10, జనవరి 2021, ఆదివారం

త్వమేవాహమ్‌



*త్వమేవాహమ్‌*


కన్నతల్లి కడుపులోంచి బయటపడి, తొలిసారి ఊపిరిని పీల్చిన క్షణంనుంచి, పుడమితల్లి కడుపులోకిచేరుకునేందుకు ఆఖరిసారి ఊపిరిని విడిచిపెట్టడం దాకా సాగే ప్రస్థానం పేరే *నేను*


ఈ *నేను* ప్రాణశక్తి అయిన ఊపిరికి మారుపేరు


ఊపిరి ఉన్నంతదాకా *నేను* అనే భావన కొనసాగుతూనే ఉంటుంది


 జననమరణాల మధ్యకాలంలో సాగే జీవనస్రవంతిలో ఈ *నేను* ఎన్నెన్నో పోకడలు పోతుంది. మరెన్నో విన్యాసాలూ చేస్తుంది


*ఈ *నేను* లోంచే*నాది* అనే భావన పుడుతుంది!


ఈ *నాది* లోంచి నావాళ్ళు, నాభార్య, నాపిల్లలు, నాకుటుంబం, నాఆస్తి, నాప్రతిభ, నాప్రజ్ఞ, నాగొప్ప... అనేవీ పుట్టుకొచ్చి చివరికి ఈ *నేను* అనే భావన భూమండలాన్ని కూడా మించిపోయి,ఆకాశపు సరిహద్దును కూడా దాటిపోయి, నిలువెత్తు విశ్వరూపాన్ని దాల్చి *అహం* గా

ప్రజ్వరిల్లుతుంది

 *అహం* అనే మాయ పొర కమ్మేసిన స్థితిలో ఈ *నేను*  *నేనే సర్వాంతర్యామిని* అని విర్రవీగుతుంది. నాకు ఎదురే లేదని ప్రగల్భాలూ పలుకుతుందిపంతాలతో పట్టింపులతో, పగలతో ప్రతీకారాలతో తన ప్రత్యర్థిని సర్వనాశనం చేయడానికీసిద్ధపడుతుంది


బాల్య, కౌమార, యౌవన, వార్ధక్య దశలదాకా విస్ఫులింగ తేజంతో విజేతగా నిలిచిన *నేను* అనే ప్రభ ఏదో ఒకనాడు మృత్యుస్పర్శతో కుప్ప కూలిపోతుంది.

వందిమాగధులు కైవారం చేసిన శరీరం కట్టెలా మిగులుతుంది.

సుందరీమణులతో మదనోత్సవాలు జరుపుకొన్న దేహం నిస్తేజంగా పడి ఉంటుంది.

సుఖభోగాలతో, అష్టైశ్వర్యాలతో తులతూగిన *నేను* చుట్టూ చేరిన బంధుమిత్ర సపరివారపు జాలి చూపులకు కేంద్ర బిందువుగా మారుతుంది.

*కడసారి చూపులకోసం, కొన్ని ఘడియలపాటు ఆపి ఉంచినవిగతజీవికి అంతిమయాత్ర మొదలవుతుంది.*

*మరుభూమిలో చితిమంటల మధ్యే సర్వబంధనాల నుంచీ విముక్తి కలుగుతుంది.*

*మొలకుచుట్టిన ఖరీదైన కౌపీనంతో సహా, మొత్తంగా కాలి బూడిద అవుతుంది.*


**నేనే* శాసన కర్తను, *నేనే* ఈభూమండలానికి అధిపతిని, *నేనే* జగజ్జేతను... అని మహోన్నతంగా భావించిన *నేను* లేకుండానే మళ్ళీ తెల్లవారుతుంది. రోజు మారుతుంది.


ఊపిరితో మొదలై ఊపిరితో ఆగిన *నేను* కథ అలా సమాప్త మవుతుంది.


అందుకే ఊపిరి ఆగకముందే *నేను* గురించి తెలుసుకో అంటుంది భగవద్గీత!

ఉపనిషత్తులు

 అన్నీ పరమాత్మ దేహంలో భాగాలే, దేనియందు అసహ్యం చెందకు (6వ మంత్రం)           [ఉపనిషత్తులు]                               


4వ మరియూ 5వ మంత్రాల్లో పరమాత్మ తత్త్వం ఏమిటో తెలిసింది. అయితే మనం చూస్తున్నది ప్రపంచాన్ని. అందులో ఎన్నో రకాల జీవుల్లు. వారియందు మనం ఎట్లాంటి భావన కలిగి ఉండాలి ? వారితో నడుచుకునేప్పుడు పరమాత్మ వరకు అది పర్యవసించగలగాలి. అదేలా సాధ్యం ఈ మంత్రం చెబుతుంది.


