2, నవంబర్ 2025, ఆదివారం

సైకాలజిస్ట్ తన కొడుకుకు

 ఓ సైకాలజిస్ట్ తన కొడుకుకు రాసిన మార్గదర్శక లేఖ… 


1.నీకు నచ్చని వారి పట్ల పగ పెంచుకోకు….


నిన్ను మంచిగా చూసుకునే బాధ్యత ఎవరికీ లేదు, మీ అమ్మ కు నాకు తప్ప. నీతో మంచిగా ఉన్నవారికి, విలువ నివ్వు. వారితో కృతజ్ఞతతో ఉండు, ,


అడవిలో ఒక్కొక్క జంతువుకు ఒక్కొక్క లక్షణం ఉంటుంది. సమాజములో అన్ని లక్షణాలున్న వారు ఒకేలా ఉంటారు… ఒక వ్యక్తి నీకు మంచిగా ఉన్నప్పుడు, అతను మిమ్మల్ని నిజంగా ఇష్టపడుతున్నాడని అర్థం కాదు. నీవు జాగ్రత్తగా ఉండాలి, తొందరపడి అతన్ని నిజమైన స్నేహితుడిగా పరిగణించవద్దు.


2. Learn detachment… నీవు ఇష్టపడేదాన్ని ఇష్టపడే మనిషిని కోల్పోయినప్పుడు నీవు కృంగి జీవితాన్ని కష్టము చేసుకోవద్దు… అన్నీ సృష్టిలో భాగమే. జరిగే వన్నీ మంచికే నని భావించు


3. జీవితం చాలా చిన్నది. ఏ రోజు నీ జీవితాన్ని వృధా చేసుకోవద్దు ఆ రోజు తిరిగి రాదు .ఎంత త్వరగా నీ జీవితాన్ని విలువైనదిగా భావిస్తావో, అంత త్వరగా జీవితాన్ని ఆనందిస్తావు… విలువయినదిగా చేసుకొంటావు…


4. ప్రేమ అనేది ఒక అస్థిరమైన అనుభూతి, ఈ అనుభూతి కాలంతో పాటు మరియు ఒకరి మానసిక స్థితితో పాటు మారుతూ ఉంటుంది. మీ ప్రియమైన వ్యక్తి మిమ్మల్ని విడిచిపెట్టినట్లయితే, ఓపికపట్టండి, కాలం మీ బాధను విచారాన్నీ సమాధానం ఇస్తుంది.. ప్రేమ యొక్క అందం మరియు మాధుర్యాన్ని అతిగా ఊహించుకొవద్దు బాధలను అతిగా ఊహించు కోవద్దు .


5. విజయవంతమైన వ్యక్తులు మంచి విద్యను పొందలేదు, కష్టపడి చదవకుండా మీరు విజయం సాధించగలరని దీని అర్థం కాదు! మీరు ఏ జ్ఞానాన్ని సంపాదించుకున్నారో అది జీవితంలో మీ కొక ఆయుధం. దానితో నీ జీవితాన్ని సుఖ వంతము నేసుకొ..పేదరికం నుండి ఐశ్వర్యానికి వెళ్ళవచ్చు, జీవితంలో చాలా వాటిని జీరో .నుంచే ప్రారంభించాలి!


6. వృద్ధాప్యంలో మీరు నాకు ఆర్థికంగా మద్దతు ఇస్తారని నేను ఆశించను, అలాగే మీ జీవితమంతా ఆర్థికంగా మద్దతు నేను ఇవ్వను. మీరు పెద్దయ్యాక నా మద్దతు బాధ్యత ముగుస్తుంది. ఆ తర్వాత, మీరు సైకిలు మీద ప్రయాణిస్తారా లేక కారులో ప్రయాణించాలా పేదవారుగా బ్రతకాలా లేక ధనవంతులుగా బ్రతకాలా నీ ఇష్టం


7. మీరు మీ మాటలను గౌరవిస్తారు, కానీ ఇతరులు అలా ఉండాలని ఆశించకండి. మీరు ప్రజలకు మంచిగా ఉండవచ్చు, కానీ ప్రజలు మీకు మంచిగా ఉండాలని ఆశించవద్దు. మీరు దీన్ని అర్థం చేసుకోకపోతే, మీరు అనవసరమైన ఇబ్బందులకు గురవుతారు.


