9, నవంబర్ 2020, సోమవారం

మహాభారతంలో ధర్మరాజుపాత్ర

 మహాభారతంలో ధర్మరాజుపాత్ర       నన్నయ భట్టారకుడు భారతం లో ఉన్న వీరుల గురించి వినుత పరాక్రమముల్ ధృతి వివేకుల్ నిత్య సమన్వితుల్ యశోధ నుల్ కృతజ్ఞులు త్తములుధర్మపరుల్ శరణాగతా ను కం పనుల నగా ప్రసిద్ధులగు భారత వీరులు అని ప్రశంసించి నాడు అట్టిపాత్రలలో ధర్మజుడు ఉత్తముడు ఆ పాత్ర చిత్రణ తిక్కన తన అమర లేఖిని నుండి మనోహర రూపకల్పన గావించినాడు విరాటపర్వం తిక్కన చిత్రించినపాత్రలన్నియుఏ బిగి బిగిసెడక జవసత్వములు వీడక పయనించిన వి ధర్మరాజు విరాట నగరముచేరినది మొదలుయుద్ద యజ్ఞం పూర్తి వరకు ధీరోదాత్త నాయకుడై మెత్తని పులియైమెలంగి నాడు సత్య ధర్మ మునకైజీవితాంతము వరకు పరిశ్రమించి నాడుస్వధర్మ నిర్వహణకై ధర్మరాజు ఉదయించిన కారణజన్ముడు స్వధర్మ విదుడు సంత త శాంతశీలుడు సమంచిత సత్య సంపన్నుడు సంగర విద్య కోవిదుడు కరుణ కలిత హృదయుడు సోదర గౌరవాను రాగములు ప్రజాభిమానం చూరగొన్న పురుషుడు శ్రీ కృష్ణ భక్తి తత్పరుడుభీష్మోపదేశమున నిరుపమాన ధర్మాత్ముడైన మహనీయుడు నిరుపమాన ప్రజాశాంతి సామ్రాజ్య స్థాపనకు అశ్వమేధ మొనరించిన గౌరవ రాజ్యలక్ష్మి వల్ల భుడైన పుణ్యాత్ముడు సేవా తత్పరత ప్రజా పరిపాలన శీలుడు నీతి నియతి అసాధారణ త్యాగం శౌర్య ధైర్య వెలుగొందిన ఉత్తమ నాయకుడు  

ఆంధ్రసాహిత్య సంగ్రహ చరిత్ర నుండి సేకరణ

జయలక్ష్మి పిరాట్ల

శివ_ఆరాధనకు_శ్రేష్ఠమైన_ప్రదోష_సమయము

 #శివ_ఆరాధనకు_శ్రేష్ఠమైన_ప్రదోష_సమయము అంటే ఏమిటి? అసలు #ప్రదోషము ను ఎలా పరిగణిస్తారు?


▪️త్రయోదశి ఆదివారం వస్తే రవి ప్రదోషం..


▪️త్రయోదశి సోమవారం వస్తే సోమ ప్రదోషం.


▪️త్రయోదశి మంగళవారం వస్తే భూమ ప్రదోషం..


▪️త్రయోదశి బుధవారం వస్తే బుధ ప్రదోషం..


▪️త్రయోదశి గురువారం వస్తే గురు ప్రదోషం..


▪️త్రయోదశి శుక్రవారం వస్తే శుక్ర ప్రదోషం..


▪️త్రయోదశి శనివారం వస్తే దాన్ని శని త్రయోదశి అనీ, శని ప్రదోషమని పిలుస్తారు...


అన్ని త్రయోదశుల లోనూ శివపూజ తప్పనిసరి..


#ప్రదోషము అంటే పాప నిర్మూలన అని అర్థము.. ప్రతిరోజూ సూర్యాస్తమయ సమయము లో చంద్రుడి కదలికల వలన ఏర్పడునది ప్రదోషము... అనగా.., 


చంద్రుడి గతి వలన, ఏర్పడే తిథుల సంధులలో సూర్యాస్తమయము అయితే, అప్పుడు #ప్రదోషము అంటారు.. కాబట్టి ప్రతిరోజూ సూర్యాస్తమయ సమయమునకు తిథి మారితే, అప్పుడు #ప్రదోషము కలిగే అవకాశము ఉంది...


ఓం నమఃశివాయ... 🙏🙏🙏

కంచి కామకోఠి పీఠాధిపతులు,* *ప్రాతఃస్మరణీయులు*

 *కంచి కామకోఠి పీఠాధిపతులు,* *ప్రాతఃస్మరణీయులు*


 *శ్రీచంద్రశేఖరేంద్ర సరస్వతీ మహాస్వామి వారు* పశ్చిమ గోదావరి జిల్లా "తణుకు" వచ్చారు. అక్కడ ఒక బ్రాహ్మణుడు ధర్మానుష్ఠానమంటే ధర్మానుష్ఠానమే అలా చేసేవాడు. ఆ బ్రాహ్మణుడికి పరమాచార్య స్వామిని దగ్గరగా చూడాలని కోరిక. రెండు రోజులు ఆయన విడిది వద్దకు వెళ్ళాడు. ఆ రెండు రోజులూ విపరీతమైన జనం. స్వామివారిని దూరం నుండే చూసి, ఆయన దగ్గరకు ఎలా వెళతాను, ఆయన నాతో ఎందుకు మాట్లాడతారు, వెళ్ళడం అనవసరం అని, అక్కడి నుండే నమస్కరించి, ఇంటికి వెళ్ళి పడుకున్నాడు.


శ్రీమహాస్వామి వారు తెల్లవారుఝామున రెండు గంటలకు ఎవరికీ చెప్పకుండా బయలుదేరి, కాలినడకన ఆ బ్రాహ్మణుడి ఇంటికి వెళ్ళారు. *ఆయనకి ఇల్లు ఎలా తెలుసు* *అనకూడదు.* *ఆయన పరబ్రహ్మస్వరూపులు, త్రికాలవేది.* *"ఆయనకు తెలియనిది ఉండదు.* స్వామివారు ఆ బ్రాహ్మణుడి ఇంటి వద్ద కూర్చుని జపం చేసుకుంటున్నారు.


ఆ బ్రాహ్మణుడి ఇల్లాలు కళ్ళాపి చల్లటానికి బయటకు వచ్చింది. కళ్ళాపి చల్లి పక్కకు చూస్తే మహాస్వామి వారు ఉన్నారు. ఆమె హడలిపోయింది. "నడిచే దేవుడు" అని పేరుగాంచిన వ్యక్తి, ప్రపంచంలో కోన్ని కోట్లమంది ఆయన పాదాలనుకూర్చొని తలచుకొని నమస్కరిస్తారు. అటువంటి ఆయన తన ఇంటి అరుగుమీద కూర్చుని ఉన్నారు. పరుగున ఇంట్లోకి వెళ్ళి భర్తని పిలిచింది. ఆ బ్రాహ్మణుడు నిద్రమంచం మీద నుండి దూకి బయటకు వచ్చి నేలమీద పడి నమస్కరించి ఏడుస్తూ, "మహానుభావా! మాదగ్గర కు ఇంటికి వచ్చారా?" అన్నాడు.

