6, జనవరి 2024, శనివారం

శ్రీ దేవీ భాగవతం

 శ్రీ దేవీ భాగవతం

.శ్రీగణేశాయనమః.శ్రీసరస్వత్యైనమః శ్రీగురుదత్తాత్రేయపరబ్రహ్మణేనమః

శ్లో)వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయవిష్ణవే|

నమోవైబ్రహ్మనిధయే వాసిష్ఠాయనమోనమః||

శ్లో)నారాయణంనమస్కృత్య నరంచైవ నరోత్తమం|

దేవీంసరస్వతీం వ్యాసం తతోజయముదీరయేత్||


శ్లో)సృష్టౌ యా సర్గరూపా జగదవనవిధౌ పాలినీ యా చ రౌద్రీ

సంహారే చాపి యస్యా జగదిదమఖిలం క్రీడనం యా పరాఖ్యా |

పశ్యంతీ మధ్యమాథో తదను భగవతీ వైఖరీవర్ణరూపా

సాస్మద్వాచం ప్రసన్నా విధి హరి గిరిశారాధితాలంకరోతు||


శ్లో)కాత్యాయనిమహామాయే భవాని భువనేశ్వరి |

సంసారసాగరోమగ్నం మాముద్ధరకృపామయే||

బ్రహ్మ విష్ణు శివారాధ్యే ప్రసీదజగదంబికే|

మనోఽభిలషితందేవివరందేహినమోఽస్తుతే||


(21-17)

ఎక్కడో ఒకచోట సంపాదించి కౌశికుడి ఋణం తీరుస్తాను. ప్రాణాలు పోయినా యాచనకుమాత్రం దిగను

నాథా ! కాలమనేది శక్తి స్వరూపం. సమస్థితినీ విషమస్థితినీ కలిగిస్తూంటుంది. అవమానాలు

సమ్మానాలూ చేయిస్తూంటుంది. పురుషుణ్ణి మహాదాతను చేసిన కాలమే యాచకుణ్ణి చేస్తూంటుంది. మన

జీవితమే చూడరాదూ, క్షణంలో ఎంత తలకిందులయ్యిందో ! ఒక విప్రుడి క్రోధం కారణంగా రాజ్యం

పోయింది. సుఖాలూ పోయాయి.

దేవీ ! కత్తి పుచ్చుకుని నా నాలుకను నిలువనా చీరనాసరే, అభిమానం చంపుకుని దేహి దేహి

అనిమాత్రం అననుగాక అనను. నేను క్షత్రియుణ్ణి. ఎవరినీ ఏదీ యాచించును. భుజబలంతో సంపాదించి

మరొకరికి ఇంత ఇస్తాను.

ప్రభూ ! యాచనకు నీ మనస్సు అంగీకరించకపోతే పోనీ మరొక పని చెయ్యి. ఇంద్రాదిదేవతలు

న్యాయంగా నన్ను నీకు సమర్పించారు. నేను ముమ్మాటికీ నీ సొత్తును. నా రక్షణ పోషణ శాసన భారాలన్నీ

నీవే. అందుచేత నన్ను అమ్మేసి ఆ డబ్బుతో ఋణం తీర్చు.

ఈ మాట వింటూనే హరిశ్చంద్రుడు కష్టం కష్టం అంటూ విలపించాడు. అయినా ఈసారి

మాధవీదేవి ధైర్యం కోల్పోలేదు. పట్టువదలలేదు. నాథా ! నా మాట విను.కాదనకు. అట్టే వ్యవధిలేదు.

సూర్యాస్తమయమే గడువు. విప్రశాపాగ్నిలో దహించుకుపోయి నీచత్వం పొందకు. నన్ను అమ్ముతున్నది

జూదం కోసం కాదు, మద్యంకోసం కాదు, రాజ్యంకోసం కాదు, భోగంకోసం కాదు. గురు ఋణం

తీర్చడానికి, సత్యవ్రతం సఫలం చేసుకోడానికి. కాబట్టి కించపడవలసింది లేకపోగా ఇది గర్వించదగిన

అంశం. దయచేసి నా మాట ఆలకించు. నన్ను ఎవరికైనా అమ్మేయ్.

