21, నవంబర్ 2020, శనివారం

రామాయణమ్ 131

 రామాయణమ్  131

.....................

రాముడు తన మీద మరులుకొన్న శూర్పణఖను చూస్తూ పూజ్యురాలా! నాకు వివాహమైనది ఈమె నాకు చాలా ఇష్టురాలైన భార్య. నీవంటి ఆడవాళ్ళకు సవతిపోరు ఎందుకుగానీ అడుగో అతడు అక్కడున్నాడే వాడు! నా తమ్ముడు లక్ష్మణుడు! భార్య దగ్గర లేనివాడు, పరాక్రమ వంతుడు .

.

,చూడగానే ఆనందము కలిగించేవాడు,చాలాకాలమునుండి భార్యాసుఖము లేనివాడు ప్రస్తుతము భార్య అవసరము ఉన్నవాడు.అతడిని సేవించు నీకు సవతి పోరు ఉండదు అని పలుకగా ఆ రాక్షసి రాముని విడచి లక్ష్మణుని వద్దకేగి ఆయనతో " నీ సౌందర్యానికి నేనే తగిన దానను రా ! హాయిగా విహరిద్దాము అని పలికింది.

.

అప్పుడు పరిహాసంగా ఒక చిరునవ్వు నవ్వి ఓ! లోకోత్తరసుందరీ! నేనే దాసుడను అడుగో మా అన్న ఆయనకు దాస్యము చేస్తున్నాను నాతోపాటు నీవుకూడా దాసివి అవుతావా ఆ బాధలు నీకెందుకు గానీ ఆయననే మరొక్కమారు అడుగు ,వికృతంగా అణగిపోయిన పొట్టతో భయంకరంగా ఉన్న ఆ ముసలి భార్యను విడిచి నిన్నే చేసుకుని రమిస్తాడు అని వేళాకోళంగా మాట్లాడాడు.

.

అది నిజమే అని నమ్మి మరల రాముని వద్దకు వెళ్లి .

ఈ వికృత రూపంతో చెడ్డదైన ముసలి భార్య నీకెందుకు? దీనిని ఇప్పుడే నేను తినేస్తాను నాకు సవతి పోరు ఉండదు ,అప్పుడు మనమిద్దరమూ సుఖముగా ఉండవచ్చు అని అంటూ సీతను భక్షించడానికి మీదమీదకు రాసాగింది .

.

అది మీదకు వస్తుంటే సీతమ్మ వణికిపోయింది వెంటనే రాముడు అడ్డము వచ్చి  ,లక్ష్మణా అంటూ కేకవేశాడు.

.

ఇదుగో ఈ రాక్షసులతో మనకు పరిహాసమెందుకు? ఈ రాక్షసి చాలా మదించి ఉన్నది దీనిని వికృత రూపుగాలదానినిగా చెయ్యి అని పలికాడు.

.

వెనువెంటనే లక్ష్మణుడు ప్రక్కనే ఉన్న ఒక ఖడ్గాన్ని తీసుకొని శూర్పణఖ ముక్కు చెవులు కోసివేశాడు.ఆ గాయాల బాధకు అది వికృతముగా అరుస్తూ వచ్చినదారినే పారిపోయింది.

..

జానకిరామారావు వూటూకూరు

.

రామాయణమ్ 130

 రామాయణమ్ 130

................

నీవెవ్వరవు? అని శూర్పణఖ అడిగిన ప్రశ్నకు ఉన్నదున్నట్లుగా తెలిపాడు రాముడు 

,తమ ముగ్గురి పేర్లు తాము అడవికి ఎందుకు వచ్చినదీ సవివరంగా తెలిపాడు .

రాముడు ఋజువర్తనుడు కావున ఏదీ దాయకుండా చెప్పాడు.

.

తమ గురించి చెప్పి మరి నీవెవరవు అని అడిగాడు 

.

అందుకు ఆ రాక్షసి " రావణో నామ మే భ్రాతా బలీయాన్ రాక్షసేశ్వరః " 

.

విశ్రవసుని కుమారుడైన రావణుడు నా సోదరుడు ,వాడు మహా బలవంతుడు .

ఎల్లప్పుడూ నిద్రలో ఉండే కుంభకర్ణుడు,ధర్మాత్ముడు రాక్షస ప్రవృత్తిలేని విభీషణుడు కూడా నా సోదరులే అని పలికింది.

.

పరాక్రమవంతులైన ఖరదూషణులు నా సోదరులు.

.

రామా !నేను వాళ్ళెవరినీ లెక్క చేయను.నిన్ను తొలిసారిగా చూసిన దగ్గరనుండీ మనోభావముచేత నిన్ను భర్తగా అనుకున్నాను.నా ఇష్టము వచ్చిన చోటికి విహరింపగల శక్తి నాకున్నది ,

.

రా ! నాతొ ఉండు నా భర్తగా ఉందువుగాని ఈ సీతతో నీకేమి పని ?

.

ఈ సీత ఆకారము ,రూపములో కూడా వికారముగా ఉన్నది.నీకు తగినది కాదు ,నేనే నీకు తగిన దానను ,నన్ను భార్యగా పొందు. ఈ మనుష్య స్త్రీ ఆకారమేమిటి ఇలా ఉన్నది? ఈమె పొట్ట లోనికిపోయి అణగి ఉన్నది దీనిని తినివేస్తాను నేను.

.

మనమిరువురమూ కలిసి దండకారణ్యములో స్వేచ్చగా విహరిద్దాము , అని పలికింది .

.

దాని మాటలన్నీ విన్న రాఘవుడు చిరు నవ్వుతో ఇలా అన్నాడు.

.

జానకిరామారావు వూటుకూరు

రామాయణమ్ 129

 రామాయణమ్ 129

..............

గోదావరిలో స్నానము చేసి సకల దేవతార్చనము పూర్తి చేసి తిరిగి పర్ణశాల చేరుకొని సుఖంగా ముగ్గురూ కబుర్లు చెప్పుకుంటూ  ఉన్నారు  .

.

అప్పుడు.

ఒక ముసలి రాక్షస స్త్రీ ,అక్కడకు వచ్చి  దగ్గరగా రాముడిని చూసింది .

.

నయనమనోహరంగా కనబడ్డాడు రాముడు దానికి ,విశాలమైన వక్షస్థలం,బలిష్ఠమైన బాహువులు,విచ్చిన తామరపూవుల వంటి కన్నులు ,నల్లకలువ వంటి శరీర ఛాయ ,మన్మధునివంటి సౌందర్యముతో మహేన్ద్రుడిలాగా ఠీవిగా ఉన్నాడు రాముడు.

.

రాముడిని చూడగానే దాని మనస్సును మన్మధబాణాలు సూటిగా వేగంగా వచ్చి తాకాయి.

.

రాముడి ముఖము చాలా అందముగా ఉన్నది,

దాని ముఖము వికృతము!

.

రాముడి నడుము సింహపు నడుములాగా సన్నగా ఉన్నది దానిది బాన పొట్ట .

.

ఆయన నేత్రాలు విశాలము ,

దాని నేత్రాలు వికారము!

.

ఆయనది నల్లని జుట్టు

,దానిది రాగి జుట్టు

.

చూసేవారి కన్నులకు ఆనందము కలిగించే రూపము ఆయనది,

దానిది భయంకరమైన రూపము.

.

ఆయన కంఠ ధ్వని మధురము ,

దాని పలుకులు కర్ణ కఠోరమైనవి.

.

ఆయన నవయవ్వనుడు

 ఆవిడ వృద్ధురాలు

.

ఆవిడ  పేరు శూర్పణఖ ఆవిడ  రావణుడి చెల్లెలు!  . 

.

రాముడిని సమీపించి రాముడితో ఎవరు నీవు? భార్యా సమేతుడవై,ధనుర్బాణాలు ధరించి ముని వేషముతో ,రాక్షస నివాస ప్రాంతమునకు ఎందుకు వచ్చావు,నీకు ఏమి పని ఇక్కడ అని పలికింది.

.

జానకిరామారావు వూటుకూరు

రుద్రాక్ష మాల

 రుద్రాక్ష మాల ధరించుటకు పాటించవలసిన ముఖ్య నియమాలు  -


 *  రుద్రాక్ష మాల ధరించాలనుకునేవారు పంచాక్షరి మంత్రాన్ని 108 సార్లు జపించి ఆవుపాలతో శుద్ధిచేసి ధరించగలరు.


 *  సంవత్సరానికి ఒకసారి రుద్రాక్ష అధిష్టాన దేవత పూజ చేయించి ఆ పూజలో రుద్రాక్షమాలను ఉంచి మరలా ధరించవలెను .


 *  ఎల్లప్పుడూ రుద్రాక్ష మాలని ధరించువారు కనీసం సంవత్సరానికి ఒకమారు ఆ రుద్రాక్ష మాలకు " మహన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం " చేసినచో చాలా మంచిది .


 *  రుద్రాక్ష మాలను బంగారంతో గాని వెండితో గాని చుట్టించుకొని తీసుకువచ్చి గంగాజలంతో శుభ్రపరచి , పంచామృతాలతో శుద్దిచేసి ఆయా రుద్రాక్ష యొక్క అధిష్టాన దేవత మందిరంలో ఉంచి పూజించి ధరించవలెను .


 *  రుద్రాక్షమాలను ధరించవలసిన తిథులు పౌర్ణమి , త్రయోదశి , చతుర్దశి , మహాశివరాత్రి , కార్తీకమాస సోమవారముల యందు ధరించవలెను .


 *  రుద్రాక్షలను రుద్రాక్ష పూజా మంత్రములతో పూజచేయకుండా ధరించిన ఫలితం ఉండదు.


 *  రుద్రాక్షలు కొన్ని సంవత్సరాల పాటు మన్నికగా ఉండవలెను అనిన వాటికి ఆవునెయ్యి నెలకొకమారు రాయవలెను.


 *  ప్రతినిత్యం స్నానం చేయునపుడు రుద్రాక్షమాల తీసి పక్కన పెట్టి స్నానం చేయుట మంచిది .


 *  రుద్రాక్షలతో ముత్యాలు , పగడములు , స్పటికములు , శంఖాలు , తులసి పూసలు , నవరత్నాలు కలిపి ధరిస్తారు . ఇలా ధరించేప్పుడు కనీసం రుద్రాక్షలు 27 గాని , 54 గాని ఉండవలెను .


 *  శివరాత్రి పర్వదినమున రుద్రాక్షలతో పూజ చేయుట చాలా శ్రేష్టం .


 రుద్రాక్ష ధారణకు శుభసమయ వేళలు  -


 *  మేష , కర్కాటక , తులా , మకర , కుంభ లగ్నముల యందు రుద్రాక్ష ధారణ చేయవలెను .


 *  అశ్వని , మృగశిర , పునర్వసు , పుష్యమి , హస్త , స్వాతి , అనూరాధ , శ్రవణం , రేవతి నక్షత్రాలలో రుద్రాక్ష ధారణ చాలా మంచిది .


 *  పంచమి , సప్తమి , దశమి , ఏకాదశి , త్రయోదశి , పౌర్ణమి తిథులలో ధరిస్తే మంచిది .


