7, డిసెంబర్ 2022, బుధవారం

ఆరోగ్య దినోత్సవo

 *అందరికీ ఆరోగ్య దినోత్సవ శుభాకాంక్షలు*

🄷🄰🄿🄿🅈 🄸🄽🅃🄴🅁🄽🄰🅃🄸🄾🄽🄰🄻

🄷🄴🄰🄻🅃🄷   🄳🄰🅈

గుర్తుంచుకోవలసిన ముఖ్యమైన విషయాలు:

1. BP: 120/80

2. పల్స్: 70 - 100

3. ఉష్ణోగ్రత: 36.8 - 37

4. శ్వాస: 12-16

5. హిమోగ్లోబిన్: మగ -13.50-18

స్త్రీ - 11.50 - 16

6. కొలెస్ట్రాల్: 130 - 200

7పొటాషియం: 3.50 - 5

8. సోడియం: 135 - 145

9. ట్రైగ్లిజరైడ్స్: 220

10. శరీరంలో రక్తం మొత్తం: PCV 30-40%

11. చక్కెర స్థాయి: పిల్లలకు (70-130) పెద్దలు: 70 - 115

12. ఐరన్: 8-15 మి.గ్రా

13. తెల్ల రక్త కణాలు WBC: 4000 - 11000

14. ప్లేట్‌లెట్స్: 1,50,000 - 4,00,000

15. ఎర్ర రక్త కణాలు RBC: 4.50 - 6 మిలియన్లు.

16. కాల్షియం: 8.6 -10.3 mg/dL

17. విటమిన్ D3: 20 - 50 ng/ml.

18. విటమిన్ B12: 200 - 900 pg/ml.

*40/50/60 సంవత్సరాల వయస్సు గల వృద్ధులకు ప్రత్యేక చిట్కాలు:*

*1- మొదటి సూచన:* మీకు దాహం లేదా అవసరం లేకపోయినా అన్ని సమయాలలో నీరు త్రాగాలి, అతి పెద్ద ఆరోగ్య సమస్యలు మరియు వాటిలో ఎక్కువ భాగం శరీరంలో నీటి కొరత కారణంగా. రోజుకు కనీసం 2 లీటర్లు.

*2- రెండవ సూచన:* శరీరం నుండి సాధ్యమైనంత ఎక్కువ పని చేయండి, నడక, ఈత లేదా ఏదైనా క్రీడ వంటి శరీర కదలికలు ఉండాలి.

*3-3వ చిట్కా:* తక్కువ తినండి... ఎక్కువగా తినాలనే కోరికను విడనాడండి... ఎందుకంటే అది ఎప్పుడూ మంచిని తీసుకురాదు. మిమ్మల్ని మీరు కోల్పోకండి, కానీ పరిమాణాన్ని తగ్గించండి. ప్రొటీన్లు, కార్బోహైడ్రేట్లు అధికంగా ఉండే ఆహారాన్ని ఎక్కువగా వాడండి.

*4- నాల్గవ సూచన:* ఖచ్చితంగా అవసరమైతే తప్ప వాహనాన్ని ఉపయోగించవద్దు. మీరు కిరాణా సామాను తీసుకోవడానికి, ఎవరినైనా కలవడానికి లేదా ఏదైనా పని చేయడానికి ఎక్కడికైనా వెళుతున్నట్లయితే, మీ పాదాలపై నడవడానికి ప్రయత్నించండి. ఎలివేటర్లు, ఎస్కలేటర్లు ఉపయోగించకుండా మెట్లు ఎక్కండి.

*5- 5వ సూచన* కోపాన్ని విడిచిపెట్టండి, చింతించడం మానేయండి, విషయాలను విస్మరించడానికి ప్రయత్నించండి. సమస్యాత్మక పరిస్థితులలో మునిగిపోకండి, అవి అన్ని ఆరోగ్యాన్ని పాడు చేస్తాయి మరియు ఆత్మ యొక్క కీర్తిని తీసివేస్తాయి. సానుకూల వ్యక్తులతో మాట్లాడండి మరియు వారి మాటలు వినండి.

