు ఎందుకంటే ఇందులో అధిక మొత్తంలో ప్లాస్టిక్ ఉంటుంది.

 మీరు కుర్కురేను కాల్చండి మరియు మీరు ప్లాస్టిక్ కరగడాన్ని చూడవచ్చు.


 4) ఈ మాత్రలను నివారించండి, అవి చాలా ప్రమాదకరమైనవి:

 * డి-చలి

 * విక్స్ యాక్షన్ -500

 * యాక్టివేట్ చేయబడింది

 * కోల్డారిన్

 * కాసోమ్

 * బాగుంది

 * నిములిడ్

 * సెట్రిజెట్-డి

 అవి ఫినైల్ ప్రొపానాల్-అమిడ్ PPA ని కలిగి ఉంటాయి. ఇది స్ట్రోక్‌లకు కారణమవుతుంది & USA లో నిషేధించబడింది!


 దయచేసి, డిలీట్ చేసే ముందు, మీ స్నేహితులకు పాస్ చేయడం ద్వారా సహాయం చేయండి ..!


 అది ప్రతి ఒక్కరికీ చేరనివ్వండి


 ఇది ఎవరికైనా సహాయపడవచ్చు. మీకు వీలైనంత వరకు ఫార్వార్డ్ చేయండి.


 దయచేసి చదివి ఫార్వార్డ్ చేయండి:


 సిల్వర్ నైట్రో ఆక్సైడ్ వల్ల కలిగే కొత్త క్యాన్సర్‌ని డాక్టర్ ఆఫ్ ఇండో అమెరికా హాస్పిటల్ కనుగొంది. మీరు రీఛార్జ్ కార్డులను కొనుగోలు చేసినప్పుడల్లా, మీ గోళ్ళతో గీతలు పడకండి, ఎందుకంటే ఇందులో సిల్వర్ నైట్రో ఆక్సైడ్ పూత ఉంటుంది మరియు చర్మ క్యాన్సర్‌కు కారణం కావచ్చు. ఈ సందేశాన్ని మీ ప్రియమైనవారితో పంచుకోండి.


 ముఖ్యమైన ఆరోగ్య చిట్కాలు:


 Phone ఎడమ చెవితో ఫోన్ కాల్‌లకు సమాధానం ఇవ్వండి.


 Cold చల్లని నీటితో మీ takeషధం తీసుకోకండి ...

చేతులెత్తి దండం

 🙏🏻 *_అందరికి చేతులెత్తి దండం పెట్ట కూడదా?_* 🙏🏻 🛎 నమస్కారం… భారతీయ సంస్కారం. కాదు, సంస్కృతిలో భాగం. ఇది ఒక గౌరవసూచకం. 👉మనషులందరిలోనూ దైవత్వము ఉంటుందని హిందువులు నమ్ముతారు. దీనినే ఆత్మ అంటారు. 👉నమస్కారం పెట్టడం అంటే మన ఆత్మ ఎదుటి వ్యక్తిలోని ఆత్మను గుర్తించి దానికి విధేయత ప్రకటించడం. 👉కానీ, ప్రతి నమస్కరానికి ఒక విధానం ఉంది. అందరికీ చేతులెత్తి దండం పెట్ట కూడదట. 👉ఎవరికీ ఏ విధంగా నమస్కారం చేయాలి అనే అంశాలను పరిశీలిద్దాం 👉తల్లిదండ్రులకు, గురువుకి, అతిధులకి అందరికంటే ముఖ్యంగా ఆ పరమాత్మకు నిత్యం నమస్కారం చేస్తాం. 👉దేవుళ్లకు చేసే నమస్కారాలు ఒక విధంగా ఉంటాయి , గౌరవపూర్వకంగా మనుషులకు చేసే నమస్కారం మరో రకంగా ఉంటుంది. 👉శివకేశవులకు నమస్కరించేటపుడు తల నుంచి 12అంగుళాల ఎత్తున చేతులు జోడించి నమస్కరించాలి. అంటే చేతులెత్తి నమస్కరించాలి 👉హరిహరులకు తప్ప మిగతా దేవతలకు శిరసు మీద చేతులు జోడించి నమస్కరించకూడదు. 👉గురువుకి వందనం చేసేటప్పుడు ముఖానికి నేరుగా చేతులు జోడించి నమస్కరించాలి . 👉తండ్రికి, ఇతర పెద్దలకు నోటికి నేరుగా చేతులు జోడించాలి. 👉తల్లికి నమస్కరించేటపుడు ఉదరమున నేరుగా చేతులు జోడించి నమస్కరించాలి. 👉యోగులకు, మహానుభావులకు వక్షస్థలం వద్ద చేతులు జోడించి నమస్కరించాలి. 🛎 మన శాస్త్రాలు ఇలా చెప్తున్నాయి.......

