17, నవంబర్ 2020, మంగళవారం

ఒబేసిటీ

 ఒబేసిటీ గురించి సంపూర్ణ వివరణ  -


     ఒబేసిటీ గురించి ఆయుర్వేదం చాలా చక్కగా వివరిస్తుంది. ఆయుర్వేదంలో అతి కొవ్వురోగం అని పిలుస్తారు . ఒబేసిటీ రావడానికి గల ప్రధాన కారణం శ్లేష్మకారకాలు అయిన పదార్ధాలను అతిగా తీసుకోవడం అదేవిధముగా అంతకు ముందు తీసుకున్న ఆహారం సంపూర్ణంగా జీర్ణం కాకుండానే మళ్ళీ ఆహారం తీసుకోవడం , సరైన వ్యాయామం చేయకపోవటం , పగలు అతిగా నిద్రించడం , మైధున ప్రక్రియ లేకపోవడం , మనస్సుకు ఆలోచన లేకుండా ఒకేచోట  కూర్చుండిపోవడం వంటి కారణాల వలన శరీరంలో కొవ్వు ఎక్కువ పేరుకొనిపోవును. స్థూలకాయుల అయిన తల్లితండ్రులకు పుట్టడంకూడా మరొక కారణం అగును.


         పైన చెప్పిన కారణాల వల్లన శరీరంలో మేధోధాతువు వృద్ధిపొందుతుంది. శరీరంలో కొవ్వుపెరగడం మొదలైతే ఏది తినినను అది కొవ్వుగా మారును . శరీరానికి అవసరం అయిన మిగిలిన ధాతువులుగా ఆహారరసం పరిణమించదు. ఒక్క కొవ్వు మాత్రమే పెరుగుతూ మిగిలిన ధాతు పోషణం లేకపోవటం వలన ఆయుష్షు తగ్గిపోవును .


                శరీరంలో పెరిగే కొవ్వుకు శైధిల్యం చెందించే గుణము కలదు. ఇది సుకుమారము , గౌరవము అగు ధాతువు అగుట చేత శరీరముకు త్వరగా ముసలితనపు లక్షణాలు వస్తాయి. దానివలన ఎటువంటి పనిచేయలేకపోతాడు. శుక్రధాతువు స్వల్ప పరిమాణంలో ఉండటం చేత ఉన్న కొంచం శుక్రానికి కొవ్వు పెరగటం వలన మార్గావరోధం ఏర్పడుట వలన సంసారసంబంధ కార్యం చాలా తగ్గిపోవును . ఇతర ధాతువులు క్షీణించి మేధస్సు మాత్రం పెరుగుట చేత కలిగిన ధాతు వైషమ్యం వలన శరీరంలో బలహీనతను వృద్ది చేస్తుంది.


               సహజసిద్ధంగానే కొవ్వు ఒకరకమయిన దుర్వాసన కలిగి ఉంటుంది.  శరీరం నందు కొవ్వు అతిగా ఉన్నటువంటి వ్యక్తికి చెమట అధికంగా పట్టును . దీనివలన శరీరం నుంచి దుర్వాసన అధికం అగును.  అదే సమయంలో శరీరంలో కొవ్వుతో పాటు శ్లేష్మం కూడా అధికం అగుట చేత ఈ రెండూ నెయ్యి వలే కరిగే స్వభావం ఉండటం చేత వ్యాయమం చేయుటకు కూడా ఇష్టం అనిపించదు . కొవ్వు పేరుకుపోవడం వలన శరీరంలో వాతమార్గాలను అడ్డం ఏర్పడును . ఇలా మార్గావరోధం ఏర్పడటం వలన వాతం ఉదరంలో తిరుగుతూ వృద్ది చెంది తనతోపాటు జఠరాగ్నిని కూడా వృద్ధిచెందించును. దీనివల్ల అతిగా కొవ్వుతో బాధపడే వ్యక్తికి ఆకలి ఎక్కువ అగును. అతిగా నీటిని సేవిస్తాడు. త్వరగా జీర్ణం అవ్వును. మరలా తింటాడు. దీనివల్ల కొవ్వుతో పాటు కొంచం మాంసం కూడా వృద్ధిచెంది పిరుదులు, పొట్ట, స్తన ప్రదేశం బాగా లావు అయ్యి వేలాడుచుండును. కూర్చున్నప్పుడు , లేచేప్పుడు ఆయాసపడుతూ ఉంటాడు. ఇలా ఆయసపడుతూ శ్వాస తీసుకోవడాన్ని ఆయుర్వేదంలో క్షుద్రశ్వాస అని అంటారు.


            పైన చెప్పిన విధంగా అతిగా కొవ్వుపట్టిన వ్యక్తి ఆహారం తీసుకునే వేళ తప్పితే ఆకలిబాధ అస్సలు భరించలేడు . ఎప్పుడూ ఆకలిగానే ఉంటాడు ఎప్పుడూ దప్పికతోనే ఉంటాడు. పడుకుంటే కంఠం నుంచి గురగురమని శబ్దం పుడుతుంది. మాట్లాడబోతే పూర్తిగా మాట బయటకి రాదు .


           శ్లేష్మ, మేథస్సు వలన పుట్టిన రసం ఈ రోగానికి కారణం అని ఆయుర్వేదం చెప్తుంది.  అతిస్థూలకాయుడు పైన చెప్పిన లక్షణములతో కొంత వయస్సు గడిపి పూర్తి వయస్సు గడవక మునుపే ప్రమేహ వ్రణాలతోనో , జ్వరం వల్ల గాని భగంధరం వల్ల కాని , విద్రది వల్లనో , తీవ్రమైన సన్నిపాత జ్వరం వల్లనో  పట్టుకొని మరణించుట తప్పక జరుగును.


     గమనిక  -


           నాచే రచించబడిన "ఆయుర్వేద మూలికా రహస్యాలు " , " ప్రాచీన ఆయుర్వేద రహస్యాలు "  అను ఈ రెండు గ్రంథముల యందు అత్యంత రహస్యమైన సులభముగా ఇంటి యందు , చుట్టుపక్కల దొరికే మూలికలతోనే పెద్దపెద్ద రోగాలను నయం చేసుకొనే విధముగా అనేక వైద్య యోగాలను ఇచ్చాను. ఈ గ్రంథాలలో ఇచ్చినటువంటి యోగాలు అన్నియు గత 250 సంవత్సరాల నుంచి వంశపారంపర్యముగా మాకు వస్తున్న రహస్యయోగాలు పరోపకారార్థం దాచుకోకుండా ప్రచురించాను.


           మన చుట్టుపక్కల ఉండే మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల బొమ్మలతో మొక్కల చిత్రపటాలు ఇవ్వడం జరిగింది.


            రైతులకు ఉపయోగపడేవిధముగా చెట్లను , భూమిని బట్టి , రాళ్లని బట్టి భూమి యందు జలమును కనుగొను విధానం , ముహూర్తాలను అనుసరించి ఏయే సమయాలలో పంటలు వేయాలి . ఆయుర్వేద మూలికల సహాయముతో పురుగు మందులు వాడకుండా అత్యంత ఎక్కువ దిగుబడులు సాధించే రహస్య వృక్షయుర్వేద యోగాలు , పశువులకు సంబంధించిన వైద్య యోగాలు కూడా ఇవ్వడం జరిగింది . ఈ గ్రంథాలలో ఇచ్చిన యోగాలు ఉపయోగించటం వలన ఎటువంటి వ్యతిరేక ఫలితాలు రావు.


      ప్రాచీన ఆయుర్వేద రహస్యాలు గ్రంథం 288 పేజీలు ఉంటుంది . విలువ 350 రూపాయలు మాత్రమే . ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథం 384 పేజీలు ఉంటుంది . విలువ 450 రూపాయలు . కొరియర్ చార్జి 100  రూపాయలు అదనం .పుస్తకములు ఎక్కువ కాలం మన్నిక కొరకు కుట్టించి ఇవ్వడం మరియు అత్యంత నాణ్యమైన తెల్లటి 80GSM పేపరుతో ఉంటాయి.


            ఈ రెండు గ్రంథాలు కావలసినవారు డైరెక్టుగా 9885030034 నెంబర్ కి ఫోన్ చేయగలరు. కామెంట్లు , మెస్సేజెస్ సమాధానము ఇవ్వబడదు. కాల్ చేయగలరు .


                  కాళహస్తి వేంకటేశ్వరరావు 


                         9885030034 


               అనువంశిక ఆయుర్వేద వైద్యులు

ధార్మికగీత - 75*

 *ధార్మికగీత - 75*

                                     


      *శ్లో:- కార్యేషు దాసీ౹ కరణేషు మంత్రీ ౹*

             *రూపే చ లక్ష్మీ:౹ క్షమయా ధరిత్రీ ౹*

             *భోజ్యేషు మాతా౹ శయనే తు రంభా ౹*

             *షట్కర్మయుక్తా కులధర్మపత్నీ ౹౹*

                                    

                     

కార్యములందు దాసియును ,

            కర్మలపొందికయందు మంత్రి , నా 

హార్యమునందు లక్ష్మియు , క్ష 

          మన్ పలుకర్జ మోనర్చి ధాత్రిగన్ ,

వీర్యత నొప్పు భోజనము 

           వేడ్కగ బెట్టుచు మాతభంగిగన్ ,

భార్యయి శయ్యపైనను వి 

            భాసితసుందరరంభపొలికన్ ,

యార్యతనూజ షట్విధిగ

            నారయ నుండును ధర్మపత్నియై **


✍️ గోపాలుని మధుసూదన రావు 🙏

Your one vote

 आपका विश्वास/एक वोट इतनी उपलब्धियां/बदलाव लाया.. आगे आगे देखिये और क्या रंग लाता है आपका स्नेहआशीष भरा वोट.. 🕉️🚩🇮🇳

Your one vote to Modiji got you these


▶️CAA

▶️Rera Act

▶️Ram Mandir 

▶️3 Cr Homes

▶️9 Cr Toilets

▶️Stable Govt

▶️370 Removal

▶️Triple Talaq 

▶️Low Inflation

▶️Terrorism Drop

▶️15 new AIIMS

▶️35 new Airports

▶️Transgenders Act

▶️1.8 lakh Km Roads

▶️Motor Vehicles Act

▶️Weaponry for forces

▶️New Education Policy

▶️7 New IITs ,IIMs, IITs

▶️Reduced Corporate tax

▶️PM Kisan yojanas for all Farmers

▶️2nd largest Solar Power

▶️2nd largest steel producer

▶️2nd largest mobile manufacturer

▶️4th largest Automotive market

▶️Fugitive Economic Offender Act

▶️Converting post offices into Banks

▶️Reduction in Bank Non-Performing assets

▶️Clearing 2 Lakh crore fuel debt by Congress

▶️Worlds largest healthcare - Ayushman Bharat

▶️5th Largest GDP Power from the previous 11th

▶️Privatization of failed Business for over 12 years


*All in 6 years*!


When people tell that Congress gave the Country 1 AIIMS , 4 IITs , and 4 IIMs in 67 years !!!


Please share with friends of Modiji..

और सुखद उपलब्धियां/बदलावों के लिए तैयार रहें.. जय हिंद.. वन्देमातरम.. भारत माता की जय.. 🕉️🚩🇮🇳🙏💪

నాగులచవితి


రేపు నాగులచవితి సందర్భంగా 


దీపావళి అమావాస్య తరువాత వచ్చే కార్తీక శుద్ధ చతుర్థిని నాగుల చవితి పండుగ అంటారు.

 కొందరు శ్రావణ శుద్ధ చతుర్థినాడు జరుపుకుంటారు. ప్రకృతి మానవ మనుగడకు జీవనాధరమైనది కనుక దానిని దైవస్వరూపంగా భావించి మన పూర్వీకులు చెట్టును, పుట్టను, రాయిని, రప్పను, కొండను, కోనను, నదిని, పర్వతాన్ని - ఇలా సమస్త ప్రాణికోటిని దైవస్వరూపంగా చూసుకొంటూ! పూజిస్తూవస్తున్నారు. ఇదే మనభారతీయ సంస్కృతిలోని విశిష్టత. నిశితంగా పరిశీలిస్తే ... అందులో భాగంగానే ' నాగుపాము" ను కూడా నాగరాజుగా, నాగదేవతగా పూజిస్తూ వస్తున్నారు.


నాగుల చవితికి పుట్టకు నూలు చుట్టి పూజ చేయుట. 