*6- ఆరవ సూచన* ముందుగా, డబ్బుతో ఉన్న అనుబంధాన్ని వదులుకోండి

మీ చుట్టూ ఉన్న వ్యక్తులతో కనెక్ట్ అవ్వండి, నవ్వండి మరియు మాట్లాడండి! డబ్బు మనుగడ కోసం, డబ్బు కోసం జీవితం కాదు.

*7-7వ గమనిక* మీ గురించి లేదా మీరు సాధించలేని దేని గురించి లేదా మీరు ఆశ్రయించలేని దాని గురించి చింతించకండి.

దానిని విస్మరించండి మరియు మరచిపోండి.

*8- ఎనిమిదో నోటీసు* డబ్బు, పదవి, పలుకుబడి, అధికారం, అందం, కులం మరియు ప్రభావం;

ఇవన్నీ అహాన్ని పెంచుతాయి. వినయం మనుషులను ప్రేమతో దగ్గర చేస్తుంది.

*9- తొమ్మిదవ చిట్కా* మీ జుట్టు తెల్లగా ఉంటే, అది జీవితాంతం అని కాదు. ఇది మంచి జీవితానికి నాంది. ఆశాజనకంగా ఉండండి, జ్ఞాపకశక్తితో జీవించండి, ప్రయాణం చేయండి, ఆనందించండి. జ్ఞాపకాలను సృష్టించండి!

*10- 10వ సూచనలు* మీ చిన్నారులను ప్రేమ, సానుభూతి మరియు ఆప్యాయతతో కలవండి! వ్యంగ్యంగా ఏమీ అనకండి! మీ ముఖం మీద చిరునవ్వు ఉంచండి!

గతంలో ఎంత పెద్ద పదవిలో ఉన్నా, వర్తమానంలో దాన్ని మరచిపోయి అందరితో కలిసిపోండి!

*11- 11 వ హెచ్చరిక*

ఆడవారు మీ ఇంటి లో వంటచేయడం, ఇల్లు, వాకిలి తుడిచి కలాపి,ముగ్గు లు వేయడం, ముఖ్యంగా వంటపాత్రలు తోమడం వంటి ఇంటి పనులు స్వయంగా చేసుకోండి., పనిమనుషులపై ఆధారపడి బతికినంతవరకూ రోగాలు మీతో సహవాసం చేస్తూనే ఉంటాయి, ఈనాటి తొంభై శాతం గృహిణుల నిత్య రోగాలకు ఇదే ప్రధాన కారణం, మన సంప్రదాయం స్త్రీల ఆరోగ్యం కోసం ఇటువంటి కర్తవ్యాలను విధిస్తే మనం తెలియకుండా నే పనిమనుషులకు బానిసలమై,రోగాల కు లోకువై ఆసుపత్రులకు బంధువులమై రోదిస్తున్నాము.

దత్తాత్రేయాష్టోత్తర శతనామావళి

 వేదధర్ముడు సందీపకునికి ఉపదేశించిన దత్తాత్రేయాష్టోత్తర శతనామావళి 


నమస్తే పుండరీకాక్ష దత్తాత్రేయ జగద్గురో! 

సిద్ధులు కూడా ఎవరి వలన సిద్ధిని పొందుతున్నారో అటువంటి స్వామికి నమస్కారం అంటూ అష్టోత్తర శతనామావళిని ఉపదేశించారు వేదధర్ముల వారు. ఇది పరంపరాగతమైన, ఋషిప్రోక్తమైన అష్టోత్తర శతనామావళి. 


స్వామిని స్మరిస్తే చాలు అనుగ్రహిస్తాడు, స్మరించిన వారి హృదయాన్ని తన నివాసంగా చేసుకుంటాడు. తినేదానిని ఒక్కసారి స్వామికి నివేదన చేస్తే అదే ఆయనకు మహానైవేద్యం. తినేటప్పుడు దత్తస్మరణ చేసుకొని తింటే మహాదానం చేసిన ఫలం లభించగలదు. ఇంద్రాదులకు కూడా దుర్లభమైన ఐశ్వర్యం లభిస్తుంది. రక్షణ లేని స్థలాలలో ఒక్కసారి స్మరిస్తే చాలు రక్షణనిస్తాడు. రాజద్వారాలయందు, అడవులలోను, దుర్గమమైన ప్రాంతాలలో ఉన్నప్పుడు దత్తుని నామాలు స్మరిస్తే చాలు. ఈ నామాలను స్మరిస్తూ ఆయా అవయవాలను స్పృశిస్తే ఆ అవయవాలలో ఉన్న రోగములు కూడా పోతాయి. కాళ్ళు, చేతులు కడుక్కొని ఆచమనం చేసి దత్తధ్యానపూర్వకంగా ఈ నామాలను పఠించాలి. 