నవగ్రహాలకు ప్రదక్షణ

 నవగ్రహాలకు ప్రదక్షణ, దానాదులు!!

నవగ్రహాలకు ప్రదక్షణ, దానాదులు!!  


జాతకం లో ఏ గ్రహం అనుకూలంగా లేదో ఆయా గ్రహాలకు ఆయా రోజుల్లో ప్రదక్షిణ చేయడం ఉత్తమం. ప్రతికూలత అధికంగా వున్నప్పుడు దానాదులు చేయాలి. 


1) మాములుగా అయితే ప్రతిరోజూ నవగ్రహాలకు ఒక్క ప్రదక్షిణ మాత్రమే చేయాలి. 


2) నవగ్రహాలకు సాష్టాంగ నమస్కారం చేయకూడదు. 


3) ఇతరులు ముట్టించిన దీపం తో మనదీపాన్ని వెలిగించరాదు. 


4) శని గ్రహానికి శనివారం మాత్రమే 9 ప్రదక్షిణలు చేయాలి. 


5) మాములు రోజుల్లో నవగ్రహాలకు 9 ప్రదక్షిణలు చేయకూడదు. 


6)శని గ్రహానికి ఎదురుగ నిలబడి నమస్కరించ కూడదు. 


7) గ్రహాల పై మాములు సమయాల్లో పసుపు కుంకుమలు, నవధాన్యాలు వేయకూడదు.


8) నవగ్రహాలకు ప్రదక్షిణ చేస్తున్నప్పుడు విగ్రహాలను తాకకూడదు. 


9) నవగ్రహ ప్రదక్షిణ అనంతరం కాళ్ళు కడగడం చేయరాదు. 


10) ఒక్క శని గ్రహానికి అభిషేకం తర్వాత మాత్రం స్నానము చేయాలి. 


11) ఏ గ్రహానికి మనము గ్రహ ధాన్యాన్ని దానము చేస్తామో ఆ ధాన్యాన్ని ఆరు నెలల వరకు తినకూడదు. ( ముక్యంగా కుజ, శని, రాహు, కేతు, బుధ గ్రహాలకు ) 


12) నవగ్రహాలలో పాటుగా మిగితా దేవతలకు కలిపి ఒకేసారి ప్రదక్షిణ చేయకూడదు. 


13) ఇతరులతో మాట్లాడుతూ, ఇతరులను చూస్తూ గ్రహ ప్రదక్షిణ చేయరాదు. 


14) నవగ్రహ ప్రదక్షిణ సమయం లో నవగ్రహ స్తోత్రం చదవడం ఉత్తమం. 


' ఆదిత్యాయచ సోమాయ 

మంగళాయ బుధాయచ 

గురు శుక్ర శనిభ్యశ్చ 

రాహవే కేతవే నమః '.


15) నవగ్రహాలకు ఇచ్చే దానం లో పూర్ణ ధాన్యాన్ని మాత్రమే దానంగా ఇవ్వాలి కండించిన ధాన్యం ( పప్పులు, పిండి ) ఇవ్వరాదు. 


16) బ్రాహ్మణ సహాయం లేకుండా గ్రహ పూజలు చేయరాదు. 


17) గ్రహానుకూలం కోసం చేసే దానము కూడా తప్పకుండ సద్బ్రాహ్మణులకు మాత్రమే చేయాలి, అన్యులకు గ్రహదానం చేయకూడదు.

పతన హాస్యం

 🌹🌹🌹🌹🌷🌷🌹🌹🌹🌹

     *🌷పతన హాస్యం🌷* 

              🌷🌷🌷

‘ఫుల్లుమూను నైటటా.. జాసుమిన్ను వైటటా.. మూను కన్న మొల్ల కన్న నీదు మోము బ్రైటటా.. టా! టా! టా!’ అంటాడు గిరీశం ‘కన్యాశుల్కం’లో. ‘నేను వట్టి తెలివితక్కువ వాడిననా నీ అనుమానం’ అని కాంతం కథల్లో భర్త అంటే అందుకు కాంతం ‘అహహ అనుమానమేమీ లేదు.. గట్టి నమ్మకమే’ అంటుంది. ‘నేను సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ధారబోశాను’ అని శ్రీశ్రీ రాస్తే జరుక్‌శాస్త్రి పేరడీగా ‘నేను సైతం కిళ్లీ కొట్లో పాతబాకీలెగరగొట్టాను’ అని రాశాడు. ‘నవ్వవు జంతువుల్‌.. నరుడు నవ్వును’ అంటాడో కవి. నవ్వు మానవ ప్రవృత్తి. సకల జీవజాలం నుంచి మనిషిని వేరు చేయగల ఒకే ఒక స్పందనాగుణం– నవ్వు.