అప్పుడు మహాస్వామివారు "రెండు రోజులుగా నా దగ్గరకు వస్తున్నావుగా! ఈయన దగ్గరకు వెళ్ళగలనా, నన్ను పలకరిస్తారా అనుకున్నావు.


 *ధర్మానుష్ఠానం చేసేవారి* *దగ్గరకు నేను రాను* *అనుకున్నావు! అందుకే, నేనే* *వచ్చాను" అన్నారు.*


*"మహాత్ముల దృష్ఠిలోకి ఏదో చేస్తే వెళ్ళగలము"* *అనుకోకూడదు! ఏ మూల* *కూర్చుని ధర్మానుష్ఠానం* *చేస్తున్నా మహాత్ముల* *దృష్టిలోనికి వెళ్ళి తీరుతారు.* *సత్పురుషుల దృష్టిలో పడటం జీవితంలో* *గొప్ప అదృష్ణం"*

ధార్మికగీత - 75*

 🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲

                           *ధార్మికగీత - 75*

                                     *****

      *శ్లో:- కార్యేషు  దాసీ౹ కరణేషు మంత్రీ ౹*

             *రూపే  చ  లక్ష్మీ:౹ క్షమయా  ధరిత్రీ ౹*

             *భోజ్యేషు  మాతా౹ శయనే  తు  రంభా ౹*

             *షట్కర్మయుక్తా కులధర్మపత్నీ ౹౹*

                                     *****

*భా:-1.గృహము, భర్త, బిడ్డలు, అతిథులు,బంధుమిత్రుల విషయమై దాసీ కంటే మిన్నగా అనన్యమైన సేవలు అందించినా, సతీత్వధర్మంగా అన్వయించుకొనేది ; 2. పెళ్లి,కట్నాలు,కానుకలు, పిల్లల  ఫీజులు, మర్యాదలు,వేడుకల వంటి  జటిలమైన ఆర్ధిక సమస్యలలో, తమ అంగ, ఆర్ధిక బలాల ప్రతిపత్తితో భర్తకు ఆలోచనా పరంగా "మంత్రి"గా వ్యవహరించేది ;    3. సాంప్రదాయ రూపురేఖలతో, సదాచారాలతో అందరి చేత "శ్రీ మహాలక్ష్మి"గా పూజ్యభావనతో మన్ననలందుకొనేది ; 4. కష్ట సుఖాల్లోను, లాభనష్టాల్లోను, గెలుపోటములందును, సిరిసంపదలలోను పొంగక, క్రుంగక సహనగుణంలో  గంభీరమైన "సముద్రము"తో పోల్చగలిగినది ; 5. మృష్టాన్న పానీయాలు తన, పర భేదం లేకుండా రుచిగా, శుచిగా కొసరి,కొసరి  వడ్డించడంలో  "మాతృమూర్తి"ని తలపించేది ; 6. ఉద్యోగ, వ్యాపారాది రంగాలలో,  ధనసముపార్జనలో  అలసి, సొలసి వచ్చిన మనోనాథుని "అప్సరస"లా     తన అందచందాలతో మురిపించి,  మరపించేది--- అనే  ఆరు కర్మలతో సలక్షణమైన ఇల్లాలిని "కులధర్మపత్ని"గా  శాస్త్రాలు కొనియాడుతున్నాయి. అటువంటి గృహిణులందరు "శ్రీ వరలక్మి"  కృపాకటాక్షవీక్షణాలకు పాత్రులై , సమస్త సన్మంగళములు పొందుదురు గాక ! మంగళం మహత్!*

                                    *****

                      *సమర్పణ  :  పీసపాటి*

🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲

🙏శ్రీకృష్ణుడు వెన్న దొంగలించడం

 🌹🌹🌹🌷🌷🌹🌹🌹

🙏శ్రీకృష్ణుడు వెన్న దొంగలించడం లోనే ఆంతర్యం :

మనము పుట్టినప్పుడు పాల వలె శుద్ధ సత్వ స్వరూపముగా ఉంటాము. ఆ పాలు కుండలో పోయటం అనగా దేహము ధరించటమని అర్థము. పిడకల దావిలో పాలకుండను పెడితే ఎంతో నెమ్మదిగా సన్నటి సెగ మీద పెట్టి బాగా కాగుతాయి. ఎర్రటి రంగును సంతరించుకుని దట్టంగా మీగడ కట్టి కాగుతాయి. అనగా నిరంతరమూ సత్సంగంలో పాల్గొని గురుబోధను ఆచరణలో అనుభవిస్తుంటే దేహ సంబంధిత రుగ్మతలు పిడకలు కాలి బూడిద అయినట్లు అయిపోతాయి. సత్సంగ ప్రభావము వలన చిక్కగా, కమ్మగా పాలు తయారయినట్లు మనలో భావం తయారు అవుతుంది. ఇక పాలలో తోడు పెట్టినట్లు గురువు అనుగ్రహమును కలుపుకుంటే జ్ఞానము పెరుగు లాగా గట్టిపడుతుంది. ఆ పెరుగు అనే జ్ఞానంలో భక్తి అనే కవ్వం పెట్టి చిలుకుతుంటే దానిలోనుండి వెన్న వంటి మృదువైన పదార్థం తయారు అవుతుంది. దానిని తీసుకోవటానికి పరమాత్మ స్వయంగా వస్తాడు. అదే వెన్న దొంగలించడంలోని ఆంతర్యం. శ్రీ కృష్ణలీలలో ఎన్నో అన్వయాలు తెలుసుకుని వాటిని మన మాటలలో చెబుతూ మనను ఆనాటి కృష్ణ తత్వము అనుభవింప చేస్తున్న ప్రవచనకర్తలు ఎందరో ఉన్నారు. ఎన్ని వింటున్నా తాత్కాలికానందమే కానీ మహి మాన్విత్వమును అనుభవించటం అనేది ఎవరి పరిధిలో వారు అనుభవించవలసిందే. ఈనాటికీ స్మరించినంత మాత్రాన ఆనాటి వైభవము దృశ్యరూపంగా గోచరిస్తుంది.🙏

సేకరణ.

దుర్గా సప్తశతి

 *🌹. శ్రీ దేవీ మహత్యము - దుర్గా సప్తశతి - 9  / Sri Devi Mahatyam - Durga Saptasati - 9 🌹*

✍️. మల్లికార్జున శర్మ 

📚. ప్రసాద్ భరద్వాజ 


*అధ్యాయము 2*

*🌻. మహిషాసుర సైన్యవధ - 3 🌻*


దేవతలు, ఋషులు తనను కొనియాడుచుండగా, ఆయాస లక్షణాలు ఏమీ లేని ముఖంతో, ఈశ్వరి అసుర దేహాలపై తన శస్త్రాస్త్రాలను ప్రయోగించింది. 


దేవి వాహనమైన సింహం కూడా కోపంతో జూలు విదుర్చుచు అరణ్యంలో కార్చిచ్చువలె అసురసైన్యంలో సంచరించింది. యుద్ధం చేస్తూ దేవి విడిచే నిట్టూర్పులు వెంటనే నూర్లకొలది, వేలకొలది ఆమె సైన్యగణంగా రూపొందుచున్నాయి. 