ఈ పాములు భూమి అంతర్భాగమందు నివసిస్తూ భూసారాన్ని కాపాడే ప్రాణులుగా సమస్త జీవకోటికి " నీటిని" ప్రసాదించే దేవతలుగా తలచేవారు. ఇవి పంటలను నాశనంచేసే క్రిమికీటకాదులను తింటూ, పరోక్షంగా " రైతు " కు పంటనష్టం కలగకుండా చేస్తాయట!. అలా ప్రకృతి పరంగా అవి మనకు ఎంతో సహాయపడుతూ ఉంటాయి.


మన పురాణాలలో నాగుల చవితి గురుంచి ఎన్నో గాథలు ఉన్నాయి. దేశమంతట పలు దేవాలయల్లో మెలికలతో ఉన్న నాగేంద్రుని విగ్రహాలు కనిపిస్తూ ఉంటాయి. ఈ నాగుల చవితి నాడు నాగేంద్రుని శివభావముతో అర్పిస్తే సర్వరోగాలు పోయి సౌభాగ్యవంతులవుతారని భారతీయుల నమ్మకం.


ఈ మానవ శరీరమనే పుట్టకు తొమ్మిది రంధ్రాలు ఉంటాయి. వాటినే నవరంధ్రాలు అంటూ ఉంటారు. మానవ శరీరంలో నాడులతో నిండివున్న వెన్నెముకను ' వెన్నుబాము' అని అంటారు. అందు కుండలినీశక్తి మూలాధారచక్రంలో "పాము" ఆకారమువలెనే వుంటుందని "యోగశాస్త్రం" చెబుతోంది. ఇది మానవ శరీరంలో నిదురిస్తున్నట్లు నటిస్తూ! కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలనే విషాల్ని గ్రక్కుతూ, మానవునిలో ' సత్వగుణ' సంపత్తిని హరించి వేస్తూ ఉంటుందని అందుకు ' నాగుల చవితి రోజున ప్రత్యక్షంగా విషసర్పపుట్టలను ఆరాధించి పుట్టలో పాలు పోస్తే మానవునిలో ఉన్న విషసర్పం కూడా శ్వేతత్వం పొంది, అందరి హృదయాలలో నివసించే ' శ్రీమహావిష్ణువు" నకు తెల్లని ఆదిశేషువుగా మారి శేషపాన్పుగా మారాలని కోరికతో చేసేదే! ఈ నాగుపాము పుట్టలో పాలు పోయుటలోగల అంతర్యమని చెప్తారు.


నాగుల చవితి రోజు ఆవు పాలు పుట్టలో పోసి నాగపూజచేసి చలిమిడి, చిమ్మిలి (నువ్వులతో చేస్తారు) అరటిపళ్ళు, తాటి బుర్రగుంజు , తేగలు మున్నగున్నవి నివేదన చేస్తారు. ఆ సందర్భంగా పుట్టవద్ద " దీపావళి" నాడు మిగిలిన మతాబులు, కాకరపువ్వొత్తులు, టపాసులు మొదలైనవి చిన్నపిల్లలు ఎంతో సంతోషంగా కూడా కాలుస్తారు.


మన భారతీయుల చాల ఇళ్ళల్లో ఇలవేల్పు " సుబ్రహ్మణేశ్వరుడే ఆరాధ్య దైవంగా పూజిస్తారు కాబట్టి వారి పేరును చాల మంది నాగరాజు, ఫణి, సుబ్రహ్మణ్యం, సుబ్బారావు వగైరా పేర్లు పెట్టుకుంటూ ఉంటారు.


Good Afternoon

దత్తాత్రేయ సంబంధ 10 పుస్తకాలు(PDF) ఒకేచోట ఉచితంగా తెలుగులో

 *దత్తాత్రేయ  సంబంధ 10  పుస్తకాలు(PDF) ఒకేచోట ఉచితంగా తెలుగులో. ఈ క్రింది లింక్స్ పై క్లిక్ చేసి Read/Download చేసుకోగలరు*

------------------------------------------------


10 పుస్తకాలు ఒకేచోట!    https://www.freegurukul.org/blog/dattatreya-pdf


               (OR)


శ్రీపాద శ్రీవల్లభ లీలా వైభవము www.freegurukul.org/g/Dattatreya-1


గురు తత్త్వము www.freegurukul.org/g/Dattatreya-2


నవనాధ చరిత్ర-నిత్య పారాయణ www.freegurukul.org/g/Dattatreya-3


శ్రీదత్త గురుచరిత్ర www.freegurukul.org/g/Dattatreya-4


గురు చరిత్రామృతము www.freegurukul.org/g/Dattatreya-5


దత్త భాగవతాద్వైతము www.freegurukul.org/g/Dattatreya-6


నృసింహ సరస్వతి మహారాజ్ www.freegurukul.org/g/Dattatreya-7


శ్రీ గురు దేవదత్త www.freegurukul.org/g/Dattatreya-8


గురుమూర్తి నృసింహ సరస్వతి చరితము www.freegurukul.org/g/Dattatreya-9


గురులీల www.freegurukul.org/g/Dattatreya-10


గురువు దత్తాత్రేయ పై అధ్యయనం, పరిశోధన చేయడానికి కావలిసిన పుస్తకాలు ఒకేచోట దొరకక తెలుగువారు ఇబ్బంది పడుతున్నారు. కావున ప్రతి ఒక్కరికి చేరేలా సహాయం చేయండి 🙏.


మరింత సమాచారం కోసం:

ఉచిత గురుకుల విద్య ఫౌండేషన్

Website: www.freegurukul.org

Android App: FreeGurukul 

iOS App: Gurukul Education  

Helpline: 9042020123

*To Join In WhatsApp Group*: To get this type of Spiritual, Inspirational, PersonalityDevelopment messages daily, join in group by this link  www.freegurukul.org/join

size of God

 What's​ the size of God? Excellent reading


A boy asked the father: _What’s the size of God?_ 


Then the father looked up to the sky and seeing an airplane asked the son: What’s the size of that airplane? The boy answered: It’s very small. I can barely see it. 


So the father took him to the airport and as they approached an airplane he asked: And now, what is the size of this one? The boy answered: Wow daddy, this is huge! 


Then the father told him: God, is like this, His size depends on the distance between you and Him. *


The closer you are to Him, the greater He will be in your life!*

పంచారామాలు
































 

Swamiji










 

Dievikam









 

తంత్రము -క్రాంతములు

 #తంత్రము -క్రాంతములు   

తంత్ర శాస్త్రము శక్తి ఉపాసన శాస్త్రము. యొక్క ముఖ్య గమ్యము జీవబ్రహ్మైక్యం. ఉపనిషత్తులు సిద్ధంతమే ఇది.కాని ఉపనిషత్తులు ఎక్కువగా జ్ఞానమును ఆధారం చేసుకున్నవి. శక్తిని ఆధారం చేసుకున్నవి తంత్ర శాస్త్రములు. ఆత్మ జ్ఞాన గ్రంథాలు రహస్య గ్రంథాలన్నారు పెద్దలు.కనుక తంత్ర శాస్త్రమును రహస్య భాషలో వ్రాసారు.ఈభాషను సంధ్యా భాష అంటారు. సంధ్య వేళయందు చీకటి, వెలుగులు రెండున్నట్లు, సంధ్యా భాషకు రెండర్ధాలున్నవి.తెలిసిన వారు చదివితే ఒక అర్ధం, తెలియని వారు చదివితే వేరొక అర్ధం. మహానిర్వాణ తంత్ర శాస్త్రమును పరమేశ్వరుడుపార్వతీదేవికి కైలాసంలో చెప్పాడు.అని కొందరు అంటారు.వేదములు స్త్రీ శూద్రులు వేదకర్మలను ఆదరించకూడదని బహిష్కించినవి.దీనివల్ల కలియుగంలో స్త్రీ శూద్రులు తంత్ర శాస్త్రమును ఆశ్రయించినట్లు తెలుస్తున్నది.

తంత్ర శాస్త్రము సాధనా గ్రంథము. త్రంత్రమునకు ఉపాయము అని కూడా అర్ధమున్నది. దీని యందు ముఖ్య విషయములను వేదములనుండే తంత్ర శాస్త్రము తీసుకున్నది.ఆ తీసుకున్నదానిని విశదపరిచి వ్రాసింది. తను అనగా విస్తరించుట. తనువిస్తారే. త్ర అనగా తరింప జేయు జ్ఞానము.తరింపజేయు జ్ఞానమును విస్తరించి చెప్పినది తంత్ర శాస్త్రము.తంత్ర శాస్త్రములో శక్తి (స్త్రీ) ఆరాధ్యముఖ్యము. శ్రీ పూజ వేదములలో శ్రీసూక్తంమొదలైన వాటిలలో ఉంది. గాయత్రి కూడా స్త్రీయే.యజ్ఞములందు పశుబలులు, సోమపానములున్నవి. తంత్ర శాస్త్రములు దేశాచారములను అనుసరించి అనేక రూపాలుగా ఉన్నాయి. ఈసంప్రదాయములు కల ప్రాంతములను క్రాంతములందురు.వింధ్యకు ఉత్తరాన ఉన్న భూమిని రాధాక్రాంతమంటారు.ఇక్కడ కాశ్మీరి సంప్రదాయం ఉంది.తూర్పున ఉన్న ప్రాంతమును విష్ణు క్రాంతము అంటారు.ఇక్కడ గౌడ (వంగ) సంప్రదాయం ఉంది. దక్షిణ దేశమును అశ్వ క్రాంతమందురు. ఇక్కడ కేరళ సంప్రదాయం ఉంది.ఎవరి ఆచారవ్యవహారములను అనుసరించి ఆసాధనలు ప్రబలివి.వంగీయులు మత్స్య మాంస ప్రియులు-వీరు వాటిని విశేషముగా ఉపయోగించిరి.....మీ... *చింతా గోపీ శర్మ సిద్ధాంతి** *లక్ష్మీలలితా వాస్తు జ్యోతిష నిలయం* (భువనేశ్వరిపీఠం) పెద్దాపురం, సెల్:- 9866193557

నవరత్నాలు ధరించే విధములు

 #భువనేశ్వరిపీఠం

#నవరత్నాలు ధరించే విధములు

నవగ్రహాలకు సంబంధించి అంతర్ధశలు ఉన్నట్టే గ్రహ మహర్ధశ ఉంటుంది. అంతర్ధశకు సంబంధించి ఆ కాలంలో వివిధ రత్నాలను ధరించిన ట్లే మహర్ధశలోనూ రత్నాలను ధరిస్తే శుభం చేకూరుతుంది. రవి మహర్ధ్థశ ఆరేళ్లకాలంపాటు ఉంటుంది. ఈ మహర్థశ కాలంలో రవి జపం చేయించిన తర్వాత కెంపును వెండిలో ధరించాలి. దీనిని ఉంగరపు వేలికి మాత్రమే పెట్టుకోవాలి. చంద్ర మహర్థశ పదేళ్ల కాలం ఉంటుంది. ఈ మహర్ధశ కాలంలో చంద్ర జపం చేయించి ముత్యాన్ని వెండిలో ధరించాలి.దీనిని ఉంగరపు వేలికి ధరించాలి. కుజ మహర్థశ ఏడేళ్ల కాలం ఉంటుంది. ఈ మహర్థశ కాలంలో కుజ జపం చేయించిన తర్వాత పగడాన్ని వెండిలో ఉంగరపు వేలికి ధరించాలి. బుధ మహర్ధశ పదిహేడేళ్ల పాటు ఉంటుంది. ఈ కాలంలో బుధ జపం చేయించిన తర్వాత జాతిపచ్చను బంగారముతో చేయించి చిటికెన వేలు పెట్టుకోవాలి. గురు మహర్ధశ పదహారేళ్ల పాటు ఉంటుంది.ఈ మహర్ధశ కాలంలో గురు జపం చేయించిన త ర్వాత కనక పుష్యరాగం అనే రత్నాన్ని బంగారంతో చేయించి చూపుడు వేలికి పెట్టుకోవాలి. శుక్ర మహర్ధశ ఇరవై ఏళ్ల పాటు ఉంటుంది. శుక్ర జపం చేయించిన వజ్రాన్ని బంగారంలో చేసి ఉంగరపు వేలికి పెట్టుకోవాలి. శని మహర్ధశ పందొమ్మిదేళ్ల పాటు ఉంటుంది. ఈ కాలంలో శని జపం చేయించిన నీలాన్ని వెండిలో మధ్య వేలికి ధరించాలి.రాహు మహర్ధశ పద్దెనిమిదేళ్ల పాటు ఉంటుంది. ఈ మహర్ధశ కాలంలో రాహు జపం చేయించిన గోమేధికాన్ని వెండిలో ధరించాలి. ఈ ఆభరణాన్ని మధ్య వేలికి ధరించాలి. కేతువు మహర్ధశ ఏడేళ్ల కాలం ఉంటుంది. కేతు జపం చేయించిన వైఢూర్యాన్ని వెండిలో మధ్య వేలికి పెట్టుకోవాలి.