 *  సోమవారం  ధరిస్తే చాలా మంచిది . లేదా శనివారం కూడా ధరించగలరు . కృష్ణపక్షంలో (పౌర్ణమి తదుపరి బహుళపాడ్యమి నుండి అమావాస్య వరకు ) ధరిస్తే మంచిది .


 *  కార్తీకమాసంలో ధరిస్తే చాలా మంచిది . లేదా మార్గశిర మాసంలో కూడా ధరించవచ్చు . భాద్రపద , పుష్య , శ్రావణ , అశ్వయుజ మాసంలో కూడా ధరించవచ్చు .


 *  రుద్రాక్షమాల ధారణకు మహాశివరాత్రి పర్వదినం చాలా ఉత్తమం.


 రుద్రాక్షధారణ కు పాటించవలసిన నియమాలు -


 *  సోమరులు అయి ఉండకూడదు. సేవా కార్యక్రమాలు యందు ఆసక్తి కలిగిఉండవలెను.


 *  అపద్దాలు ఆడకూడదు . దయ, దాక్షిణ్యం , ఏకాంతం , క్షమాగుణములలో సాత్విక అభిప్రాయంతో , శాంతస్వభావులై ఉండవలెను .


 *  కామ, క్రోధ, లోభ, మోహ , మద మాత్సర్యాలను వదిలిపెట్టి సంప్రదాయ బద్ధమైన విషయాలను నిందించకూడదు .


 *  పాపాత్ములతో సావాసం చేయరాదు .


 *  వితంతువులు రుద్రాక్ష ధారణ చేయుట మంచిది .


 *  రుద్రాక్ష ధరించువారు ధూమపానం మానివేయవలెను .


 *  రుద్రాక్ష ధారణ చేసినవారు వెల్లుల్లి , నీరుల్లి , మద్యమాంసాదులు మానివేయవలెను .


   గమనిక  -


           నాచే రచించబడిన "ఆయుర్వేద మూలికా రహస్యాలు " , " ప్రాచీన ఆయుర్వేద రహస్యాలు "  అను ఈ రెండు గ్రంథముల యందు అత్యంత రహస్యమైన సులభముగా ఇంటి యందు , చుట్టుపక్కల దొరికే మూలికలతోనే పెద్దపెద్ద రోగాలను నయం చేసుకొనే విధముగా అనేక వైద్య యోగాలను ఇచ్చాను. ఈ గ్రంథాలలో ఇచ్చినటువంటి యోగాలు అన్నియు గత 250 సంవత్సరాల నుంచి వంశపారంపర్యముగా మాకు వస్తున్న రహస్యయోగాలు పరోపకారార్థం దాచుకోకుండా ప్రచురించాను.


           మన చుట్టుపక్కల ఉండే మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల బొమ్మలతో మొక్కల చిత్రపటాలు ఇవ్వడం జరిగింది.


            రైతులకు ఉపయోగపడేవిధముగా చెట్లను , భూమిని బట్టి , రాళ్లని బట్టి భూమి యందు జలమును కనుగొను విధానం , ముహూర్తాలను అనుసరించి ఏయే సమయాలలో పంటలు వేయాలి . ఆయుర్వేద మూలికల సహాయముతో పురుగు మందులు వాడకుండా అత్యంత ఎక్కువ దిగుబడులు సాధించే రహస్య వృక్షయుర్వేద యోగాలు , పశువులకు సంబంధించిన వైద్య యోగాలు కూడా ఇవ్వడం జరిగింది . ఈ గ్రంథాలలో ఇచ్చిన యోగాలు ఉపయోగించటం వలన ఎటువంటి వ్యతిరేక ఫలితాలు రావు.


      ప్రాచీన ఆయుర్వేద రహస్యాలు గ్రంథం 288 పేజీలు ఉంటుంది . విలువ 350 రూపాయలు మాత్రమే . ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథం 384 పేజీలు ఉంటుంది . విలువ 450 రూపాయలు . కొరియర్ చార్జి 100 రూపాయలు అదనం .పుస్తకములు ఎక్కువ కాలం మన్నిక కొరకు కుట్టించి ఇవ్వడం మరియు అత్యంత నాణ్యమైన తెల్లటి 80GSM పేపరుతో ఉంటాయి.


            ఈ రెండు గ్రంథాలు కావలసినవారు డైరెక్టుగా 9885030034 నెంబర్ కి ఫోన్ చేయగలరు. కామెంట్లు , మెస్సేజెస్ సమాధానము ఇవ్వబడదు. కాల్ చేయగలరు .


                  కాళహస్తి వేంకటేశ్వరరావు 


                         9885030034 


               అనువంశిక ఆయుర్వేద వైద్యులు

Kartika masam



 

సౌందర్య లహరి

 **దశిక రాము**


**సౌందర్య లహరి**


**శ్రీశ్రీశ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతీ స్వామి వారి భాష్యం**


ఇరవైయవ శ్లోక భాష్యం - ఆరవ భాగం


అమృతంతో సంబంధమున్న గరుత్మంతుడు ప్రజలను విషము నుండి రక్షిస్తాడు. చంద్రకాంత శిలామూర్తిగా అంబికను ధ్యానం చేసినవారు గరుడుని వలే పాముల విషాన్ని శమింప చేయగలడని ఆచార్యులవారంటున్నారు. “ససర్పాణాం దర్పం శమయతి శకుంతాధిప ఇవ”. 'శకుంతము' అంటే పక్షి. మేనకా విశ్వామిత్రుల సంతానము పక్షుల చేత పెంచబడి శకుంతల అయింది కదా! గరుత్మంతుడు శకుంతాధిపుడు పక్షిరాజు. 


ఈ శ్లోకం జపం చేయడం వలన పాముకాటు వల్ల ఎక్కినా విషము హరించడమేకాక, దోమవంటి కీటకముల వలన కలిగిన చలిజ్వరములు, వైరల్ జ్వరములు కూడా శమిస్తాయి. అంబికను అమృత కిరణమూర్తిగా ధ్యానించిన వారికి అమృతనాడి సిద్ధిస్తుంది. లేక సహస్రారంలో కురిసిన అమృతపు జల్లులకు అతడి నాడీమండలమంతా అమృత మయమవుతుంది. అమృత నాడులున్న అతడి దృష్టి జ్వరగ్రస్తుని పై పడితే చాలు, జ్వరం మటుమాయమయిపోయి అతడు సుఖిస్తాడు. 


“జ్వరపుష్టాన్ దృష్ట్యా సుఖయతి సుధాధార సిరయా”


అంబిక అరుణారుణమైన తనుచ్ఛాయతో నభోంత రాళములు ప్రకాశిస్తున్నట్లు ఆ కాంతితో భూమ్యాకాశములు నిండిపోయినట్లు భావించిన సాధకునికి వశీకరణ శక్తి లభిస్తుందని పద్దెనిమిదవ శ్లోకంలో చెప్పబడి ఉంది. సాధారణంగా అంబిక తనుచ్ఛాయ శుద్ధస్ఫటికం వలె ప్రకాశించేదే అయినప్పటికీ, శ్రీవిద్యాధిదేవతగా అంబిక అరుణవర్ణంతో ప్రకాశిస్తుందని చెప్పబడింది. అది శ్రీ విద్యాధిదేవత యొక్క ప్రత్యేకత. సూర్యోదయ కాలంలో ఆకాశమంతా అరుణిమతో ప్రకాశిస్తుంది కదా! అదే విధంగా భూమ్యాకాశములు, సమస్త బ్రహ్మాండము ఆమె తనుచ్ఛాయవలన అరుణారుణంగా ప్రకాశిస్తోందనే భావన చేయాలన్నమాట. వశీకరణ విషయంలో మనం వశీకరింపబడకూడదనే ఉద్దేశంతో నేనా శ్లోకాన్ని వ్యాఖ్యానించలేదు. అయితే అంబిక యొక్క ప్రత్యేకత అయిన ఈ అరుణ వర్ణం గురించి చెప్పుకోకుండా ఉండేదెలా? అదీకాక వశీకరణం యొక్క అంతరార్థం గురించి మనం చెప్పుకోవద్దా?


సొందర్యలహరిలోనూ మరి అటువంటి ఇతర శాక్త గ్రంథములలోనూ వశీకరణ, స్త్రీవశ్యము, మన్మథునిబోలిన గురించి బహుధా చెప్పబడి ఉంటుంది. ఆ మాటల అర్థాన్ని కేవలం వాచ్యార్థంగా తీసుకొంటే ప్రమాదమున్నది. ఒక వ్యక్తీ ఇంకొకరిని ఆకర్షించడానికి ప్రయత్నిస్తున్నాడంటే అర్థమేమిటి? అతడు వారిచే ఆకర్షించబడినాడన్న మాట. అందువల్లనే వశీకరణ మంత్రాలను ఉపయోగించి వారిని స్వంతం చేసుకోవాలని ప్రయత్నిస్తాడు. ఒకరు ధన కనక వస్తువాహనాది సంపదను సంపాదించి, వాటిని తాను స్వంతం చేసుకొన్నానని భావిస్తారు. నిజంగా జరిగేది ఏమంటే అతడు వాటిచేత స్వంతం చేసుకోబడ్డాడు. వాటికి బానిస అయినాడు. దీనికి తార్కాణమేమిటి? ఒకవేళ ఆ సంపద పోయినట్లయితే ఈతడి మతి చలించిపోతోంది కదా! ఏదో ఒక వస్తువునో, వ్యక్తినో వశీకరించుకోవాలని మంత్రజపం చేసే వ్యక్తి, తన వశ్య మంత్రానికి గమ్యమైన వస్తువు లేక కోరికకు బానిస అయిపోయాడు. అటువంటి వానికి అంబికను సదా తన హృదయంలో ఉంచుకొని ధ్యానిస్తూ క్రమశః ఆత్మసాక్షాత్కారం పొందే దారి మూసి వేయబడుతుంది.


మంత్రశాస్త్రాన్ని ఆవిష్కరించిన ఆచార్యుల వారి వంటి మహాపురుషులు ఒక మనిషి తన పరమగమ్యము చేరుకోవడానికి పయనించవలసిన దారిని మూసివేసే పద్ధతి ఉపదేశిస్తారని మీరనుకొంటున్నారా? అంబిక భక్తులు మనఃస్థితిని ఆచార్యులవారు “మృదితమల మాయేన మనసా” అని అభివర్ణిస్తారు. భక్తుని మనసు చెడ్డ ఆలోచనలకు, కోరికలకు దూరంగా మాయను అణచి ఉండే విధంగా ఉంటుందట. అంబిక భక్తుడు తుచ్ఛమైన వశీకరణాది విషయాల్లో మనస్సు పెట్టేవాడుకాదు. మాయ అనే మహా సర్పాన్ని కాళీయ మర్దనం చేసిన కృష్ణునివలె మర్దించేవాడు. కాబట్టి 'వశ్యము' అనేదానికి అంబికను ధ్యానించే సాధకుడు ఎటువంటి ఆకర్షణలకు బానిసకాడనీ, అతడి మనస్సు ఎప్పుడూ అతడి అధీనంలోనే ఉంటుందనీ అర్థం చెప్పుకోవాలి. అతడు వశీకరించు కొన్నాడన్న మాటకు ఆ వస్తువు అతనిలో ఐక్యమయిందనే అర్థం చెప్పుకోవాలి. గీతలో భగవానులు “సముద్రం ఆపః ప్రవిశంతి యద్వత్ తద్వత్ కామాయాం ప్రవిశంతి సర్వే” అంటారు. సముద్రం నదులన్నిటినీ తనవైపుకు లాగి తన అధీనంలోనికి తెచ్చుకొన్నట్లు - వశ్యమంటే తన వైపుకు లాగుకొనడమేకదా! నదులుగానీ, సముద్రం గానీ ఒకదాని కొకటి భిన్నంగా గుర్తించుకోలేవు కదా! సముద్రము నదులూ కూడా అద్వైత భావాన్ని పొది “శాంతిం ఆప్నోతి” శాంత స్థితిని పొందుతాయి.