ఇలా మాధవీదేవి పోరగా పోరగా కట్టకడపటికి గతిలేక హరిశ్చంద్రుడు అంగీకరించాడు. సరే,

దేవీ ! నిన్ను అమ్మేస్తాను. కఠినాతి కఠినుణ్ణి. నాకు దిగులేమిటి! నీచాతినీచులుకూడా చెయ్యని పనికి సిద్ధం

అవుతున్నాను. నాకు సిగ్గేమిటి! అంటూనే రెక్కపట్టుకుని భార్యను చరచరా తీసుకువెళ్ళి వీథిమొగలో

ఒక ఆరుగుమీద నిలబడ్డాడు జీరబోయిన గొంతుతో నలుగురికీ వినిపించేట్టు అరిచాడు

Panchang


 

దొంగలు పడ్డారు

 *దొంగలు పడ్డారు !*

 ౼౼౼౼౼౼౼౼౼౼౼

*ఒక కవి ఇంట్లో*

*దొంగలు పడ్డారు!*

*ఆరు వారాల నగలు*

*మూడు లక్షల నగదు*

*ఐదు పుస్తకాలు పోయాయి!!*


*పుస్తకాలది ఏముందయ్యా... నగలు నగదు చోరీ జరిగిందని కేసు నమోదు చేసుకున్నాడు పోలీసు.*


*పోలీసుల దర్యాప్తు జరుగుతోంది... నెలలు గడుస్తున్నా జాడలేదు... ఇక వడిసెను సుమతీ అనుకున్నాడు కవి...*


*ఐదు నెలల తర్వాత ఇంటికి ఒక పార్సిల్ వచ్చింది... అందులో నగలు నగదు భద్రంగా పంపించారెవరో... కవి గారి భార్య పిల్లలు వాటిని కళ్ళకు అద్దుకుని ఆనందించారు...*


*పుస్తకాలు పోతేపోయినయి... సొమ్ము దొరికింది అంతేచాలు అన్నారు భార్యాపిల్లలు...*


*ఆ పుస్తకాలు నా పంచప్రాణాలు అన్నాడు కవి...*

*" పోద్దురు బడాయి "*


*" పదేళ్లు కష్టపడి ఐదు పుస్తకాలు రాశానే... అవి నా పంచప్రాణాలు... పంపించినవాడు పుస్తకాలు పంపించి... నగదు నగలు పంపించకపోయినా బాధపడక పోయేవాడిని... కష్టపడితే సొమ్ము సంపాదించగలను... మళ్ళీ ఆ పుస్తకాలు రాయలేనే... అవి సరస్వతీ దేవి అమ్మవారు "... ఎడ్వడం మొదలెట్టాడు.*


*" నీ పుస్తకాలు సరస్వతీదేవీ ఐతే... నా నగలు నగదు సాక్షాత్తు లక్ష్మీదేవి... ఆ దొంగేవడో పిచ్చోడు " ఆనంద పడింది. ఇంతలో ఆ పార్సిల్లో ఒక కవర్ కనిపించింది. దాన్ని చించి అందులోని చీటి ఆసక్తిగా చదవడం ప్రారంభించింది ఆవిడ.*


*కవి గారికి*

*నమస్కారములు...🙏*

*బీరువా తాళాలు పగులగొట్టి చూశా... నగలు నగదు పక్కన పుస్తకాలు కనిపించగానే ఇవేవో ఖరీదైనవని భావించి దోచుకెళ్లా... బీరువాలో ఎందుకు దాచారు... వీటిలో నిధి రహస్యాలు ఏమైనా ఉన్నాయేమోనని ఓపిగ్గా వాటిని చదివా... నగదు నగలుకన్నా గొప్ప నిధి దొరికింది... అది జ్ఞాన నిధి... తప్పుచేశానని తెలుసుకున్నా...*

*ఈ లోగా నాభార్య పాతికవేలు ఖర్చుచేసింది... చమటోడ్చి సంపాదించి కొద్దినెలల్లో మనియార్థర్ చేస్తా... డబ్బుతో పాటు పుస్తకాలు పంపిస్తా... ఐతే వాటి జిరాక్స్ ప్రతులు మాత్రం తీసుకుని నావద్ద ఉంచుకుంటా... వాటిని మా పిల్లలతో పాటు తోటివారితో చదివిస్తా... ఒకవేళ పుస్తకాలు దొంగిలించకపోతే నగలు నగదు తిరిగి పంపించేవాడినికాదు... ఇప్పుడు నా దృష్టిలో నగలు నగదు కన్నా పుస్తకాలే విలువైనవిగా కనిపిస్తున్నాయి...*

