17, మార్చి 2026, మంగళవారం

ఆంజనేయ స్తుతి🙏

 🌸ఆంజనేయ స్తుతి🙏

    ॐॐॐॐॐॐॐ

సీ౹౹పావన!హనుమయ్య పాలింపరావయ్య!

                        భక్తులబ్రోచెడి పరమపురుష!

     సంజీవ రాయుడా! సర్వజ్ఞ! సామీర!

                 సత్వరమే రమ్ము! సాధు చరిత !

     వీరాంజనేయుడా! వినుమయ్య వినతి నీ

                     సేవయే మాకును చింత తీర్చు!

      జలధిని! లంఘించి జానకి !జాడను 

                   తెలిపిన తేజస్వి! ధీరహనుమ!

తే౹౹ సూర్యునిదరికిని జనుచు శ్రుతులనేర్చి

       వ్యాకరణపండితుడవైన వాయుపుత్ర!

       రామసుగ్రీవులకుమైత్రి! లక్షణముగ

      నెఱపినట్టి ప్రసన్నాంజనేయ !శరణు !


                "సాహితీ శ్రీ " జయలక్ష్మి పిరాట్ల

తోటకూర దొంగతనం

 శ్రీరామ (114)


                             శుభోదయం.


🙏 శ్రీరామ జయరామ జయజయరామ 🙏 సర్వే జనాః సుఖినో భవన్తు 🙏


ఒక తల్లి, తన పిల్లవాడు పక్క ఇంట్లో తోటకూర దొంగతనం చేసినప్పుడు మందలించకపోగా సంతోషించింది. 

అప్పటినుండి వాడు చిన్న చిన్న దొంగతనాలు చేస్తూ ఒక గజదొంగ అయ్యాడు.

 చివరకు పట్టుబడి జైలుకు వెళ్తూ వాళ్ళ అమ్మతో,

" అమ్మా ! తోటకూర దొంగతనం చేసినప్పుడే అది తప్పని ఎందుకు చెప్పలేదు ? "

అన్నాడని, చిన్నప్పుడు ఒక కథ విన్నాం.


ఆ విషయాన్నే,ఇంకొక తీరులో మనకు బాగా అర్థమయ్యేలా, అద్భుతంగా ఇలా శ్లోకబద్ధం చేశారు శ్రీ పుల్లెలవారు.



 శ్లో// యథాహి మలినైః వస్త్రైః యత్ర తత్రోపవిశ్యతే/

తథా స్ఖలిత చారిత్రః వృత్తశేషం న రక్షతి//


(సహజంగా ఒక కొత్త చొక్కానో, లేక ఇస్త్రీ చొక్కానో వేసుకున్న వాడు అది మలినం కాకుండా చాలా జాగ్రత్తగా ఉంటాడు.

ఒక సారి ఆ చొక్కా ఏ కారణంవల్లనైనా మలినమైతే, తరువాత ఎక్కడబడితే అక్కడ కూర్చుంటూ,ఆ వస్త్రం ఎన్నిసార్లు మలినమైనా లెక్కచేయడు.

అదే విధంగా ఒకసారి నడవడి చెడిపోయిన వాడు, తిరిగి తన శీలాన్ని రక్షించుకునే ప్రయత్నం చెయ్యకుండా ఇంకా తప్పు పనులు చేసి భ్రష్టుడవుతాడు)

 ( మహామహోపాధ్యాయ, పద్మశ్రీ పుల్లెల శ్రీరామచంద్రుడు గారు)


తన అభ్యుదయం కోరుకునేవాడు, ఈ విషయం చక్కగా గ్రహించి, మొదటి తప్పును క్షమించమని భగవంతుని ప్రార్థించాలి.

 ఆయన అనుగ్రహముతో మనస్సును నిగ్రహించుకొని అదేపనిగా తప్పులు జేస్తూ పతనం చెందకుండా, తనని తాను కాపాడుకోవాలి.


శుభమస్తు.

తూములూరి మధుసూదనరావు,

17-3-'26

మహాస్వామి వారి మేధస్సు

 మహాస్వామి వారి మేధస్సు


ఈ విషయం నా దగ్గరకు చికిత్సకు వచ్చే కోయంబత్తూరు వ్యక్తి ఒకరు చెప్పారు. 1960లలో మహాస్వామివారు కోయంబత్తూరు విచ్చేసినప్పుడు దారిలో వస్తున్నా మహాస్వామివారికి ఈ వ్యక్తి పూర్ణకుంభం సమర్పించాడు. తరువాత స్వామివారితో, “పరమాచార్య స్వామివారికి బహుశా గుర్తులేదేమో, ముప్పై ఏళ్ల క్రితం ఇదే రోడ్డులో మీరు వచ్చినప్పుడు మా నాన్నగారు మీకు పూర్ణకుంభం సమర్పించారు” అని చెప్పాడు. అందుకు స్వామివారు, “అవును. కాని అప్పుడు మీరు ఎదురుగా ఉన్న ఇంటిలో ఉండేవారు. ఇప్పుడు ఉన్న ఇంటిలో కాదు కదా!” అని అన్నారు. అంతటి జ్ఞాపకశక్తికి సూపర్ హ్యూమన్ అన్న విశేషణం కూడా సరిపోదేమో!


ఒకసారి మేము కర్నూలులో అనుకోకుండా చరిత్ర, భూగోళం గురించిన పాఠం విన్నాము. మేము శ్రీమఠం మకాంచేసిన ప్రాంతంలోని ఒక కుటీరంనుండి ఒక ఉపాధ్యాయుడు కంబోడియా మరియు థాయ్ ల్యాండ్ దేశాల ప్రజలు, చరిత్ర, మతాలు, ఆచారాలు, వారి జీవన విధానం గురించిన పాఠం చెప్పడం లీలగా విన్నాము. మేమనుకున్నాము బహుశా ఎవరో వేదపండితుడు పాఠశాలలో చదువుతున్న తన కుమారునికి బోధిస్తున్నాడు అని. కొద్దిసేపటి తరువాత ఆ కుటీరం నుండి మహాస్వామివారు బయటకువచ్చారు. అప్పుడు మాకు అర్థం అయ్యింది. ఇప్పటిదాకా మహాస్వామివారు అంతకు కొద్దిరోజుల ముందే సన్యాసం స్వీకరించిన బాల పెరియవతో సంభాషిస్తున్నారని. అన్ని విషయాలపై మహాస్వామివారికున్న పట్టు చూసి ఆశ్చర్యపోయాము.


