15, జులై 2023, శనివారం

షోడచోపచార పూజ

షోడచోపచార పూజ: 

భగవంతుడిని ఒక అతిధిగా భావించి పదహారు రకాలుగా సేవలు చేయటాన్ని షోడశోపచార పూజ అంటారు.  ఎప్పుడైతే భగవంతుని నిశ్చల భక్తితో ఆరాధిస్తాడో అప్పుడు భక్తుడు భగవద్ కైంకర్యంలో నిమగ్నుడైతాడు. కండ్లతో విగ్రహాన్ని చూస్తాడు.  అక్కడ వెలిగించి సుగంధ పరిమళ ఊదుబత్తుల సుగంధాన్ని ఆస్వాదిస్తాడు, స్వామికి అర్పించిన రంగు రంగుల పుష్పాల అలంకరణతో తాదాప్యం చెందుతాడు. మనస్సు తాను చేస్తున్న అర్చన మీద ఉంచుతాడు, చెవులు మంత్రాలపై, దృష్టి స్వామిపై, చేతులు అర్చనపై వుంచు పూర్తిగా తాన పంచేంద్రియాలతో  భగవంతుడికి స్వాధీనుడు అవుతాడు. తన్ములంగా మనస్సుని భగవంతునిపై ఏకాగ్రత చేయగలుగుతాడు.  కానీ నిజానికి విగ్రహారాధనే అంతిమ గమ్యం కాదు. నిర్గుణోపాసనే కైవల్య ప్రధం అని ఉపనిషత్తులు గోషిస్తున్నాయి. విగ్రహారాధన ఎందుకు చేయాలో ఒక ఉదాహరణతో తెలుసుకుందాం. బాల్యంలో గురువుగారు విద్యార్థికి గణితం బోధించటానికి చేతి వేళ్ళని గణించమని చెపుతారు. ఇది మన అందరికి తెలిసిన విషయమే. వ్రేళ్ళని గణించటంతో చిన్న పిల్లవాడు కూడికలు, తీసివేతలు నేర్చుకుంటాడు.  మరి వాడు పెద్దయిన తరువాత వాడికి చేతి వేళ్ళు లెక్కించటం అవసరమా కాదు. కానీ బాల్యంలో చేతిమీద లెక్కలు నేర్చుకోటంతోనే నేడు గణితం అర్ధం చేసుకో గలుగుతున్నారు.  అదే విధంగా విగ్రహారాధన కుడా.  ఈ విషయం ప్రతి ఒక్కరు తెలుసుకోవలసిన అవసరం వున్నది.   

ఇంతమంది దేముళ్ళు ఎందుకు.  విగ్రహారాధన ఎందుకో తెలుసుకున్నాము. మరి ఇంతమంది దేముళ్ళు అవసరమా అని ప్రతి ఒక్కరి మదిలో ప్రశ్న మొదలవుతుంది. మన ఋషులు వారి మేధా శక్తితో మనకు అందించిన సంప్రదాయమే నేడు మనం ఆచరించే ఆచారాలు, ఆరాధనలు, పండుగలు మొదలైనవి. ఇంత మంది దేముళ్ళు ఎందుకు అవసరమో  ఒక చిన్న ఉదాహరణతో గమనిద్దాము. నీకు ఒక కలెక్టర్ ఆఫీసులో పని వుంది అనుకుందాము.  మనకు తెలిసి కలెక్టర్ గారే ఆ ఆఫీసుకి ముక్క్యులు.  నీకు కావలసిన పని కేవలము ఒక చిన్న సమాచారం అనుకుందాము.  అది ఫలనా రికార్డులో ఫలానా పేరు వున్నదో లేదో తెలుసు కోవాలి.  నీవు ఏమి చేస్తావు.  నేరుగా ఆ శాఖకు సంబందించిన గుమస్తా దగ్గరకి వెళ్లి సదరు విషయం తెలుసుకుంటావు.  కానీ నీకు కలెక్టర్ గారితో ఎలాంటి పని లేదు.  నీవు కలెక్టర్ గారిని కాలవ వలసిన అవసరంకూడా లేదు.  నీ పని అయిపోతుంది.  అదే మాదిరిగా నీకు ఏ శాఖకు చెందిన పని ఉంటే ఆ శాఖకు చెందిన గుమస్తా లేక శాఖా అధికారిని కలుసుకొని నీ పని చేసుకొంటావు.  అదే విధంగా కేవలం కలెక్టర్ గారితోనే అయ్యే పని అయితే అప్పుడు కానీ కలెక్టర్ గారిని కలవవు.  అదే మాదిరిగా మనకు దేముడికి సంబందించిన శాఖలు ఏర్పాటు చేసారు.  అవి ధనానికోసం లక్ష్మి దేవి, చదువుకి సరస్వతి దీవి. ధుర్యానికి దుర్గా దేవి.  అలానే విజ్ఞలను తొలగించటానికి గణపతిని.  ఈ విధంగా మనకు వేరు వేరు కోరికలను తీర్చటానికి వేరువేరు దేవతలు వున్నారు.  అదే నీకు కైవల్యం కావాలంటే ఆ పరబ్రహ్మయే శరణ్యం. 

