8, సెప్టెంబర్ 2023, శుక్రవారం

మోహముద్గరము

 మోహముద్గరము 


భజ గోవిందం భజ గోవిందం 

గోవిందం భజ మూఢమతే 

సంప్రాప్తే సన్నిహితే కాలే 

నహి నహి రక్షతి డుకృఞ్ కరణే


తనిసి గోవింద ! గోవింద ! యనుచు భక్తి

భజన మొగిసల్పు మో మూఢ ! ప్రాప్తమయ్యె

మరణకాలమ్ము నీకు ,  వ్యాకరణ మేల ?

అద్ది రక్షింపజాల దా యముని నుండి.        1* 



మూఢ ! జహీహి ధనాగమ తృష్ణా

కురు సద్బుద్ధి మనసి వితృష్ణా

ఎల్లభసే నిజ కర్మోపాత్తం 

విత్తం తేన వినోదయ చిత్తం 


విత్త సముపార్జనా కాంక్ష  విడువు మూఢ !

మనసు సద్భుద్ధియందున మగ్న పరచు 

మరయ నిజకర్మవలన నీ కందినట్టి 

విత్తమున తృప్తిపరచుమీ చిత్తమెపుడు    2*



నారీ స్తనభర నాభీదేశం 

దృష్ట్వాత్ మాగా మోహావేశం

ఏత న్మాంస వసాది వికారం 

మనసయే చింతని వారం వారం 


నారి స్తనములపొందిక నాభి జూచి 

మోహభూమాబ్ధి మొఱకువై మునుగ వద్దు 

సర్వమదియెల్ల మాంసాస్రు సంగతమ్ము

మాటిమాటికి తలపగా మాను మింక     3*


✍️గోపాలుని మధుసూదన రావు 🙏

ధర్మమంటే

 సనాతన ధర్మం అంటే ఏంటి?

 అస్సలు సనాతన ధర్మం లో ఏముంది? అస్సలు నిజం గా భారతీయులు అందరూ సనాతన ధర్మాన్ని పాటిస్తున్నారా? 

కనీసం సనాతన ధర్మం అంటే నిజమైన అర్ధం కచ్చితంగా ఎంత మంది కి తెలుసు?

అస్సలు ధర్మం అంటే తెలుసా?


సనాతన ధర్మం అంటే హిందువుల ఆచార వ్యవహారాలు, నడవడిక, సాంప్రదాయాలు, కట్టుబాట్లు మాత్రమే నా? 


సనాతన ధర్మం అంటే సృష్టిలో ప్రతి వస్తువు లో భగవంతుని చూడటం.


సనాతన ధర్మం అంటే మనిషి మనీషిగా, మహర్షి గా మారటానికి వేదాలు, ఉపనిషత్తులు, రామాయణ, మహా భారత గ్రంధాల లో మనిషి ఎలా ఉండాలో, ఎలా ఉండకూడదో చూపించిన మార్గం.


"భగవద్గీత" సృష్టి లో మనిషి ఎలా నడుచుకోవాలి, అలాగే కర్మ సిద్ధాంతం , ధర్మాన్ని ఆచరించడం చూపించిన మహా గ్రంధం కూడా సనాతన ధర్మాన్నే భోదిస్తూ ఉంది.


అయితే హిందూ ధర్మం లో కూడా కాలాన్ని బట్టి కొందరి స్వార్ధ పరుల కుటిల స్వభావాలు వల్ల " సతీ సహగమనం, అంటరాని తనం, బాల్య వివాహాలు మొదలగు అనేక సాంఘీక దూరాచారాలు మొదలు అయ్యాయి, అయితే మరీ వాటిని నిర్మూలన కోసం కృషి చేసిన వారు ఎక్కువ శాతం కూడా అగ్ర వర్ణాలు లో జన్మించిన మహానుభావులు ఎందరో ఉన్నారు. 


కానీ కొంతమంది ఆయా సాంఘీక దూరాచారాలు మాత్రమే సనాతన ధర్మం అని నమ్మించే ప్రయత్నాలు చేస్తూ అమాయకులను మభ్య పెడుతున్నారు. అది కేవలం వారు పాపులర్ అవ్వాలని , అంతే తప్ప జనాల మీద నిజమైన అభిమానం తో కాదు.


ప్రతి మతం లో కొన్ని సాంఘీక దూరాచారాలు ఉంటాయి, అయితే అవి ఆ మతం వారు పూజించే దేవుడు ఆ దూరాచారాలు ను పాటించమని చెప్పినట్టు అర్ధమా?


ఏ మతం యొక్క ముక్య తత్వం అయిన మనిషి మనిషి గా బ్రతకమని, భగవంతుడు ని ధ్యానించమనే చెప్తుంది. మూఢ నమ్మకాలు, మూఢ ఆచారాలు , సాంఘీక దూరాచారాలు పాటించమని చెప్పదు.


ఏ గ్రంధం లో అయిన, మతం లో అయిన, ఆచార వ్యవహారాలు లో అయిన, కట్టుబాట్లు, సాంప్రదాయాలలో అయిన ఉన్న మంచిని గ్రహించాలి,


కానీ మనిషి బుద్ధి సామాన్యంగా చెడు నే ఎక్కువ గ్రహిస్తుంది, ఆ చెడు నే ఎక్కువ వ్యాప్తి చేస్తోంది.


సనాతన ధర్మం హిందువులు నడిచే విధానం,

అందుకే హిందూత్వం అంటే ఒక మతం కాదు, ఒక నడవడిక, ధర్మాన్ని పాటిస్తూ , స్వధర్మ ఆచరణ చేస్తూ, "పరోపకారర్థయా ఇదం శరీరం" అని చూపించేది నిజమైన , మనలో చాలామంది పాటించని సనాతన ధర్మం, 


అలాగే సనాతన ధర్మం లోని ప్రతి ఆచారం లో పూర్తిగా పరిశీలించి చూస్తే ఒక సైన్స్ ఫాక్టర్ కచ్చితంగా ఉంటుంది.


బయటకు వెళ్లి వచ్చి కాళ్ళు కడగడం లో, ఇంట్లో పసుపు నీరు జల్లటం లో, మడి ఆచరించటం లో, దీపారాధన లో, హారతి వెలిగించడం లో, నిల్చునే, కూర్చునే, తినే, పడుకునే విధానం, కట్టు, బొట్టు, వృక్షాలు ను పూజించడం లో, లో ప్రతి దాంట్లో సైన్స్ ఫాక్టర్ తో కూడిన నియమాలు ఉన్నాయి. అవన్నీ సనాతన ధర్మం మనిషికి చూపిస్తుంది.

ప్రస్తుతం సంఘాన్ని ఉద్ధరించాలి అని సనాతన ధర్మాన్ని తప్పు పట్టె మహానుభావులందరూ ముందు సనాతన ధర్మం లో ఏముందో, దాని సారాంశం ఏంటో పూర్తిగా తెలుసుకుని తరువాత సనాతన ధర్మాన్ని నిర్మూలించండి , అంతే గాని కొందరు స్వార్థ ప్రయోజనాల కోసం మధ్యలో తీసుకుని వచ్చిన సాంఘీక దూరాచారాలు చూపించి అదే సనాతన ధర్మం అని తెలిసి తెలియక మాట్లాడే అజ్ఞాన మహానుభావుల మాటలు నమ్మి బొక్క బోర్లా పడితే అది మీ ఇష్టం.


ప్రపంచ దేశాలు గుడ్డలు కట్టుకోవడం కూడా తెలియని , కొండ గుహలు లో ఆదిమానవులు గా నివసించినప్పుడే నా భారత దేశంలో అంతులేని టెక్నాలజీ , వజ్రాలు, స్వర్ణాభరణాలు, చెక్కు చెదరని కట్టడాలు, ఆలయాలు, అలాగే ఎన్నో కాస్మో పోలిటీన్ నగరాలు భారత దేశంలో ఉన్నాయి, ఇది చరిత్ర సరిగ్గా చెప్పకపోయినా, ఎన్నో చారిత్రక ఆధారాలను corbondating టెస్ట్ ద్వారా టెస్ట్ చేసి నిరూపితం అయిన నిజాలు.


సనాతన ధర్మం ఎప్పుడూ గొప్పదే.

అది నిర్మూలిస్తే మనం నమ్ముతున్న నేటి సైన్స్ కూడా చాలా వరకు దానితో పాటే అంతరించిపోయి మానవాళి వినాసనానికి దారి తీస్తుంది అని ప్రతి ఒక్కరూ గుర్తు పెట్టుకోవాలి. 


మేర భారత్ మహాన్.

జైహింద్ముందు ధర్మమంటే ఏమిటి ? 

ధర్మం అంటే సత్యం, శౌచం, దయ (సర్వభూతములు యడ దయ) అహింస, అనే నాలుగు పాదాలుగా పిలువబడే  మానవ నడవడిక.


ఆధ్యాత్మికంగా చూస్తే బ్రహ్మం సత్యము, శరీరము అసత్యం. వ్యవహారికంగా చూస్తే హరిచంద్రుని కథ సత్యానికి ప్రతిరూపం.


ఈ నాలుగు నడవడికలు 

ధర్మానికి నాలుగు పాదాలు అనే నానుడి.


ఇది సృష్టి ఆరంభం నుంచి ఉంది కాబట్టి ఇటువంటి ధర్మాన్ని సనాతన ధర్మము అంటారు. 


ఇక విషయాన్నికొస్తే ఈ సనాతన ధర్మం ఆచరణకు సమాజానికి ఇది ఏ విధంగానూ అపకారం కాదు. 


మనదేశంలో జ్యోతిష్యం చదవని వాడిని కూర్చోబెట్టి టీవీలు జ్యోతిష్య శాస్త్రం ఊహ అంటారు. అదేవిధంగా సనాతన ధర్మం తెలియనివాడు అదేదో బ్రాహ్మణులకు సంబంధించినటువంటి విషయంగా పరిగణించి వారేదో సమాజానికి హితం చేస్తున్నట్లు ఫోజుపెట్టి బ్రాహ్మణ ద్వేషాన్ని ఈ విధంగా తెలియపరచుకుంటారు.


అసలు ముందు తమిళనాడులో ద్రవిడ కసిగా ఉండేది. దానికి పెరియార్కర్ ఫౌండర్.

ఆయన బ్రాహ్మణులను చంపండి అనేవాడు.


తర్వాత ఆ పార్టీ డీఎంకేగా చీలిపోయింది.

ఆ తరువాత ఆ పార్టీ ఏడీఎంకె గా చీలిపోయింది. డీఎంకే వరకు బ్రాహ్మణ ద్వేషం ఉంది. ఎడియంకే లో బ్రాహ్మణ ద్వేషం లేదు.


ఇప్పుడు డీఎంకే పరిపాలనలో ఉంది కాబట్టి సహజంగా బ్రాహ్మణ ద్వేషం ఉంటుంది.


దాని ఫలితమే ఈ సనాతన ధర్మ విలువల విమర్శ. 


చిన్న పామైనా పెద్దకర్రతో కొట్టాలి. లేకపోతే విషం

చిన్ని పాములు పుట్టుకొస్తాయి. సనాతన ధర్మేయులు ఈ విషయంలో శ్రద్ధ చూపాలి. లేకపోతే భావితరాలు భారతీయ ఉనికిని కోల్పోవచ్చు. శ్రద్ధకి వివేకానందుడు స్ఫూర్తి.

భారత్ మాతాకీ జై.

Panchaag


 

⚜ శ్రీ కంకేశ్వర్ మహాదేవ్ మందిర్

 🕉 మన గుడి : నెం 172




⚜ ఛత్తీస్‌గఢ్ : పాలి ( కొర్బా జిల్లా)


⚜ శ్రీ కంకేశ్వర్ మహాదేవ్  మందిర్



💠 ఛత్తీస్‌గఢ్‌లో చాలా ప్రసిద్ధ శివాలయాలు ఉన్నాయి. అలాంటి ఒక శివాలయం గురించి ఈ రోజు మనం తెలుసుకుందాం.

ఛత్తీస్‌గఢ్‌లోని పాలిలో ఉన్న శివుని ఆలయం చారిత్రాత్మకమైనది, దాని చరిత్ర ఆసక్తికరంగా ఉంటుంది.

కోర్బా జిల్లాకు 30 కి.మీ దూరంలో, పాలిలో అద్భుతమైన శివాలయం ఉంది.

పాలి నగరం విక్రమాదిత్య రాజు ఆరాధన స్థలంగా ఉండేదని నమ్ముతారు. 


💠 ఛత్తీస్‌గఢ్‌లోని బిలాస్‌పూర్ నుండి రతన్‌పూర్ మీదుగా అంబికాపూర్‌కు వెళ్లే మార్గంలో, ఈశాన్యంలో 50 కిమీ దూరంలో పాలి అనే గ్రామం ఉంది, అది ఇప్పుడు చిన్న పట్టణంగా మారింది.  

ఈ నగరం చివరలో, సుందరమైన మైదానాలలో ఒక అందమైన జలాశయం ఉంది, దాని చుట్టూ ఒకప్పుడు అనేక దేవాలయాలు నిర్మించబడ్డాయి, అవి ఇప్పుడు ధ్వంసమయ్యాయి.  

ఇప్పటికీ ఒడ్డున ఒక దేవాలయం ఉంది.  ఆలయం ముందున్న మహామండపం పాడైపోయినా సిమెంటు ప్లాస్టర్‌తో నిర్మాణాన్ని కొనసాగించేందుకు కృషి చేశారు.  

ఇది మహాదేవ ఆలయం అని కూడా పిలువబడే శివాలయం. దీనిని చక్రేశ్వర్ మహాదేవ్ అని కూడా పిలుస్తారు.



🔅 ఆలయ చరిత్ర 🔅


💠 ఆలయ పూజారి చెప్పిన స్థల పురాణం  ప్రకారం, ఈ శివలింగానికి ప్రతిరోజూ ఒక ఆవు పాలు సమర్పిస్తూ ఉండేదని  నమ్ముతారు. ఒకరోజు గోపాలుడు ఆవును ఇలా చేయడం చూశాడు. కోపంతో పాలు పడుతున్న చోట కర్రతో కొట్టాడు. కర్ర కొట్టగానే విరిగిన శబ్ధం వచ్చి అక్కడక్కడా కంకి గింజలు (బియ్యం గింజలు) పడ్డాయి. 

ఆ స్థలాన్ని శుభ్రం చేసిన తర్వాత అక్కడ ఒక శివలింగం కనిపించింది.

తరువాత ఆలయం అక్కడ నిర్మించబడింది. శివలింగం దగ్గర కంకి ధాన్యాలు పడి ఉండడం వల్ల ఆ ఆలయానికి కనకేశ్వర్ మహాదేవ్ అని పేరు వచ్చిందని అంటారు.

ఆలయ స్థాపన తరువాత, ఒక గ్రామం కూడా అక్కడ స్థిరపడింది, దానికి కంకి అని పేరు పెట్టారు.


💠 ఈ ఆలయంలో స్వామిని దర్శించుకోవడానికి ఛత్తీస్‌గఢ్ నలుమూలల నుండి శివ భక్తులు చేరుకుంటారు

శ్రావణ  మాసంలో ఇక్కడ భక్తుల జాతర జరుగుతుంది. 

శ్రావణ మాసంలో ప్రతి భక్తుని కోరికలను శివుడు తీరుస్తాడని ప్రజల నమ్మకం. 


💠 ఈ ఆలయాన్ని దాదాపు 900 సం.లో బాన్ రాజవంశ రాజు విక్రమాదిత్య నిర్మించాడని నమ్ముతారు. ఈ ఆలయం ఇసుక రాతితో నిర్మించబడింది. దీనితో పాటు, ఈ ఆలయం మరియు దాని గర్భగుడి యొక్క అద్భుతమైన ఆకృతి దీని ప్రత్యేకత.

 

💠 పాలి నుండి 20 కి.మీ దూరంలో దట్టమైన అడవుల మధ్య 3060 అడుగుల ఎత్తైన కొండపై ఉంది. 

ఈ ప్రదేశాన్ని కాశ్మీర్ ఆఫ్ ఛత్తీస్‌గఢ్ అని కూడా పిలుస్తారు, ఈ పేరును ఇక్కడి పర్యాటకులు పెట్టారు. 

కల్చూరి పాలకుడు పృథ్వీదేవ్ I ఈ ప్రదేశంలో ఇక్కడ ఒక కోటను నిర్మించాడు. 

పురాతన చరిత్రకు సంబంధించిన అవశేషాలు ఇప్పటికీ ఈ ప్రదేశంలో ఉన్నాయి.

 

💠 శ్రావణ మాసంలో  గొప్ప జాతర జరుగుతుంది.

ఆ మాసంలో శివుడిని దర్శించుకోవడానికి వేలాది మంది భక్తులు ఇక్కడికి వస్తారని గ్రామ ప్రజలు చెప్తారు. 

అలాగే, సుదూర ప్రాంతాల నుండి కన్వారీలు ఇక్కడికి చేరుకుని శివుని అభిషేకం కోసం  నీరు సమర్పించుకుంటారు.


💠 ఈ పురాతన ఆలయంపై చెక్కబడిన శిల్పాల పనితనం  జైన దేవాలయాలను పోలి ఉంటుంది, అలాగే ఇది ప్రపంచ ప్రసిద్ధ ఖజురహో దేవాలయం వలె కనిపిస్తుంది.  

 

💠 ఈ ఆలయ ప్రవేశ ద్వారం దగ్గర ఉన్న చెరువుకు తొమ్మిది మూలలు ఉన్నాయి.  అలాగే, ఈ చెరువు ఏడాది పొడవునా నీటితో నిండి ఉంటుంది.  


