29, జులై 2021, గురువారం

Ramana Maharshi

 

Ramana Maharshi

Your own Self-realization is the greatest service you can render the world.

No one succeeds without effort... Those who succeed owe their success to perseverance.

The degree of freedom from unwanted thoughts and the degree of concentration on a single thought are the measures to gauge spiritual progress.


రమణ మహర్షి

మీ స్వంత స్వీయ-సాక్షాత్కారం మీరు ప్రపంచాన్ని అందించగల గొప్ప సేవ.

ప్రయత్నం లేకుండా ఎవరూ విజయం సాధించరు ... విజయం సాధించిన వారు పట్టుదలతో తమ విజయానికి రుణపడి ఉంటారు.

అవాంఛిత ఆలోచనల నుండి స్వేచ్ఛ యొక్క డిగ్రీ మరియు ఒకే ఆలోచనపై ఏకాగ్రత స్థాయి ఆధ్యాత్మిక పురోగతిని అంచనా వేసే చర్యలు.

ఓ కథ* శ్రమజీవులు

 ఓ కథ*

     (రచయిత/త్రి పేరు తెలియదు)

        *🌹 శ్రమజీవులు 🌹* 


"మమ్మీ ! స్కూలు బస్ వచ్చే టైమయ్యింది. నా టై కనబడటం లేదు. ఎక్కడ పెట్టావు?" అడిగింది ఆరో తరగతి చదువుతున్న కూతురు.


"వస్తున్నా తల్లీ, ఇదిగో అన్నయ్య లంచ్ బాక్స్ సర్దుతున్నా!" వంటింట్లోంచి బదులిచ్చింది సుధ.


"మమ్మీ! నా ఉతికిన సాక్స్ ఎక్కడ పెట్టావు? త్వరగా రావాలి, ఆటో వచ్చే టైమయ్యింది" అరుస్తున్నాడు ఏడో తరగతి చదువుతున్న కొడుకు.


"వస్తున్నా నాన్నా! ఇదిగో చెల్లాయ్ టై కనబడటం లేదు. వెతుకుతున్నా."


"సుధా! బాత్రూమ్ లో కొత్త సోప్ పెట్టలేదా?" పిలుస్తున్నాడు భర్త వెంకట్.


"ఆ తెస్తున్నానండీ, ఇప్పుడే పిల్లల్ని పంపించి, లోపలికి వచ్చాను" బదులిచ్చింది సుధ.


"ఇదిగో సుధా! ఈరోజు ఆఫీసుకు కొంచెం ముందుగా వెళ్లాలి. టిఫిన్, లంచ్ బాక్స్ లు సర్దేయ్. నీకు కూడా బ్యాంక్ టైం అవుతోంది కదా ! నువ్వు కూడా తయారవ్వు" అని చెప్పి, డ్రెస్ చేసుకోవడానికి లోపలికి వెళ్లాడు వెంకట్.


"అలాగేనండీ" అంటూ ఆ పనిలో మునిగి పోయింది సుధ.


వచ్చిన రెండు రోజుల నుంచీ, తన కూతురు చేస్తున్న అష్టావధానం గమనిస్తోంది, పక్క గదిలో పేపర్ చదువుకుంటున్న సుధ తల్లి సుభధ్ర.


"ఇదీ అమ్మా వరుస. ఇక్కడ ఇంటిపనీ, అక్కడ బ్యాంక్ పనితో నిజంగా ఒత్తిడి పెరిగి, టెన్షన్ వచ్చేస్తోదనుకో. పోనీ ఉద్యోగం మానేద్దామా అంటే, ఇంటికోసం తీసుకున్న అప్పు నిప్పులా భయపెడుతోంది. పోనీ పనిమనిషిని పెట్టుకుందామా అంటే, వాళ్ళు వస్తారా, రారా అని ఎదురు చూడ్డానికే కాలం సరిపోతుంది, అంతే కాదు వాళ్ల జీతాల కోసం నేను ఇంకో చోట పార్ట్ టైం జాబ్ చేయాలి. సరే ఈ గొడవలు ఎప్పడూ ఉండేవే కానీ, నాలుగు రోజులు ఉందామని వచ్చావు, హాయిగా రెస్ట్ తీసుకో. సాయంత్రం వస్తా" అంటూ తల్లికి చెప్పి, పక్క వీధిలోనే ఉన్న తను పని చేస్తున్న ప్రైవేటుబ్యాంక్ కి బయలుదేరింది సుధ.


 **** 🌷 **** 🌷 **** 🌷 ****


ఆ రోజు సాయంత్రం, బేంక్ నుంచి ఆలశ్యంగా రావడమే కాకుండా, మొహం వేలాడేసుకుని సోఫాలో కూలబడిన సుధని,


"అమ్మడూ, ఏమయ్యిందే తల్లీ ! అలా ఉన్నావు. ఏం జరిగిందో చెప్పవే?" కూతురు పక్కన కూర్చుని, ఆందోళనతో అడిగింది సుభధ్ర.