పూజించేటప్పుడు శుచిగా ఉండటం  ఎందుకు.  : పూజ అనేది మానసిక ప్రక్రియ అంటే మనస్సుతో మాత్రమే మనం దేవి దేవతలను ఆరాధిస్తాము. ఆలా ఆరాధించాలంటే మనస్సు నిర్మలంగా ఉండాలి. ఎప్పుడైతే శరీరం పరిశుభ్రంగా ఉంటుందో అప్పుడు మనస్సుకూడ పరిశుభ్రంగా ఉంటుంది. కాబట్టి పూజించే వారు విధిగా స్నానం చేసి పరిశుభ్రమైన వస్త్రాలని ధరించి పూజకు కూర్చోవాలి. హిండవ సంప్రదాయం ప్రకారం విగ్రహారాధన అనేది 16 ఉపచారాలతో ఉంటుంది.  అందుకే షోడచోపచార పూజ అంటారు. 16 రకాలుగా దేవతారాధన చేయటం అని అర్ధం.  పూజ చేసేటప్పుడు చేతులు పుష్పాలు, అక్షింతలు, పత్రి, తోయం (నీరు) తో వినియోగించి అర్చిస్తుంటే, కళ్ళు ఆ దివ్య మంగళ విగ్రహాన్ని (రూపాన్ని) చూస్తూవుంటే చెవులు మంత్రాలు లేక నామాలు వింటూవుంటే మనస్సు అన్ని విధాల ఆ దివ్య మంగళ మూర్తిని స్మరిస్తూ ఉంటుంది.  అంటే పూజ చేసే భక్తుడు తన పంచేంద్రియాలను దేముడి మీదనే లగ్నాత చేసి అర్చిస్తాడు.  తద్వార త్రికరణ శుద్ధి సాధిస్తాడు.  ఈ రకమైన ఆరాధన ఏ ఇతర మతాలలో మనం చూడలేం.  

హిందూ ధర్మం అత్యంత ప్రాచీనమైనది, ప్రశస్తమైనది. అందుకే ఇప్పుడు ప్రపంచం మొత్తం హిందుత్వం వైపు మొగ్గు చూపుతున్నాయి మోక్షమార్గాన్నిచూపెట్టిన ఏకైక దర్మం హిందూ ధర్మం. దేముడిని సహేతువుగా చెప్పింది హిదూత్వం. దేముడు ఒక నమ్మకం కాదు ఒక నిజం.


ఓం శాంతి శాంతి శాంతిః

పుదీనా గురించి

 పుదీనా గురించి సంపూర్ణ వివరణ - ఉపయోగాలు .


     ఆయుర్వేదం నందు పుదీనా కు ప్రత్యేక స్థానం ఉన్నది. 100 గ్రాముల పుదీనా ఆకు 56 క్యాలరీల శక్తిని ఇస్తుంది. ఇవే కాకుండా మరెన్నొ పోషకాలు ఉన్నాయి . వాటి గురించి ఇప్పుడు మీకు వివరిస్తాను 


 100 గ్రాముల పుదీనా ఆకులో ఉండే పోషకాలు - 


 పిండిపదార్దాలు - 8 .40 గ్రా , ప్రొటీన్స్ - 5 .90 గ్రా , 0 .70 గ్రా ఫ్యాట్స్ , క్యాల్షియం - 440 మి.గ్రా , ఫాస్ఫరస్ - 70 మి.గ్రా , ఐరన్ - 19 .2 మి.గ్రా , విటమిన్లు - A , B1 , B2 , నియాసిన్ , ఆక్సాలిక్ ఆసిడ్ ఉన్నాయి.  


            పుదీనా ఆకు ఎక్కువుగా మాంసాహార వంటకాలలో వాడతారు . పచ్చడిగా మనవారు చాలాకాలం నుంచి ఉపయోగిస్తున్నారు. పుదీనా ఆకు నుంచి " పిప్పర్మెంట్ " నూనె తయారగును. దీనితో కూడా అనేక వైద్య ప్రయోజనాలు ఉన్నాయి. ఈ నూనెని ఘనీభవింపచేసిన మనము కిళ్ళీలలో వాడే " పిప్పరమెంట్ " తయారగును. పిప్పర్మెంట్ నోట్లో వేసుకొనిన వేడిగా ఉండి బయట గాలి కొద్దిగా సోకగానే చల్లగా ఉన్నట్లు అనిపిస్తుంది. 


  పుదీనా ఆకుతో చికిత్సలు - 


  * పుదీనా ఆకు రసములో 1 స్పూన్ నిమ్మరసం , కొద్దిగా తేనె కలిపి ప్రతిరోజూ 3 సార్లు చొప్పున తీసుకొనుచున్న అజీర్తి , కడుపునొప్పి , పొట్ట ఉబ్బరం , పొట్టలో గ్యాస్ , విరేచనాలు , విరేచనములో నులిపురుగులు , రక్తహీనత సమస్యల నుండి విముక్తి లభించును. 


 * పుదీనాకు కషాయం రోజుకి 2 లేక 3 పర్యాయాలు సేవిస్తున్న ఎక్కిళ్లు , దగ్గు , జలుబు , అజీర్తి తగ్గును. 


 * బహిష్టులో నొప్పికి పుదీనాకు కషాయం బహిష్టుకు 3 నుంచి 4 రోజుల ముందుగా సేవించటం మొదలుపెట్టిన బహిష్టునొప్పి రాదు . 


 * పుదీనాకు కషాయం నందు కొంచం ఉప్పు కలిపి గొంతులో పోసుకొని గార్గిలింగ్ ( గుడగుడ ) చేయుచున్న గొంతునొప్పి తగ్గును. 


 * క్షయ , ఉబ్బసం , కొన్ని ఊపిరితిత్తుల వ్యాధులకు ఆయా మందులతో పాటు ఒకస్పూను పుదీనాకు రసములో 2 స్పూనుల వెనిగార్ , తేనె , కేరట్ రసము కలిపి రోజుకి 2 సార్లు సేవించిన మంచి టానిక్ లా పనిచేస్తుంది . 


 * నోటి దుర్వాసన గలవారు ప్రతిరోజు పుదీనాకు కొంచం నములుతున్న దుర్వాసన నిర్మూలమగును . ఇంకా దంతాలు పుచ్చుట తగ్గిపోయి దంతాలు గట్టిపడును. 


