19, డిసెంబర్ 2023, మంగళవారం

కొలమానమవుతుంది

 *1988*

*కం*

పనిముగియగ పనిముట్లను (పరికరముల)

పనిమంతులు తగువిధముగ భద్రము చేయున్.

పనిముట్లకు నిచ్చువిలువ

పనితనముకు మాపనమగు పదపడి సుజనా.

*భావం*:-- ఓ సుజనా! పని ముగిసిన తరువాత పనిమంతులు పనిముట్లను తగువిధంగా భద్రపరచెదరు. అలా పనిముట్లకు ఇచ్చే విలువ యే ఆ పనివారి పనితనానికి కొలమానమవుతుంది.

*** *కొంపెల్ల శ్రీనివాస శర్మ*

విజయములు అందగలవు.

 *1987*

*బహులఘుకందము*

గతమున విఫలములకు గల

స్థితి గతులను పరిగణించి స్థితమతి తోడన్

శ్రితబలముల నొకగతి గొన

స్తుతవిజయములందగలవు తుదకిల సుజనా.

*భావం*:-- ఓ సుజనా! గతంలో పొందిన విఫలములకు గల పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని స్థిరమైన మనస్సు తో మనవద్ద యున్న బలములను(శ్రితబలములు) ఒక క్రమమైన పద్ధతిలో స్వీకరించి నచో చివరకు పొగడదగిన విజయములు అందగలవు.

*** *కొంపెల్ల శ్రీనివాస శర్మ*

నేను అనంతం

 నేను ఇక్కడ ఒక బంధాన్ని

నేను ఇక్కడ ఒక జ్ఞాపకాన్ని 

నేను ఇక్కడ ఒక స్నేహాన్ని 

నేను ఇక్కడ అనేక రకాలుగా ఉన్న జీవాత్మను కానీ నా ప్రయాణం అనంతమైనది దీనికి కారణం 

నాకు విశ్వం విష్ణువు అన్న భావన నాలో లేక పోవడం నేను వేరు విష్ణువు వేరు అనే భావనతో ఉన్నాను

కానీ విశ్వం విష్ణువు అన్న భావన నాలో కలిగిన రోజు విష్ణువులో నేను ఉన్నాను.  

*నేను అనంతం*

కృష్ణార్పణం

 💐🌾❤️ కృష్ణార్పణం❤️🌾💐


ఒక పేద,అమాయకపు కృష్ణభక్తురాలు ఒక గ్రామంలో ఉండేది. గోక్షీరాన్ని, పెరుగు, వెన్న, నెయ్యి అమ్ముకొంటూ జీవనాన్ని సాగించేది. ఆమె ఎక్కడ విన్నదో ఎవరన్నారో గానీ కృష్ణార్పణం అన్న మాట విన్నది... అదేదో మంత్రమనుకొని ప్రతి విషయానికీ కృష్ణార్పణ మనడం మొదలుపెట్టింది.


ఆ పదమెంతగా అలవాటయ్యిందంటే నిద్ర లేవగానే కృష్ణార్పణం, పడుకొనే ముందు కృష్ణార్పణం, భుజించే ముందు, భోజనం తరువాత, బయటకెళ్ళే ముందు ఇంటికొచ్చిన తరువాత..కృష్ణార్పణమే. చెత్త ఊడ్చి పారేసేటప్పుడు, గోమయాన్ని ఎత్తి కుప్పగా వేసేటప్పుడూ కృష్ణార్పణం అనటమే


ఆవిడ ఇలా మొదలుపెట్టగానే ఆ ఊరిలో కలకలం చెలరేగింది.


ఆ ఊళ్లోని శ్రీకృష్ణ దేవాలయంలో కృష్ణుడిపై చెత్త, గోమయం పడుతోంది... ప్రతీ రోజూ పూజారి శుభ్రం చేసినా మర్నాడు మళ్ళీ చెత్త పడుతోంది. ఎవరికీ అర్ధంకాక నిఘా పెట్టారు ఊరి జనమందరి మీదా. ఒక స్త్రీ చెత్త ఊడ్చి పారేయడం, అక్కడ కృష్ణుడి పై చెత్త పడటం ఒకే సమయంలో జరగడం గమనించి ఊరందరూ ఈవిడ చేసినదానికి ఉగ్రులై ఆ దేశపు రాజు గారి దగ్గరకు తీసుకుపోయారు.


రాజుగారు చెప్పినదంతా విని ఆవిడ నాకేమీ తెలియదని ఎంత ఏడుస్తున్నా కారాగార శిక్ష విధించారు.. ఖిన్నురాలై ఏడ్చుకొంటూ కారాగారం లోకి వెళ్తూ కృష్ణార్పణమంది.


మరుసటి రోజు స్వామి విగ్రహం వెనుకకు తిరిగిపోయింది... నాకీ పూజలు వద్దు అని బెట్టు చేస్తున్న చిన్ని బాలుడిలా... . ఐనా పట్టించుకోకుండా యధాతధంగా పూజలు చేశారు. ...ఆమె కటిక నేల పై పడుకొనే ముందు కృష్ణార్పణమనుకుంది. రెండవ రోజు కృష్ణుడి విగ్రహం నేలపై పడుకొనుంది.


ఇక మూడవ రోజు మళ్ళీ దేవాలయాన్ని తెరుద్దామని ఎంత ప్రయత్నించినా గర్భగుడి తలుపులు తెరుచుకోలేదు. ఈ లోగా కారాగారంలో గట్టిగా ఏదో తగిలి ఆమె కాలు బ్రొటనవేలు నుండి రక్తం ధారాపాతంగా ద్రవించసాగింది. అప్రయత్నంగా కృష్ణార్పణం అనగానే గాయం మాయమయ్యింది. అది చూసిన కారాగృహాధికారి ఆ వెంటనే రాజుగారికి చెప్పాడు.


అదే సమయంలో ఆ ఊరి జనం కూడా రాజుగారి దగ్గరకు చేరుకున్నారు.


“మహాప్రభో శ్రీవారి విగ్రహం బ్రొటన వేలు నుంచి ధారాపాతంగా రక్తమొస్తోంది. ఎన్ని కట్లు కట్టినా ఆగట్లేదు. విషయం అర్ధమవ్వ ట్లేదు” అని వాపోయారు.


రాజుగారు వెంటనే ఆ స్త్రీని పిలిపించి అడిగారు. నీ గాయం అకస్మాత్తుగా ఎలా నయమైపోయిందని.


“నాకు తెలియదు” అంది...


“సరే ఏదో మంత్రం చదివావట కదా ?” అని ప్రశ్నిస్తే ఆమె కృష్ణార్పణం అనే అన్నాను అని బదులిచ్చింది.


సభలోని వారందరూ హతాశులయ్యారు.


ఆమెని “నీకు కృష్ణార్పణమంటే ఏమిటో తెలుసా?” అని అడిగితే “తెలియదు ఏదో మంత్రమనుకుంటా. ఎవరో అంటుంటే విని అనడం మొదలుపెట్టాను. అలా అనటం తప్పాండీ? ఆ మంత్రం నేను జపించకూడదా? ఐతే తెలియక చేసిన తప్పును క్షమించండి.” అని ఏడుస్తూ బేలగా అన్నది.


సభికులందరి కళ్లూ చెమర్చాయి ఆమె అమాయకత్వానికి. ఆమెకు కృష్ణార్పణం అనడంలో అర్ధాన్ని వివరించి కాళ్ళ మీద పడ్డారు.


ఇంతలో ఆమె ఘోరాతి ఘోరంగా రోదించడం మొదలెట్టింది. అయ్యో తెలియక ఎంత అపరాధం చేశాను.. స్వామివారి మీద చెత్త పోసాను. నా గాయాన్ని కృష్ణుడికి అంటగట్టా ను. నా పాపానికి శిక్షేముంటుంది అనుకొంటూ శ్రీకృష్ణాలయానికి పరుగు పరుగునపోయింది.