"ఏం లేదమ్మా! ఈరోజు బ్యాంక్ లో పని ఎక్కువగా ఉండడం వలన, ఆ ఒత్తిడిలో ఒక ఎంట్రీ తప్పు వేసాను. అది మేనేజర్ కనిపెట్టి సరిచేసి, నాకు చివాట్లు పెట్టాడు" బాధపడుతూ చెప్పింది సుధ.


"ఏంటి మమ్మీ ! ఇంత ఆలశ్యం. ఇంతవరకూ స్నాక్స్ కూడా తినలేదు" కంప్లైంట్ చేసింది, పక్క గదిలోంచి వచ్చిన కూతురు.


"బ్యాంక్ లో పనిఒత్తిడి వలన ఆలశ్యం అయ్యింది తల్లీ! అయినా అమ్మమ్మనడిగి ఏవైనా తినలేకపోయారా?"


"నువ్వు లేకుండా ఎప్పుడైనా ఏదైనా తిన్నామా?" సూటిగా అడిగాడు కొడుకు.


"అయ్యయ్యో, అలాగా! ఇప్పుడే తెస్తా ఉండండి" అంటూ లోపలికి వెళ్లింది సుధ.


ఈ సంఘటనలు చూసిన తరువాత, తను తిరిగి వెళ్లబోయే ఈ రెండు రోజుల్లో ఈ ఇంటికి చేయవలసిన ప్రక్షాళన గురించి ఆలోచనలో పడింది సుభద్ర.


 **** 🌷 **** 🌷 **** 🌷 ****


మర్నాడు సాయంత్రం, తను రాసిన ఓ కధకు తుది మెరుగులు దిద్దుతున్న సుభద్ర, ఫోన్ రింగ్ రావడంతో,


"చెప్పవే అమ్మడూ! బ్యాంక్ నుంచి బయలు దేరుతున్నావా?" అడిగింది సుధను.


"లేదమ్మా! ఈ రోజు సాయంత్రం డాక్టర్ దగ్గర అపాయింట్ మెంట్ తీసుకున్నాం. ఆఫీసు అవ్వగానే ఆయన ఇక్కడికి వస్తానన్నారు. అందుకే మేము రావడం కొంచెం ఆలశ్యం అవుతుంది. పిల్లలకి ఏం కావాలో చూడమ్మా!"


"సరేకానీ, డాక్టర్ దగ్గరకు దేనికే? " గాభరాగా అడిగింది సుభద్ర.


"కంగారు పడకు. నీకు నిన్న చెప్పానుగా! ఈ మద్యన కొంచెం స్ట్రెస్ ఎక్కువగా ఉంటోందని ! అందుకే ఓ సారి చూపించు కుందామని వెళ్తున్నాం" అంటూ ఫోన్ పెట్టేసింది సుధ.


ఫోన్ పెట్టేసిన సుభద్ర, ఈ రోజే తన పథకం అమలు చేయాలని ఓ నిశ్చయానికి వచ్చేసింది.


"అమ్మమ్మా! మమ్మీ ఇంకా రాలేదా, ఈ రోజు కూడా? " అడిగారు స్కూలు నుంచి వచ్చిన పిల్లలు.


"మీ మమ్మీకి ఒంట్లో బాగోలేదర్రా! పాపం పని ఒత్తిడిలో నలిగి పోతుంది కదా ? అందుకే డాక్టర్ దగ్గరకు వెళ్లింది. మీరు కొంచెం కోపరేట్ చేస్తే మీ మమ్మీ త్వరగా కోలుకుంటుంది" బిక్కుబిక్కుమంటూ చూస్తున్న పిల్లలతో చెప్పింది సుభద్ర.


"మేము ఏం చేయాలి అమ్మమ్మా, చెప్పు చేస్తాం!" అన్నారు ముక్తకంఠంతో.


"నాకు తెలుసుర్రా! మీరు మంచి పిల్లలని. ఏం చేయాలంటే........" అంటూ పిల్లలకు విడమరిచి చెప్పసాగింది సుభద్ర.


  **** 🌷 **** 🌷 **** 🌷 ****


పిల్లలతో కబుర్లలో మునిగిపోయిన సుభద్రకు అల్లుడు, కూతురు వచ్చిన అలికిడి వినబడడంతో హడావుడిగా గది లోంచి బయటకు వచ్చి,


"ఎలావుందే అమ్మడూ! డాక్టర్ గారు ఏమన్నారు?" ఆందోళనగా అడిగింది.