💠 ఆలయ ప్రవేశ ద్వారం ముందు చిన్న నంది ఉండి,  గర్భగుడిలో శివలింగం ఉంది.

గర్భగుడి ప్రవేశ ద్వారం ద్వారపాలకుల 

తో పాటు గంగా మరియు యమున విగ్రహాలు ఉంటాయి.


💠 ఆలయ మండపాన్ని బ్రహ్మ, కృష్ణుడు, సరస్వతి, మహిషాసురమర్థిని  మరియు గజలక్ష్మి చిత్రాలతో అలంకరించారు.

 

💠 ఆలయాన్ని చూడటం చాలా బాగుంటుంది మరియు చాలా శిల్పాలు 1000 సంవత్సరాలకు పైగా మనుగడలో ఉన్నాయి.

ఆలయం చుట్టూ చెక్కిన శిల్పాలు చూడ ముచ్చటగా ఉంటాయి.  పైభాగంలో దేవతలు, దేవతలు కొలువుదీరిన చోట, మరోవైపు ఖజురహో తరహాలో శృంగార రసాన్ని నింపి వివిధ భంగిమల్లో నాయికలు దర్శనమిస్తున్నారు.


💠 ప్రవేశ ద్వారం వద్ద ఒక చిన్న వరండా ఉండేదని అంచనా వేయబడింది, దాని తర్వాత అష్టభుజి మహామండపం / సభామండపం / జగమోహన్ గోపురం, ఆపై ఒక అంతరాలయం మరియు గర్భగుడి ఉంటుంది.  గోపురం లోపలి నుండి చూసేటప్పుడు, ఇది అనేక వృత్తాకార స్తంభాలతో తయారు చేయబడింది మరియు వివిధ బొమ్మలతో అలంకరించబడింది.

 

💠 రాయ్‌పూర్‌ నుండి సుమారు 200 కి.మీ.  దూరం మరియు బిలాస్‌పూర్  నుండి 60 కి.మీ.  దూరం.

అద్భుతమైన ఆవిష్కరణ*.

 అద్భుతమైన ఆవిష్కరణ*.


ఇజ్రాయెల్ దేశ శాస్త్రజ్ఞులు 

అంధుల కోసం ఒక క్రొత్త పరికరం కనిపెట్టారు.

ఈ పరికరం ద్వారా ఏ అంధుడైనా మనం చూడగలిగే, చదవగలిగే విధంగానే ప్రతిదీ చూడగలుగుతారు.  ప్రపంచవ్యాప్తంగా 4,00,000 కంటే ఎక్కువ మంది వ్యక్తులు  ఈ పరికరం ద్వారా ప్రయోజనాన్ని పొందుతున్నారు.  ఈ వీడియోలో ఆ అంధుల ఆనందాన్ని చూడండి.  ఇది మానవాళికి సరికొత్త, అమూల్యమైన బహుమతి.

Chamakura


 

Laxinarasimha


 

Grinder


 

Aadi deva


 

Harahara


 

Pile


 

Thirupati


 

Siva


 

Naarasimha


 

Apple juice making


 

Vasista ganapsti


 

M

 

Kolkata special


 

Majik


 

Slive making


 

Mahadeva


 

Peel


 

Larkura saagu


 

Voin separate


 

Jantilalu


 

TirupylO


 

Bhakaara slokam


 

Very shorp


 

Rural


 

Palvliser


 

Siva


 

Dulagondi


 

Sri


 

Srilalahastiswsrs


 

Dhavaleswaram


 

Jaya jaya


 

Vande bharath


 

Srikalahastiswara


 

Day country


 

Horse tanga


 

Bhupaadou


 

శ్రీ కంకేశ్వర్ మహాదేవ్ మందిర్

 🕉 మన గుడి : నెం 172


⚜ ఛత్తీస్‌గఢ్ : పాలి ( కొర్బా జిల్లా)


⚜ శ్రీ కంకేశ్వర్ మహాదేవ్  మందిర్



💠 ఛత్తీస్‌గఢ్‌లో చాలా ప్రసిద్ధ శివాలయాలు ఉన్నాయి. అలాంటి ఒక శివాలయం గురించి ఈ రోజు మనం తెలుసుకుందాం.

ఛత్తీస్‌గఢ్‌లోని పాలిలో ఉన్న శివుని ఆలయం చారిత్రాత్మకమైనది, దాని చరిత్ర ఆసక్తికరంగా ఉంటుంది.

కోర్బా జిల్లాకు 30 కి.మీ దూరంలో, పాలిలో అద్భుతమైన శివాలయం ఉంది.

పాలి నగరం విక్రమాదిత్య రాజు ఆరాధన స్థలంగా ఉండేదని నమ్ముతారు. 


💠 ఛత్తీస్‌గఢ్‌లోని బిలాస్‌పూర్ నుండి రతన్‌పూర్ మీదుగా అంబికాపూర్‌కు వెళ్లే మార్గంలో, ఈశాన్యంలో 50 కిమీ దూరంలో పాలి అనే గ్రామం ఉంది, అది ఇప్పుడు చిన్న పట్టణంగా మారింది.  

ఈ నగరం చివరలో, సుందరమైన మైదానాలలో ఒక అందమైన జలాశయం ఉంది, దాని చుట్టూ ఒకప్పుడు అనేక దేవాలయాలు నిర్మించబడ్డాయి, అవి ఇప్పుడు ధ్వంసమయ్యాయి.  

ఇప్పటికీ ఒడ్డున ఒక దేవాలయం ఉంది.  ఆలయం ముందున్న మహామండపం పాడైపోయినా సిమెంటు ప్లాస్టర్‌తో నిర్మాణాన్ని కొనసాగించేందుకు కృషి చేశారు.  

ఇది మహాదేవ ఆలయం అని కూడా పిలువబడే శివాలయం. దీనిని చక్రేశ్వర్ మహాదేవ్ అని కూడా పిలుస్తారు.



🔅 ఆలయ చరిత్ర 🔅


💠 ఆలయ పూజారి చెప్పిన స్థల పురాణం  ప్రకారం, ఈ శివలింగానికి ప్రతిరోజూ ఒక ఆవు పాలు సమర్పిస్తూ ఉండేదని  నమ్ముతారు. ఒకరోజు గోపాలుడు ఆవును ఇలా చేయడం చూశాడు. కోపంతో పాలు పడుతున్న చోట కర్రతో కొట్టాడు. కర్ర కొట్టగానే విరిగిన శబ్ధం వచ్చి అక్కడక్కడా కంకి గింజలు (బియ్యం గింజలు) పడ్డాయి. 

ఆ స్థలాన్ని శుభ్రం చేసిన తర్వాత అక్కడ ఒక శివలింగం కనిపించింది.

తరువాత ఆలయం అక్కడ నిర్మించబడింది. శివలింగం దగ్గర కంకి ధాన్యాలు పడి ఉండడం వల్ల ఆ ఆలయానికి కనకేశ్వర్ మహాదేవ్ అని పేరు వచ్చిందని అంటారు.

ఆలయ స్థాపన తరువాత, ఒక గ్రామం కూడా అక్కడ స్థిరపడింది, దానికి కంకి అని పేరు పెట్టారు.


💠 ఈ ఆలయంలో స్వామిని దర్శించుకోవడానికి ఛత్తీస్‌గఢ్ నలుమూలల నుండి శివ భక్తులు చేరుకుంటారు

శ్రావణ  మాసంలో ఇక్కడ భక్తుల జాతర జరుగుతుంది. 

శ్రావణ మాసంలో ప్రతి భక్తుని కోరికలను శివుడు తీరుస్తాడని ప్రజల నమ్మకం. 


💠 ఈ ఆలయాన్ని దాదాపు 900 సం.లో బాన్ రాజవంశ రాజు విక్రమాదిత్య నిర్మించాడని నమ్ముతారు. ఈ ఆలయం ఇసుక రాతితో నిర్మించబడింది. దీనితో పాటు, ఈ ఆలయం మరియు దాని గర్భగుడి యొక్క అద్భుతమైన ఆకృతి దీని ప్రత్యేకత.

 

💠 పాలి నుండి 20 కి.మీ దూరంలో దట్టమైన అడవుల మధ్య 3060 అడుగుల ఎత్తైన కొండపై ఉంది. 

ఈ ప్రదేశాన్ని కాశ్మీర్ ఆఫ్ ఛత్తీస్‌గఢ్ అని కూడా పిలుస్తారు, ఈ పేరును ఇక్కడి పర్యాటకులు పెట్టారు. 

కల్చూరి పాలకుడు పృథ్వీదేవ్ I ఈ ప్రదేశంలో ఇక్కడ ఒక కోటను నిర్మించాడు. 

పురాతన చరిత్రకు సంబంధించిన అవశేషాలు ఇప్పటికీ ఈ ప్రదేశంలో ఉన్నాయి.

 

💠 శ్రావణ మాసంలో  గొప్ప జాతర జరుగుతుంది.

ఆ మాసంలో శివుడిని దర్శించుకోవడానికి వేలాది మంది భక్తులు ఇక్కడికి వస్తారని గ్రామ ప్రజలు చెప్తారు. 

అలాగే, సుదూర ప్రాంతాల నుండి కన్వారీలు ఇక్కడికి చేరుకుని శివుని అభిషేకం కోసం  నీరు సమర్పించుకుంటారు.


💠 ఈ పురాతన ఆలయంపై చెక్కబడిన శిల్పాల పనితనం  జైన దేవాలయాలను పోలి ఉంటుంది, అలాగే ఇది ప్రపంచ ప్రసిద్ధ ఖజురహో దేవాలయం వలె కనిపిస్తుంది.  

 

💠 ఈ ఆలయ ప్రవేశ ద్వారం దగ్గర ఉన్న చెరువుకు తొమ్మిది మూలలు ఉన్నాయి.  అలాగే, ఈ చెరువు ఏడాది పొడవునా నీటితో నిండి ఉంటుంది.  


💠 ఆలయ ప్రవేశ ద్వారం ముందు చిన్న నంది ఉండి,  గర్భగుడిలో శివలింగం ఉంది.

గర్భగుడి ప్రవేశ ద్వారం ద్వారపాలకుల 

తో పాటు గంగా మరియు యమున విగ్రహాలు ఉంటాయి.


💠 ఆలయ మండపాన్ని బ్రహ్మ, కృష్ణుడు, సరస్వతి, మహిషాసురమర్థిని  మరియు గజలక్ష్మి చిత్రాలతో అలంకరించారు.

 

💠 ఆలయాన్ని చూడటం చాలా బాగుంటుంది మరియు చాలా శిల్పాలు 1000 సంవత్సరాలకు పైగా మనుగడలో ఉన్నాయి.

ఆలయం చుట్టూ చెక్కిన శిల్పాలు చూడ ముచ్చటగా ఉంటాయి.  పైభాగంలో దేవతలు, దేవతలు కొలువుదీరిన చోట, మరోవైపు ఖజురహో తరహాలో శృంగార రసాన్ని నింపి వివిధ భంగిమల్లో నాయికలు దర్శనమిస్తున్నారు.


💠 ప్రవేశ ద్వారం వద్ద ఒక చిన్న వరండా ఉండేదని అంచనా వేయబడింది, దాని తర్వాత అష్టభుజి మహామండపం / సభామండపం / జగమోహన్ గోపురం, ఆపై ఒక అంతరాలయం మరియు గర్భగుడి ఉంటుంది.  గోపురం లోపలి నుండి చూసేటప్పుడు, ఇది అనేక వృత్తాకార స్తంభాలతో తయారు చేయబడింది మరియు వివిధ బొమ్మలతో అలంకరించబడింది.

 

💠 రాయ్‌పూర్‌ నుండి సుమారు 200 కి.మీ.  దూరం మరియు బిలాస్‌పూర్  నుండి 60 కి.మీ.  దూరం.

జగతికి జీవన సుగతుల


: *కం*

జగతికి జీవన సుగతుల

భగవద్గీత ను నొసగిన భగవంతుండా

నిగమాగమ మూర్తునిగా

జగమంతయు నీకు మ్రొక్కు జయ శ్రీ కృష్ణా.

*అందరికీ శ్రీ శోభకృన్నామ సంవత్సర శ్రీ కృష్ణ జన్మాష్టమీ,గోకులాష్టమీ శుభాకాంక్షలు.*


*కం*

ఇతరుల పై ద్వేషముతో

సతతము రగిలెడి జనులకు సౌఖ్యం బెపుడున్

మితమై జీవితమంతయు

హుతమగు చుండును నిరతము హోరుగ సుజనా.

*భావం*:-- ఓ సుజనా! ఇతరుల పై ద్వేషం తో ఎల్లప్పుడూ రగిలిపోతున్న వారి సౌఖ్యం తరిగి పోయి జీవితమంతా వేగంగా నాశనమగును.

*** *కొంపెల్ల శ్రీనివాస శర్మ*

Digital Medicine for Heart*

 *TODAY TAMIL NADU  BREAKING NEWS*


*Digital Medicine for Heart*

(Heart can be recycled without cardiac transplant)


Ultra modern English medicine without knife and blood.


*1) No angiogram *


*2) No bypass surgery*


*3) No angioplasty or stent*


Two super modern machines have been discovered

*1)CT-700*

*2)EECP*


*1) The most modern machine called CT-700 has been discovered to detect heart blockage without angiogram*..


Two minutes is enough for this.

No need to stay in hospital for this


This cost is also less

This is done in two places only in Chennai.


Early heart blockage detection in early stages

There is a great chance of healing through pills..


And that now

*2) Heart can be cured and recycled without bypass surgery and stent through the sophisticated machine called EECP*.


Government approved medical system


To know the truth

* Sri Vivekananda Hospital *

Chennai

08925015666

08778463371

09500037040

04443192129


*DR.G. Vivekanandan* in Doctors Conference Interview

This is the news published


Millions of diabetes and heart patients benefited from this.


Share this to everyone you know without any block.


One share can save lives of many heart patients

Thank you 🙏🙏🙏

Stichakrarchana -Sri sarmada







 

బసవ పురాణం - 26 వ భాగము...!

 🎻🌹🙏బసవ పురాణం - 26 వ భాగము...!!


🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿


🌹కళియంబ నయనారు కథ🌹


🌸పూర్వం కళియంబ నయనారు అనే శివభక్తుడు ఉండేవాడు. నిరంతరం శివుణ్ణి నవ్వించడం తన నియంగా పెట్టుకొని ఆ వ్రతం యథావిధిగా నిత్యమూ సాగించి తరించాడు.


🌿సకలేశ్వరు మాదిరాజయ్య కథ

శ్రీ సకలేశ్వరు మాదిరాజయ్యగారనే భక్తుడు ఉండేవాడు. ఆయన వీణా వాదనంతో శివుణ్ణి ఆనందపరుస్తూ అర్చన చేస్తూ వుండేవాడు. 


🌸మల్లరసు అనే రాజు రాజ్యం త్యజించి శ్రీశైలం వద్ద తపస్సు చేసుకుంటూ వుండగా ఆయనను చూడాలని మాదిరాజయ్యగారు శ్రీశైలం వెళ్లారు. 


🌿(ఇక్కడ శ్రీశైల వర్ణన సుదీర్ఘంగా పాల్కురికి చేశాడు) అక్కడ చెట్లన్నీ రుద్రాక్ష చెట్లే. అక్కడి గనులన్నీ విభూతిగనులే. అక్కడి నీళ్లన్నీ లింగ తీర్థములే. 


🌸అక్కడి సమస్త సృష్టీ శివ పూజామయమే. అటువంటి చోటికి వచ్చి మల్లరుసు కోసం వెదుకసాగాడు. మల్లికార్జునాచార్యుడుమాదిరాజయూను పరీక్షించాలని తన దేహాన్ని భూమ్యాకాశాలు పట్టనంతగాపెంచాడు.


🌿మాదిరాజయ్య మల్లికార్జునుని తల కోసం మూడేళ్లు ప్రయాణం చేసి అలసిపోయాడు. పాదాభివందనం చేయకుండా ఉండడమెట్లా అని 


🌸మల్లికార్జునుని పాదాల కోసం మాదిరాజయ్య ప్రయాణం చేసి ఎనిమిదేళ్లు నడచి విసిగిపోయాడు. అప్పుడు భయభ్రాంతుడై స్వామీ! మిమ్మెరుగ నేనెంతవాడిని అని ప్రణామం చేశాడు. 


🌿మల్లికార్జునుడు చిరునవ్వు నవ్వి తన మామూలు రూపం ధరించి మాదిరాజును ఆదరించాడు. మాదిరాజు తాను అక్కడనే ఉండాలని కోరికను వ్యక్తపరచాడు. 


🌸మల్లికార్జునుడు మాదిరాజయ్యను ఒక తుమ్మ చెట్టుగా మార్చి నిశ్చలంగా తపస్సు చేసుకోమన్నాడు. మాదిరాజు తపసు చేసుకుంటున్నాడు. 


🌿ఒకనాడు మల్లికార్జునుడు గొల్లని వేషం ధరించి వచ్చి తుమ్మ కొమ్మలు కొట్టబోగా ఒరే! గొల్లడా! నీకు బుద్ధిలేదా’ అని మాదిరాజు తుమ్మచెట్టు రూపంలోనే ఉండి కోప్పడ్డాడు. 


🌸అప్పుడు గొల్లని రూపం వదిలి మల్లికార్జునుడు ‘నీవేమి తపసివి! కోపం పోలేదే’ అని పరిహసించాడు. మాది రాజయ్య దుఃఖించాడు. మల్లయ్య మాదిరాజును కౌగలించుకొని ఆయనకు మామూలు రూపమిచ్చి భూమి మీదికి బసవడనే భక్తుడు వచ్చి వున్నాడు. 