 * దంతాల నుండి చీముకారు సమస్య ఉన్నవారు పుదీనాకు నములుతున్న చీము కారుట తగ్గును. దంతాలు ఊడుట తగ్గును. 


 * ప్రతిరోజూ నిద్రించుటకు ముందు పుదీనాకు ముఖమునకు రాసుకొనుచున్న ముఖంపైన మొటిమలు తగ్గిపోయి ముఖచర్మం మృదువుగా , అందముగా తయారగును. 


 * గజ్జి , దురద వంటి చర్మవ్యాదులలో పుదీనాకు రసం పైపూతగా వాడుచున్న చర్మవ్యాధులు అంతరించును. నొప్పులు తగ్గును. 


 * పిప్పరమెంట్ తైలములో కొద్దిగా పంచదారను కలిపి 2 నుంచి 3 చుక్కలు కడుపులోకి తీసుకొనుచున్న కడుపుబ్బరం , ఆహారం అరగకుండా ఉండటం , అజీర్తి తగ్గును. 


 * కొబ్బరినూనెలో కొద్దిగా పిప్పరమెంట్ తైలం కలిపి కీళ్ళనొప్పులకు పైపూతగా రాయుచున్న గుణం కనిపించును. 


 * గొంతునొప్పికి , గొంతులోని టాన్సిల్స్ కు పైపూతగా పిప్పరమెంట్ తైలాన్ని రాయుచున్న తగ్గును. 


 * పిప్పరమెంట్ నూనెలో కొద్దిగా లవంగ నూనె కలిపి పుచ్చుపళ్ళలో పెడుతున్న నొప్పి తగ్గుటయే కాక క్రమక్రమంగా పుచ్చు అంతరించును. 


 * నిమ్మరసములో కొద్దిగా పిప్పరమెంట్ తైలము కలిపి రాత్రిపూట ఒంటికి పట్టించుకుని పడుకున్న దోమలు దరిచేరవు . 


        పైన చెప్పిన యోగాలే కాకుండా విరేచనాలు , జిగటవిరేచనాలు యందు పనిచేయును . హృదయమునకు మంచిది . గర్భాశయ దోషాలను పోగొట్టి రుతుస్రావం సరిగ్గా అగునట్లు చేయును . బాలింతలకు వచ్చు జ్వరం నందు పుదీనాకుల రసం తీసి రెండు చెంచాలు చొప్పున తాగించుట మంచిది . జలుబు నందు పుదీనాకు ముద్దగా చేసి నుదురుకు పట్టించి జలుబు , తలనొప్పి తగ్గును. 


            సమాప్తం 


 

     మరింత విలువైన సమాచారం కొరకు నేను రచించిన గ్రంథాలు చదవగలరు . 


    

కుజుడు భూమి

 కుజుడు అంటే భూమి యొక్క కుమారుడు అని అర్థం. సూర్యునికీ, భూమికీ కలిపి ఈ కుజుడు పుట్టినట్లుగా ఒక పురాణకథ ఉంది. (ఇక్కడ సూర్యుణ్ణి విష్ణువుగా వర్ణించారు.


బుధజననం కథలో స్త్రీరూపంలో వర్ణించబడిన సూర్యుణ్ణి ఇక్కడ పురుషునిగా వర్ణించారు. కుజుడు కూడా సౌరకుటుంబంలో వాడే కనుక సూర్యపుత్రుడని వర్ణించారు.


కుజుడు కూడా మన భూగోళం లాగానే కొంచెం ప్రక్కకు ఒరిగిఉండి తిరుగుతుంటాడు. అందుకే కుజుడిపైన కూడా ఋతువులేర్పడతాయి. ఆ విషయాన్ని మన ఋషులు గుర్తించారు. అంతేకాదు, ఇంకా మరిన్ని కుజగ్రహలక్షణాలను కూడా వారు కనుగొన్నారు. ఆ లక్షణాలన్నీ భూగోళ లక్షణాలకు దగ్గరగా వున్నాయని, అయితే భూగోళం కంటే కుజుడు. చిన్నగోళం కనుక, భూమికి కుజుడు కుమారుడని చమత్కరించారు.


మహర్షులు చెప్పిన భూమి, కుజగ్రహల పోలికలు... నేటి ఆధునిక శాస్త్రవేత్తలు చెప్తున్న చూద్దాం. పోలికలతో సరిగ్గా సరిపోతున్నాయి. అవి ఏమిటో


1. భూమి తనచుట్టూ తాను తిరగటానికి 23 గం॥ 56 ని॥ కాగా, కుజుడి ఆత్మభ్రమణానికి కూడా సుమారుగా అంతే సమయం పడుతుంది. (కుజుడి భ్రమణసమయం 24 గం. 37ని॥. అనగా కేవలం 41 నిముషాలే తేడా.)


2. భూగోళం 23 1/2° ప్రక్కకు ఒరిగి తిరుగుతుంది. అలాగే కుజుడు సుమారు 24° ఒరిగి తిరుగుతున్నాడు.


3. సౌరకుటుంబంలోని గ్రహాలన్నింటిలో కేవలం ఈ రెండు గ్రహాలపైనే ఋతువులు ఏర్పడుతున్నాయి.


4. భూమిపై ప్రాణవాయువు వుంది. కుజుడిపై కూడా నేడు కొద్దిగా ప్రాణవాయువు వుంది. (ఒకానొకప్పుడు భూమిపై వున్నంత హెచ్చు ఆక్సిజను వుండేదని శాస్త్రజ్ఞులంటారు.)