*ఈ రోజు నుంచి దొంగతనాలు మానేస్తున్నా... పుస్తకాలు అచ్చేసుకునేందుకు తోచిన డబ్బుకూడా మీకు పంపించే ప్రయత్నం చేస్తా...*


                     *ఇట్లు*

      *దొంగతనాలు మానిన దొంగ*


*ఇప్పుడు కవి ముఖంలో ఆనందం... ఆయన భార్య ముఖంలో ఆలోచనలు*

*లక్ష్మీదేవి గొప్పదా?*

*సరస్వతీ దేవి గొప్పదా?*   

-------------------------------------------------------  

*ఎంత చక్కని కధ. రచయిత కు అభినందనలు.*


*కావున విద్యార్థులకు పుస్తకాపాఠనాన్ని ఒక నిధిగా... పుస్తక అన్వేషణనే ఒక ఆయుధంగా పిల్లలకి తోడ్పాటు అందించగలరని నా యొక్క మనవి...*



*

శ్రీ గౌరీ శంకర్ మందిర్

 🕉 మన గుడి : నెం 290


⚜ హిమాచల్ ప్రదేశ్  : జగత్ సుఖ్


⚜ శ్రీ గౌరీ శంకర్ మందిర్



💠 ఇది కులు జిల్లాలో ఉంది.

 ఇక్కడ మహిషాసురమర్ధని ఆలయం కూడ ఉంది. 

ఈ ఆలయంలో విగ్రహం మహిషాసురునితో కన్నులు మూసుకుని వధిస్తూ వున్నట్లు ఉంటుంది. 

ఇక్కడి స్వామివారు గౌరీ శంకరుడు.


💠 ఉత్తర భారతదేశంలోని అత్యంత పురాతన దేవాలయాలలో ఒకటి మరియు కులు జిల్లాలోని కొన్ని శిఖర శైలిలోని ఆలయాల్లో  ఒకటి.


💠 సాంప్రదాయ శిఖర వాస్తుశిల్పం ప్రపంచం నలుమూలల నుండి శిల్పశాస్త్ర ప్రేమికులను ఆకర్షిస్తుంది.  

నిర్మాణం చుట్టూ ఉన్న సహజ ప్రకృతి దృశ్యం యొక్క సుందరమైన అందం ఒక ఆహ్లాదకరమైన వాతావరణాన్ని సృష్టిస్తుంది 



💠 దీనిని జగత్సుఖ్ శివాలయం అని కూడా పిలుస్తారు. జగత్సుఖ్ మనాలికి పూర్వపు రాజధాని మరియు ప్రస్తుతం కులు జిల్లాలో అతి పెద్ద గ్రామం. 


💠 ఈ ఆలయం వెలుపలి ద్వారం " శ్రీ మహారాజా ఉదం పాల్ సుండేయా దేవి కాళీ మురుట్" అనే శాసనాన్ని కలిగి ఉంది. 

అప్పుడు ఉధమ్ పాల్ కులులో పాలించాడు, అతను సిద్ధ్ సింగ్‌కు పూర్వం పాలించాడు. జగత్సుఖ్ శివాలయం అని కూడా పిలువబడే ఈ ఆలయం పదమూడవ శతాబ్దం చివరి భాగంలో నిర్మించబడింది. 



💠 జగత్సుఖ్ గురించి ఆసక్తికరమైన కథనం ఏమిటంటే, 16వ శతాబ్దం ప్రారంభంలో, సిద్ధ్ పాల్ తన పూర్వీకుల రాజ్యాన్ని తిరిగి పొందుతానని ప్రవచించిన వృద్ధ మహిళ ముసుగులో హిడింబా దేవతను కలుసుకున్నాడు మరియు ఇక్కడ కూడా రాజవంశం పేరు పాల్ నుండి సింగ్‌గా మార్చబడింది, ఎందుకంటే సిద్ధ్ పాల్ ఒక రోజు తన బ్రాహ్మణ గృహిణి ఆవుకు పాలు పితికే సమయంలో ఆమె కోసం దూడను పట్టుకున్నప్పుడు, ఒక సింహం అకస్మాత్తుగా కనిపించింది, అతను అక్కడికక్కడే దానిని చంపాడు.