8. లక్కీ డ్రాలు లేదా లాటరీలను నమ్మవద్దు. అంటే ధనవంతులు కావాలంటే కష్టపడాల్సిందే! విజయాలకు రాచబాట కాని దగ్గరి బాట కాని ఉండదు. అందరు నడిచే దారిలో నడవకు నీ కంటూ ఒక మార్గాన్ని అన్వేషించుకో…


9 మనం కలిసి గడిపిన సమయాన్ని విలువైనదిగా భావిద్దాం…. మరో జన్మ ఉంటుందో లేదో. అన్నీ ఈ జన్మ లోనే అనుభవిద్దాము. వచ్చే జన్మలో మళ్లీ కలుస్తామో లేదో తెలియదు…

Panchaag

 


స్త్రీలు శివలింగమునకు

 శ్రీమాత్రేనమః 


ఈ విషయంలో పూర్వసంప్రదాయాన్ని అనుసరించి చెప్పాలంటే...


స్త్రీలు శివలింగమునకు పూజచేయరాదు. శివుని భార్య అయిన శ్రీ గౌరీదేవికి, ఇంకా ఆమె రూపాలైన అన్నివిధములైన అమ్మవారి రూపాలనూ పూజించాలి. 


వివాహంలో కూడా వధువుచేత గౌరీపూజ చేయిస్తారు. ఈ విషయానికి ఇదే ప్రమాణం. 


స్త్రీలు తాకకూడనివి/ధరించకూడనివి....

రుద్రాక్షలు 

పగడాలు (ముత్యాలు కలపకుండా)

సాలగ్రామాలు 

తులసి చెట్టు యొక్క అగ్రాలు 

శివాభిషేకం 


ఇవన్నీ స్త్రీలకు నిషేధించబడినాయి. వీటి స్పర్శ వలన వైధవ్యం కలుగుతుందని చెబుతారు. 


అంతే కాకుండా... స్త్రీపురుషులకు వస్త్రాలను పెట్టే సందర్భాలలో... స్త్రీలు స్త్రీలకు, పురుషులు పురుషులకు బొట్టు పెట్టి వస్త్రాలను పెట్టాలి. ఏవో కారణాల వలన పురుషులే దంపతులిద్దరికీ వస్త్రాలను సంకోచంలేకుండా పెడుతున్నారు. ఇది తప్పు. 


కొన్ని చోట్ల నేను గమనించాను. ఆ విధంగా పురుషులు స్త్రీలకు వస్త్రాలను సమర్పించిన తరువాత ఆ ఇంట్లో అనర్థాలు జరిగాయి. నేను గమనించాను. 


కాని, నేడు ప్రవచనాలను చెప్పేవారిలో కొందరు... ఈ నిషేధం లేదని, వీటిని ధరించవచ్చని చెబుతున్నారు. ఇది సరైనది కాదని నా అభిప్రాయము.

*~శ్రీశర్మద*

క్షీరాబ్ధి ద్వాదశి వ్రతానికి

 


శ్రీభారత్ వీక్షకులకు కార్తిక మాస శుభాకాంక్షలు 🌹

     కార్తిక మాసంలో క్షీరాబ్ధి ద్వాదశి వ్రతానికి, ఆ రోజున చేసే తులసీ దామోదర పూజకు చాలా ప్రత్యేకతలున్నాయి. అసలు తులసి చెట్టు ఎలా పుట్టింది, దానికి అంతటి పవిత్రత ఎలా వచ్చింది, ఉసిరి మొక్కతో తులసికి పెళ్లి చేయడమేమిటి! వాటి వెనుక గల విశేషాలేమిటో వివరంగా తెలిపారు ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త డా. తిరుమల నీరజ గారు. వినండి.. ఇటువంటి విశిష్టమైన ఎపిసోడ్స్ ఉచితంగా వీక్షించడానికి వెంటనే చానల్ ను subscribe చేయండి, శ్రీభారత్ కుటుంబ సభ్యులు కండి.🙏