(సశేషం)


కృతజ్ఞతలతో🙏🙏🙏


#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం

#ParamacharyaSoundaryaLahariBhashyam

🙏🙏🙏

సేకరణ

వేమన పద్యం *


 వేమన పద్యం *


తనువ  దెవరిసొమ్ము తనదని పోషింప, 

ధనమదెవరిసొమ్ము  దాచుకొనగ, 

ప్రాణ  మెవరిసొమ్ము పాయకుండగ  నిల్ప, 

విశ్వదాభిరామ వినురవేమ *


భావము =


మనిషి జన్మ పలు జన్మల పుణ్య సిద్ధి యని ఆర్యోక్తి. అలాంటి మనిషి పై, అతనిపై అతనికే అధికారములేదు, అది అంతా ఆ సర్వాంతర్యామి అయిన ఆ భగవంతుడు లీల. ఆయనే అన్ని నీకు సమకూర్చుతాడు, హరింపచేస్తాడు. ఈ సుందరమైన దేహం దేవుడిచ్చిన బహుమానం.  దీన్ని చూసుకుని మురిసిపోతూ ఉంటాము. ఎన్నాళ్లు  ఉంటామో ఈ సుందర రూపంతో తెలియని మనిషి తన అశాశ్వత రూపాన్ని ఎంతో ఆపురూపంగా చూచుకొన్నపటికి, ఆ దైవం ఆజ్ఞ కాగానే, నీది అనుకొన్న తనువు విడచి పోవాలిసిందే, ఇది అంతా నాది అనే ఆశతో దాచుకొన్న ధనము అంతా పరాధీనమై పోతుంది, ప్రాణము ను పోకుండా ఆపలేము, ఈ తనువు, ధనము, ప్రాణము,  అన్ని ఆ భగవంతుడు ఇచ్చినవి, ఈ లోకంలో ఆయన పిలవగానే అన్నిటిని విడచి ఆయన సన్నిధికి చేరుకోవలిసిందే.వున్న కొన్నినాళ్లు తోటి మనిషిని ప్రేమిస్తూ, సఖ్యత తో విరోధము లేక  జీవనమ్ సాగించటమే మనిషి ధర్మం.   ఇది ఈ నాటి వేమన పద్య భావన.


మీరు రాజబాబు 😷🎹🎼🎤

శాస్త్రోక్తంగా శ్రీ పద్మావతి అమ్మవారి పంచమీ తీర్థం

 శాస్త్రోక్తంగా శ్రీ పద్మావతి అమ్మవారి పంచమీ తీర్థం


తిరుప‌తి, 2020 నవంబ‌‌రు 19: సిరుల‌త‌ల్లి శ్రీ పద్మావతి అమ్మవారు అవతరించిన పంచమి తిథిని పురస్కరించుకుని కార్తీక బ్రహ్మోత్సవాల్లో చివరి రోజైన గురువారం పంచమీ తీర్థం(చక్రస్నానం) శాస్త్రోక్తంగా జరిగింది. ఆల‌యం వ‌ద్ద‌గ‌ల వాహ‌న మండ‌పంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన చిన్న పుష్కరిణిలో ఉద‌యం 11.52 గంటలకు కుంభ లగ్నంలో పంచమీ తీర్థం(చక్రస్నానం) ఘట్టం శాస్త్రోక్తంగా నిర్వహించారు. 


ఉదయం 7 గంటల నుండి 8 గంటల వరకు శ్రీ పద్మావతి అమ్మవారి పల్లకీ ఉత్సవం ఆలయంలో నిర్వహించారు. అనంతరం అమ్మవారికి ఆస్థానం నిర్వహించి ఉత్సవర్లను ఊరేగింపుగా వాహన మండపానికి వేంచేపు చేశారు. 


తిరుమల శ్రీవారి ఆలయం వద్ద తెల్లవారుజామున 4.30 గంటలకు బయలుదేరిన సారె ఉదయం 9.00 గంటలకు తిరుచానూరు అమ్మవారి ఆలయానికి చేరుకుంది. సారెను అమ్మవారికి సమర్పించి శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు. 


అమ్మవారికి శ్రీవారి ఆలయం నుండి ఆభరణాలు :


ఈ సందర్భంగా 112 గ్రాములు బ‌రువుగ‌ల బంగారు పతకం, 249 గ్రాములు బ‌రువుగ‌ల ప్లాటినం లక్ష్మీ పతకం, దశావతారముల బిళ్లలు కలిగిన ప్లాటినం చైను సారెతో పాటు ఊరేగింపుగా తీసుకొచ్చి అమ్మవారికి అలంకరించారు.


శోభాయ‌మానంగా స్న‌ప‌న‌ తిరుమంజ‌నం


 వాహన మండపంలో అమ్మవారికి, చక్రత్తాళ్వార్‌కు ఉదయం 10 గంటల నుండి 11.30 గంటల వరకు వేడుకగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, పసుపు, చందనం, కొబ్బరినీళ్లతో విశేషంగా అభిషేకం చేశారు.


నెమలి ఈకలు, యాలకులు, నెల్లి, ఫైనాపిల్, బ్లాక్ క్యాన్ బెర్రీ, లిల్లీ, తులసి, ఆర్కాడ్ పూలతో రూపొందించిన మాలలు, కిరీటాలు ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలిచాయి. 


తిరుపూర్ కు చెందిన దాతలు ఈ మాల‌ల త‌యారీకి విరాళం అందించారు. సేలంకు చెందిన కళాకారులు ఈ మాలలను రూపొందిచారు. 


ఆకట్టుకున్న ఫలపుష్ప మండపం:


టీటీడీ గార్డెన్ విభాగం ఆధ్వర్యంలో తామరపువ్వులు, ఆపిల్, గ్రీన్ ఆపిల్, రోజా, సంపంగి, ఆరు రకాల కట్ ఫ్లవర్స్ తో వాహన మండ పాన్ని ప్రత్యేకంగా అలంకరించారు. 


కాగా రాత్రి 7 నుండి 7.30 గంటల వరకు బంగారు తిరుచ్చి వాహనంలో అమ్మవారి ఉత్సవర్లను ఆలయంలో ఊరేగించనున్నారు. అనంతరం రాత్రి 8 నుండి 9.30 గంట‌ల వ‌ర‌కు శాస్త్రోక్తంగా ధ్వజావరోహణం జరుగనుంది.

*శ్రీ వేంకటేశ్వర దివ్య చరిత్ర - 22*

 *శ్రీ వేంకటేశ్వర దివ్య చరిత్ర - 22*


సోదిని నమ్మే ఆచారము వున్నది కదా! అందుచే శ్రీనివాసుడు కనకాంబరము చీర కట్టాడు. కాని రంగు రవికె తొడుగుకున్నాడు. ముద్దొచ్చే పచ్చబొట్టు ముఖానికి పెట్టుకున్నాడు. కండ్లకు నల్లనైన కాటుక పెట్టుకున్నాడు. తలమీద సోదిబుట్ట పెట్టుకొన్నాడు.


ఈ విధముగా ఎరుకలసాని వేషము ధరించినవాడై శ్రీనివాసుడు అచ్చు ఆడుదానివలె తయారయి ఆకాశరాజు నగరములో ప్రవేశించాడు. సరాసరి రాజభవనము చేరింది ఆ క్రొత్త సోది స్త్రీ‘. సోది చెబుతానమ్మా సోదీ!’ అని బిగ్గరగా కేక వేసింది. 


ఆకాశరాజు భార్య ధరణీదేవి ఈ మాట విన్నది. పిలిపించి ఆమెను ‘మా అమ్మాయికి సోది చెప్పుము’ అంది. ‘సరే’ యన్నది. ఎరుకల సాని పద్మావతిని బుట్టకి ఎదురుగా కూర్చుండజేసి చేటలో విలువైన ముత్యాలు పోయించినది. 


గద్దెపలక వుంటుంది కదా దానికి పసుపూ, కుంకుమా పెట్టించింది. దేవతలను కొలిచినది. మూలదేవతలకు మ్రొక్కినది. ఇంక సోది చెప్పుట ప్రారంభించినది.....


‘‘ఇనుకోవె ఓ పిల్లా ఇవరంగా చెప్పుదు

జరిగేది యంతా నిజముగా చెప్పుడు

వనములో పురుషుని వలపుతో జూసి 

అతని నీ మనసులో అట్లే దాచావు

గుండెలో నతుడు బాగుండినాడే పిల్ల 

శృంగార వనములో శృంగార పురుషుడే ‘‘నన్ను 

ప్రేమింతువా?’’ యని యన్నందుకే నీవు 

రాళ్ళతో కొట్టించు రాలుగాయీ పిల్లా.

వెన్నవంటీ మనసున్నవాడే వాడు. 

నిన్న బోలిన బాధ నున్నాడు వాడు. 

ఆ రోజు నడవి వాడనుకొంటివే వెఱ్ఱి!

ఆదిదేవుడు, నారాయణుడతండే. 

శ్రీనివాసునిగాను చెలగుచున్నాడే

ఆకాశమె క్రిందుగా గమనించిననూ 

భూమియే పైపైకి పోయినా ఏమైనా 

దంపతులగుదరు పెండ్లియు జరిగు 

దిగులు నీ పెండ్లితో దిగునులే పిల్లా‘‘

అని వున్నవీ, జరిగేవీ వివరముగా సోది చెప్పినది. వారిచ్చిన కట్నము తీసుకొని వెళ్ళిపోయింది ఎరుకులసాని.


ఎరుకసాని వేషము వేసుకొని సోది చెప్పిన తర్వాత శ్రీనివాసుడు పద్మావతి గురించే ఆలోచించసాగాడు. పద్మావతి శ్రీనివాసునితో తనకు ఏ విధముగా పెండ్లి జరుగుతుందా అనే ఆలోచనలో పడింది.


ఆకాశరాజు, ధరణీదేవి పద్మావతిని చూచి విచారించసాగారు. పద్మావతికి కలలో శ్రీనివాసుడు కనుపించి అనేకమైన లీలలు చూపించినాడు. ఆమె ఆవిషయము తన తల్లిదండ్రులతో చెప్పి తాను శ్రీనివాసుని తప్ప మరొకరిని వివాహమాడననెను. ధరణీదేవీ, ఆకాశరాజూ కూడా తాము పెద్దలను సంప్రదించి ఆమె కోరిక తీర్చడానికి ప్రయత్నిస్తా మన్నారు.