నవరత్నములు ధారణా లాభములు

నవగ్రహ వైభవం లో చెప్పిన విధంగా మధుమేహము[చెక్కెర వ్యాధి] కలవారు,స్త్రీ లోలురు,రాజకీయవేత్తలు,ఆకర్షణ లోపము వున్నవారు వజ్రము ధరిచుతుపయుక్తము.


నీలం రాయి కలిగిన ఉంగరాన్ని దరిద్రముతో బాధపడుచున్న వారు, కీళ్ళ నొప్పులు కలవారు, గ్యాస్ ట్రబుల్, కుసుమ వ్యాధులు కలిగిన వారు దీన్ని ధరించాలి. వైఢూర్యానికి విష జంతు బాధా నివారణము అనే పేరుకూడా ఉంది. ప్రతివాద భయము తొలగుటకు, సంతాన లోప నివారణకు ఉపయోగించపచ్చు. గోమేధకమును నరాల సంబంధిత వ్యాధులతో బాధపడే వారు ధరించవచ్చు. వ్యాపారములందు రాణించి, లాభాలను పొందలేని వారు గోమేధికమును ధరించాలి.


పుష్యరాగ ఉంగరాన్ని దేవభక్తి, సూక్ష్మజ్ఞానము కలగాలంటే ధరించవచ్చు. పగడమును రాజకీయ వేత్తలు, శత్రుభయంతో బాధపడుతున్నావారు, దీర్ఘవ్యాధి గలవారు ఈ ఉంగరాన్ని ధరించడం మంచిది. అలాగే ముత్యమును అన్ని సమయాలందు, ప్రతి ఒక్కరు ధరించవచ్చును. కుటుంబ సౌఖ్యములేని వారు సోమవారము రోజున ముత్యముతో కూడిన ఉంగరాన్ని ధరిస్తే మంచిది. ముఖ్యంగా ఈ రాళ్లను ధరించే వారు వారి వారి జాతకములు జ్యోతిష నిపుణులతో  సంప్రదించి ధరించాలి. లేకపోతే సమస్యలను మంచికన్న చెడును ఎదుర్కొనవలసి ఉంటుంది....మీ... *చింతా గోపీ శర్మ సిద్ధాంతి** *లక్ష్మీలలితా వాస్తు జ్యోతిష నిలయం* (భువనేశ్వరిపీఠం) పెద్దాపురం, సెల్:- 9866193557

సోమవార వ్రత మహిమ*

 💥కార్తీక పురాణం ప్రారంభం


🌈కార్తీకపురాణం 2 అధ్యాయం🌈

🪔🪔🪔🪔🪔


🌹సోమవార వ్రత మహిమ*


వశిష్టుడు జనక మహారాజుతో ఇలా అంటున్నాడు ”జనకా! ఇంతవరకు నీకు కార్తీక మాసములో చేయాల్సిన కార్యక్రమాలను మాత్రమే చెప్పాను. అయితే… కార్తీక మాసంలో సోమవారాలకు ప్రత్యేకత ఉంది. ఆ రోజున ప్రత్యేకంగా సోమవార వ్రతం నిర్వహిస్తారు. ఎంతో మహత్తు కలిగిన ఆ సోమవార వ్రత విధానాన్ని, దాని మహత్యాన్ని గురించి చెబతాను. సావధానంగా విను” అని ఇలా చెప్పసాగాడు.

”కార్తిక మాసములో సోమవారం శివుడికి అత్యంత ప్రీతికరమైన రోజు. ఆ రోజున స్త్రీ గాని, పురుషుడుగాని ఏజాతి వారైనా గాని రోజంతా ఉపవాసముండాలి. నదీస్నానం చేసి, తమ శక్తికొద్దీ దానధర్మాలు చేయాలి. శివుడికి బిల్వపత్రాభిషేకం చేసి, సాయంత్రం నక్షత్రదర్శనం తర్వాత అల్పాహారం తీసుకోవాలి. ఈ విధంగా నిష్టతో ఉంటూ… ఆ రాత్రంతా జాగరణ చేసి, పురాణ పఠనం చేయాలి. ఉదయం నదీస్నానమాచరించాలి. నువ్వులను దానం చేయాలి (తిలాదానం). తమ శక్తికొద్దీ పేదలకు అన్నదానం చేయాలి. అలా చేయలేనివారు కనీసం ముగ్గురు బ్రాహ్మణులకు తృప్తిగా భోజనం పెట్టిన తర్వాత,

తాము భుజించాలి. ఈ కార్తీక సోమవార వ్రతం కేవలం భక్తి, సంకల్పంపైనే ఆధారపడి ఉంటాయి. పెద్దగా పూజాదికాలు నిర్వహించలేనివారు సైతం కనీసం ఉపవాసం ఉంటే… కార్తీక సోమవార వ్రతం ఫలితాన్ని పొందగలరు. ఇందుకు సంబంధించి ఒక ఇతిహాసముంది. దాన్ని మీకు తెలియజేస్తాను. సావధానంగా విను” అని ఇలా చెప్పసాగాడు.

కుక్క కైలాసానికి వెళ్లుట…

”పూర్వ కాలమున కాశ్మీర్లో ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. అతడు పురోహిత వృతిని చేపట్టి తన కుటుంబాన్ని పోషించేవాడు. అతనికి లేకలేక ఒక కూతురు పుట్టింది. ఆమెకు స్వాతంత్ర నిష్టురి అని పేరు పెట్టారు. తండ్రి ఆమెకు సౌరాష్ట్రకు చెందిన మిత్రశర్మ అనే సద్బ్రాహ్హణుడికి ఇచ్చి పెళ్లి చేశాడుఏ. అయితే ఆ బ్రాహ్మణ యువకుడు నాలుగు వేదాలు, శాస్త్రాలు అభ్యసించడం వల్ల సదాచారపరుడై ఉండేవాడు. భూతదయ కలిగి ఉండేవాడు. నిత్య సత్యవాది. నిరంతరం భగవన్నామస్మరణ చేసేవాడు ఈ కారణాలతో ప్రజలంతా అతన్ని ‘అపర బ్రహ్మ’ అని పిలిచేవారు. ఇంతటి ఉత్తమ పురుషుడికి భార్య అయిన స్వాతంత్ర అందుకు భిన్నంగా ఉండేది. యవ్వన గర్వంతో, కన్నుమిన్నుగానక పెద్దలను దూషించేది. అత్తమామలను, భర్తను తిట్టడం, కొట్టడం, రక్కడం చేసేది. పురుషసాంగత్యంతో వ్యభిచారిణియై… తన ప్రియులు తెచ్చిన తినుబండారాలు, బట్టలు, పువ్వులు, ధరించి దుష్టురాలై తిరుగసాగింది. ఆమె తమ వంశాన్ని అప్రతిష్టపాలు చేస్తోందని అత్తమామలు ఆమెను ఇంటినుంచి వెళ్లగొట్టారు. అయితే శాంత స్వరూపుడైన ఆమె భర్త మాత్రం ఆమెను ఏవగించుకోకుండా… ఆమెతో కలిసే ఉండేవాడు. చుట్టుపక్కలవారంతా ఆమెను గయ్యాళి అని ఏవగించుకుంటూ… కర్కశ అని పేరుపెట్టి ఎగతాళి చేసేవారు.

ఇలా కొంతకాలం తర్వాత ఆమె ఒకనాటి రాత్రి తన భర్త గాఢనిద్రలో ఉండగా… ఒక బండరాయితో అతని తలపై కొట్టి చంపింది. ఆ మృతదేహాన్ని అతిరహస్యంగా దొడ్డిదారిన ఊరి చివరకు తీసుకెళ్లింది. అక్కడున్న బావిలో మృతదేహాన్ని పారేసి, పైన చెత్తచెదారంతో నింపింది. తనకు ఏమీ తెలియదన్నట్లుగా ఇంటికి తిరిగి వచ్చింది. తనకిక ఎదురులేదని, అడ్డూఅదుపు ఉండదనే అహంకారం పెరిగి… ఇష్టారాజ్యంగా తిరగసాగింది. తన సౌందర్యాన్ని చూపి ఎందరినో క్రీగంటనే వశపరుచుకుంది. వారి వ్రతాలను పాడుచేసి, నానాజాతి పురుషులతో సంభోగిస్తూ వర్ణసంకరురాలైంది. అంతటితో ఆగకుండా… కన్యలు, పెళ్లైన మహిళలకు దుర్బుద్దులు నేర్పి, పాడుచేసి, విటులకు వారిని అప్పగిస్తూ ధనార్జన చేయనారంభించింది.

ఆ తర్వాత ఆమె యవ్వనం క్రమంగా నశించడం ఆరంభమైంది. వయసు పైపడసాగింది. చేసినపాపాలకు గురుతుగా శరీరంపై పుండ్లు ఏర్పడ్డాయి. వాటి నుంచి చీము, రక్తం కారుతూ, క్రమంగా కుష్టువ్యాధిబారిన పడింది. రోజురోజుకూ ఆమె శరీర పటుత్వం కృశించి కురూపిగా మారింది. యవ్వనంలో ఆమెకోసం వంతులవారీగా ఎగబడే విటుల్లో ఒక్కరూ ఇప్పుడామెవైపు కన్నెత్తికూడా చూడడం లేదు. అలా కొంతకాలం ఆమె ప్రత్యక్ష నరకాన్ని చవిచూచి, పురుగులు పడి చనిపోయింది.

బతికినన్ని రోజులు ఒక్క పురాణ శ్రవణమైనా చేయని పాపి కావడంతో భయంకరంగా కనిపించే యమకింకరులు ఆమెను యముని ముందు హాజరుపరిచారు. చిత్రగుప్తుడు ఆమె పాపపుణ్యాలను ఏకరవు పెట్టారు. పాపాలకు ఎర్రగా కాల్చిన ఇనుప స్తంభానికి కట్టాలని, విటులతో సుఖించినందుకు ఇనుపస్తంభాన్ని కౌగిలించుకోవాలని ఆదేశించారు. భర్తను బండరాతితో కొట్టి చంపినందుకు ఇనపగదలతో ఆమెను మోదాలని ఆదేశించారు. పతివ్రతలను వ్యభిచారిణిలుగా మార్చినందుకు సలసలా కాగే నూనెలో వేచారు. తల్లిదండ్రులు, అత్తమామలకు అపకీర్తి తెచ్చినందుకు సీసం కరిగించి నోట్లో, చెవిలో పోశారు. ఇనపకడ్డీలు కాల్చి వాతలు పెట్టారు. చివరకు కంఉబీపాకంలో వేశారు. ఆమె చేసిన పాపాల ఫలితాలను ఆమె ఒకత్తే కాకుండా, ఇటు ఏడు తరాలు, అటు ఏడు తరాలు నరక బాధలు అనుభవించసాగారు. ఆ తర్వాత ఆమె నీచజన్మలు ఎత్తుతూ, క్రిమికీటకాలుగా పుట్టి.. చివరకు పదిహేనో జన్మలో కళింగ దేశంలో ఒక కుక్కగా జన్మనెత్తింది.

కుక్కజన్మలో ఆమె ఆకలికి తట్టుకోలేక ఇంటింటికీ తిరిగింది. కర్రతో కొట్టేవారు ఆమెను కొడుతుంటే.. తిట్టేవాడు తిడుతున్నారు. పిల్లలు తరుముతున్నారు. అయితే… ఒక బ్రాహ్మడు కార్తీక సోమవార వ్రతమాచరించి, ఉపవాసముండి, సాయంత్రం నక్షత్ర దర్శనం చేసి, ఉపవాస విరమణ నిమిత్తం సిద్ధం చేసుకున్న అల్పాహారాన్ని అరుగుపై పెట్టి, కాళ్లూచేతులు కడుక్కునేందుకు వెళ్లాడు. అయితే… ఆ కుక్క గబగబా వెళ్లి ఆ ఆహారాన్ని భుజించింది.