అనుబంధం

🔔 *అనుబంధం* 🔔

*భార్యాభర్తల అనుబంధం గురించి అమృత వాక్యాలు:*
                  
సృష్టి తీర్చిదిద్దిన అతి గొప్ప కళాఖండం “కుటుంబం”

నీకెంత అదృష్టం కలసి వచ్చినా నువ్వెంత కష్టం చేసే వాడివే అయినా నీ భార్య సహకారం లేనిదే నువ్వు యే రంగంలోనూ రాణించలేవు.

తన భర్త ఆదాయం, ఖర్చులను గమనిస్తూ తనకు సంబంధించిన ఖర్చులను తగ్గించుకునే భార్య నిజంగా ఓ వరమే.

అర్థం చేసుకునే భార్య దొరికితే అడుక్కుతినేవాడు కూడా హాయిగా జీవిస్తాడు.

అహంకారి భార్య దొరికితే అంబానీ కూడా సన్యాసంలో కలవాల్సిందే.

ప్రతి భర్త తన భార్యను మరో తల్లి రూపంగా భావిస్తే, ప్రతి భార్య తన భర్తను మొదటి బిడ్డగా పరిగణిస్తే 
ఇదే మధురమైన బంధం.

భార్యకు సేవ చేయడం అంటే బానిసగా బ్రతుకుతున్నామని కాదు అర్థం.. బంధాన్ని గౌరవిస్తున్నామని అర్థం.!

సంసారం అంటే కలసి ఉండడమే కాదు. కష్టాలే వచ్చినా కన్నీరే ఏరులై పారినా ఒకరిని ఒకరు అర్థం చేసుకొని కడవరకూ తోడూ వీడకుండా ఉండడం.

ఒక మంచి భర్త భార్య కన్నీరు తూడుస్తాడేమో కానీ అర్థం చేసుకునే భర్త ఆ కన్నీటికి కారణాలు తెలుసుకుని మళ్లీ తన భార్య కళ్లలో కన్నీరు రాకుండా చూసుకుంటాడు.

భార్యాభర్తల సంబంధం శాశ్వతం. కొంతమంది మధ్యలో వస్తారు. మధ్యలోనే పోతారు. భార్యకి భర్త శాశ్వతం. భర్తకు భార్య శాశ్వతం.

ఇంటి వ్యవహారాలు చక్కగా నిర్వహించగలిగే ప్రతి గృహిణీ గొప్ప విద్యావంతురాలి కిందే లెక్క !

అమ్మ లేకుంటే మనకు జన్మ లేదు. భార్య లేకుంటే ఆ జన్మకు అర్థం లేదు.

మోజు తీరగానే మూలనేసేది కాదు మూడుముళ్ల బంధం. ముసలితనంలో కూడా మనసెరిగి ఉండేది “మాంగల్య బంధం!”

బంధాలు శాశ్వతంగా తెగిపోకుండా ఉండాలి అంటే ఎదుటివారు తప్పు చేస్తే క్షమించాలి. మనం తప్పు చేస్తే క్షమించమని అడగాలి.

మూర్ఖురాలైన మహిళ తన భర్తను బానిసను చేసి ఆ బానిసకు యజమానిగా ఉంటుంది. 
కానీ తెలివైన మహిళ తన భర్తను రాజును చేసి ఆ రాజుకు తను రాణిగా ఉంటుంది.

కుటుంబంలో ఎన్ని కీచులాటలున్నా సమాజంలో భర్త పరువు నిలబెట్టాల్సిన బాధ్యత భార్యది. భార్యను చులకనగా చూడకుండా గౌరవించవలసిన ధర్మం భర్తది.

https://whatsapp.com/channel/0029VaAAuIn1NCrYXdsBqn2B

నీ సంతోషం నేను కాకపోయినా 
నా చిరునవ్వు మాత్రం నువ్వే.
నీ ఆలోచన నేను కాకపోయినా 
నా ప్రతి ఙ్ఞాపకం నువ్వే.