శ్రీ దత్తాయ నమః; దేవతద్దాయ నమః; బ్రహ్మదత్తాయ నమః; విష్ణుదత్తాయ నమః; శివదత్తాయ నమః; అత్రిదత్తాయ నమః; ఆత్రేయాయ నమః; అత్రివరదాయ నమః; అనసూయాయ నమః; అనసూయాసూనవే నమః; అవధూతాయ నమః; ధర్మాయ నమః; ధర్మపరాయణాయ నమః; ధర్మపతయే నమః; సిద్ధాయ నమః; సిద్ధిదాయ నమః; సిద్ధిపతయే నమః; సిద్ధిసేవితాయ నమః; గురవే నమః; గురుగమ్యాయ నమః; గురోర్గురుతరాయ నమః; గరిష్ఠాయ నమః; వరిష్ఠాయ నమః; మహిష్ఠాయ నమః; మహాత్మనే నమః; యోగాయ నమః; యోగగమ్యాయ నమః; యోగాదేశకరాయ నమః; యోగపతయే నమః; యోగీశాయ నమః; యోగాధీశాయ నమః; యోగపరాయణాయ నమః; యోగిధ్యేయాంఘ్రిపంకజాయ నమః; దిగంబరాయ నమః; దివ్యాంబరాయ నమః; పీతాంబరాయ నమః; శ్వేతాంబరాయ నమః; చిత్రాంబరాయ నమః; బాలాయ నమః; బాలవీర్యాయ నమః; కుమారాయ నమః; కిశోరాయ నమః; కందర్పమోహనాయ నమః; అర్థాంగాలింగితాంగనాయ నమః; సురాగాయ నమః; విరాగాయ నమః; వీతరాగాయ నమః; అమృతవర్షిణే నమః; ఉగ్రాయ నమః; అనుగ్రరూపాయ నమః; స్థవిరాయ నమః; స్థవీయసే నమః; శాంతాయ నమః; అఘోరాయ నమః; గూఢాయ నమః; ఊర్ధ్వరేతసే నమః; ఏకవక్త్రాయ నమః; అనేక వక్త్రాయ నమః; ద్వినేత్రాయ నమః; త్రినేత్రాయ నమః; ద్విభుజాయ నమః; షడ్భుజాయ నమః; అక్షమాలినే నమః; కమండలధారిణే నమః; శూలినే నమః, డమరుధారిణే నమః; శంఖినే నమః; గదినే నమః; మునయే నమః; మౌనినే నమః; శ్రీవిరూపాయ నమః; సర్వరూపాయ నమః; సహస్రశిరసే నమః; సహస్రాక్షాయ నమః; సహస్రబాహవే నమః; సహస్రాయుధాయ నమః; సహస్రపాదాయ నమః; సహస్రపద్మార్చితాయ నమః; పద్మహస్తాయ నమః; పద్మపాదాయ నమః; పద్మనాభాయ నమః; పద్మమాలినే నమః; పద్మగర్భారుణాక్షాయ నమః; పద్మకింజల్కవర్ఛసే నమః; జ్ఞానినే నమః; జ్ఞానగమ్యాయ నమః; జ్ఞానవిజ్ఞానమూర్తయే నమః; ధ్యానినే నమః; ధ్యాననిష్ఠాయ నమః; ధ్యానస్థిమితమూర్తయే నమః; ధూళిధూసరితాంగాయ నమః; చందనలిప్తమూర్తయే నమః; భస్మోద్ధూళితదేహాయ నమః; దివ్యగంధానులేపినే నమః; ప్రసన్నాయ నమః; ప్రమత్తాయ నమః; ప్రకృష్టార్థప్రదాయ నమః; అష్టైశ్వర్యప్రదాయ నమః; వరదాయ నమః; వరీయసే నమః; బ్రహ్మణే నమః; బ్రహ్మరూపాయ నమః; విష్ణవే నమః; విశ్వరూపిణే నమః; శంకరాయ నమః; ఆత్మనే నమః; అంతరాత్మనే నమః; పరమాత్మనే నమః!! 