యస్తు సర్వాణి భూతాని  ఆత్మన్యేవానుపశ్యతి |

సర్వ భూతేషు చాత్మానం తతో న విజుగుప్సతే || (6)


విజుగుప్స- అంటే అసహ్యం, లోకంలో కొందరిని చూస్తే కలుగుతోంది అసహ్యం, కొందరిని చూస్తే కలుగుతోంది ప్రేమ,  ఏమి కారణం ? మన కాలికి మురికి అంటితే కాలును పట్టుకోవడానికి ఏం పెద్ద పాదపడటం లేదే, కారణం ఇది నా దేహంలోని భాగమే అనే భావం. కాలిలో ముల్లు దిగితే కంటిలోంచి నీరు వస్తుంది, శరీరంలో ఒక అవయవం శోకిస్తే మిగతా అవయవాలు అన్నీ స్పందిస్తాయి. వాటికి అట్లాంటి జుగుప్స లేదు. ఇదే దృష్టితో ప్రపంచాన్ని చూడు,  ఇక ఎవడిని చూసి జుగుప్స చెందుతావు ? చెందవు. ఎందుకని ?  "యస్తు సర్వాణి భూతాని ఆత్మని" సర్వ భూతాలు అన్నీ పరమాత్మ ఆధీనంలో ఉన్నాయి. "సర్వ భూతేషు చాత్మానం" పరమాత్మ అంతటా ఉన్నాడు, ప్రతి ప్రాణిలో ఉన్నాడు. విశ్వశరీరంలో ప్రతి ఒక్కరం ఒక్క అవయవమే, కనుక ఒక అవయవం మరొక అవయవాన్ని ఎప్పుడూ ధూషించదు, ద్వేశించదు, అసహ్యం చెందదు. 


కనుక ఎవడైతే కనిపించే ప్రపంచంలోని విషయాలు పరమాత్మపై ఆధారపడి ఉన్నాయని, అవన్నీంటిలో పరమాత్మ వ్యాపించి ఉన్నాడని తెలిస్తే వాడికి పరమాత్మ తత్త్వం అర్థం అయినట్లు, ఇక ఈర్ష్య అసూయ ద్వేషాలు ఉండవు. ఇక అవి లేనప్పుడు వాడికి పాపం అంటనే అంటదు.

విష్ణుసహస్ర నామ స్తోత్రం విశిష్టత

 విష్ణుసహస్ర నామ స్తోత్రం విశిష్టత


రోజుకు కనీసం ఒక్క సారైనా 

విష్ణుసహస్ర నామ పారాయణం చేయండి.

ఉత్తమ ఫలితాలు పొందండి..


మంత్రాల ఘనికి మూల మంత్రం శ్రీ విష్ణుసహస్రనామం

ఓం నమో నారాయణాయ .

ఓం నమో భగవతే వాసుదేవాయ.

ఫలితం మీకే స్పష్టంగా తెలుస్తుంది...


విష్ణు సహస్ర నామ స్తోత్రము పారాయణ చేసిన 

అశ్వ మేధ యాగం చేసినంత పుణ్యం కలుగును ఆయురారోగ్యము కలుగును, 

పాపములు తొలగును. 


స్తోత్రము లో ప్రతి నామము అద్భుతం. 

మన నిత్య జీవితంలోని అన్నీ సమస్యలకు పరిష్కరాలు ఇందులో వున్నాయి


విష్ణు సహస్రనామాన్ని ప్రతిరోజు నిష్ఠతో పఠించే వారికి ఎలాంటి ఇబ్బందులైనా తొలగిపోతాయి. కష్టనష్టాలు ఒక్కసారిగా మీదపడి ఉక్కిరిబిక్కిరి చేస్తున్న తరుణంలో విష్ణు సహస్ర నామపారాయణం అన్నింటికీ విరుగుడులా పనిచేస్తుందని వారు సూచిస్తున్నారు. 


అనునిత్యం అత్యంత భక్తి శ్రద్ధలతో విష్ణు సహస్రనామ పారాయణం చేయడం ద్వారా కష్టాలు, వ్యాధులు తొలగిపోయి, అష్టైశ్వర్యాలు శుభాలు చేకూరుతాయి. విష్ణు సహస్రనామ పఠనం వలన పుణ్యరాశి పెరుగుతుందనీ.. ఉత్తమగతులు కలుగుతాయని పండితులు చెప్తున్నారు. ఇంకా ఇంటి దేవతా పూజతో, ఇష్టదేవతా పూజతో కూడా ఇబ్బందులను తొలగించుకోవచ్చునని వారు సూచిస్తున్నారు. 