వకుళ, రాయబారము సాగించుటకు నారాయణపురము చేరినది. అంత:పురములో ప్రవేశించినది. ఆకాశరాజు, ధరణీదేవి ఆమెను తగురీతిని గౌరవించి పూజించారు. 


అనంతరము ఆకాశరాజు వకుళతో ‘‘అమ్మా! చూడగా మీరు యోగినివలె కనిపించుచున్నారు. మీ రాకవలన మా గృహము పావనమైనది. మీ రాకకు గల కారణము తెలుసుకొనవలెనని కుతూహల పడుచుంటిమి. మీరు యెక్కడ వుంటుంటారు? ముఖ్యంగా మీరు శ్రమపడి వచ్చిన పనిని తెలియజేయ కోరుతున్నాము. అన్నాడు. 


వకుళాదేవి ఆకాశరాజుతో మహారాజు! నేను శేషాచల నివాసిని, నాకు ఒక్కగానొక్క, కుమారుడు. అతనిపేరు శ్రీనివాసుడు. నాకుమారుని అందము చెప్పడానికి భాషలోని మాటలు చాలవు. అతనిది వశిష్టగోత్రము అతని వయస్సు ఇరవై ఐదు సంవత్సరాలు మాత్రమే. ఒకనాడు మావాడు వేటకు వెళ్ళి శృంగారవనమున ప్రవేశించి, మీ ముద్దుల కుమార్తె అయిన పద్మావతి యొక్క సౌందర్యతిశయాన్ని చూసి ప్రేమించినాడు. పద్మావతిని తప్ప అన్య కన్యను ఒల్లనంటున్నాడు.’’ ఈ మాటలు అంటూంటే ధరణీదేవి మా అమ్మాయి కూడా యింతే కదా అనుకొన్నది.


వకుళ చెప్పసాగినది. ‘‘నా కుమారుడు మూడు లోకాల్ని ఏలగల దిట్టడు. ఆ లక్షణాలన్నీ వున్నాయి. బుద్ధిమంతుడూ, అందగాడూ అయిన మా పిల్లవాడికి బుద్ధిమంతురాలూ, సుందరీ అయిన మీ కుమార్తెనిచ్చి వివాహము చేస్తే ఉభయత్రా బాగుంటుంది. కనుక, మీరు సందేహించక ఆ విధముగా చేయండి. మావాడు దైవాంశజుడేగాని, మానవమాత్రుడు కానేకాడు’’ సాత్త్విక భావము తొణికిసలాడే ఆమె పలుకులకు ఆకాశరాజు ఆనందించి ‘‘ అమ్మా! మీరు ఉన్న విషయాలన్నీ చెప్పారు. ఈ విషయాలన్నీ మా పెద్దలతో కూలంకషంగా యోచించి, ఏ విషయమూ మీకు వర్తమానము పంపుతాను’’ అన్నారు. వకుళాదేవి వారివద్ద శలవు గైకొని తిరిగి తన స్థలానికి చేరుకొన్నది.


*బిల్వపత్రార్చిత గోవిందా, బిక్షుక సంస్థుత గోవిందా,* *బ్రహ్మాండ రూప గోవిందా, భక్త రక్షక గోవిందా; |* 


*గోవిందా హరి గోవిందా, వేంకట రమణా గోవిందా, గోవిందా హరి గోవిందా,* *వేంకట రమణా గోవిందా. |* |22||


శ్రీ వేంకటేశ్వరుని దివ్య లీలలలో మరికొన్ని తదుపరి సంపుటిలో తెలుసుకుందాం.


*జై శ్రీమన్నారాయణ*

*ఓం నమో వెంకటేశాయ*

🙏🙏🙏🙏🙏

*శ్రీ వేంకటేశ్వర దివ్య చరిత్ర - 21*

 *శ్రీ వేంకటేశ్వర దివ్య చరిత్ర - 21*


శ్రీనివాసుడు ముఖములో చిరునవ్వు చిందిస్తూ ‘‘మాతా! ఈనాడు నీకొక రహస్యము చెప్పగలవాడను వినుము. పూర్వకాలములో నేను శ్రీరామావతారము ధరించినప్పుడు నేను లేని సమయము చూసి, రావణుడు సీతను యెత్తుకుపోయాడు. 


మార్గ మధ్యములో అగ్నిదేవుడు రావణునకు అడ్డుపడినాడట. అడ్డుపడి నేను అసలు సీతను అగ్నిచెంత దాచి, ఆశ్రమమున మాయ సీతను వుంచితిననియూ, అతడు తీసుకుపోతున్న సీత మాయసీతే ననియు నమ్మించాడు. మాయసీత నాకేలనని రావణుడు అగ్నిదేవునకిచ్చి వేసినాడు. ‘అసలు సీత యిదిగో ఈమె’ యని చెప్పి, తనవద్దనున్న వేదవతిని రావణున కిచ్చినాడట. 


నాకు యీ విషయము తెలియదు, రావణుని నేను సంహరించిన అనంతరం సీతను ఒకవేళ లోకము శంకిస్తుందేమో యని అగ్నిప్రవేశము చేయించాను.


అప్పుడు అగ్నిదేవుడు వచ్చి విషయము చెప్పి వేదవతినీ కూడా సీతాదేవితో పాటు ఏలుకోవలసినదని కోరాడు. అప్పుడతనితో నేను వేదవతిని కలియుగములో వివాహమాడెదనని మాట నిచ్చివేయుటము జరిగినది. ఆ వేదవతియే యీ పద్మావతి. కనుకనే పద్మావతిని నేను వివాహమాడవలసి యున్నది. అన్ని వకుళతో వివరముగా చెప్పినాడు.


శృంగార వనములో ఎప్పుడైతే పద్మావతి వేటగాని రూపములో వున్న శ్రీనివాసుని చూచినదో అప్పటినుంచీ యామెకు ఆ పురుషుని గూర్చిన ఆలోచనలే మనసులో మెదలడము ప్రారంభించినాయి. 


కన్ను మూసినా, తెరచినా అతడే కనిపిస్తున్నాడు. అతడు తన హృదయముపై చెరగని ముద్రవేసినాడు. అతనిని వివాహము చేసుకొన్న బాగుండునని పద్మావతి భావించినది. అయితే తల్లికికానీ, తండ్రికి కానీ విషయము చెప్పలేదు, చెలికత్తెలకి చెప్పడానికి గూడా సిగ్గేసింది. 


‘బోయవాడు, బికిరివాడు నీకు భర్తగా రావడమేమిటి?’ అని తల్లిదండ్రులు తనను చీవాట్లు పెట్టవచ్చు. అందువలన ఆమె సరిగా తినడము సరిగా నిద్రపోవడము మానేసి చాలా కాలమైనది. సింగారించు కోవడము మానినది.


వనవిహారము మానినది, చివరకు చెలికత్తెలతో సరిగా మాట్లాడడము కూడా మానివేసినది. ప్రేమ జ్వరము ఆమెను క్రుంగదీయడము ప్రారంభించినది. 


పద్మావతి వనోవ్యాధితో మంచమెక్కినది. ఆకాశరాజు, ధరణీదేవి విప్రవర్యులచే పద్మావతి ఆరోగ్యమునకై పూజలూ, అభిషేకములూ జరిపించారు. రాజవైద్యులు కూడా వైద్యము చేశారు. ఏమి చేయించినా ఆమె వ్యాధి కుదటపడదని ప్రారంభించనే లేదు పైగా ఆ వ్యాధి ఆ రోజు కారోజు పెరిగిపోసాగినది. ఇక్కడ పద్మావతియిలా వుంటే

అక్కడ శ్రీనివాసుడు కూడా నిద్రాహారాలు మాని కాల పరిణామము తెలియకుండా అదే పనిగా పద్మావతిని గూర్చి ఆలోచించసాగాడు.


శ్రీనివాసుని దిగులు వకుళాదేవికి విచార కారణమయినది. వకుళ పరిష్కారమును గూర్చి ఆలోచించసాగినది.


 శ్రీనివాసునితో ఆమె ’’నాయనా! నీ దిగులు చూస్తే నాకు మతిపోతోంది. బాధపడకు, ఆకాశరాజుగారి వద్దకు ఇంక నేనే స్వయముగా వెళతాను వెళ్ళి అన్నీ మాట్లాడుతాను మాట్లాడి, ఈ నీ వివాహము ఎలాగైనా జరిపించాలని అర్ధిస్తాను. శాయశక్తులా కృషిచేసి రాయబారము సాగించి వస్తాను.

నీవు బాధపడడము మాత్రము మానుకో! అని నారాయణపురానికి బయలుదేరినది. 


పాపం వకుళాదేవి శ్రమపడి వెళుతోంది కానీ, ఆకాశరాజా వాళ్ళూ అంగీకరిస్తారో లేదో? అందుచేత ఈ లోపున దానికి బలముగా ఒక పధకం వేయవలసి వుంది అని అనుకున్నాడు శ్రీనివాసుడు.


 *వజ్రకవచధర గోవిందా,* *వసుదేవ తనయ గోవిందా,* *వైజయంతిమాల గోవిందా,* 

*వేంకట నాయక గోవిందా; |* 


*గోవిందా హరి గోవిందా, వేంకటరమణా గోవిందా,*

*గోవిందా హరి గోవిందా, వేంకట రమణా గోవిందా.|* |21||


శ్రీవేంకటేశ్వరుని దివ్య లీలలలో మరికొన్ని తదుపరి సంపుటిలో తెలుసుకుందాం.


*జై శ్రీమన్నారాయణ*

*ఓం నమో వెంకటేశాయ*

🙏🙏🙏🙏🙏

గర్భిణి స్త్రీ పాటించవలసిన నియమాలు

 గర్భిణి స్త్రీ పాటించవలసిన నియమాలు  - 


 *  ఎల్లప్పుడూ మితిమీరి ఆహారాన్ని భుజించకుడదు. సులభంగా జీర్ణం అయ్యే ఆహార పదార్దాలు మాత్రమే తినాలి .


 *  తినాలి అనిపించినప్పుడు వీధిలోని పదార్దాలు భుజించ కూడదు. ఇంట్లో చేయించుకొని తినాలి .


 *  కొంతైనా శారీరక శ్రమ చేయాలి.


 *  ప్రసవించెంత వరకు సామాన్యంగా ఇతరుల ఇళ్ళకు వెళ్ళకూడదు. ముఖ్యంగా చావులు, ఘర్షణలు , గొడవలు జరిగిన ప్రదేశాలకు వెళ్ళకూడదు .


 *  గర్భిణులు బలవంతమైన అతి కష్టమైన పనులు అసలు చేయకూడదు. ఎత్తు ప్రదేశాలు ఎక్కడం , వేగంగా దిగడం చేయకుడదు . 


 *  కారం, చేదు, ఉప్పు ఎక్కువ ఉన్న పదార్దాలు గర్భిణి లు తినకూడదు . 


 * పగలు నిద్రించడం, రాత్రి మేలుకోవడం , అతిగా టీవీ చూడటం, సినిమాలు చూడటం చేయకూడదు 


 *  మనసుకి ఆందోళన కలిగించే విషయాలు వినకుడదు .


 *  నూలు బట్టలు వదులు గా ఉన్నవి ధరించాలి.