శ్రీదత్తాత్రేయాయ నమోనమః!! అనఘాయై నమః!! అనఘాయ నమః! అనఘానఘాభ్యాం నమః!!


ఈ నామములు పఠించే ముందు చదవవలసిన శ్లోకం – 

పీతాంబరాలంకృత పృష్ఠభాగం భస్మావగుంఠామలరుక్మదేహమ్!

విద్యుత్సదాపింగ జటాభిరామం శ్రీదత్తయోగీశమహంనతోఽస్మి!!

*శ్రీ దత్త జయంతి

 _*శ్రీ దత్త జయంతి*_ 

_* (07-12-2022)*_

♻️♻️♻️♻️♻️♻️♻️♻️♻️♻️♻️


*దత్తాత్రేయ తవ శరణం దత్తనాధా తవ శరణం*

*త్రిగుణాత్మకా త్రిగుణాతీతా త్రిభువన పాలక తవ శరణం*

అత్రి మహాముని, మహా పతివ్రత అనసూయల సంతానమే దత్తాత్రేయుడు. ఈయన త్రిమూర్తులు అంటే బ్రహ్మ, విష్ణు, పరమేశ్వరుల అంశలతో జన్మించిన అవతారమూర్తి. అందునా దత్తాత్రేయుడు విష్ణువు అంశతో, చంద్రుడు బ్రహ్మ అంశతో, దుర్వాసుడు శివుని అంశతో జన్మించారని పురాణ కథనం. 


*"దత్తా" అంటే…* 


‘దత్తా’ అనే పదానికి “సమర్పించిన” అనే అర్థముంది. శ్రీ దత్తాత్రేయ జయంతిని మార్గశిర శుక్ల పౌర్ణిమనాడు జరుపుకుంటారు. త్రిమూర్తులు బ్రహ్మ, విష్ణు మరియు మహేశ్వరుల అవతారమైన దైవ స్వరూపులు. త్రిమూర్తులు అత్రి మహర్షి మరియు అనసూయ దంపతులకు పుత్రుడి రూపంలో తమను తాము “సమర్పించుకున్నారు” కనుక దత్తా అని పేరు వచ్చింది. అత్రి కుమారుడు కాబట్టి ఆయన పేరు *“ఆత్రేయ”* అయింది.


*దత్తజయంతి రోజున పాటించవలసిన నియమాలు ఏమిటి?* 


దత్త జయంతి రోజున తెల్లవారుఝామునే భక్తులు నదీస్నానం లేదా ఏటి స్నానం చేస్తారు. దత్తత్రేయునికి షోడశోపచారాలతో పూజ చేస్తారు. జప,ధ్యానాలకు ఈ రోజు ప్రాముఖ్యం ఇస్తారు. దత్తాత్రేయుని యోగమార్గం అవలంబిస్తామని సంకల్పించుకుంటారు. *దత్త చరిత్ర, గురు చరిత్ర, అవధూత గీత, జీవన్ముక్త గీత, శ్రీపాదవల్లభ చరిత్ర, నృసింహసరస్వతి చరిత్ర, షిర్డి సాయిబాబా చరిత్రం, శ్రీదత్తదర్శనం వంటివి పారాయణ చేస్తారు. ఈ రోజు ఉపవాసం ఉండడం కూడా ఆనవాయితీనే. సాయం వేళలో భజనలు చేస్తారు.*


 *దత్త చరిత్ర* 


ఒకసారి లోకకళ్యాణార్థం నారదుడు ఆడిన చతురోక్తికిలోనైన లక్ష్మీ, సర్వస్వతి, పార్వతిమాతలు, మహాపతివ్రత అయిన అనసూయపై ఈర్ష్య అసూయ ద్వేషాలను పెంచుకున్నారు. 