చిరునవ్వులు రువ్వుతూన్న నందకిశోరుణ్ణి చూడగానే ఆమెకి కర్తవ్యం బోధపడింది. ఆ రోజు నుంచీ శుద్ధిగా భోజనం వండి తినే ముందు కృష్ణార్పణమనడం మొదలుపెట్టింది. శ్రీకృష్ణుడు తృప్తిగా వచ్చి ఆరగించడం మొదలుపెట్టాడు.


సకల చరాచర సృష్టికర్త తనంతట తానే కావాల్సింది తీసుకోగలడు. భోజనమైన తరువాత కొడుకు ఇచ్చిన ఎంగిలి తినుబండా రాన్ని తండ్రి వద్దనకుండా ఆప్యాయంగా ఎలా తింటాడో అలాగే భక్తులు పరిపూర్ణమైన భక్తితో సమర్పించిన దానిని కూడా అత్యంత ప్రేమ పూర్వకంగా స్వీకరిస్తాడు.


ఆమె భక్తి భావాన్ని లోకానికి చాటి చెప్పడానికి చెత్తనే తనపై వేసుకున్న భక్తలోలుడి లీలలను మనం కొనియాడడానికి మాటలున్నాయంటా రా?!


ఎందుకు ఇంక ఆలస్యం ఒకసారి 'కృష్ణార్పణం' అని అనుకోండి...


*సేకరణ:- శ్రీ ఎ.వి. రామారావు గారి పోస్టు.*

సిరప్పులి నాయనారు

 🔱🔱⚜️⚜️🔱🔱⚜️⚜️🔱🔱

.          *⚜️పెరియ పురాణం⚜️*

.           *నాయనార్ల చరిత్ర - 34*

🔱🔱⚜️⚜️🔱🔱⚜️⚜️🔱🔱

 

*సిరప్పులి నాయనారు*


సంపద్భరితమైన చోళ దేశంలో తిరువాక్కరు అనే గ్రామంలో ఒక బ్రాహ్మణ కుటుంబంలో సిరప్పులి నాయనారు అనే శివభక్తుడు జన్మించాడు.

'లేదు' అని వచ్చిన వాళ్లకు లేదనకుండా ఇచ్చే ఉదార స్వభావంగల వాడు

సిరప్పులియారు.


 తన దగ్గరికి వచ్చిన శివభక్తులను మృదు మధురమైన మాటలతో

సంతోషంగా ఆహ్వానించి, షడ్రసోపేతమైన వంటకాలను తయారుచేసి

ప్రీతిగా వారికి వడ్డించేవాడు. వారు కోరిన పదార్థాలను లేదనకుండా ఇస్తూ

వచ్చాడు. జీవితాంతం పంచాక్షరి మంత్రాన్ని జపం చేస్తూ చివరగా

పరమేశ్వరుని తిరు చరణాల సన్నిధిని చేరుకున్నాడు.


*ముపైనాలుగవ చరిత్ర సంపూర్ణం*


*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*

🔱🔱⚜️⚜️🔱🔱⚜️⚜️🔱🔱

Vaamu kaaram podi

 


పరాన్నము ద్వారా

 ముఖం దగ్ధం పరాన్నేన

హస్తౌ దగ్దౌప్రతిగ్రహాత్|

మనో దగ్ధం పరస్త్రీభిః

బ్రహ్మశాపం కుత:కలౌ||


పరాన్నము ద్వారా ముఖ వర్చస్సు - వాక్ శక్తి క్షీణిస్తుంది.... (బ్రాహ్మడికి) 


ఎప్పుడు బడితే అప్పుడు - ఎలా బడితే అలా - ఏది బడితే అది - దానం తీసుకోవడం ద్వారా[తర్వాత తథ్సంబంధమైన పరిహార క్రియలు చేసుకోక పోవడం ద్వారా?] చేతికి ఉన్న శక్తి /చేసిన పుణ్యము క్షీణిస్తుంది... 


పరస్త్రీ వ్యామోహం ద్వారా మనసు వికలమై మనోనిగ్రహం లేక [మనశ్శక్తి] మనస్సు దగ్ధమై శక్తి క్షీణిస్తుంది... 


(ఈ మనో వాక్ కాయ కర్మలు అనబడే త్రికరణ శుద్ధి లేని కలియుగ బ్రాహ్మణుడి యొక్క శాపానుగ్రహాలూ ఎలా సిద్ధిస్తాయి - కావున ప్రయత్న పూర్వకంగా త్రికరణశుద్ధి సాధించాలి...) 




ఇక కలిలో బ్రాహ్మాణ శాపం కానీ? (ఆశీర్వచనం కానీ?) ఎలా ఫలిస్తుంది....? ఫలించాలంటే? సాధన తపస్సు ఇంద్రియ నిగ్రహం.... ఇత్యాదులు అవసరం....

శ్రీ దేవీ భాగవతం

 శ్రీ దేవీ భాగవతం


.శ్రీగణేశాయనమః.శ్రీసరస్వత్యైనమః శ్రీగురుదత్తాత్రేయపరబ్రహ్మణేనమః

శ్లో)వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయవిష్ణవే|

నమోవైబ్రహ్మనిధయే వాసిష్ఠాయనమోనమః||

శ్లో)నారాయణంనమస్కృత్య నరంచైవ నరోత్తమం|

దేవీంసరస్వతీం వ్యాసం తతోజయముదీరయేత్||


శ్లో)సృష్టౌ యా సర్గరూపా జగదవనవిధౌ పాలినీ యా చ రౌద్రీ

సంహారే చాపి యస్యా జగదిదమఖిలం క్రీడనం యా పరాఖ్యా |

పశ్యంతీ మధ్యమాథో తదను భగవతీ వైఖరీవర్ణరూపా

సాస్మద్వాచం ప్రసన్నా విధి హరి గిరిశారాధితాలంకరోతు||


శ్లో)కాత్యాయనిమహామాయే భవాని భువనేశ్వరి |

సంసారసాగరోమగ్నం మాముద్ధరకృపామయే||

బ్రహ్మ విష్ణు శివారాధ్యే ప్రసీదజగదంబికే|

మనోఽభిలషితందేవివరందేహినమోఽస్తుతే||


ఋత్విక్కులుగా వచ్చిన మునీశ్వరుల మనస్సులు విలవిలలాడాయి. పసిబాలుణ్ణి బలి ఇవ్వడానికి

చేతులు రాలేదు. నరకవలసిన విప్రుడు నేను ఈ ఘాతుకం చెయ్యలేనంటూ కత్తి విసిరేసి వెళ్ళిపోయాడు.

హరిశ్చంద్రుడు అవాక్కయ్యాడు. ఏమి చెయ్యడానికీ తోచలేదు. సభాసదులారా ! తరణోపాయం చెప్పండి

అని అభ్యర్థించాడు. సభలో కలకలం బయలుదేరింది.

అజీగర్తుడు లేచి, మహారాజా! నేను చేస్తాను, వేతనం రెట్టింపు ఇప్పించు, నేను నిరుపేదను.

నాకు ధనం కావాలి. నీకు పని అవ్వాలి అన్నాడు. హరిశ్చంద్రుడు సరే అన్నాడు. నూరుగోవులు

ఇస్తానన్నాడు. అజీగర్తుడు కత్తి అందుకున్నాడు. కొడుకును చంపడానికి సిద్ధపడిన తండ్రిని చూసి జనాలు

ఆశ్చర్యచకితులయ్యారు. హాహాకారాలు చేశారు. వీడు తండ్రి కాదు, పిశాచమంటూ నిందించారు.

మహాపాపీ క్రూరుడా! డబ్బుకోసం కక్కుర్తిపడి కన్నకొడుకును అమ్ముకోవడమేకాక, స్వయంగా

చంపుకోడావికీ సిద్ధమయ్యావా ? ఏం సుఖపడతావ్ ఈ డబ్బుతో. కొడుకంటే ఎవరు ? ఏమి చెబుతోంది

వేదం ? ఆత్మావై జాయతే పుత్రః అంగాద్వై వేదభాషితమ్. ఎంత పాపాత్ముడివిరా అని నలుగురూ

నాలుగు మాటలూ అన్నారు. సభ అంతా కోలాహలమైపోయింది.