🌿నీవు అక్కడికి పోయి ఆయనతో కలిసి గోష్ఠి చేయవలసిందిఅనిచెప్పాడు. మాదిరాజు మల్లయ్యకు శరణు చేసి శ్రీగిరినుండి కల్యాణం వచ్చి అక్కడ బసవన్నను కలిశాడు. 


🌸బసవన్న మాదిరాజును ఆదరించి సమస్త పూజలతోనూ తృప్తిపరిచాడు.

శంకరదాసి కథ(చతుర్థాశ్వాసం బసవన్నకుమాచయ్య చెప్పిన కథ)

పూర్వం శంకరదాసి అనే శివభక్తుడు ఉండేవాడు. 


🌿కాయకంతో ధనం సంపాదించి జంగమార్చన చేసేవాడు. ఇలా ఉండగా ఒకనాడు దేడర దాసయ్య అనే భక్తుడు శంకర దాసి ఇంటికి వచ్చి చూచి అయ్యో! ఇతని ఇంట్లో ఒక్క ధాన్యపు గింజ కూడా లేదే! 


🌸ఈ పేదరికం ఎలా భరిస్తాడు? అని భావించి దుగ్గళవ్వకు చెప్పి గంపెడు ధాన్యం పంపాడు. తర్వాత శంకరదాసి వచ్చి ఈ సంగతి తెలుసుకొని చిరునవ్వు నవ్వి ఆ ధాన్యాన్ని తన గుప్పెట్లోకి తీసుకున్నాడు. 


🌿ధాన్యమంతా గుప్పెట్లో మాయమై పోయింది. ఇది చూచి దుగ్గళవ్వ శంకరదాసి మహాత్ముడు. ఆజ్ఞతతో ఆయనకు ధాన్యం పంపడం మనదే తప్పు. శివుణ్ణి మెప్పించి మూడవ కన్ను బడసినవాడు శంకరదాసి. 


🌸జగదేకమల్లుడు అనేవాడు శంకరదాసిని పరీక్షిద్దామని కల్యాణ నగరం నడి వీధిలో ఉక్కుతో విష్ణు ప్రతిమ చేసి దానిపై పంచలోహాల పోత పోసి నిలిపాడు. అయితే శంకరదాసి దృష్టి సోకగానే ఆ ప్రతిమ ముక్కలై పేలిపోయిందిఅని చెప్పింది. 


🌿అప్పుడు దేడర దాసయ్య, దుగ్గళవ్వ శంకరదాసి పాదాలపై బడి తమ అహంకారాన్ని మన్నింపుమని వేడారు. శంకరదాసి చిరునవ్వు నవ్వి ఒక చోట నేల త్రవ్వమని చెప్పాడు. అక్కడ తవ్వేసరికి భూమిలో నుండి నిధి నిక్షేపాలు బయటకు వచ్చాయి.


🌸దానితో దేడర దాసయ్య, దుగ్గళవల్ల గర్వరహితులైనారు.సిరియాలుని కథ

(చతుర్థ- మాచయ్య బసవనికి చెప్పినది)కంచిలో సిరియాలుడనే భక్తుడు ఉండేవాడు. 


🌿ఆయన సెట్టి. ఈయననే చిరుతొండడనీ అంటారు. నిత్యమూ ఐదుగురు జంగమయ్యలను అర్చించి లింగావసరం తీర్చకుండా తాను భోజనానికి కూర్చునేవాడు కాడు. ఇలా వుండగా పరమేశ్వరుడు సిరియాలుణ్ణి పరీక్షింపదలచాడు....సశేషం..🚩🌞🙏🌹🎻


🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿

Jai


 

శ్రీకృష్ణావతారం

 ॐ    శ్రీకృష్ణావతారం - కొన్ని ముఖ్య అన్వయాలు 


    దేవకీదేవి అష్టమ గర్భంలో అవతరించాడు.

    నందగోపునివద్ద పెరిగాడు.


* వెన్నముద్దలు కాజేశాడు 


నవనీతమ్ - "నవ" అంటే "కొత్తగా", 

                    "నీతమ్" అంటే -పొందబడింది" 

    అంటే, ఈ జన్మలో మనం ప్రోగు చేసుకొనే కర్మ. 

    జన్మాంతర సంబంధమైన వాసన పాతది. 


నవనీతచోరుడు - ఈ జన్మలో మనకి కోరికలు కలగజేసే కర్మల దోషాలు (ప్రార్థనతో) హరిస్తాడని అంతరార్థం.


* కాళీయమర్దనం 


కాళీయుడు - తమో గుణం 


వ్యాపించేది మాయ.

    మాయకు మూలస్థానమైన వాసనా బీజం అయిన "కదంబ వృక్షం" నుండి దూకి తమోగుణంమీద నృత్యం చేశాడు.

    పాదాలు శిరస్సుపై పెట్టుకుంటే, ఆ పాద ముద్రలు చూస్తే, "గరుడుడు"(వేదం) ఏమీ చేయలేడు - అంటాడు. 

    అంటే వేదం కర్మలు చెబుతుంది కదా! 

     స్వామి పాదముద్రలు శిరసున ఉంచుకొని, ఆయనని ఆశ్రయిస్తే,    

     కర్మ ఫలాలతో సంబంధంలేకుండా, అనుగ్రహిస్తాడనేది సందేశం. 


* గోపికా వస్త్రాపహరణం 


గోపికలు - ఇంద్రియాలు

  - వాసనా తత్త్వం కలిగిన ఇంద్రియాలు నీటిలో మునిగియున్నాయి. 

  - గుడ్డలు విడిచినా(మాయ తొలగినా) మళ్ళీ ప్రాపంచిక మాయలో పడతాయి. 

  - మాయను కృష్ణుడు స్వాధీనపరచుకుంటే,

   "నీరు" - అంటే "అజ్ఞానం".  

    దాని నుండీ బయటకు వస్తే తప్ప వస్త్రాలు ఇవ్వను అన్నాడు.

    ఆయన చేతినుంచీ వచ్చేది "జ్ఞానం".

    లోకంలో వచ్చేది మాయ.


కృష్ణః 


 కర్షతీతి కృష్ణః

 - ఆకర్షించే స్వభావం ఉన్నవాడు. 


                      =x=x=x=


    — రామాయణం శర్మ

            భద్రాచలం

నవగ్రహ పురాణం - 49 వ అధ్యాయం*

 *నవగ్రహ పురాణం - 49 వ అధ్యాయం*

🪷🪻🌿🪷🪻🌿🪷🪻🌿🪷🪻🌿🪷


*బుధగ్రహ జననం - 12*



*"బ్రహ్మదేవుల అభిప్రాయంతో నేను సంపూర్ణంగా ఏకీభవిస్తున్నాను !"* అంగీరసుడు. లేచి , ప్రకటించాడు. 


*"సౌభాగ్యవతి తారను నేను ప్రశ్నిస్తాను. శిశువు జన్మ రహస్యాన్ని ఛేదిస్తాను !"* అంటూ బ్రహ్మ తార వైపు చూశాడు. *"తారా ! నీ కుమారుణ్ణి తీసుకొని... ఆ కక్ష్యాంతరం లోనికి రా !"*


తార లేచి , శిశువును రెండు చేతుల్తో ఎత్తుకుని , బ్రహ్మ వెంట వెళ్ళింది. అందరూ ఆసక్తిగా వాళ్ళిద్దరూ వెళ్ళిన వైపే చూస్తున్నారు. బృహస్పతీ , చంద్రుడూ ఇద్దరూ సగర్వంగా చిరునవ్వులు నవ్వుకుంటున్నారు.


క్షణాలు గడుస్తున్నాయి. తార ముందుగా వచ్చింది. ఆమె చేతులలో బాలుడు లేడు. బాలుణ్ణి తన చేతుల్తో , ఎత్తుకుని బ్రహ్మ నామకరణ వేదిక వద్దకు వచ్చి , నిలుచుని , అందర్నీ మౌనంగా కలియజూశాడు. గంభీరమైన కంఠంతో ఇలా అన్నాడు. 


*"ప్రతీ శిశువుకూ తండ్రి ఎవరో సందేహరహితంగా నిరూపించబడాలి. ఆ ధర్మాన్ని తారకు వివరించాను. తన వొడిలోని శిశువు తండ్రి ఎవరో - నిర్భయంగా వెల్లడించ మన్నాను. ఈ బాలకుడు ఎవరు ? బృహస్పతి తనయుడా ? చంద్రుడి తనయుడా ? చెప్పమని ఆమెను ఆజ్ఞాపించాను. ఇప్పుడు మాతృమూర్తిగా ఉన్న తార తాను ప్రసవించిన బిడ్డడి తండ్రి ఎవరో ప్రమాణపూర్వకంగా విన్నవించింది..."* ఉత్కంఠతో చూస్తూన్న అందర్నీ కలియజూస్తూ బ్రహ్మ క్షణకాలం ఆగాడు. 


*"ఈ బాలకుడి తండ్రి చంద్రుడు!"* బ్రహ్మ కంఠం అక్కడ ప్రతిధ్వనించింది. *"ఈ శిశువు చంద్రునికే సంక్రమించాలి. మీ అందరి సమక్షంలో ఈ బాలుడికి 'బుధుడు' అని నేనే నామకరణం చేస్తున్నాను. జనకుడైన చంద్రుడికి అప్పగిస్తున్నాను !”* 


బృహస్పతి నిశ్చేష్టుడై అలా చూస్తూ ఉండిపోయాడు. చంద్రుడు బ్రహ్మకు నమస్కరించి బాలుణ్ణి స్వీకరించాడు.


*"చంద్రా ! ఈ బుధుడు నీ కుమారుడు. భవిష్యత్తులో ఇతడు నవగ్రహాలలో ఒకడుగా నియమితుడవుతాడు. తీసుకువెళ్ళి పెంచు , పోషించు ; విద్యతో పెంపొందించు 0!"* అన్నాడు. బ్రహ్మ చంద్రుడితో.


*"బుధుణ్ణి విద్యాభ్యాసం కోసం , మా జనకులు అత్రిమహర్షికి అప్పగిస్తాను. అందుకు మీరు అనుమతించాలి”* చంద్రుడు బ్రహ్మను అభ్యర్ధించాడు.


*"అనుమతి లభించింది. ఇక వెళ్ళు !"* బ్రహ్మ ఆజ్ఞాపించాడు. 


చంద్రుడు పురిటిబిడ్డతో వెళ్తున్నాడు. తార కన్నీళ్ళతో మసకబారిన చూపుల్ని పసివాడి మీదే నాటింది.


*"బృహస్పతీ !"* బ్రహ్మ పిలిచాడు. *"నిరాశ వద్దు ! నీ వంశం నీ సంతతితోనే వృద్ధి చెందాలి ; చెందుతుంది ! చంద్రుణ్ణి , బుధుణ్ణి మరిచిపో. తార నీకు వారసుల్ని బహూకరిస్తుంది."* 


బృహస్పతి మౌనంగా నమస్కరించాడు. అప్పటి దాకా చలనం లేకుండా అందరూ అటూ ఇటూ కదిలారు.


*"ఇప్పుడు.. ఆదిత్యాయచ సోమాయ..." క్రమంలోకి వెళ్ళి నవగ్రహదేవతలలో మిగిలిన ముగ్గురి జన్మ వృత్తాంతాలు శ్రవణం చేద్దాం..."* శిష్యులను ఉద్దేశించి అన్నాడు. నిర్వికల్పానంద.


*"గురువు గారూ , అయితే మీరిప్పుడు శని జన్మవృత్తాంతం చెప్పాలి !"* సదానందుడు ఉత్సాహంగా అన్నాడు.


*"ఔను ! శని నవగ్రహాలలో ఎన్నికెక్కిన ఏడవ గ్రహం. ఆయన ఆవిర్భావ నేపథ్యం చిత్రవిచిత్రంగా ఉంటుంది. అబ్బురపరిచే సంఘటనల సమాహారం అది. శని సూర్యుడి కుమారుడు. అంచేత ఒక్కసారి సూర్య చరిత్రలోకి - వెనక్కి వెళ్దాం. సూర్యుడికి విశ్వకర్మ కూతురు సంజ్ఞతో వివాహం జరిగిన కథా , ఏకాంత మందిరంలో సూర్య దంపతులు కాపురం ప్రారంభించిన సంగతీ , తనకు ఇద్దరు కుమారుల్నీ , ఒక కుమార్తెను ప్రసాదించమని సంజ్ఞ కోరిన విషయం - మనం చెప్పుకున్నాం. సంజ్ఞ కోరినట్టుగానే సూర్యుడామెకు ముగ్గురు పిల్లలను అనుగ్రహించాడు...”*


*"ఓహో... ఆ ముగ్గుర్లో, మన శని ఒకడన్నమాట !"* శివానందుడు ఉత్సాహంగా అన్నాడు.


నిర్వికల్పానంద చిన్నగా నవ్వాడు. *“కాదు , శివానందా ! వాళ్ళు ముగ్గురూ ఎవరంటే జ్యేష్ఠ పుత్రుడైన వైవస్వతుడు , రెండవవాడైన యముడూ , కుమార్తె 'యమి' అనే వాళ్ళు ! ఆ వైవస్వతుడే వైవస్వత మనువు. సూర్యుడి ద్వాదశ నామధేయాల్లో 'వివస్వంతుడు' అనేది ఒకటి. వివస్వంతుని పుత్రుడైన కారణంతో సూర్యుడి పెద్దకొడుకు 'వైవస్వతుడు' అయ్యాడు. ఇక్ష్వాకుడూ , నగుడూ , శర్యాతీ మొదలైన సూర్యవంశ పురుషులందరూ ఆ వైవస్వతుడి సంతతే ! సూర్యవంశపాలన. ఆయనతోనే ప్రారంభం!


*"ఇక - రెండవ కుమారుడు యముడు. ఆయనే మన యమధర్మరాజు. మిగిలింది కుమార్తె యమి. ఆమే యమునా నదిగా మారిపోయింది..."*


*"గురువుగారూ , అయితే శని వాళ్ళ తమ్ముడుగా తదనంతరం జన్మించాడా ?"* విమలానందుడు అడిగాడు.


*"వినిపిస్తాను , వినండి ! తల్లిదండ్రుల పోషణలో వైవస్వతుడూ , యముడూ , యమీ పెరుగుతున్నారు. మన ప్రస్తుత కథాకాలానికి వాళ్ళింకా బాల్యావస్థలోనే ఉన్నారు. ఒకనాటి రాత్రి ఏమైందంటే..."* అంటూ చెప్పసాగాడు నిర్వికల్పానంద.




*రేపటి నుండి శనిగ్రహ జననం ప్రారంభం*

బయటేమీ లేదు*

 *యెవరో చాల బాగా రాశారు*.

    

                  *విత్తనం తినాలని*

                 *చీమలు చూస్తాయ్*.. 

                *మొలకలు తినాలని*

                 *పక్షులు చూస్తాయ్*..

           

                 *మొక్కని తినాలని*

                *పశువులు చూస్తాయ్*


                 *అన్ని తప్పించుకుని*

             *ఆ విత్తనం వృక్షమైనపుడు*..


            *చీమలు, పక్షులు, పశువులు*..

         *ఆ చెట్టుకిందకే నీడ కోసం వస్తాయ్*....


            *జీవితం కూడా అంతే TIME*

          *వచ్చే వరకు వేచివుండాల్సిందే*

          *దానికి కావాల్సింది ఓపిక మాత్రమే*.....        


               *లైఫ్ లో వదిలి వెళ్ళిన*

           *వాళ్ళ గురించి ఆలోచించకు*..


              *జీవితంలో ఉన్న వాళ్ళు*

              *శాశ్వతం అని భావించకు*..


           *ఎవరో వచ్చి నీ బాధను అర్థం*

           *చేసుకుంటారని ఊహించకు*...


              *నీకు నీవే ధైర్యం కావాలి*.....

          *నీకు నువ్వే తోడుగా నిలబడాలి*...


                  *లోకులు కాకులు,*

                 *మనిషిని చూడరు*,

              *మనస్సును చూడరు,*

              *వ్యక్తిత్వాన్ని చూడరు.*


                     *కనిపించింది,*

            *వినిపించింది నమ్మేస్తారు*,

                 *మాట అనేస్తారు,*


                 *ఒక్కోసారి మన కళ్ళే*

              *మనల్ని మోసం చేస్తాయి.*


           *మరొకసారి చెప్పుడు మాటలు*

                        *జీవితాలను*

                  *తలకిందులు చేస్తాయి*


             *అబద్దాలతో, మోసాలతో*

                   *కీర్తి, ప్రతిష్టలను*

         *ఎంత గొప్పగా నిర్మించుకొన్నా*..

          *అవి కుప్పకూలి పోవడానికి*

               *ఒక్క "నిజం"చాలు*.