సింగ్- అనగా హిందీలో సింహం, అనే పేరును అతను తన వారసులకు అందించాడు.

శ్రీ మదగ్ని మహాపురాణము

 *🔥శ్రీ మదగ్ని మహాపురాణము🔥*

.                *భాగం - 44*

*ప్రథమ సంపుటము, అధ్యాయము - 17*

🔱🔱⚜️⚜️🔥🔥⚜️⚜️🔱🔱


*స్వాయంభువ వంశ వర్ణనము - 4*


ప్రాచీనాగ్రాః కుశస్తస్య పృథివ్యాం యజతో యతః | ప్రాచీనబర్హిర్బగవాన్మహానాసీత్‌ ప్రజాపతిః. 21


యజ్ఞము చేయుచున్నప్పుడు కుశలు, వాటి అగ్రములు తూర్పు వైపున కుండు నట్లు భూమిపై పరవబడెను. అందుచే పూజ్యు డైన ఆ ప్రజాపతికి ''ప్రాచీన బర్హిస్సు'' అను పేరు వచ్చెను.


సవర్ణా7ధత్త సాముద్రీ దశ ప్రాచీనబర్హిషః | సర్వే ప్రచేతసో నామ ధనుద్వేదస్య పారగాః. 22


సముద్రుని కుమార్తె యైన సవర్ణ ప్రాచీనబర్హిస్సువలన పదిమంది కుమారులను కనెను వారందరికిని ప్రచేతను లనియే పేరు. వారందరును ధనుర్వేదమునందు పరిపూర్ణప్రజ్ఞ కలవారు.


అపృథగ్ధర్మచరణాస్తే7తప్యన్త మహత్తపః | దశ వర్షసహస్రాణి సముద్రసలిలేశయాః. 23


ఒకే విధముగా ధర్మము నాచరించుచున్న వారందరును సముద్ర జలమున నివసించి పది వేల సంవత్సరములు గొప్ప తపస్సు చేసిరి.


ప్రజాపతిత్వం సంప్రాప్య తుష్టా విష్ణోశ్చనిర్గతాః | భూః ఖం వ్యాప్తం హి తరుబిస్తాంస్తరూనదహంశ్చ తే.


ముఖజాగ్ని మరుద్భ్యాం చ దృష్ట్వాచాథ ద్రుమక్షయమ్‌ | ఉపగమ్యాబ్రవీదేతాన్రాజా సోమః ప్రజాపతీన్‌. 24


కోపం యచ్చత దాస్యన్తి కన్యాం వోమారిషాం వరామ్‌ | తపస్వినో మునేః కణ్డోః ప్రవ్లూెచాయం మయ్తెవ చ.


భవిష్యం జానతా సృష్టా భార్యా వో7స్తు కులఙ్కరీ | అస్యాముతృద్యతే దక్షః ప్రజాః సంవర్దయిష్యతి. 26


వారు విష్ణువునుండి ప్రజాపతిత్వమును పొంది, సంతసించినవారై సముద్రజలమునుండి లేచిరి అపుడు భూమ్యాకాశములు వృక్షములచే వ్యాప్తములై యుండెను వారు తమ ముఖమునుండి పుట్టిన అగ్ని వాయువులచే ఆ వృక్షములను దహింపచేయ మొదలిడిరి. అపుడు రాజైన సోముడు ప్రజాపతుల దగ్గరికి వెళ్లి-- ''కోపమును ఉపసంహరింపుడు భవిష్యత్తును గూర్చి తెలిసిన నేను తపశ్శాలి యగ కండుముని కుమార్తె యైన ప్రవ్లూెచయందు ఉత్తమురాలగు మారిషయను కన్యను జనింపచేసితిని ఆమెను మీకు ఇచ్చెదరు. ఆమె మీ వంశమును వృద్ది పొందించు బార్య యగుగాక. ఆమెయందు పట్టిన దక్షుడు ప్రజలను వృద్దిపొందించును.

సశేషం...