అయితే విష్ణు సహస్రనామాన్ని అనునిత్యం ఏడాది పాటు పఠించడం ద్వారా ఎలాంటి ప్రయోజనాలు చేకూరుతాయంటే..?


1. అదృష్టం


2. ఆర్థిక ఇబ్బందులు వుండవు 


3. గృహంలో ఆహ్లాదకరమైన వాతావరణం 


4. కోరిన కోరికలు నెరవేరుతాయి


5. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది


విష్ణు సహస్రనామాన్ని పఠించే ముందు శుచిగా స్నానమాచరించడం చేయాలి. ఆపై పూజగదిలో కూర్చుని విష్ణు సహస్రనామాన్ని పఠించాలి. లేకుంటే వినడమైనా చేయాలి. ఈ విష్ణు సహస్ర నామం నుంచి వెలువడే శబ్ధం దుష్ట ప్రభావాన్ని దూరం చేస్తుంది. అలాగే ఇంటి ముందు తులసిని పెంచడం ద్వారా మంచి ఫలితాలు వుంటాయి. అలాగే తులసీ మొక్క ముందు నేతి దీపం వెలిగించడం ద్వారా శ్రీ మహాలక్ష్మీ దేవి అనుగ్రహాన్ని పొందిన వారవుతారు.


అభీష్టసిద్ధికి ఈ క్రింద సూచించిన శ్లోకములను 

108 మార్లు జపించవలెను. 

పిల్లల క్షేమార్థము తల్లిదండ్రులు జపము చేయవచ్చును:


1. విద్యాభివృద్ధికి :-

      14వ శ్లోకం.

సర్వగ సర్వవిద్భాను ర్విష్వక్సేనో జనార్దనః |

వేదో వేదవిదవ్యంగో వేదాంగో వేదవిత్కవిః ||


2. ఉదర రోగ నివృత్తికి:-

       16వ శ్లోకం.

భ్రాజిష్ణు ర్భోజనం భోక్తా సహిష్ణు ర్జగదాదిజః |

అనఘో విజయో జేతా విశ్వయోనిః పునర్వసుః ||


3. ఉత్సాహమునకు:-

       18వ శ్లోకం.

వేద్యో వైద్య స్సదాయోగీ వీరహా మాధవో మధుః |

అతీంద్రియో మహామాయో మహోత్సాహో మహాబలః ||


4. మేధాసంపత్తికి:-

       19వ శ్లోకం.

మహాబుధ్ధి ర్మహావీర్యో మహాశక్తి ర్మహాద్యుతిః |

అనిర్దేశ్య వపుః శ్రీమా నమేయాత్మా మహాద్రిధృక్ ||


5. కంటి చూపునకు:-

       24వ శ్లోకం.

అగ్రణీ గ్రామణీ శ్రీమాన్ న్యాయో నేత సమీరణః |

సహస్రమూర్థా విశ్వాత్మ సహస్రాక్ష స్సహస్రపాత్ ||


 6. కోరికలిడేరుటకు:-

         27వ శ్లోకం.

అసంఖ్యేయో2ప్రమేయాత్మ విశిష్ట శ్శిష్ట క్రుచ్ఛిచిః |

సిద్ధార్థ స్సిధ్ధసంకల్పః సిద్ధిద స్సిధ్ధిసాధనః ||


7. వివాహ ప్రాప్తికి:-

       32వ శ్లోకం.

భూతభవ్య భవన్నాధః పవనః పావనో2నలః |

కామహా కామక్రుత్కాన్తః కామః కామప్రదః ప్రభుః ||


8. అభివృద్ధికి:-

       42వ శ్లోకం.

వ్యవసాయో వ్యవస్థానః సంస్థాన స్స్థానదో ధ్రువః |

పరర్థిః పరమ స్పష్ట: స్తుష్ట: పుష్ట శ్శుభేక్షణః ||


9. మరణ భీతి తొలగుటకు:-

        44వ శ్లోకం.

వైకుంఠ: పురుషః ప్రాణః ప్రాణదః ప్రణవః ప్రుథుః |

హిరణ్యగర్భః శత్రుఘ్నో వ్యాప్తో వాయు రథోక్షజః ||


10. కుటుంబ ధనాభివ్రుద్ధికి:-

         46వ శ్లోకం.