వ్రత నిష్ఠ గరిష్ఠుడైన ఆ బ్రాహ్మడి పూజ విధానముతో జరిపెంచిన బలియన్నం కావడం… కార్తీక సోమవారం నాడు కుక్క ఆకలితో రోజంతా ఉపవాసముండడం, శివపూజ పవిత్ర స్థానంలో ఆరగించడం వల్ల ఆ కుక్కకు పూర్వజన్మ విజ్ఞానం ఉద్భవించింది. వెంటనే ఆ కుక్క ‘విప్రోత్తమా… నన్ను కాపాడుము’ అని మొరపెట్టుకుంది. ఆ మాటలు బ్రాహ్మణుడికి ఆశ్చర్యాన్ని కలిగించింది. మనుష్యులెవరూ కనిపించకపోయేసరికి అంతా భ్రమ అనుకున్న ఆ విప్రుడికి మళ్లీ మాటలు వినిపించాయి. ‘రక్షించు… రక్షించు…’ అనే కేకలు వినిపించాయి. ఆ మాటలు కుక్క నుంచి వస్తున్నాయని గ్రహించిన బ్రాహ్మడు ‘ఎవరు నీవు? నీ వృత్తాతమేమిటి?’ అని ప్రశ్నించాడు. అంత ఆ కుక్క తన వృత్తాంతాన్ని వివరించింది. పదిహేను జన్మల క్రింద సద్భ్రాహ్మణుడి భార్యయైన తాను వ్యభిచారం చేసిన తీరు, భర్తను చంపడం, వృద్ధాప్యంలో కుష్టువ్యాధితో దినదినగండంగా బతికి, చనిపోయిన తీరును, నరకంలో అనుభవించిన శిక్షలను గురించి వివరించింది. ‘ఈ రోజు మీరు కార్తీక సోమవార వ్రతం చేసి, ఇక్కడ పెట్టిన బలిఅన్నం తినడం వల్ల నాకు జ్ఞానోదయం కలిగింది. కాబట్టి ఓ విప్రోత్తమా…! నాకు మహోపకరాంగా మీరు చేసిన కార్తీక సోమవార వ్రత ఫలమొక్కటి ఇచ్చి, నాకు మోక్షం కలిగించు’ అని ప్రార్థించింది.

దాంతో ఆ శునకం మీద జాలితో ఆ బ్రాహ్మణుడు తాను చేసిన కార్తీక సోమవార వ్రతాల్లో ఒక రోజు నాటి ఫలాన్ని ఆమెకు ధారబోశాడు. అలాచేసిన వెంటనే… ఒక పుష్పక విమానం అక్కడకు చేరుకుంది. కుక్క తన జన్మను చాలింది, సూక్ష్మదేహంతో పుష్పకాన్ని చేరింది. అటు నుంచి శివసాన్నిథ్యాన్ని చేరుకుంది.”

*ఇతి శ్రీ సాంద పురాణే తర్గత, వశిష్ట ప్రోక్త కార్తీక మహత్యే ద్వితీయ అధ్యాయం సమాప్తం.*


   🪔 ఓం నమః శివాయ 🪔


    🌹సర్వేజనా సుఖినోభవంతు🌹

వ్రత మాసం.. కార్తికం

 *🍁బహు పర్వ బహు వ్రత మాసం.. కార్తికం🍁*


      ప్రాచీన భారతీయ ఆర్ష సంప్రదాయంలో భారతీయులనందరినీ శారీరకంగా, మానసికంగా, బౌద్ధికంగా, ఆధ్యాత్మికంగా, సామాజికంగా చైతన్యవంతుల్ని చేయడం కోసం సంవత్సరం పొడవునా ఎన్నో పండుగలను, వ్రతాలను రూపొందించి భావితరాలకు బహూకరించారు మన మహర్షులు. అందులో కార్తికం ఒక మహత్తరమైన మాసం. ఒక్కొక మాసంలో ఒక్కొక్క దేవతకు ప్రాధాన్యం ఉంది. అయితే కార్తికం బహు దేవతాత్మకం. శివ, కేశవ, శక్తి, గణేశ, దామోదర, సూర్యాది దేవతలను, ఆయా దేవతల ప్రతీకలైన అశ్వత్థ (రావి), వట (మర్రి), పాలాశ(మోదుగ) వృక్షాలను, తులసి, ధాత్రీ మొదలైన మొక్కలను, గోవును, ఆయా ప్రాంతాలలోని నదులను అత్యంత భక్తిశ్రద్ధలతో పూజించుకో దగిన మాసంగా కార్తిక మాసాన్ని తీర్చి దిద్దారు. ‘‘కార్తికః ఖలు వై మాసః సర్వమాసేషు చోత్తమః’’ అన్నారు పెద్దలు. అంటే.. అన్ని మాసాలలో కార్తికం చాలా గొప్పది అని అర్థం. ఈ మాసంలో రోజూ ఒక పర్వ దినమూ, ఒక వ్రతమూ ఉండి నెల అంతా దైవీమయంగా ఉంటుంది. లోకంలో సకల దేవతల భక్తులకూ కోరిన కోరికలను నెరవేర్చే కల్పతరువై ప్రకాశిస్తోంది. 


ముందుగా పర్వదినాలను చూద్దాం. దీపావళి మరునాడు బలి చక్రవర్తి భూలోకానికి వచ్చి భూలోక దీప శోభను పర్యవేక్షించడానికి వచ్చే రోజు బలి పాడ్యమి. యముడు తన చెల్లెలు యమున ఇంటికి వచ్చి భోజనం చేసే యమ ద్వితీయ/భగినీహస్త భోజనం. నాగ జాతికి చెందిన జరత్కారువు తన కుమారుడైన ఆస్తీకుని ద్వారా జనమేజయుని సర్పయాగాన్ని నిలుపుజేయించిన సందర్భానికి గుర్తు అయిన నాగులచవితి,  సుబ్రహ్మణ్యేశ్వరుని కొలుచుకునే నాగ పంచమి, సుబ్రహ్మణ్యేశ్వరునికీ, దేవసేనకు కళ్యాణదినమైన స్కందషష్ఠి, శాకంబరీ దేవిని పూజించుకుని ఏడుగురు విప్రులకు భోజనం నివేదించే శాకసప్తమి, గోవును, గోపాలకృష్ణుని పూజించుకునే గోపాష్టమి, అక్షయనవమి, సార్వభౌమవ్రతం, ఆషాఢంలో నిదురకు ఉపక్రమించిన మహావిష్ణువు మేల్కొనే రోజు ప్రబోధనైకాదశి, సమస్త దేవతలూ క్షీరసాగరంలో రమా సమేతంగా విష్ణువును పూజించుకునే క్షీరాబ్ది ద్వాదశి, వైకుంఠ చతుర్దశి, శివకేశవులు ఇరువురికీ ప్రీతిపాత్రమైన కార్తిక పూర్ణిమ, అదే రోజున..  అకాల మృత్యువు నుంచి రక్షించే యమ దీపదానం, దేవదీపావళి అయిన త్రిపురోత్సవం, సూర్యుడు తులా రాశిలో ప్రవేశించే తులాసంక్రాంతి, స్త్రీలు మాత్రమే పూజించే గణేశ వ్రతం కరకచతుర్థి ఇలా ఎన్నో పర్వదినాలు.


ఇక కార్తికంలో వచ్చే వ్రతాల గురించి తెలుసుకునే ముందు అసలు వ్రతం అంటే ఏమిటో తెలుసుకోవాలి. నిత్య, నైమిత్తిక, కామ్యక.. అని, వ్రతాలు మూడు విధాలు. బ్రహ్మచారులు అనుసరించే బ్రహ్మచర్యవ్రతం, గృహస్థుల అగ్నిహోత్ర వ్రతం, నిత్య సత్య వ్రతం, అహింసా వ్రతం వంటివి నిత్య వ్రతాలు. వీటికి కథలేమీ ఉండవు. అలాగే ఆయా మాసములలో ఆయా తిథులను నిమిత్తంగా చేసుకొని ఆయా దేవతలకు చెందిన పూజలూ వ్రతాలే. ఉదాహరణకు.. శ్రీరామనవమి, శ్రీకృష్ణాష్టమి, వినాయక చవితి, వరలక్ష్మీ వ్రతం, దీపావళి లక్ష్మీపూజ వంటివి. ఇవి నైమిత్తిక వ్రతాలు. ఇక కామ్యక వ్రతాలు. ఏదో ఒక కోర్కెతో చేసే వ్రతాలు. వీటికి తప్పక కథలు ఉంటాయి. మనకు కార్తికంలో వచ్చే వ్రతాలు ఎక్కువగా శివకేశవ దేవతా ప్రధానమైనవి.


వీటిలో నైమిత్తికములూ, ఉన్నాయి. కామ్యములూ ఉన్నాయి. ముక్కంటిని భర్తగా పొందాలని తపస్సుచేసిన గౌరి.. శివుని ప్రసన్నం చేసుకొన్న రోజున జరిగే త్రిలోచన గౌరీవ్రతం, నందికేశుడు చిత్రాంగదుడనే గంధర్వునికి చెప్పిన కేదారేశ్వరవ్రతం, తులసిని, ధాత్రీ రూపమున ఉన్న సమస్త దేవతలను అనుగ్రహించిన దామోదరునికి చెందిన శ్రీతులసీ ధాత్రీసహిత దామోదర వ్రతం, ఉమాసహితశంకరులను పూజించుకునే శ్రీ శివ సోమవార వ్రతం, క్షీరాబ్ది ద్వాదశి వ్రతం, జ్వాలాతోరణం, అర్థనారీశ్వర వ్రతం, శుక్ల నవమి, దశమి, ఏకాదశి తిథులలో జరుపుకొనే విష్ణు త్రిరాత్ర వ్రతం.. ఇలా ఎన్నో ఉన్నాయి. మానవుల చతుర్విధ పురుషార్థాలను తీర్చి,  లోకకళ్యాణాన్ని సిద్ధింపజేసేవే. కనుక ఇటువంటి కార్తిక మాసాన్ని ఒక మహా వ్రతంగా స్వీకరించి నియమబద్ధమైన జీవితాన్ని గడపాలి.


*-:ఆచార్య రాణి సదాశివ మూర్తి*

జ్ఞాన దీపం🪔*

 *జ్ఞాన దీపం🪔*


     తెల్లవారే ముందు ప్రతి రోజూ ఆకాశం రాగరంజితంగా, మనోహరంగా మనల్ని అలరిస్తుంది. కళాదృష్టితో చూసేవారికి ప్రతి ఉషోదయం ఒక మహోజ్జ్వల దృశ్యకావ్యంగా కళ్లకు కడుతుంది. గతంలో ఎన్నో ఉషోదయాలు వచ్చి వెళ్లిపోయాయి. ఇకముందు కూడా ఎన్నెన్నో రాబోతున్నాయి. అవి మన గతానికి, భవితకు సంకేతాలు. మన జీవితాలకు అర్థం, పరమార్థం ఉన్నాయని ఆకాశ పుత్రిక ఉష గుర్తు చేస్తుంది. పైన ఆకాశం, కింద భూమి... మధ్యన మనం ఉన్నాం. అటు దివ్యత్వం, ఇటు భౌతికత్వం... రెండూ మనకు కావలసినవే. ఇహపర సాధన ద్వారా అమరత్వాన్ని పొందవచ్ఛు మనలో ఉన్న దివ్యత్వాన్ని వెలికి తేవచ్చు అంటారు శ్రీ అరవిందులు.


ఆలోచనాపరుడైన మానవుడికి నిత్య జీవితంలో అయిదు ప్రశ్నలు ఎదురవుతాయి. దైవం అంటే ఏమిటి? అందుకు కావలసిన పూర్ణత్వం ఎలా సాధించాలి? సత్యం అంటే ఏమిటి? ఆనందం ఎక్కడుంది? అమృతత్వం పొందడమెలా? శరీరం ఒక కర్మాగారం, మనసు యంత్రం. యంత్రాన్ని నడిపిస్తే గాని కర్మాగారం పనిచేయదు. యంత్రానికి అమర్చిన ఒక చిన్న మీటపైన ఆధారపడి కర్మాగారం నడిచే విధంగా, దివ్యచైతన్యం సూక్ష్మ రూపంలో మన లోపలే ఉంది. సూక్ష్మంలోనే మోక్షం ఉందంటారు. శరీరం, మనసు, ఆత్మ మధ్య అవినాభావ సంబంధం ఉంది.