 *  మనసులో ఈర్ష్య, ద్వేషం , అసూయ లాంటి రజో,తమో గుణాలు కి గురి కాకూడదు . అలా గురి అవ్వడం వలన లోపల బిడ్డ మీద ప్రభావం పడుతుంది. పుట్టే వారు కూడా అవే లక్షణాలతో పుడతారు.


 *  గర్భిణి స్త్రీలు చన్నీటి స్నానం చేయకూడదు .


 *  ఆరోవ మాసం నుంచి సంభోగంలో పాల్గొనకుడదు . సంభోగం నుంచి ఆలోచనలు రాకూడదు.


 *  సంభోగం లో పాల్గొనడం వలన గర్భ స్రావాలు , 8 మాసాలకే ప్రసవాలు , మృత శిశువులు పుట్టడం ఒక్కోసారి తల్లి ప్రాణానికి కూడా ప్రమాదం వాటిల్లడం జరుగుతుంది.


 *  గర్భిణి స్త్రీ ఎట్టి పరిస్థితుల్లోను కొబ్బరి బొండాలు తాగకూడదు. అలా తాగడం వలన అప్పుడే నెల తప్పినా , మూడు లేకా నాలుగు మాసాల గర్భవతిగా ఉన్నా లేత కొబ్బరి బొండాల నీళ్లు తాగడం వలన గర్భ స్రావాలు జరుగుతాయి.


 *  నువ్వులతో చేసిన కజ్జికాయలు, నువ్వుల నూనెతో వండిన పిండి వంటలు, నువ్వుల నూనెతో తయారయిన ఉరగాయ పచ్చళ్ళు తినడం వలన కూడా గర్భ విచ్చిత్తి జరుగుతుంది.


 *  పాతకాలపు ఇళ్ళలో మొదటి సారిగా సమర్త ఆడిన ఆడపిల్లలకు నువ్వులు , బెల్లం కలిపి           " చిమ్మిరి " తయారు చేస్తారు ఆ చిమ్మిరి ముద్ధలని పొరపాటుగా గర్భవతులు గనక సేవిస్తే వెంటనే గర్బం విచ్చిత్తి జరుగుతుంది.


 *  రెండు, మూడు నెలలు గర్బవతులు గా ఉన్నప్పుడు అతిగా వేడిచేసే ఆవపిండి, ఆవకాయ , ఎక్కువుగా ఉప్పు , కాకరకాయ , కర్బూజా పండు , ఇంగువ, శోంటి , పిప్పిళ్ళు , మిరియాలు, నువ్వులు , బ్రాంది , విస్కీ, రమ్ , ఎక్కువ ఎండు కారం , లవంగాలు, కర్పూరం , వస, వెల్లుల్లి, సునాముఖి మొదలయిన పదార్దాలు ఎక్కువుగా వాడటం వలన కూడా గర్భ విచ్చిన్నం జరుగును.


  

     గమనిక  -


           నాచే రచించబడిన "ఆయుర్వేద మూలికా రహస్యాలు " , " ప్రాచీన ఆయుర్వేద రహస్యాలు "  అను ఈ రెండు గ్రంథముల యందు అత్యంత రహస్యమైన సులభముగా ఇంటి యందు , చుట్టుపక్కల దొరికే మూలికలతోనే పెద్దపెద్ద రోగాలను నయం చేసుకొనే విధముగా అనేక వైద్య యోగాలను ఇచ్చాను. ఈ గ్రంథాలలో ఇచ్చినటువంటి యోగాలు అన్నియు గత 250 సంవత్సరాల నుంచి వంశపారంపర్యముగా మాకు వస్తున్న రహస్యయోగాలు పరోపకారార్థం దాచుకోకుండా ప్రచురించాను.


           మన చుట్టుపక్కల ఉండే మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల బొమ్మలతో మొక్కల చిత్రపటాలు ఇవ్వడం జరిగింది.


            రైతులకు ఉపయోగపడేవిధముగా చెట్లను , భూమిని బట్టి , రాళ్లని బట్టి భూమి యందు జలమును కనుగొను విధానం , ముహూర్తాలను అనుసరించి ఏయే సమయాలలో పంటలు వేయాలి . ఆయుర్వేద మూలికల సహాయముతో పురుగు మందులు వాడకుండా అత్యంత ఎక్కువ దిగుబడులు సాధించే రహస్య వృక్షయుర్వేద యోగాలు , పశువులకు సంబంధించిన వైద్య యోగాలు కూడా ఇవ్వడం జరిగింది . ఈ గ్రంథాలలో ఇచ్చిన యోగాలు ఉపయోగించటం వలన ఎటువంటి వ్యతిరేక ఫలితాలు రావు.


      ప్రాచీన ఆయుర్వేద రహస్యాలు గ్రంథం 288 పేజీలు ఉంటుంది . విలువ 350 రూపాయలు మాత్రమే . ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథం 384 పేజీలు ఉంటుంది . విలువ 450 రూపాయలు . కొరియర్ చార్జి 100  రూపాయలు అదనం .పుస్తకములు ఎక్కువ కాలం మన్నిక కొరకు కుట్టించి ఇవ్వడం మరియు అత్యంత నాణ్యమైన తెల్లటి 80GSM పేపరుతో ఉంటాయి.


            ఈ రెండు గ్రంథాలు కావలసినవారు డైరెక్టుగా 9885030034 నెంబర్ కి ఫోన్ చేయగలరు. కామెంట్లు , మెస్సేజెస్ సమాధానము ఇవ్వబడదు. కాల్ చేయగలరు .


                  కాళహస్తి వేంకటేశ్వరరావు 


                         9885030034 


               అనువంశిక ఆయుర్వేద వైద్యులు

మూఢుడు

 *విదురనీతి*


*సంసారయతి కృత్యాని సర్వత్ర విచికిత్సతే*

*చిరం కరోతి క్షిప్రార్థే స మూఢో భరతర్షభ*


"తన పనుల్ని ఇతరులకు పురమాయిస్తాడు. 

అన్నిచోట్ల సందేహిస్తుంటాడు. 

తొందరగా ముగిసే పనిని సాగదీస్తాడు. 

అతణ్ణి మూఢుడు అంటారు."


====================

మత్స్య యంత్రము

 #భువనేశ్వరిపీఠం

మత్స్య యంత్రము


మహావిష్ణువు ధర్మ రక్షణకు ఎత్తిన దశ అవతారాలలో ఒకటి 'మత్స్యావతారము'. విష్ణు ద‌శావ‌తార‌ముల‌లో మొట్టమొద‌టి అవ‌తార‌మే మ‌త్స్యావ‌తార‌ము వేద స‌ముద్ధర‌ణ‌కై అవ‌త‌రించిన శ్రీ మ‌హావిష్ణువు రూప‌ము. ఈ యంత్రము, ఇత‌ర యంత్రముల క‌ంటే చాలా విశిష్టమైన‌ది. స‌మ‌స్త వాస్తు దోష నివార‌ణ యంత్ర రాజ‌ము ముఖ్యంగా విశేషించి ఈ యంత్రము – వాని ప్రస్థార‌ము నందు గ‌ల స‌ప్తావ‌ర‌ణ‌ల‌లోను అతి ముఖ్యము శ‌క్తివంత‌మైన బీజాక్షర‌ముల‌తో రూపొందించ‌బ‌డి, స‌ర్వ సాంప్రదాయాను కూల‌ముగా నిర్మించ‌బ‌డింది.


పూజా విధి ఈ మ‌త్స్య యంత్రమును శాస్త్రానుసార‌ముగా దైవ‌జ్ఞుల‌చే త‌యారు చేయించుకొని, యంత్ర సంస్కార జీవ క‌ళాన్యాస‌, ప్రాణ‌ప్రతిష్టాదుల‌ను జ‌రిపించి, శుభ స‌మ‌య‌మున యంత్ర పూజ‌, జ‌పాదుల‌ను ప్రారంభించ‌వ‌లెను. ఈ యంత్రమును శ‌క్తివంత‌ముగా చేయుట‌కై విధి విధాన‌మును మిగిలిన యంత్రముల క‌న్న కొంచెం ఎక్కువ‌గానే నిర్ధేశింప‌బ‌డిన‌ది. 


మత్స్య యంత్రమును 

                శ్లో || స్వర్ణేన రజతే నాపి పంచాంగుళ ప్రమాణకమ్ |

                         యంత్రపత్రం విరచ్యాధ సప్తకోణం లిఖేత్పురమ్ |

                         వాదిక్షాంతాని ‍ బీజాని లిఖేత్కోణేషు చక్రమాత్ |

                         మధ్యేతు మత్స్య మాలిఖ్య గృహస్థాపన శోభనమ్ |

                         అగ్రముత్తరతః కృత్వాస్తంభమూలే౭ ధవాపరమ్ |

                         శంకుమూలేతు సంస్థాప్య సర్వదోషనివారణమ్ ||

                          

                   మత్స్య యంత్రంను ఐదు శేర్ల ధాన్యములో ఒక దినం, పంచామృతములందు ఒక దినం మంచి నీటిలో ఒక దినము ఉంచి పూజించి సహస్రాష్టోత్తర శతగాయత్రి జపమును చేసి శంఖు స్థాపన చేసిన గృహ స్థలములలో ఈ యంత్రమును ఏర్పాటు చేసుకోవాలి. ఈ యంత్రంను స్థాపన చేయుటవలన ద్వార దూష్యములు, కూప వేధలు, స్తంభ వేధలు, వీధి శూలలు ఆయుర్ధాయము నశించిన గృహ దోషములు, శంఖు స్థాపన చేయక కట్టిన దోషమును మొదలగునవన్నీ పరిహరించి మిక్కిలి శుభములు కలిగించును....మీ... *చింతా గోపీ శర్మ సిద్ధాంతి** *లక్ష్మీలలితా వాస్తు జ్యోతిష నిలయం* (భువనేశ్వరిపీఠం) పెద్దాపురం, సెల్:- 9866193557

కార్తీకపురాణం 7 వ అధ్యాయము*

 *కార్తీకపురాణం 7 వ అధ్యాయము*


🌺🌺🌺🌺🌺🌺🌺🌺


*శివ కేశ వార్చనా విధులు*


వశిష్టులు వారు జనకున కింకను యిటుల బోధించిరి 'రాజా!కార్తీక మాసము గురించి, దాని మహత్యము గురించి యెంత వినిననూ తనివి తీరదు. ఈమాసము లో శ్రీ మహావిష్ణువును సహస్ర కమలములతో పూజి౦చిన వారి     ఇంట లక్ష్మిదేవి స్థిరముగా నుండును తులసీ దళములతో గాని సహస్ర నామ పూజ చేసిన వారికి జన్మ రాహిత్యము కలుగును కార్తీక మాసమందు ఉసిరి చెట్టు క్రింద సాలగ్రామ ముంచి భక్తి తో పూజి౦చిన  యెడల వారికీ కలుగు మోక్ష మింతింత గాదు. అటులనే బ్రాహ్మణులకు కూడా ఉసిరి చెట్టు క్రింద బోజనము పెట్టి తను తినిన, సర్వ పాపములు పోవును. ఈ విదముగా కార్తీక స్నానములు దీపా రాదనలు చేయలేని వారు ఉదయం సాయంకాలం యే గుడికైనను వెళ్లి భక్తితో సాష్టా౦గ నమస్కారము లైననూ చేసిన యెడల వారి పాపములు నశించును. సంపత్తి  గల వారు శివ కేశవుల ఆలయములకు వెళ్లి భక్తితో దేవతార్చన,  హొమాదులు,  దానధర్మములు చేసిననచో అశ్వ మేధము చేసినంత ఫలము దక్కుటయే గాక వారి పితృ దేవతలకు కూడా వైకు౦ట ప్రాప్తి కలుగును. 