విస్తారః స్థావర స్స్తాణుః ప్రమాణం బీజ మవ్యయం |

అర్థో2నర్థో మహాకోశో మహాభోగో మహాధనః ||


 11. జ్ఞానాభివ్రుద్ధికి:-

           48వ శ్లోకం.

యజ్ఞ ఇజ్యో మహేజ్యశ్చ క్రతు స్సత్రం సతాం గతిః |

సర్వదర్సీ నివృతాత్మ సర్వజ్ఞో జ్ఞాన ముత్తమం ||


12. క్షేమాభివ్రుధ్ధికి:-

           64వ శ్లోకం

అనివర్తీ నివృత్తాత్మ సంక్షేప్తా క్షేమక్రుచ్ఛివః |

శ్రీవత్సవక్షా శ్శ్రీవాస శ్శ్రీపతిః శ్శ్రీమతాం వరః ||


13. నిరంతర దైవ చింతనకు:-

          65వ శ్లోకం.

శ్రీద శ్శ్రీశ శ్శ్రీనివాసః శ్రీనిధిః శ్రీవిభావనః |

శ్రీధరః శ్రీకర శ్శ్రేయః శ్రీమాన్ లోకత్రయాశ్రయః ||


14. దుఃఖ నివారణకు:-

           67వ శ్లోకం.

ఉదీర్ణ స్సర్వత శ్చక్షు రనీశ శ్శాశ్వత స్థిరః |

భూశయో భూషణో భూతి ర్విశోక శ్శోక నాశనః ||


15. జన్మ రాహిత్యమునకు:-

          75వ శ్లోకం.

సద్గతి స్సత్క్రుతి స్సత్తా సద్భూతి స్సత్పరాయణః |

శూరసేనో యదుశ్రేష్ఠ స్సన్నివాస స్సుయామునః ||


16. విద్యా ప్రాప్తి కి :-

       80వ శ్లోకం.

అమానీ మానదో మాన్యో లోకఃస్వామీ త్రిలోకధృత్|

సుమేధా మేధజో ధన్యః సత్యమేథా ధరాధరః||


 17. శత్రువుల జయించుటకు:-

            88వ శ్లోకం.

సులభ స్సువ్రత సిద్ధ శ్శత్రుజి చ్ఛత్రు తాపనః !

న్యగ్రోధో దుంబరో2శ్వత్ఠ శ్చాణూరాంధ్ర నిషూధనః ||


18. భయ నాశనమునకు:-

           89వ శ్లోకం.

సహస్రార్చి స్సప్తజిహ్వ స్సప్తైధా స్సప్తవాహనః |

అమూర్తి రణఘో2చింత్యో భయక్రు ద్భయ నాశనః ||


19. సంతాన ప్రాప్తి కి :-

       90వ శ్లోకం.

అణుర్బృహత్కృశః స్థూలో గుణభృన్నిర్గుణో మహాన్|

అధృత స్స్వధృత స్య్సాస్థ్యః ప్రాగ్వంశో వంశవర్థనః||


20. మంగళ ప్రాప్తికి:-

         96వ శ్లోకం.

సనాత్సనాతన తమః కపిలః కపి రవ్యయః |

స్వస్తిద స్స్వస్తిక్రుత్ స్వస్తి స్వస్తిభుక్ స్వస్తిదక్షిణః ||


21. ఆపదలు తొలగుటకు, లోక కల్యాణమునకు:-

          97 & 98వ శ్లోకం.

అరౌద్రః కుండలీ చక్రీ విక్రమ్యూర్జిత శాసనః |

శబ్దాదిగ శ్శబ్దసహ శ్శిశిర శ్శర్వరీకరః ||

అక్రూరః పేశలో దక్షో దక్షిణః క్షమిణాం వరః |

విద్వత్తమో వీతభయః పుణ్యశ్రవణకీర్తనః ||


22. దుస్వప్న నాశనమునకు:-

            99వ శ్లోకం.

ఉత్తారణో దుష్క్రుతిహా పుణ్యోదుస్వప్న నాశనః |

వీరహా రక్షణ స్సంతో జీవనం పర్యవస్తితః ||


23. పాపక్షయమునకు:-

           106వ శ్లోకం.

ఆత్మయోని స్స్వయం జాతో వైఖాన స్సామగాయనః |

దేవకీ నందన స్స్రష్టా క్షితీశః పాపనాసనః ||


24.సర్వ రోగ నివారణకు:-

     103వ శ్లోకం.