పరమాచార్య స్వామికున్న మేధస్సు, వివిధ విషయాలపై ఉన్న అవగాహన అసాధారణం. ఒకసారి కాంచీపురం దగ్గర ఉన్న శివాస్థానంలో మహాస్వామివారు మకాం చేస్తున్నారు. దర్శనానికి మేమి అక్కడకు వెళ్ళాము. ఒక భక్తుడు అక్కడకు వచ్చి భౌతికశాస్త్రానికి సంబంధించిన ఒక సిద్ధాంతం గురించిన వ్యాసం అచ్చువేయబడిన కాగితాలను స్వామి ముందు పెట్టాడు. మద్రాసు విశ్వవిద్యాలయానికి పి హెచ్ డి కోసం దీన్ని సమర్పిస్తున్నాని, స్వామివారి ఆశీస్సులు కావాలని తెలిపాడు. అది చాలా సాంకేతికమైన క్లిష్ట విషయం. స్వామి కొన్ని క్షణాలు ఇరవై పేజీలున్న ఆ పొత్తాన్ని చూసి దాన్ని పక్కన పెట్టి ప్రసాదం ఇచ్చి పంపారు. కొద్దిసేపటికి ఆ భక్తుడు వెల్లిపోయిన తరువాత న ఆవైపు తిరిగి,

స్వామివారు : “దీన్ని తీసుకుని, ఆ చెట్టు నీడలో కూర్చుని, దీన్ని జాగ్రత్తగా చదివి, దాని సారాశం నాకు చెప్పు”


నేను దాన్ని తీసుకుని ఒక అరగంట పాటు దాన్ని చెదివి స్వామివద్దకు తిరిగొచ్చాను.


స్వామివారు : దాన్ని చదివావా? అర్థం అయ్యిందా?


నేను దాని గురించి చెప్పడం మొదలుపెట్టాను. రెండు మూడు నిముషాల తరువాత స్వామివారు మధ్యలో ఆపారు.


స్వామివారు : నువ్వు చెబుతున్నది నేను అంగీకరించను. మొదటి పేజిలో ఉన్న రెండవ పేరా, నాల్గవ పేజిలో ఉన్న మొదటి పేరా ఒకదానికొకటి విరుద్ధంగా లేవూ? వెళ్ళు మరలా చదువు.


నేను ఆశ్చర్యపోయాను. నేను మరలా చెట్టు నీడకు వెళ్లి శ్రద్ధగా చదివాను. పరమాచార్య స్వామివారు చెప్పింది నిజం. అరగంట పాటు చదివినా నాకు కనపడని ఆ విషయం, కేవలం క్షణాల్లో భక్తులకు దర్శనం ఇస్తూ ఒకసారి అలా తిరిగేసిన స్వామివారికి కనపడింది.


నన్ను వారు పరీక్షిస్తున్నారు అని అర్థం అయ్యింది. బహుశా అహంకారమనే బుడగని సుతిమెత్తగా బద్దలుకొడుతున్నారు.


--- ప్రొ. యస్. కళ్యాణరామన్, న్యూరోసర్జన్, చెన్నై. “మూమెంట్స్ ఆఫ్ ఎ లైఫ్ టైం” నుండి.


అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం

శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం ।।


#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం

ఉద్యమించే లక్షణం

  🍀🌅  *_-|¦¦|శుభోదయమ్|¦¦|-_* 🌄🍀

🪔 ॐ卐  *_-|¦¦|సుభాషితమ్|¦¦|-_* ॐ卐 💎


      శ్లో𝕝𝕝  *ఉద్యమం సాహసం ధైర్యం* 

              *బుద్ధి శక్తి పరాక్రమః* | 

              *షడైతే యత్ర వర్తన్తే* 

              *తత్ర దేవో సహాయకః* ||


తా𝕝𝕝 *ఉద్యమించే లక్షణం, సాహసం, ధైర్యం, బుద్ధి, సమయ స్ఫూర్తి, సమయానుసారంగా పోరాడటం* -

*ఈ ఆరు లక్షణాలు ఉన్నవారికి దైవం కూడా సహకరిస్తుంది.... ప్రసన్నమవుతుంది...*.


✍️🌹💐🪷🙏

*శ్రీ మహావిష్ణు పురాణం

  🌹🌷🪷🐚🛕🐚🪷🌷🌹

*సోమవారం 16 మార్చి 2026*


        *శ్రీ మహావిష్ణు పురాణం*

 `` *27వ భాగం*``

        

*కపిలమహర్షితల్లిదేవహూతికి చేసిన తత్త్వోపదేశం (3)*```


“తల్లీ! శరీరంలోకి వచ్చి పోయే జీవుడు ఎవరో తెలుసునా? భూమి, ఆకాశం, నీరు, అగ్ని, వాయువు అనే పంచభూతాల సూక్ష్మ రూపమే జీవుడు. ఈ జీవుడు జ్యోతి వలె శరీరంలో ప్రజ్వరిల్లుతూ ‘ఆత్మ’ పేరున ప్రకాశిస్తాడు. ఇటువంటి కోట్లాది ఆత్మల ఏకత్వమే పరమాత్మ స్వరూపము.


ఈ పరమాత్మ తేజస్సులా ప్రకాశించే నిరాకారుడు. ఇతడే భగవంతుడు. జీవులకు జనన మార్గమైన భగము తానైన వాడు భగవంతుడు. స్త్రీనుంచి ఉత్పన్నమైన అండమును, పంచభూతాల మయమైన పురుష ఓజస్సును మాతృగర్భంలో కలిపి పరాసృష్టికి మూలమైన వాడు భగవంతుడు.


ఆది, అనాది అయిన ఈ భగ వంతుడు నిరాకారమైన పరమాత్మ గా ప్రకాశిస్తుంటాడు. ఇతడు ఇచ్ఛాపూర్వక సృష్టికి సంకల్పించినప్పుడు నిరాకారం వదలి జీవాత్మగామారి సాకారరూపమైన దేహము ధరిస్తాడు. శరీరంలో 

చైతన్యుడైన ఆత్మగా నివసిస్తూ తాను నివసించే దేహాన్ని నడిపిస్తాడు, ఆడిస్తాడు. ఇలా భగవంతుడు ఒక దేహము నుండి కోట్లాది దేహాలను సృష్టిస్తాడు.