             *అందుకే కష్టమైనా సరే*

          *నీతిగా బ్రతకడమే మనిషికి*

                  *ఉత్తమ మార్గం.*

         

                *ఒక చిన్న మొక్కనాటి*

      *ప్రతిరోజూ వచ్చి కాయకాసిందా అని*      

                   *చూడకూడదు.*


             *ఎందుకంటే అది పెరగాలి*

                *మొక్క వృక్షం కావాలి*

          *పుష్పించాలి, పిందెలు రావాలి*

         *అవి కాయలై , పండితే తినగలం.*


              *అలాగే నేను ఇది కావాలి*

              *అనే కోరిక కూడా మొలకై*

       *వృక్షమై ఫలవంతం ఔతుందని తెలిసి*    

         *మసలుకోండి*


               *జీవితంలో కష్టము,*

             *కన్నీళ్ళు, సంతోషము,*

        *బాధ ఏవి శాశ్వతంగా ఉండవు*,


     *కాలం ఎప్పుడూ ఒకేలా ఉండిపోదు.*

       *ఆనందం, ఆవేదన కూడా అంతే.*


              *నవ్వులూ, కన్నీళ్ళూ*

              *కలగలసినదే జీవితం*


             *కష్టమూ శాశ్వతం కాదు,*

       *సంతోషమూ శాశ్వతమూ కాదు.*


                   

    


                      *ఓడిపోతే*

            *గెలవడం నేర్చుకోవాలి*,


                     *మోసపోతే*

       *జాగ్రత్తగా ఉండడం నేర్చుకోవాలి*


                  *చెడిపోతే ఎలా*

           *బాగుపడలో నేర్చుకోవాలి,*


         *గెలుపును ఎలా పట్టుకోవాలో*

                *తెలిసిన వాడికంటే*

                   *ఓటమిని ఎలా*

          *తట్టుకోవాలో తెలిసిన వారే*

               *గొప్ప వారు నేస్తమా* !


              *దెబ్బలు తిన్న రాయి*

            *విగ్రహంగా మారుతుంది*


              *కానీ దెబ్బలు కొట్టిన*

             *సుత్తి మాత్రం ఎప్పటికీ*

          *సుత్తిగానే మిగిలిపోతుంది*....


          *ఎదురు దెబ్బలు తిన్నవాడు*,

         *నొప్పి విలువ తెలిసిన వాడు*

          *మహనీయుడు అవుతాడు*...


       *ఇతరులను ఇబ్బంది పెట్టేవాడు*

    *ఎప్పటికీ ఉన్నదగ్గరే ఉండిపోతాడు*...

    

         

  


                 *డబ్బుతో ఏమైనా*

           *కొనగలమనుకుంటున్నారా*

             *అయితే కొనలేనివి ఇవిగో*


            *మంచం పరుపు కొనవచ్చు*

                    *కానీ నిద్ర కాదు*


                 *గడియారం కొనవచ్చు*

                    *కానీ కాలం కాదు*


                  *మందులు కొనవచ్చు*

                   *కానీ ఆరోగ్యం కాదు*


                  *భవంతులు కొనవచ్చు* 

                   *కానీ ఆత్మేయిత కాదు*


                   *పుస్తకాలు కొనవచ్చు*

                      *కానీ జ్ఞానం కాదు*


          *పంచభక్ష పరమాన్నాలు కొనవచ్చు*

                     *కానీ జీర్ణశక్తిని కాదు*

                    

      


        *ఆకులు తింటేనే బ్రహ్మజ్ఞానం వస్తే*

      *అందరి కన్నా ముందు మేకలే జ్ఞానులు*

                          *కావాలి,*


       *స్నానాలతోనే పాపాలు పోతే ముందు*

           *చేపలే పాప విముక్తులు కావాలి,*


           *తలక్రిందులుగా తపస్సు చేస్తేనే*

          *పరమాత్మ ప్రత్యక్షమైతే ముందు*

             *గబ్బిలాలకే ఆ వరం దక్కాలి,*


           *ఈ విశ్వమంతా ఆత్మలో ఉంది*

  *నీలో ఉన్న ఆత్మను వదిలి పరమాత్మ అంటూ*

       *పరుగులు పెడితే ప్రయోజనమే లేదు*,


             *నీలో లేనిది బయటేమీ లేదు* 

          *బయటఉన్నదంతా నీలోనూ ఉంది*


        *తెలిసి మసులుకో  --  కలిసి జీవించు.....*

             *సర్వే జనా సుఖినోభవంతు*

 *మీ ఉల్లిగడ్డల శివకుమార్* *సీనియర్ జర్నలిస్ట్* ✍️🙏🙏

సాంఖ్య యోగః 🌸* *2-అధ్యాయం, 21వ శ్లోకం*

 🕉️🪷 *ఓం శ్రీ కృష్ణపరబ్రహ్మణే నమః* 🪷🕉️

 *🪷 శ్రీ మద్భగవద్గీత🪷* 

 *🌸 అథ ద్వితీయోధ్యాయః 🌸* 

 *🌸 సాంఖ్య యోగః 🌸* 

 *2-అధ్యాయం, 21వ శ్లోకం* 


 *వేదా వినాశినం నిత్యం య ఏనమజమవ్యయమ్ |* 

 *కథం స పురుషః పార్థ కం ఘాతయతి హంతి కమ్|| 21* 


 *ప్రతిపదార్థం*


వేద = తెలుసుకున్న; అవినాశినం = నాశము కానిది; నిత్యం =నిత్యమైనది; యః = ఎవరైతే; ఏనమ్ = ఇది; అజమ్ = జన్మ లేనిది; అవ్యయమ్ = తరగనిది; కథం —=ఎట్లా; సః = అది; పురుషః = పురుషుడు; పార్థః = పార్థా; కం = ఎవరిని; ఘాతయతి = చంపే కారణం ; హంతి = చంపును; కమ్ = ఎవరిని?


 *తాత్పర్యము* 


 ఓ పార్థ ఈ ఆత్మ నాశరహితము, నిత్యము అని యు, జనన మరణములు లేనిదనియు, మార్పు లేనిదనియు తెలిసి కొన్ని నా పురుషుడు ఎవరిని ఎట్లు చంపించును? ఎవరిని ఎట్లు చంపును.


 *సర్వేజనా సుఖినోభవంతు* 

 *హరిః ఓం 🙏🙏*

అంతర్జాతీయ అక్షరాస్యతా దినోత్సవం"*

 🍁🍁🍁🍁🍁🍁🍁🍁

*ఈరోజు (08-09-2023) "అంతర్జాతీయ అక్షరాస్యతా దినోత్సవం"*

🍁🍁🍁🍁🍁🍁🍁🍁


*సాంప్రదాయకంగా భాషను ఉపయోగించేందుకు అవసరమైన చదవటం, రాయటం, వినటం, మాట్లాడటం అనే నాలుగు ప్రాథమికాంశాలు తెలుసుకోవటాన్నే అక్షరాస్యత అనవచ్చు.* 


*అయితే.......* 


*రాయడం, చదవటం మాత్రమే అక్షరాస్యత కాదనీ.. గౌరవం, అవకాశాలు, అభివృద్ధి గురించి చెప్పడమే నిజమైన అక్షరాస్యత అని కొంతమంది పెద్దలు చెబుతుంటారు.*


*ప్రపంచం అన్నిరంగాల్లో ముందుకు సాగేందుకు విద్య, విజ్ఞానం ఎంతో అవసరం. ఉన్నతమైన జీవనానికి ఇవి ఎంతో ముఖ్యం. నేడు మనం "అంతర్జాతీయ అక్షరాస్యతా దినోత్సవం" జరుపుకుంటున్న సందర్భంగా........*


*ప్రతి యేడాది సెప్టెంబర్ 8వ తేదీని "అంతర్జాతీయ అక్షరాస్యతా దినోత్సవం"గా జరుపుకోవడం ఆనవాయితీ.* 


*1965వ సంవత్సరం, నవంబర్ 17వ తేదీన యునెస్కో సభ్యదేశాల విద్యాశాఖా మంత్రుల మహాసభ అనంతరం.. "అంతర్జాతీయ అక్షరాస్యతా" దినోత్సవం ప్రకటించబడింది.* 


*ఆ తరువాత 1966వ సంవత్సరం నుండి ప్రతి యేడాదీ క్రమం తప్పకుండా జరుపుకుంటున్నాం.*


*ప్రపంచంలోని కొన్ని దేశాలు అన్ని రకాలుగా వెనుబడి ఉండటానికి నిరక్షరాస్యత ముఖ్య కారణంగా చెప్పవచ్చు.*


*అంతర్జాతీయ అక్షరాస్యతా దినోత్సవం ముఖ్య ఉద్దేశ్యం ఏంటంటే...* 


*అక్షరాస్యతను వ్యక్తులు మరియు సంఘాలకు అందించటం. ఇది పిల్లల్లో విద్యపైనేగాకుండా, వయోజన విద్యమీద కేంద్రీకరించ బడుతుంది.*


*అదలా ఉంటే........*


*ఐక్య రాజ్య సమితి విద్యా, విజ్ఞాన (శాస్త్రీయ) మరియు సాంస్కృతిక సంస్థ (యునెస్కో), ఐక్యరాజ్యసమితికి చెందిన ఒక ప్రధాన అంగము. ఇది ఓ ప్రత్యేక సంస్థ కూడా. దీనిని 1945లో స్థాపించారు. ఈ సంస్థ తన క్రియాశీల కార్యక్రమాలలో శాంతి, రక్షణలకు తోడ్పాటునందించటమేగాక... అంతర్జాతీయ సహకారంతో విద్య, విజ్ఞానం, సాంస్కృతిక పరిరక్షణ కోసం పాటుపడుతుంది.*


*193 మంది సభ్యులు, ఆరుగురు అసోసియేట్ సభ్యులు కలిగిన యునెస్కో ప్రధాన కేంద్రం ఫ్రాన్స్‌ రాజధాని పారిస్‌లో ఉంది. దీని ప్రధాన అంగాలు మూడు.* 


*వాటిలో........* 


*మొదటిది తన పాలసీ తయారీ కోసం,*


*రెండవది అధికార చెలామణి కోసం*


*మూడవది దైనందిన కార్యక్రమాల కోసం పాటుపడుతాయి.*


*యునెస్కో తన తన కార్యక్రమాలను 5 రంగాలలో నిర్వహిస్తుంది, అవేంటంటే... విద్య, ప్రకృతి విజ్ఞానం, సామాజిక మరియు మానవ శాస్త్రాలు, సంస్కృతి, మరియు కమ్యూనికేషన్లు మరియు ఇన్ఫర్మేషన్. యునెస్కో, విద్య ద్వారా "అంతర్జాతీయ నాయకత్వం" కొరకు అవకాశాల కల్పనలో తన వంతు కృషి చేస్తుంది. దీని ప్రధాన ఉద్దేశ్యం... వివిధ దేశాలలో విద్యావిధానలను క్రమబద్ధీకరించడం, ట్రైనింగ్ రీసెర్చ్‌లు చేపట్టడం.*


*యునెస్కో ప్రజా ప్రకటనలిచ్చి, ప్రజలను చైతన్యవంతం చేస్తుంది. సాంస్కృతిక మరియు శాస్త్రీయ ఉద్దేశ్యాలు కలిగిన ప్రాజెక్టులను చేపడుతుంది. "భావ వ్యక్తీకరణ స్వాతంత్ర్యాన్ని, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని ప్రోత్సహిస్తుంది. మీడియా ద్వారా, సాంస్కృతిక భిన్నత్వాలను తెలియజేసి, రాజకీయ సిద్ధాంతాలను తయారుజేయడం. వివిధ ఈవెంట్‌లను ప్రోత్సహించడం.. లాంటివి చేస్తుంది.*


*కాగా.........*


*యునెస్కో 1990 సంవత్సరాన్ని అక్షరాస్యతా సంవత్సరంగా ప్రకటించింది. ఇక ఐక్యరాజ్య సమితి అయితే 2003-2012 దశాబ్దాన్ని అక్షరాస్యతా దశాబ్దంగా ప్రకటించింది.* 


*"లిటరసీ ఫర్ ఆల్, వాయిస్ ఫర్ ఆల్, లెర్నింగ్ ఫర్ ఆల్" అనే అంశాల్ని ఈ దశాబ్ది లక్ష్యంగా నిర్దేశించింది.*


*ఆ సంగతలా పక్కనబెడితే...*


*ప్రపంచంలో అభివృద్ధి చెందుతున్న ఇతర దేశాలతో పోలిస్తే అక్షరాస్యత విషయంలో భారతదేశం అగాథంలో వున్నట్లే చెప్పవచ్చు.* 


*ఈ మాత్రమైనా మనదేశ అక్షరాస్యత ఉందంటే దానిక్కారణం కొన్ని రాష్ట్రాలు అక్షరాస్యతను సాధించటంలో ముందుండటం తప్ప మరోటి కాదు. బీహార్, ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రాలు సగటు అక్షరాస్యతా శాతానికి దూరంగా ఉన్న విషయం తెలిసిందే.* 


*మొత్తం మీద ప్రపంచ నిరక్షరాస్యుల్లో సగం మంది మనదేశంలోనే ఉండటం విచారకరం.*




*నారాయణ రావు పీవీయస్*

*విశ్రాంత ఉపాధ్యాయులు*

*కొత్తపాళెం*


🍁🍁🍁🍁🍁🍁🍁🍁

మహనీయుని మాట

 *

 -------------------

🌻 *మహనీయుని మాట*🍁

        -------------------------

*"జీవితంలో మన మీద మనకి నమ్మకం ఉండి మంచి సంకల్పం మంచి ఆలోచనలతో ఏ కార్యం తలపెట్టిన విజయం లభిస్తుంది."*

       --------------------------

🌹 *నేటి మంచి మాట* 🌼

      ---------------------------

*"మంచివారు శత్రువుకు కూడా సాయం చేస్తారు. చెడ్డవారు తోడబుట్టిన వారికి కూడా హాని చేస్తారు. కాబట్టి మంచివారు కఠినంగా మాట్లాడినా వారిని దూరం చేసుకోకూడదు. ఎందుకంటే వారి మాటల్లో కఠినత్వం ఉన్నా చేతల్లో ప్రేమ ఉంటుంది."*

🌻🌻🌻🌻🌻

సటికా వ్రుక్షాయుర్వేధం

 సటికా వ్రుక్షాయుర్వేధం  - ప్రాచీన వృక్ష  వైద్య గ్రంధం .


 * వృక్ష జాతులు అనగా తిన్త్రిని మామిడి మొదలగు చెట్లు ను తీగలుగా మార్చుట 


  బియ్యపు పొడి 1 భాగము , మినుముల 1 బాగము , నలగ దంచిన వడ్ల పిండి 1 భాగము , నువ్వుల పిండి 1 భాగము, వీటిని మాంసము కడిగిన నీళ్లలో కడిగి పసుపు పొడి పోగవేసి పాటి మట్టి నేలలో నాటితే అవి తీగలుగా మారును.


 *  చెట్లు అప్పటికి అప్పుడే పెరిగి చిగుర్చుట  - 


 అంకోల తైలము లొ యే చెట్టు యెక్క బీజములు నైనా నూరు మాట్లు తడిపి వడగండ్లతో కలిపి పాటిమట్టి లొ నాటితే అప్పటికప్పుడే చెట్టు మొలిచి పండ్లు, పువ్వులు ఇచ్చును.


 *  బీజములు తొందరగా మొలుచుటకు  - 


  ఆయా పండ్లు కాచే సమయమున వాటి విత్తనాలు సేకరించి వాటిని బాగుగా ఎండించి పాలలో తడిపి అయిదు దినములు ఎండనించి వాయు లవంగాల కషాయముతో కలిసిన నేతితో పోగవేసి పంచాంగం, బృహతి, నిప్పుల బూడిద ను పాలలొ కలిపి ఆ విత్తనాలను దీనితో పిసికి ఆ ప్రకారము అయిదు రోజులు అయిన పిమ్మట ఆ బీజములు ఆవు పేడతో , ఆవు మూత్రములో ఒక్కో దినము నానబెట్టి విత్తిన మొక్కలు తొందరగా మొలుచును . 

  

 *  చెట్లకు విపరీతముగా పువ్వులు , పండ్లు కాచుటకు - 

 

  చేప మాంసమును , ఆవు పేడతో కలిపి చెట్లకు వేసి యావలు, నువ్వులు , మిణుములు, పెసలు, వులవులు ఈ ఐదింటిని సమబాగాలుగా కలిపి నీళ్లు పోసి వుడకపెట్టి ఆ నీళ్లు చల్లార్చి రెండు దినములు వరసగా చెట్లకు చల్లితే చెట్లు విశేషముగా ఫలించును. 


  మామిడి చెట్లకు నక్క మాంసం , ఉడుము మాంసం లేదా లేడి, పంది మాంసం , రావి చిగుల్లు, మర్రి చిగుల్లు , అత్తి చిగుల్లు, మామిడి చిగుల్లు, నేరేడు చిగుల్లు, కషాయం పెట్టి చల్లార్చి పాదులో పొసిన మంచి పండ్లు పండును. 

 

  మామిడి చెట్టు వేరు దగ్గర చుట్టు గొడ్డలితో కొంచం కాటు చేసి కషాయం పొసిన విశేషమైన ఫలములు ఇచ్చును.


   పెసలు , మినుములు ఉడక పెట్టి చల్లార్చి ఆ నీళ్లు తేట వంచి ఆ గుజ్జు కొబ్బరి చెట్టు వేళ్ళకు పట్టించి ఉప్పు నిండా వేసి ఆ నీళ్లు పోస్తే పెద్ద పెద్ద కాయలు కాయును , కాయలు రాలవు.


  పోక చెట్లకు ప్రతి సంవత్సరం వర్షాకాలంలో పైన ఎండిపోయిన మట్టలు కోసి చెట్ల చుట్టు త్రవ్వి పైన చెప్పిన కషాయము పొస్తే అధికముగా పండును.


  అరటి చెట్టు కు ఏనుగు దంతపు పొట్టు కాల్చిన నిప్పులోగాని, పంది పెంటికలు, గుర్రపు పెంటికలు కాల్చిన నిప్పులో గాని ఇనప సలాకు ఎర్రగా కాల్చి చెట్టు మొదట వేరులో గుచ్చితే చాలా గొప్ప ఫలితాలు ఇచ్చును.