5. భూమిపై వాతావరణం వుంది. కుజుడిపై ప్రస్తుతం వాతావరణం


77


"ప్రాచీన హిందూ విజ్ఞాన ఘనత"


164


పురాణాల్లో సైవ్స్


ప్రాణికోటి ముందుగా కుజగ్రహంపై ఉండేదనీ, ఆ తర్వాత భూమి మీదకు మారిందనీ, అనంతరం శుక్రునిమీదకు బదిలీ చెందుతుందనీ మనం చెప్పుకున్నాం. నేటి ప్రఖ్యాత ఖగోళ శాస్త్రవేత్తల అభిప్రాయాలు, ఇందుకు అనుకూలంగానే ఉన్నాయి. వాటిని గూర్చి తెలుసుకుందాం.


కుజ, శుక్ర గ్రహాల పరిశీలన వివిధ అంతరిక్ష నౌకల ద్వారా అమెరికా, రష్యా దేశాలకు చెందిన ఖగోళశాస్త్ర వేత్తలు ఇటు శుక్రుడి మీదా, అటు కుజుడిమీదా అనేక పరిశోధనలు జరిపారు. వాటి ఫలితాలు ఇలా ఉన్నాయి.


కుజ గ్రహంపై ఇప్పటికీ స్వల్ప వాతావరణం ఉందట. ఆ గ్రహంపై కొంత నీటి ఆవిరి, మంచు, నాచుజాతి మొక్కలు ఉన్నట్లు కనుగొనబడింది. కుజగ్రహ వాతావరణంలో మెథేన్, అమ్మోనియా వాయువులున్నాయని అమెరికా అంతరిక్షనౌక 'మారినర్ - 7' తెలిపింది. ఈ రెండు వాయువులూ జీవోత్పత్తికి ముఖ్యమైన మూలపదార్థాలట. ఒకనాడు వాతావరణం, ప్రకృతి, జీవి రాశీ విలసిల్లి - తిరిగి అంతమౌతున్న దశలో కుజుని పరిస్థితి ఉన్నట్లుగా శాస్త్రవేత్తలు తేల్చి చెప్తున్నారు.


ఇక శుక్రుని పరిస్థితిని తెలుసుకుందాం. వ్యాసం, ద్రవ్యరాశీ, పరిమాణం, గురుత్వాకర్షణశక్తీ, పలాయన వేగం - వీటన్నింటిలో శుక్రుడు, సుమారుగా భూమిని పోలి ఉన్నాడు. శుక్రుని పై దట్టమైన వాతావరణం ఉంది. అయితే ప్రకృతి, జీవరాశీ ఏర్పడగల పరిస్థితులు మాత్రం ఇంకా కలగలేదట. ప్రకృతి ఏర్పడక ముందు కొన్ని కోట్ల సంవత్సరాల క్రితం మన భూమి ఎలా ఉండేదో, ప్రస్తుత శుక్రగ్రహం ఆ దశలో ఉందట. అంటే మరిన్ని కోట్ల సంవత్సరాలకు... ప్రకృతి, జీవరాశులు భూమిపై నశించే సమయానికి, శుక్రగ్రహం ప్రకృతికి అనుకూలంగా మారుతుందన్నమాట.


మన పురాణాలు చెప్తున్న కల్పకాల సిద్ధాంతాన్ని, “ఆధునిక సైన్సు” పై విధంగా సమర్థిస్తోంది.

ఆర్య చాణక్య*♦️ *పార్ట్ - 117*

 .    *🌹చారిత్రాత్మక కథాస్రవంతి🌹*

.           ♦️ *ఆర్య చాణక్య*♦️


*పార్ట్ - 117*


చాణక్యునికి దౌహిత్రుడు జన్మించాడు. 


చాణక్యుని ఏకైక పుత్రిక అన్నపూర్ణ గర్భవసాన జన్మించిన ఆ బాలునికి 'రాధాగుప్తుడు' అని నామకరణం చెయ్యబడింది. పుత్రసంతానములేని చాణక్యుడు దౌహిత్రుని జననంతో తమకి 'ఉత్తరగతులకు' లోపం జరగదనుకొని ఆనందించాడు. 


అర్థశాస్త్రము, కామసూత్రములు మౌర్య సామ్రాజ్యమంతటా ప్రచారం చెయ్యబడ్డాయి. ఆ సేతు హిమాచలము వరకూ విస్తరించిన మౌర్య సామ్రాజ్యములోని జనులందరూ ఆ రెండు శాస్త్రములనూ తమ తమ నిత్యజీవితాలలో పాటించి, సత్ఫలితాలు పొంది సుఖశాంతులతో వృద్ధి చెందసాగారు. 


చాణక్యునికి ఆముష్మిక జీవనం మీదకి మనసు మళ్లింది. తపోవనానికి చేరి శేషజీవితాన్ని తపస్సు చేసుకుంటూ గడిపి వెయ్యాలని ఆలోచించాడు. తన భార్య గౌతమిని సంప్రదించాడు. 


"మీతో తపోవనానికి రావడానికి, వానప్రస్థ జీవనం గడపడం నాకు ఇష్టమే.... కానీ నాదొక్క మనవి. మన వివాహమైన యిన్ని సంవత్సరాలలో నేను కోరుతున్న ఒకే ఒక కోరిక..." అన్నది గౌతమి. 


అర్ధాంగి వైపు ప్రశ్నార్థకంగా చూశాడు ఆర్యుడు. 


"దౌహిత్రుడు జన్మించి ఆరుమాసాలు మాత్రమే అయినది. మనకెటూ పుత్రసంతానం లేదు. కనీసం మనవడి అచ్చట్లు ముచ్చట్లు కొంతకాలం చూసి ఆనందించాలని ఉంది. ఆ తర్వాత మీ యిచ్ఛానుసారమే మనం వానప్రస్థ ఆశ్రమ జీవితాన్ని గడుపుదాం" అని కోరింది గౌతమి. 