"కంగారు ఏమీ లేదు అత్తయ్య గారూ! నీరసానికి మందులు రాసారు. వీలైతే మెడిటేషన్ చేయమన్నారు" చెప్పాడు అల్లుడు.


అంతా విని, కూతురు వద్దకు వచ్చి,


"అమ్మడూ, రాత్రి పడుకునే ముందు ఓసారి నా గదిలోకి రావే, కొంచెం మాట్లాడే పని ఉంది నీతో" కూతురు భుజంమీద చెయ్యి వేసి, అనునయస్తూ చెప్పింది సుభద్ర.


"అలాగే అమ్మా! నువ్వేమీ గాభరా పడకు" అంటూ తల్లికి చెప్పి వంట గదిలోకి వెళ్లింది సుధ.


 **** 🌷 **** 🌷 **** 🌷 ****


"అమ్మా! ఇంకో వారం రోజులు ఉండవచ్చు కదా? ఎప్పుడూ చెప్పులో కాళ్ళు పెట్టుకుని మరీ వస్తావు. సరేకానీ, చెప్పు ఎందుకు రమ్మన్నావు?"తల్లి పక్కన కూర్చుని అడిగింది సుభద్ర.


"నీ గురించి చెప్పి, అల్లుడు గారు రమ్మంటే వచ్చాను గానీ, నీకు తెలియంది ఏముంది? అన్నయ్య ఆరోగ్యం సరైనది కాదు కదా? సరే అసలు విషయానికి వస్తా. ఈ ఒత్తిడి అనేది ఓ జబ్బూ కాదు, అలాగని అంటురోగమూ కాదు. ఇది మన సృష్టించుకున్నదే. అందుకే దీని నివారణ కూడా మన చేతుల్లోనే ఉంది. అలాగని, డాక్టర్ గారు ఇచ్చిన మందులు, సలహాలు మానేయమని చెప్పడంలేదు. వాటితో పాటు ఈ జపమాల అనే పద్ధతి పాటిస్తే, ఈ ఒత్తిడి, అనవసరపు ఆందోళనలు దూరమవుతాయి" చెప్పింది సుభద్ర.


"ఊరుకో అమ్మా! ఈ జపాలూ తపాలు చేసే సమయం ఎక్కడుంటుందే? దేవుడుకి ఓ నమస్కారం పెట్టడానికే సమయం దొరకడం లేదు" కొంచెం విసుగ్గా చెప్పింది సుధ.


"అయ్యో, జపమాల అంటే జపం కాదే. ఒత్తిడి తగ్గించుకునేందుకు ఉపయోగపడే నాలుగు పద్ధతులలోని మొదటి అక్షరాలే ఈ జ,ప,మా,ల . కిందటి సంవత్సరం మీ వదిన ఇలాగే బాధపడుతూంటే ఈ పద్ధతి చెప్పాను. వెంటనే ఆచరణలో పెట్టడంతో, ఇప్పుడు ఆ ఒత్తిడి అధిగమించి హాయిగా ఉంది."


"ఔనా ? ఆ జపమాల పద్ధతి ఏమిటో నాకూ చెప్పవే" తల్లి ఒడిలో తల ఆనించి ముద్దుగా అడిగింది సుధ.


📍"అయితే విను. ఇందులో మొదటి పద్ధతి *జ* న భాగస్వామ్యం: 

అంటే మనం చేసే పనిలో కొందరికైనా భాగస్వామ్యం కల్పించాలి. అన్నీ మనం ఒక్కరమే చేద్దాం అనుకోకూడదు. మీ ఇంట్లో చూడు, పిల్లల స్కూలు యూనీఫారాలూ, వాళ్ల టిఫిన్ బాక్సులు సర్దడం, కడగడం అన్నీ నువ్వే చేయాలా? పాపం, చిన్న పిల్లలు, వాళ్లని ఇప్పటినుంచీ కష్టపెట్టడం ఎందుకని నువ్వు అనుకోవచ్చు. కానీ, వాళ్లు ఎదుగుతున్నారు, రేపో మాపో పై చదువుల కోసం హాస్టళ్లలో ఉండవలసి రావచ్చు. అప్పుడు నువ్వు అక్కడికి వెళ్లి చేయలేవు కదా? అందుకే వాళ్ళ పనులు వాళ్లను చేసుకోనివ్వాలి. అప్పుడు నీకు కొంచెం పని ఒత్తిడి తగ్గుతుంది" చెబుతున్న ఆమె మొహంలో ముప్పై సంవత్సరాలు ఉపాధ్యాయవృత్తి చేసిన తల్లి కనపడింది, సుధకు.


ఆశ్చర్యంగా వింటున్న సుధ వైపు చూస్తూ, చెప్పసాగింది సుభద్ర.