అన్ని దేహాలలో తాను ఆత్మగా ఉంటూ పరమాత్మగా దేహులందరి చేత జగన్నాటకం నడిపిస్తాడు. విచిత్రమేమంటే ప్రతి దేహానికి గల జీవన కథ ప్రత్యేకంగా ఉంటుంది. కథ వ్రాసేవాడు తానైనా ఆ కథతో ఏ సంబంధం పెట్టుకోడు. తామరాకు మీద నీటిబొట్టు లాగా తాను నిమిత్త మాత్రుడిగా వినోదం చూస్తూ దేహాలను, వాటి కథలను నడిపిస్తాడు. దేహి తన కథ ముగించగానే ఆ దేహము పతనమై పోతుంది. అందులోని జీవాత్మ బయటకు వచ్చి మరో దేహం లభించేంతవరకూ సంచరిస్తూ ఉంటుంది.


దేహాలను ఇలా సృష్టించి ఆడిస్తుంటాడు కనుకనే పరమాత్మని ‘దేవుడు’ అంటారు. ఈ దేవుడిని (పరమ)పురుషుడు అని కూడా అంటారు. ఇతడు నిర్గుణుడు, నిర్వికారుడు కనుక ‘నిర్గుణ పరబ్రహ్మము’ అని పిలుస్తారు. పరబ్రహ్మములో అంతర్గతంగా ఉన్న ప్రకృతి ఇతనికి సృష్టిలో సహకరిస్తుంది. ఈ ప్రకృతికి ఇరవై నాలుగు తత్త్వాలు ఉన్నాయి.


భూమి,ఆకాశం,జలం,అగ్ని,వాయువు అనే పంచ (ఐదు) భూతాలు, శబ్దం,స్పర్శ,రూపం,రసం,గంధం అనేవి పంచ భూతముల ఐదు గుణాలు, త్వక్కు,చక్షువు,శ్రోతము, జిహ్వ,ఘ్రాణము,వాక్కు,పాణి,పాదము పాయువు,ఉపస్థు అనే ఇంద్రియాలు పది, మనస్సు,బుద్ధి,చిత్తము, అహంకారం అనే నాలుగు అంతఃకరణాలు కలిపి మొత్తం ఇరవై నాలుగు తత్త్వాలు గల ప్రకృతి ‘కాలం’ చేరడంతో ఇరవై ఐదు తత్త్వాలు గలదైంది.


నిర్గుణుడైన పురుషుడితో ఇరవైఐదు తత్త్వాలు గల ఈ ప్రకృతి కలిస్తే ఆయన సగుణుడు అవుతాడు. అప్పుడు ఆయనకు రజస్సు, సత్త్వము, తమస్సు అనే త్రిగుణాలు కలుగుతాయి. వాటి వలన బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అనే త్రిమూర్తులుగా సాకార రూపుడు అవుతాడు. బ్రహ్మగా దేహాలను సృష్టిస్తాడు. విష్ణువుగా దేహాలలో ఆత్మస్వరూపుడైఉంటూ వాటిని నడిపిస్తాడు,ఆడిస్తాడు. మహేశ్వరుడిగా దేహాలలో గల ఆత్మలను బయటకు రప్పించి దేహాలను పతనం చేస్తాడు, నాశనం చేస్తాడు.


భగవంతుడు ఈవిధంగా త్రిమూర్తి రూపాలలో సృష్టి స్థితి లయ కార్యాలు నిర్వర్తిస్తున్నా ఏ దేహంతో సంబంధం కలిగి ఉండడు. ఏ దేహం ఆయనది కాదు. ఇప్పుడు చెప్పమ్మా! పరమాత్మ సృష్టిలో పుట్టి నశించే ఈ దేహం ఎవరిది? ఎవరికి దేహిపైన, దేహం పైన హక్కు, అధికారం ఉంటుంది.

అమ్మా! ఈ దేహంలో జీవుడు ఉన్నంత వరకే బంధాలు అనుబంధాలు, ప్రేమలు మమకారాలు వెంట ఉంటాయి. దేహం నశించడంతో అంతమై పోతాయి. దేహం వదిలిన జీవుడికి వీటితో ఏ సంబంధం ఉండదు. అతనికి మరో దేహయాత్ర ఆరంభం ఔతుంది. మరో కొత్త బంధాలు, అనుబంధాలు మొదలవుతాయి. కనుక అశాశ్వతమైన దేహంతో ఏర్పడిన భవబంధాల గురించి ప్రాకులాడటం, దుఃఖించడం వలన ప్రయోజనం ఏమి ఉండదు.

అందుకే జ్ఞానులైన వారు భవబంధాల చింతలు వదిలి మనస్సులో విష్ణువుని నిలుపుకుని నిరంతరం ధ్యానిస్తారు. అమ్మా! మన మనస్సే అన్ని బంధాలకు, మోహాలకు, మోక్షానికి కారణం. కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలు అనే అరిషడ్వ ర్గాలు మనిషికి అంతర్గత శత్రువులు. వీటిని జయించ గలిగితే మనస్సు పరిశుద్దమవుతుంది. పరిశుద్ధమైన మనస్సులో ఉన్న జీవుడే పరమాత్మ అనే విశ్వాసం కలిగితే అది భక్తిగా మారుతుంది. భక్తితో భగవంతుడు దగ్గరవుతాడు. పరమాత్మ సాక్షాత్కారం అవుతుంది. 


అప్పుడు జీవుడు తన దేహాముతో సహా కనిపించే ప్రపంచము అంతా మిధ్య మాయ అని, అశాశ్వతం అని తెలుసుకుంటాడు. తక్షణమే జీవాత్మకు నిర్మలమై కనిపించే ప్రపంచంలోని ప్రతి వస్తువులో వాసుదేవ స్వరూపం గోచరిస్తుంది. నేను - నాది, దేహం - దేహి అన్న మాయ తొలగి పోతుంది. భగవంతుని దర్శనం భక్తి మార్గం ద్వారా పొందిన జీవుడు మోక్షం పొందుతాడు.


మోక్షము అంటే ఏమిటో తెలుసా అమ్మా! ఏపరమాత్మ, పరబ్రహ్మo నుంచి ఆత్మగా, అణువుగా బయటకు వచ్చామో, తిరిగి అదే పరమ-ఆత్మలో లీనమై పోవడం మోక్షం అవుతుంది. జీవాత్మ పరమాత్మలో లీనమైనప్పుడు నిర్మలమైన బ్రహ్మానందాన్ని పొందుతాడు” అని కపిలుడు తల్లి దేవహూతికి ఉపదేశం చేశాడు.