   రేగు చెట్టుకి నువ్వులు , పెసలు సమబాగములు గా చేర్చి దానితో కొంచం అతిమధురం వేసి చెట్టు చుట్టు వేసి మాంసం కడిగిన నీళ్లు పొసిన మరియు నూవుల పిండి , అతిమధురం కలిపి ఎరువు వేసిన తియ్యటి ఫలములు మరియు తియ్యటి ఫలములు ఇచ్చును. 


  పత్తి విత్తనాలను ఆవు పేడలో , ఆవు పంచితములో చాలుమార్లు తడిపి పేడనీళ్ళు చల్లుతూ నాటిన తరువాత పందికొవ్వు, మాంసం కడిగిన నీళ్లు చల్లిన అది తన జాతిని విడిచి నిమ్మ జాతిగా మారును. 


  మామిడి టెంక నాటిన పిదప మొలచిన మొక్క జానెడు వరకు పెరిగిన పిదప చిగురు కత్తిరించిన యెడల నాలుగైదు కొమ్మలు పుట్టి పెరుగును. ఆ కొమ్మలు వ్రేళ్ళు వలె పెరిగిన పిమ్మట నాలుగు కొమ్మలకు నాలుగు జాతుల అంటు మామిడి అంట్లు కట్టిన నాలుగు వైపులా నాలుగు రంగుల కాయలు కాచును. 


   పనస మొక్కకు మామిడి కొమ్మ కట్టి నాటిన మొదటను పనస కాయలును, కొమ్మలకు మామిడి కాయలను కాయును .


   నేరేడు మొక్క యెక్క కొమ్మకు గులాబి, జామ, అంటును కట్టవచ్చు.


   నిమ్మ , దబ్బ , కమలా, నారింజ, ఈ జాతులు ఒక జాతి మొక్కకు అన్ని జాతుల మొక్కలు అంట్లు కట్టవచ్చును.


   పాల మొక్కకు సపోటా, పనస అంటు కట్టవచ్చును.


   పొగాకుకు , గరుడ వాహన , జాజికి చమెలి, గులాభికి  పల్ల సంపెంగి , మాలతికి సాంబ్రాణి అంట్లు కట్టవచ్చు. 


   మల్లె చెట్టు దగ్గర నొక యెర్ర బాడిద కొమ్మను పాతి ఆ కొమ్మ చిగిర్చిన పిదప అడ్డగముగా నొక రంధ్రము చేసి ఆ రంధ్రములో నుండి ఒక మల్లె కొమ్మని తీసి పేడ మన్ను ఆ రంధ్రముని గప్పి నీళ్లు పోయుచుండిన కొంతకాలానికి ఆ రంద్రములో గల కొమ్మకి వేర్లు వచ్చును. పిమ్మట ఆ కొమ్మని మొదటకి కోసి నాటిన మంకెన ( బాడిద  ) పువ్వులు పూయును. 


   పొగడ చెట్టు కొమ్మకు సంపెంగ మొక్కకు అంటు కట్టిన ఒక పక్క పొగడ పువ్వులు , ఇంకో పక్క సంపెంగ పువ్వులు పూయును.


   సూర్య కాంత ( sunflower ) గింజలు పాలలొ 7 మార్లు నానవేసి ఎండబెట్టి నాటి రోజు పాలతో తడుపు చుండిన తెల్లని పువ్వులు పూయును. 


   ఎర్ర గన్నేరుకు , తెల్ల గన్నేరుకు అంటు కట్టిన రెండు రకాల పువులు పూయును.


  ఈ వృక్షాయుర్వేదం అనే అత్యంత అరుదైనది. ఈ వృక్షాయుర్వేదానికి సంబంధించిన మరిన్ని విషయాలు నేను రాసిన గ్రంథాలలో సంపూర్ణంగా వివరించాను.

  


   

స్నానం

 🔴రుషి స్నానం,

🔴దేవ స్నానం,

🔴మానవ స్నానం,

🔴రాక్షస స్నానం...


ఇంతకీ మీది ఏ స్నానం?!

"శ్రీరామ జయ రామ జయజయ రామ"


బారెడు పొద్దెక్కినా నిద్ర లేవ‌కుండా ప‌డుకోవ‌డం ఇపుడు సిటీల‌లోనే కాదు... ప‌ల్లెటూళ్ళ‌లోనూ ఫ్యాష‌న్‌గా మారింది.

అర్థరాత్రి వ‌ర‌కు సినిమాలు, టీవీలు, ఛాటింగుల‌తో గ‌డిపేసి... ఉద‌యం ఎంత‌కీ నిద్ర‌లేవ‌రు.

సూర్యుడు న‌డినెత్తిన చేరిన త‌ర్వాత స్నానం చేస్తుంటారు.

కానీ, ఇది మంచి ప‌ద్ధ‌తి కాదంటున్నాయి శాస్త్రాలు. అస‌లు స్నానం ఎపుడు చేయాలి...?

దాన్నిబట్టి ఉండే ఫ‌లితాలు ఇవిగో...


🚿తెల్లవారుజామున 4-5 గంటల మధ్య స్నానం చేయడం అత్యుత్తమం. దీన్ని ఋషి స్నానం అంటారు.


🚿5 నుంచి 6 గంటల మధ్య చేసే స్నానాన్ని" దేవస్నానం " అంటారు. ఇది మధ్యమం.


🚿 ఇక 6 నుంచి 7 గంటల మధ్య చేసే స్నానాన్ని "మానవ స్నానం "అంటారు. ఇది అధమం.


🚿ఇక 7 గంటల తర్వాత చేసే స్నానాన్ని "రాక్షస స్నానం" అంటారు.

ఇది అధమాతి అధమం.


కాబట్టి ఉదయాన్నే బ్రహ్మముహూర్తంలో నిద్రలేచి, ఋషిస్నానం చేయడం పుణ్యప్రదం.


🚿ఇక స్నానాల్లోకెల్లా చన్నీటి స్నానం ఉత్తమమైనది.


🚿ప్రవాహ ఉదకంలో స్నానం చేయడం ఉత్తమోత్తమం.


🚿చెరువులో స్నానం మద్యమం .నూతి(బావి) వద్ద స్నానం చేయడం అధమం.


🚿వేయి పనులున్నా వాటిని వదిలి సమయానికి స్నానం చేయాలని ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి.🚿


🚿ఒక నదిలో స్నానం చేసినప్పుడు ఇంకో నదిని దూషించకూడదు.


కొన్ని స్పాలలో, ఆయుర్వేదశాలల్లో చాకొలేట్, మట్టి వంటి ఇతర పదార్థాలతో స్నానం చేయటానికి ప్రత్యేక వసతులు ఉంటాయి.

షాంపేనుతో స్నానం చేసిన  ఉదాహరణలు అక్కడక్కడా కనిపిస్తాయి. అంతేకాకుండా ఆరుబయట🌤️🌤️🌅 సూర్యుని కిరణాలు శరీరాన్ని తాకేట్టు పరుండటాన్ని కూడా స్నానంగా పరిగణిస్తారు.

🌞ఈ సూర్య స్నానం (సన్ బాతింగ్)🌞 ముఖ్యంగా పాశ్చాత్య ప్రజలలో ప్రసిద్ధి చెందినది.🌞


⛱ *పురాణాలలో స్నానం :*

మానవుల్ని పవిత్రులను చేసుకోవడానికి భగవంతుడు అనుగ్రహించినది.☁️ జలం. 

🔥అగ్ని. అగ్నితో శుద్ధి చేసుకోవడం వీలుబడదు.

అగ్ని యందలి దాహక శక్తి మనల్ని దహింప చేస్తుంది కనుక జలముతో శుద్ధి చేసుకోవడం అందుబాటులో ఉన్న శాస్త్ర సమ్మతమైన విషయంగా చెప్పబడింది. హిందూ పురాణాలలో వివిధ రకాలైన స్నానాల గురించి చెప్పబడింది.


⛱ *మంత్ర స్నానం:*

వేదమందు చెప్పబడిన నమక, చమక, పురుష సూక్తములను, మార్జన మంత్రములను ఉచ్ఛరిస్తూ చేయునది "మంత్ర స్నానం"


⛱ *భౌమ స్నానం :*

పుణ్య నదులలో దొరుకు మన్ను లేక పుట్టమన్ను మొదలగు పవిత్ర మృత్తికను ఒంటి నిండా అలముకొని మృత్తికా మంత్రాలతో చేసేది "భౌమ స్నానం".


🔥 ఆగ్నేయ 

స్నానం:🔥

సమస్త పాపములను దగ్ధం చేసే పుణ్య రాశిని చేకూర్చే భస్మమును మంత్ర సహితంగా లేదా🕉️ శివ నామమును ఉచ్ఛరిస్తూ ధరించి చేసేది "ఆగ్నేయ స్నానం"🔥


 🌪️🌀వాయువ్య స్నానం: ముప్పది మూడు కోట్ల దేవతులు నివశించు గోమాత పాద ధూళి చేత చేసేది "వాయువ్య స్నానం"🌪️🌪️


⛱ *దివ్య స్నానం:*

లోక భాంధవుడు, జగత్ చక్షువు, కర్మ సాక్షి అగు 🌞సూర్య భగవానుడు ఆకాశంలో ఉండి 

🌅సూర్య కిరణాలను వెలువరిస్తున్నపుడు వానలో స్నానం చేయడం "దివ్య స్నానం".

ఇది అరుదైనది. దీనికి వాతావరణం అనుకూలించాలి.


 🌨️వారుణ స్నానం

పుణ్య నదులలో స్నానం ఆచరించడం

"వారుణ స్నానం".🌧️


⛱ మానస స్నానం :*

నిత్యం నారాయణ నామ స్మరణతో కామ క్రోధ లోభ మోహ మద మత్సర అహంకార ఢంభ దర్పదైన్యాది మాలిన్యాలను మనస్సులో చేరనీక పోవడం

"మానస స్నానం".

ఇది మహత్తర స్నానం.

మహా ఋషులచేత ఆచరింప బడుతుంది. ఈ స్నానం కోసం అందరూ ప్రయత్నం చేయాలి.


🎊 *స్నానాలు రకాలు*


🌧 *మానస స్నానం:*

దైవాన్ని స్మరిస్తూ, మనసును నిలిపి చేయు స్నానం.


🌧 *క్రియాంగ స్నానం:*

జపం, మంత్రతర్పణ చేయుటకు చేసే స్నానం.


🌧 *దైవ స్నానం:*

ఉదయం 4-5 గంటల మధ్య చేయు స్నానం.


🌧 *మంత్ర స్నానం:*

వైదిక మంత్రాలను చదువుతూ చేసే స్నానం.


🌧 *ఋషి స్నానం:*

ఉదయం 5-6 గంటల మధ్య చేయు స్నానం.


🌧 *మానవ స్నానం:*

ఉదయం 6-7 గంటల మధ్య చేయు స్నానం.


🌧 *రాక్షస స్నానం:*

ఉదయం 7 గంటల తరవాత చేసే స్నానం.


🌧 *ఆతప స్నానం:*

ఎండలో నిలబడి శరీరాన్ని శుద్ధి చేసుకునే స్నానం.


🌧 మలాపకర్షణ స్నానం:

మాలిన్యం పోవుటకు చేయు స్నానం.🚿🚿🚿🚿🚿శ్రీరామ జయ రామ జయజయ రామ

ఈశ్వర స్తవము

 ఈశ్వర స్తవము 


శ్రీకైలాసనివాసా !

లోకేశ్వర ! నిగమవినుత !లోకపవిత్రా !

భీకరవిషకంఠేశ్వర !

చేకూర్చుము ముక్తి  నాకు శ్రీ పరమేశా ! 01


అక్కజముగ విషమును గని

దిక్కుల పరువెత్తుచుండ దేవత లెల్లన్

మక్కువ తోడను దానిని

గ్రక్కున గ్రహియించినావె  ఘనముగ యీశా !02


ఒడ లెల్లశ్రీవిభూతిని

కడు మక్కువ తోడ దాల్చి కన్పించు హరా !

ఇడుముల నుండెడి భక్తుల

కడు సంపద లిత్తు వకట  ఘనముగ యీశా ! 03


ద్వారమునందున బాలుని

దారుణ శూలంబు తోడ తరిగియు శిరమున్

కారుణ్యముతో పిమ్మట

వారణశిర ముంచినట్టి వందిత యీశా !    04


బాలుడు మార్కండేయుని

కాలుడు గొంపోవగాంచి కడు కుపితుడవై

శూలము బెట్టితి వడ్డుగ

లీలలు తెలియంగ లేము నిక్కము  యీశా.   05


✍️గోపాలుని మధుసూదన రావు. 🙏

అభిజిత్ లగ్నం

 

🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀



         *అభిజిత్ లగ్నం అంటే…*

                 ➖➖➖✍️


అభిజిత్ అనేది కాంతిలేని నక్షత్రం. పురాణాల్లో దీని వెనుక ఓ ఆసక్తికర కథ కూడా ఉంది.


అందరూ టక్కున చెప్పే సమాధానం ఇరవై ఏడు అని. కానీ అభిజిత్ అనే ఓ నక్షత్రం ఉందనీ, దానికి కొంత ప్రత్యేకత ఉందని ఎంతమందికి తెలుసు? 

ఆ విశేషాలేమిటో మనం తెలుసుకుందాం….


అభిజిత్ అంటే కనిపించని చుక్క అని మనం అనుకోవచ్చు. అంటే కాంతిలేనిదన్నమాట. నిజానికి నక్షత్రం అనేది కూడా ఒక్కటి కాదు…. అనేక నక్షత్రాల సమూహం. 


వీటిని 27 మండలాలుగా విభజించి వాటికి అశ్వని, భరణి అంటూ పేర్లు నిర్ణయించారు. ఇక అభిజిత్ విషయానికి వస్తే ఉత్తరాషాఢ నక్షత్రం చివరి పాదం, శ్రవణా నక్షత్రంలోని మొదటి పాదంలో 15వ వంతు భాగాన్ని అభిజిత్ నక్షత్రం అంటారు. ఈ నక్షత్రం వెనుక ఓ పురాణ కథ ఉంది అదేంటో మనం తెలుసుకుందాం….


మనకున్న 27 నక్షత్రాలనూ దక్షప్రజాపతి కుమార్తెలుగా చెబుతారు. దక్షుడు వీరిని చంద్రుడికి ఇచ్చి పెళ్లి చేశాడు. 


అందరికన్నా రోహిణి మీదే చంద్రుడికి ప్రేమ ఎక్కువ. ఆమెతోనే ఎక్కువ కాలం గడిపేవాడు. మిగతా నక్షత్రాలు ఊరుకున్నా శ్రవణం మాత్రం ఊరుకోలేదు. తనలాగే ఉండే తన ఛాయను తీసి తన స్థానంలో ఉంచి చంద్రుడి వ్యవహారం తేల్చడానికి తండ్రి దగ్గరకు వెళ్లింది. 


శ్రవణా నక్షత్రం వదిలిన ఛాయ పేరే అభిజిత్తు. అది 28వ నక్షత్రంగా ఏర్పడింది. 


ఆ తర్వాత కాలంలో దీనికి ఒక పవిత్రమైన స్థానం కూడా ఏర్పడింది. సర్వ దోషాలనూ పోగొట్టే శక్తి ఈ నక్షత్రానికి వచ్చింది. 


ప్రతి రోజూ ఈ నక్షత్రానికి సంధించిన సమయం ఉంటుంది. దాన్నే అభిజిత్ ముహూర్తం అంటారు. ఆ వివరాలు చూద్దాం….


ఈ పదం ఒకప్పుడు పల్లెటూళ్లకు కొత్త కాదు. కాలంమారింది కాబట్టి ఇప్పుడది అంతగా వినపడటం లేదు. అభిజిత్ లగ్నాన్ని పల్లెటూళ్లలో అలా పిలిచేవారు. గడ్డపలుగును భూమిలో పాతిపెట్టి దాని నీడ మాయమయ్యే సమయాన్ని గడ్డ పలుగు ముహూర్తం అనేవారు. అంటే మిట్టమధ్యాహ్నం అన్నమాట. 


ఈ ముహూర్తంలో సూర్యుడు దశమ స్థానంలో ఉంటాడని, ఈ ముహూర్తం చాలా దోషాలను పోగొడుతుందని నమ్మకం. నిజానికి ఇది చాలా బలమైన ముహూర్తం. 


ప్రస్తుతం రామాలయ నిర్మాణం కోసం అయోధ్యలో జరుగుతున్న భూమిపూజను ఈ అభిజిత్ లగ్నంలోనే చేశారంటే దీనికున్న ప్రాధాన్యం                          ఏ పాటిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దీన్ని విజయ ముహూర్తం అని కూడా అంటారు. 


ఈ ముహూర్తం మధ్యాహ్నం 11-45 నుండి 12-30 వరకు ఉంటుంది. 

ఈ ముహూర్తం లోనే శివుడు త్రిపురాసుర వధ చేశాడు. 

ఇదే ముహూర్తం లో దేవతలు సముద్ర మధనం ప్రారంభించారు. 

ఈ శుభ ముహూర్తం లోనే ఇంద్రుడు దేవ సింహాసనాన్ని అధిరోహించాడు. శ్రీరాముడి జననం, సీతారాముల కల్యాణం, భీష్మ పితామహుడు ధ్యాన స్థితుడై ప్రాణాలను విడిచిపెట్టిన సమయం… ఇవన్నీ ఈ ముహూర్తంలోనే జరిగాయి. 