శరీరం అనే కర్మా గారాన్ని, మనసు అనే మరను శుభ్రంగా ఉంచుకోకపోతే అవి తుప్పు పట్టి పనికి రాకుండా పోతాయి. పరమార్థం గురించి ఆలోచించకుండా పోతే బతుకు బండబారి, ఒక జీవిత కాలం వృథా అయిపోతుంది. యంత్రాంగాలను కందెన పూసి పనికి సిద్ధం చేసినట్లు- కొత్త ఆలోచనలతో, ప్రయోగాలతో, మనసును అప్రమత్తం చేయకపోతే ఉపాయాలకు బదులు అపాయాలు ఎదురవుతాయి. ప్రగతి బాటలు మూసుకుపోయి, సుగతి ఆకాశ సుమంగా మిగిలిపోతుంది. మనిషి మనీషిగా ఎదగడానికి ప్రయత్నం కావాలి. మానవ ప్రయత్నానికి దైవ సహాయం తప్పకుండా ఉంటుంది.



దివ్యత్వం మన లోపల ఉన్నదని తెలుసుకుని దాన్ని బయటికి రప్పించే ప్రయత్నమే సాధన. దైవారాధన, సత్యసంధత, పూర్ణత్వం పైన దృష్టి, ఆనందాన్వేషణ, అమృతత్త్వం కోసం తపన- అయిదు ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వగల సాధనా మార్గాలు. మనసు మూగబోయి, జీవితం మోడుగా మారే ప్రమాదం నుంచి బయటపడటానికి అవి తగిన ఉపాయాలు. ఈ భౌతిక శరీరంలో ఆధ్యాత్మిక వెలుగు నిండినప్పుడే, దివ్యచైతన్యం రెక్కలు పరచుకుని, దివి నుంచి భువికి గరుత్మంతుడిలా దిగివచ్చి భువిని దివిగా, మనల్ని దివ్య మానవులుగా మారుస్తుంది.


ఇహం అంటే స్వారాజ్యం; పరం అంటే సామ్రాజ్యం. ఇహపర సాధన అంటే మనం ఉన్న చోటునుంచి, మరో ప్రపంచం లోకి అడుగువేయడం అన్నమాట. వామనుడు త్రివిక్రముడిగా ఎదిగిన విధంగానే- మనమూ సార్వభౌమత్వం, సామంతం రెండూ సాధించి చెప్పుచేతల్లో ఉంచుకోవాలి. సామంతం అంటే సాలోక్యం; సాధర్మ్యం అంటే సార్వభౌమత్వం. అయిదు ప్రశ్నలకు, అయిదు పరిష్కారాలకు ఆఖరిదైన అమృతత్త్వం శిరోభూషణం. అది దొరికితే మిగతావన్నీ సాధించినట్టే. అమృతత్త్వం అంటే జీవన్ముక్తి వివేకం. మనం కోరుకునే అమరత్వం కన్నా ఉన్నతమైన ఆకాంక్ష. ఎవరికైనా సరే- ఈ లోకంలోనే ఒక దివ్య దీపంగా నిలిచి, మరెన్నో ప్రాణ దీపాలు వెలిగించడం ఒక గొప్ప అనుభవం, అనుభూతి. మన ఆనందం అందరి సుఖంలోనే ఉందని తెలుసుకోవడం జీవన్ముక్తి వివేకం. జ్ఞాన దీపాన్ని తోటి మానవుల హృదయ మందిరాల్లో వెలిగించి ఆనందించడం కన్నా వేరే పర్వదినం ఏముంది?


*- :ఉప్పు రాఘవేంద్రరావు*

వేమన పద్యం

   వేమన పద్యం *


చెఱకు లోననైన జెడ్డగుణంబున్న, 

దీసివేయకున్న  దినగా బొసఁగఁ, 

దంతి పురము ద్రోహి యాతడెట్లుండురా, 

విశ్వదాభిరామ వినుర వేమ *


భావము =


సాధారణంగా మనకు అందరికీ ఇష్టమైనది రుచులలో తీయదనం, ఆ తియ్యదనం కు మూలము చెఱకు, ఎంతో ఇష్టంగా చెఱకు గడను కూడా మనం తింటూ వుంటాము. ఆ గడ లో ఎక్కడైనా పుచ్చు వచ్చినచో దాన్ని, కొరికితే  గట్టిగా ఉండి, మన నోటిలోని పళ్లకు  హానికరం, పళ్ళు ఊడి పోవచ్చు కూడా,  కనుక ఆ గట్టిగా వున్న పుచ్చు ను తీసివేసి తింటాము. ఇక్కడే మనకు  ఓ సంగతిని అంతర్లీనంగా వేమన గారు మనకు చెప్పారు, అదేమిటంటే, చెఱకు ఎంతతిపి అయినా పుచ్చు తీసివేసాము,పుచ్చుతో తింటే పళ్ళు ఊడిపోవచ్చు,  అలాగే మన కడుపున పుట్టిన వాడిని కూడా  చిన్నప్పటి నుండి వాడిలో పెరిగిన పుచ్చు అనే దుర్మార్గం ను ప్రతీ తల్లి తండ్రి, ఖండించి, వాడిని దండించినచో, క్రమశిక్షణ లో పెంచినట్లయితే , సమాజం లో దుర్మార్గుడు అనే వాడు  ఉండడు అని,లేని పోనీ గారా బాలు పెట్టి వాడు చేసిన, ప్రతీ చెడుపనిని పుత్రుడనే వాత్సల్యం తో సమర్ధించవద్దని, అందువల్ల మన బిడ్డే సమాజం లో దుర్మార్గుడు అవుతాడని,  అందరి తల్లి తండ్రులకు వేమన తియ్యనైన చెరకుతో హితవు చెప్పారు. నిజమే అప్పటి కాలంలో  క్రమశిక్షణ ఇప్పుడేది, అందుకే లేనిపోని నేరాలు, అఘాయిత్యాలు , జరుగుతున్నాయి చిన్న చిన్న పిల్లలే పెద్ద పెద్ద నేరాలు చేస్తున్నారు .అది పెంపక లోపం.  ఈనాటి సమాజాన్ని ఆనాడే వేమన ఊహించారు . తప్పకుండ మన పిల్లలను చెడు మార్గం వైపు మళ్ల కుండా, సన్మార్గములో పెంచుకుందాం. 


మీ రాజబాబు 😷🎹🎼🎤

శ్రీ సత్యనారాయణ స్వామి వ్రత మహాత్మ్యము

 శ్రీ సత్యనారాయణ స్వామి వ్రత మహాత్మ్యము 


తే."విమలమానస నారదా ! యేల యిపుడు *

     కూర్మితోడను నీవిట కొచ్చినావు ? 

     తెల్పు నీకోర్కె యేదైన దీర్తు నిపుడె 

     తేటతెల్లంబుగా నీవు దెల్పవయ్య "          11


క. నారాయణు డా విధముగ 

    కారుణ్యము తోడ బలుక, కడు పులకితు డై 

    నారదు డన్తట  భక్తితొ 

    యీ రీతిగ బలికె మిగుల వినయము తోడన్ 12


సీ. "సర్వజ్ఞు డవునీవు సర్వేశ !పరమేశ !

              నీ వెఱుంగని దేది నీరజాక్ష !

     మర్త్య లోకమునందు మనుజులుపెక్కురు 

              పలుయోనులందున ప్రభవమొంది 

     వివిధ యిడుములందు విధిదప్పి పడుచుండి 

               యనుభవించుచునుండె యమితవగపు 

     పాపకర్మలతోడ పలురోగములతోడ 

               పీడింప బడుచుండె పెక్కురీతి 

   తే. యమిత బాధల క్లేశాల యనుభవమున 

        మహిని జీవించుచున్నట్టి మానవులకు 

        బాధలను బాప నేదైన పరమపథము 

        బోధజేయగ గోరుదు పురుషశ్రేష్ఠ !"       13


క. ముని నారదు డావిధముగ 

    వినయంబున ప్రభునిగాంచి వేదన తోడన్ 

    జనముల బాధలు దెలుపగ 

    విని మనమున మెచ్చుకొనియు విష్ణుండనియెన్ 14


క. "మునివర ! నీ యభిమతమును 

    విని సంతస మొందినాను వేడుక యయ్యన్ 

    జగముల క్లేశము బాపగ 

    మనమందున దలచు నిన్ను మది శ్లాఘింతున్ 15


తే. లోక కల్యాణమును గోరి తేకువగను 

     యమిత యావేదనంబున యడుగ జూచి 

     సంతసంబయ్యె నాకెంతొ సంయమీంద్ర ! 

     వినుము దెల్పెద నీకొక్క విమల పథము   16


క. వినుమో నారద ! తెల్పెద 

    మనమందున కలతమాని మదిస్థిమితమునన్ 

    జనులందఱు సుఖ శాంతుల 

    మనగల రీ పుణ్య వ్రతము మఱి చేయంగన్ 17



తే. కామితార్ధ ప్రదాయిని కల్పతరువు 

     "సత్యనారాయణస్వామి సద్వ్రతంబు"

    యిహమునందున సుఖశాంతు లిచ్చితుదకు 

    పరమునందున మోక్షపుప్రాప్త మిచ్చు        18


                                    సశేషము … 


✍️ గోపాలుని మధుసూదన రావు 🙏

ధార్మికగీత - 83*

 🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲

                         *ధార్మికగీత - 83*

                                   *****

      *శ్లో:- అనభ్యాసే  విషం విద్యా ౹*

             *త్వ  జీర్ణే భోజనం విషం ౹*

             *విషం   సభా  దరిద్రస్య  ౹*

             *వృద్ధస్య  తరుణీ విషమ్ ౹౹*

                                 *****

*భా:- లోకంలో మానవాళికి సందర్భానుగుణంగా విషతుల్యమైన విషయాలు నాలుగు తారసపడతాయి. 1."విద్య":- "అభ్యాసము కూసు విద్య" అన్నారు పెద్దలు. విద్యాభ్యాసంలో శ్రవణ, భాషణ, పఠన, లేఖనములు, వాని వినియోగము కీలక సోపానాలు. వీనిని*  

*శ్రధ్ధాసక్తులు, దీక్షాదక్షతలతో  క్రమపద్ధతిలో నేర్వని వానికి ఆ చదువు*  *కాలకూటవిషమే.జీవితంలో ఒంటబట్టదు.  2."విందు":- పంచభక్ష్య సహితంగా, రుచికరము,శుచికరమై, షడ్రసోపేతమై డెందమలరే పసందైన విందు భోజనాన్ని  పీకల దాకా మెక్కి, అరగక* *బాధపడేవాడికి  ఒక్క బందరులడ్డు ప్రసాదంగా పెట్టినా అది విషతుల్యమే.ఒక వేళ తిన్నా  వెలుపలకు రావలసిందే. 3."సభ":- "ఆకొన్న కూడె అమృతము*"- *అన్నాడు* *సుమతీశతకకర్త.అసలే దరిద్రుడు. పైగా ఆకలెక్కువ. కడుపు కాలుతూ, కూటికోసం అలమటించే వాడికి  సభపెట్టి, గొప్పగా ఇచ్చే ఉపన్యాసం కూడా విషతుల్యమే. అందుకే నరేంద్రుడు ముందు* *అన్నం పెట్టి, పిమ్మట హితం చెప్పమన్నాడు. 4."తరుణి":- భార్యా వియోగంతో వేగలేక, పిల్లల్ని, ఇంటిని సాకలేక,  ముసలితనంలో చేసుకొన్న  దిక్కు, ఆర్థికప్రతిపత్తి, ఆశ్రయము*, *అండాదండాలేని  పడుచుపెళ్ళాం కూడా విరసానికి సరసం తోడైనట్లు విషంగా పరిణమిస్తుంది. జీవితాంతం కలచివేస్తుంది.  వీనిని  లోకవ్యవహారాలుగా,లోకాచారాలుగా నెమరువేసుకోవాలని సారాంశము*

                                    *****

                     *సమర్పణ  :  పీసపాటి*

🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲

క్షేత్ర సందర్శనం:త్రేతాయుగం


క్షేత్ర సందర్శనం:త్రేతాయుగం నాటి క్షేత్రం... జూత్తిగ. 