ప్రమాణం ప్రాణనిలయః ప్రాణభృత్ ప్రాణజీవనః

తత్త్వం తత్త్వ విదేకాత్మా జన్మమృత్యు జరాతిగః||


25. సుఖ ప్రసవమునకు:-

    107వ శ్లోకం.

శంఖభృత్ నన్దకీ చక్రీ శారంగధన్వా గదాధరః|

రథాంగపాణి రక్ష్యోభ్యః సర్వ ప్రహరణాయుధః||

శ్రీ స్సర్వ ప్రహరణాయుధ ఓమ్ నమ ఇతి


విష్ణు సహస్ర నామము మొత్తం చదివిన తదుపరి మీకు ఇందులో కావలసిన శ్లోకం 108 సార్లు పఠించవలెను.

(సేకరణ)pvs శాస్త్రి స్వామి

శ్రీమద్రామాయణావతరణము

 🌹శ్రీమద్రామాయణావతరణము🌹 


మనమన ఘనమగు చరితము

కనిపించుచునుండ గాంచి కడుతోషమునన్

ముని యా వాల్మీకి యపుడు

ఘనమగు రామాయణంబు గావించె భువిన్  36 


శ్రీరాము జననంబు క్షితి పతి ప్రేమయు

         గురు వశిష్ఠుని వద్ద కూర్మి విద్య

గాదేయు జన్నంబు కావంగ బోవుట

        తాటకన్ జంపుట దారి యందు

జన్నమ్ము గాచుట జనకుని జేరుట

        శివ ధనుర్భంగమ్ము సీత పెంళ్లి

కైక వరంబులు కానల కేగుట

        పాదుకా దానమ్ము భరతు నకును

దండ కారణ్య సీమకు తరలు టయును

దనుజ నాసిక చెవులను తరుగు టయును

క్రూర ఖరదూష ణాదుల గూల్చు టయును

వర్ణనము జేసె వాల్మీకి వరుసగాను            37 


దశకంఠు చరితమ్ము తరుణి పై మొహంబు

         మారీచు సాయంబు మాయలేడి

సీతాపహరణమ్ము శ్రీరాము శోకంబు

         కపివర్యు మారుతిన్ కలసికొనుట

సురుచిర స్నేహమ్ము సుగ్రీవుపట్టంబు

          కలికి సీతమ్మకై కపులు జనుట

సామీరి పయనమ్ము సంద్రంబు దాటుట

          లంకిణిన్ జంపుట లంక జేరి

ధరణిపుత్రిక సీతమ్మ దర్శనంబు

లంక గాల్చియు వెనుకకు రయము గొచ్చి

సీత విషయము స్వామికి చెప్పు టయును

వర్ణనముజే సె వాల్మీకి వరుస గాను           38 


శ్రీరాము కోపంబు సేతు నిర్మాణంబు

         యుద్ధ సంసిద్ధత యుద్ధితిగను

రామ రావణ ఘోర రణ విశేషంబులు

         కుంభ కర్ణుడు నేల గూలు టయును

సౌమిత్రి మూర్ఛయు సంజీవి గ్రహణంబు

         యిల మీద గూలుట యింద్రజిత్తు

రఘురాము తేజంబు రావణుమరణంబు

          ధర్మసంస్థాపన ధరణి యందు

సీత నగ్నిపునీతను స్వీకరించి

తిరిగి సాకేత పురముకు చేరు టయును

రామ పట్టాభి షేకమున్ రమ్య ముగను

వర్ణ నము జే సె వాల్మీకి వరుస గాను         39



ఆదికవి వాల్మీకి యజుని యానతితోడ

          రామాయణంబును రమ్యముగను

యారు కాండములుగ  నరయంగ రచియించి

           జగతికి నర్పించె జనులు బొగడ

పంచశతములైన ప్రముఖ సర్గల తోడ

           భాసమానమ్ముగా పరిఢ విల్లి

వెరసి యిర్వైనాల్గు వేల శ్లోకాలతో

           నొప్పారె కావ్యమ్ము  నుర్వి యందు

ఘనుడు వాల్మీకి సంయమి  గరిమ తోడ

భవ్య రామాయణమునందు భాగముగను

తదుప రుత్తరకాండమున్ తనరు నట్లు

రమ్య మొప్పoగ పరిపూర్ణ రచన జేసె.        40



                      🌹శుభమ్ 🌹 


           గోపాలుని మధుసూదనరావు 🙏