వింటున్న దేవహూతికి పరమానందం కలిగి కళ్ళ నుండి ఆనంద బాష్పాలు జలాజలా వచ్చాయి. మనస్సుని కమ్ముకున్న మోహ మాయా బంధాల తెర తొలగి పోయింది. కుమారుడైన కపిలునిలో శ్రీమన్నారాయణుడు కనిపించాడు. భగవంతుని దర్శనంతో తన్మయత్వం చెంది "నారాయణా! నీ దివ్య దర్శనంతో జన్మ ధన్యమైంది. నాకుపుత్రుడిగా జన్మించి నన్ను 

చరితార్థురాలిని చేశావు. ఇరవైఐదు తత్త్వాల సాంఖ్య యోగము, సృష్టి రహస్యం బోధించి అహంకార మమకారాలను తొలగించావు. నాకు ఈ దేహముపై మోహము పోయింది. పరమాత్మలో లీనమై జన్మరాహిత్యం పొందే ఉపాయం చెప్పు తండ్రీ" అని ప్రార్ధించింది.


కపిలుడు ఆమెకు అష్టాక్షరి మహామంత్రమైన "ఓం నమో నారాయణాయ" ఉపదేశించి "తల్లీ! శ్రీహరిని మనస్సులో నిలుపుకుని ఈ మహామంత్ర జపం చేయుము. సమస్త విశ్వము వాసుదేవ మయంగా కనిపించిన నాడు జీవన్ముక్తి లభిస్తుంది" అని ప్రబోధించాడు. 


దేవహూతి సమస్తం త్యజించి బిందు సరోవరంలో త్రికాల స్నానమాచరిస్తూ నిశ్చల భక్తితో అష్టాక్షరి మంత్రం జపిస్తూ తపస్సు చేసింది. తపస్సిద్ది పొంది నారాయణునిలో లీనమైంది. 


ఆమెకు మోక్ష ప్రాప్తి కలిగిన ప్రదేశం "సిద్దిపదం" గా ప్రసిద్ది చెందింది.


కపిల మహర్షి సాంఖ్య యోగం భూమండలమంతా పర్యటించి ప్రవచించి ప్రతిష్టించాడు. ఉత్తర సముద్రం తీరం చేరిన కపిల మహర్షిని సాగరుడు స్వాగతం పలికి పాదపూజలు చేశాడు. కపిల మహర్షి ఉత్తర సముద్ర జలాలలో ప్రవేశించి పాతాళ లోకము చేరి ఆశ్రమం 

ఏర్పరచుకుని తపస్సులో నిమగ్నుడయ్యాడు.


*తరువాత కధ రేపటి భాగంలో చదువుదాం*

*శ్రీకాంత్ గంజికుంట కరణంగారి సౌజన్యంతో*


*ఆధ్యాత్మిక బృందం* నుండి వచ్చింది                     

                *సేకరించి*

*భాగస్వామ్యం చేయడమైనది*


 *న్యాయపతి నరసింహారావు*

🙏🌷🪷🪔🛕🪔🪷🌷🙏

మంగళవారం*🍁 *🌹17మార్చి2026🌹* *దృగ్గణిత పంచాంగం*

  *卐ॐ ఓం శ్రీ 🌹గురుభ్యోనమః ॐ卐*      

   🍁 *మంగళవారం*🍁

  *🌹17మార్చి2026🌹*   

    *దృగ్గణిత పంచాంగం*  

               

           *ఈనాటి పర్వం*

     *🔱మాస శివరాత్రి🔱* 


          *స్వస్తి శ్రీ విశ్వావసు* 

          *నామ సంవత్సరం* 

*ఉత్తరాయణం - శిశిర ఋతౌః*

*ఫాల్గుణమాసం - కృష్ణ పక్షం*


*తిథి      : త్రయోదశి* ‌ఉ 09.23 వరకు ఉపరి *చతుర్దశి*

*వారం    : మంగళవారం* ( భౌమవాసరే )

*నక్షత్రం   : ధనిష్ఠ* ఉ 06.22 వరకు ఉపరి *శతభిషం*

*యోగం  : సిద్ధ* ఉ 08.15 వరకు ఉపరి *సాధ్య*

*కరణం   : వణజి* ఉ 09.23 *భద్ర* రా 08.59 ఉపరి *శకుని*

*సాధారణ శుభ సమయాలు:*

             *-ఈరోజు లేవు-*               

అమృత కాలం  : *రా 11.01 - 12.36*

అభిజిత్ కాలం  : *ప 11.52 - 12.40*

*వర్జ్యం            : మ 01.30 - 03.05*

*దుర్ముహూర్తం  : ఉ 08.39 - 09.27 రా 11.04 - 11.52*

*రాహు కాలం   : మ 03.17 - 04.47*

గుళికకాళం      : *మ 12.16 - 01.46*

యమగండం    : *ఉ 09.15 - 10.45*

సూర్యరాశి : *మీనం*                         

చంద్రరాశి : *కుంభం*

సూర్యోదయం :*ఉ 06.23*

సూర్యాస్తమయం :*సా 06.26*

*ప్రయాణశూల   : ఉత్తర దిక్కుకు పనికిరాదు*

*వైదిక విషయాలు:*

ప్రాతః కాలం     :*ఉ 06.14 - 08.39*

సంగవ కాలం    :*08.39 -11.03*

మధ్యాహ్న కాలం   :  *11.03-01.28*

అపరాహ్న కాలం  :*మ 01.28- 03.53*

*ఆబ్ధికం తిధి        : ఫాల్గుణ బహుళ చతుర్దశి*

సాయంకాలం  :*సా 03.53 - 06.18*

ప్రదోష కాలం    :*సా 06.18 - 08.41*

రాత్రి కాలం        :*రా 08.41 - 11.52*

నిశీధి కాలం       :*రా 11.52 - 12.39*

బ్రాహ్మీ ముహూర్తం :*తె 04.38 - 05.26*

******************************

        *🌷ప్రతినిత్యం🌷*

        *_గోమాతను 🐄 పూజించండి_* 

        *_గోమాతను 🐄 సంరక్షించండి_*


 *శ్రీ ఆంజనేయ స్తోత్రం*

🌷🔥🌷🔥🌷🔥🌷


*మౌజ్ఞీకౌపీనసంయుక్తం* 

*హేమయజ్ఞోపవీతినమ్*

*పిఙ్గళాక్షం మహాకాయం* 

*టఙ్కశైలేన్ద్రధారిణమ్.!!*


            🍁 *ఓం శ్రీ*🍁

🌹 *ఆంజనేయాయ నమః*🌹


🍁🪷🌹🛕🌹🌷🪷🌷🍁

*సర్వే జనాః సజ్జనో భవంతు !*

*సర్వే సజ్జనా స్వజనో భవంతు !!*

*సర్వే స్వజనా సుకృతో భవంతు !*

*సర్వే సుకృత జనః సుఖినో భవంతు !!*

<><><><><><><><><><><><><><>


         🌷 *సేకరణ*🌷

      🌹🌿🍁🍁🌿🌹

        *న్యాయపతి వేంకట*

       *లక్ష్మీ నరసింహా రావు*

      🌷🍃🍁🍁🍃🌷

 🌹🌷🍁🍁🍁🍁🌷🌹

వెండిపళ్ళెరమున

 🪷 *"శుభోదయ సుప్రభాతం"* 🪷


ఆ.వె.