శివాలయమున గాని, విష్ణ్యలయమున గాని జండా ప్రతిష్టించినచొ  యమ కింకరులకు దగ్గరకు  రాలేరు సరి కదా, పెను గాలికి ధూళిరాసు లెగిరి పోయినట్లే కోటి పాపములైనను పటా ప౦చలై పోవును. ఈ కార్తీక మాసములో తులసి కోట వద్ద ఆవు పేడతో అలికి  వరి పిండితో శంఖు చక్ర ఆకారముల ముగ్గులు పెట్టి, నువ్వులు ధాన్యము పోసి వానిపై ప్రమిద నుంచి నిండా నువ్వులు నూనె పోసి, వత్తిని వేసి వెలిగించ వలెను.ఈ దీపము రాత్రింబవళ్ళు ఆరకుండా ఉండవలెను. దీనినే నంద దీపమందురు. ఈ విదముగా జేసి, నైవేద్యమిడి కార్తీక పురాణము చదువు చుండిన  యెడల హరిహరులు సంతసించి కైవల్య మొసంగెదరు. అటులనే కార్తీక మాసములో ఈశ్వరుని జిల్లేడు పూలతో అర్పించిన ఆయుర్ వృద్ది కలుగును. సాలగ్రామమునకు ప్రతి నిత్యము గంధము పట్టించి తులసి దళములతో పూజించవలెను. ఏ మనుజుడు ధనము బలము కలిగి యూ కార్తీక మాసమందు పూజాదులు సలపడో అ మానవుడు  మరుజన్మలో శునకమై  తిండి దొరకక ఇంటింట తిరిగి కర్రలతో దెబ్బలు తింటూ నీచ స్థితిలో చచ్చును. కావున కార్తీక మాసము నెలరోజులూ పూజలు చేయలేని వారు ఒక్క  సోమవార మైనను చేసి శివ కేశవులను పూజించిన మాస ఫలము కలుగును. కనుక ఓ రాజా! నీవు కూడా యీ వ్రతమాచరించి తరింపుముయని చెప్పెను. 


*' నమ శివాభ్యం నవ యౌ వనాభ్యాం పరస్ప రాశ్లి ష్ట వపుర్ధ రాభ్యాం*

*నాగేంద్ర కన్యా వృష కేత నాభ్యం నమో నమ శంకర పార్వతీ భ్యాం''*


*ఇట్లు స్కాంద పురాణా౦తర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహాత్య మందలి*

*సప్తమధ్యాము - సప్తమదిన పారాయణము సమాప్తం.*

   🙏🙏🙏🙏

స్త్రీలు_ఎందుకు_వేదాలు_పఠించకుడదు

 స్త్రీలు_ఎందుకు_వేదాలు_పఠించకుడదు..


వేదాలకి అధిదేవత గాయత్రి మాత, వాక్కును ప్రసాదించే దేవి సరస్వతి, వారిరువురు స్త్రీ రూపాలే. మరి స్త్రీలు ఎందుకు వేదం చదవకూడదన్న వాదన వింటుంటాం.

.

 వేదాలు స్వర, మాత్రానుగుణంగా ఉచ్చరింపబడాలి వాటి పూర్తి ప్రభావం ప్రకటింపబడాలి. అంటే పురుషదేహ నిర్మాణానికి, స్త్రీ దేహ నిర్మాణానికి తప్పక తేడా వుంది. వారికున్న నాడీమండల వ్యవస్థ ఆడవారికి సరైన స్వరోచ్చారణకు పూర్తిగా సహకరించదు. పురుషుల వోకల్ ఫోల్డ్స్/కార్డ్స్ 17mm-25mm పొడవు వుండగా, స్త్రీలకు 12.5 Mm-17.5mm దీనివల్ల వారి pitch లో తేడా వుంటుంది. వేద మంత్రాలన్నీ ఉదాత్త, అనుదాత్త, స్వరానుగుణంగా ఆయా స్థాయిలో ఉచ్చరించడం ఈ నిర్మాణం వలన స్త్రీలకు పూర్తిగా సాధ్యపడదు.


 ఈ వేదమంత్రాల స్వరాలు నాభినుండి పలకవలసి వస్తుంది. కావున నమకచమక మంత్రాలలో ఇటువంటి ప్రయోగాలు ఎక్కువ వుండడం వలన వాటికి పొత్తికడుపు మీద ఒత్తిడి ఎక్కువ కలుగుతుంది. వారి శరీరనిర్మాణం ప్రకారం వారికి ఇటువంటి ఒత్తిడి పెట్టడం వలన ఉచ్చారణ చెయ్యగా చెయ్యగా వారి ఋతుకాలం మీద ప్రత్యక్ష ప్రభావం చూపుతుంది.


నేడు మనం చూస్తున్న సంగీత థెరపీ వలన రోగులలో హార్మోన్లు అధికంగా ఉత్పత్తి కావడమూ, తక్కువ చెయ్యబడడమూ శాస్త్రీయంగా నిరూపింపబడినది. వేదము, వేదమునందలి ఈ నమక చమక మంత్రాలు ప్రధానంగా శబ్దప్రధానం. వీటి శబ్దప్రకంపనల వలన ఈస్ట్రోజెన్ తదితర హార్మోన్లపై ప్రభావం అధికంగా వుండి కాలక్రమేణా కొన్ని కొన్ని మంత్రాల వలన గర్భస్రావం కూడా జరుగుతుందని ఆడవారు ఆ మంత్రాలు వినరాదు చదవరాదు అని నియమం పెట్టారు.


 వేదమంత్రాన్ని కొంచెం తప్పుగా చదివితే రావలసిన ఫలితాలకు వ్యతిరికంగా దుష్ఫలితాలు కలుగుతాయి. ఆడవారికి గురూపదేశం లేకుండా సరైన ఉచ్చారణ అబ్బదు, కాబట్టి వారికి వేదపఠనం, అందునా మరింత శక్తివంతమైన రుద్రాధ్యాయ, ఆదిత్య, సౌర సూక్తాలు వద్దని చెప్పారు. నేటి సాంకేతిక పరిజ్ఞానం చెబుతున్న దాని ప్రకారం ఆడవారికి మెనోపాజ్ వరకు వారిని చాలా శక్తివంతమైన హార్మోన్లు కాపాడతాయి. ఒకసారి ఆ సమయం వచ్చాక వారికి వ్యాధినిరోధక శక్తి తక్కువ అవుతుందని పరిశోధనల ద్వారా నిరూపించారు. వారికున్న రక్షణాత్మక కవచాన్ని కాపాడుకోవాలన్న తాపత్రయం కొద్దీ వారికి కొన్ని పనులు నిషేధించారు, అందులో ముఖ్యంగా ఇటువంటి వేదనాదాన్ని ఉచ్చరించడం.


నేటి యుగధర్మ ప్రకారం ఆడవారికి ద్విజత్వం సిద్ధించదు, ఎందుకంటె వారికి ఉపనయన సంస్కారం లేదు కనుక. కావున వారికి గాయత్రి మంత్రోచ్చారణ కానీ వేదపఠన కానీ వద్దని చెప్పారు. ద్విజులంటే బ్రాహ్మణులు, వైశ్యులు, క్షత్రియులు అన్న విషయం అందరికీ తెలుసు. వేదం పఠించడం వలన శరీరంలో చక్రం ఉత్తేజితం వలన, ఉచ్చారణాక్రమం వలన ఎక్కువగా ఉష్ణం ఉత్పన్నమవుతుంది. అది ఆడవారి శరీరానికి మంచిది కాదని వారిని చదవద్దని వారిస్తారు. కొందరు ఏడ్చి పెడబొబ్బలు పెట్టినట్టు ఇందులో ఆడవారిని తక్కువగా ఎక్కడా చూడమని చెప్పలేదు. ఆడదంటే ఆదిశక్తి అని కొలిచిన ధర్మం మనది. వేదం చదవద్దని చెప్పిన మన ధర్మశాస్త్రాలు వారికి మరెన్నో సౌలభ్యాలు కలుగచేసాయి.


1. వారు వేద వ్యాఖ్యానాలు మనసులో పూర్తిగా చదివి తత్త్వం తెలుసుకోవచ్చును. మనకు పూర్వం కూడా ఎందరో నారీమణులు వేదార్ధాన్ని, వేదంగాలను నేర్చిన వైనం వినే ఉన్నాము.


2. వారు సౌందర్యలహరి, లలితా సహస్రనామం, విష్ణు సహస్రనామం వంటి ఎన్నో శక్తివంతమైన స్తోత్రాలు, వివిధ దేవతల శ్లోకాలు, దివ్యప్రబంధాలు, పురాణ ఇతిహాసాలు, భజనలు, కీర్తనలు తప్పక చదవమని చెబుతుంది శాస్త్రం


 3. వారు మాత్రమే చెయ్యగలిగిన ఎన్నో శక్తివంతమైన ఫలవంతములైన వ్రతాలు చెప్పబడి ఉన్నాయి.


4. ఆత్మ విచారం ఇత్యాది గొప్ప ఆధ్యాత్మిక సాధనలు నిషిద్ధం కావు. ఇలా ఎన్నో దైవపూజలకు వారికి అధికారం వుంది. కేవలం వేదం చదవరాదన్న నియమం వలన వారు ఏ రకంగాను కూడా పురుషులకన్నా తక్కువ స్థాయిలో చూడలేదు.


                        ఇట్లు 

                          మీ

         అవధానుల శ్రీనివాస శాస్త్రి

చాణక్య నీతి

 చాణక్య నీతి


వరం న రాజ్యం న కురాజరాజ్యం 

వరం న మిత్రం న కుమిత్రమిత్రమ్

వరం న శిష్యో న కుశిష్యశిష్యో 

వరం న దారా న కుదారదారాః 


చెడు రాజ్య వాసంబు చేయుట కంటె 

వీడుటే మేలగు విజ్ఞత తోడ 

చెడు మిత్ర స్నేహంబు సేయుట కంటె 

మిత్రుడే లేకుండ మెలగుట మేలు 

చెడు శిష్య పాలన సేయుట కంటె 

శిష్యులే లేకుంట శ్రేష్టంబు యగును

చెడు భార్యతో పొత్తు జేగుట కంటె 

భార్యయే లేకుండ బ్రతుకుట మేలు.           


✍️గోపాలుని మధుసూదన రావు 🙏

శ్రీ విష్ణు షట్పది స్తోత్రం

 *శ్రీ ఆదిశంకరాచార్య విరచిత శ్రీ విష్ణు షట్పది స్తోత్రం*

 


ఆది శంకరులు రచించిన స్తోత్రాలలో విష్ణు షట్పది ఒకటి. మనస్సుపై స్వాధీనము కొరకు విష్ణుని ప్రార్థిస్తూ రచించిన ఈ స్తోత్రము మానసిక ప్రశాంతతకు చాలా తోడ్పడుతుందని నమ్మకం.