అంతలోకీ విశ్వామిత్రుడు అక్కడికి వచ్చాడు. పరిస్థితి అర్థమయ్యింది. హృదయం ఆక్రోశించింది.

19-12-2023 / మంగళవారం / రాశి ఫలితాలు

 ☘️🙏🕉️శ్రీ గురుభ్యోనమః🕉️🙏☘️


 •••••┉━•••••┉━•••••┉━•••••┉━  

19-12-2023 / మంగళవారం / రాశి ఫలితాలు

•••••┉━•••••┉━ •••••┉━•••••┉━•••••┉━•••••┉━ 

మేషం


బంధువులతో మాటపట్టింపులు ఉంటాయి. ముఖ్యమైన వ్యవహారాలలో స్వల్ప అవాంతరాలు తప్పవు. వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు మరింత చికాకు పరుస్తాయి. రుణదాతల నుండి ఒత్తిడి అధికమై నూతన  రుణాలు చేస్తారు. పుణ్యక్షేత్రాలు  సందర్శిస్తారు.

---------------------------------------

వృషభం


నూతన వాహనం కొనుగోలు చేస్తారు. నూతన వ్యక్తులతో పరిచయాలు ఉత్సాహాన్నిస్తాయి. వృత్తి వ్యాపారాలలో కీలక నిర్ణయాలు అమలు పరుస్తారు. ఉద్యోగస్తులకు రావలసిన పదోన్నతుల పొందుతారు. నిరుద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి. కుటుంబ సభ్యులతో  శుభకార్యాలలో పాల్గొంటారు. ఆకస్మిక ధనలాభ సూచనలు ఉన్నవి.

---------------------------------------

మిధునం


ఉద్యోగాలలో అనుకూల వాతావరణంఉంటుంది. చేపట్టిన పనులలో అవరోధాలు కలిగిన నిదానంగా పూర్తి చేస్తారు. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. ఆప్తుల నుంచి శుభవార్తలు అందుతాయి. దూరపు బంధువులసలహాలు కలసివస్తాయి.  వ్యాపారాలు అనుకులిస్తాయి.

---------------------------------------

కర్కాటకం


స్థిరస్తి ఒప్పందాలలో ఆటంకాలు తప్పవు. ముఖ్యమైన పనుల్లో జాప్యం కలుగుతుంది. వ్యాపార, ఉద్యోగాలలో అధికారుల నుండి సమస్యలు తప్పవు. నూతన ఋణ ప్రయత్నాలు కలసిరావు. ఆర్థిక విషయాలు నిరుత్సాహపరుస్తాయి. వృత్తి వ్యాపార విషయంలో జాగ్రత్త అవసరం.

---------------------------------------

సింహం


వ్యాపార, ఉద్యోగాలలో ఊహించని మార్పులు ఉంటాయి. బంధువులతో మాటపట్టింపులు ఉంటాయి. సోదరులు కొన్ని విషయాలలో మీతో విబేదిస్తారు. ఆరోగ్య విషయంలో శ్రద్ద వహించాలి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. చేపట్టిన వ్యవహారాలు నిరాశ పరుస్తాయి.

---------------------------------------

కన్య


స్థిరస్తి కొనుగోలుకు అవరోధాలు తొలగుతాయి నూతన కార్యకమాలు చేపడతారు. దూరపు బంధువుల కలయిక ఉత్సాహనిస్తుంది. వృత్తి వ్యాపారములలో ఆశించిన పురోగతి సాధిస్తారు. ఉద్యోగాలలో మీ ప్రతిభ వెలుగులోకి వస్తుంది ఆకస్మిక వస్తు వాహన లాభాలు పొందుతారు. బంధు వర్గం నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి.

---------------------------------------

తుల


కుటుంబ సభ్యులతో కొన్ని వివాదాలు తీరతాయి. సన్నిహితులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. వ్యాపారమున కీలక నిర్ణయాలు అమలుచేస్తారు. ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. నూతన భూ, వాహనాలు కొనుగోలు చేస్తారు. చిన్ననాటి మిత్రుల నుంచి అరుదైన ఆహ్వానాలు అందుతాయి.

---------------------------------------

వృశ్చికం


మిత్రులతో స్వల్ప విభేదాలు ఉంటాయి. చేపట్టిన పనులు కొన్ని వాయిదా వేస్తారు. ఆర్థిక విషయాలు నిరుత్సాహపరుస్తాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం.  ఉద్యోగాలలో అధికారులతో సమస్యలు కొంత ఒత్తిడి కలిగిస్తాయి. వృత్తి వ్యాపారాలలో శ్రమ తప్ప ఫలితం కనిపించదు.

---------------------------------------

ధనస్సు


కుటుంబ సభ్యులతో ఆలయాలు సందర్శిస్తారు. ఇంటా బయట పరిస్థితులు అనుకూలించవు. గృహమున కొందరి ప్రవర్తన శిరో భాధలు కలిగిస్తాయి. వ్యాపార, ఉద్యోగాలలో చికాకులు తప్పవు. విద్యార్థులకు ఒత్తిడి పెరుగుతుంది. చేపట్టిన పనులలో వ్యయప్రయాసలు అధికామౌతాయి. బంధువులతో స్వల్ప వివాదాలు ఉంటాయి.

---------------------------------------

మకరం


ఆత్మీయుల నుంచి వివాదాలకు సంభందించి కీలక సమాచారం. సన్నిహితుల నుండి ఊహించని ఆహ్వానాలు అందుతాయి. అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేస్తారు. వ్యాపార, ఉద్యోగాలలో సమస్యలు తొలగుతాయి. చిన్న నాటి మిత్రులతో విందువినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. స్థిరాస్తి కొనుగోలుకు అవరోధాలు తొలగుతాయి.

---------------------------------------

కుంభం


వృత్తి ఉద్యోగాలలో స్థానచలన సూచనలున్నవి. చేపట్టిన వ్యవహారాలలో అవాంతరాలు ఉంటాయి. కొత్త రుణాలు చేస్తారు. నిరుద్యోగులకు నిరాశ తప్పదు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది ఆప్తులతో స్వల్ప వివాదాలు కలుగుతాయి. వ్యాపార వ్యవహారాలలో  ఆలోచనలు స్థిరంగా ఉండవు.

---------------------------------------

మీనం


ఆత్మీయుల నుంచి శుభవార్తలు అందుతాయి. ముఖ్యమైన పనులు సజావుగా పూర్తి చేస్తారు. వ్యాపారాలు సాఫీగా సాగుతాయి. ఉద్యోగాలలో రావలసిన ప్రమోషన్ లు పొందుతారు. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. ఆకస్మిక ధన లాభ సూచనలున్నవి. విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు.

---------------------------------------

🍀 *శుభం భూయాత్* 🍁

గుణపాఠం

 *తప్పక చదవండి.*


*100 మంది సామర్ధ్యం గల ఒక హాస్టల్ నందు ప్రతిరోజూ ఉదయం టిఫిన్ లో ఉప్మా ను వడ్డించేవారు.* 

ఆ 100 మందిలోని 80 మంది మాత్రం ఉప్మా కాకుండా భిన్నమైన టిఫిన్ ను చేసి పెట్టాల్సిందిగా ప్రతిరోజూ ఫిర్యాదు చేసేవారు.


కానీ, మిగతా 20 మంది మాత్రం ఉప్మా తినడానికి సంతోషంగా ఉండేవారు.

మిగతా 80 మంది మాత్రం ఉప్మా కాకుండా మరేదో ఒకటి వండి పెట్టాల్సిందిగా కోరేవారు.


ఈ గందరగోళ పరిస్థితిలో ఎదో ఒక నిర్ణయానికి రావాలి కాబట్టి

ఆ హాస్టల్ వార్డెన్ వోటింగ్ పద్ధతిని ప్రతిపాదించడం జరిగింది.