*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*

🔱🔱⚜️⚜️🔥🔥⚜️⚜️🔱🔱

అర్జున విషాద యోగము*

 🌹🪷🌹🪷🌹🪷🌹🪷🌹🪷

.           *🌹శ్రీమద్భగవద్గీత🌹*

.           *ప్రధమ అధ్యాయము* 

🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐

.         *అర్జున విషాద యోగము*

.                  *శ్లోకము 20*

🌹🪷🌹🪷🌹🪷🌹🪷🌹🪷


*అథ వ్యవస్థితాన్ దృష్ట్వా*

*ధార్తరాష్ట్రాన్ కపిధ్వజః ।*

*ప్రవృత్తే శస్త్రసంపాతే*

*ధనురుద్యమ్య పాండవః।।*


*హృషీకేశం తదా వాక్యం ఇదమాహ మహీపతే ।*


అథ  —  అనంతరము; 

వ్యవస్థితాన్  —   క్రమంగా నిలిచివున్న; 

దృష్ట్వా  — చూసి; 

ధార్తరాష్ట్రాన్  — ధృతరాష్ట్రుని  తనయులు; 

కపి-ధ్వజః  —  వానరమును జండా పై కలవాడు; 

ప్రవృత్తే  — ప్రారంభించటానికి సిద్దంగా వున్న; 

శస్త్ర సంపాతే — ఆయుధములు వాడటానికి; 

ధనుః  — ధనుస్సు (విల్లు) ను; 

ఉద్యమ్య   — పైకెత్తి; 

పాండవః — అర్జునుడు, పాండు పుత్రుడు; 

హృషీకేశం  — శ్రీ కృష్ణునితో; 

తదా  — అప్పుడు; 

వాక్యం  — పదములు; 

ఇదం — ఇవి; 

ఆహ — పలికెను; 

మహీ-పతే — రాజా..

 

*భావము:*

ఆ సమయంలో, తన రథం జెండా పై హనుమంతుని చిహ్నం కలిగివున్న పాండు పుత్రుడు అర్జునుడు, తన ధనుస్సుని తీసుకున్నాడు. సమరానికి ఎదురుగా నిలిచిఉన్న మీ పుత్రులను చూసి, ఓ రాజా, అర్జునుడు శ్రీ కృష్ణుడితో ఇలా అన్నాడు.


వివరణ: శక్తిశాలి అయిన హనుమంతుడు తన రథం (జెండా) మీద ఉన్నాడు కాబట్టి, అర్జునుడికి 'కపి ధ్వజుడు' అన్న పేరు ఉంది. దీనికి ఒక పూర్వ వృత్తాంతం ఉంది. ఒకసారి అర్జునుడు విలు విద్య లో తనకున్న ప్రావీణ్యానికి గర్వ పడి, శ్రీ రామ చంద్రుని సమయంలో వానరములు అంత కష్టపడి సేతువు (బ్రిడ్జి) ని భారత" దేశం నుండి లంకకు ఎందుకు నిర్మించారో అని, శ్రీ కృష్ణునితో అన్నాడు. తనే గనక వుంటే, బాణములతో ఒక వారధి ని చేసేవాడిని అన్నాడు. శ్రీ కృష్ణుడు, అది ఎలాగో చూపించమన్నాడు. అర్జునుడు తన శర పరంపర తో ఒక వంతెన ని నిర్మించాడు. శ్రీ కృష్ణుడు హనుమంతుడిని ఆ వంతెనని పరీక్షించడానికి రమ్మని పిలిచాడు. హనుమ దానిపై నడవటం ప్రారంభించగానే ఆ వంతెన కూలిపోవటం మొదలయింది. తన బాణాలతో చేసిన వారధి రాముని అపారమైన (వానర) సైన్య బరువుని తట్టుకోలేదని అర్జునుడికి అర్థం అయింది. అర్జునుడు తన తొందరపాటుకి క్షమాపణ వేడుకున్నాడు. అప్పుడు హనుమంతుడు అర్జునుడికి, ఎప్పుడూ తన ప్రావీణ్యం చూసుకొని గర్వ పడొద్దని హితవు చెప్పాడు. హనుమ దయాళువై, మహాభారత యుద్ధం లో నీ రథం పై కూర్చుంటాను అని అర్జునుడికి వరం ఇచ్చాడు. ఈ విధంగా అర్జునుడి రథం, హనుమంతుని చిహ్నం తో ఉన్న జెండాని కలిగి వుంది. దీనితో అతనికి 'కపి ధ్వజుడు' (జెండా పై కపిరాజు ఉన్నవాడు) అన్న పేరొచ్చింది.