నారద మహర్షి అనసూయ “పాతివ్రత్యాన్ని” (భర్త పట్ల భక్తిభావం) గురించి బ్రహ్మ, విష్ణు,మహేశ్వరుల ధర్మపత్నుల ముందు విశేషంగా ప్రశంసించాడు. 


*"ఈర్ష్య, అసూయ, ద్వేషమనే దుర్గుణలకు లోనయితే! దేవతలకైనా అనేక దుఃఖాలు కలుగుతాయని సర్వులకు తెలియచెప్పడానికో, శ్రీదత్తుని అవతారానికి నాంది పలుకడానికో!"* 


ఈ గుణాలు వారి మనస్సునిండా దావానలంలా వ్యాపించి ముగ్గురమ్మల గుండెలు భగ్గుమన్నాయి. వారి వారి పత్నులను తక్షణం ఆ అనసూయ ఆశ్రమానికి వెళ్ళి ఆమె పాతివ్రత్యాన్ని భగ్నం చేయమని ప్రార్థించారు. త్రిమూర్తులు ఎంతవారించినా, పెడచెవిన పెట్టారు ససేమిరా అన్నారు. ఇక చేయునది లేక సన్యాస వేషములు ధరించి అత్రి ఆనసూయ ఆశ్రమ ప్రాంతమందు భూమిపై పాదంమోపారు త్రిమూర్తులు.


వారి పాదస్పర్శకు భూదేవి పులకించింది, వృక్షాలు వారికి వింజామరలు వీస్తున్నట్లుగా తలలాడిస్తూ వారి పాదలచెంత పుష్పాలు పండ్లు నేలకురాల్చాయి. నెమలి పురివిప్పి నాట్యం చేయసాగింది. లేడిపిల్లలు చెంగు చెంగున గంతులువేస్తూ వారి వద్దకు వస్తున్నాయి. కుందేటి పిల్లలు వారి పాదాలు స్పృశించి పునీతమవ్వాలని అడుగడుగునా పాదాలకు అడ్డుపడుతున్నాయి. వన్యప్రాణుల కేరింతలతో అ ఆశ్రమ వాతవరణం అంతా ఆహ్లాదమవుతోంది. ఈ ఆకస్మిక పరిణామ మేమిటో? అని వారిని చూచిన పక్షులు కిలకిలా రావలు చేయసాగాయి.  ఇవికాక ఒక ప్రక్క పవిత్ర జలపాతాల సోయగాలు, మరోప్రక్క ఆశ్రమ బాలకుల వేదమంత్రోచ్చారణ కర్ణామృతంగా వినిపిస్తున్నాయి. ఇంత చక్కని ప్రకృతి అందాలకు ఆలవాలమైన ఈ రమణీయ వాతావరణమందు తేలియాడుతున్న ఈ భూలోకవాసులు ఎంతటి అదృష్టవంతులో, మనం ముగ్గురం కూడ చిన్నారి బాలురవలె ఈ మునిబాలకులతో కలిసి ఆడుకుంటే! ఎంతబాగుండునో! అని తన్మయత్వంతో ఆ త్రిమూర్తులు పలుకుతారు. అలా మైమరపిస్తున్న ఆ ఆశ్రమ వాతావరణం నుంచి ఒక్కసారి తెప్పరిల్లి ఇంతకీ మనం వచ్చిన మాటను మరచి మన భార్యలకు ఇచ్చిన మాటను విస్మరించాం; అని తలచి ఆశ్రమం ముంగిటవైపునకు పయనమయినారు.