దేవి శక్తిచే అభివృద్ధి నొందుతున్న ఉత్సాహంతో ఈ సైన్యం గండ్రగొడ్డళ్ళతో, గుదియులతో,

అడ్డకత్తులతో తాకి అసురగణాలను నాశమొనర్చెను. ఈ సైన్యంలో కొందఱు ఆ యుద్ధమహోత్సవంలో తప్పెటలు కొట్టారు; కొందరు శంఖాలు ఊదారు. (50-54)


మణికొందఱు మృదంగం వాయించారు. అంతట దేవి తన త్రిశూలంతో, గదతో, బల్లెంలు కురిపించడంతో, ఖడ్గాదులతో నలకడంచేత,  నూర్లకొలది మహాసురులను వధించింది. కొందఱిని తన ఘంటానినాదంతో అవశులైన వారిని పడద్రోసింది. ఇతరులను తన పాశంతో బంధించి నేలపై ఈడ్చింది. కొందఱు తీక్ష్మమైన ఆమె ఖడ్గపు వ్రేటులచే రెండుగా నఱకబడ్డారు. 


ఇతరులు తీవ్రమైన ఆమె గదదెబ్బలు తిని భూమిపై పడిపోయారు. మరికొందరు ఆమె రొకటిపోటులతో

తీవ్రంగా గాయపడి నెత్తురు కక్కుకున్నారు. కొందరి వక్షం ఆమె త్రిశూల పోటుచే భిన్నమవడంతో భూమిపై పడిపోయారు.  (55-59)


కొందరు సురవైరులు ఎడతెగక గ్రుచ్చుకొంటున్న బాణసమూహంచే ముళ్ళపందులను పోలి రణాంగణంలో ప్రాణాలు వదిలారు. కొందరి బాహువులు, కొందరి కంఠాలు తెగిపోయాయి. కొందరి శిరస్సులు నేలపై దొర్లాడాయి. కొందరి నడుములు ఖండింపబడ్డాయి. కొందరు మహాసురులు పిక్కలు తెగిపోవడంతో భూమిపై కూలారు. (60-61)


ఒకే చేయి, ఒకే కన్ను, ఒకే కాలు నిలిచి ఉన్న కొందరిని దేవి మరల రెండు ముక్కలుగా ఖండించింది. మరికొందరు శిరస్సులు ఛేదింపబడి పడిపోయి మళ్ళీ లేచారు. (62)


కొన్ని మొండాలు ఉత్తమాయుధాలు తీసుకుని దేవితో పోరాడాయి. మరికొన్ని మొండాలు ఆ యుద్ధంలో వాద్యాల లయను అనుసరించి నృత్యం చేసాయి. (63)


ఇతర మహాసురుల మొండాలు ఖడ్గాలు, బల్లాలు, కుంతములు ఇంకా చేతబట్టుకుని అప్పుడే తెగిన తలలతో “ఆగు, ఆగు” అని దేవిని ఉద్దేశించి కేకలు వేసాయి. 


ఆ యుద్ధం జరిగిన రంగం అసురులు, ఏనుగులు, గుఱ్ఱములు, రథములు కూలి ఉండడం చేత నడువ శక్యంకాకుండా ఉంది. అసురుల, వారి ఏనుగుల, గుజ్రాల రక్తసమూహం వెంటనే మహానదీరూపమై ఆ సైన్యం మధ్యలో ప్రవహించింది. 


గడ్డి, కట్టెల పెద్దరాశిని అగ్ని ఎలా క్షయమొనరుస్తుందో అలా ఆ అసుర మహాసైన్యాన్ని అంబిక క్షణమాత్రాన నాశనం చేసింది.

(64–67)


దేవి వాహనమైన సింహం జూలు విదుర్చుచు, మహానాదం చేస్తూ, సురవైరుల దేహాలలో ప్రాణాలకై వెదకుతున్నట్లు ఆ రణరంగంలో సంచరించింది. (68)


అక్కడ దేవీగణాలు అసురులతో చేసిన యుద్ధవైఖరిని చూసి సంతుష్టులై దేవతలు పుష్పవర్షాన్ని కురిపించారు. (69)


శ్రీమార్కండేయ పురాణమునందలి సావర్ణి మన్వంతరమున “దేవీ మాహాత్మ్యము” లో “మహిషాసుర సైన్యవధ” యను పేరిటి ద్వితీయాధ్యాయము.


సశేషం....

🌹 🌹 🌹

ఆధ్యాత్మిక జీవనము

 *ఆధ్యాత్మిక జీవనము*


జ్ఞానాతీత స్థితిని లేదా అధిదైవాన్ని సాక్షాత్కరించుకున్న మహనీయుల్ని ఋషులు లేదా ద్రష్టలు అంటారు. నిజానికి అందరూ ఏదో ఒక విధంగా ద్రష్టలే. ఇంద్రియార్థాల ఆకర్షణలను గ్రహించినవాడు, రూపంలో ఉన్న నక్షత్రాలను, గ్రహాలను గమనించే వాడు, ఇతరుల ఆలోచనలను కనిపెట్టగలిగినవాడు, యోచనలకు సంబంధించిన సిద్ధాంతాలను కనుగొన్నవాడు, మానవ హృదయ పోకడలను తెలుసుకున్నవాడు వీరందరూ ద్రష్టలే. కానీ పరమసత్యాన్ని అంతర్భుద్దితో సాక్షాత్కరించుకున్న వారినే ఋషులంటారు. 


అయితే ఇటువంటి అంతర్భుద్ధిని ఉపయోగించే శక్తి ప్రతీ మనిషిలోనూ దాగి ఉంది. దీనినే *దివ్యచక్షువు* అంటారు. భగవద్గీతలో ఈ దివ్య చక్షువుల ప్రస్తావన ఉంది. శ్రీకృష్ణుడు తన విశ్వరూపాన్ని చూపి అర్జునునితో ఇలా పలికాడు.


*న తు మాం శక్యసే ద్రష్టుం అనేనైవ స్వచక్షుషా*

*దివ్యం దదామి తే చక్షుః పశ్యమే యోగమైశ్వరమ్*


"నీ చర్మ చక్షువులతో నా విశ్వరూపాన్ని చూడలేవు. నా విశ్వరూపాన్ని చూడడానికి కావలసిన దివ్య చక్షువులను నీకు ప్రసాదిస్తున్నాను."


అయితే మనకున్న ఈ దివ్యచక్షువులను ఇప్పుడే ఉపయోగించలేక పోవడానికి ఉన్న అడ్డంకి మనకున్న *అజ్ఞానం* మాత్రమే. ఈ అజ్ఞానపు మైకం వలన సత్యమే అసత్యం కంటే అధ్వాన్నమైనదిగా కనిపిస్తుంది.


*శుభంభూయాత్*

బాహ్య విషయాలపై

 🙏🙏🙏🙏🙏

🌹🌹🌹🌹🌹

మనం బాహ్య విషయాలపై కోరికలను త్యజించనంత వరకు భగవంతుడు చిక్కడు...