భార్య కోరికలోనూ ధర్మమున్నదనిపించి "సరే" అన్ని సమ్మతించాడు చాణక్యుడు. 


మనవడి ఊసులు చూస్తూ ఆనందిస్తున్న చాణక్యునికి బాలల కోసం ఏదైనా శాస్త్రం వ్రాయాలనిపించింది. "పిల్లలు స్వచ్ఛమైన సరస్సువంటి మనస్సు గలవారు. ఆ వయస్సులో వాళ్ళకి మంచి విషయాలు నేర్పితే, ఆ పసివయసు నుంచే వారి మనస్సులు ధర్మహితాలై, వారి భవిష్యత్తులు ఆదర్శవంతంగా ప్రకాశిస్తాయి. ఆ వయస్సు పిల్లలకి నేర్పడం సులభం." 


ఆ విధంగా ఆలోచించిన చాణక్యుడు తాను రచించిన అర్థశాస్త్రాన్నించి ముఖ్యమైన సూత్రాలను తీసుకొని వాటిని సంక్షిప్తం చేస్తూ నీతిసూత్రాల రూపంలో చిన్న గ్రంథం తయారుచేశాడు. 


బాలలకోసం గ్రంధస్తం చేసిన ఈ శాస్త్రానికి "రాజనీతి సూత్రాణి" అని పేరు పెట్టాడు చాణక్యుడు. 


బాలలకి సులభంగా అర్థమయ్యేటట్లు చిన్నచిన్న వాక్యాలతో 8 అధ్యాయాలతో 562 సూత్రాలతో రచించబడిన ఈ చాణక్యనీతి సూత్రాలు తెలుగు వ్యాఖ్యానాలతో మీ ముందుకు ...

(ఇంకా ఉంది)...🙏l


*సేకరణ:- శ్రీ రమణమూర్తి గారి వాట్సాప్ పోస్ట్.* 


🪻🪻🪻🪻🪻🪻🪻🪻🪻🪻

👉 *రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*

🌺☘️🌺☘️🌺☘️🌺☘️🌺☘️

గుళ్ళల్లో ప్రసాదం

 🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹

*గుళ్ళల్లో ప్రసాదం పెడతారు ఎందుకు?*

🌹🌹🌹🌹🌹🌹🌹


మేము తిరుపతి వెళ్లి వచ్చాము అనో, శబరి మలై వెళ్లి వచ్చామనో ప్రసాదం ఇస్తారు . #అసలు గుళ్ళల్లో ప్రసాదం ఎందుకు పెడతారు, కేవలం అది భక్తితోనేనా లేక మరేదైనా కారణం ఉందా అని ఆలోచిస్తే మనకు ఒక అద్భుతమైన విషయం బోధ పడుతుంది. #మరే వ్యవస్థలో లేని సోషలిజం మనకు ఈ ప్రసాద వితరణ లో కనపడుతుంది.  #అదేదో ఊరికే నైవేద్యం పెట్టి మనం లాగించడానికి కాదు అనే తత్వం బోధపడుతుంది. 

#ఒక ఊరి లో ఉండే ప్రజలందరూ మంచి పౌష్టికాహారం  తీసుకునే స్థితిలో ఉండరు. #బాగా డబ్బులున్న వాళ్ళు పేదవాళ్ళ గురించి పట్టించుకోరు. #వారికి కూడా మీరు తినే బలమైన ఆహారం పెట్టండి అంటే ఎవరూ ముందుకు రారు. #అదే దేముడికి ప్రసాదం చేయించండి, మీకు పుణ్యం వస్తుంది అంటే సంతోషంగా ఒప్పుకుంటారు. #అలా చేయించిన పౌష్టికాహారాన్ని  దేముడికి నైవేద్యం పెట్టి ప్రసాదం పేరుతో అన్ని వర్గాల వారికి అందించడం ప్రసాద వితరణ వెనుక ఉన్న అసలు రహస్యం. #మనం తీసుకునే పులిహోర, దద్దోజనం, చక్ర పొంగలి, సెనగలు, కట్టె పొంగలి మొదలైన వాటిల్లో ఇనప ధాతువు (ఐరన్), కార్బో హైడ్రేట్లు, కాల్షియం, పీచు పదార్థాలు, సోడియం, పొటాసియం, ఇంకా అనేక రకాల ఔషధ గుణాలు ఉంటాయి. 

#కాబట్టి ప్రసాదం పెట్టడం ద్వారా ఊరి లోని జనాలందరినీ బలంగా, ఆరోగ్యంగా ఉంచాలి అనేది మన పెద్ద వాళ్ళ ఉద్దేశ్యం.


*సర్వోజనా సుఖినోభావంతు*

సేకరణ:- వాట్సాప్ పోస్ట్ 

🙏🙏🙏

ఏరు దాటాక తెప్ప

 🌹🌹 *సుభాషితమ్* 🌹🌹

--------------------------------------------


*శ్లోకము*


కార్యార్థీ భజతే లోకః

యావత్కార్యం న సిధ్యతి ।

ఉత్తీర్ణం చ పరే పారే 

నౌకాయాః కిం ప్రయోజనం||


(సుభాషితరత్నావళి)


*తాత్పర్యం*


 తీరాన్ని దాటిన తరువాత నదిలోని నావ యొక్క ప్రయోజనమేమి ఉండదు.అదేరీతి అవసరాల నిమిత్తం ఉపయోగించుకుని చేసిన మేలుని కూడా మరచిపోతారు. లోకములో ఇటువంటి వారే చాలా మంది.

ఏరు దాటాక తెప్ప తగలబెట్టడం అనే సామెత.