‘నాకు గనక సెన్సాఫ్‌ హ్యూమర్‌ లేకపోతే నేనెప్పుడో ఆత్మహత్య చేసుకుని ఉందును’ అన్నారు గాంధీజీ. ఓ పెద్దాయన ‘ఏ మేన్‌  ఈజ్‌ నాట్‌ పూర్‌ ఇఫ్‌ హి కెన్‌ స్టిల్‌ హీ లాఫ్‌’ అన్నాడు. ‘నవ్వుకు చోటు దొరకనంత సేపు అది ఎంత పెద్ద గది అయినా ఇరుకే’ అని ఇంగ్లిష్‌ వ్యాఖ్య. బతకడానికి నవ్వు అవసరం అని సామాన్యుడేమిటి చక్రవర్తి కూడా అనుకున్నాడు. అందుకే విదూషకుణ్ణి ఆస్థానంలో పెట్టుకున్నాడు. తెనాలి రామలింగడు, బీర్బల్‌ తమ చక్రవర్తులను ఏమో కాని నేటికీ ఆబాలగోపాలాన్ని నవ్విస్తున్నారు.


మనుషులు నిత్య జీవితంలో పరాచికాలతో నవ్వుతారు. వెక్కిరించి నవ్వుతారు. తప్పులకు, అబద్ధాలకు నవ్వుతారు. అవివేకులను, మందబుద్ధులను, అతి తెలివిగల వారిని చూసి నవ్వుతారు. అధికారంలో ఉన్నవారిని ఏమీ అనలేక గేలి చేసి నవ్వుతారు. చాలక పుస్తకాలు చదివి, నాటకాలు చూసి, సినిమాలకు వెళ్లి కూడా నవ్వుతారు. అయినా కూడా గౌరవం పొందే విషయంలో హాస్యానిది ద్వితీయ స్థానమే. గంభీరంగా ఉండే అధికారినీ, గంభీరమైన ఉపన్యాసకుణ్ణీ గౌరవించినట్టుగా హాస్యం మిళితం చేసేవారిని గౌరవించరు. సాహిత్యంలో గొప్ప రచనలన్నీ గంభీరమైన విషయాలవే. హాస్యం రాస్తే ‘హాస్య రచయిత’.  గంభీరమైన విషయాలు రాస్తే ‘రచయిత’. అతి తక్కువ మందే హాస్యంతో గంభీరమైన విషయాలు రాసి గౌరవం పొందారు. 

తెలుగులో తొలి వచన సాధకులలో ఒకౖరైన వీరేశలింగం నవ్విస్తూ తొడపాశం పెట్టే శిల్పంలో తెలుగువారిని స్మిత వచనా సముద్రంలోకి ప్రవేశ పెట్టారు. మొక్కపాటి నరసింహశాస్త్రి, మునిమాణిక్యం నరసింహారావు, భమిడిపాటి కామేశ్వరరావు ‘హాస్యత్రయం’ అనిపించుకున్నారు. చిలకమర్తి ప్రహసనాలు, పానుగంటి ‘సాక్షి’ వ్యాసాలు క్లాసిక్స్‌. ఆ తర్వాతి రోజుల్లో ముళ్లపూడి వెంకటరమణ ‘బుడుగు’, పురాణం ‘ఇల్లాలి ముచ్చట్లు’, నండూరి పార్థసారథి ‘రాంబాబు డైరీ’... ఈ హాస్యధారను బలంగా ముందుకు తీసుకెళ్లాయి. నామిని సుబ్రహ్మణ్యం నాయుడు, తెలిదేవర భానుమూర్తి తదితరులు మాండలిక రచనతో హాస్యం ఎంత నేటివ్‌ రుచిగా ఉంటుందో చూపించగలిగారు.

అయితే ఆది నుంచి స్త్రీకి హాస్యం ‘అదుపు చేయబడినది’. నవ్వుకు ప్రధాన వాటాదారు పురుషుడే. స్త్రీ కాదు. ద్రౌపది కాలం నుంచి స్త్రీ నవ్వుకు అపఖ్యాతి, అపసవ్య వర్తనను ఆపాదిస్తూ వచ్చారు. నవ్వే, నవ్వించే స్త్రీలు నేటికీ తక్కువ. ఇలాంటి సంఘ అంకుశాలను కూడా ధిక్కరించి స్త్రీలు రాశారు. భానుమతి ‘అత్తగారి కథలు’, రంగనాయకమ్మ ‘స్వీట్‌హోమ్‌’ నవ్వించాయి. పొత్తూరి విజయలక్ష్మి,  మృణాళిని, సోమరాజు సుశీల... పాఠకులను తమ ఫిక్స్‌డ్‌ ఖాతాల్లో వేసుకోగలిగారు.