ప్రేమ అనేది చాలా విలువైనది. దాన్ని “వివాహం” అనే అద్దాల బీరువాలో పెట్టుకుంటేనే అది రాణిస్తుంది.

సృష్టి తీర్చిదిద్దిన అతి గొప్ప కళాఖండం “కుటుంబం”

గొడవ పడకుండా ఉండే బంధం కన్నా ఎంత గొడవ పడినా విడిపోకుండా ఉండే బంధం దొరకడం ఒక గొప్ప వరం.

కలిమి లేములతో.. కలసిన మనసులతో... కలివిడిగా మసలుకో.. కలకాలం సుఖసంతోషాలు పంచుకో..!

బంధం అన్నది అందమైన పుస్తకం లాంటిది. పొరపాటు అనేది అందులో ఒక పేజీ మాత్రమే.

ఆ ఒక్క పొరపాటు జరిగితే సవరించాలి కానీ మొత్తం పుస్తకాన్ని చించి వేయకూడదు.

భర్తకి భార్య బలం కావాలి. బలహీనత కాకూడదు భార్యకి భర్త భరోసా కావాలి భారం కాకూడదు. భార్యా భర్తల బంధం అన్యోన్యం కావాలి, అయోమయం కాకూడదు.

మనసులోని ప్రేమని, బాధని కళ్లలో చూసి చెప్పకుండానే గుర్తించగలిగిన వ్యక్తి భాగస్వామిగా దొరికితే అంతకుమించిన అదృష్టం మరొకటి ఉండదు.

అందాన్ని చూసి పెళ్లి చేసుకోవడం అంటే ఇంటికి వేసిన రంగులు చూసి ఇల్లు కొనుక్కోవడమే.

పెళ్లి అంటే ఈడూ-జోడూ, తోడూ-నీడా, కష్టం- సుఖం గురించి కాదు. ఇద్దరూ ఐక్యమైపోయి తమని ఉద్ధరించుకొనే ఒక మంచి అవకాశం. ప్రతి అమ్మాయికి చదువుకున్న భర్త రావడం సహజం. కానీ తన మనసు చదివిన భర్త రావడం అదృష్టం.✍️```

చిరునవ్వులతో కూడిన దంపతులారా 
మీ అందరికీ శుభాకాంక్షలు.!
.          *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
                       
🙏🏻🙏🏻🙏🏻🔔🔔🔔🙏🏻🙏🏻🙏🏻

మర్మకళ

 మర్మకళ - శరీరం నందు ఉండు మర్మస్థానములు  

        

మర్మ కళ అనే యుద్ధవిద్య భారతీయ ప్రాచీన రహస్య యుద్ధవిద్యలలో ఒకటి. ఈ యుద్దవిద్య ఎక్కువుగా కేరళలో అక్కడక్కడ కనిపిస్తుంది. ఈ విద్యకు మూలపురుషుడు పరమశివుడు . దీనికి వర్మ కళ అని మరొక పేరుతో కూడా వ్యవహరిస్తున్నారు.

            

మనిషియొక్క శరీరంలో ప్రాణశక్తి అనేది శరీరములో గల పది మార్గాలనుంచి పైనుంచి క్రిందకి , క్రింద నుంచి పైకి ప్రయాణిస్తూ ఉంటుంది. ఈ మార్గాలను "దశ నాడులు " అని పిలుస్తారు . ఈ ప్రాణశక్తి ప్రవహించే మార్గాలలో ఎటువంటి అడ్డు ఏర్పడినపుడు మనుష్యునికి రోగాలు సంభవిస్తాయి. శరీరములో రక్తం ప్రవహించుటకు రక్తనాళాలు ఎలా ఉన్నాయో అదేవిధముగా వాయువు శరీరం అంతా పరిభ్రమించుటకు కొన్ని ప్రత్యేక మార్గాలు కలవు. ఈ మార్గాలనే నాడులు అని పిలుస్తారు . ఈ నాడులు లో వాయవు ఉంటుంది. పైన చెప్పిన ప్రాణశక్తి అనేది వాయవు రూపంలో ఉంటుంది.