 


 

Birds



 

సమన్వయ లోపం


 

గోపబాలునిగా కృష్ణయ్య

 శుభోదయం🙏





గోపబాలునిగా కృష్ణయ్య


మ: "శ్రవణోదంచిత కర్ణికారములతో స్వర్ణాభ చేలంబుతో

నవతంసాయిత కేకి పింఛకముతో నంభోజదామంబుతో

స్వవశుండై మధురాధరామృతముచే వంశంబుఁ బూరించుచు

న్నువిదా ! మాధవుఁ డాలవెంట నవమందొప్పారెడిం జూచితే.


భాగవతము:దశ:స్కం- 769 పద్యము: బమ్మెర పోతన !


సాహిత్య పిపాస గల భావుకులను తన్మయ పరచే సన్నివేశాలు భాగవతంలో కోకొల్లలు. అందులో నొకటి

బాలగోపాలుని బృందావిహారం. 


గోపాలునిగా ,మోహన వంశీధరునిగా, విలసిల్లే గోపాలకృష్ణుని ముగ్ధమనోహర రూపం ఈపద్యంలో 

పోతన కవితాచిత్రంగా చిత్రించి మనకళ్ళకు కట్టించాడు.


కర్ణికారమంటే కొండగోగు పూవు . చెవిలో కొండగోగుపూవు నలంకరించుకున్నాడట. అప్పటి షోకది." ఇప్పుడైతే అది వెక్కిరింపు". బంగరుచేలం ధరించాడట.కలవారిబిడ్డ .యెంత డాబుగా ఉంటాడో అంతగానూ ఉన్నాడు. శిరస్సు పైన తురాయిగా

నెమలి పిఛాన్ని ధరించాడట. మెడలో తామరపూలమాల. చేతిలో మోహన మురళి . 


దాన్ని పెదవులకాన్చి వేణుగానం చేయుచున్నాడట. గోవులు ఆమురళీగానామృతాన్ని తన్మయంతో వింటూ మోరలెత్తి చూస్తున్నాయట.

చూడవే చూడు. కిష్ఠయ్య యెంత అందంగా ఉన్నాడో! అంటూ గోపికలు ఆనందాశ్చర్యములతో 

బాలగోపాలుని చూచి ముచ్చట పడుచున్నారట. ఇదీ ఇక్కడిదృశ్యం.


వింటున్న మనకే యెంతో ముచ్చటగా ఉంటే కళ్ళెదటనున్నవారు ముచ్చటపడటంలో వింతేముంది?

లీలా శుకులవారు(బిల్వమంగళుడు) శ్రీకృష్ణకర్ణామృతంలో ఈఘట్టాన్ని చాలామనోహరంగా వర్ణించారు. అదికూడా విందాం.


శ్లో: మన్దం మన్దం మధుర నినదైః వేణు మాపూరయంతం /

బృందం బృందావనభువి గవాం చారయంతం చరతం /

ఛందోభాగే శతమఖ మఖ ధ్వంసినాం దానవాణాం /

హంతారమ్ తం కథయ రసనే! గోపకన్యా భుజంగం//


మెల్ల మెల్లగా వేణువు నూదుతూ మంద మందలుగానున్న గోవులను ముందుకు తోలుతూ తాను వాటివెనుక అడుగులు వేయుచు (యజ్ఙభాగాలు సరిపోక )దేవతల యజ్ఙాలనునష్టపరచు,రాక్షసులనుసంహరించు, మురారి యెంత మనోహరంగా ఉన్నాడో! వర్ణించరాదటే ఓనాలుకా! ఆగోపకన్యావిటుని యందాన్ని వర్ణించు, అంటున్నాడు కవి.

ఇంత మనోహరమైన యీదృశ్యాన్ని అక్షరాలలో చదివిన మీరు కనులు మూసి తలపుల 

తలుపులు తీసి మరోసారి దర్శించటానికి ప్రయత్నంచేయండి. అదే రసానందం!!! "రసోవైసః"-అన్నమాటలోని మర్మంకూడా ఇదే!!

                        

                 స్వస్తి!🙏🙏

ఆచరణ వల్ల మాత్రమే

 శ్లోకం:☝️

*అంతస్తిమిరనాశాయ*

 *శబ్దబోధో నిరర్థకః ।*

*న నశ్యతి తమో నామ*

 *కృతయ దీపవార్తయా॥*


అన్వయం: _మనసి యః తమః పూరితః వర్తతే తస్య శమనం నీతివాక్యైః ఏవ న భవితుం శక్నోతి యథా రాత్రికాలస్య అంధకారః దీపవిషయే చర్చాం కృత్వా న నశ్యతి ।_


భావం: కేవలం "దీప" శబ్దానికి అర్థం తెలుసుకోవడం ద్వారా లేక ఉచ్ఛరించడం ద్వారానో చీకట్లు తొలగింపబడవు. అటులనే నీతి వాక్యలు చదివినంత మాత్రాన లేక వల్లె వేసినంత మాత్రాన మానసిక చీకట్లు పోవు. అంటే ఆచరణ వల్ల మాత్రమే మానసిక పరివర్తన సాధ్యమవుతుందని భావం.🙏

Pujalu analysis


 

ఈ రోజు పంచాంగం

 ఈ రోజు పంచాంగం 15.07.2023 Saturday,

 

స్వస్తి  శ్రీ చాన్ద్రమాన శోభకృన్నామ సంవత్సర: ఉత్తరాయణం గ్రీష్మ ఋతు ఆషాఢ మాస కృష్ణ పక్ష: త్రయోదశి తిధి స్థిర వాసర: మృగశిర నక్షత్రం వృద్ధి యోగ: గరజి తదుపరి వణిజ కరణం ఇది ఈరోజు పంచాంగం. 


త్రయోదశి రాత్రి 08:34 వరకు.