ఈ ముహూర్తంలో పెళ్ళి జరిగింది కాబట్టి ఇలా కష్టాలు వచ్చాయని అనుకోవడం కూడా తప్పే. అసలు ఆ లగ్నంలో ఏ శుభకార్యం చేపట్టినా, ఇక మిగతా విషయాలు ఏవీ ఆలోచించాల్సిన అవసరమే లేదు.

ఇంకా ఈ ముహూర్తానికి సంబంధించి మరికొన్ని విశేషాలు ఉన్నాయి. ఈ ముహూర్త సమయంలో దక్షిణ దిక్కుకు ప్రయాణం మంచిది కాదని నారద సంహిత పేర్కొంటోంది. 

దక్షిణం యమస్థానం కాబట్టి బుధవారం మాత్రం ఆ దిక్కుకు వెళ్లరాదని నారద సంహిత పేర్కొంది. 

అలాగే ఉపనయనానికి కూడా ఈ లగ్నం పనికిరాదని పేర్కొంది. దీనికి కొన్ని మినహాయింపులు కూడా ఉన్నాయి. 

ఆ నక్షత్రాధిపతుల సమయంలో ఈ అభిజిత్ ముహూర్తం వస్తే మాత్రం దక్షిణ దిక్కుకు నిరభ్యంతరంగా ప్రయాణం చేయవచ్చు. సూర్యుడు చీకటిని ఎలా పారదోలతాడో అలా సర్వదోషాలనూ ఈ ముహూర్తం హరించి వేస్తుందని వశిష్ఠ సంహిత పేర్కొంది. ముహూర్త వల్లరి అనే గ్రంథం మాత్రం అభిజిత్ ముహూర్తం కేవలం ప్రయాణాలకే తప్ప ఇతర కార్యాలకు పనికిరాదని అంటోంది. ఈ లగ్నంలో వివాహం చేస్తే నష్టమని బ్రహ్మ శపించినట్లు నారద సంహిత పేర్కొంది. ఎన్ని భిన్నాభిప్రాయాలు ఉన్నా అభిజిత్ లగ్నం సర్వశ్రేయోదాయకమని అనేక గ్రంథాలు పేర్కొన్నాయి.✍️

.          *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

                       🌷🙏🌷


 🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏


🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

*రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*

                     ➖▪️➖

ఇలాటి మంచి విషయాలకోసం…

*“భగవంతుని విషయాలు గ్రూప్“*  లో చేర్చమని ఈక్రింది నెంబరుకి వాట్సప్ లో మెసేజ్ పెట్టండి...

944065 2774.

లింక్ పంపుతాము.🙏

లెక్కకు మించిన సిరులను


*కం*

లెక్కకు మించిన సిరులను

లెక్కెరుగక నొందుకన్న లెక్కించుగతిన్

చక్కగ నక్కర తీర్చుకు

తక్కిన సిరి సంస్కరించ తలచుము సుజనా.

*భావం*:-- ఓ సుజనా! లెక్కపెట్టలేనన్ని సిరులను సంపాదించడం కన్నా గణనీయంగా నీ అవసరాలకు సరిపోయే సిరులను వాడుకొని తక్కిన సిరులను సంస్కరించ డానికి ( మంచిపనులకు ఉపయోగించే) యోచన చేయుము.

*** *కొంపెల్ల శ్రీనివాస శర్మ*


*కం*

ఉపయోగించెడి మనసుకు

నుపయుక్తంబగు సకలము నుర్విన నెపుడున్.

ఉపయోగము లేదనుచును

నెపమెంచక విలువలెరుగ నెగడుదు సుజనా.

*భావం*:-- ఓ సుజనా! ఉపయోగించుకునే మనసు ఉన్న వారి కి ఈ భూలోకంలో అన్నీ ఉపయోగకరమైనవే అవుతాయి. ఉపయోగం లేదు అని చెప్పుటకన్నా దాని విలువ ను తెలుసుకుంటే వర్ధిల్లెదవు.

*** *కొంపెల్ల శ్రీనివాస శర్మ*

*🌹శ్రీ వేంకటేశ్వర దివ్య చరిత్ర-38🌹* 🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁 *గోదాదేవి:*

 🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹

*🌹శ్రీ వేంకటేశ్వర దివ్య చరిత్ర-38🌹*


🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁


*గోదాదేవి:*


తమిళనాడులోని శ్రీవిల్లిపుత్తూరులో విష్ణుచిత్తుడనే భక్తుడు ఉండేవాడు. ఈ విల్లిపుత్తూరులోనే శ్రీకృష్ణుడు, మర్రి ఆకు మీద తేలియాడుతూ లోకాన్ని రక్షించాడని నమ్మకం. అందుకే ఇక్కడి ఆలయంలోని ప్రధాన దైవం ఆ చిన్నికృష్ణుడే.


 విష్ణుచిత్తుడు నిత్యం ఆ కృష్ణునికి పుష్పమాలలని అర్పిస్తూ ఉండేవాడు. విష్ణుచిత్తుడి అసలు పేరు భట్టనాథుడు. నిరంతరం ఆయన చిత్తం విష్ణుమూర్తి మీదే ఉండేది కాబట్టి ఆ బిరుదు దక్కింది. 


ఆయనను విష్ణుభక్తులైన ఆళ్వారులలో ఒకరిగా ఎంచి, ఆయనకు పెరియాళ్వారు అంటే - పెద్ద ఆళ్వారు అన్న గౌరవాన్ని కూడా అందించారు. 


అలాంటి పెరియాళ్వారు ఒకసారి తులసి మొక్కల కోసం పాదులు తీస్తుండగా ఒక పాప కనిపించింది. తనకు వటపత్రశాయే ఆ శిశువును ప్రసాదించాడని భావించాడు. ఆ శిశువుకు మంగళస్నానం చేయించి భార్యచేతికిచ్చాడు. ఆమెకు ఆమెకు ‘కోదై’ అంటే  - పూలమాల ‘‘’’ అని నామకరణం చేశారు. మహాలక్ష్మిలా వెలుగొందుతున్న ఆ ‘‘గో’’ అనే పదానికి గల ఉన్నత లోకం, వాక్కు, వజ్రము, నేత్రము, కిరణము వంటి అర్థాలకు గల లక్షణాలన్నీ విష్ణుచిత్తులు ఆ శిశువులో చూశారు. అల్లారు ముద్దుగా పెంచారు.

 ఆ పేరే క్రమంగా గోదాగా మారింది.



గోదాదేవి చిన్ననాటి నుంచి కృష్ణుడి లీలలను ఆడుతూపాడుతూ పెరిగిందే. యుక్తవయసు వచ్చేసరికి ఆ భక్తి కాస్తా ప్రేమగా మారిపోయింది. కళ్లుమూసినా, తెరిచినా ఆ నల్లనివాడే కనిపించసాగాడు. 


తన చుట్టూ ఉన్న స్నేహితురాళ్లంతా ఒకప్పటి గోపికలనీ, తానుండే విల్లిపుత్తూరు ఒకనాటి గోకులమని భావించసాగింది. అంతేకాదు! తన తండ్రి విష్ణుచిత్తుడు రోజూ భగవంతుని కోసం రూపొందించే మాలలను ముందు తనే ధరించి, తనలో ఆ కృష్ణుని చూసుకుని మురిసిపోయేది. 


ఈ దృశ్యం ఒకరోజు విష్ణుచిత్తుని కంట పడనే పడింది. తన కూతురు చేసిన పని వల్ల ఇన్నాళ్లూ ఆ దేవదేవుని పట్ల అపచారం జరిగిందని బాధపడ్డాడు. కానీ ఆ రోజు కృష్ణుడు అతనికి కలలో కనిపించి, గోదాదేవి సాక్షాత్తూ భూదేవి అవతారమేననీ, ఆమె వేసుకున్న మాలలను ధరించిడం వల్ల తనకు అపచారం కాదు కదా, ఆనందం కలుగుతుందనీ తెలియచేశాడు.



ఇలాంటి సంఘటనలన్నీ గోదా మనసులో కృష్ణప్రేమని మరింతగా పెంచాయి. తనకు పెళ్లంటూ జరిగితే ఆయనతోనే జరగాలని అనుకుంది. అందుకోసం ఒకప్పుడు గోపికలు చేసిన కాత్యాయని వ్రతాన్ని మొదలుపెట్టింది. 


ఈ వ్రతం చేయాలంటే ఆహారానికీ, అలంకారానికీ సంబంధించిన చాలా కఠినమైన నియమాలని పాటించాల్సి ఉంటుంది. అలా గోదాదేవి తాను వ్రతాన్ని పాటించడమే కాకుండా తన చెలికత్తెలని కూడా ప్రోత్సహించింది. తన స్నేహితురాళ్లను మేలుకొలిపేందుకు, వారికి వ్రత విధానాలను తెలియచేసేందుకు, తనలో కృష్ణభక్తిని వెల్లడించేందుకు 30 పాశురాలను పాడింది గోదా. అవే ధనుర్మాసంలో ప్రతి వైష్ణవభక్తుని ఇంట్లోనూ వినిపించే తిరుప్పావై!


ఇలా సాగుతున్న గోదాదేవి ప్రేమకు, ఆ కృష్ణుడు లొంగక తప్పలేదు. దాంతో ఆయన విష్ణుచిత్తునికి కనిపించి, గోదాదేవిని శ్రీరంగానికి తీసుకురమ్మనీ… అక్కడ రంగనాథునిగా వెలసిన తాను గోదాదేవిని వివాహం చేసుకుంటాననీ చెప్పాడు.


 శ్రీరంగంలోని ఆలయ అర్చకులకు కూడా ఈ విషయాన్ని తెలియచేశాడు. కృష్ణుని ఆదేశాలను విన్న విష్ణుచిత్తుని సంతోషానికి అవధులు లేకుండా పోయాయి. వెంటనే గోదాదేవినీ, విల్లిపుత్తూరులోని ప్రజలనూ తీసుకుని శ్రీరంగానికి బయల్దేరాడు. అక్కడ వారి రాక గురించి ముందే తెలిసిన అర్చకులు వారిని ఆలయంలోకి తీసుకువెళ్లారు. 


పెళ్లికూతురిగా గర్భగుడిలోకి ప్రవేశించిన గోదాదేవి, అందరూ చూస్తుండగా ఆ రంగనాథునిలో ఐక్యమైపోయింది. ఇదంతా మకర సంక్రాంతికి ముందు భోగిరోజు జరిగింది. అందుకే ప్రతి వైష్ణవాలయంలో భోగినాడు గోదాదేవికి, విష్ణుమూర్తితో కళ్యాణం జరుపుతారు.


 

భక్తి, కళా, సామ్రాజ్యాలను ప్రకాశింపజేసిన విజయనగర సార్వభౌములు, శ్రీకాకుళ ఆంధ్ర మహా విష్ణువు ఆదేశానికి అనుగుణంగా తమ కవితాశక్తిని ధారపోసి ‘లెస్స అయిన తెలుగు’ భాషలో అద్భుతమైన విష్ణుభక్తి కావ్యం రచించాడు. అదే ‘అమూక్త్తమాల్యద’’ ప్రబంధం. గోదాదేవి వైభవ చరిత్ర 

‘శూడికొడుత ్త నాచియార్‌’ అంటే ‘ఆమూక్తమాల్యద’ అని అర్థం. ఆ పేరుతోనే రాయలవారు ప్రబంధం తెలుగులో రచించారు.

శ్రీకృష్ణుని అదేశానుసారం మార్గ్గశిర మాసంలో ఆచరించిన కాత్యాయనీ వ్రతం గురించి, విధి విధానాలన్నిటి గురించి సవివరంగా గోదాకు విష్ణుచిత్తుడు తెలియజేశాడు.

తండ్రిచెప్పినవన్నీ విన్న గోదా శ్రీవిల్లిపుత్తూరును నందవనంగా, వటపత్రశాయిని నందగోపునిగా, చెలులను గోపికలుగా, తనను వారిలో ఒకతెగా ఊహించుకుని కాత్యాయనీ వ్రతానికి సమాన ప్రతిపత్తిగల ‘మార్గళి’ వ్రతాన్ని మార్గశిర మాసంలో ఆచరించింది. ఈ వ్రతాన్ని ‘శ్రీవ్రతం’గా కూడా వ్యవహరిస్తారు.


30 రోజులపాటు సాగే ఈ వ్రతంలో, గోపికల చిత్తప్రవృత్తులను, వారి హస, హాస్య, లాసాలను, ప్రకృతి సౌందర్యాన్ని, చివరగా శ్రీకృష్ణుని ఇంటికి వెళ్లి తమ హృదయాల కవాటాలు తెరచి తమ ప్రేమను విన్నవించుకోవడం వంటి చిత్రవిచిత్ర దృశ్యాలను హృదయాలు పులకించేటట్లు గోదాదేవి రోజుకొక పాటగా (పాశురం) పాడింది. ఈ ముప్పది పాశురాలు ‘‘తిరుప్పావై’’గా తమిళవాజ్ఞయంలో ప్రసిద్ధి పొందాయి.

తిరుప్పావై శరణాగతికి ప్రతీక, రామాయణాన్ని ‘వాల్మీకిగిరి సంభూతా, రామసాగర గామినీ’ అన్నట్టు, దీనిని ‘గోదా రసనాగ్ర సంభూతా శ్రీరంగనాయక సాగర గామినీ’’ అని పండితులు పోలిక చేశారు.

 

పాశురాలన్నీ దివ్యప్రబోధాలు, బ్రహ్మానంద సాగర తరంగాలు, మోక్షసౌధాన్ని చేరటానికి సోపానాలు. ఎక్కడా ఉపయోగించని అద్భుతమైన, అపూర్వమైన ఉపమానాలు ‘తిరుప్పావై’ సొంతం. తాను స్ర్తీ కనుక తన అనుభూతిని గోదాదేవి పాశురాల్లో పొందుపరచగలిగింది. శ్రీహరి పాదాలనే నమ్ముకున్న గోదా పాశురాల్లో ప్రత్యక్షరంలో పర, వ్యూహ, విభవ, అర్చావతార వైభవం ఆవిష్కృతమవుతుంది.

గోదాదేవి విశేష భక్తికి, ప్రేమానురాగాలకు సంతసించిన శ్రీరంగనాఽథుడు విష్ణుచిత్తుడు పాండ్యరాజు మత్స్యధ్వజునికి కలలో కనిపించి ఆమెను తన సన్నిధికి రప్పించి కల్యాణం జరిపించమని ఆజ్ఞాపించాడు.

 

శ్రీరంగనాథుని ఆజ్ఞమేరకు సమస్త రాజ లాంఛనాలతో గోదా - రంగనాథుల కల్యాణం జరిగింది. గోదాదేవి శ్రీరంగనాథునిలో ఐక్యమైంది. వైష్ణాలయాల్లో ధనుర్మాసంలో సుప్రభాతానికి బదులు ‘తిరుప్పావై’ పాడటం అందరికీ తెలిసిందే! మహత్వపూర్ణమైన ‘తిరుప్పావై’ దివ్య ప్రబంధాన్ని పఠించినా, విన్నా శ్రీలక్ష్మీ నారాయణులు అనుగ్రహిస్తారని ఫలశృతిగా చెప్పడం జరిగింది.

పన్నిద్దరాళ్వారులలో తండ్రితో సమానంగా తాను కూడా ఒక ఆళ్వార్‌గా గణుతికెక్కిన గోదాదేవి కొలువుతీరిన పుణ్యక్షేత్రమే శ్రీవిల్లిపుత్తూరు. తమిళనాడులోని రాష్ట్రం విరుద్ నగర్ జిల్లాలోని ఒక చిన్న పట్టణం, పురపాలక సంఘం. మదురైకి 80 కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ దివ్యక్షేత్రం. ఆండాళ్, కోదై అనే పేర్లతో ప్రసిద్ధమైన ఆ తల్లి ఆవిర్భవించింది ఇక్కడే. వేటగాడైన విల్లి పేరు మీద విల్లిపుత్తూరు అని, ఆండాళ్ అవతరించిన పుణ్యస్థలి, పెరియాళ్వార్ నివసించిన ప్రదేశం కాబట్టి శుభప్రదమైన శ్రీవిల్లిపుత్తూరు అని ప్రసిద్ధి పొందింది. శ్రీవిల్లిపుత్తూరు పట్టణ చిహ్నం 12 అంతస్తుల ఆలయ గోపురం. సుప్రసిద్ధమైన శ్రీవిల్లిపుత్తూరు గోదాదేవి దివ్యాలయ ప్రాంగణం నిత్యం గోదా, వటపత్రశాయి నామస్మరణలతో మారుమోగుతుంటుంది. సుమారు 192 అడుగుల ఎత్తులో ఉన్న ఈ దివ్యాలయం ఆధ్యాత్మికంగా మేరు పర్వతానికి సమానమైనదిగా భావించబడుతుంది. ఈ అతి ప్రశస్త దివ్యక్షేత్రం 108 దివ్య దేశాలలో ఆండాళ్ జన్మించిన పుణ్యస్థలం. ఈమె అనితరసాధ్యమైన భక్తితో విష్ణువుని కొలిచి అతనినే భర్తగా పొందిన భక్త శిఖామణి. ఈమె తిరుప్పావై, నాచ్చియార్ తిరుమొళి పాశురాలను రచించింది. ఈ ఆలయాన్ని క్రీ.శ. 7వ శతాబ్దంలో వల్లభ దేవ పాండ్యన్ అనే రాజు నిర్మించినట్లు చారిత్రక ఆధారాలను బట్టి తెలుస్తోంది. అనంతరకాలంలో ఈ ఆలయాన్ని తిరుమల నాయకర్, చొక్కప్ప నాయకర్ అనే రాజులు అభివృద్ధి చేశారు. కాలాంతరంలో ఈ ఆలయంలో అనేక మార్పులుచేర్పులు జరిగినప్పటికీ, పురాతనత్వాన్ని ఏమాత్రం కోల్పోని ఆలయమిది. గోదాదేవి దొరికిన తులసీవనం ఈ ఆలయ ప్రాంగణంలో ఇప్పటికీ భక్తులకు దర్శనమిస్తుంది. ఈ వనంలోనే అమ్మవారికి గుర్తుగా చిన్న మందిరాన్ని నిర్మించారు. 