            

మర్మస్థానం గురించి వివరించాలి అంటే అదొక ట్రాఫిక్ జంక్షన్ లాంటిది. జంక్షన్ లో సమస్య లేనంతవరకు వాహనాలు ఎటు వెళ్ళేవి అటు ప్రశాంతముగా వెళ్తాయి. ఏదన్నా సమస్య వస్తే ఒకదానివెంట ఒకటి ఆగి సమస్య ఎలా వస్తుందో అదేవిధముగా మర్మస్థానము పైన దెబ్బ తగిలిన వెంటనే శరీరం నందు ఒక్కసారిగా మార్పు వస్తుంది . అవయవాలు చచ్చుబడుట , కోమాలోకి వెళ్లడం , మరణించడం ఈ మూడు రకాల సమస్యలు సంభంవించును. ఏ సమస్య అనేది మర్మస్థానం మరియు మర్మస్థానం పైన దెబ్బ ఎంత బలంగా తగిలింది అనేదానిని బట్టి ఉంటుంది.

         

    మనుష్య శరీరములోని సిరలు గురించి చెప్పాలంటే వాత , పిత్త , కఫ , రక్త వాహకాలు అని నాలుగు రకాలుగా ఉంటాయి.ఇవి మొత్తం 700 సిరలు శరీరం నందు ఉండును. ఈ సిరలును ఆశ్రయించి మర్మస్థానాలు ఉంటాయి. ఈ మర్మ స్థానముల యందు దెబ్బ తగిలినప్పుడు లేదా గాయం అయినపుడు ప్రాణానికి ముఖ్యమైన రక్తం అధికంగా స్రవించును . రక్తము వలనే మిగిలిన ధాతువులు అన్నియు వృద్ధిచెందుతూ ఉండును. గాయం వలన రక్తం అధికంగా పోయినచో శరీరం నందలి మిగిలిన ధాతువులు క్షీణించును. ఎప్పుడైతే ధాతుక్షయం జరిగినదో వాతం ఒక్కసారిగా వృద్దిచెంది తేజోరూపమైన పిత్తమును ప్రేరణ చెందించును. దీనివల్ల దెబ్బ లేదా గాయం అయిన మర్మస్థానం నందు మిక్కిలి తీవ్రమైన మంట, పోటు మున్నగు బాధలు కలుగును. తీవ్రమైన దప్పిక , శోష , భ్రమ కలుగును. ఆ తరువాత శరీరం పైన తీవ్రంగా చెమట పట్టి అవయవాలు చచ్చుబడుతూ నరకాన్ని అనుభవిస్తూ మరణిస్తాడు. పైన చెప్పిన లక్షణాలన్నీ మర్మస్థానం పైన దెబ్బ తగిలినప్పుడు సంభంవించును. ఈ అత్యంత ప్రాచీన రహస్యమైన మర్మకళ ని సంపూర్ణంగా అభ్యసించిన వ్యక్తికి మాత్రమే మనుష్య శరీరంలో మర్మ స్థానాలు ఎక్కడ ఉంటాయో చక్కగా తెలుస్తుంది. ఈ మర్మస్థానాలనే మన తెలుగుభాషలో ఆయువుపట్లు అంటాము.

                          

    ఇప్పుడు మీకు మర్మస్థానముల గురించి వివరిస్తాను. మనుష్య శరీరం మొత్తం మీద 107 మర్మస్థానాలు ఉండును. నాకున్న పరిధినిబట్టి కొంత సమాచారం మాత్రం మీకు వివరిస్తాను. తొడలు ,చేతులు ఈ నాలుగు అంగముల యందు ఒక్కోదానియందు 11 మొత్తము 44 . ఉదర భాగము నందు 3 , రొమ్ము భాగము నందు 9 , వీపున 14 , కంఠము పై భాగము నందు 37 ఉండును. ఇవ్వన్ని కలిపి మొత్తం 107 మర్మములు ఉండును.