కాని నవ్వించడం ఏమాత్రం జోక్‌ కాదు. ఆరోగ్యకరమైన హాస్యంతో నవ్వించడం కొద్దిమందికే చేతనవుతుంది. సమాజంలో కానీ, రచనల్లో కానీ చాలామటుకు హాస్యం స్త్రీలను, బలహీనులను, వెనుకబడినవారిని దూషించడం వల్ల గేలి చేయడం వల్ల పుడుతూ ఉంటుంది. ఆస్తిత్వ రాజకీయ ఉద్యమాల వల్ల కలిగిన చైతన్యం ఇప్పుడు ఇవేవీ చేయడానికి వీల్లేని సంస్కారాన్ని ఇస్తున్నాయి. ఈ సంస్కార పరిధిలో ఉంటూ హాయిగా నవ్వుకోగల హాస్యాన్ని పుట్టించడం నవ్వు మీద సాముగా మారింది. 

ఈ సమయంలోనే నేటి తరం ఎటువంటి హాస్యానికి సామీప్యంలో ఉన్నదీ గమనించుకోవాలి. నిత్య ఒత్తిడి వల్ల పాఠకులు ప్రేక్షకులుగా మారి చదవడానికి బదులు చూడటానికి ఇష్టపడుతున్న సమయంలో హాస్యం వ్యాపార వనరుగా మారింది. అభినవ విదూషకులు పుట్టుకొచ్చారు. నిత్యం ప్రతి చానల్‌లో గంటో అరగంటో హాస్య కార్యక్రమం ఉంటోంది. అయితే అది ఎటువంటి హాస్యం? స్త్రీల రూపాలను, ఎదుటివారి ఆకారాలను పదే పదే హీనపరచడమే హాస్యంగా ఉంది. తెలుపు నలుపులను, పొడవు పొట్టిలను, భాషా యాసలను హీనపరచడమే హాస్యంగా ఉంది. ‘ఒరే దరిద్రుడా’ అనేది హాస్య సంబోధన. దరిద్రుడంటే పేదవాడు. పేదవాడు ఎవరికి హాస్య వస్తువు? ఎందుకు హాస్య వస్తువు? సమాజం లైంగిక అపక్రియల్లో మునిగినట్టుగా వాటి చుట్టూ అల్లిన హాస్యానికి రేటింగులు వస్తున్నాయి.

మాటలతో సాగే రతిని హాస్యం అంటున్నారు. ఇవి ఇళ్లల్లో ఉండి చూస్తున్న పిల్లలకూ, యువతీ యువకులకూ ఏం నేర్పిస్తున్నాయి? ఆరోగ్యకరమైన హాస్యాన్ని అలవర్చుకోని పిల్లలు తమక్కావాల్సిన హాస్యాన్ని వెతుక్కోవడంలో ఎదుటివారి దుఃఖానికి హేతువు అవుతారు. బాధించడాన్ని ‘ఎంజాయ్‌’ చేస్తారు. సత్యానికి, హేతువుకు, వాదనకు నిలబడలేక ‘ముఖాన్నో, మూతినో’ కామెంటు చేసి పారిపోతారు. సాంస్కృతిక దాడి చేస్తారు. ఉన్నతమైన విషయాన్ని కూడా పతనానికి తెచ్చి నవ్వుదామనుకుంటారు. పతన హాస్యపు ప్రతిఫలనం ఇది. ఇప్పుడు చలామణిలో ఉన్నదానిని అపహాస్యం అనడానికి కూడా లేదు. *ఇది  దుర్మార్గ, హాస్యం!*

ప్రయత్నించండి

 ప్రయత్నించండి  జవాబులు 

______________________________

(1) గ్రామాశ్వము అనగా ? (ఇ) గాడిద 


(అ) కుక్క

(ఆ) ఎద్దు

(ఇ) గాడిద 

(ఈ) ఆడఒంటె


(2) ఇంగలీకము అనగా ? (ఇ) కోతి


(అ) ఒకరకం చెట్టు

(ఆ) ఆయుర్వేద ఔషధం

(ఇ) కోతి

(ఈ) నల్లి


(3) కచ్ఛపి అనగా ?  (అ) సరస్వతి వీణ


(అ) సరస్వతి వీణ

(ఆ) గోచి

(ఇ) తాబేలు

(ఈ) రథము


(4) అనాలంబి అనగా ?


(అ) కుబేరుడి పురాణాలలో వీణల పేర్లు 

(ఆ) శివుడివీణ

(ఇ) ఇంద్రుడి ఉద్యానవనం

(ఈ) అశ్వనీదేవతల వాహనం


(5) కుముదము అనగా ?(అ) ఇంద్రలోకంలోని దివ్యపుష్పం


(అ) ఇంద్రలోకంలోని దివ్యపుష్పం

(ఆ) యముడి ఆయుధం

(ఇ) రావణుడి వీణ

(ఈ) శివుడి శంఖం


(6) అజగవము అనగా ?