ఆత్మజ్ఞానం కావలెనంటే త్యాగం చాలా అవసరము. 

త్యాగమంటే ఇల్లు, వాకిలి, భార్యాబిడ్డలను వదిలేయడం కాదు! 

ప్రపంచపు విషయాల పట్ల ఆకర్షణ వదిలేయాలి. 

మనసులో కోరికలను అదుపులో ఉంచుకోవాలి. 

ఇహలోక బందాల పట్ల వ్యామోహం, మమతానురాగాలు క్రమక్రమంగా వదులుకోవాలి. 

భగవంతుడు ఒక్కడే నిత్యుడు అన్న సత్యాన్ని గుర్తించి, ఆయనను పొందడానికి సాధన చేస్తుండాలి. 

కానీ నేడు మన పరిస్థితి ఎలా ఉందంటే, ' ఆత్మజ్ఞానం కావాలంటే ప్రతీరోజూ పలానా మంత్రం జపించు, దానితో పాటు రెండు అరటిపండ్లు తిను! ' అని చెపితే ' ఏ మంత్రం జపించాలి?' అని అడగడం మానేసి ' ఏ రకమైన అరటిపండు తినాలి?' అని అడిగే మేదావులుండే కాలం మనది...


మనం ఇలా ఉంటుంటే ఇంకా అత్మజ్ఞానం ఎలా కలుగుతుంది! 

కోరికలను త్యాగం చేయకుండా ఏ సాధన చేసినా ఈ జన్మకే కాదు వేయి జన్మలెత్తినా భగవంతుని తెలుసుకోలేం! ఆత్మజ్ఞానం కలుగనే కలుగదు.

🌹🌹🌹🌹🌹

🙏🙏🙏🙏🙏

లడ్డూలు__చీమలు

 *లడ్డూలు__చీమలు*


శ్రీ రామకృష్ణ పరమహంస గారు చెప్పిన ఒక చిన్న సంఘటన...

      

కాళీమాత ఆలయంలో ఓరోజు ప్రసాదంగా ఇవ్వడానికి లడ్డూలు తయారు చేస్తున్నారు. అయితే ఎక్కడి నుంచి వచ్చాయో తెలీదు..

లడ్డూలకి చీమలు పట్టడం మొదలైంది. 

      

లడ్డూ తయారు చేస్తున్న వారికి ఏం చేయాలో తెలీలేదు. చీమలను చంపకుండా ఎలా?" అని ఆలోచనలో పడ్డారు... వాటిని చంపకుండా ఉండడానికి ఏం చేయాలో చెప్పమని రామకృష్ణ పరమహంస ను సలహా అడిగారు..


అప్పుడాయన చీమలు వస్తున్న దారిలో చక్కెర పొడి చల్లండి.. వాటిని తీసుకుని చీమలు వెళ్ళిపోతాయి.., ఇక ఇటు రావు అని సూచించారు.. పరమహంస చెప్పినట్లే చీమలొచ్చే దారిలో చక్కెర పొడి చల్లారు.. 

ఆ పొడిని చూడటంతోనే వాటిని నోట కరుచుకుని చీమలు కాసేపటి కల్లా అక్కడి నుంచి వెళ్ళిపోవడం మొదలుపెట్టాయి..

సమస్య కొలిక్కి వచ్చింది....    

                     

ఈ దృశ్యాన్ని చూసిన పరమహంస గారు ఇలా అన్నారు...."మనుషులూ ఈ చీమల్లాంటి వారే.. తాము కోరుకున్న వాటిని పొందాలను కుంటూనే తమకు తెలియకుండానే దానిని మధ్యలోనే విడిచిపెట్టి మరొకటేదైనా దారిలో కనిపిస్తే దానితో సరిపెట్టుకుంటారు తప్ప.., ముందనుకున్న లక్ష్యాన్ని విడిచిపెడతారు అని చెప్పారు. 

   

తమకు కావలసింది చక్కెర కాదు, లడ్డూ పొడేనని ఒక్క చీమా ముందుకు రాలేదు.

మనం కూడా అలానే ‘భగవంతుడు సర్వస్వము’ అనుకొనే ధ్యాన సాధన మొదలు పెడతాము.., మధ్యలో ఎవరో ఎదో చెపితే దాని వద్దకు వెళ్లి మన సాధన అంతా వృధా చేసుకొంటాము..

            

తీయగా ఉందన్న చక్కెరతో సరిపెట్టుకుని వెళ్ళిపోయాయి చీమలు. రవ్వంత చక్కెర సంతోషం చాలనుకున్నాయవి. లడ్డూ అంత పరిపూర్ణమైన సంతోషం పొందాలనుకునే వారు చాలా తక్కువ మందే అని పరమహంస చెప్పారు.

Hindu dharmic



 

ఇహపర సౌఖ్యం

 మానవుల ఇహపర సౌఖ్యం కోసం సూక్ష్మ విషయ దర్శనం చేసిన శాస్త్రాలు అవతరించాయి. అవి వేదాలను ఆధారం చేసుకుని ఉన్నాయి. వేదాలు అపౌరుషేయాలు. దోష శంకా కళంకాలు లేనివి. అవి మానవ సుఖ జీవనం కోసం కొన్ని ఆచారాలనీ, నియమాలనీ ఉపదేశించాయి. వాటిని పాటించడం ప్రతి వైదికుని కర్తవ్యం. మడి, మైల అనే పదాలను మనం వింటుంటాం. అవి శుభ్రతను మటుకే తెలుపుతాయని అనుకోవడం పొరపాటు. వాటి వెనుక మనకు గోచరించని, కానీ మన జీవనంపై ప్రభావం చూపించే సూక్ష్మశక్తుల గురించిన పరిఙ్ఞానం ఉంది. జాత, మృత అశౌచాదులలో మనం శారీరకంగా, మానసికంగా శుద్ధంగా ఉన్నా ‘మైల’అనే పరిపాటి లోకంలో ఉంది. కాబట్టి వేదం ఎలా చెప్పిందో అదే ఆచరణలో ఉండాలి. మన యుక్తులూ, మార్చుకోవడాలు వైదిక ఆచారం కానేరదు. 

స్త్రీలు ప్రతిమాసం ఋతుకాలంలో విడిగా ఉండడం మన పూర్వీకుల ఆచారం. దీనికి ఆధారం యజుర్వేదంలో రెండవ కాండలోని ఐదవ ప్రపాఠకం. అందులో విశ్వరూప వధ, రజస్వలా వ్రతాలు ముఖ్యంగా చెప్పబడి ఉన్నాయి. అది ఇలా ఉంది – పూర్వం బృహస్పతి తపస్సుకు పోగా, ఇంద్రుడు త్వష్ట కుమారుడైన విశ్వరూపుని గురువుగా చేసుకున్నాడు. ఆయనకు మూడు తలలు. వాటితో అతడు సోమపానం, సురాపానం, అన్నభోజనం చేసేవాడు.