 


భయము, అహంకారముతో కప్పబడిన ఈ జీవితం భవ సాగరమై మరిన్ని జన్మలకు కారణము అవుతుంది. కావున, వాటిని అధిగమించి, మనసును లగ్నము చేసి, ధ్యేయము వైపు ధ్యానించి సత్య జ్ఞాన ప్రాప్తికి కృషి చేయవలెను అని ఈ స్తోత్రము ద్వారా మనకు ఆది శంకరులు చక్కని సందేశాన్ని అందించారు.


 భయమే మృత్యువు, భయమే శత్రువు. అహంకారమే పతనము. అహంకారమే అత్యంత ప్రమాదకరమైన శత్రువు. వాటిని అధిగమించటం  ఆధ్యాత్మిక పరమార్థము. అదే పరమాత్ముని దర్శనము. అదే మోక్ష కారకము.



*౧. అవినయమపనయ విష్ణో దమయ మనః శమయ విషయమృగతృష్ణామ్ |*

*భూతదయాం విస్తారయ తారయ సంసారసాగరతః ||*


ఓ విష్ణో!  నాలోని అహంకారాన్ని తొలగించు. మనస్సును శాంతితో నింపుము. పాశవిక కోరికలనుంచి నన్ను దూరము చేయుము. సకల ప్రాణుల పట్ల నేను దయతో ఉండునట్లు చేయుము. ఈ భవసాగరాన్ని దాటుటకు చేయూతనీయుము.




*౨. దివ్యధునీ మకరందే పరిమళ పరిభోగసచ్చిదానందే |*

*శ్రీపతిపదారవిందే భవభయఖేదచ్ఛిదే వందే ||*


సంసార సాగరములోని భయాన్ని, దుఖాన్ని పోగొట్టే, పవిత్రమైన పుప్పొడి నది వంటి, సచ్చిదానందాన్ని ఇచ్చే దివ్య సుగంధము వంటి నీ పాదపద్మములకు నమస్కరించు చున్నాను.




*౩. సత్యపి భేదాపగమే నాథ తవా‌உహం న మామకీనస్త్వమ్ |*

*సాముద్రో హి తరంగః క్వచన సముద్రో న తారంగః ||*


ఎలాగైతే సముద్రము అలలు ఒకటే అని అనిపించినా, సముద్రపు అల సముద్రములోని భాగమే కానీ సముద్రం అలలోని భాగం కాదో, అలాగే సత్యము గ్రహించు నపుడు కూడా, భేదము గ్రహించలేనప్పుడు, నేను నీలోని భాగమే కానీ నీవు నాలో భాగము కావు.




*౪. ఉద్ధృతనగ నగభిదనుజ దనుజకులామిత్ర మిత్రశశిదృష్టే |*

*దృష్టే భవతి ప్రభవతి న భవతి కిం భవతిరస్కారః ||*


పర్వతమును ఎత్తిన వాడవు { కృష్ణుడవు, కూర్మావతారము కూడా } , పర్వతరాజు శత్రువైన ఇంద్రుని సోదరుడవు, అసురుల శత్రువువు, సూర్య చంద్రులు కన్నులుగా చూసేవాడవు, నిన్ను చూసిననంత లోకపు శోకము పోవును. నిన్ను చూసిన తర్వాత ఇంకా జరుగ వలసినది ఏమైనా ఉందా?




*౫. మత్స్యాదిభిరవతారైరవతారవతా‌உవతా సదా వసుధామ్ |*

*పరమేశ్వర పరిపాల్యో భవతా భవతాపభీతో‌உహమ్ ||*


మత్స్య రూపము మొదలకొని వివిధ అవతారములతో ఈ భువిని కాపాడుతున్నావు. పరమేశ్వరా! ఈ భవసాగరమును చూసి భయపడుతున్న నన్ను కాపాడుము.




*౬. దామోదర గుణమందిర సుందరవదనారవింద గోవింద |*

*భవజలధిమథనమందర పరమం దరమపనయ త్వం మే ||*


నడుమునకు త్రాడు కట్టుకున్న విష్ణో { దామోదరా } ! సకల సద్గుణ సంపన్నా! కలువ వంటి అందమైన ముఖము కలవాడా ! అందరి రక్షకుడా ! ఈ భవ సాగరాన్ని మధించ అత్యుత్తమ సాధనమైన వాడా ! ఈ జీవనసాగరంలో నా భయాలను పోగొట్టుము.



*నారాయణ కరుణామయ శరణం కరవాణి తావకౌ చరణౌ |*


ఓ నారాయణా ! కరుణామయా ! నా చేతులు నీ పదములకు మ్రొక్కనీ !



*ఇతి షట్పదీ మదీయే వదనసరోజే సదా వసతు |*


ఈ ఆరు శ్లోకములు నా వదనములో ఎల్లప్పుడూ నిలవనీ !



🚩


*శ్రీవిష్ణు షట్పది స్తోత్రం భావం:*


మనస్సుపై స్వాధీనము కొరకు విష్ణుని ప్రార్థిస్తూ రచించిన ఈ స్తోత్రము మానసిక ప్రశాంతతకు చాలా తోడ్పడుతుందని నమ్మకం. భయము, అహంకారముతో కప్పబడిన ఈ జీవితం భవ సాగరమై మరిన్ని జన్మలకు కారణము అవుతుంది. కావున, వాటిని అధిగమించి, మనసును లగ్నము చేసి, ధ్యేయము వైపు ధ్యానించి సత్య జ్ఞాన ప్రాప్తికి కృషి చేయవలెను అని ఈ స్తోత్రము ద్వారా మనకు ఆది శంకరులు చక్కని సందేశాన్ని అందించారు. భయమే మృత్యువు, భయమే శత్రువు. అహంకారమే పతనము. అహంకారమే అత్యంత ప్రమాదకరమైన శత్రువు. వాటిని అధిగమించటం ఆధ్యాత్మిక పరమార్థము. అదే పరమాత్ముని దర్శనము. అదే మోక్ష కారకము.



🚩


*భ్రమర నాదాలు* 


భ్రమరం అంటే తుమ్మెద. దీనికి మధువ్రతం, మధుకరం, మధుపాళి, ద్విరేఫం, భృంగం, షట్పదం, అళి మొదలైన పేర్లు ఉన్నాయి. పూలలోని తేనెను తాగుతూ, ఝుమ్మని నాదాలు చేయడం తుమ్మెదకు అలవాటు. విష్ణువును స్తుతించిన శంకర భగవత్పాదులు ‘షట్పదీ స్తోత్రం’ రచించి, లోకానికి ప్రసాదించారు. షట్పది అనే మాటకు అర్థం ‘ఆరు పదాలు గలది’. తుమ్మెదకు ఆరు కాళ్లుంటాయి కాబట్టి, ఆ పదం సరిపోతుంది. భగవత్పాదుల స్తోత్రంలోనూ ఆరు పదాలు విరాజిల్లుతున్నా, అవి తుమ్మెదకు సంబంధించినవి కావు. విష్ణువును ఉద్దేశించిన నామాలు అవి. అందువల్ల ఆ స్తోత్రం ‘షట్పది’ అయింది. పద్మం చుట్టూ తుమ్మెద తిరిగినట్లే, తన ముఖం అనే పద్మం చుట్టూ ఆరు పదాలూ తిరుగుతుండాలని హరిని భగవత్పాదులు కోరుతున్నారు. ‘నారాయణా, కరుణామయా, శరణం కరవాణి తావకౌ చరణౌ’ అనే వాక్యంలో ఆరు పదాలు ఉన్నందువల్ల, అది షట్పదీ స్తోత్రమైంది.



తుమ్మెదలు పద్మం నుంచి మకరందాన్ని తాగుతాయి. అలాగే ముఖపద్మంలో నుంచి ఆరు విష్ణు పదాల మకరందం గ్రోలడానికి స్తోత్రం అనే తుమ్మెద తిరుగుతుండాలని సారాంశం. ఆ ఆరింటి మాధుర్యాన్ని అందరూ ఆస్వాదించాల్సిందే.



‘ఓ హరీ! మొదట నా అవినయాన్ని పోగొట్టు. నా మనసును నియంత్రించు. భూతదయను పెంపొందించు. సంసారం అనే సముద్రం నుంచి నన్ను ఒడ్డుకు చేర్చు. నీ పాదాలు కమలాలు. ఆ పాదాల నుంచి ఉద్భవించిన ఆకాశ గంగ మకరంద ప్రవాహం వంటిది. సచ్చిదానందాలే ఆ పద్మాల సుగంధాలు. సంసార బంధాలవల్ల కలిగే భయాల్ని పోగొట్టేవి ఆ పాదపద్మాలే !



హరీ! నీకు, నాకు భేదం లేకున్నా- ఎప్పుడూ నేను నీవాణ్ని అవుతాను కానీ, నువ్వు నా వాడివి కాదు. అదెలా అంటే- కెరటాల్ని చూసే జనం అవి సముద్రానివే అంటారు. అంతే తప్ప, సముద్రమే కెరటాలకు సంబంధించినదని ఎవరూ అనరు.



పర్వతాల రెక్కల్ని తొలగించిన ఇంద్రుడి సోదరుడివి నువ్వు. అందుకే నీకు ‘ఉపేంద్రుడు’ అని పేరు. రాక్షసులకు నువ్వు శత్రువు. సూర్యచంద్రులే నీ కళ్లు. ఇంతటి మహిమ గల నిన్ను చూస్తే చాలు, సంసార దుఃఖాలన్నీ దూరమవుతాయి.



ఓ హరీ! లోకాల్ని రక్షించడం కోసం నువ్వు ఎన్నో అవతారాలెత్తావు. ఎందరినో రక్షించావు. సంసార బంధాలతో భయపడుతుండే నన్ను కాపాడేదీ నువ్వే! నువ్వు వనమాల ధరించావు. గుణాలన్నీ నీలో మణుల్లా వెలుగుతున్నాయి. నీ వదనం అనే పద్మం ఎంతో అందమైనది. సంసార సాగరాన్ని మధించడానికి మందర పర్వతంలా నిలుస్తావు నువ్వు. నా భయాలన్నింటినీ పోగొడతావు...’- ఇలా షట్పదీ స్తోత్రం అంతా మానవుడిలోని ఆర్తికి ప్రతిబింబంగా కనిపిస్తుంది. ఆర్తుల్ని ఉద్ధరించాలంటూ స్వామిని స్తుతించడమే భగవత్పాదుల పరమార్థంగా స్పష్టమవుతుంది.



మహర్షులు, యోగులు, మహాకవులు విశ్వక్షేమాన్నే కాంక్షిస్తారు. లోకుల భయాల్ని పోగొట్టడానికి త్రికరణశుద్ధిగా కృషిచేస్తారు. అదే పనిని శంకర భగవత్పాదులు ‘షట్పదీ స్తోత్రం’లో చేశారు. ఆరు శ్లోకాలు, ఆరు విష్ణునామాంకిత పదాలు మకరంద బిందువుల వంటివి. వాటిని ఆస్వాదించే ఆ స్తోత్రమే ఒక తుమ్మెద. ‘అది ఎప్పుడూ ఇలాగే నా వదన సమీపంలో తిరుగుతుండాలి’ అని కోరడం అంటే, స్తోత్రాన్ని నిరంతరం పఠించే భాగ్యాన్ని అర్థించడమే! ఇదే ఆ స్తుతిలోని అసలు రహస్యం.