(అ) అడవి జింక

(ఆ) ఉత్తమాశ్వము ( మేలుగుర్రం)

(ఇ) శివుడివిల్లు

(ఈ) విభీషణుడి విల్లు


(7) ముద్దయ్య అనగా ? (ఇ) కుమారస్వామి


(అ) పోలేరయ్య

(ఆ) శివుడు

(ఇ) కుమారస్వామి

(ఈ) శశీశ్వరుడు


(8) కటిసూత్రము అనగా ? (అ) మొలత్రాడు


(అ) మొలత్రాడు

(ఆ) భుజకీర్తి ( వంకీ)

(ఇ) ముంజేతికడియం

(ఈ) మంగళసూత్రం


(9) అనామిక అనగా ? (ఈ) ఉంగరపు వ్రేలు


(అ) అనామకుడు

(ఆ) అన్నసత్రం

(ఇ) గందంచెట్టు

(ఈ) ఉంగరపు వ్రేలు


(10) పుండరీకాక్షుడు అనగా ?


(అ) ఎర్రనికనులు కలవాడు

(ఆ) నీలికనులు కలవాడు

(ఇ) నల్లనికనులు కలవాడు

(ఈ) తెల్లని కనులుకలవాడు


( విష్ణువుకు గల పేరిది )


 

॥సేకరణ॥

__________________________________________________జిబి.విశ్వనాథ.9441245857. అనంతపురం.

బ్రాహ్మిణ్‌లపై

 *బ్రాహ్మిణ్‌లపై వాస్తవ తనిఖీ*


కాలక్రమేణా కల్పన ఎలా నిజం అవుతుందో చూడటం ఆశ్చర్యంగా ఉంది!


 వాస్తవాలు మరియు వాస్తవ చరిత్ర ఆధారంగా సత్యాన్ని పరిశీలిద్దాం.


 *1.* ముందుగా... హిందూ మతంలో ఒక్క బ్రాహ్మణ దేవుడు లేడు!


 *2.* దేవుళ్లందరూ వెనుకబడిన కులాలు, దళితులు మరియు గిరిజనుల నుండి వచ్చారు.


 *3*. బ్రాహ్మణులు హిందూ మతంలో దేవుళ్ల భావనను సృష్టించలేదు.


 *4.* భారతదేశాన్ని పాలించిన బ్రాహ్మణ రాజు ఒక్కడు కూడా లేడు.


 *5.* ఇతరులను అణచివేయడానికి అధికార స్థానాలు అవసరం. బ్రాహ్మణులు ఉపాధ్యాయులు, పండితులు, పూజారులు, సలహాదారులు కానీ పాలకులు కాదు.


 *6*. బ్రాహ్మణుల సాంప్రదాయక వృత్తి ఆలయ పూజారి (పురోహిత్), మతపరమైన కార్యక్రమాలను నిర్వహించడం. వారి ఏకైక ఆదాయం భూస్వాములు (బ్రాహ్మణేతరులు) ఇచ్చిన _బిక్ష_ (భిక్ష).


 *7.* బ్రాహ్మణుల మరొక విభాగం ఉపాధ్యాయులు, అది కూడా జీతం లేకుండా.


 *8*. వేద సాహిత్యం ఎక్కువగా బ్రాహ్మణేతరులచే వ్రాయబడింది. బ్రాహ్మణులకు ఉన్నత హోదా ఇచ్చే ధర్మ శాస్త్రంలో అత్యంత శక్తివంతమైనది, బ్రాహ్మణేతరుడైన మను వ్రాసిన మనుస్మృతి. బ్రాహ్మణుడు అంటే అదొక వృత్తి (వర్ణ) - కులం కాదు.


 *9.* సంస్కృతం చదవడం మరియు రాయడం బ్రాహ్మణులకే పరిమితమైతే, మీరు గిరిజన వాల్మీకి రామాయణాన్ని ఎలా కంపోజ్ చేస్తారు? నాలుగు వేదాలను వర్గీకరించి మహాభారతం రచించిన వేదవ్యాసుడు ఒక మత్స్యకారునికి జన్మించాడు.


 *10*. సంస్కృతాన్ని బ్రాహ్మణేతర రచయితలు ఎక్కువగా ఉపయోగించారు - బ్రాహ్మణులు రచించిన సంస్కృతంలో చాలా తక్కువ గ్రంథాలు ఉన్నాయి.


 *11*. వేదవ్యాసులు, వశిష్ట, వాల్మీకి, కృష్ణ, రాముడు, అగస్త్య, విశ్వామిత్ర, శృంగ, గౌతమ, బుద్ధ, మహావీర, తులసీదాస్, తిరువళ్లువర్, కబీర్, వివేకానంద, గాంధీ, నారాయణ గురు మొదలైన వారి బోధనలను అత్యంత విలువైనవిగా భావిస్తాం.