ఒకప్పుడు తనకు లభించిన యఙ్ఞ భాగాన్ని రాక్షసులకి ఇవ్వడంతో కోపం చెందిన ఇంద్రుడు వజ్రాయుధంతో అతని శిరస్సుని ఖండించాడు. అవి పక్షులై బ్రహ్మహత్యా దోషాన్ని ధరించి ఇంద్రునికి ఆ దోషాన్ని ఇవ్వసాగాయి. దాంతో ఇంద్రుని ఇంద్రత్వానికే ఆపద వచ్చింది. యఙ్ఞం ద్వారా కొంతమేరకు తొలగించి, మిగిలిన ఆ దోషాన్ని మూడు భాగాలు చేసి, పుచ్చుకున్న వారికి కోరిన వరమిస్తానన్నాడు. ఒక భాగాన్ని పృథివి తీసుకుంది. వరంగా – భూమిపై ఎక్కడైనా తవ్వితే కొన్ని రోజులకు ఆ భూమి సమమయ్యేలా కోరింది. అలాగేనని వరమిచ్చాడు ఇంద్రుడు.


వృక్షాలు ఒక భాగాన్ని పుచ్చుకున్నాయి. కొన్ని కొమ్మలు నరికినా వృక్షం మృతి చెందక మళ్ళీ వేరే శాఖలు మొలిచేలా వరాన్ని పొందింది. అలాగే స్త్రీలు చివరిభాగం తీసుకొని, దానికి బదులుగా పుత్రోత్పత్తి సామర్థ్యాన్ని వరంగా పొందారు. అందువల్ల ఆ రజస్వలా కాలంలో వారికి బ్రహ్మహత్యాదోషం ఉంటుంది. ఆ దోషం ఉండడం వల్ల, ఆ రోజుల్లో వారితో సల్లాపాలు చేయరాదు, సమానంగా కూర్చోరాదు. ఒకటిగా భోజనం చేయరాదు, వారిని తాకరాదు. వారు వండినవి తినరాదు. అలా నియమాలు పాటించని పక్షంలో కొన్ని కష్టాలు వస్తాయని కూడా వేదమంత్రాలు చెప్తున్నాయి. ఇది వేదం చెప్పిన గాథ. పైగా ఇందులో ఎన్నో సంకేతాలు ఉంటాయి. శరీర నిర్మాణంలో దేవతాశక్తులే ఇంద్రియాధిదేవతలు. మన శరీరంలో మనకు తెలియని మార్పులు జరుగుతున్నట్లే మనపై ప్రభావం చూపే సూక్ష్మప్రపంచంలోనూ జరుగుతాయి. ఇంద్రుడు ప్రధాన దేవతాశక్తి. ఆశ్చర్యంగా, కాలగమనాన్ని ఆధారం చేసుకొని మారే శరీర నియమంలో అంతు తెలియని దైవిక రహస్యాలను వేదం వివరిస్తుంది. ఇంద్రియాతీత సత్యదర్శనమే కదా వేదవిఙ్ఞానం.


కొన్ని ధర్మాలను పాటించలేకపోవచ్చు. కానీ మన అశక్తత వల్ల వదలి, వాటిని ధర్మాలే కావనీ, మనం చేసిందే ధర్మమనీ ఋషి విఙ్ఞానాన్ని తూలనాడడం ఎందుకు? ఆధునిక కాలంలో వాటిని పాటించడం శ్రమ అనీ, అవి మూఢనమ్మకాలనీ స్త్రీలను తక్కువ చేయడమేనన్న భావాలున్నాయి. కానీ అవి సరికావు. ఇది వైదిక ఆచారమే. మన పూర్వీకులు పాటిస్తూ వచ్చిన ధర్మమే. మనకు పట్టలేదని అవి మూఢనమ్మకాలనడం సబబు కాదు. స్త్రీలు ఇంద్రునికి సహాయం చేసి, దోషాన్ని తాము తీసుకొని అనుభవిస్తున్నారని వారి గొప్పదనాన్ని తెలుపుతోంది కనుక వారిని తక్కువ చేయడం ఏమాత్రమూ కాదు. 

పైగా ఇది శరీరజ దోషం. వ్యక్తిత్వదోషం కాదు. ఇది అవమానకరమూ కాదు. దేశ, కాల పరిస్థితులను బట్టి కొన్ని అనుకూలించకపోయినా, శక్తివంచన లేకుండా యథాశక్తి వాటిని ఆచరించవచ్చు. ఇంట్లో ఇతరుల్ని తాకకుండా, వండకుండా విశ్రాంతిగా ఒకేచోట ఉండడం ఎప్పుడైనా కుదురుతుంది. శ్రద్ధ ఉన్నప్పుడు తప్పకుండా ఆచరించగలం. 

నెలలో కేవలం ఆ కొద్దిరోజులు జాగ్రత్తపడడం, కొంచెం శ్రమ అయినా, అసాధ్యం కాదు. బైట ప్రపంచం గురించి విడిచిపెట్టండి, మన ఇంట్లో మనం జాగ్రత్తగా ఉండగలం. 

నాలుగవ రోజున స్నానం చేశాక, నీళ్ళలో పసుపు కలిపి ఆ దోషాలన్నీ పోయేలా భగవత్ సమర్పణ చేసి స్నానం చేస్తారు. ఇంట్లో ఆ మూడు నాళ్ళు మసలిన చోటంతా పసుపు నీళ్ళు జల్లి ఇల్లు కడుగుతారు. పైగా మంత్రం జపించేవాళ్ళు ఉన్న ఇంట, దీపారాధన, దేవతాపూజలు జరిగే ఇంటా ఇటువంటి ‘మైల’లు కలిస్తే ఆ మంత్రశక్తీ, దైవశక్తి నశిస్తాయి. దీనికి ఎన్నో నిదర్శనాలున్నాయి. తాయెత్తులు, యంత్రలు వంతివి కూడా రజస్వలా స్త్రీ స్పర్శతో శక్తిహీనమవుతాయి. మళ్ళీ సంప్రోక్షణ చేస్తేగానీ వాటిలో శక్తిచేరదు. 

అంతటా దేవుడున్నాడు కదండీ’ అనే వేదాంత వచనాన్ని దీనికి అన్వయించడం తప్పు. అంతటా దేవుడున్నాడనిపిస్తే ఒకేచోట దేవతాపూజ చేయడం ఎందుకు? దేహ స్పృహ ఉన్నంతకాలం ఆచారం పాటించవలసిందే. 

ఈవిధమైన అశౌచంలోనున్న స్త్రీ శరీరం నుండి ప్రసరించే సూక్ష్మ విద్యుదయస్కాంత తరంగాల ఆవరణ(ఆరా) దివ్యంగా ఉండదు. విపరీత శక్తులతో ఉంటుంది. ఇది సూక్ష్మ ప్రపంచాన్ని దర్శించగలిగిన వాళ్ళకి తెలుస్తుంది.