దీని ప్రకారం ఏ టిఫిన్ కైతే ఎక్కువ ఓట్లు వస్తాయో, ఇక రోజు ఆ టిఫిన్ నే వండిపెట్టడం జరుగుతుంది.


*ఉప్మా కావాలి అనుకున్న 20 మంది విద్యార్థులు తమ ఓటును ఖచ్చితంగా వేశారు.*


మిగతా 80 మంది మాత్రం ఈ క్రింది విధంగా తమ ఓటును వేయడం జరిగింది.


18 - దోసా

16 - ఇడ్లీ

14 - రోటి

12 - బ్రెడ్ & పాలు

10 - వడ

10 - కిచిడి


కావున,

*ఓటింగ్ ఫలితాల ప్రకారం*

ఉప్మా కు అత్యధిక ఓట్లు పడటం వలన, మరలా అదే ప్రతి రోజు వడ్డించబడుతుంది.


*గుణపాఠం:*

*80% జనాభా స్వార్ధంతో, విభజించబడి, చెల్లాచెదురై దిక్కులు చూస్తున్నంత కాలం,*


*20% మమ్మల్ని పాలిస్తూ ఉంటుంది.*


 *ఇదొక నిశబ్ద సందేశం అర్ధం చేసుకోగలిగిన వారి కొరకు.*

19-12-2023 రాశి ఫలితాలు

 19-12-2023

రాశి ఫలితాలు

భౌమ వాసరః(మంగళవారం )

xxxxxx


మేషం

బంధువులతో మాటపట్టింపులు ఉంటాయి. ముఖ్యమైన వ్యవహారాలలో స్వల్ప అవాంతరాలు తప్పవు. వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు మరింత చికాకు పరుస్తాయి. రుణదాతల నుండి ఒత్తిడి అధికమై నూతన  రుణాలు చేస్తారు. పుణ్యక్షేత్రాలు  సందర్శిస్తారు.

---------------------------------------

వృషభం

నూతన వాహనం కొనుగోలు చేస్తారు. నూతన వ్యక్తులతో పరిచయాలు ఉత్సాహాన్నిస్తాయి. వృత్తి వ్యాపారాలలో కీలక నిర్ణయాలు అమలు పరుస్తారు. ఉద్యోగస్తులకు రావలసిన పదోన్నతుల పొందుతారు. నిరుద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి. కుటుంబ సభ్యులతో  శుభకార్యాలలో పాల్గొంటారు. ఆకస్మిక ధనలాభ సూచనలు ఉన్నవి.

-------------------------------------

మిధునం

ఉద్యోగాలలో అనుకూల వాతావరణంఉంటుంది. చేపట్టిన పనులలో అవరోధాలు కలిగిన నిదానంగా పూర్తి చేస్తారు. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. ఆప్తుల నుంచి శుభవార్తలు అందుతాయి. దూరపు బంధువులసలహాలు కలసివస్తాయి.  వ్యాపారాలు అనుకులిస్తాయి.

--------------------------------------

కర్కాటకం

స్థిరస్తి ఒప్పందాలలో ఆటంకాలు తప్పవు. ముఖ్యమైన పనుల్లో జాప్యం కలుగుతుంది. వ్యాపార, ఉద్యోగాలలో అధికారుల నుండి సమస్యలు తప్పవు. నూతన ఋణ ప్రయత్నాలు కలసిరావు. ఆర్థిక విషయాలు నిరుత్సాహపరుస్తాయి. వృత్తి వ్యాపార విషయంలో జాగ్రత్త అవసరం.

---------------------------------------

సింహం

వ్యాపార, ఉద్యోగాలలో ఊహించని మార్పులు ఉంటాయి. బంధువులతో మాటపట్టింపులు ఉంటాయి. సోదరులు కొన్ని విషయాలలో మీతో విబేదిస్తారు. ఆరోగ్య విషయంలో శ్రద్ద వహించాలి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. చేపట్టిన వ్యవహారాలు నిరాశ పరుస్తాయి.

---------------------------------------

కన్య

స్థిరస్తి కొనుగోలుకు అవరోధాలు తొలగుతాయి నూతన కార్యకమాలు చేపడతారు. దూరపు బంధువుల కలయిక ఉత్సాహనిస్తుంది. వృత్తి వ్యాపారములలో ఆశించిన పురోగతి సాధిస్తారు. ఉద్యోగాలలో మీ ప్రతిభ వెలుగులోకి వస్తుంది ఆకస్మిక వస్తు వాహన లాభాలు పొందుతారు. బంధు వర్గం నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి.

--------------------------------------

తుల

కుటుంబ సభ్యులతో కొన్ని వివాదాలు తీరతాయి. సన్నిహితులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. వ్యాపారమున కీలక నిర్ణయాలు అమలుచేస్తారు. ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. నూతన భూ, వాహనాలు కొనుగోలు చేస్తారు. చిన్ననాటి మిత్రుల నుంచి అరుదైన ఆహ్వానాలు అందుతాయి.

---------------------------------------

వృశ్చికం

మిత్రులతో స్వల్ప విభేదాలు ఉంటాయి. చేపట్టిన పనులు కొన్ని వాయిదా వేస్తారు. ఆర్థిక విషయాలు నిరుత్సాహపరుస్తాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం.  ఉద్యోగాలలో అధికారులతో సమస్యలు కొంత ఒత్తిడి కలిగిస్తాయి. వృత్తి వ్యాపారాలలో శ్రమ తప్ప ఫలితం కనిపించదు.

---------------------------------------

ధనస్సు

కుటుంబ సభ్యులతో ఆలయాలు సందర్శిస్తారు. ఇంటా బయట పరిస్థితులు అనుకూలించవు. గృహమున కొందరి ప్రవర్తన శిరో భాధలు కలిగిస్తాయి. వ్యాపార, ఉద్యోగాలలో చికాకులు తప్పవు. విద్యార్థులకు ఒత్తిడి పెరుగుతుంది. చేపట్టిన పనులలో వ్యయప్రయాసలు అధికామౌతాయి. బంధువులతో స్వల్ప వివాదాలు ఉంటాయి.

-------------------------------------

మకరం

ఆత్మీయుల నుంచి వివాదాలకు సంభందించి కీలక సమాచారం. సన్నిహితుల నుండి ఊహించని ఆహ్వానాలు అందుతాయి. అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేస్తారు. వ్యాపార, ఉద్యోగాలలో సమస్యలు తొలగుతాయి. చిన్న నాటి మిత్రులతో విందువినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. స్థిరాస్తి కొనుగోలుకు అవరోధాలు తొలగుతాయి.

---------------------------------------

కుంభం

వృత్తి ఉద్యోగాలలో స్థానచలన సూచనలున్నవి. చేపట్టిన వ్యవహారాలలో అవాంతరాలు ఉంటాయి. కొత్త రుణాలు చేస్తారు. నిరుద్యోగులకు నిరాశ తప్పదు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది ఆప్తులతో స్వల్ప వివాదాలు కలుగుతాయి. వ్యాపార వ్యవహారాలలో  ఆలోచనలు స్థిరంగా ఉండవు.

---------------------------------------

మీనం

ఆత్మీయుల నుంచి శుభవార్తలు అందుతాయి. ముఖ్యమైన పనులు సజావుగా పూర్తి చేస్తారు. వ్యాపారాలు సాఫీగా సాగుతాయి. ఉద్యోగాలలో రావలసిన ప్రమోషన్ లు పొందుతారు. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. ఆకస్మిక ధన లాభ సూచనలున్నవి. విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు.

--------------------------------------

పంచాంగం

 ఈ రోజు పంచాంగం 19.12.2023   Tuesday,

 

స్వస్తి  శ్రీ చాన్ద్రమాన శోభకృన్నామ సంవత్సర: దక్షిణాయనం హేమన్త ఋతు మార్గశిర మాస శుక్ల పక్ష: సప్తమి తిధి భౌమ వాసర: పూర్వాభాద్ర నక్షత్రం సిద్ది యోగ: వణిజ తదుపరి భద్ర కరణం. ఇది ఈరోజు పంచాంగం.