మహా తపోబలసంపన్నుడైన కర్దమ మహర్షికి, దేవహూతికి జన్మించిన అనసూయాదేవిని, ముని శ్రేష్టుడైన అత్రిమహర్షికి ఇచ్చి వివాహంచేసారు. అప్పటి నుండి ఆమె గృహస్థురాలిగా గృహస్థధర్మాన్ని చక్కగా నిర్వహిస్తూ అత్రిమహర్షికి సేవలు చేస్తూ, అతిధి అభ్యాగతులను ఆదరిస్తూ తన “పతి సేవతత్పరతచే” పొందిన పాతివ్రత్య మహిమలతో ముల్లోకాలను అబ్బురపరస్తూ; పంచభూతాలు, అష్టదిక్పాలకులు సహితం అణకువగా వుండేలా చేస్తున్న ఆ పతివ్రతామతల్లిని, దివ్యతపోతేజోమూర్తి అయిన అత్రిమహర్షిని చూసినంతనే త్రిమూర్తులు ముగ్ధులయ్యారు. ఆ సాధుపుంగవుల ముగ్గురిని చూచిన ఆ పుణ్య దంపతులు, సాదరంగా ఆశ్రమంలోనికి అహ్వానించి ఉచిత ఆసనాలు ఇచ్చి స్వాగత సత్కారాలు చేసి, అనంతరం మీరు మువ్వురు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులవలె వచ్చి మా ఆశ్రమాన్ని పావనం చేశారు, భోజనాలు సిద్ధంచేశాను రండి అంటూ! అనసూయమ్మ ఆహ్వానం పలికింది. అత్రిమహర్షితో కలిసి ముగ్గురు సాధువులు ఆసీనులయ్యారు. ఇక వడ్డన ప్రారంభించుటకు సమాయత్తమవుతున్న అనసూయతో నగ్నరూపంలో వడ్డిస్తేనే తాము భుజిస్తామని వారు చెప్పారు.


వారి పలుకులు విన్న ఆ పతివ్రతామతల్లి ఇప్పుడు తన కర్తవ్యం ఏమిటా అని ఒక్కసారి తన ప్రత్యక్షదైవమైన “భర్త” ను మనసారా నమస్కరించుకుంది. “పాతివ్రత్యజ్యోతి” వెలిగింది. ఆమె జ్ఞాననేత్రం తెరుచుకుంది. కపట సన్యాసరూపంలో ఉన్న త్రిమూర్తుల గుట్టు రట్టు అయింది. వారి అంతర్యమేమిటో గ్రహించింది. పెదవుల వెంట చిరునవ్వు చెక్కు చెదరకుండా! ఏమి నా భాగ్యము! ముల్లోకాలను ఏలే సృష్టి, స్థితి, లయకారకులైన వీరు నాముంగిట ముందుకు యాచకులవలె వచ్చినారా? వీరిని కనుక నేను తృప్తిపరిస్తే ముల్లోకాలు కూడా ఆనందింపచేసిన భాగ్యం నాకు కలుగుతుంది కదా; అని ఆలోచిస్తూ! ఒక ప్రక్క పాతివ్రత్యం, మరోవైపు అతిథిసేవ. ఈ రెండు ధర్మాలను ఏకకాలాల్లో సాధించడమెలా? అనుకుంటూ పతికి నమస్కరించి “ఓం శ్రీపతి దేవాయనమః” అంటూ కమండలం లోని ఉదకమును ఆ త్రిమూర్తుల శిరస్సున చల్లింది. వెంటనే ఆ ముగ్గురు పసిబాలురయ్యారు! వెనువెంటనే అనసూయలో మాతృత్వం పొంగి స్తన్యం పొంగింది. కొంగచాటున ఆ ముగ్గురు బాలురకు పాలు ఇచ్చి వారి ఆకలి తీర్చింది. ఇంతలో ఋషి కన్యలు, ఋషిబాలురు కలిసి మెత్తని పూల పానుపుతో ఊయలవేయగా! వారిని జోలపాడుతూ నిదురపుచ్చింది.


“ఇంతటి మహద్భాగ్యం” సృష్టిలో ఏ తల్లికి దక్కుతుందో చెప్పండి….! 


ఆ వింత దృశ్యాన్ని చూచిన అత్రి మహర్షి ఒకసారి త్రుళ్ళిపడి మరలా తేరుకుని, తన దివ్య దృష్టితో జరిగినది, జరగబోతున్నది గ్రహించుకున్నాడు. ఈ త్రిమూర్తులు ఈ ఆశ్రమ ప్రవేశ సమయంలోనే ఆశ్రమ వాతావరణానికి తన్మయత్వంతో పలికిన పలుకులే! కార్యరూపం దాల్చడం బ్రహ్మవాక్కుగా తలచి ఆ చిన్నారులు బుడి బుడి నడకలతో, ఆడుతూ గెంతుతూ అ మునిబాలకులతో, కలిసి వారి కలలను పండించుకోసాగారు. మానవులకు బాల్య, కౌమార, యవ్వన, వార్ధక్యాలలో ఆనందముగా సాగేది ఈ బాల్యదశే కదా మధురాను భూతిని మిగిల్చిది అని మురిసిపోయారు. కనని తల్లి దండ్రులైన అత్రి అనసూయల పుత్ర వాత్సల్య బాంధవ్య అయౌనిజులైన వారికి చాలాకాలం కొనసాగుతోంది.