నిత్యం దీక్షగా ఉన్న స్త్రీలు ఆ నాలుగు రోజులు మంత్రజపం, స్తోత్ర పారాయణ, దీపారాధన వంటివి చేయరాదు. (మానసికంగా నామస్కరణ చేస్తే తప్పులేదు). తిరిగి స్నానాదులు చేశాక (అయిదవరోజు నుండి) వాటిని కొనసాగించవచ్చు. అప్పుడు, మధ్యలో ఆపిన దోషం ఉండదు. అలాకాకుండా ఆ నాలుగు రోజుల్లోనూ వాటిని కొనసాగిస్తే, పాపం సంక్రమిస్తుంది. ఆ సమయంలో దైవసంబంధ కార్యక్రమాలలో పాల్గొన్నా దోషమే. మామూలుగా నిత్యం సహజంగా మలినాలు విసర్జించాక, స్నానం చేస్తేనే గానీ పూజాదులకు పనికిరాదంటారు. మరి ఈ విషయంలో నియమాలుండడం ఎంత అవసరమో ఆలోచించండి!

దేవాలయాదుల వాతావరణమంతా మంత్రశక్తిచేత, నిత్యానుష్ఠానాల చేత పునీతమై ఉంటుంది. అందులో ఇటువంటి అశౌచమున్న వాళ్ళు ప్రవేశిస్తే, ఆ వాతావరణంలోని సూక్ష్మంగా ఉన్న పవిత్రత దెబ్బతింటుంది.

మన దేవతల గురించి, మంత్రాల గురించి చెప్పిన వేదపురాణాలే ఈ విషయాలూ చెప్పాయి. దేవతపై నమ్మకం ఉంటే వీటిని నమ్మవలసిందే. ‘శుచి’ అనేది అభివృద్ధి చెందిన నాగరికతకి చిహ్నం. అయితే మనకో సందేహం రావచ్చు – బైట ఎందరో అలా ఉంటున్నారు కదా! అని. బైట విషయం మనకు ఙ్ఞాతం కాదు. మన మటుకు మనం జాగ్రత్త పడితే చాలు. 


అందుకే దైవమందిరాన్ని ప్రత్యేకంగా ఉంచుతాం. బైటకి వెళ్ళి వచ్చిన బట్టలతో ముట్టుకోం. స్నానం చేసి, శుద్ధ జలాన్ని పట్టుకొని, శుద్ధ వస్త్రాల్ని కట్టుకొని ‘పుండరీకాక్ష’ (భగవంతుని)నామం స్మరించుతాం. అప్పుడు శుచి వస్తుంది. తెలిసి అటువంటి వాటిని కలుపుకోకూడదు. అటువంటి స్థితిలో ఉన్నప్పుడు ఆవరణలో ఉన్న ప్రాంతమంతా అశుచి అవుతుంది. 

ఆరోగ్యరీత్యా కూడా ఆ నాలుగు రోజులూ స్త్రీకి విశ్రాంతి అవసరం. అప్పుడు కూడా ఆమెకు విశ్రాంతినివ్వకుండా, ఇంటి పనులు చేయించడం మగవాడి దౌర్జన్యమే. అప్పటి ‘ఇన్ఫెక్షన్’ ప్రభావం గురించి విఙ్ఞానశాస్త్రమూ చెప్పింది. భారతీయ విఙ్ఞానంలో భౌతిక విఙ్ఞానం, సూక్ష్మ ప్రపంచ విఙ్ఞానం కలిసి ఉంటుంది. భౌతిక విఙ్ఞానం ఇంకా ఎదుగుతోంది. ఇప్పటికే మన ఆచారాల్లో కొన్నింటి ఆరోగ్య రహస్యాలు అంగీకరిస్తున్నారు. ఇంకా ఈ సైన్స్ ఎదిగితే అన్నిటినీ అంగీకరిస్తారు. కానీ ఈ లోపలే మనం వీటిని పోగొట్టుకోకూడదు. ఈ నాలుగు రోజులూ ఆమె ఇంట్లో కలవకూడదు. ఇంటి యజమాని గానీ, ఇంకెవరైనా గానీ దీపారాధన, పూజ చేయవచ్చు. 


మనచుట్టూ జగత్తులో దైవీశక్తులూ, విపరీత శక్తులూ ఉంటాయి. విపరీత శక్తుల ప్రభావం పడకుండా ఉండేందుకే శౌచాన్ని పాటించాలి.


‘ఇవి కుదరవు’ అని తప్పించుకుంటే నష్టపోయేది మనమే. ఆ నష్టానికి సిద్ధపడితే వదలవచ్చు. శాస్త్రాన్ని పాటించడం వల్ల పాటించిన వారికే ప్రయోజనం కానీ ఇంకెవరికో కాదు. మన శ్రేయస్సు కోసమే సూక్ష్మదర్శనం కలిగిన ఋషులు సదాచార నియమాలను పేర్కొన్నారు. అవి పాటించడం కొందరికి సాధ్యం కాకపోవచ్చు. అంతమాత్రం చేత వాటిని తీసిపారేయడం తగదు కదా! నిప్పునీ, నీటినీ సమానంగా చూడగలిగే ద్వంద్వాతీత అవధూత స్థితిలో ఉన్నవారికే విధి నిషేధాలు ఉండవు గానీ, నిప్పు నీరూ, మంచీచెడూ, శీతోష్ణాలూ, సుఖదుఃఖాలూ తెలిసిన ‘దేహస్పృహ’ కలిగిన మనందరికీ విధినిషేధాలున్నాయి.


సేకరణ: బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారు.

పిలిచేవాళ్ళు

 *పిలిచేవాళ్ళు పిలిస్తే వస్తా* 

🕉🌞🌎🌙🌟🚩


స్వామి వివేకానంద భారతదేశంలోని ఓ గ్రామంలో నుంచి నడిచి వెళ్తున్నాడు.

ఊరి బయట ఒక దేవాలయం ఉంది.

ఆ దేవాలయం విగ్రహం ధ్వంసమై ఉంది.

దేవాలయం కూల్చబడి ఉంది.

లోపలికి వెళ్ళాడు స్వామీజీ.

అమ్మవారు భవానీదేవి.

క్షీరభవానీ దేవి అంటారు ఆ ప్రాంతీయులు ఆమెను.

విగ్రహాన్ని చూసి స్వామీజీ...

అమ్మా!?

ఇతర మతస్థులు వచ్చి నీ దేవాలయాన్నిలా ధ్వంసం చేశారు.??

నీ విగ్రహాన్ని ముక్కలు చేశారు.??

నువ్వు ఎందుకు చూస్తూ ఊరుకున్నావు??

నువ్వందరినీ రక్షిస్తావని కదా!?దేవాలయాన్ని కట్టింది.!?

నిన్ను నీవే రక్షించుకోలేకపోతే ఎలా!??

ఇక మమ్మల్నేమి రక్షిస్తావు?

అన్నారు స్వామీజీ అమ్మవారితో.

అని కళ్ళు మూసుకుని బాధపడుతున్నాడు.

అమ్మవారు కనిపించిందాయనకు.!

పరమేశ్వరి సాక్షాత్కరించింది.

ఆమె అన్నది...నాయనా!

దేవాలయాన్ని నేను కట్టమన్నానా?!

మీరు కట్టుకున్నారు.!

మీరే రక్షించుకోవాలి.!

అంటే!??

ఆ సమాధానం సంతృప్తిగా లేదమ్మా?!

దేవాలయాన్ని మేము కట్టాము.

కానీ నువ్వు వస్తున్నావు కదా?!

మీరే రక్షించుకోండి అంటే?