సప్తమి మధ్యాహ్నం 01:08 వరకు . 

శతభిషం రాత్రి 12:03 వరకు.

సూర్యోదయం : 06:44

సూర్యాస్తమయం : 05:42

వర్జ్యం : ఉదయం 07:25 నుండి 08:55 వరకు.

దుర్ముహూర్తం : పగలు 08:56 నుండి 09:39 వరకు తిరిగి రాత్రి  10:55 నుండి 11:47 వరకు.


రాహుకాలం : మధ్యాహ్నం 03:00 నుండి 04:30 వరకు.


యమగండం : పగలు 09:00 నుండి 10:30 వరకు.


శుభోదయ:, నమస్కార:

పూర్వ పద్ధతి పంచాంగం

 **********

*శుభోదయం*

***********

సంధ్యా వందన 

మరియు ఇతర

 పూజాకార్యక్రమాల సంకల్పము. 

పూర్వ పద్ధతి పంచాంగం.

తేదీ.19.12.2023

 మంగళ వారం (భౌమ వాసరే) 

*********

గమనిక:-ఇక్కడ నేను ఇచ్చే సంకల్పం మా పెద్దలు మరియు గురువుల ద్వారా నేర్చుకున్న నిష్కామ సంకల్పం.  దీనిని మీరు ఉన్న ప్రదేశం మరియు మీరు మీ గురువు ద్వారా నేర్చుకున్న విధంగా మార్చుకో  వచ్చును. 

__________________

శుభాభ్యుదయార్ధంచ, శుభే శోభనే ముహూర్తే శ్రీ  మహావిష్ణోరాజ్నేయా  ప్రవర్తమానస్య అద్యబ్రహ్మణః ద్వితీయ పరార్ధే శ్వేత వరాహ కల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రధమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే

మేరోః దక్షిణ దిగ్భాగే శ్రీ శైలస్య వాయువ్య దిగ్భాగే (హైదరాబాద్ లో వారికి మాత్రమే)గంగా కావేర్యోర్మధ్య ప్రదేశే  శ్రీలక్ష్మీ నివాస గృహే సమస్థ దేవతా హరిహర గురు గో బ్రాహ్మణ చరణ సన్నిధౌ  అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన

శ్రీ శోభకృత్ నామ సంవత్సరే దక్షిణాయనే

హేమంతృతౌ

మార్గశీర్ష మాసే శుక్ల పక్షే సప్తమ్యాం (సూర్యోదయానికి ఉన్న తిథే  చెప్పుకోవాలి సంధ్యావందనాలకు మాత్రమే)

భౌమ వాసరే 

శుభ నక్షత్రే

శుభ యోగే,

శుభకరణ,  

ఏవంగుణ విశేషణ విశిష్ఠాయాం శుభ తిధౌ 

శ్రీమాన్_______గోత్రః_____నామధేయః  

శ్రీమతః ______గోత్రస్య_______ నామధేయస్య మమ ఉపాత్త దురిత క్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ముద్దిశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం ప్రాతః/మాధ్యాహ్నిక/సాయం 

సంధ్యాముపాసిష్యే. 

సంధ్యా వందనం కొరకు మాత్రమే.


ఇతర పూజలకు

 శ్రీ శోభకృత్  నామ సంవత్సరే దక్షిణాయనే

హేమంతృతౌ మార్గశీర్ష మాసే  శుక్ల పక్షే 

సప్తమ్యాం

భౌమ వాసరే అని చెప్పుకోవాలి.


ఇతర ఉపయుక్త విషయాలు

సూ.ఉ.6.27

సూ.అ.5.26

శాలివాహనశకం 1945 వ సంవత్సరం.  

విక్రమార్క శతాబ్దం లో 2080 వ సంవత్సరం. 

కల్యబ్దాః 5124 వ సంవత్సరం. 

శ్రీ శోభకృత్ నామ సంవత్సరం 

దక్షిణాయన పుణ్యకాలం శరత్ ఋతువు

మార్గశిర మాసం 

శుక్ల పక్షం సప్తమి సా. 4.06 వరకు. 

మంగళ వారం. 

నక్షత్రం పూర్వాభాద్ర తె. 3.11 వరకు.

అమృతం రా.7.45 ల 9.14 వరకు. 

దుర్ముహూర్తం ఉ.8.38 ల 9.14 వరకు.

దుర్ముహూర్తం రా.10.38 ల 11.30 వరకు. 

వర్జ్యం ప.10.50 ల 12.19 వరకు. 

యోగం సిధ్ధి రా. 10.16 వరకు.

కరణం వనజి సా. 4.06 వరకు.  

సూర్యోదయము  ఉ.6.00 గంటలకు అయితే.

రాహు కాలం సా.3.00 ల 4.30 వరకు. 

గుళిక కాలం మ.12.00 ల 1.30 వరకు. 

యమగండ కాలం ఉ.9.00 ల 10.30 వరకు. 

***********

పుణ్యతిధి మార్గశిర శుద్ధ సప్తమి. 

********

పద్మావతీ శ్రీనివాస వివాహ సమాచార సంస్థ*,

(స్థాపితము 11/08/2000 రి.జి.నెం.556/2013)

S2,/C92, 6 -3 -1599/92,C

Vanasthalipuram, Hyderabad

500 070.

.**********

*బ్రాహ్మణ వధూవరుల సమాచార కేంద్రం*

                           వారి

*బ్రాహ్మణ వధూవరుల ద్వై మాసవపత్రిక*

*పత్రికలో రిజిస్ట్రేషన్*ఉచితం, పుస్తకం కావలసిన వారు ₹100/- చెల్లించిన చో పుస్తకం వారి చిరునామాకు పంపబడును* 

*రిజిస్ట్రేషన్ మరియు ఇతర వివరాలకై*

*సంప్రదించండి*

ఫోన్(చరవాణి) నెం లను 

*9030293127/9959599505

*.**************

ఈ రోజు పుట్టినరోజు మరియు పెళ్ళి రోజు జరుపు కుంటున్న   అందరికీ గాయిత్రి మాత ఆయురారోగ్యాలు సర్వదా ప్రసాదించాలని  కోరుకుంటూ మీ  శ్రేయోభిలాషి.

**************

మాస్క్ ధరిస్తూ సామాజిక దూరం పాటిస్తూ ఆరోగ్యం గాను క్షేమంగాను ఉండాలని ఆకాంక్షిస్తూ మీ శ్రేయోభిలాషి.

🙏🙏🙏

ధనుర్మాస ధ్యానం భజనం

 *ధనుర్మాస ధ్యానం భజనం 2023-24 ప్రత్యేక శీర్షిక .*


*అన్నమయ్య అజరామర సంకీర్తనలు -  03* 


🌺🍃 *----------------* 🍃🌺


*అన్నమయ్య అక్షరవేదం ..సంపుటి -- 361*


*( భావములోనా బాహ్యమునందును ... )*


🌺🍃 *----------------* 🍃🌺


ఓం నమో వేంకటేశాయ. 🙏

 అన్నమయ్య అక్షర వేదం ..సంపుటి -- 361 కి శుభ స్వాగతం ..🙏 


*ప్రార్థన ః--*🌹🙏


*తపముగ లోనన్ వెలుపల-*

*నపరము లెరుగక హరిహరియను నొక నామం-*

*బపురూపంబుగ దల్చుటె*

*తపములనన్నిటిని మించు తపమౌనయ్యా !!*


🌹🌹


*వెలుపల లోపల నొకటిగ* 

*నలరుచు సమబుద్ధితోడ నధికముగ హరిన్*

*బలువిధములుగాఁ  దలచుము !*

*సులభముగా ముక్తికదియె సోపానంబౌ !*


🌹🙏🌹


✍️ *స్వీయపద్యములు ( కందము )*


🌹🌹


తపస్సు వలే అంతరంగములోనూ , బాహ్యమున , ఇతరములనన్నీ విడచి *"హరీ హరీ "* అన్న ఒక్క నామమును తల్చుకొనుట తపస్సులనన్నీ మించిన తపస్సు కాదా !🙏