వ్యాసుడు రచించిన పురాణాల్లో వాయుపురాణం ఒకటి.ఆపురా ణంలో గోస్తనీ నది గురించి ఉమా మహేశ్వరక్షేత్రం గురించిరాసారు. సాక్షాత్తు ఆక్షేత్రమేనేటికి పశ్చిమ గోదావరి జిల్లా పెనుమంట్రమండ లంలో జుత్తిగ గ్రామంలో అలరారు తోంది. సుందరమైన ప్రకృతిరమణీ యతల మధ్య నిర్మితమైన చారిత్రక దేవాలయం ఇది.

భక్తుల కోర్కెలు తీర్చే కల్పతరువుగా విరాజిల్లుతున్న ఈ ఆలయాన్ని దర్శించు కున్న భక్తులంతా ఆధ్యాత్మిక ఆనందానికి గురౌతారు. ఈ ఉమా వాసుకి రవి సోమేశ్వర స్వామిని సేవించేవారికి శత్రు, రుణ, రోగ, మృత్యు భయాలు ఉండవని అంటారు. సోమవారం నాడు ఈ శివలింగాన్ని సేవించి అన్నదానం చేస్తే కోటి రెట్లు ఫలితం కలుగు తుందట. మహాశివరాత్రి పర్వదినాన ఈ శివలింగానికి అభిషేకం చేసి అర్చించినవారు పునర్జన్మ రహితమైన కైవల్యం పొందగలరు. జుత్తిగలోని సోమేశ్వర స్వామి ఆలయం కాశీ క్షేత్రమంత పవిత్రమైనది. | త్రేతాయుగంలో రావణాసురుడు, అతని పరివారం దేవతలందరిని పీడిస్తుండే వారు. అలా ఒకరోజు రవి, వాసుకి, సోము డు, రావణ భటులచేపరభావింపబడి దుఃఖిస్తుండగా, బ్రహ్మ చూసి వారి దుఃఖాన్ని పోగేట్టుందుకు, రావణవధ శీఘ్రంగా జరిగి లోక కళ్యాణం జరిగేందుకు వారికి ఒక సలహా ఇచ్చారట. బ్రహ్మ ఆదేశానుసారము ఉమా, వాసుకి, సూర్యచంద్రులు గోస్తనీ నది తీరంలో ఉత్తర వాహిని, నిత్య పుష్కరిణి ఉన్నచోట పశ్చిమాభిముఖంగా శివలింగా న్ని ప్రతిష్టించి కొలవసాగారు. అలా త్రేతా యుగంలో నెలకొల్పబడిన ఈ లింగమే శ్రీ

*

ఉమావాసుకి | సోమేశ్వర లింగం.15వ శతా బ్దంలో ఖిల్జీ పాదుషావారి ఆజ్ఞానుసారం సత్తిరాజు వంశస్తులచే ఈ దేవాలయం పున ర్నిర్మాణం జరిగినట్లుగా ఇక్కడి శాసనాల ద్వారా తెలుస్తుంది. సత్తిరాజు వంశస్తులే నిర్వాహక ధర్మకర్తలుగా ఉంటున్నారు.

ఆలయ గోపురాలు రమణీయ ప్రతిమ లతో దర్శనమిస్తాయి. గర్భాలయంలో శ్రీ ఉమా వాసుకి రవి సోమేశ్వర స్వామి లింగం స్పటిక స్వచ్చంగా, పవిత్రంగా భాసిస్తుంది. స్వామికి మహాన్యాస, నమక, చమక సంపుటీ కరణతో అభిషేకాలు, బిల్వార్చన భక్తులు నిర్వర్తింప చేసుకుంటూ ఇహపర ఫలితా లను అందుకుంటారు. ఉమా, వాసుకీ రవి సోమేశ్వర స్వామి వారి కల్యాణ మహోత్సవా లను మాఘమాసం బహుళ పక్షంలో దశమి నుంచి అమావాస్య వరకూ నిర్వహిస్తారు.

ఈ ఆలయంలో ఉత్తరాన దక్షిణాది ము ఖంగా పార్వతీదేవి భక్తులకు దర్శనం ఇస్తుం ది. గర్భాలయాన అమ్మవారు స్వర్ణ కిరీట ధారినై కుంకుమార్చనలను అందుకుంటూ ఉంటుంది. ఈ ప్రాంగణంలో అనేక దేవి, దేవతల ఆలయాలు ఉన్నాయి. పార్వతిదేవి ఎడమ భాగాన శ్రీ భద్రకాళి, వీరభద్రేశ్వరుల ఆలయం ఉంది. మండప స్తంభాలు నయన మనోహరంగా ఉంటాయి. ప్రధాన ఆలయం శివలింగానికి ఎదురుగా ముఖమండపంలో శ్రీ శారదాదేవి, శ్రీ అనిస్రమ్మదేవి దర్శనమిస్తా రు. ఇక్కడ లక్ష్మి జనార్ధన స్వామి ఆలయం ఉంది. వైశాఖ శుద్ధ త్రయోదశి నుండి పౌర్ణమి వరకు లక్ష్మి జనార్దనస్వామి కళ్యాణ మహో త్సవాలు జరుగుతుంటాయి. ఆలయానికి ఈశాన్యంలో శ్రీ సూర్యనారాయణుడు, ఛాయాదేవి సహితంగా ఉషఃకిరణ కాంతు లతో దర్శనమిస్తాడు. శ్రీ కాలభైరవస్వామీ ఆలయాన్ని 1924వ సంవత్సరంలో

సత్తిరాజు వంశస్తులే ప్రతిష్టించారు. ప్రధాన ఆలయానికి ఆగ్నేయంలోగణపతి, నైరుతి దిక్కున శ్రీ దుర్గాదేవి ప్రతిష్ణుతులై పూజలం దుకుంటున్నారు. అలాగే 1958లో నిర్మిం చిన దూతికాదేవి ఆలయం ఇక్కడ నెలకొని ఉంది. ఇక్కడ 1997-98వ సంవత్సరంలో నవగ్రహమండపాన్ని నిర్మించారు. ఆలయ రెండవ ప్రాకారంలో శ్రీవల్లి సమేతుడైన శ్రీ సుబ్రహ్మణ్యస్వామి నెలకొని ఉన్నారు. ఇది 1907వ సంవత్సరంలో నిర్మింపబడినది. ఇక్కడ ప్రతి మంగళవారం పూజలు జరుగు తాయి. మార్గశిర శుద్ధ పంచమినాడు శ్రీ వల్లి దేవి సుబ్రహ్మణ్యస్వామి వారి కళ్యాణం, తీర్ధం జరుగుతాయి. ఈ ఆలయములో సంతానము లేని దంపతులు పూజలు చేసిన సంతానము కలుగుతుందని నమ్ముతారు. సుబ్రహ్మణ్యస్వామి ఆలయానికి చేరువలోనే చంద్ర పుష్కరిణి ఉంది. మొదటి ప్రాకారాని కి ఉత్తర దిక్కులో శ్రీ కంచి కామాక్షి ఆలయం కూడా సందర్శించుకోవచ్చు. కామాక్షి దేవికి కుంకుమ పూజలు విశేషంగా నిర్వహిస్తారు.

ఈ ఆలయంలో స్వామికి రోగ పీడి తులు మృత్యుంజయ అభిషేకం చేయించ టం, సుఖజీవన సంప్రాప్తికి సోపానంగా విశ్వ సిస్తారు. మాఘ బహుళ దశమి నుండి అమా వాస్య వరకు ఏటా ఉమా వాసుకి రవి సోమే శ్వరస్వామి కళ్యాణోత్సవాలు జరుగుతాయి. " కోర్టు సమస్యలతో బాధపడుతున్న వారు ఈ ఆలయాన్ని దర్శించి స్వామి వారికి మహన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, మృత్యుంజయ అభిషేకం చేసుకోవడం వలన సమస్య నుంచి విముక్తి కలుగుతుంది.

ఎలా వెళ్లాలి...? జుత్తిగకు తణుకు నుండి అన్ని రవాణా సౌకర్యాలు ఉన్నాయి. తణుకు పట్టణం నుండి ఈ క్షేత్రం 14 కి.మీ. దూరంలో ఉంది. తాడేపల్లి గూడెం నుండి 28 కి.మీ., అత్తిలి నుండి 6 కి.మీ., మార్టేరు నుండి 15 కి.మీ. దూరంలో ఈ క్షేత్రముంది.


🌷🌷🕉🌷🌷🕉🌷🌷🕉🌷🌷🕉

శివానందలహారీ

 🙏శివానందలహారీ🙏


29

త్వత్పాదాంబుజ మర్చయామి పరమం త్వాo చింతయా మ్యస్వహం

త్వామీశం శరణం వ్రజామి వచసా త్వామేవ యాచే విభో !

వీక్షాo మే దిశచాక్షుషీo స కరుణాం , దివ్యైశ్చిరం 

ప్రార్థితాం

శంభో ! లోకగురో ! మదీయ మనసస్సౌఖ్యోపదేశం కురు 



భవ్యమౌ నీ దివ్య పాదపద్మంబుల

            పరమేశ ! నర్చింతు ప్రతి దినంబు

సర్వ కాలము లందు సర్వేశ్వరా ! నిన్నె

            చింతించు చుందును చిత్త మందు

సతతంబు దేవేశ ! శరణు వేడెద నిన్ను

            నన్యులు లేరంచు ననుచు మదిని

యనయంబు వాక్కుతో యాచించు చుందును

             గరళకంఠా ! నీవె గమ్య మనుచు

సర్వామరులు నిన్ను సతతంబు యాచించు

             విమలమౌ సుకటాక్ష వీక్షణంబు

దీనతను నున్న నాపైన దిగిచి సుంత

మహిత సౌఖ్యోపదేశంబు మమత మీర

చేయు మో దేవ ! శంకరా ! చిత్తమునకు

భక్త వత్సల ! శ్రీకరా ! పాహి పాహి !            29 #



 30            

వస్త్రోద్యూతవిధౌ సహస్రకరతా, పుష్పార్చనే విష్ణుతా,

గంధే గంధవహాత్మతా2స్నపచనే బర్హిర్ముఖాధ్యక్షతా , 

పాత్రే కాంచనగర్భతా2స్తి మయి చే ద్బాలేందు చూడామణే 

శుశ్రూషాo  కరవాణి తే పశుపతే ! స్వామిన్ ! త్రిలోకీ గురో ! 



వస్త్రోప చారంబు వదలక సేయంగ

            వేయికరాల  వేవెలుగు పదవి

కుసుమార్చనల్ సేయ కుసిమిత వాసనల్

            విమల వ్యాపక మైన విష్ణు పదవి

గంధోపచారంబు గావింపగా  నీకు

            పలుదెసల్ వ్యాపించు పవన పదవి

యన్నపచనమున హవిసు నర్పించంగ

             నిష్టి దేవుండైన యింద్ర పదవి

నిత్య పాత్రోప చారంబు నెఱపు టకును

ఘనతగాంచిన కాంచనగర్భ పదవి

యీశ్వరా ! నీవు దయతోడ యిచ్చి తేని

చిత్త మలరంగ శుశ్రూష సేతు దేవ !          30 #



✍️గోపాలుని మధుసూదన రావు 🙏

దుర్గా సప్తశతి - 17

 *🌹. శ్రీ దేవీ మహత్యము - దుర్గా సప్తశతి - 17  / Sri Devi Mahatyam - Durga Saptasati - 17 🌹*

✍️. మల్లికార్జున శర్మ 

📚. ప్రసాద్ భరద్వాజ 


*అధ్యాయము 5*

*🌻. దేవీ దూతసంవాదం - 2 🌻*


17-19. సర్వభూతాలలో చేతనా (తెలివి) స్వరూప అయి నిలిచి ఉండే దేవికి పదే పదే నమస్కారాలు.


20–22. సర్వభూతాలలో బుద్ధిస్వరూపయై నిలిచి ఉండే దేవికి పదే పదే నమస్కారాలు.


23-25. సర్వభూతాలలో నిద్రాస్వరూపయై నిలిచి ఉండే దేవికి పదే పదే నమస్కారాలు.


26-28. సర్వభూతాలలో క్షుధా (ఆకలి) స్వరూపయై నిలిచి ఉండే దేవికి పదే పదే నమస్కారాలు.


29-31. సర్వభూతాలలో ఛాయా (ప్రతిబింబం) స్వరూపయై నిలిచి ఉండే దేవికి పదే పదే నమస్కారాలు.


32–34. సర్వభూతాలలో శక్తిస్వరూపయై నిలిచి ఉండే దేవికి పదే పదే నమస్కారాలు.