          

       ఆయా భాగములలోని మర్మస్థానాలలో దెబ్బలు గాని గాయాలు గాని సంభవించినపుడు కలుగు విపరీత పరిస్థితుల గురించి మీకు వివరిస్తాను. కాలు యందు ఉండు పదకొండు మర్మస్థానములలో ఒకటి నడిమివేలికి అభిముఖంగా , పాదమధ్య భాగము నందు తల హృదయమును మర్మస్థానం ఉండును. ఈ స్థానము నందు దెబ్బ తగిలినచో తీవ్రమైన నొప్పి కలిగి వెంటనే మరణం సంభంవించును. బొటనవేలికి మరియు మిగిలిన వేళ్ళకి మధ్య క్షిప్రం అను మర్మస్థానం ఉండును. ఈ ప్రదేశము నందు దెబ్బ తగిలినచో అవయవాలు చచ్చుబడి మరణం సంభంవించును. క్షిప్ర మర్మస్థానము నకు రెండు అంగుళాల పైభాగము నందు కూర్చమ్ అను మర్మస్థానం ఉండును. దీనిపైన దెబ్బ తగిలినచో పాదము నందు వణుకు పుట్టును .

           

      కీలు భాగము నందు ఉండు మర్మలో దెబ్బ తగిలినచో నొప్పి కలిగి కీలు యొక్క గమనం మందగించును. పిక్క మధ్యభాగము నందలి దెబ్బ తగిలి రక్తం వెడలి ఎక్కువ మోతాదులో బయటకి పొయినచో ఆ వ్యక్తికి మరణం తప్పదు. కావున గాయం అయిన వెంటనే రక్తం బయటకి పోకుండా జాగ్రత్త పడవలెను. పిక్కకి మరియు తొడ మధ్యభాగము నందు ఉండు కీలు నందు జాను అను మర్మస్థానం ఉండును. అక్కడ దెబ్బ తగిలినచో మరణించును. ఒకవేళ చికిత్స ద్వారా కాపాడబడినను కుంటితనం సంప్రాప్తిస్తుంది.

       

        పైన చెప్పిన విధముగా అనేక మర్మస్థానములు మన యొక్క శరీరం నందు ఉండును. వాటిలో కొన్నిస్థానాల పైన దెబ్బలు తగిలితే వెంటనే మరణం సంభంవించును. మరికొన్ని స్థానాలలో దెబ్బలు తగిలితే కొన్నిరోజుల సమయంలో హఠాత్తుగా మరణించటం జరుగును. మరికొన్నిసార్లు శాశ్వత అంగవైకల్యం లేదా తాత్కాలిక అంగవైకల్యం సంప్రాప్తినిచ్చును . ఈ మర్మస్థానం ల యందు దెబ్బలు తగలడం వలన వచ్చు జబ్బులకు 

అత్యంత కష్టసాధ్యముతో నయం చేసినప్పటికీ దానిప్రభావం మాత్రం పోదు .

            

        మర్మకళ ని నేర్చుకోవాలి అనుకునే వ్యక్తికి చాలా అత్యంత కఠిన నియమ నిబంధనలు ఉంటాయి. ఈ విద్య అందరికి లభించదు. మనస్సుపైన , తన యొక్క భావావేశాలును అదుపులో ఉంచుకోగలిగిన వ్యక్తి మాత్రమే ఈ విద్య నేర్చుకోగలుగుతాడు .

      

           చివరగా చిన్న విషయం చిన్నపిల్లల తలపైన మొట్టికాయలు వేయడం ప్రమాదకరం ఆ స్థలములో కూడా మర్మస్థానాలు ఉంటాయి. ఒక్కోసారి ఆ స్థానాల్లో దెబ్బ తగలడం వలన విపరీత ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది.