మనస్సులోనూ ,భౌతికముగానూ స్థితప్రజ్ఞత కలిగి ఆనందముగా ఆ హరినే అనేక విధములుగా కీర్తించుటయే ముక్తికి సులభతరమైన మార్గమౌను కదా ! 🙏


అట్టి *శ్రీహరి* తలపులలో సదా ఉందాము !!🙏


🌹🙏🌹


🌺🍃 *----------------* 🍃🌺


అన్నమాచార్యుల వారి సుప్రసిద్ధ సంకీర్తనలలో ఈ కీర్తనకు ప్రత్యేక స్థానము ఉన్నది . 🙏 


భజనవలె ఈ కీర్తన పాడుకుంటే మనసుకు ఎనలేని సాంత్వన సమకూరుననుటలో సందేహమే లేదు .🙏


అందరికీ తెలిసిన కీర్తనయే అయినా నా తృప్తికోసము భావార్థమును అందిస్తున్నాను అంతే ! 👇


🌺🍃 *----------------* 🍃🌺


🌹🌹


మన మనస్సుల లోని భావన గానూ , బౌతికముగా మనము చేయు సదాచార కర్మలలోనూ సదా ఆ గోవిందునినే తలచుకొనుట ఉత్తమమైన మార్గము .🙏


*" గోవిందా గీవిందా "* అని సదా అతనిని ప్రార్థించుకుందాము .🙏


🌹🌹


ఆ *శ్రీ హరి* స్వరూపములే వెలసి ఉన్న అన్ని దేవతా రూపములు .

అసలు ఆ *శ్రీహరి* లోనుంచీ ఉద్భవించినదే ఈ సకల బ్రహ్మాండ సృష్టి అంతయును.🙏


 ఆ *శ్రీహరి* పేరును , ఆతని  గుణములను కీర్తించుచున్నవే అన్ని మంత్రములూ సారముగా . 🙏


కావున ఓ మనసా హరినామము విడువకు . సదా *"హరీ హరీ "* అని అంటూనే ఉండుము .🙏


🌹🌹


ఆ *విష్ణుని* మహిమలుగా నిర్దేశింప బడినవే ఈ కర్మలన్నియూ .🙏

 వీటికి కారణము , ఫలమూ కూడా అతని మహిమయే అని మరువరాదు .🙏


ఆ *విష్ణువును* కీర్తించుచున్నవే సకల వేదములు .🙏


ఆ *విష్ణువు* ఒక్కడే శ్రీమన్నారయణ స్వరూపమై విశ్వమంతటికీ ఆత్మ గానూ , మన అందరి అంతరాత్మగాను వెలసి ఉన్నాడు .🙏


ఆ *విష్ణువు*  బయట అంతటా , లోలోన కూడా ఉన్నాడని నమ్మి వెతుకవే మనసా ! 🙏


🌹🌹


ఈ *అచ్యుతుడే* నాశనమన్నది ఎరుగని వాడు . ఆదికి ఆదియౌ ఆది పురుషుడు ,అటులనే అంతము కూడా లేని వాడు .🙏


ఈ *అచ్యుతుడే* చెడును నాశనము చేసెడి వాడు . రాక్షసులను అంతము చేసెడి వాడు .🙏


ఆ *అచ్యుతుడే* ఇదిగో చక్కగా వేంకటాద్రిమీద ఇదిగో ,

*శ్రీ వేంకటేశ్వరుడై* కొలువుతీరినాడు .🙏


చక్కగా *" అచ్యుతా అచ్యుతా "* అంటూ ఈ వేంకటాద్రి విభునకు శరణని ఉండవే ఓ మనసా !!🙏


🌹🙏🌹


*ఓమ్ శ్రీ అలమేలుమంగా సమేత శ్రీ వేంకటేశ్వర స్వామినే నమః !*🙏


🌹🙏🌹


తాత్పర్య సహిత దృశ్య మాలికగా మీకు అందించాలన్న నా చిన్న ప్రయత్నమును ఆశీర్వదిస్తారని ఆశిస్తూ..🙏

దోషములున్న...మన్నించమని విన్నపము... 🙏


*(  అన్నమయ్య అక్షర వేదం --- సంపుటి 361)*


✍️ *-- వేణుగోపాల్ యెల్లేపెద్ది* 🙏


   🌹🌹   *సంకీర్తన*    🌹🌹



*॥పల్లవి॥*


భావములోనా బాహ్యమునందును

గోవిందగోవింద యని కొలువవో మనసా


*॥చ1॥*


హరి యవతారములే యఖిలదేవతలు

హరిలోనివే బ్రహ్మాండములు

హరినామములే అన్నిమంత్రములు

హరిహరిహరి యనవో మనసా


*॥చ2॥*


విష్ణుని మహిమలే విహితకర్మములు

విష్ణునిఁ బొగడీ వేదములు

విష్ణుఁడొక్కఁడే విశ్వాంతరాత్ముఁడు

విష్ణు విష్ణువని వెదకవో మనసా


*॥చ3॥*


అచ్యుతుఁ డితఁడే ఆదియు నంత్యము

అచ్యుతుఁడే యసురాంతకుఁడు

అచ్యుతుఁడు శ్రీవేంకటాద్రిమీఁద నిదె

అచ్యుతయచ్యుత శరణనవో మనసా


           🌹🙏🌹🙏🌹

పంచాంగం

 ॐశుభోదయం, పంచాంగం ॐ 

*ఓం శ్రీ గురుభ్యోనమః* 

 *_డిసెంబరు 19, 2023_* 

*శ్రీ శోభకృత్ నామ సంవత్సరం*

*దక్షిణాయనం**హేమంత ఋతువు*

*మార్గశిర మాసం**శుక్ల పక్షం*

తిథి: *సప్తమి* సా4.00

వారం: *భౌమవాసరే*

(మంగళవారం)

నక్షత్రం: *పూర్వాభాద్ర* 

తెల్లవారితే బుధవారం 3.12

యోగం: *సిద్ధి* రా10.12

కరణం: *వణిజ* సా4.00

*విష్ఠి* రా2.58

వర్జ్యం: *ఉ10.46-12.16*

దుర్ముహూర్తము: *ఉ8.39-9.23*

*రా10.38-11.30*

అమృతకాలం: *రా7.44-9.14*

రాహుకాలం: *మ3.00-4.30*

యమగండం: *ఉ9.00-10.30*

సూర్యరాశి: *ధనుస్సు*

చంద్రరాశి: *కుంభం*

సూర్యోదయం: *6.28*

సూర్యాస్తమయం: *5.26*

 లోకాః సమస్తాః*

 *సుఖినోభవంతు*

శనివారము, డిసెంబర్, 16, 2023

 శనివారము, డిసెంబర్, 16, 2023

-----------------------------------------

మాసం: మార్గశిర మాసం

ఆయనం: దక్షిణాయణం

పక్షము: శుక్ల పక్షము

ఋతువు: హేమంతఋతువు

అమృతకాలము: 19:00 నుండి 20:28 వరకు

సూర్యోదయము: 06:39

సూర్యాస్తమయము: 17:45

రాహు కాలం: 09:25 నుండి 10:48 వరకు

యమగండము: 13:35 నుండి 14:58 వరకు

దుర్ముహుర్తములు: 06:39 నుండి 07:23 వరకు, 07:23 నుండి 08:07 వరకు

అభిజిత్: 11:49 నుండి 12:34 వరకు

కరణం: వణిజ 09:15 వరకు, విష్టి 20:00 వరకు

చంద్రోదయం: 09:49

చంద్రాస్తమయం: 21:16

చంద్ర రాశి: మకరము

తిథులు: చవితి 20:00 వరకు

నక్షత్రము: శ్రవణం 04:37, డిసెంబర్ 17 వరకు

గుళిక కాలం: 06:39 నుండి 08:02 వరకు

శక: 1945 శోభకృత్

వర్జ్యం: 10:07 నుండి 11:35 వరకు

యోగా: ధ్రువ 07:03 వరకు


 

Checkout Telugu Calendar Panchangam App: 

 IOS :  https://itunes.apple.com/app/telugu-calendar/id1448360812

శ్రీనాధుని కవిత

 శుభోదయం🙏

.