35-37. సర్వభూతాలలో తృష్ణా (దప్పిక) స్వరూపయై నిలిచి ఉండే దేవికి పదే పదే నమస్కారాలు.


38–40. సర్వభూతాలలో క్షాంతి (ఓర్పు) స్వరూపయై నిలిచి ఉండే దేవికి పదే పదే నమస్కారాలు.


41–43. సర్వభూతాలలో జాతి స్వరూపయై నిలిచి ఉండే దేవికి పదే పదే నమస్కారాలు.


44–46. సర్వభూతాలలో ల (వినమ్రత) స్వరూపయై నిలిచి ఉండే దేవికి పదే పదే నమస్కారాలు.


47–49. సర్వభూతాలలో శాంతిస్వరూపయై నిలిచి ఉండే దేవికి పదే పదే నమస్కారాలు.


50–52. సర్వభూతాలలో శ్రద్ధా (ఆసక్తి) స్వరూపయై నిలిచి ఉండే దేవికి పదే పదే నమస్కారాలు.


సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹

కార్తిక పురాణము

 శ్రీరస్తు.


కార్తిక పురాణము

2వ అధ్యాయము.


కార్తిక సోమవార వ్రతమాహాత్మ్యము


పద్యరచన.

చింతా రామకృష్ణారావు.


వశిష్ఠుఁడు జనకునికిట్లు చెప్పసాగెను.


మత్తకోకిలు.

👇

1.  శ్రీ వశిష్ఠుఁడు చెప్పుచుండెను శ్రీకరంబగు సత్ కథల్


ధీవరేణ్యుఁడు రాజయోగియు తృప్తిగా వినుచుండె, స


ద్భావ సంపద, పుణ్యసత్ ఫలదంబు కార్తిక మాసమున్


జీవపాళికి సోమవారము చేయుమేలు వ్రతంబునే.


2.  కార్తికంబున సోమవారము గాఢ సద్వ్రత దీక్షతో


వర్తిలం దగు షడ్విధంబులు బాగుగా వివరించుచున్,


ధూర్తులేవిధి ముక్తిగాంచ బుధుల్ వచించిరొ తెల్పి తా


నార్తితోడను నిష్ఠురీ యపహాస్య వృత్తిని తెల్పెగా.


3.  భారతంబున కాశ్మిరంబున బ్రాహ్మణోత్తము పుత్రిగా


వారకాంతయె పుట్టెనా యన పాపి నిష్ఠురి పుట్టె, నె


వ్వారలున్ తన దుర్గుణంబులు భారమంచును చేరనీ


రారజోగుణ దుర్భగన్, గని యాదరించెను భర్తయే.   


4.  మిత్ర శర్మ మహానుహావుఁడు, మేలు కూర్చగ నామెనే


పాత్రురాలుగ నెంచి నిత్యము భర్త్రుధర్మము తోడ తా


ధాత్రి వర్తిలుచుండ, నామె కుతంత్రముల్ పచరించుచున్


శత్రువట్టుల చూడ సాగె నసహ్య ధూర్తుల చేరికన్,   


5.  అంద చందములారఁ బోయుచు నందరున్ వశమౌటతో


పొంద సాగెను యౌవనోద్ధృతి పొంగగా దురహంకృతిన్,


కొందరామెను భర్త యడ్దని క్రుమ్మిచంపమనంగనే


మందబుద్ధి వధించె భర్తను,మంచియే కనరానిదై.     


6.  పాప పంకిల దుర్మదాంధను వార కాంతగ చేసి యా


కూపమందుననుంచి వీడిరి కోడెగాండ్రు, కృశించగా


వాపువోలెను యౌవనంబు, ప్రభావమంతయు హీనమై


యోపలేని దురంత దుర్గతి నొంది క్రుళ్ళెను దేహమున్. 


7.  తా నధర్మమునందు మున్గిన ధర్మబాహ్యను నిష్ఠురిన్


ప్రాణముల్ హరియించి దూతలు వాతలెన్నియొ పెట్టి, య


క్షీణ పాపికి దుష్ట జన్మలు శిక్షగా విధియించగా


తాను చేసిన కర్మదుష్ఫల దండనంబని రోదిలున్,       


8.  వేల జన్మలు నెత్తు నామెను పెద్దవారల పుణ్యమే


నేలపై జనియింపఁ జేసెను నీతిబాహ్యను, కుక్కగా


జాలి చూపుచు బ్రహ్మయే మనసార మార్చగ వ్రాతయే,


మ్రోల నిల్చెను బ్రాహ్మణోత్తము ముంగిలిన్ గని భుక్తికై.   


9.  కార్తికంబది, సోమవారము, కాల కంఠుని గొల్చుచున్,


గుర్తుగా వ్రతమాచరించెను కోవిదుండగు బ్రాహ్మణుం


డార్తులన్ గని బ్రోవుదైవ మహత్వ మాతనికబ్బుటన్


బూర్తిగా శివుఁడట్లు భాసిలు పూజ్యుడుండు గృహంబదే.


10.  బాపడావ్రతమున్ సమాప్తము పాడిగా యొనరించి తా


మాపటన్ బలి నుంచె బైటను మంచికోరుచు, నంతలో


నా పదార్థము గ్రోలె నిష్ఠురి యాకలిన్ బరిమార్చగా


నా పరాత్పరు సత్ కృపన్ దన యాత్మలో స్మృతి కల్గెనే.  


11.  నాకు ముక్తిని గొల్పుడంచు ఘనంబుగా నది కోరగా


శ్రీకరుండగు బ్రాహ్మణుండటు చెంత నిష్ఠురిఁ గాంచుచున్


నీకదెట్టుల వచ్చె మాటలు నీ వెవండవు తెల్పుమం


చాకడన్ గల కుక్క తో ననె నంతనయ్యది తెల్పగా,          


12.  దానివృత్తము విన్న బాపఁడు దానికిన్ వ్రత సత్ ఫలం


బే నయంబుగ ధారవోసె, నహీన దివ్య ఫలంబుచే


శ్వాన దేహము వీడి నిష్ఠురి శర్వుసన్నిధి చేరె, నో


ధీనిధీ! వర కార్తికవ్రత దీక్ష మానకు మెప్పుడున్.               


13.  కార్తికంబున సోమవారము కాలకంఠుని గొల్చుడీ!


స్ఫూర్తి నొందుడి భక్తి భావము పొంగిపొర్లగ మీరలున్


ధూర్తపాళిని చేరబోకుడి, తోచినట్లుగ నీశ్వరున్


పూర్తిగా మదినిల్పి ముక్తిని పొందుడీ జనులందరున్.


2వ అధ్యాయము సమాప్తము.


స్వస్తి.

H








 

మానవుడు ప్రకృతి

 మానవుడు ప్రకృతిని నాశనం చేసి కోరికలను తీర్చు కోవాలి అన్న తపన ఎక్కువైంది. దీనికి కారణం దురాశ అహంకారం. ధర్మం జయెూస్తు. అధర్మస్య నాశ్యోస్తు.అన్న వేదోక్తివి సార్థకం చేయుటయే సనాతన ధర్మాచరణ. ప్రకృతిని రక్షిస్తే ధర్మమే. తద్వారా వాటి ఫలములను అనుభవించవచ్చు. ప్రకృతిని మనం నాశనం చేస్తే దాని సమతుల్యత సాధించుటకు విపరీత వాతావరణ మార్పులు.ఏదైనా అవసరార్ధం మట్టిని మెుదలగు పంచభూత తత్వ పదార్ధ లక్షణములను స్వీకరించుటకు తవ్వే ముందు కూడాలేక వాటిని వుపయోగించే ముందు వాటిని లోక కళ్యాణ నిమిత్తమే ప్రజా హితం కోరి ప్రకృతిలో వస్తువులను సంగ్రహించుట వైదిక సనాతన సంప్రదాయం. పంట వేసే ముందు కూడా అటులనే భూమిలో జీవరాశులకును హాని చేయకుండా వాటి సృష్టి కర్తయైన భూ దేవుని ప్రార్థన చేసి వాటికి యిబ్బంది లేకుండా పూజచేసి ఆచరించుట ధర్మం. అదే వైదిక మానవ జీవన సంప్రదాయం. అప్పుడే ఋతు ధర్మం తద్వారా సృష్టి ధర్మం. ప్రకృతి ఆరాధన. వృక్షో రక్షిత రక్షిత. అన్నింటిలో జీవం వున్నదని వాటి రక్షణయే సనాతన ధర్మమని తెలియుటయే సత్వ గుణ లక్షణము. సమస్తమును  జయించుటకు మానవులకు అసంభవం.ఎందుకనగా మనం దేనినీ సృష్ఠంచలేదు.ప్రకృతిని అనుభవించుచూ తనను తాను జయించు ప్రయత్నం చేయాలి.అదియే మానవ ధర్మం.

సన్యాసి..పరివర్తన..

 సన్యాసి..పరివర్తన..


సుమారు ఎనిమిదేళ్ల క్రిందట..డిసెంబర్ నెలలో ఒక శనివారం సాయంత్రం ఐదు గంటల వేళ..బుల్లెట్ మోటార్ సైకిల్ మీద తెల్లటి వస్త్రాలు ధరించిన ఒక వ్యక్తి నా దగ్గరకు వచ్చి.."ఈ మందిరం నిర్వాహకులు ఎవరు..?" అని అడిగాడు..


"నేనే.." అన్నాను..అతనిని చూస్తే ఓ ముప్పై ఐదేళ్ల వయసుంటుందేమో..తెల్లగా వున్నారు..గడ్డం పెంచుకొని, తలమీద జుట్టును ముడి వేసుకొని..నుదుటి మీద ఒకే నామం దిద్దుకొని..వున్నారు...చూడగానే సన్యసించారేమో అని అనిపిస్తున్నది..సరే..వివరాలు తెలుసుకుందామని అనుకొని.."మీరెవరు..?" అన్నాను..


"నా పేరు రామయోగి స్వామి..సన్యాసం స్వీకరించి నిరంతర దైవ స్మరణలో గడుపుతున్నాము..అన్ని క్షేత్రాలూ, తీర్ధాలూ దర్శించుకుంటూ..ఈ ప్రాంతంలో ఒక అవధూత సిద్ధిపొందాడని విని..ఈ ప్రదేశాన్ని చూసిపోవాలని వచ్చాము..ఈరాత్రికి ఇక్కడ బస చేసి, రేపుదయం తిరిగి వేరే ప్రాంతానికి వెళ్లిపోతాము.." అని నాతో చెప్పాడు.."ఇప్పుడు ఈ అవధూత సమాధి చూడవచ్చా.." అన్నారు..


"ఈరోజు శనివారం కనుక, శ్రీ స్వామివారి ఆదేశానుసారం..సమాధిని దూరం నుండి దర్శించుకోవచ్చు కానీ..దగ్గరగా వెళ్లి, ముట్టుకునే అవకాశం లేదు.." అని చెప్పాను..


"ఓహో..అలాగా..పర్లేదు..రేపుదయం చూస్తాము..ఎలాగూ రాత్రికి ఇక్కడే ఉంటాము కదా.." అన్నారు..


తనని తాను "మేము.." అని సంబోధించుకోవడం నాకెందుకో నచ్చలేదు..అయినా అది వారి స్వవిషయం కనుక ఊరుకున్నాను..ఉండటానికి ఏదైనా గది కావాలా అని అడిగాను..పెద్దగా నవ్వి.."అక్కర్లేదు..ఈ మంటపం లోనే ఉంటాము..కాలకృత్యాలకు బైటకు వెళతాము..బావి వద్ద స్నానం చేస్తాము..ఈరాత్రికి ఆహారంగా పళ్ళు తీసుకుంటాము..అవికూడా తెచ్చుకున్నాము..మా గురించి మీరేమీ శ్రమ పడవద్దు.." అన్నారు..సరే అన్నాను..