 *12*. వారెవరూ బ్రాహ్మణులు కాకపోతే, "బ్రాహ్మణులు మిమ్మల్ని నేర్చుకోవడానికి అనుమతించలేదు" అని ఎందుకు గట్టిగా అరుస్తారు? బ్రాహ్మణేతర భక్తి సాధువులచే భక్తిపై అనేక రచనలు ఉన్నాయి.


 *13.* బ్రాహ్మణులు ఇతరులను నేర్చుకోకుండా ఎప్పుడూ నిరోధించలేదు.


 *14*. చరిత్రలో ఏ సమయంలోనూ బ్రాహ్మణులు ధనవంతులు లేదా శక్తివంతులు కాదు. ఏదైనా పాత భారతీయ కథల పుస్తకాన్ని తీయండి, మీరు గరీబ్_ బ్రాహ్మణుడు (పేద బ్రాహ్మణుడు) ధర్మంగా పేర్కొనడాన్ని చూస్తారు. (సుదామ-కృష్ణ కథ గుర్తుందా?)


 *15.* వారి వృత్తి సమాజంలో అత్యున్నత స్థాయిగా పరిగణించబడుతున్నప్పటికీ, బ్రాహ్మణ సన్యాసుల మనుగడకు ఏకైక మార్గం ప్రజలు ఇచ్చే భిక్ష.


 *16.* బ్రాహ్మణుల అతిపెద్ద సహకారం భూమిలో ఇప్పటివరకు మాట్లాడే అత్యుత్తమ భాష - సంస్కృతాన్ని నిలబెట్టుకోవడం. మీరు ఇంగ్లీష్ లేదా అరబిక్ నేర్చుకుంటే, మీకు వాణిజ్య ప్రయోజనాలు ఉంటాయి.


 *17*. సంస్కృతాన్ని ఎవరూ ప్రోత్సహించలేదు.

 ఎలాంటి ప్రయోజనాలు లేకుండా, బ్రాహ్మణులు సంస్కృతం నేర్చుకునే స్వచ్ఛంద పనిని చేపట్టారు. ఇప్పుడు మీరు వాటిని సంస్కృతంలో గుత్తాధిపత్యంగా ఆరోపిస్తున్నారు!


 అంతే కాకుండా, బ్రాహ్మణులు రాజులు కాదు. వారు అధికారాలను ఆస్వాదించలేదు లేదా సంపదను కలిగి లేరు. వారు జ్ఞానాన్ని సంపాదించడానికి మరియు కష్టతరమైన జీవితాన్ని గడపడానికి చాలా కష్టపడ్డారు. కాబట్టి బ్రాహ్మణుల దోపిడీ ప్రశ్న లేదు.


బ్రాహ్మణుల జనాభా తమిళనాడులో కేవలం 2% నుండి ఉత్తరాఖండ్‌లో 12% వరకు ఉన్నప్పుడు, వారు మెజారిటీలో ఎలా ఆధిపత్యం చెలాయించగలరు?


 ఇవన్నీ చదివిన తరువాత ఎవరైనా *బ్రాహ్మణులను* నిందించగలరా?


 *దయచేసి వీలైనంత ఎక్కువ మందికి ఫార్వార్డ్ చేయండి మరియు సమాజాన్ని విభజించే తప్పుడు సమాచారం యొక్క ఈ వైరస్‌ను చంపండి ...*🙏🙏🙏

కాసు' ల్లేవు

 *ఒక మువ్వురు కవులు కవి సంఘం పెట్టి, దానికి ఒక భవనం కట్టాలని సహాయం కోసం అప్పటి ముఖ్యమంత్రి శ్రీ కాసు బ్రహ్మానందరెడ్డి గారి దగ్గరికి వెళ్ళారు..*


*పరిచయ కార్యక్రమం:*

*"వీరు సున్నం రంగరాజు గారు..వీరు రాళ్ళబండి వెంకట్రాజు గారు..ఇక నేను తాపీ ధర్మారావు..."*


*కాసు బ్రహ్మనందరెడ్డి(ముఖ్యమంత్రి): "సంతోషం. ఎందుకోసం ఈ రాక ?"..*


*కవులు: "భవనం కట్టాలి మీ సహాయం కోసం వచ్చాము".*


*కాసు బ్రహ్మనందరెడ్డి :* 

*"ఇక్కడ.. తాపి, సున్నం, రాళ్ళ బండి ఉన్నాయిగా... నా అవసరమేముంది?*

*(హాస్యంగా)*


*కవులు: "అన్నీ ఉన్నాయి గానీ... 'కాసు' ల్లేవు... మీరు కూడా కలిస్తే ..భవనం పూర్తవుతుంది"* 

*(కవులు.. మరి !).* 😂😂

గణపతిని నిమజ్జనం

 _*గణపతిని నిమజ్జనం చేస్తారు ఎందుకు ?*_




🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉




మట్టి గణపతి ఆరాధన గురించి అడిగి తెలుసుకున్న శౌనకాదులు సూతుడితో *'మరి పూజానంతరం నీటిలో నిమజ్జనం ఎందుకు ?'* అన్నారు శౌనకాదుల. ఆ ప్రశ్నకు సూతుడు ఈ విధంగా సమాధానమిస్తున్నాడు.