శ్రీనాధుని కవితలోని  రక్తి-భక్తుల మహోదయం!


-------------- శ్రీనాథుని కవితా వైభవం   - --------------


ఈ క్షోణి న్నిను బోలు సత్కవులు లేరీ?నేటి కాలంబునన్

దాక్షారామ చళుక్య భీమవర గంధర్వాప్సరో భామినీ

వక్షోజ ద్వయ గంధసార ఘుసృణ ద్వైరాజ్య భారంబు న

ధ్యక్షించున్ గవిసార్వబౌమ! భవదీయ ప్రౌఢ సాహిత్యముల్.


ఈ పద్యం లోశ్రీనాథ  కవిని స్తుతించింది అల్లాడ వేమారెడ్డి.అయినా పఠితలకు వినవచ్చేది శ్రీనాథుని ప్రౌఢ కవితా(రీతి)సరస్వతి.

అర్థము:--శ్రీనాథుడు కవిసార్వబౌముడు,ఆయన సృజించినది ప్రౌఢ సాహిత్యాలు. సాహిత్యాలంటే రసవత్కావ్యాలని తాత్పర్యం.సార్వబౌముని సాహిత్యాలు కూడా సామ్రాజ్యాలను పాలించాయి.

దాక్షారామ భీమేశ్వర క్షేత్రం లోని గంధర్వా ప్సరో భామినుల వక్షోజాల మీద పరిమళసుందరంగా పరివేష్టించి వున్న మంచిగంధం ,కుంకుమపువ్వు,పూతలు ఆ కవితాసామ్రాజ్యానికి ఎల్లలు.ఆ యెల్లలలొ

చల్లదనం వుంది,రాగ మాధుర్యమూ వుంది.శృంగార రసభాండాలు ఆ సీమలు, ఆ సీమల గౌరవాన్ని పాలించట మంటే రసజగత్తునే జయించట మన్నమాట.ఆ విజయ చిహ్న మే కవి సార్వభౌమ బిరుదమని

పద్యం లో ధ్వని.నాటి కాలానికే కాదు నేటి కాలానికి కూడా శ్రీనాథుని పోలిన కవి శ్రీనాథుడే.


మరి శ్రీనాధుని భక్తిభానమలో అపూర్వము!


కాదుకాదుదుదయాద్రి కనకకూటంబిది డంబైన పానవట్టంబు గాని

కాదుకాదిది సుధాకర పూర్ణబింబంబు కాశ్మీర శంభులింగంబు గాని

కాదుకాదుదయ రాగ ప్రకాశం బిది నవ కుంకుమా లేపనంబుగాని

కాదు కాదిది కళంక చ్చటారింఛోళి పూజచేసిన కల్వపువ్వుగాని

యనగా సప్తార్ణవములు మిన్నంది కొనగ

జంద్రకాంతోపలంబులు జాలువార

నశమశర సార్వభౌము ముత్యాల గొడుగు

విధుడు విశ్వంబు వెన్నెల వెల్లి దేల్చె.


ప్రకృతిని పరమేశ్వర స్వరూపంగా భావించే ప్రజ్ఞ శ్రీనాథుడీ సీసం లో ప్రదర్శించాడు.విశ్వం లో విశ్వాత్మకుడిని ద ర్శి0 చే విశాలమైన భక్తి భావం కనబడుతుంది

చంద్రోదయ వర్ణనం యిందులో వస్తువు.అవస్థాన్థరాలలొ చంద్రబింబ ఆవిర్భావం యిందులో దర్శననీయ

మవుతుంది.ఉపమేయం చంద్రబింబం,ఉపమానం శివలింగం.కవి ఉపమేయాన్ని చెబుతున్నా

ఉపమానాన్ని కన్నులకు కట్టించటం ధ్యేయం.తూర్పుకొండ కోన వెనక చంద్రుడు తలెత్తుతున్నాడు.కనపడుతున్నది కనకశిఖరం ,అది కనకశిఖరం కాదనీ శివలింగపు పానవట్టమనీ వర్ణిస్తాడు.ఆ తర్వాత పూర్ణ చంద్రబింబం పొడసూపింది,అది కాశ్మీర శంభులింగమంటాడు,ఉదయించిన చంద్రుడు రాగకాంతి తో రాణిస్తున్నాడు,ఆ అరుణకాంతి శివలింగాని

కలందిన కుంకుమ లేపనమని చూపిస్తాడు.శశాంక కళంకాన్నిశివలింగం పైని కలువపువ్వుగా(నల్లకలువ)కీర్తిస్తాడు.

ధవళ కాంతులతో వెన్నెల గుమ్మరిస్తున్న ఆ వెలుగు రేనిని శివ ప్రభువు దాల్చిన ముత్యాల గొడుగుగా

మూర్తి కట్టిస్తాడు.లోకాన్ని వెన్నెల వెల్లువలో ముంచుతున్న కలువరేనిని కన్ను కప్పటం అంత తేలిక పని కాదు.అందువలననే 'కాదు కాద'నే క్రియను సీస పద్యపాదారంభం లో కదను తొక్కించాడు. .అర్థాలంకారాన్ని సార్థకం చేశాడు.

చంద్రబింబం లో చంద్రమౌళిని దర్శించిన శ్రీనాథుని భక్తి చరితార్థం

శ్రీనాథు డంటే శృంగార 'సీస'పద్యాలే వ్రాస్తాడని,విమర్శల నే ఎక్కువ చేస్తాడని,అతనికి రక్తి తప్ప భక్తి లేదని చాలా మందికి వున్న అభిప్రాయం తప్పని రుజువు చేస్తుంది ఈ సీసం.


శ్రీ భీమనాయక శివనామధేయంబు చింతింప నేర్చిన జిహ్వ జిహ్వ

దక్షవాటీ పురాధ్యక్ష మోహనమూర్తి చూడంగ నేర్చిన చూపుచూపు

దక్షిణాంబుధి తటస్థాయి పావనకీర్తి చే నింప నేర్చిన చెవులు చెవులు

తారకబ్రహ్మ విద్యాదాత యౌదలవిరులు పూన్పగ నేర్చు కరము కరము

ధవళకర శేఖరునకు బ్రదక్షిణంబు

నర్థి దిరుగంగ నేర్చిన యడుగు లడుగు

లంబికా నాయక ధ్యానహర్ష జలధి

మధ్యమున దేలియాడెడి మనసు మనసు.


ఈ పద్యం చదవగానే తెలుగువారికి "కమలాక్షు నర్చించు కరములు కరములు"అనే పోతన గారి పద్యం గుర్తుకువస్తుంది.పై పద్యం శ్రీనాథుడు వ్రాసింది.


రెండు పద్యాలూ భక్తిభావ వ్యంజకాలే.కానీ శ్రీనాథుడు చెప్పే పద్ధతిలో రాజసం రాణిస్తున్నది.పోతన కవిత్వం లోపారవశ్యం లాస్యం చేస్తున్నది.వస్తుతత్వం ఒకటే అయినా కవి వ్యక్తిత్వాన్ని బట్టి కవితలలో భేదం కనిపిస్తుంది.సీసపద్య పాదాలను సమవిభక్తం చేసి పూర్వార్థం లో భీమేశ్వరాకృతిని సమాన ఘటనం

తో సాక్షాత్కరింప చేసి ఆ మూర్తిని అర్చించాలని ఆదేశిస్తున్నట్లు వున్నది శ్రీనాథుని సీసం.