వెండిపళ్ళెరమున వేడ్కగా కుంకుమ 

నింపి నింగి నుంచ నెగడినట్లు 

తూర్పుదిక్కునందు తొంగిజూచె నినుడు 

తెల్లవారెను నేస్తమా! తీరు లెమ్ము! 

*~శ్రీశర్మద*

*శ్రీ మహావిష్ణు పురాణం*

 🌹🌷🪷🐚🛕🐚🪷🌷🌹

*సోమవారం 16 మార్చి 2026*


        *శ్రీ మహావిష్ణు పురాణం*

 ``            *27వ భాగం*``

        

*కపిలమహర్షితల్లిదేవహూతికి చేసిన తత్త్వోపదేశం (3)*```


“తల్లీ! శరీరంలోకి వచ్చి పోయే జీవుడు ఎవరో తెలుసునా? భూమి, ఆకాశం, నీరు, అగ్ని, వాయువు అనే పంచభూతాల సూక్ష్మ రూపమే జీవుడు. ఈ జీవుడు జ్యోతి వలె శరీరంలో ప్రజ్వరిల్లుతూ ‘ఆత్మ’ పేరున ప్రకాశిస్తాడు. ఇటువంటి కోట్లాది ఆత్మల ఏకత్వమే పరమాత్మ స్వరూపము.


ఈ పరమాత్మ తేజస్సులా ప్రకాశించే నిరాకారుడు. ఇతడే భగవంతుడు. జీవులకు జనన మార్గమైన భగము తానైన వాడు భగవంతుడు. స్త్రీనుంచి ఉత్పన్నమైన అండమును, పంచభూతాల మయమైన పురుష ఓజస్సును మాతృగర్భంలో కలిపి పరాసృష్టికి మూలమైన వాడు  భగవంతుడు.


ఆది, అనాది అయిన ఈ భగ వంతుడు నిరాకారమైన పరమాత్మ గా ప్రకాశిస్తుంటాడు. ఇతడు ఇచ్ఛాపూర్వక సృష్టికి సంకల్పించినప్పుడు నిరాకారం వదలి జీవాత్మగామారి సాకారరూపమైన దేహము ధరిస్తాడు. శరీరంలో 

చైతన్యుడైన ఆత్మగా నివసిస్తూ తాను నివసించే దేహాన్ని నడిపిస్తాడు, ఆడిస్తాడు. ఇలా భగవంతుడు ఒక దేహము నుండి కోట్లాది దేహాలను సృష్టిస్తాడు.


అన్ని దేహాలలో తాను ఆత్మగా ఉంటూ పరమాత్మగా దేహులందరి చేత జగన్నాటకం నడిపిస్తాడు.  విచిత్రమేమంటే ప్రతి దేహానికి గల జీవన కథ ప్రత్యేకంగా ఉంటుంది. కథ వ్రాసేవాడు తానైనా ఆ కథతో ఏ సంబంధం పెట్టుకోడు. తామరాకు మీద నీటిబొట్టు లాగా తాను నిమిత్త మాత్రుడిగా వినోదం చూస్తూ దేహాలను, వాటి కథలను నడిపిస్తాడు.  దేహి తన కథ ముగించగానే ఆ దేహము పతనమై పోతుంది. అందులోని జీవాత్మ బయటకు వచ్చి మరో దేహం లభించేంతవరకూ సంచరిస్తూ ఉంటుంది.


దేహాలను ఇలా సృష్టించి ఆడిస్తుంటాడు కనుకనే పరమాత్మని ‘దేవుడు’ అంటారు. ఈ దేవుడిని (పరమ)పురుషుడు అని కూడా అంటారు. ఇతడు నిర్గుణుడు, నిర్వికారుడు కనుక ‘నిర్గుణ పరబ్రహ్మము’ అని పిలుస్తారు. పరబ్రహ్మములో అంతర్గతంగా ఉన్న ప్రకృతి ఇతనికి సృష్టిలో సహకరిస్తుంది. ఈ ప్రకృతికి ఇరవై నాలుగు తత్త్వాలు ఉన్నాయి.


భూమి,ఆకాశం,జలం,అగ్ని,వాయువు అనే పంచ (ఐదు) భూతాలు,  శబ్దం,స్పర్శ,రూపం,రసం,గంధం అనేవి పంచ భూతముల ఐదు గుణాలు, త్వక్కు,చక్షువు,శ్రోతము, జిహ్వ,ఘ్రాణము,వాక్కు,పాణి,పాదము పాయువు,ఉపస్థు అనే  ఇంద్రియాలు పది, మనస్సు,బుద్ధి,చిత్తము, అహంకారం అనే నాలుగు అంతఃకరణాలు కలిపి మొత్తం ఇరవై నాలుగు తత్త్వాలు గల ప్రకృతి  ‘కాలం’ చేరడంతో ఇరవై ఐదు తత్త్వాలు గలదైంది.


నిర్గుణుడైన పురుషుడితో ఇరవైఐదు తత్త్వాలు గల ఈ ప్రకృతి కలిస్తే ఆయన సగుణుడు అవుతాడు. అప్పుడు ఆయనకు రజస్సు, సత్త్వము, తమస్సు అనే త్రిగుణాలు కలుగుతాయి. వాటి వలన బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అనే త్రిమూర్తులుగా సాకార రూపుడు అవుతాడు. బ్రహ్మగా దేహాలను సృష్టిస్తాడు. విష్ణువుగా దేహాలలో ఆత్మస్వరూపుడైఉంటూ వాటిని నడిపిస్తాడు,ఆడిస్తాడు. మహేశ్వరుడిగా దేహాలలో గల ఆత్మలను బయటకు రప్పించి దేహాలను పతనం చేస్తాడు, నాశనం చేస్తాడు.