ధనుర్మాస కాలంలో రోజుకో పాశురాన్ని స్వామి సన్నిధిలో గానం చేయడం జరుగుతూ ఉంటుంది. లక్ష్మీదేవి అంశతో తులసివనంలో విష్ణుచిత్తుడికి లభించిన గోదాదేవి, ఆ స్వామిని వివాహం చేసుకున్నది ఈ మాసంలోనే.


అలాంటి ఈ మాసంలో స్వామివారితో పాటు అమ్మవారు కూడా ప్రత్యేకపూజలు అందుకుంటూ ఉంటుంది. వివిధ రకాల పూలమాలికలతోను ... ఆభరణాలతోను అలంకరించబడిన అమ్మవారు ప్రసన్న వదనంతో దర్శనమిస్తూ ఉంటుంది. ఆ తల్లి భుజంపైగానీ ... చేతిలో గాని ఒక రామచిలుక కనిపిస్తూ ఉంటుంది.

శ్రీవిల్లిపుత్తూరులోని అమ్మవారి ఆలయాన్ని దర్శించినట్టయితే ఈ రామచిలుక తయారీ విషయంలో చాలా శ్రద్ధ తీసుకుంటారట. సగ్గుబియ్యం ఆకులతో చిలుకను తయారుచేసి దానిమ్మ మొగ్గను దాని ముక్కుగా అమర్చుతారు. నిజంగా రామచిలుకే అమ్మవారి భుజంపై వాలిందా ? అన్నంత సహజంగా అది కనిపిస్తూ ఉంటుంది.



ప్రతినిత్యం ఇలా చిలుకను తయారు చేసి అమ్మవారి ఉత్సవమూర్తి భుజంపై అలంకరిస్తూ ఉంటారు. ఇలా కొలువుదీరిన అమ్మవారిని పూజించడం వలన ధర్మబద్ధమైన కోరికలు తప్పనిసరిగా నెరవేరతాయని విశ్వాసం.



కృపాసాగర గోవిందా, శరణ సుందర గోవిందా, పుణ్య స్వరూప గోవిందా, శ్రీ పురుషోత్తమ గోవిందా; |

గోవిందా హరి గోవిందా, వేంకట రమణా గోవిందా, గోవిందా హరి గోవిందా, వేంకట రమణా గోవిందా. ||38||



*శ్రీవేంకటేశ్వరుని దివ్య లీలల లో మరికొన్ని తదుపరి సంపుటిలో తెలుసుకుందాం.*


*సేకరణ:- శ్రీ రమణమూర్తి గారి వాట్సాప్ పోస్ట్.*

🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

సౌందర్యలహరి🌹* *శ్లోకం - 16*

 🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹

🌹🌹🍃🍃🌹🌹🍃🍃🌹🌹

.          *🌹సౌందర్యలహరి🌹*


*శ్లోకం - 16*

🌷🪷🌷🪷🌷🪷🌷🪷🌷🪷



       *కవీంద్రాణాం చేతః కమలవన బాలాతప రుచిం*

        *భజంతే యే సన్తః కతిచి దరుణామేవ భవతీమ్ |*

       *విరించి ప్రేయస్యా స్తరుణ తరశృంగారలహరీ*

        *గభీరాభిర్వాగ్భిః విదధతి సతాం రంజనమమీ ||*



ఎర్రని లలితాదేవి, తెల్లని సరస్వతీదేవిల సంయుక్త రూపమైన అరుణ సరస్వతిని ఆవిష్కరిస్తున్నారు శంకరులు ఈ శ్లోకంలో.


ఈ అరుణ సరస్వతి, తనను ఉపాసించేవారికి, 


సతాం రంజనమమీ = సత్పురుషులను రంజింపజేసేటట్లు వారు మెచ్చేటట్లు


గభీరాభిర్వాగ్భిః = గంభీరమైన, లోతైన వాక్కును ప్రసాదిస్తుందట.


విరించి ప్రేయస్యా స్తరుణతర శృంగార లహరీ = బ్రహ్మకు ప్రేయసి అయిన సరస్వతీదేవి (వాక్కు వేదమాత బ్రహ్మ ద్వారా వ్యక్తమైంది కనుక) నిత్య యవ్వన. ఆమె యవ్వనము, సౌందర్యము, శృంగారము, ఆ ఉపాసకుని వాక్కులో కనబడుతుంది. ఇవన్నీ ఆ వేదమునకే అన్వయము.


ఇక అరుణ సరస్వతి కాంతులు ఎలా ఉంటాయి?


 ప్రాతఃకాలంలో అరుణ కాంతులు, సాయంకాలంలో వరుణ కాంతులు (నీరెండ) ఉంటాయి కదా అలాగ


కవీంద్రాణాం చేతః కమలవన బాలాతప రుచిం = ప్రాతః సమయంలో కవీంద్రుల మనస్సనే కోనేరులో భావనలనే కమలాలు విచ్చుకున్నట్లు ఆమె అనుగ్రహం కలుగుతుందట.


అరుణ సరస్వతి అమృత సముద్ర మధ్యంలో అరుణ కాంతులతో ప్రకాశిస్తూ శిరముపై చంద్రలేఖ, త్రినేత్రములు, పైన నాలుగు హస్తములలో పాశాంకుశాలు, ధనుర్బాణాలు (చెరకు విల్లు, పూలబాణాలు); క్రింది నాలుగు హస్తములలో వరద అభయ ముద్రలు, పుస్తకము, అక్షమాల కలిగియుంటుందట. ఈ అరుణ సరస్వతి ఒక మంత్ర విశేషము అని పెద్దలు చెప్తారు.


           🙏🏻 *శ్రీమాత్రే నమః*🙏🏻


*సేకరణ:- శ్రీ రమణమూర్తి గారి వాట్సాప్ పోస్ట్.*

🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

*🚩శ్రీ వివేకానందస్వామి🚩* . *🚩జీవిత గాథ🚩* *భాగం 32*

 🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹

.    *🌹చారిత్రాత్మక కథాస్రవంతి🌹*

.   *ఓం నమో భగవతే రామకృష్ణాయ*


.       *🚩శ్రీ వివేకానందస్వామి🚩*

.                *🚩జీవిత గాథ🚩*   


*భాగం 32*

🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁


*నరేంద్రుని ఆశ్చర్యం వర్ణనాతీతం*


శ్రీరామకృష్ణుల మాటలూ, అనుభవాలు ఉపదేశాలు ఆయన జీవితం ఆయనను నిజమైన సాధువుగా గుర్తించి నరేంద్రుడు మనస్సులో, 'ఈ వ్యక్తి గురువుగా ఉండగలరా? నా సందేహాన్ని ఈయనను అడగవచ్చా?” అనే ప్రశ్న మెదలింది. వెంటనే శ్రీరామకృష్ణుల వద్దకు వెళ్లి చాలా రోజులుగా తన మనస్సును వేధిస్తున్న అనేకులను అడిగినా జవాబు లభించని ఆ ప్రశ్నను అడిగాడు.


"మహాశయా, మీరు భగవంతుణ్ణి కళ్లారా చూశారా?"


ఎక్కడెక్కడో వెదకివేసారి నిష్పలమై తిరుగుముఖం పట్టిన ప్రశ్న ఎట్టకేలకు సముచితమైన చోటు చేరుకొంది. ఠక్కున జవాబు వచ్చింది. 


"అవును చూశాను. ఎంతో స్పష్టంగా నిన్ను చూస్తున్నంత స్పష్టంగా, ఇంకా స్పష్టంగా" అన్నారు. శ్రీరామకృష్ణులు.


"నిన్ను చూస్తూన్నట్లుగా, నీతో మాట్లాడుతున్నట్లుగా భగవంతుణ్ణి చూడవచ్చు, ఆయనతో మాట్లాడవచ్చు. కాని ఎవరికి ఆ కోర్కె ఉంది! భార్యాపిల్లల నిమిత్తం లోకులు కడవల కొద్దీ కన్నీరు కారుస్తారు; ధనం కోసమూ, సుఖభోగాల కోసమూ: దొర్లుతూ విలపిస్తారు. భగవద్దర్శనం పొందలేదని ఎవరు విలపిస్తున్నారు? ఆయనను దర్శించాలనే పరమ వ్యాకులతతో బిగ్గరగా పిలిస్తే ఆయన తప్పకుండా సాక్షాత్కరిస్తాడు."


*సేకరణ:- శ్రీ రమణమూర్తి గారి వాట్సాప్ పోస్ట్.*

🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁

👉 *రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*

🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

అభినవ వికటకవి

 అభినవ వికటకవి


 (నేడు జరుక్ శాస్త్రి జయంతి)


తెలుగు సాహిత్యంలో పేరడీలకు ఆద్యుడిగా జలసూత్రాన్ని చెప్పుకుంటారు.

జరుక్ శాస్త్రి గా పేరొందిన జలసూత్రం రుక్మిణీనాథ శాస్త్రి 1914, సెప్టెంబర్ 7న బందరులో జన్మించారు. ఆయన పేరడీ వంటి కొత్త ప్రక్రియలే కాక సాహిత్యంలోని అన్ని ప్రక్రియలతోనూ ఈయనకి పరిచయం ఉంది. ఈయన కృష్ణా పత్రిక, ఆంధ్రపత్రిక, వాణి - వంటి పత్రికల్లో తరుచుగా వ్యాసాలు వ్రాస్తూ ఉండేవారు.ఆంధ్రపత్రిక, వాణి పత్రికల్లో సంపాదకవర్గ సభ్యులుగా కూడా పనిచేసారు. తెనాలి రామకృష్ణుని తరువాత తెలుగునాట జన్మించిన అంతటి ప్రతిభామూర్తి, వికటకవి - శ్రీ జలసూత్రం రుక్మిణీనాథ శాస్త్రి అని అంటారు. ఆయన రచనల్లో కొన్ని - "జరుక్ శాస్త్రి పేరడీలు" పేరుతోనూ, కథలు కొన్ని "శరత్ పూర్ణిమ" పేరుతోనూ నవోదయ పబ్లిషర్స్ వారు సంకలనాలుగా వెలువరించారు. ఆయన 1968 జులై20న హృద్రోగంతో కన్నుమూసారు.


జరుక్ శాస్త్రిగా ప్రసిద్ధులైన వీరు చిట్టి గూడురు సంస్కృత కళాశాలలో ఉభయభాషా ప్రవీణులయ్యారు. ఆంధ్రపత్రిక ఉపసంపాదకులుగా కొంతకాలం పనిచేశారు. మదరాసు, విజయవాడ ఆకాశవాణి కేంద్రాలలో స్క్రిప్టు రైటర్ గా పనిచేశారు. నవ్యాంధ్ర సాహిత్యోద్యమంలో ప్రధాన పాత్ర వహించారు. పేరడీ శాస్త్రిగా మంచి పేరు. దేవయ్య స్వీయచరిత్ర (నవల) ప్రచురించారు. ఆనంద వాణిలో ' తనలో తాను ' శీర్షిక నిర్వహించారు. సమకాలీన కవుల రచనలకు పేరడీలు వ్రాసి మెప్పు పొందారు. 


దేవయ్య స్వీయచరిత్ర (నవల),శబరి (నాటకం),

కన్యకాపరమేశ్వరి (నాటకం)

అక్షింతలు (పేరడీ) వంటి రచనలు చేశారు.


ఆనందం అంబరమైతే

అనురాగం బంభరమైతే

అనురాగం రెక్కలు చూస్తాం

ఆనందం ముక్కలు చేస్తాం అంటూ తన పేరడీలతో సాహితీ పరిమళాలను వెదజల్లారు.ఇక శ్రీశ్రీ ‘నేను సైతా’నికి వచ్చిన పేరడీలు లెక్కకు లేవు.

జరూక్ శాస్త్రి శ్రీశ్రీ కవితలలో ప్రసిధ్ది చెందిన పంక్తులకుచెప్పిన పేరడీలు గమనిస్తే,

నేను సైతం కిళ్ళీకొట్లో పాతబాకీ లెగర గొట్టాను

నేను సైతం జనాభాలో సంఖ్య నొక్కటి వృద్ధి చేశాను

ఇంకా,

ఏ కాకి చరిత్ర చూచిన ఏమున్నది గర్వకారణం

ప్రపంచ మొక సర్కస్ డేరా (ప్రపంచమొక పద్మవ్యూహం)

కవిత్వమొక వర్కర్ బూరా (కవిత్వమొక తీరని దాహం)

ఫిరదౌసి వ్రాసేటప్పుడు తగలేసిన బీడిలెన్నీ... మొదలైనవి..,


మొక్కపాటి నరసింహశాస్త్రి, మునిమాణిక్యం నరసింహారావు, భమిడిపాటి కామేశ్వరరావు, జలసూత్రం రుక్మిణీనాథశాస్త్రి తదితరులు తమ రచనలతో నవ్వులు పూయించారు.

భక్త జయదేవుడు

 ✍️... *నేటి చిట్టికథ* 


కృష్ణాష్టమి సందర్భం గా...


భక్త జయదేవుడు 


కొంత మంది పుట్టుకతోనే భక్తులై, జ్ఞానులై ఉంటారు. 


13 వ శతాబ్దానికి  చెందిన, వ్యాసుని అవతారంగా భావించే

జయదేవుడు' ఇటువంటి వారిలో ఒకరు.


 ఈయన  జీవితం, పూర్ణ భావంతో, భక్తీ విశ్వాసాలతో, సాధన చేస్తే,

భగవంతుడే, అనేక  రూపాల్లో వచ్చి రక్షిస్తాడని, తెలియజేస్తుంది. బాల్యంలోనే ,ఆశుకవిత్వం చేప్పారు,



ఏకసంధాగ్రాహి , జగన్నాధుని భక్తుడు. ఈయన కీర్తనలు పాడుతుంటే, జగన్నాధ స్వామి లీలలన్ని, కళ్ళకు కట్టినట్టు

కనిపించడంవల్ల, బహుళ ప్రజాదరణ పొంది, ప్రతి నోటా, వినిపించసాగాయి.


 జగన్నాధుని భక్తుడయిన కళింగ రాజు,

తన పాటలను కాక, జయదేవుడి పాటలు ఎక్కువ ప్రాచుర్యం పొందడం సహించలేక, పండితుల సలహాతో, ఇరువురి

కీర్తనలను ఒక రాత్రి, జగన్నాధుని గుడిలో ఉంచుతాడు. 


ఉదయానికి, రాజుగారి గ్రంధం ముక్కలుముక్కలయ్యి

ఉండడం చూసి, అభిమానపడి, ప్రాణత్యాగం చెయ్యబోతాడు. 


అప్పుడు జగన్నాధుని విగ్రహం లోనుంచి,

'రాజా! మీ ఇద్దరి కవితలూ గొప్పవే, ఈర్ష తో, అధికార బలంతో, నువ్వు ప్రవర్తించడం వల్ల, నీ కీర్తనలు నేను

స్వీకరించలేదు, ఇప్పుడు అవన్నీ తొలగిపోయాయి కనుక, నీ పాటలను కూడా కొన్నిటిని స్వీకరిస్తున్నాను,' అన్న

మాటలు వినిపించాయి.


ఒక సారి, జయదేవుడు

ప్రక్క ఊరిలో,భాగవత సప్తాహం చేసాడు. ప్రతిఫలం ఆశించడని తెలిసిన షావుకారు, నలుగురు సేవకులతో,

మణిమాణిక్యాలు, బంగారం, రహస్యంగా, ఆయన వెంట వెళ్లి, పద్మావతికి ఇచ్చిరమ్మని పంపాడు.


 ఆ నలుగురు

సేవకులూ, స్వార్ధంతో కుమ్మక్కయ్యి, జయదేవుడి, కాళ్ళు-చేతులు నరికేసి, ఒక పాడుబడిన బావిలో పడేసారు. 


దారిలో వెళుతున్న వింధ్య రాజు, బావిలోంచి, 'కృష్ణా! కృష్ణా!' అన్న మాటలు విని, ఆయనను బయటకు

తీయిన్చేసరికి, లీలగా, ఆయన కాళ్ళు- చేతులు తిరిగి వచ్చేసాయి


. ఆ రాజు జరిగింది తెలుసుకుని, సంతోషించి, తన

రాజ్యంలో కూడా భాగవత సప్తాహం జరపాలని, ఆయనను భార్యా సమేతంగా తీసుకువెళ్ళాడు. 


ఆ సప్తాహానికి,

లోగడ ఆయనను బావిలో పడేసిన నలుగురు దొంగలూ వచ్చారు. భక్తి పారవశ్యంలో ఉన్న జయదేవుడు, వాళ్ళను

చూడగానే, హటాత్తుగా వెళ్లి, కౌగిలించుకున్నాడు. వాళ్ళను సత్కరించి పంపాల్సిందిగా, రాజుకు చెప్పాడు.


 అయితే,వెళ్ళే దారిలో, వాళ్ళు మట్టిలో సగానికి కూరుకుపోయారు. జయదేవుడికి, వారి దీనావస్తకు, దయ కలిగి, 'హే కృష్ణా!