                     స్వస్తి!

మొగలిచెర్ల అవధూత

 మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామి వారి చరిత్ర..


*ఏప్రిల్ 30వ తేదీ 1976..*


*(అరవై రెండవ రోజు)*


శ్రీ స్వామివారు ఏప్రిల్ 30 వతేదీ నాడు తనను కలువమని శ్రీధరరావు దంపతులకు చెప్పి పంపారు..ఆరోజు ఉదయం శ్రీధరరావు ప్రభావతి గార్ల తో పాటు వారి రెండవ కుమారుడు ప్రసాద్ కూడా ఆశ్రమానికి వెళ్ళాడు..కొద్దిసేపు బైట వేచి వుండగానే..శ్రీ స్వామివారు తలుపు తీసుకొని బైటకు వచ్చారు..


వీళ్ళను చూడగానే నవ్వి.."వచ్చారా?.." అన్నారు..

కొద్దీ దూరంలో నిల్చుని ఉన్న ప్రసాద్ దగ్గరకు వెళ్లి..ముఖంలో ముఖం పెట్టి.."ఎవరూ ప్రసాదా?.."అన్నారు..


"అవును స్వామీ!.." అన్నాడతను..


"చూసావా..నిన్ను దగ్గరగా చూస్తే గానీ పోల్చుకోలేకుండా వున్నాను..చూపు కూడా మందగించింది..మీ అమ్మా నాయన్లకు చెప్పరాదూ..స్వామివారికి చూపు కూడా కనబడటం లేదు..ఇంక ఆయన్ను సజీవ సమాధి చేయమని.." అన్నారు పెద్దగా నవ్వుతూ..


"మీరు మాట్లాడుకోండి స్వామీ ఆ విషయాలు.." అన్నాడు ప్రసాద్..


శ్రీ స్వామివారు వెనక్కు వచ్చి..శ్రీధరరావు ప్రభావతి గార్లను కూర్చోమని చెప్పి..తాను వారికెదురుగ్గా పద్మాసనం వేసుక్కూర్చున్నారు..అప్పుడు ఆ దంపతులు గమనించారు ..శ్రీ స్వామివారి రెండు తొడలమీదా అరచెయ్యంత మేర చర్మం కమిలి..లేచి పోయి..పుండు లాగా ఎఱ్ఱగా కనబడుతోంది..


"ఏంది స్వామీ ఆ పుండు?.." అని అడిగారు శ్రీధరరావు గారు..


"ఇదా..ఇది..సిద్దాసనం వేసీ.. వేసీ..ఇలా పుండులాగా మారిపోయింది..అదేం చేస్తుంది.." అన్నారు అరచేతితో అక్కడ తడుతూ..


భరించటానికి కొద్దిగా ఇబ్బందిగా వున్నా..సరే స్వామివారు పట్టించుకొనే స్థితిలో లేరు..ఆయన దృష్టిలో అది సమస్యే కాదన్నట్లు వున్నారు..


"ఈరోజు వైశాఖ మాసం పాడ్యమి..శుక్రవారం..ఇక నేరుగా విషయం లోకి వస్తాను..త్వరలో నేనీ దేహాన్ని వదలి వేస్తాను..మీతో చాలాసార్లు ముచ్చటించి వున్నాను..ఇక నా సజీవ సమాధి కూడా జరుగదు..ప్రత్యామ్నాయ పద్దతి నేనే చూసుకోవాలి..ఇంతకాలం చేసిన తపోసాధన ఒక కొలిక్కి వచ్చింది..మళ్లీ మళ్లీ చెపుతున్నాను..ఇది క్షేత్రం గా మారుతుంది.."


"మీరు మాత్రం ఓ వారం పాటు ఇటు రాకండి..నేనూ ఎవ్వరికీ అందుబాటులో ఉండను..ఇప్పటిదాకా నేను చేసిన సాధన అంతా ముగింపుకు వచ్చే సమయంలో అవరోధం ఉండకూడదు.." అన్నారు..


దంపతులిద్దరూ సరే నన్నట్లు గా తలూపారు..శ్రీ స్వామివారు నిశ్చలంగా కొద్దిసేపు అక్కడే కూర్చుని.."ఇక మీరు బైలుదేరండి..మళ్లీ వారం తరువాత కలుద్దాము.." అన్నారు..


ఇంతకుముందు చెప్పిన దానికన్నా భిన్నంగా చెప్పినదేమీ లేకపోయినా..ఎందుకనో శ్రీ స్వామివారు చెప్పిన వారం గడువులో ఏదన్నా మర్మం వున్నదా అని ఆ దంపతులు ఆలోచించుకున్నారు..శ్రీ స్వామివారి మాటకు ఎదురు చెప్పడం ఎందుకు?..ఈ వారం వేచి చూసి మళ్లీ ఇక్కడకు వస్తే..ఏదైనా వుంటే..ఆయనే చెపుతారు కదా అని సమాధాన పడి.. ఇంటికి చేరారు..


ఫకీరుమాన్యం లోని శ్రీ స్వామివారి ఆశ్రమానికి ఉన్న ప్రహరీగోడ పెద్ద ఎత్తు కలది కాదు..అక్కడికి పశువులు గొర్రెలు మేకలు మేపుకోవడానికి వచ్చే పశువుల కాపరులు..కుతూహలం కొద్దీ..ఆ గోడమీదుగా లోపలికి తొంగి చూడటం ఒక అలవాటు..ఒక్కొక్కసారి శ్రీ స్వామివారు స్నానం చేస్తూనో..లేదా పచార్లు చేస్తూనో కనబడుతూ వుండేవారు..ఎప్పుడన్నా శ్రీ స్వామివారు వీళ్ళను చూడటం జరిగితే..పలకరింపుగా నవ్వేవారు..మరీ ఉల్లాసంగా వుంటే..పల్లెటూరి యాస లోనే.."ఏం బాగుండారా?..ఏ ఊరు మనది?.." అని అడిగేవారు..కొన్ని నిమిషాల పాటు వాళ్ళతో ముచ్చటించి..లోపలికి వెళ్లేవారు..వాళ్లకూ పట్టరాని ఆనందంగా ఉండేది..


1976 మే నెల ఒకటవ తేదీ నుంచి..పశువుల కాపర్లకు కూడా శ్రీ స్వామివారి దర్శనం కలుగలేదు..ఒక్కసారి మాత్రం శ్రీ స్వామివారు బావి వద్దకు వచ్చి స్నానం చేసి వెళ్లారు..అంతే.. ఎవ్వరికీ ఆ తరువాత కనబడలేదు..ఆశ్రమం ప్రధాన గదిలోని నేలమాళిగ లోనే తీవ్ర సాధన లో మునిగిపోయారు..


శ్రీధరరావు ప్రభావతి గార్లకు ఆ వారం రోజుల పాటు ఇంటి పనులతో సరిపోయింది..నిరంతరం శ్రీ స్వామివారి ఆలోచన లో వుండే ఆ దంపతులు..చిత్రంగా లౌకిక వ్యవహారాలకు పరిమితం అయ్యారు..వాళ్లకు మళ్లీ శ్రీ స్వామివారి గురించి వచ్చిన వార్త..మే నెల 6వతేదీ నాడే..


ఆత్మత్యాగం...కపాలమోక్షం..రేపటి నుండి..


*మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామివారి చరిత్రను ఆడియో రూపంలో ఈ క్రింద ఇచ్చిన లింక్ ద్వారా యూట్యూబ్ లో వినవచ్చు..*


https://youtube.com/playlist?list=PLZ3oJviTRayHLeRpuozyT55d-H-4xmTHs&si=xqCIrCAE0k1Rmrnx



సర్వం..

శ్రీ దత్తకృప!


(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం, మొగలిచెర్ల గ్రామం, లింగసముద్రం మండలం.. SPSR నెల్లూరు జిల్లా..పిన్: 523114..సెల్..94402 66380 & 99089 73699).