*చెపుతాను వినండి మట్టితో వినాయకుని చేస్తాం ఆ విగ్రహానికి మంత్రపూర్వకంగా ప్రాణప్రతిష్ట చేస్తాం పూజ చేస్తాం అంతవరకు బాగానే ఉంది. మామూలు దృష్టితో చూస్తే అది మట్టి బొమ్మే కానీ ఆధ్యాత్మిక దృష్టితో ఆలోచిస్తే అది మామూలు మట్టి బొమ్మ కాదు. పరబ్రహ్మ రూపమైన మృత్తికా ప్రతిమ. మనం ప్రాణప్రతిష్ట చేసి ఆహ్వానించి పూజ చేయకపోయినా ఆ ప్రతిమ యందు పరబ్రహ్మ ఉన్నాడు. ఆ మృత్తికలోని అణువణువూ ఆయనే.... అలాంటి మృత్తికను మంత్రపూర్వకంగా పూజించిన తర్వాత ఆ విగ్రహాన్ని అలా వదిలేయడం దోషం. బొమ్మని సృష్టించాం. పూజానైవేధ్యాలతో పోషించాం. మరి లయం చేయవద్దా ? లయం చేయడమంటే ఆత్మను విశ్వాత్మతో ఐక్యం చేయడం. అణువును బ్రహ్మాండంలో లీనం చేయడం. అంటే ఎక్కడ నుంచి వచ్చిందో అక్కడికే చేరుకోవడం. ఇదే సృష్టి , స్థితి , లయల చక్రభ్రమణం ఇదే పరబ్రహ్మతత్వం అందుకే పరబ్రహ్మ ప్రతిరూపమైన మట్టి వినాయకుడిని పరబ్రహ్మ స్థూలరూపమైన భూమిలో ఐక్యం చేయడానికి యీ విగ్రహాన్ని సముద్ర జలమందు గానీ , నదీ , తటాక జలములయందుగానీ నిమజ్జనం చేస్తే ఆ నీటియందు చేరిన విగ్రహం కరిగి ఆ జలప్రవాహంతో ప్రయానించి , అంటే వ్యాపిస్తూ , పరబ్రహ్మరూపమైన మట్టిలో ఐక్యమైపోతుంది. అందుకే పూజానంతరం వినాయక నిమజ్జనం ఆచారంగా పూర్వులు ప్రకటించారు. ఆచరించారు. పూజలో వినాయకుడికి అర్పించిన పత్రి ఓషధీ గుణాలు కల్గినవీ , భూదేవి ప్రసాదించినవే గనక వాటిని కూడా నిమజ్జనం ద్వారా ఆ పరబ్రహ్మకి అర్పించి అంజలి ఘటిస్తారు. సర్వ ఈశ్వరార్పణం అంటే అసలు అర్ధం ఇదే"* అని వివరించారు సూతమహర్షి.

ప్రశ్న పత్రం సంఖ్య: 31 జవాబులు

 ప్రశ్న పత్రం సంఖ్య: 31 జవాబులు  కూర్పు: సి. భార్గవ శర్మ న్యాయవాది  

రామాయణ  సంబంధిత ప్రెశ్నలు. 

ఇతిహాసాలలో మొదటిది మరియు ఒక ఉత్తమపురుషుడు జీవనం ఎలాచేయాలి అనేది శ్రీ రాముని ద్వారా తెలుసుకోవాలని మన సాంప్రదాయాలలో శ్రీరాముని ఆదర్శ పురుషునిగా భావిస్తున్నాము. క్రింది ప్రశ్నలను   పూరించటానికి ప్రయత్నించండి.   

1. రామాయణాన్ని రచించింది ఎవరు.  జవాబు: ఆదికవి వాల్మీకి 

2.ఆదికవికి రామాయణాన్ని రచించటానికి ప్రేరేపించిన మహాముని ఎవరు. జవాబు: నారద మహాముని 

3. శ్రీరాముని అక్కగారి పేరు ఏమిటి. జవాబు. శాంత (దశరథుని మిత్రుడైన రామపాదుని కుమార్తె.)