మనిషిని సంసారం అనేక విధాలుగా బాధిస్తుంది. ఇలాంటి భయాలు, బాధల నుంచి మనసుకు శాంతి కావాలి. అది భగవన్నామ స్మరణతోనే సాధ్యమని పెద్దల మాట. షట్పదీ స్తోత్రం ద్వారా శంకర భగవత్పాదులు చేసిన మహోపదేశం ఇదే. మనిషి తనలోని ఆత్మశక్తిని విస్మరించకూడదు. మనిషిలోనే శాంతి ఉంటుందని, దాన్ని అతడే తెలుసు కోవాలని స్తోత్ర భ్రమరం ఉపదేశిస్తుంది. ఆ భ్రమర నాదం హృదయంగమం!



🕉🕉🕉🕉🕉🕉

శ్రీ సత్యనారాయణ వ్రత మహాత్మ్యము

 శ్రీ సత్యనారాయణ వ్రత మహాత్మ్యము



క. బ్రాహ్మణప్రియుడగు విష్ణువు 

    బ్రాహ్మణు వెతలెల్ల బాప భావించి మదిన్ 

    బ్రాహ్మణు నడుగగ యవ్విధి 

    బ్రాహ్మణు డిట్లనియె భక్తి భావము పొంగన్  29


ఆ. "బ్రాహ్మణుండ నేను బహుశాస్త్ర పఠితుడ  

     యుంఛవృత్తితోడ నుండు చుందు 

     దార సుతులతోడ దారిద్ర్యమున నుండి 

     బ్రతుకు నీడ్చుచుంటి భారముగను         30


క. సతతము శ్రీహరి నుతులతొ 

    ప్రతి గేహముచెంత బిక్ష ప్రార్ధించడుగన్ 

    యతితక్కు వొచ్చుభిక్షతొ 

    సతిసుతులతొబ్రతుకుచుందు సతమతమౌచున్"31


క. విప్రు0డాడిన మాటలు 

    విప్రోత్తమ వేషధారి విష్ణుడు వినియున్ 

    విప్రుని కావగ దలచియు 

    'విప్రా ! చింతించ వలదు విను'యంచనియన్  32


ఆ. "నీదు పేదతనము నిస్సేషముగ బోవ 

    దివ్య వ్రతము నొకటి తెలియ సేతు 

    యాచరించ దాని యాత్మ సాక్షిగ నీవు 

    పొందగలవు యిలను భూరిసుఖము        33


ఆ. అదియె నరునికిచ్చు యాముష్మికంబును 

     అదియె నరునికిచ్ఛు యాత్మశాంతి 

     యెయ్యది హరి దొల్లి యెఱిగించె , నయ్యదే 

     సత్య దేవు దివ్య  సద్వ్రతంబు             34


తే. విష్ణుదేవుని దివ్యమౌ వేఱు రూపె 

     సత్యనారాయణస్వామి సత్త్వరూపు 

     సత్యదేవుని మనసార సన్నుతించ 

     సకల కోర్కెలు దీరును సర్వులకును     35


క. వేగమె పేదరికంబును 

    పోగొట్టగ జాలునట్టి పుణ్య వ్రతంబున్ 

    రాగముతో గృహ మందున 

    జాగించుక సేయకుండ సల్పుము భక్తిన్ "   36


ఆ. విప్ర వేష ధారి విష్ణుడా విధముగ 

     పేదబ్రాహ్మణునకు ప్రియము తోడ 

     సత్యవ్రతమువిధిని  సంపూర్ణముగ జెప్పి

     మహిమ తోడ యపుడు మాయ మయ్యె  37


తే. వృద్దవిప్రుని మాటలు విశ్వసించి 

     సత్యనారాయణస్వామి సద్వ్రతమును 

     చేతు రేపని మనమందు చెప్పి కొనియు 

     విప్రవర్యుడు నిద్రించె వీడి చింత            38


                                     సశేషము….


✍️ గోపాలుని మధుసూదన రావు 🙏

ధార్మికగీత - 87*

 🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲

                         *ధార్మికగీత - 87*

                                   *****

       *శ్లో:- అజరా౽మరవత్ ప్రాజ్ఞ: ౹*

              *విద్యా మర్థం చ సాధ యేత్ ౹*

              *గృహీత ఇవ కేశేషు ౹*

              *మృత్యునా ధర్మ మాచరేత్ ౹౹*

                                   *****

*భా:- "జర" అంటే ముసలితనం. "అజర" - అంటే ముదిమి లేకపోవడం ; "అమర" - చావులేక పోవడం; లోకంలో వివేకవంతులు తమకు ముసలితనం లేదనే నిర్ణయానికి వచ్చి, విద్యను ఆర్జించాలి. "గుణాః పూజాస్థానం గుణిషు న చ లింగం న చ వయః" అని ఆర్యోక్తి. వయో నిమిత్తము లేని చక్కని విద్య వల్లనే మనలోని సుగుణాలు ప్రవర్ధ మానమై పరిమళిస్తాయి. ఫలాలనిస్తాయి. జీవితాన్ని సార్థకం చేస్తాయి. నేడు దూరవిద్య ద్వారా పెద్దలు చదువుకోవడం కద్దు. అలానే బుద్ధిమంతులు చావులేదనే నమ్మకంతో జవసత్త్వాలను కూడగట్టుకొని, ధనార్జన చేయాలి. గడిచింది చాలు అని ఆగిపోరాదు. అలాగే ప్రతిక్షణం మృత్యుదేవత తన జుట్టు పట్టుకుని ఈడ్చుకొని పోతున్నట్లు భావిస్తూ, ధర్మాన్ని నిర్వర్తించాలి. దానధర్మాలను నిత్యము, నిరంతరము చేస్తూనే ఉండాలని సారాంశము. కాన వయస్సుతో పనిలేకుండా చదువు, చావు లేదనే భావనతో డబ్బును గడిస్తూనే, అడుగడుగునా ధర్మనిరతుడవై, జీవన సమరం కొనసాగించాలని భావము*.

                                    *****

                     *సమర్పణ : పీసపాటి*

🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲

దుర్గా సప్తశతి

 *🌹. శ్రీ దేవీ మహత్యము - దుర్గా సప్తశతి - 21  / Sri Devi Mahatyam - Durga Saptasati - 21 🌹*

✍️. మల్లికార్జున శర్మ 

📚. ప్రసాద్ భరద్వాజ 


*అధ్యాయము 5*

*🌻. దేవీ దూతసంవాదం -6 🌻*


111. ఓ శోభనాంగీ! దేవతల, గంధర్వుల, నాగుల వద్ద ఉన్న రత్నతుల్యాలైన ఇతర వస్తువులన్ని ఇప్పుడు నా వద్దనే ఉన్నాయి.


112. ఓ దేవీ! మేము నిన్ను ప్రపంచ స్త్రీలందరిలో రత్నసమానమైన

దానిగా తలచుచున్నాం. అటువంటి నీవు నన్ను చేరు. రత్నతుల్యములైన వస్తువుల నంన్నిటిని అనుభవించేవారం మేమే కదా.


113. ఓ క్రాలుగంటీ! నీవు రత్నసమానవడం చేత నన్ను గాని, మహాపరాక్రమశాలి అయిన నా తమ్ముడు నిశుంభుణ్ణి గాని సేవించు.


114. నన్ను పెళ్ళాడితే, అసమాన మహాసంపద నీకు లభింస్తుంది. నీ మదిలో ఇది చక్కగా ఆలోచించుకుని నా భార్యవు కమ్ము.


115-116. ఋషి పలికెను : ఇలా చెప్పగా, ఈ జగత్తును భరించే శరణ్య, శుభంకరి అయిన దుర్గాదేవి లోననవ్వుకొని గంభీరంగా ఇట్లనెను :


17–118. దేవి పలికెను: నీవు సత్యాన్నే పలికావు. ఈ విషయంలో నీవు కొద్దిపాటి అసత్యమైనా చెప్పలేదు. శుంభుడు త్రైలోక్య సార్వభౌముడే. నిశుంభుడూ అట్టివాడే. 


119. కాని ఈ విషయంలో నేను దృఢనిశ్చయంతో ఆడిన మాటను బొంకు చేయడమెలా? మునుపు నేను అల్పబుద్ధినై చేసిన ప్రతిజ్ఞను విను.


120. యుద్ధంలో నన్ను ఎవడు ఓడిస్తాడో, నా గర్వాన్ని ఎవడు పోగొడతాడో, నా బలానికి లోకంలో సమానుడెవడో, అతడే నాకు భర్త అవుతాడు.


121. కాబట్టి ఇక్కడకు శుంభుడైనా, నిశుంభ మహాసురుడైనా వచ్చు గాక, నన్ను ఓడించి నాతో వెంటనే పాణిగ్రహణం చేయు గాక. జాగు ఎందుకు?


సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹

దీపారాధన

 🌹💐🥀🙏🌸🌷🌺🌾


*ఎన్ని వత్తులతో దీపారాధన చేయాలి*


*సాజ్యంత్రివర్తి సంయుక్తం వహ్నినా యోజితం మయా గృహాణ మంగళం దీపం త్రైలోక్య తిమిరాపహా*


మామూలుగా పత్తినుంచి తీసిన సన్నని దారపుపోగును మూడుసార్లు మూడువేళ్ల చుట్టూ తిప్పితే వత్తి తయారవుతుంది. 


ఈ తరహా వత్తిని ప్రమిదలో వేసి ఒక కొన పైకి వచ్చేలా పెడతారు. అక్కడ నూనెతో తడిపి దీపం వెలిగిస్తారు.


మూడువత్తులను కలిపి ఒక వత్తిగా చేసి, త్రివర్తి సంయుక్తంగా దీపం వెలిగించాలని తద్వరా గృహంలో మంగళప్రదంగా  ఉంటుందని  దీపారాధన శ్లోకం తెలియచేస్తూ ఉంది.  అది ఆచరించటం సాంప్రదాయం.


కొందరు రెండు లేదా అయిదు వత్తులు కూడా పెడతారు. అది సంప్రదాయాన్ని అనుసరించి ఉంటుంది. మరికొందరు కుంభం వత్తి లేదా బొడ్డువత్తి తయారుచేస్తారు. క్రిందగుల్లగా ఉండి ఒకటే కొసపైకి తేలి గరాటులా కనిపించే వత్తి అది. దానిని ప్రమిద మధ్యలో వెలిగిస్తారు కుంభం వత్తిని సాధారణంగా ఒకటికి మించి వెలిగించరు. 


*దేవస్య పార్శ్వయోః దీపానుద్దీప్య అని గృహంలో పూజామందిరంలో  దేమునికి ఇరుప్రక్కలా రెండు కుందుల్లో దీపారాధన చేయాలి.*

Draksharamam






 

Divali