మృగశిర రాత్రి 12:24 వరకు.

సూర్యోదయం : 05:53

సూర్యాస్తమయం : 06:50

వర్జ్యం : తెల్లవారుఝామున 04:31 నుండి ఉదయం 06:14 వరకు.

దుర్ముహూర్తం: ఉదయం 05:53 నుండి 07:37వరకు.


రాహుకాలం : పగలు 09:00 నుండి 10:30 వరకు.


యమగండం : మధ్యాహ్నం 01:30 నుండి 03:00 వరకు. 



శుభోదయ:, నమస్కార:

శని త్రయోదశి

 _*🚩(15.07.23) శని త్రయోదశి ,  శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వరదేవుడు సంతృప్తి చెందుతాడు ?🚩*_


శనిదేవుడు అంటే చాలా మంది బయపడతారు. వాస్తవానికి శని దేవుడు చాలా మంచివాడు. అమ్మ నాన్నల ప్రేమను శని దేవుడు చూపి స్తాడు. శని భగవానుడు అంటే నీతి , న్యాయం , ధర్మబద్దతకు కట్టుబడి ఉంటాడు. గోచారరిత్య శనిదేవుని అశుభ దృష్టి ఉన్నవారు భక్తితో కొలిచి ధర్మబద్దంగా జీవించే వారిని ఎలాంటి కీడు చేయకుండా కాపాడుతాడు.


*శని త్రయోదశి అంటే*


శనివారం రోజు త్రయోదశి తిథి ఉన్న రోజును శని త్రయోదశి అంటారు. ఆ రోజు స్వామి వారిని నువ్వులతో, నూనేతో నల్లని వస్త్రంతో అభిషేకం చేస్తే ఎంతో మంచిదని పెద్దలు చెబుతుంటారు. 


*అయితే ఎలాంటి అభిషేకాలు చేయాలి ,  ఎలా చేయాలి ?*


శనీశ్వరుడికి నువ్వుల నూనెతో అభిషేకం చేయాలి.

కుటుంబ, ఉద్యోగ, వ్యాపార , ఆరోగ్య, కోర్టు కేసులు, శత్రువులు , రుణాలు నుంచి విముక్తుల్ని చేయాల్సిందిగా మొక్కుకుని నియమాలు పాటిస్తారు. శనీశ్వరుడి ఆలయం నుంచి బయటికు వెళ్ళేప్పుడు అక్కడ ఉన్న బిక్షగాల్లకు, పేదవారికి శక్తి కొలది ఆహార రూపంలో కాని , వస్త్ర ,ధన, వస్తు రూపంలో కాని దాన ధర్మాలు విరివిగా విశాల హృదయంతో చేస్తేమంచి ఫలితాలు దక్కుతాయి.పూజకు వాడే నల్లటి వస్త్రం సుమారు రెండు మీటర్ల పోడవు అంటే ఒక లుంగి లాంటిది ఉండాలి. పూజ తరువాత ఆ వస్రాన్ని దానం చెస్తే దానం తీసుకున్నవారు ఉపయోగించు కునేలా ఉండాలి అని అర్ధం . దానాలు అనేవి ఉన్నవారికి చేస్తే ఫలితంరాదు. కేవలం నిరుపేదలకు, పశు పక్షాదులకు చేస్తేనే పుణ్య ఫలం దక్కుతుంది ఇది గమనించాలి.


*త్రయోదశి వ్రతం :-*


శనీశ్వరుడు సూర్యభగవానునికి ఛాయాదేవికి కలిగిన కుమారుడని శాస్త్రాలు చెబుతున్నాయి. కాశ్యపన గోత్రం. సోదరుడు యమధర్మరాజు , సోదరి యమున , స్నేహితులు హనుమాన్ , కాలభైరవుడు. శనికి ఉన్న ఇతర పేర్లు కోణస్త , పింగళ , కృషాణు , శౌరి , బభ్రు , మంద , పిప్పలా , రౌద్రాంతక , సూర్యపుత్ర అని పిలవబడుతాడు.నిజానికి శని భగవానుడిని మనసారా పూజించి ఆరాధించే భక్తులను కష్టాలనుంచి గట్టెక్కించే కరుణామూర్తి శనీశ్వరుడు. ఏ త్రయోదశి అయితే శనివారంతో కూడి ఉంటుందో ఆ రోజు శని గ్రహాన్ని శనీశ్వరుడుగా సంబోధించి పరమశివుడు వరం ఇచ్చాడని అంటారు. ఈ శని త్రయోదశి అంటే శనికి చాలా ఇష్టం. దోషాలను పోగొట్టి మానవులు కోరుకున్న కోరికలను తీర్చి శుభ ఫలితాలను అందించేవాడు శనీశ్వరుడు. దీనికి నిష్టా నియమం కావాలి. ఈ రోజు ఎలాంటి నియామాలు పాటించాలి.


*శని త్రయోదశి రోజున పాటించవలసిన నియమాలు*


1️⃣ఉదయాననే నువ్వుల నూనేతో ఒళ్ళంతా మర్ధన చేసుకుని తలస్నానం చేయాలి.


2️⃣ఆ రోజు మద్య , మాంసాలు ముట్టరాదు.వీలైన వారు శివార్చన తామే స్వయంగా చేస్తే మంచిది.


3️⃣శనిగ్రహ స్థానదోషాల వలన బాధపడేవారు

*నీలాంజన సమభాసం*

*రవిపుత్రం యమాగ్రజం*

*ఛాయా మార్తాండ సంభూతం*

*తం నమామి శనైశ్చరం.*


అనే స్తోత్రాన్ని వీలైనన్ని ఎక్కువ సార్లు పఠిస్తే మంచిది.