భగవంతుడు ఈవిధంగా త్రిమూర్తి రూపాలలో సృష్టి స్థితి లయ కార్యాలు నిర్వర్తిస్తున్నా ఏ దేహంతో సంబంధం కలిగి ఉండడు. ఏ దేహం ఆయనది కాదు. ఇప్పుడు చెప్పమ్మా! పరమాత్మ సృష్టిలో పుట్టి నశించే ఈ దేహం ఎవరిది? ఎవరికి దేహిపైన, దేహం పైన హక్కు, అధికారం ఉంటుంది.

అమ్మా! ఈ దేహంలో జీవుడు ఉన్నంత వరకే బంధాలు అనుబంధాలు, ప్రేమలు మమకారాలు వెంట ఉంటాయి. దేహం నశించడంతో అంతమై పోతాయి. దేహం వదిలిన జీవుడికి వీటితో ఏ సంబంధం ఉండదు. అతనికి మరో దేహయాత్ర ఆరంభం ఔతుంది. మరో కొత్త బంధాలు, అనుబంధాలు మొదలవుతాయి. కనుక అశాశ్వతమైన దేహంతో ఏర్పడిన భవబంధాల గురించి ప్రాకులాడటం, దుఃఖించడం వలన ప్రయోజనం ఏమి ఉండదు.

అందుకే జ్ఞానులైన వారు భవబంధాల చింతలు వదిలి మనస్సులో విష్ణువుని నిలుపుకుని నిరంతరం ధ్యానిస్తారు. అమ్మా! మన మనస్సే అన్ని బంధాలకు, మోహాలకు, మోక్షానికి కారణం.  కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలు అనే అరిషడ్వ ర్గాలు మనిషికి అంతర్గత శత్రువులు. వీటిని జయించ గలిగితే మనస్సు పరిశుద్దమవుతుంది.  పరిశుద్ధమైన మనస్సులో ఉన్న జీవుడే పరమాత్మ అనే విశ్వాసం కలిగితే అది భక్తిగా మారుతుంది. భక్తితో భగవంతుడు దగ్గరవుతాడు. పరమాత్మ సాక్షాత్కారం అవుతుంది. 


అప్పుడు జీవుడు తన దేహాముతో సహా కనిపించే ప్రపంచము అంతా మిధ్య మాయ అని, అశాశ్వతం అని తెలుసుకుంటాడు. తక్షణమే జీవాత్మకు నిర్మలమై కనిపించే ప్రపంచంలోని ప్రతి వస్తువులో వాసుదేవ స్వరూపం గోచరిస్తుంది. నేను - నాది, దేహం - దేహి అన్న మాయ తొలగి పోతుంది. భగవంతుని దర్శనం  భక్తి మార్గం ద్వారా పొందిన జీవుడు మోక్షం పొందుతాడు.


మోక్షము అంటే ఏమిటో తెలుసా అమ్మా!  ఏపరమాత్మ, పరబ్రహ్మo నుంచి ఆత్మగా, అణువుగా బయటకు వచ్చామో, తిరిగి అదే పరమ-ఆత్మలో లీనమై పోవడం మోక్షం అవుతుంది. జీవాత్మ పరమాత్మలో లీనమైనప్పుడు నిర్మలమైన బ్రహ్మానందాన్ని పొందుతాడు” అని కపిలుడు తల్లి దేవహూతికి ఉపదేశం చేశాడు.


వింటున్న దేవహూతికి పరమానందం కలిగి కళ్ళ నుండి ఆనంద బాష్పాలు జలాజలా వచ్చాయి. మనస్సుని కమ్ముకున్న మోహ మాయా బంధాల తెర తొలగి పోయింది. కుమారుడైన కపిలునిలో శ్రీమన్నారాయణుడు కనిపించాడు. భగవంతుని దర్శనంతో తన్మయత్వం చెంది "నారాయణా! నీ దివ్య దర్శనంతో జన్మ ధన్యమైంది. నాకుపుత్రుడిగా జన్మించి నన్ను 

చరితార్థురాలిని చేశావు. ఇరవైఐదు తత్త్వాల సాంఖ్య యోగము, సృష్టి రహస్యం బోధించి అహంకార మమకారాలను తొలగించావు. నాకు ఈ దేహముపై మోహము పోయింది. పరమాత్మలో లీనమై జన్మరాహిత్యం పొందే ఉపాయం చెప్పు తండ్రీ" అని ప్రార్ధించింది.


కపిలుడు ఆమెకు అష్టాక్షరి మహామంత్రమైన "ఓం నమో నారాయణాయ" ఉపదేశించి "తల్లీ! శ్రీహరిని మనస్సులో నిలుపుకుని ఈ మహామంత్ర జపం చేయుము. సమస్త విశ్వము వాసుదేవ మయంగా కనిపించిన నాడు జీవన్ముక్తి లభిస్తుంది" అని ప్రబోధించాడు. 


దేవహూతి సమస్తం త్యజించి బిందు సరోవరంలో త్రికాల స్నానమాచరిస్తూ నిశ్చల భక్తితో అష్టాక్షరి మంత్రం జపిస్తూ తపస్సు చేసింది. తపస్సిద్ది పొంది నారాయణునిలో లీనమైంది. 


ఆమెకు మోక్ష ప్రాప్తి కలిగిన ప్రదేశం "సిద్దిపదం" గా ప్రసిద్ది చెందింది.


కపిల మహర్షి సాంఖ్య యోగం భూమండలమంతా పర్యటించి ప్రవచించి ప్రతిష్టించాడు. ఉత్తర సముద్రం తీరం చేరిన కపిల మహర్షిని సాగరుడు స్వాగతం పలికి పాదపూజలు చేశాడు. కపిల మహర్షి ఉత్తర సముద్ర జలాలలో ప్రవేశించి పాతాళ లోకము చేరి ఆశ్రమం 

ఏర్పరచుకుని తపస్సులో నిమగ్నుడయ్యాడు.


*తరువాత కధ రేపటి భాగంలో చదువుదాం*

*శ్రీకాంత్ గంజికుంట కరణంగారి సౌజన్యంతో*


*ఆధ్యాత్మిక బృందం* నుండి వచ్చింది                     

                *సేకరించి*

*భాగస్వామ్యం చేయడమైనది*


 *న్యాయపతి నరసింహారావు*

🙏🌷🪷🪔🛕🪔🪷🌷🙏

పద్యరచనలో

 


పద్యరచనలో దోషాలు లేకుండా ఉండాలని ఛందశ్శాస్త్రం చెబుతోంది. చూడటానికి ఇదొక కళగా, క్రీడగా అనిపిస్తున్నా... ఇదొక శాస్త్రం. 