ఆ శనివారం నాడు భక్తులు ఎక్కువ మంది రాలేదు..సుమారుగా మూడు నాలుగు వందలమంది మాత్రం వున్నారు..ఆరుగంటలకే చీకటి పడింది..ఏడు గంటలకు పల్లకీసేవ ప్రారంభం అయింది..అంతవరకూ మంటపం ముందు వైపు కూర్చుని ఉన్న రామయోగి స్వామి..పల్లకీ దగ్గరకు వచ్చి కూర్చున్నారు..చాలా శ్రద్ధగా పల్లకీసేవ తతంగాన్ని గమనించసాగారు..పూజా కార్యక్రమాలు అయిపోయి..పల్లకీని శ్రీ స్వామివారి సమాధి చుట్టూ త్రిప్పడానికి భక్తులు సమాయత్తం అవుతున్న సమయం లో..తన వంటి మీద ఉన్న చొక్కాను విప్పివేసి..భుజంబుమీద ఉన్న ఉత్తరీయాన్ని నడుముకు చుట్టుకొని..ఒక్క ఉదుటున పల్లకీ దగ్గరకు వచ్చి..పల్లకీ ని తన భుజం మీదకు ఎత్తుకున్నారు..నేను కొద్దిగా నివ్వెరపోయాను..


శ్రీ స్వామివారి ఆలయం వెలుపల..మందిరం చుట్టూ మూడు ప్రదక్షిణాలు అయ్యేవరకూ..ఆపై ముఖద్వారం వద్ద పల్లకీని ఇతర భక్తుల తో పాటు పైకెత్తి పట్టుకొని..భక్తులందరూ ఆ పల్లకీ క్రింద నుంచి నడచి వచ్చేదాకా..తిరిగి పల్లకీ యధాస్థానానికి చేరేదాకా...తానే మోస్తూ వున్నారు..అర్చకస్వామి చివరలో ఇచ్చిన తీర్ధ ప్రసాదాలను భక్తితో స్వీకరించి..ఇవతలికి వచ్చేసారు..ఆ తరువాత..కొంచెం సేపు మంటపం లో వుండి..బైటకు వెళ్లిపోయారు..


ప్రక్కరోజు ఆదివారం ఉదయం ఐదు గంటలకల్లా మందిరం లోని మంటపం లోకి వచ్చేసారు..శ్రీ స్వామివారి సమాధికి అర్చకస్వాముల ద్వారా జరిగిన అభిషేకాన్ని దగ్గరుండి మరీ చూసారు..హారతులు అయిపోయిన తరువాత..నా వద్దకు వచ్చి..

"స్వామివారి సమాధి వద్దకు ఇప్పుడు వెళ్ళొచ్చా..." అని అడిగారు.."వెళ్ళండి.." అన్నాను..


శ్రీ స్వామివారి సమాధి వద్దకు వెళ్లి, మూడు ప్రదక్షిణాలు చేశారు..శ్రీ స్వామివారి పాదుకులను తన నెత్తిమీద పెట్టుకున్నారు..వాటిని మళ్లీ యధాస్థానం లో ఉంచి..సమాధికి మోకాళ్ళ మీద కూర్చుని నమస్కారం చేసుకొని..ఇవతలికి వచ్చారు..


"నిన్న రాత్రి పల్లకీసేవ లో కూర్చున్న క్షణం నుంచీ..నాలో ఏదో తెలీని అంతర్మధనం మొదలైంది..నేను చేస్తున్న సాధనలో పొరపాటు ఉందేమో అని అనిపిస్తున్నది..ఇతమిద్ధంగా ఇదీ అని చెప్పలేను..అహంకరించొద్దు..అహంకరించొద్దు..అని పదే పదే అంతర్వాణి పలుకుతున్నది..రాత్రంతా అశాంతి గా వున్నాను..శ్రీ స్వామివారి సమాధి వద్ద పాదుకలు నా శిరస్సు కు ఆనించుకున్న మరుక్షణం..నాలోని ఆవేదన మాయం అయింది..నేను చేసే సాధనే గొప్పది అనే భావన విడవమని స్వామివారి ఆదేశం అనిపించింది..ఇలా దేశాలు పట్టి తిరగకుండా..ఒకచోట స్థిరంగా వుండి సాధన చేసుకోమని నాకు ఆజ్ఞ వచ్చినట్లు అనిపించింది..ఇక నాకు అనువైన ప్రదేశానికి వెళ్లి అక్కడే నేను సాధన చేసుకుంటాను..నాకు ఏ సందేహం వచ్చినా...ఇక్కడకు వచ్చి..ఈ స్వామివారి సమాధిని దర్శించుకుంటాను..మీ ఆదరణ కు నా ధన్యవాదములు.." అన్నారు..


తనని తాను గౌరవ వాచకం తో సంబోధించుకున్న ఆ సాధకుడు..శ్రీ స్వామివారి సమాధి దర్శనం అనంతరం అత్యంత వినయంగా తన గురించి చెప్పుకొచ్చారు..అదే పరివర్తన అనుకున్నాను నేను..


ఆ తరువాత ఆ సన్యాసి మరొక్కసారి మాత్రమే శ్రీ స్వామివారి సమాధి దర్సనానికి వచ్చారు..తనకు మార్గదర్శనం చేసిన స్వామివారికి ఆజన్మపర్యంతం ఋణపడిఉంటానని పదే పదే చెప్పుకొచ్చారు..


సర్వం..

శ్రీ దత్తకృప!


(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగిలిచెర్ల గ్రామం..లింగసముద్రం మండలం..ప్రకాశం జిల్లా..సెల్ : 94402 66380 & 99089 73699).

“పది రూపాయల పథకం”

 జయ జయ శంకర హర హర శంకర


 “పది రూపాయల పథకం” ఆలోచనకు మీ స్పందన మాకు చాలా సంతోషం కలిగించింది. 


పరమాచార్య స్వామివారి అనుగ్రహంతో ప్రతిఒక్కరూ ప్రతినెలా తప్పకుండా మీ సంపాదనలో నుండి వేదరక్షణ, గోరక్షణ, ఆలయరక్షణ, ధర్మరక్షణ కొరకు కేవలం “పది రూపాయల” మొత్తాన్ని పంపండి. 


ఇలా సమకూరిన ధనాన్ని ప్రతినెలా వేద పాఠశాలలకు, వేద పారాయణలకు, యజ్ఞయాగాది క్రతువులకు, గోసేవకు వినియోగించబడుతుంది.


పది రూపాయలు పంపాల్సిన వివరాలు.


Google Pay : 7259859202


UPI ID: paramacharyavaibhavam@okicici


--- అడ్మిన్ టీం

మారేడు ధళం గోప్పతనం**

 *మారేడు ధళం గోప్పతనం**


లక్ష్మీదేవి కుడిచేతితో సృష్టించిన చెట్టు మారేడు చెట్టు. అందుకే ఆ చెట్టుకు పండిన కాయను *శ్రీఫలము* అని పిలుస్తారు. సృష్టిలో మారేడు చెట్టుకు ఒక గొప్పతనం ఉంది. అది పువ్వు పూయకుండా కాయ కాస్తుంది.


మారేడు కాయలో ఉన్న గుజ్జును చిన్న కన్నం పెట్టి తీసి, దానిని ఎండబెట్టి అందులో విభూతి వేసి ఆ విభూతిని చేతిలో వేసుకుని పెట్టుకునేవారు. 


మారేడు ఆయుర్వేదమునందు ప్రధానంగా ఉపయోగ పడుతుంది. 

ఈ మారేడు దళము మూడుగా ఉంటుంది. అందుకే


త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం చ త్రియాయుధం!


త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పణం!!


అని తలుస్తాము.


దళములు దళములుగా ఉన్నవాటినే కోసి పూజ చేస్తారు. ఈ దళం మూడు ఆకులుగా ఉంటుంది.


అరుణాచలంలో బహుబిల్వదళం ఉంటుంది. అది మూడు, తొమ్మిది కూడా ఉంటాయి. 


పుష్పములను పూజ చేసేటప్పుడు తొడిమ లేకుండా పూజ చేయాలి. 


కానీ మారేడు దళమును పూజ చేసేటప్పుడు కాడను తీసివేయకుండా ఈనెనే పట్టుకుని శివలింగం మీద వేస్తారు. 


మనకి శాస్త్రంలో అయిదు లక్ష్మీ స్థానములు ఉన్నాయని చెప్పారు.అందులో మారేడు దళము ఒకటి.


మారేడు దళంతో పూజ చేసినప్పుడు బిల్వం ఈనె శివలింగమునకు తగిలితే ఐశ్వర్యం కటాక్షింపబడుతుంది.

అందుకే ఇంట్లో ఐశ్వర్యం తగ్గుతున్నా, పిల్లలకు  ఉద్యోగములు రాకపోవడం మొదలగు ఇబ్బందులు ఉన్నా, మూడు ఆకులు ఉన్న దళములను పట్టుకుని శివునికి పూజ చేసేవారు. 


శివుడిని మారేడు దళంతో పూజ చేయగనే ఈశ్వరుడు *త్రియాయుషం* అంటాడట.


‘బాల్యం, యౌవనం, కౌమారం 

ఈ మూడింటిని నీవు చూస్తావు’ 

అని ఆశీర్వదిస్తాడుట.


కాబట్టి


ఆయుర్దాయం పూర్తిగా ఉంటుంది.


శివుని మారేడు దళములతో పూజించే వ్యక్తీ మూడు గుణములకు అతీతుడు అవుతాడు.


మారేడు దళం శివలింగం మీద బోర్లాపడితే..జ్ఞానం సిద్ధిస్తుంది.


ఇంత శక్తి కలిగినది కాబట్టే దానికి *శ్రీసూక్తం* లో

*అలక్ష్మీర్మే నశ్యతాం త్వాం వృణే*

(అమ్మా అలక్ష్మిని= దరిద్రమును పోగొట్టెదవుగాక) అని చెప్తాము.


మనిషికి మూడు గుణములు, 

మూడు అవస్థలు ఉంటాయి.

నాల్గవదానిలోకి వెళ్ళడు. 

నాల్గవది తురీయము.


*తురీయమే జ్ఞానావస్థ*


అటువంటి తురీయంలోకి వెళ్ళగలిగిన స్థితి శివలింగమును మారేడు దళముతో పూజ చేసిన వారికి వస్తుంది.


*మారేడు చెట్టుకి ప్రదక్షిణం చేస్తే మూడు కోట్లమంది దేవతలకి ప్రదక్షిణం చేసినట్లే*  


ఇంట్లో మారేడు చెట్టు ఉంటే..


ఆ మారేడు చెట్టు క్రింద కూర్చుని ఎవరయినా జపం చేసినా పూజ చేసినా.. అపారమయిన సిద్ధి కలుగుతుంది.

యోగ్యుడయిన వ్యక్తి దొరికినప్పుడు ఆ మారేడు చెట్టుక్రింద చక్కగా శుభ్రం చేసి ఆవుపేడతో అలికి ..పీట వేసి .. ఆయనను అక్కడ కూర్చోపెట్టి ..భోజనం పెడితే ..అలా చేసిన వ్యక్తికి కోటిమందిని తీసుకువచ్చి ఏకకాలమునందు వంటచేసి అన్నం పెట్టిన ఫలితం ఇవ్వబడుతుంది.


శాస్త్రము మనకు లఘువులు నేర్పింది.


మారేడు చెట్టు అంత గొప్పది.


మారేడు చెట్టు మీదనుండి వచ్చే గాలి మిక్కిలి ప్రభావం కలది.


అసలు మారేడు చెట్టు పేరులోనే చాలా గొప్పతనం ఉంది.


‘మా-రేడు’ తెలుగులో 

రాజు ప్రకృతి, 

రేడు వికృతి.


*మారేడు అంటే మా రాజు*. 

ఆ చెట్టు పరిపాలకురాలు.

అన్నిటినీ ఇవ్వగలదు.

ఈశ్వరుడు ఈ చెట్టు రూపంలో ఉన్నాడు.

అది పువ్వు పూయవలసిన అవసరం లేదు.


ద్రవస్థితిని పొందకుండా వాయుస్థితిని పొందిన కర్పూరంలా..మారేడు 

పువ్వు పూయకుండా కాయ కాస్తుంది.


అంత గొప్ప చెట్టు మారేడు చెట్టు.


అందుకే మీకు ఏది చేతనయినా కాకపోయినా ..మీ జీవితమును పండించుకోవడానికి, మీ మనస్సు ఈశ్వరాభిముఖం కావడానికి మూడు విషయములు శాస్త్రంలోచెప్పబడ్డాయి.అందులో


మొదటిది తప్పకుండా భస్మ ధారణ చేయడం,


రెండవది రుద్రాక్ష మెడలో వేసుకొనుట,


మూడవది తప్పకుండా మారేడు దళములతో శివలింగార్చన జీవితంలో ఒక్కసారయినా చేయుట.


ఈ మూడు పనులను ప్రతివ్యక్తి తన జీవితంలో చేసి తీరాలని పెద్దలు చెప్తారు.