నువ్వెందుకిక్కడ?

అన్నాడు స్వామీజీ.

అంటే!?

కాదు నాయనా!

*Divine Law is different from Human Law.* 

మేము జోక్యం చేసుకుంటే!?మా ముందు ఎవరాగుతారు?

ఈ ప్రపంచంలో?

కానీ...!

మేము కర్మ ఫలితాలనిస్తాము.

సరాసరి.,నేరుగా జోక్యం చేసుకోము.

దేవాలయం కట్టినవాడికి పుణ్యఫలితమిస్తాము.

దేవాలయం నాశనం చేసినవాడికి పాపఫలితమిస్తాము.

నరకాన్నిస్తాము.

అయితే!?

మీరెందుకున్నది?

మీరు రారా?

అని నువ్వడిగావు.

వస్తాము.

తప్పకుండా వస్తాము.

మమ్మల్ని పిలువగలవాడు పిలిస్తే వస్తాము!

పిలువగలగాలా?

మమ్మల్ని పిలిచేవాళ్ళు తక్కువైపోయారు.

నువ్వు పిలువగలిగేవాడవు గనుక వచ్చాను నేను.!

కనుక పిలువగలిగేవాళ్ళను తయారు చేయి.

వస్తే..అప్పుడు తప్పకుండా వస్తాము మేము.

అని ఆమె సమాధానం చెప్పింది క్షీరభవానీ దేవి వివేకానంద స్వామికి.

🐚🐚🐚🐚🐚🐚🐚🐚🐚

జ్ఞానయోగం

 **అద్వైత వేదాంత పరిచయం**


7.1 జ్ఞానయోగం:  జ్ఞాన ప్రాప్యర్థం యోగ:        :జ్ఞానయోగం అంటే జ్ఞాన సముపార్జనకి వాడే పద్ధతి. సహజంగా ఒక ప్రశ్న ఉదయిస్తుంది. దేని గురించిన 

జ్ఞానం?ఎందుకంటే జ్ఞానం ఒక వస్తువుకి సంబంధించినది ఎప్పుడూ.జ్ఞానయోగం అంటే ఆత్మ జ్ఞానం, మనల్ని గురించి మనం తెలుసుకోవటం.

  మనని గురించి మనం తెలుసుకోవటం అంటే మనకి ఇప్పటికే మన గురించి కొంత తెలుసు  మన ఎత్తు, మన బరువు, మన తల్లిదండ్రులు, మన పుట్టుమచ్చలు 

వగైరా. అంటే మన గురించి పైపైన తెలుసు. కాని జ్ఞానయోగం అంటే మన గురించిన ముఖ్యమైన విషయం లేదా అసలు విషయం లేదా అసలు నేను, ఉన్నతమైన నేను అనవచ్చు. దాన్ని 

పరాప్రకృతి అంటారు.శాస్త్రంలో అసలు నేనుని ఆత్మ అంటారు.కాబట్టి జ్ఞానయోగం అంటే ఆత్మజ్ఞానయోగం.

అద్వైత వేదాంత పరిచయం

7.2 ప్రయోజనం : మోక్షపురుషార్థ: :

  జ్ఞానయోగం అత్యుత్తమ పురుషార్థమైన మోక్షాన్ని పొందటానికి 

ఉపయోగపడుతుంది. జ్ఞానయోగం: మోక్షార్థం

అద్వైత వేదాంత పరిచయం

7.3 మోక్షం :

  దీని గురించి పురుషార్థముల గురించి తెలుసుకున్నప్పుడు చూశాం.దానికి అనేక నిర్వచనాలున్నాయి.కాని మనం పురుషార్థాలలో చూసిన అర్థాన్ని మరి ఒకసారి 

గుర్తుకు తెచ్చుకుందాం.మోక్షం అంటే బంధకత్వం లేదా ఆధారపడటం నుంచి స్వేచ్ఛ పొందటం. దేనితో బంధం? తక్కినమూడు పురుషార్థాలూ అయిన ధర్మ, అర్థ, కామాలతో బంధం.

అద్వైత వేదాంత పరిచయం

7.3.1 రెండురకాల బంధం :- ఒక వస్తువు గాని, వ్యక్తి గాని ఎదురుగుండా ఉంటే భారం అవుతుంది. ముఖ్యంగా తోటి మనుష్యులతో ఏర్పడే సంబంధ బాంధవ్యాలలో ఒత్తిడి ఎక్కువగా 

ఉంటుంది.

  అలాగని ఎవరూ లేకపోతే ఒంటరితనం వేధిస్తుంది. జీవితం శూన్యంగా అనిపిస్తుంది. ఉంటే ఒక బాధ లేకపోతే ఒక బాధ. మనకి మనుష్యులు కావాలా వద్దా అన్నది 

తేల్చుకోలేకపోతున్నాం. ఒక్కోసారి ఏదైనా ఆశ్రమానికి పారిపోదామా అనిపిస్తుంది. పిల్లలు ఎదురుగా ఉంటే తలనొప్పి, దూరంగా ఉంటే గుండెనొప్పి అని సామెత. ఇలాంటి పాశాన్ని 

ఉభయత: పాశా రజ్జు అంటారు.

  మోక్షం అంటే ఈ రెండు బంధాలూ ఉండవు. మనిషి ఎదురుగా ఉంటే ఒత్తిడికి లోనవటమూ ఉండదు. దూరమయితే శూన్యతా భావమూ ఉండదు. ‘నాకొక తోడు 

కావాలి’ అన్న తపన ఉండదు. ధర్మార్థకామాలు ఉన్నా, లేకపోయినా తేడా ఉండదు. దీన్ని స్వేచ్ఛ అంటారు.

7.4 అంతర్గత స్వేచ్ఛలో మూడు సద్గుణాలు :-

ప్రశాంతత పెంపొందించుకోవటానికి-

  ఓభగవంతుడా జీవితంలో మార్చలేనివాటిని అంగీకరించగలిగేటందుకు. నాకు ధైర్యం ప్రసాదించు, జీవితంలో మార్చగలిగినవాటిని 

మార్చేటందుకు. నాకు వివేకం ప్రసాదించు, జీవితంలో ఏవి మార్చగలనో, ఏవి మార్చలేనో తెలుసుకునేటందుకు. 

  అంటే మూడు సద్గుణాలు కోరుతున్నాము - సమత్వం, ధైర్యం, వివేకం. ఇక్కడ మార్చలేనిది అంగీకరించటం అంటే నోరు మూసుకుని భరించడం కాదు అర్థం. 

మార్చలేని దాన్ని భరించాలన్న ఆంగ్ల సామెత 

ఉంది కాని ఇక్కడ మనం కోరే సమత్వం చిరునవ్వుతో అంగీకరించే సానుకూలత. ద్వేషం పెంపొందించనిది, అన్యాయం జరిగిందనిపించనిది కోరుతున్నాము. ఒప్పుకోవాల్సిన చోట 

ఆరోగ్యకరంగా ఒప్పుకోవటం, మార్చగలిగిన చోట ధైర్యంగా మార్చగలగడం, వివేకంతో ఏది ఏదో తేల్చుకోవటం.