వేదమునకు ఆరు అంగములు కలవు. 


*"శిక్ష-వ్యాకరణము-ఛంధస్సు నిరుక్తము-జ్యోతిషము-కల్పము అను ఆరు వేదము యొక్క అంగములు."*


వీటినే షట్ శాస్త్రములు అని కూడా అంటారు. అపౌరుషేయమైన వేదము కూడా ఛందోబద్ధమైనదే. 


కనుక పద్యం అనేది ఛందోబద్ధంగా ఉండాలి కాని, ఛందోభంగములు ఉండకూడదు. 


ఛందోభంగములతో పద్యాన్ని వ్రాయటం అవయవలోపాలతో శిశువు జన్మించటంవంటిదే. 


పద్యరచనరో ఏవిధమైన లోపాలు లేకుండా ఉండాలో.... ఈ క్రింద వ్రాస్తాను. 


దయచేసి ఇకపై ఛందోభంగాలు లేకుండా వ్రాయటానికి ప్రయత్నించగలరు. 


*"ఈ "వైదికప్రపంచం" లో అనేకమంది సంస్కృత, ఆంధ్రభాషాపండితులతోపాటు పద్మశ్రీ అవార్డు గ్రహీతలైన సంస్కృతభాషాకోవిదులు కూడా ఉన్నారు."* దోషభూయిష్టమైన కవిత్వాన్ని చూచి వీరందరితోపాటు సంస్కృత సాహిత్యాలకు అధిదీవత అయిన సరస్వతీమాత కూడా బాధపడుతుంది.

*పద్యరచన-దశవిధదోషములు*


 ఏ పద్యములు ఎలా వ్రాయాలో తెలుసుకోవడానికి ముందు పద్య రచన చేసేసమయంలో చేయకూడని పది దోషములు తెలుసుకుందాము. పద్య రచన యందు సహజముగా వచ్చెడి దోషాలు 10 గుర్తించారు మనపూర్వులు. అవి ఈ క్రింది విధంగా ఉన్నాయి.


*1) గణ భంగము:-* గురువు వ్రాయ వలసిన స్థానంలో లఘువు వ్రాసినా, లఘువు బదులు గురువు వ్రాసినా ఈ గణ భంగమనే దోషం వస్తుంది.


*2) యతి భంగము:* యతి స్థానము నందు యతి మైత్రికి సరిపోయే అక్షరం లేకపొయినా....యతికి   యతిమైత్రి సరిపోక పోయినా.... యతి స్థానం మారినా.... అది యతి భంగముగా గుర్తించ వలెను.


*3) సంశయము:-*

పద్య పాదాలలో అర్ధం సరిగ్గా చెప్పలేకపొయినా.. అర్ధంలో సంశయమున్నా.. సంశయ దోషము అంటారు.


*4) విసంధి:-* సంధి చేయవలసిన చోట సంధి చేయకపోతే అది విసంధి దోషము అవుతుంది. తప్పనిసరిగా సంధి చేయవలెను. పద్యరచనలో ఇది అవశ్యము.

సంధి పొసగని యెడల యడాగమ సంధినైనా చేయవలెను.  ఉత్వ సంధి వంటి నిత్య సంధిని అసలు విస్మరించ రాదు)


*5) పునరుక్తము:-* 

ఒక శబ్ధాన్ని మరల మరల ప్రయోగించడం పునరుక్త దోషము ఒకే అర్ధం వచ్చే విధముగా శబ్దములను పలుమార్లు  ప్రయోగించకూడదు.


*6)అపశబ్దము:-* వ్యాకరణంతో సంబంధము లేకుండా...కుసంధులు, దుస్సంధి, వైరి సమాసాలు  ఉపయోగించరాదు.


*7)వ్యర్ధము:-* అనవసరమైన అక్షరములు, పదములు, అనుగుణముగా లేని పదములు, కూడని మాటలు వాడిన.. "వ్యర్ధము" అనే దోషము కలుగుతుంది.


 *8) అపక్రమము:-*

వరుస తప్పడమే అపక్రమము.

ఉదా:  బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు.. అంటూ.. లక్ష్మీ దేవి, సరస్వతీ దేవి, పార్వతీ దేవి అన రాదు...సరస్వతీ దేవి, లక్ష్మీ దేవి, పార్వతీ దేవి అని అనాలి.  


*9) అపార్ధము:-*

సరి అయిన అర్ధము లేకుండా.. ప్రాస కోసమో.. యతి కోసమో శూన్య  పదాలు వాడ రాదు  వాడిన ఎడల  అపార్ధ దోషమంటారు.


*10) విరోధము:-* ప్రకృతి విరుద్ధంగా వర్ణించ రాదు, భౌగోళికాంశములకు విరుద్ధంగా రచనలు చేయరాదు. 

ఉదా:  

ఆ.వె

అమిత భక్తితోడ నానందముప్పొంగ

విప్రుడొకండు జేరి విజయవాడ

గౌతమందు మునిగి కనకదుర్గఁ గొలిచి

సేద దీరెనతడు చెట్టు క్రింద !   (ఇలా ఒక ఆ.వె పద్యము వ్రాసామనుకుందాము)


"భక్తి విశ్వాసములు మెండుగాగల ఒక బ్రాహ్మణుడు విజయవాడ చేరి కనక దుర్గమ్మ పాదాల చెంత గౌతమీ నదిలో స్నానమాచరించి కనకదుర్గతల్లి దర్శనం చేసుకున్న పిదప చెట్టుక్రింద సేద తీరినాడ"ని కదా ఈ పద్యభావము  కాని అక్కడ విజయవాడలో కనకదుర్గమ్మ తల్లి పాదాలచెంత ప్రవహించేది కృష్ణమ్మ తల్లి. గోదావరి మాత కాదు. కావున పై పద్యము ప్రకృతి విరుద్ధంగా ఉందని తెలుసుకోవాలి. ఇలా వ్రాసినచో అది విరోధము దోషము అవుతుంది.


*నిషిద్ధ గణము వాడుట:-*  కంద పద్యం లో.. జ గణం బేసి గణము గా వాడ రాదు కదా. 6 వగణము తప్పనిసరిగా జ గణము లేదా నల గణము వ్రాయలికదా, ఆవిధంగా వాడకుంటే అది నిషిద్ద గణం అవుతుంది.