4️⃣వీలైనంత వరకు ఏపని చేస్తున్నా మౌనంగా ఉంటూ దైవ చింతనతో ఉండాలి.


5️⃣అందరిలోను ప్రతీ జీవిలోను దేవున్ని చూడగలగాలి.


6️⃣ఎవరితోను వాదనలకు దిగరాదు.


7️⃣ఆరోజు ఆకలితో ఉన్న వారికి , పశు పక్షాది జీవులకు భోజనం పెడితే మంచిది.


8️⃣ఉదయం సూర్యోదయం కాగనే శరీరానికి నువ్వుల నూనే రాసుకుని గంట తర్వాత స్నానం చేయాలి. ఇలా చేస్తే శని అనుగ్రహాన్ని పొందవచ్చని పురాణాలు చెబుతున్నాయి.


9️⃣మూగ జీవులకు ఆహార గ్రాసలను , నీటిని ఏర్పాటు చేయాలి.


🔟కాకులకు బెల్లంతో చేసిన రొట్టెలను నువ్వులనూనేతో కాల్చి చిన్న చిన్న ముక్కలుగా చేసి కాకులకు వేయాలి.


1️⃣1️⃣అనాధలకు , అవిటి వారికి , పేద వితంతువులకు , పేద వృద్ధులకు ఏదో రూపంగా సహయపడాలి.


1️⃣2️⃣జీవిత భాగస్వామితో సఖ్యతతో మెలగాలి.


1️⃣3️⃣ప్రతి రోజు తల్లి దండ్రుల పాద నమస్కారం చేసుకోవాలి.


1️⃣4️⃣అత్త మామలను , వంట చేసి వడ్డించిన వారిని , మన మేలు కోరేవారిని , ఉద్యోగం ఇప్పించిన వారిని , ఆపధ కాలంలో సహాయంగా నిలచిన వారిని ఎట్టి పరిస్థితులలో నిందించరాదు.


1️⃣5️⃣ఎట్టి పరిస్థితులలోను భాద్యతలను , భవ బంధాలను మరువరాదు.


ఈ విధంగా వ్యవహరించగలిగితే తప్పక శని భగవానుడు పూర్తి స్థాయి మేలు చేసి మంచి ఉన్నత స్థానంలో నిలబెడతాడని పురాణ వచనం.


దశరథుని రాజ్యానికి శనైశ్చర గ్రహబలం లేనందున కష్టాలు వస్తే , శనైశ్చరుని స్తుతించి దశరథుడు ఈ స్తోత్రాన్ని చేస్తాడు. ఈ స్తోత్రం పారాయణము చేసినవారికి శీఘ్రముగా నవగ్రహ అనుగ్రహం కలిగి ఏలినాటి శని , అర్ధాష్టమ శని దోషాలు తొలగి సంపదలు , ఐశ్వర్యాన్ని ఇస్తారని ఫలశ్రుతి. నిత్యం లేదా తప్పక శని వారం శనిత్రయోదశి వంటి పర్వదినాలలో పారాయణము చేయడం మంచిదని గురువుగారు పద్మపురాణ ప్రవచనంలో చెప్పారు. 


_*దశరథకృత శ్రీ శని స్తోత్రం*_


*ఓం నమః కృష్ణాయ నీలాయ - శితికంఠనిభాయ చ*

*నమః కాలాగ్ని రూపాయ - కృతాంతాయ చ వై నమః*


*నమో నిర్మాంసదేహాయ దీర్ఘశ్మశ్రుజటాయచ*

*నమో విశాల నేత్రాయ - స్థూలరోమ్ణే చ వై పునః*


*నమో దీర్ఘాయ శుష్కాయ కాలదంష్ట్ర నమోస్తుతే*

*నమోస్తు కోటరాక్షాయ - దుర్నిరీక్షాయ వై నమః*


*నమో నీలమధూకాయ - నీలోత్పలనియభాయ చ*

*నమో ఘోరాయ రౌద్రాయ - భీషణాయ కరాళినే*


*నమస్తే సర్వభక్షాయ - బలీముఖ నమోస్తుతే*

*సూర్యపుత్ర నమస్తేస్తు భాస్కరాభయదాయ చ*


*అథో దృష్టే నమస్తేస్తు - సంవర్తక నమోస్తుతే*

*నమో మందగతే తుభ్యం నిస్త్రింశాయ నమోస్తుతే*


*తపసా దగ్ధదేహాయ- నిత్యం యోగరతాయ చ*

*నమో నిత్యం క్షుధార్తాయ - అతృప్తాయ చ వై నమః*


*జ్ఞాన చక్షు ర్నమస్తేస్తు- కశ్యపాత్మజసూనవే*

*తుష్ఠోదదాసి నై రాజ్యం - రుష్ఠో హరసి తత్తణాత్*


*దేవాసురమనుష్యా శ్చ సిద్ధ విద్యాధరోరగాః*

*త్వయా విలోకితా స్సర్వే - నాశం యాంతి సమూలతః*


*ఓం నమస్తే కోణసంస్థాయ - పింగళాయ నమోస్తుతే*

*నమస్తే బభ్రురూపాయ - కృష్ణాయ చ నమోస్తుతే*


*నమస్తే రౌద్రదేహాయ నమస్తే చాంతకాయ చ*

*నమస్తే యమసంజ్ఞాయ- నమస్తే సౌరయే విభో*


*నమస్తే మందరూపాయ శనైశ్చర నమోస్తుతే*

*ప్రసాదం కుర మే దేవ వరార్థో హ ముపాగతః*


*ప్రసాదం కురు దేవేశ - దీనస్య ప్రణతస్య చ*


*ఇతి శనిస్తోత్రమ్*

🙏🙏🕉️🙏🙏🕉️🙏🙏🕉️🙏🙏