4. రామాయణంలో ఎన్ని కాండలు వున్నాయి  జవాబు. 1) బాలకాండ, 2)అయోధ్యకాండ, 3)అరణ్య కాండ4) కిష్కింద కాండ, 5) సుందరా కండ 6) యుద్ధకాండ కాగా 7) ఉత్తరకాండ 

ఏడు కాండములు (భాగములు) గా విభజింప బడింది. వాస్తవానికి వాల్మీకి రాసిన రామాయణంలోనివి ఆరు కాండలు, మొత్తం 24వేల శ్లోకములు (శతకోటి అక్షరములని కూడా చెబుతారు). ఏడవ కాండము అయిన ఉత్తర కాండము వాల్మీకి రచన కాదంటారు. కాండము అనగా చెరకుగడ కణుపు అని అర్ధము.

5. రాముని సోదరులలో కవలపిల్లలు ఎవరు జవాబు. లక్ష్మణ,శత్రుఘ్నులు 

6. నందిగ్రామము ఎవరి మేనమామయూరు జవాబు. భరతుని 

7. దశరథమహారాజు మరణించినప్పుడు శ్రీరాముడు ఎక్కడ వున్నారు. జవాబు. అరణ్యంలో 

8. కైకేయిని ప్రేరేపించింది ఎవరు ఆమె ఏదేశంనుండి వచ్చినది. జవాబు. మందార 

9. ఇంటిగుట్టు లంకకు చేటు అనే సామెత ఎలా వచ్చింది. జవాబు. రావణుని మరణ రహస్యం విభిషణుడు రామునికి తెలుపుట వలన ఆ మాదిరిగా ఎవరైనా చేస్తే ఉపయోగించే వాక్యం. 

10.సీతజాడతెలిపిం పక్షి ఎవరు. జవాబు.జటాయువు

11. పరమేశుని ఆత్మలింగాన్ని వరంగా పొందిన భక్తుడు ఎవరు. జవాబు. రావణబ్రహ్మ 

12. సీతాదేవిని వివాహమాడటానికి శ్రీరాముడు చేసినది ఏమిటి. జవాబు. శివధనస్సు విరచటము  

13. రామోవిగ్రహవాన్ ______జవాబు. ధర్మః 

14. నదిదాటించింది ఎవరు, ఆ నడిపేరు ఏమిటి. జవాబు. గుహుడు, సరయు నది

15. శ్రీరాముడు అరణ్యవాసానికి బయలుదేరినప్పుడు రధాన్ని నడిపిన సారధి ఎవరు. జవాబు. సుమంతుడు 

16. శ్రీరాముని శరీరఛాయ ఏమిటి. జవాబు. నీలమేఘచాయ 

17. శ్రీరాముడు మొదటిసారి హనుమంతుని చూసినప్పుడు ఆంజనేయులు ఏవేషంలో వున్నారు. జవాబు. బ్రాహ్మణ 

18.తార ఎవరి భార్య జవాబు. వాలి భార్య 

19. విశ్వామిత్రుడు రామాయణంలో ఏ కాండలో కనపడతాడు. జవాబు.  బాలకాండ-

20. మధువనంను పాడుచేసింది ఎవరు జవాబు. సుగ్రీవుని సేన అయిన వానరులు. 

21. ఎంగిలి పండ్లు ఎవరు ఎవరికి తినిపించారు.  జవాబు. శబరి, తినిపించింది శ్రీరామచంద్రునికి. 

22. శ్రీరాములవారి తల్లిగారి పేరు ఏమిటి. జవాబు. కౌసల్య 

23. విశ్వామిత్రుడు దశరధుని ఏమి కోరాడు జవాబు. యాగసంరక్షణకు శ్రీరాముని పంపమని కోరారు. 

24. భూమినుంచి పుట్టింది ఎవరు. జవాబు. సీతాదేవి 

25. లక్ష్మణ రేఖ అంటే ఏమిటి. జవాబు. లక్ష్మణులు సీతాదేవికి రక్షణగా  పర్ణశాలముందు గీసిన రేఖ 

26. బంగారు లేడి రూపంలో వున్నరాక్షసుడు ఎవరు. జవాబు. మారీచుడు (తాటక అనే యక్షిణికి, సుందుని వల్ల కలిగిన కుమారుడు.)

27. పర్ణశాల అంటే ఏమిటి దీనిని నిర్మించినది ఎవరు. జవాబు. అరణ్యవాసంలో సీత,రామ లక్ష్మణులు నివసించటానికి నిర్మించుకున్న వసతి గృహం. 

28. ముక్కుచెవులు కోసింది ఎవరు, ఎవరికి జవాబు. లక్ష్మణుడు, సూర్పనక్క ఈమె రావణుని సోదరి. 

29. లంకను కాపలా కాసింది ఎవరు. జవాబు. లంకిణి 

30. శ్రీరాముడు ఎవరి విమానంలో అయోధ్యకు చేరుకున్నారు. జవాబు. రావణుని విమానం, దానిపేరు పుష్పక విమానం.