*పదచ్చేద భంగము:-* ద్విపద, మంజరీ ద్విపద లలో ఏ పాదమునకు ఆపాదము విడి విడివిడిగా వ్రాయలి రెండు పాదములు కలుప రాదు


పద్యాలు అందలి రకాలు...,                        

కం//

విద్యలలోపల నుత్తమ

విద్య కవిత్వంబు మఱి కవిత్వము ఛందో

వేద్యముఁ గావునఁ జెప్పెద

హృద్యంబుగఁ గవిత చందమేర్పడఁ గృష్ణా! (చందోదర్పణము-అనంతామాత్యుడు)    


అన్ని విద్యలలోను  కవిత్వము ఉత్తమ విద్యయని ఆ కవిత్వము ఛందస్సు వలననే రంజిల్లు తున్నదని అనంతామాత్యుడు చందోదర్పణములో తెలియ చేసినాడు.


🕉️🪷🕉️🪷🕉️

పద్యరచనలకోసం సమస్యలు,దత్తపదులు, వ్యస్తాక్షరి, న్యస్తాక్షరి, వర్ణన, పురాణపఠనము మొదలైన అంశాలను ఉద్దండులైన అవధానులైన కవిపండితులకు ఇస్తుంటారు. 


వాటిని సభాముఖంగా స్వీకరించిన ఆ అవధానులైన కవిపండితులు సమర్థవంతంగా వివిధఛందస్సులలో పూరిస్తుంటారు. 


ఈ అవధానులు ఉద్దండులైనట్లే...  అంశాలను అడిగే పృచ్ఛకులు కూడా గొప్పకవులే అయి ఉంటారు. 


*ఈ విధంగా అంశాలను అడిగిన పృచ్ఛకులైన కవులుకూడా తామిచ్చిన సమస్య మొదలైన అంశాలకు సంబంధించిన పద్యాలను వ్రాయటం సంప్రదాయం మరియు గౌరవం.*


*ఆ విధంగా పద్యపూరణలను చేయలేనివారు పృచ్ఛకులుగా అనర్హులు.*


*"నారుద్రో రుద్రమర్చయేత్* 

అంటే రుద్రుడు కానివాడు రుద్రునికి అర్చన చేయటానికి అనర్హుడు." అందుకే రుద్రార్చనకు ముందు మహాన్యాసం చేసి తనలో రుద్రుని ఆవాహన చేసుకొని తాను రుద్రుడిగా మారటం జరుగుతుంది. 


అదేవిధంగా పద్యపూరణలను కవులనుండి కోరేముందు ఆ విధంగా పద్యపూరణలను కోరేవారు కూడా ఛందోరీతులను తెలిసిక కవులై ఉండాలి. 


కాకపోయినట్లైతే...  వారు కవిపండితులను, ఛందశ్శాస్త్రాన్ని అవమానించినట్లే.



వేద ఆశీర్వచనం

 *నమస్తే సదా వత్సలే మాతృ భూమే*


*కలియుగాబ్ది 5126*

*శ్రీ శాలివాహన శకం 1947 స్వస్తి శ్రీ చాంద్రమాన విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణము - శిశిర ఋతువు - ఫాల్గుణ మాసం - కృష్ణ పక్షం - త్రయోదశి - శతభిషం -‌‌ భౌమ వాసరే* (17.03.2026)


ప్రముఖ వేదపండితులు, తణుకు /తాలూకా ఇరగవరం వాస్తవ్యులు 

*బ్రహ్మశ్రీ గుళ్ళపల్లి శివశర్మ ఘనపాఠీ* *(9491391009, ఈ 9440091234)* గారి నేటి వేద ఆశీర్వచనం.




 

.🙏🙏 

భవదీయుడు

దశిక ప్రభాకరశాస్త్రి 

9849795167

---------------------------------------------

*పిల్లలకి బతుకుతో పాటు భారతీయత కూడా నేర్పండి*

 కవి మిత్రులకు వందనాలు 

దత్త పది

కేకలు

పోకలు 

నూకలు 

రూకలు


పదాలను ఉపయోగించి ఒక వివాహ వేడుకను వర్ణించగలరు

కాళీపురాణం

 🕉️ కాళీపురాణం ప్రకారం ఒక అద్భుతమైన ఘటన 🕉️

“కాళీపురాణానుసారం ఆదిపరాశక్తి దర్శనం కోసం నారాయణుడు అత్యంత ఆనందంతో ఎదురుచూస్తున్నాడు.

కాని మహాకాళి తన ఘోరమైన, భయంకరమైన ఉగ్రరూపంతో ప్రత్యక్షమైనప్పుడు, ఆ రూపాన్ని నారాయణుని నేత్రాలు తట్టుకోలేకపోయాయి.

అందువల్ల ఆయన భయంతో తన చేతులతో తన కళ్లను మూసుకున్నాడు.”

అప్పుడు ఆదిపరాశక్తి స్వల్పంగా చిరునవ్వు చిందిస్తూ ఇలా అన్నారు:

“హే నారాయణా! నీవు ఈ రూపాన్ని చూసి భయపడుతున్నావా?

ఇదే నా నిజమైన స్వరూపం.

సృష్టి, స్థితి, లయం అన్నీ ఈ శక్తి ద్వారానే జరుగుతాయి.

భయంకరంగా కనిపించే ఈ రూపమే భక్తులను రక్షించే కరుణామయి శక్తి.”

అప్పుడు నారాయణుడు వినయంతో నమస్కరిస్తూ ఇలా అన్నాడు:

“అమ్మా! నీ అపారమైన మహాశక్తిని నేను గ్రహించలేకపోయాను.

ఇప్పుడు నీ తత్త్వాన్ని అర్థం చేసుకున్నాను.

నీవే జగత్తుకు ఆదికారణం, నీవే సృష్టికి మూలశక్తి.”

అప్పుడు మహాకాళి తన ఉగ్రరూపాన్ని ఉపసంహరించి, శాంతస్వరూపంతో నారాయణునికి దర్శనమిచ్చింది.

ఆ దర్శనంతో నారాయణుని మనస్సు పరమానందంతో నిండిపోయింది.

🌺 తాత్పర్యం:

మహాకాళి యొక్క ఉగ్రరూపం భయపెట్టడానికి కాదు;

అది అధర్మాన్ని నాశనం చేయడానికి మరియు భక్తులను రక్షించడానికి ప్రదర్శించే దివ్యశక్తి.

https://whatsapp.com/channel/0029Vailh8bGk1FuDeog9W21/1503

ఆమెనే ఆదిపరాశక్తి – సృష్టి యొక్క మూలకారణం.

🔱 జై మహాకాళి 🔱

🔱 జై ఆదిపరాశక్తి 🔱