*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*

🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

వేద ఆశీర్వచనం

 *నమస్తే సదా వత్సలే మాతృ భూమే!*

               🌷🌷🌷

*కలియుగాబ్ది 5124* *శ్రీ శాలివాహన శకం 1944 స్వస్తి శ్రీ    చాంద్రమాన శోభకృత్ నామ సంవత్సరం దక్షిణాయనం - హేమంత ఋతువు - మార్గశిర మాసం - కృష్ణ పక్షం  -‌ దశమి -  స్వాతి   -‌ స్థిర వాసరే* *(06-12-2023)* 


ప్రముఖ వేదపండితులు,  *బ్రహ్మశ్రీ గుళ్ళపల్లి శివశర్మ ఘనపాఠీ* గారి నేటి వేద ఆశీర్వచనం.


https://youtu.be/R6_3OLvbjZQ?si=pDAtebbO8sAkEy5S


🙏🙏

భక్తిసుధ

 🪷🕉️  *_-|¦¦|శుభోదయమ్|¦¦|-_* 🕉️🪷

🪔 ॐ卐  *_-|¦¦|భక్తిసుధ|¦¦|-_* ॐ卐 🪔


𝕝𝕝 *శ్లో* 𝕝𝕝  

*తరుణా రూపసంపన్నౌ సుకుమారౌ మహాబలౌ*।

 *పుండరీక విశాలాక్షౌ చీరకృష్ణా జినాంబరౌ॥*


*ఫలమూలాసినౌ దాంతౌ తాపసౌ బ్రహ్మచారిణా౹*

*పుక్రౌ దశరథస్యైతౌ భ్రాతరౌ రామలక్ష్మణా॥*


*శరణ్యా సర్వసత్త్వానాం శ్రేష్టా సర్వ ధనుష్మతామ్౹*

*రక్షఃకుల నిహంతారౌ త్రాయేతాం నో రఘూత్తమౌ॥*


- *శ్రీ రామరక్షా స్తోత్రం - 17, 18, 19*


*తా* 𝕝𝕝  

మంచి వయో రూప సంపదలు గలవారు మహా బలశాలులు, సుకుమారులు, పద్మములవంటి విశాల నేత్రాలు గలవారు, నారబట్టలు, లేడిచర్మములే వస్త్రములుగా ధరించినవారు, కందమూల ఫలములను ఆహారముగా గ్రహిస్తూ, తాపసులై, బ్రహ్మచర్య దీక్షను పాటించువారు, దశరథ మహారాజు పుత్రులు, సమస్త ప్రాణులకు శరణ మిచ్చువారు, రాక్షసులను సమూలముగా నశింప చేయువారు, *రఘువంశ శ్రేష్ఠులైన రామ లక్ష్మణులు మనలను రక్షింతురుగాక*.



           తరుణ వయస్సు కలవారు, రూపంలో అతి సుందరులు బలపరాక్రమలు, కమలములవంటి విశాలమైన నేత్రాలు కలవారు, నారచీరలను, కృష్ణమృగ చర్మాలను ధరించి, కంద మూల ఫలాలను ఆహారంగా స్వీకరించేవారు, మహా తపస్వులు, శరణు నిచ్చువారు, శ్రేష్ఠ ధనుర్ధారులు, రాక్షసులను నశింపచేయువారు అయినా *రామలక్ష్మణులు మమ్ములను రక్షింతురుగాక*.



          యువకులు, అపురూప సుందరమూర్తులు, సుకుమారులు, మహాబలశాలురు, తెల్ల తామర రేకులవంటి విశాలమైన కన్నులు కలవారు, నార వస్త్రములు, కృష్ణాజినము (జింక చర్మము)ను ధరించినవారు, కందమూలములను ఆహారముగా తీసికొనువారు, తాపసవృత్తిలో ఉన్నవారు, ఇంద్రియ నిగ్రహము గలవారు, బ్రహ్మచారులు, దశరథ మహారాజు పుత్రులు, రఘుకుల శ్రేష్ఠులు అగు శ్రీరామ లక్ష్మణులు, సకల జీవరక్షకులు, ధనుర్దారులలో కెల్ల శ్రేష్ఠులు, రాక్షస జాతిని నశింప చేయువారు, రఘుకుల శ్రేష్ఠులు అగు *శ్రీరామ లక్ష్మణులు అను ఇరువురు సోదరులు మమ్ములను కాపాడుదురుగాక*.