వీళ్ళను రక్షించు తండ్రి!' అని ప్రార్ధించాడు. భక్తుని మాట మన్నించి, వారిని రక్షించాడు దేవుడు.


పద్మావతికి, వింధ్య రాణికి మంచి స్నేహం కుదిరింది. ఒక రొజు, రాణి గారు పంతం కొద్దీ, పద్మావతిని పరీక్షించాలని,

భటుడితో, 'జయదేవుడు, వేటలో పులి బారిన పడి చనిపోయాడని', అబద్ధం చెప్పిస్తుంది. ఆ వార్త వినగానే, ప్రాణాలు

విడుస్తుంది పద్మావతి. సిగ్గుతో ప్రాయశ్చితం చేసుకోబోయిన రాజ దంపతులను, జయదేవుడు వారించి,ఒక

అష్టపదిని గానం చేస్తాడు. శ్రీ కృష్ణ పరమాత్మ కరిగిపోయి, పద్మావతిని తిరిగి బ్రతికించాడు. 


ఈ ఉదంతం,

అష్టపదులకు ఉన్న మహత్తును, సంజీవిని శక్తిని తెలియజేస్తుంది.



జయదేవుడు అనగానే, అష్టపదులు గుర్తుకు వస్తాయి. ఈ అష్టపదులు 'గీతగోవింద మహాకావ్యం ' లోనివి. 'జయదేవ

అష్టపదులలో', 24 అష్టపదులు , ప్రతి ఒక్కటి, ప్రత్యేకమయిన రాగంతో, తాళంతో రచింపబడ్డాయి.


 .జయదేవుడు దశావతారాల గురించి వ్రాసిన కావ్యం, 'దశకృతికృతే''. కృష్ణుడు మూడుముఖాలతో వేణువు వాయిస్తున్నట్టు వర్ణించే కావ్యం, ''త్రిభంగి'' అతని వల్లే ప్రాశస్త్యము నొందింది. 


ఫ్రజల గుండెల్లోఅజరామరంగా నిలిచిపోయిన ఆయన యొక్క గీతగోవింద మహాకావ్యం భావికాలంలో నారాయణతీర్ధ

వంటి మహా వాగ్గేయకారులకు స్పూర్తిదాయకమయ్యింది.


🍁🍁🍁🍁🍁🍁

🚩శ్రీ వివేకానందస్వామి🚩* . *🚩జీవిత గాథ🚩* *భాగం 32*

 🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹

.    *🌹చారిత్రాత్మక కథాస్రవంతి🌹*

.   *ఓం నమో భగవతే రామకృష్ణాయ*


.       *🚩శ్రీ వివేకానందస్వామి🚩*

.                *🚩జీవిత గాథ🚩*   


*భాగం 32*

🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁


*నరేంద్రుని ఆశ్చర్యం వర్ణనాతీతం*


శ్రీరామకృష్ణుల మాటలూ, అనుభవాలు ఉపదేశాలు ఆయన జీవితం ఆయనను నిజమైన సాధువుగా గుర్తించి నరేంద్రుడు మనస్సులో, 'ఈ వ్యక్తి గురువుగా ఉండగలరా? నా సందేహాన్ని ఈయనను అడగవచ్చా?” అనే ప్రశ్న మెదలింది. వెంటనే శ్రీరామకృష్ణుల వద్దకు వెళ్లి చాలా రోజులుగా తన మనస్సును వేధిస్తున్న అనేకులను అడిగినా జవాబు లభించని ఆ ప్రశ్నను అడిగాడు.


"మహాశయా, మీరు భగవంతుణ్ణి కళ్లారా చూశారా?"


ఎక్కడెక్కడో వెదకివేసారి నిష్పలమై తిరుగుముఖం పట్టిన ప్రశ్న ఎట్టకేలకు సముచితమైన చోటు చేరుకొంది. ఠక్కున జవాబు వచ్చింది. 


"అవును చూశాను. ఎంతో స్పష్టంగా నిన్ను చూస్తున్నంత స్పష్టంగా, ఇంకా స్పష్టంగా" అన్నారు. శ్రీరామకృష్ణులు.


"నిన్ను చూస్తూన్నట్లుగా, నీతో మాట్లాడుతున్నట్లుగా భగవంతుణ్ణి చూడవచ్చు, ఆయనతో మాట్లాడవచ్చు. కాని ఎవరికి ఆ కోర్కె ఉంది! భార్యాపిల్లల నిమిత్తం లోకులు కడవల కొద్దీ కన్నీరు కారుస్తారు; ధనం కోసమూ, సుఖభోగాల కోసమూ: దొర్లుతూ విలపిస్తారు. భగవద్దర్శనం పొందలేదని ఎవరు విలపిస్తున్నారు? ఆయనను దర్శించాలనే పరమ వ్యాకులతతో బిగ్గరగా పిలిస్తే ఆయన తప్పకుండా సాక్షాత్కరిస్తాడు."


*సేకరణ:- శ్రీ రమణమూర్తి గారి వాట్సాప్ పోస్ట్.*

🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁

👉 *రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*

🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

సౌందర్యలహరి

 🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹

🌹🌹🍃🍃🌹🌹🍃🍃🌹🌹

.          *🌹సౌందర్యలహరి🌹*


*శ్లోకం - 16*

🌷🪷🌷🪷🌷🪷🌷🪷🌷🪷



       *కవీంద్రాణాం చేతః కమలవన బాలాతప రుచిం*

        *భజంతే యే సన్తః కతిచి దరుణామేవ భవతీమ్ |*

       *విరించి ప్రేయస్యా స్తరుణ తరశృంగారలహరీ*

        *గభీరాభిర్వాగ్భిః విదధతి సతాం రంజనమమీ ||*



ఎర్రని లలితాదేవి, తెల్లని సరస్వతీదేవిల సంయుక్త రూపమైన అరుణ సరస్వతిని ఆవిష్కరిస్తున్నారు శంకరులు ఈ శ్లోకంలో.


ఈ అరుణ సరస్వతి, తనను ఉపాసించేవారికి, 


సతాం రంజనమమీ = సత్పురుషులను రంజింపజేసేటట్లు వారు మెచ్చేటట్లు


గభీరాభిర్వాగ్భిః = గంభీరమైన, లోతైన వాక్కును ప్రసాదిస్తుందట.


విరించి ప్రేయస్యా స్తరుణతర శృంగార లహరీ = బ్రహ్మకు ప్రేయసి అయిన సరస్వతీదేవి (వాక్కు వేదమాత బ్రహ్మ ద్వారా వ్యక్తమైంది కనుక) నిత్య యవ్వన. ఆమె యవ్వనము, సౌందర్యము, శృంగారము, ఆ ఉపాసకుని వాక్కులో కనబడుతుంది. ఇవన్నీ ఆ వేదమునకే అన్వయము.


ఇక అరుణ సరస్వతి కాంతులు ఎలా ఉంటాయి?


 ప్రాతఃకాలంలో అరుణ కాంతులు, సాయంకాలంలో వరుణ కాంతులు (నీరెండ) ఉంటాయి కదా అలాగ


కవీంద్రాణాం చేతః కమలవన బాలాతప రుచిం = ప్రాతః సమయంలో కవీంద్రుల మనస్సనే కోనేరులో భావనలనే కమలాలు విచ్చుకున్నట్లు ఆమె అనుగ్రహం కలుగుతుందట.


అరుణ సరస్వతి అమృత సముద్ర మధ్యంలో అరుణ కాంతులతో ప్రకాశిస్తూ శిరముపై చంద్రలేఖ, త్రినేత్రములు, పైన నాలుగు హస్తములలో పాశాంకుశాలు, ధనుర్బాణాలు (చెరకు విల్లు, పూలబాణాలు); క్రింది నాలుగు హస్తములలో వరద అభయ ముద్రలు, పుస్తకము, అక్షమాల కలిగియుంటుందట. ఈ అరుణ సరస్వతి ఒక మంత్ర విశేషము అని పెద్దలు చెప్తారు.


           🙏🏻 *శ్రీమాత్రే నమః*🙏🏻


*సేకరణ:- శ్రీ రమణమూర్తి గారి వాట్సాప్ పోస్ట్.*

🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

నవగ్రహా పురాణం🪐* . *19వ అధ్యాయం*

 🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹

.        *🪐నవగ్రహా పురాణం🪐*  

.               *19వ అధ్యాయం*

🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐


*పురాణ పఠనం ప్రారంభం*

 

*చంద్రగ్రహ జననం - 1*


అత్రి మహర్షి సమిధలూ , దర్బా సేకరించాక అరణ్యం నుండి ఆశ్రమానికి వచ్చాడు. పాద ప్రక్షాళనం చేసుకొని లోపలికి వచ్చిన భర్తకు తాగటానికి నీళ్ళు అందించింది అనసూయ. ఆమె మొహంలోని నిరాశనూ , నిస్పృహను ఇట్టే కనిపెట్టేశాడు. అత్రి..


*"నీ మొహంలో ఆనందం లేదు ?"* అత్రి నవ్వుతూ అన్నాడు. జల పాత్ర ఆమెకు అందిస్తూ.


*"నా మొహం మీద నవ్వు నాట్యం చేయాలంటే , ఏం జరగాలో తమకు తెలుసుగా స్వామీ !"* అనసూయ కంఠస్వరంలో ఆవేదనా , వినయం రెండూ పెనవేసుకున్నాయి.


అత్రి మహర్షి అర్థం చేసుకున్నాడు. బరువుగా నిట్టూర్చాడు. మౌనంగా అప్పుడే కొత్తగా చూస్తున్నట్లు అనసూయను ఎగాదిగా చూశాడు. తన భార్య అనసూయ అందాల రాశి ! చంద్రబింబం లాంటి గుండ్రటి ముఖం ! అర్థ చంద్రుడి ఆకారంలో నుదురు ! ఆ నుదురు మీద మళ్ళీ పున్నమి చంద్రుడిలాగా గుండ్రటి తిలకం ! తిలకానికి ఇరువైపులా వంకీలు తిరిగిన చక్కటి కనుబొమ్మలు ! ఆ కనుబొమ్మల గట్ల కింద జంట సరోవరాల్లా మిలమిలలాడే పెద్ద కళ్ళు ! చిగురుటాకుల్లాంటి పెదవులు. ఆమె సౌందర్య సర్వస్వాన్ని కళ్ళకు కట్టుతున్న చీరకట్టు... 'ఇంకా పిల్లలు పుట్టలేదు'. అని చాటుతున్నట్లు , 'సంతాన లేమి'ని ప్రదర్శిస్తున్నట్టు కనిపిస్తున్న సన్నటి నడుము...


*"ఏమిటి స్వామి అలా చూస్తున్నారు ?"* భర్త చూపుల్ని గమనించిన అనసూయ అడిగింది.


అత్రి క్షణకాలం అయోమయంలో పడిపోయాడు. *"నిన్నే ! నువ్వు పతివ్రతవు. నేను సతీవ్రతుణ్ణి ! పరస్త్రీని కన్నెత్తి చూడను. నా అర్ధాంగినే చూస్తాను. అనసూయా ! రోజురోజుకీ నీ సౌందర్యం తరగడం లేదు. పెరుగుతోంది !".*


అనసూయ కళ్ళల్లో ఆనందం మెరుపు తీగలా తళుక్కుమని , అంతలోనే అంతర్థానమైంది. ఆ స్థానాన్ని మళ్ళీ ఆవేదన ఆక్రమించింది. 


*"సౌందర్యానికి సాఫల్యతా , సార్ధకతా ఉండాలి స్వామీ !"* అంటూ అనసూయ లోనికి వెళ్ళబోతూ తిరిగింది. పొడుగాటి వాలు జడ ఆమె నడుమును , తీగను చుట్టుకున్న పాములా చుట్టుకుంది. అత్రి కళ్ళు చెదిరాయి.


*"అనసూయా ! ఇలారా !"* పిలిచాడాయన.


భర్త పిలుపు పగ్గంలా పనిచేస్తూ అనసూయను అత్రి వైపుకు లాగింది. దగ్గరగా వచ్చి , నిల్చుని , తన మొహంలోకే చూస్తున్న అనసూయ చెయ్యి పట్టుకొని , పక్కన కూర్చోబెట్టుకున్నాడు. అనసూయ భర్త కళ్ళల్లోకి దీనంగా చూసింది. *"స్వామీ... సంతానం ఆశించడానికి ఇంక నోములూ , వ్రతాలూ ఏవీ మిగల్లేదు."*


అత్రి చిరునవ్వు నవ్వాడు. *"అన్ని సేవలూ చేసేశావు కదా ! ఇక... నీ పతి దేవుడి సేవలో మునిగిపో !!"*


*"స్వామీ..."*


*"అనసూయా ! నన్ను తన మానస పుత్రుడుగా సృష్టించినపుడు - ఆ సృష్టి కర్త ఏమన్నాడో తెలుసా ? తన మానస పుత్రులైన మా మూలంగా లోకంలో ప్రజా సృష్టి ఇబ్బడిముబ్బడిగా జరుగుతుందన్నాడు. అలా జరగాలన్నది ఆయన ఆకాంక్ష ! ఆయన ఆదేశం ! బ్రహ్మదేవుల వాక్కు వృధా పోదు కదా ! ఆ బ్రహ్మ సంకల్పించాలి. ఈ బ్రహ్మ మానసపుత్రుడికి అర్ధాంగి అనసూయ ద్వారా చక్కటి సంతానం కలగాలి ! అంత వరకూ మన ఆతృత ఆగాలి."*


*“అంతేనంటారా , స్వామీ !"* అనసూయ మాటల్లో అనుమానం తొంగి చూసింది. 


*"అనసూయా ! నువ్వు మహాపతివ్రతవు ! నీ ఆశ నెరవేరకుండా ఉండదు !"*


*"పతివ్రతలు నిరంతరమైన ఆవేదనలో మునిగిపోయి ఉండాలేమో అని భయమేస్తోంది స్వామీ..."*


*"అనసూయా !"*


*“అవును స్వామీ... ఆ మహాపతివ్రత శీలవతిని చూస్తుంటే !"* అనసూయ అంది. అత్రి ప్రశ్నార్థకంగా చూశాడు. *“శీలవతి అంటే... ఆ ఉగ్రశ్రవుడి భార్యే కదా !"*


*“ఔను... ఇందాక భిక్ష కోసం వచ్చింది పాపం !"* అనసూయ జాలిగా అంది. *"కుష్ఠురోగి అయిన భర్తను బుట్టలో పెట్టి , ఆ బుట్టను నెత్తి మీద పెట్టుకొని మోస్తూ కాళ్ళు అరిగేలా తిరుగుతూ భిక్షాటనం చేస్తూ , భర్తను పోషిస్తూ సేవించుకుంటోంది.


*"విన్నాను. ఆ ఉగ్రశ్రవుడు ఉగ్రస్వరూపుడనీ , కుష్ఠువ్యాధితో శరీరమూ , అకారణ ఆగ్రహంతో మనసూ పూర్తిగా పాడైపోయిందనీ ఆశ్రమ వాటికలో అందరూ అనుకుంటూ ఉంటారు !"*


*"అంతే కాదు స్వామీ ! శీలవతి భర్త వృద్ధుడు కూడా ! శీలవతిది నూత్న యవ్వనం ! భర్తది పండబారిన వృద్ధాప్యం ! ముసలితనానికి తోడుగా ముదిరిపోయిన వ్యాధి ! అతని శరీరం నుంచి దుర్గంధం చుట్టూ వ్యాపిస్తూ ఉంటుంది. అయినా , ఆ శీలవతి నిజంగానే సార్ధక నామధేయురాలు ! రోగగ్రస్థుడై , దుర్వాసన వేస్తూ , కృశించిపోతున్న భర్తనే దైవంగా భావించి సేవిస్తున్న ఆదర్శపత్ని ఆమె !"* అనసూయ ఉద్వేగంతో అంది.


*"ఔను ! శీలవతి గుణవతి , సౌందర్యవతి అని అందరూ అంటూ ఉంటారు. ఆ ఉగ్రశ్రవుడే పరమదుర్మార్గుడు. అనారోగ్యమూ , అసహాయతా అతనిలో ఆగ్రహాన్ని పుట్టించాయి. వృద్ధాప్యము , అసూయనూ , ఆ ఇల్లాలి పట్ల అనుమానాన్ని పుట్టించింది ! అందుకే దుర్మార్గుడు ఆ సాధ్విని ఒంటరిగా ఎక్కడికీ వెళ్ళనివ్వడు ! భిక్షాటనకు వెళ్ళినప్పుడు కూడా ఆమె శిరస్సు మీద తిష్ఠ వేస్తున్నాడు !"* అత్రి వివరించాడు.


*"చూశారా ! అష్టకష్టాలూ , అసంతృప్తులూ కేవలం పతివ్రతలకే !"* అనసూయ చిన్నగా నవ్వింది. 


*"ఔను ! బంగారం అందమైన ఆభరణంగా మారే ముందు దానికీ నిప్పుల్లో కాలడం , సుత్తి దెబ్బ తినడం అనే కష్టాలుంటాయి !"* అత్రి నవ్వుతూ అన్నాడు. 


*"అయితే , శీలవతి అందమైన ఆభరణంగా మారుతుందంటారా ?”* అనసూయ ప్రశ్నించింది.


*"శీలవతే కాదు. నువ్వు కూడా !"* అత్రి నవ్వుతూ అన్నాడు.


*సేకరణ:- శ్రీ రమణమూర్తి గారి వాట్సాప్ పోస్ట్.*

🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