అద్వైత వేదాంత పరిచయం

7.5 జ్ఞాన సముపార్జన విధానం :- 

  ఏ జ్ఞానం సంపాదించాలన్నా కూడా దానికి ఒకటే పద్ధతి ఉంది. జ్ఞాన సముపార్జనకి ఒకపరికరం కావాలి. దాన్ని సంస ్క ృతంలో ప్రమాణం అంటారు.

  నేర్చుకునే వ్యక్తి    -  ప్రమాత

  వాడే పరికరం    -  ప్రమాణం

  నేర్చుకునే వస్తువు  -  ప్రమేయం

  పొందే జ్ఞానం    -    ప్రమ

  అంటే ఒక ప్రమాత, ఒక ప్రమాణం ద్వారా, ఒక ప్రమేయం గురించిన ప్రమ పొందుతాడు.  ఉదాహరణకి రంగు గురించి తెలుసుకోవాలంటే కన్ను, 

శబ్దం గురించి తెలుసుకోవాలంటే చెవి 

ఉపయోగిస్తున్నాడు.

7.5.1  ఐదు ప్రమాణాలు :- శాస్త్రం ప్రమాణం గురించి విపులంగా చర్చించి, ఐదు ప్రమాణాలు మనకందుబాటులో ఉన్నాయి అంది. ఐదు ప్రమాణాలు మనుష్యులకి 

అందుబాటులో ఉండటంతో వాటిని పంచ పౌరుషేయ ప్రమాణాలని అంది. 

  ఆ ఐదు ప్రమాణాల పేర్లు తెలుసుకుంటే చాలు, వివరాలు సందర్భం వచ్చినప్పుడు నేర్చుకోవచ్చు.


1. ప్రత్యక్ష ప్రమాణం  2. అనుమాన ప్రమాణం 3. అర్థాపత్తి 

4. ఉపమానం 5. అనుపలబ్ధి

ఈ ఐదు ప్రమాణాలని ఆచరణకి వీలుగా రెండుగా తగ్గించారు.

1.ప్రత్యక్ష ప్రమాణం 2.అనుమాన ప్రమాణం. విజ్ఞాన శాస్త్రాలన్నీ వీటిమీదే ఆధారపడి ఉన్నాయి.

🙏🙏🙏

సేకరణ

సమయస్ఫూర్తి

 🌹🌹 *సమయస్ఫూర్తి* 🌹🌹


అనగనగా ఒక ఊరిలో కోదండరామయ్య వనజ దంపతులు. వారికి లేక లేక ఒక కుమారై కలిగింది. వారు ఆమెకి భారతి అని పేరు పెట్టుకున్నారు. 


ఒక్కగానొక్క కూతురు కావటంతో ఎంతో గారాబంగా పెంచుకున్నారు. కొంతవరకు చదివించారు. తరువాత యుక్తవయస్సు రాగానే పెళ్లి ప్రయత్నాలు ప్రారంభించారు. 


కూతురిని కాస్త తూగగలిగిన వారికి ఇవ్వాలని, కోడలిని కాస్త పేద ఇంటి నుండి తెచ్చుకోవాలని మన ఆర్యోక్తి. అలాగే కాస్త ఉన్నత కుటుంబాన్ని వెదకి జాలయ్య అనే అబ్బాయితో వివాహం జరిపించారు. అమ్మాయి కాపురానికి వెళ్లింది. కాలం గడిచిపోతున్నది. 


భారతిని పక్క ఊరిలోనే ఇచ్చారు. అక్కడికి తమ ఊరి వారు మజ్జిగ అమ్ముకునేందుకు ప్రతి రోజూ పోతుంటారు. భారతి ఇంట్లో కూడా మజ్జిగ పోస్తుంటారు.


మజ్జిగ వారితో మా అమ్మా,నాన్నను అడిగానని చెప్పండి. వారిని చూడాలని ఉంది. రోజూ కలలోకి వస్తున్నారు అంటూ ప్రతిరోజు చెప్పుకునేది భారతి.


 వారు వచ్చి అక్షరం వదలకుండా ప్రతిరోజు కోదండరామయ్యకు చెప్తుండేవారు. ఆ మాటలు విన్నప్పుడల్లా ఆయనకు మనస్సు బాధతో నిండిపోయేది. బాధ అధికమై తట్టుకోలేకపోయేవాడు.


అలా రోజులు గడుస్తున్నాయి. ఒకరోజు కూతురును చూడటానికి వెళ్లాలని నిశ్చయించుకున్నాడు. అనుకున్నదే తడవుగా కూతురి అత్తవారింటికి వెళ్లాడు. లేకలేక వచ్చిన వియ్యంకుడిని సాదరంగా ఆహ్వానించారు భారతి అత్తమామలు. 


తండ్రిని చూచి భారతి ఎంతో సంతోషించింది. భోజనాలు అయ్యాక తీరిగ్గా మాట్లాడుకుంటున్న సమయంలో భారతి తండ్రి వారి అత్తమామలతో మీరు మా అమ్మాయిని సరిగ్గా చూసుకోవడం లేదా? అని అడిగాడు.


 అది విని భారతి అత్తమామలు అలాగని భారతి మీతో చెప్పిందా? అని అడిగారు వారు. లేదు, లేదు నేనే అలా అనుకుంటున్నాను. ఎవరూ చెప్పకుండా మీకు మీరే ఎలా అనుకుంటారు అన్నారు వారు.


 దాంతో భారతి తండ్రి మాట్లాడుతూ అమ్మాయి పెళ్లయి అయిదు సంవత్సరాలు అయినా ఇంకా మమ్మల్నే తలుచుకుంటూ, మమ్మల్ని చూడాలని కలలు కంటుంది అంటే మీ కుటుంబంలో మా అమ్మాయి ఇంకా కలవలేదని అనిపిస్తుంది. 


మీరు ప్రేమగా చూసుకోకపోవడం వల్లే నిత్యం మమ్మల్ని కలవరిస్తుంది అని అనిపిస్తుంది అన్నాడు. అసలు నిజాన్ని సూక్ష్మంగా గ్రహించినందుకు భారతి అత్తమామలు ఆశ్చర్యపోయారు. 


భారతి తండ్రి మాట్లాడుతూ చూడండి! కోడలు అద్దం లాంటిది. అద్దం మనం నవ్వితే నవ్ఞ్వతుంది. ఏడిస్తే ఏడుస్తుంది. అందుకే నేడు కోడలిని కూతురులాగే భావించి ప్రేమగా చూస్తుకుంటే రేపు మీరు వృద్ధాప్యంలో ఉన్నప్పుడు రెండింతలు ప్రేమగా చూస్తుంది. లేకుంటే నేను చెప్పనవసరం లేదు అన్నాడు కోదండరామయ్య. వియ్యంకుని 


,అంతరార్ధానికి భారతి అత్తమామలు ఎంతో మెచ్చుకున్నారు. అప్పటి నుండి భారతి తల్లిదండ్రులను కలవరించలేదు.


*సేకరణ


ధర్మో రక్షతి రక్షితః 🙏🏻🙏🏻🙏🏻

సర్వే జనా సుఖినోభవంతు 🙏🙏🙏

Temple