     

       ఆయుర్వేదములోని ఎన్నొ రహస్య మూలికల అనుభవ యోగాల గురించి నా గ్రంథాల యందు సంపూర్ణముగా , అందరికి అర్థమయ్యే సులభ భాషలో వివరించాను . వాటిని చదివి మరింత విజ్ఞానాన్ని పొందగలరు . 

  


గమనిక -

           


నేను రాసిన " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు " మరియు " ఆయుర్వేద మూలికా రహస్యాలు " రెండు గ్రంథాలలో ఎన్నొ రహస్య చిట్కాలు , మా కుటుంబపరంగా గత 250 సంవత్సరాల నుంచి మా పెద్దవారు మాకు అందించిన ఎంతో అనుభవసారాన్ని ఈ గ్రంథాలలో అందరి అర్థం అయ్యే విధంగా సామాన్య బాషలో వివరించాను. ఇంట్లో ఉండి మరియు అందుబాటులో ఉన్న వాటితోనే పెద్ద పెద్ద రోగాలు నయం చేసుకునే విధంగా అత్యంత సులభయోగాలు మన ప్రాచీన భారతీయులు రచించిన చెట్లను బట్టి భూమిలో నీటిని కనుక్కునే విధానాలు , వృక్షాలకు ఆయుర్వేద మూలికల ఉపయోగించి దిగుబడి పెంచే వృక్షాయుర్వేద చిట్కాలు , రైతులకు ఉపయోగపడే విధంగా ఏయే నక్షత్రాలలో పంటలు వేస్తే ఫలితాల ఎక్కువుగా ఉంటాయో తిథి, నక్షత్ర, వారాలతో సహా ఇవ్వడం జరిగింది. ఆయుర్వేదం నేర్చుకోవాలి అనుకునేవారికి ఇది మంచి దిక్సూచిలా ఉపయోగపడును. 

           

. నా మూడొవ గ్రంథము నందు 50 రకాల మొక్కల గురించి అత్యంత విపులంగా ఇవ్వడం జరిగింది . ఈ మొక్కలన్నియు ప్రతి ఒక్కరికి తెలిసినవి మరియు మన ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటివే . ఈ గ్రంధములలో మీకు లభ్యమయ్యే సమాచారం మరే గ్రంథములలో లభ్యం అవ్వదని చెప్పగలను . మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల చిత్రములు కూడా ఇవ్వడం జరిగినది . ఏయే జబ్బులకు ఎటువంటి ఆహారపదార్థాలు తీసుకోవలెనో , తీసుకోకూడదో కూడా సంపూర్ణముగా మీకు ఇందులో లభ్యం అగును . ఔషధాలు మరియు తీసుకోవాల్సిన ఆహారవిహారాలు ఒకేదగ్గర లభ్యం అగును . 

   

ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు గ్రంథము 288 పేజీలతో ఉండును . దీని విలువ 400 రూపాయలు , ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథము 384 పేజీలతో ఉండి 500 రూపాయలు , సర్వమూలికా చింతామణి గ్రంథము 352 పేజీలతో ఉండును . దీని విలువ 550 రూపాయలు . అందరికి అర్ధమయ్యేలా సులభ బాషలో ఉండును. గ్రాంథిక భాష ఉపయోగించలేదు . 

                

. ఈ గ్రంథములు కావలసిన వారు 9885030034 నంబర్ కు Phonepay or Googlepay or Paytm కు డబ్బు పంపించి ఇదే నంబర్ కు Whatsup నందు screenshot పెట్టి మీ పూర్తి Adreass ఇవ్వగలరు . కొరియర్ చార్జీ 100 రూపాయలు అదనం .

     

. ఈ గ్రంథాలు కావలసినవారు క్రింద ఇచ్చిన నంబర్ కి ఫోన్ చేయగలరు .

    

. కాళహస్తి వేంకటేశ్వరరావు  

 

. అనువంశిక ఆయుర్వేద వైద్యులు 

        

. 9885030034