ఇలా ఉండగా! లక్ష్మీ, సరస్వతి, పార్వతి మాతలకు భర్తల ఆచూకీ తెలియక గుబులు పుట్టింది. అంతలో దేవర్షి నారదునివల్ల అత్రిమహర్షి ఆశ్రమమందు జరిగిన వింత తెలుసుకున్నారు. దానితో అనసూయపై ఏర్పడిన “ఈర్ష అసూయ  – ద్వేషాలు” పటాపంచలు అయ్యాయి. వెంటనే వారి స్వస్వరూపాలతోనే అనసూయ, అత్రిముని ఆశ్రమానికి చేరుకున్నారు. వారిని ముని కన్యలు స్వాగతించారు. అ సమయాన అనసూయమ్మ తల్లి ఆ చిన్నారులకు పాలు ఇచ్చి, ఊయలలో పరుండబెట్టి జోలపాడుతూ ఉంది! అంతలో ఆ ముగ్గురమ్మలను చూచి సాదరంగా ఆహ్వానించి, స్వాగత సత్కారములతో సుఖాసీనులను చేసింది.


పసిబాలుర రూపాల్లో ఉన్న వారి వారి భర్తలను చూచుకొని పతిబిక్ష పెట్టమని కన్నీళ్ళతో అత్రి అనసూయ పాదాలను ఆశ్రయిస్తారు. అయితే! మీ మీ భర్తలను గుర్తించి! తీసుకుని వెళ్ళండి అని అనసూయ హుందాగా చెబుతుంది. ఒకే వయస్సుతో, ఒకేరూపుతో, అమాయకంగా నోట్లో వేలువేసుకోని, నిద్రిస్తున్న అ జగన్నాటక సూత్రధారులను ఎవరు? ఎవరో? గుర్తించుకోలేక పోయారు. తల్లీ! నీ పాతివ్రత్య దీక్షను భగ్నం చేయ్యాలని “ఈర్ష్య, అసూయ, ద్వేషాలతో!” మేము చేసిన తప్పిదాన్ని మన్నించి మా భర్తలకు దయతో స్వస్వరూపాలు ప్రసాదించమని ప్రాధేపడతారు. అంత ఆ అనసూయమాత తిరిగి పతిని తలచుకుని కమండలోదకము తీయు సమయాన!


త్రిమూర్తులు సాక్షాత్కరించి, ఈ ఆశ్రమవాస సమయమందు, మీరు కన్న తల్లి దండ్రులకంటే మిన్నగా పుత్రవాత్సల్యాన్ని మాకు పంచిపెట్టారు. మీకు ఏమి వరంకావాలో కోరుకోమన్నారు. నాయనలారా! ఈ పుత్ర వాత్సల్యభాగ్యాన్ని మాకు! మీరు మీరుగా ఇచ్చినారు. అది మాకు శాశ్వతంగా ఉండేలా అనుగ్రహించండి అని వరం కోరుకున్నారు. అనసూయ ఆ ముగ్గురిని తన పిల్లలుగా శివ, విష్ణు, బ్రహ్మ అంశలతో దూర్వాసుడు, దత్తాత్రేయ మరియ వెన్నెల దేవుడు చంద్రుడుగా జన్మించవలసిందిగా వరమడిగింది. ఊయలలోని ఆ బాలురు అత్రి అనసూయలకు బిడ్డలై కొంతకాలం పెరిగిన తరువాత! బ్రహ్మ, శివుడు వారి వారి అంశలను “దత్తనారాయణు” నికి యిచ్చారు. అప్పటి నుండి ఆ స్వామివారు “శ్రీ దత్తాత్రేయ” స్వామిగా అవతార ఎత్తారు.


*సేకరణ*

☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️