📍"ఇక రెండో పద్ధతి 

*ప* నికి సమయనిర్ధేశం:

అంటే, ప్రతీ పనికి మనం ఓ నిర్ధిష్ట సమయం కేటాయించుకోవాలి. నీ విషయానికి వస్తే, నేను కొన్ని విషయాలు గమనించాను. పొద్దున్నే లేవగానే ఆ ఫోన్ తీసి వాట్సప్ మెసేజులు చూడడం అవసరమా ? అందులో ఏదో ఓ చెత్త మెసేజ్ ఉంటుంది. ఇంక ఆ రోజంతా దాని గురించి ఆలోచించి బుర్ర పాడు చేసుకుంటావు. అందుకే రోజుకు నాలుగు సార్లు, అంటే ఉదయం టిఫిన్ చేస్తూ, మధ్యాహ్నం లంచ్ టైములో, సాయంత్రం ఇంట్లో కాఫీ తాగుతూ, రాత్రి పడుకోబోయే ముందు.. ఇలా సమయం కేటాయించుకో. 


అలాగే, రాత్రి టీవీ చూస్తూ మర్నాడు ఉదయానికి కావలసిన కూరలు తరుక్కోవడం, రాత్రి భోజనాలు అయిన తరువాత ఆ పాత్రలు మర్నాడు ఉదయం వరకూ ఉంచకుండా రాత్రి పడుకునేముందే కడుక్కోవడం, ఇలా సమయ పాలన చేయడం వలన మర్నాడు ఉదయానికి నీకు కొంచెం పని ఒత్తిడి తగ్గుతుంది" చెబుతున్న తల్లి మొహంలో ఓ మోటివేటర్ దర్శనమిచ్ఛాడు సుధకు. 


ఆశ్చర్యంగా చూస్తున్న కూతురు వైపు ఓ సారి చూసి, తిరిగి చెప్పడం మొదలెట్టింది సుభద్ర.


📍"ఇక మూడోది, అతి ముఖ్యమైనదీ

*మా* నసిక స్థైర్యం. 

ఇది ఉంటే చాలు, ఒత్తిడి ఏం ఖర్మ, మనం దేనినైనా జయించవచ్చు. మిన్ను విరిగి మీదపడినా కానీ చలించకుండా, ధైర్యంగా ఎదుర్కొనేలా ఉండాలి. ఏ కష్టం వచ్చినా, కృంగిపోకుండా, నేను దీనిని ఎదుర్కొన గలను అని గట్టిగా పిడికిలి బిగించి మనసులో అనుకో. నీలో ఆత్మ విశ్వాసం పెరిగి, ఒక విధమైన ధైర్యం వచ్చేస్తుంది.   


ఇది లేకపోవడం వల్లనే చిన్నపాటి అప్పులు చేసి, అప్పులవాళ్ల ఒత్తిడి భరించలేక మీ నాన్న మీ చిన్నతనంలో ఆత్మహత్య చేసుకున్నాడు. నాకు ధైర్యం ఉంది కాబట్టే నేను చదువుకుని, టీచర్ ఉద్యోగం తెచ్చుకుని, అన్నయ్యను, నిన్నూ చదివించి ఈ స్థితికి తెచ్చాను" అని చెబుతున్న తల్లిలో ఓ సైకాలజిస్టు దర్శనమిచ్చాడు సుధకు.


📍ఇక ఆఖరుది 

*ల* క్ష్యం మీద దృష్టి. 

అంటే మనం ఏం పని చేస్తున్నామో దాని మీదే దృష్టి కేంద్రీకరించాలి. మాటవరసకి ఒక బస్సు డ్రైవర్ స్టీరింగ్ ముందు కూర్చోగానే, అతని లక్ష్యం ప్రయాణికులని క్షేమంగా గమ్యం చేర్చడం. అందుకే అతని దృష్టి రోడ్డు మీదే ఉండాలి. అలాకాక, ఉదయం ఇంట్లో జరిగిన సంఘటన గురించి ఆలోచించా డనుకో, అరవై మంది ప్రాణాలు గాల్లో కలిసినట్లే. 


నిన్న బ్యాంకు లో నువ్వు చేసింది అదే, ఏదో ఆలోచిస్తూ, ఆ ఒత్తిడిలో తప్పుడు ఎంట్రీ వేసావు. అలా కాకుండా లక్ష్యం మీద దృష్టి పెట్టి ఉంటే ఆ పరిస్థితి వచ్చేది కాదు. అందుకే పని మీద దృష్టి పెట్టమనేది.


అంతెందుకు, చాలా మంది ఇంటి నుంచి బయటకు వచ్చిన తర్వాత, గ్యాస్ స్టవ్ ఆపామా? ఇంటి తాళం సరిగ్గా వేసామా అని అనుమాన పడి ఆ ఒత్తిడితో అసలు వెళ్లిన పని మీద దృష్టి పెట్టకుండా ఇంటికి వచ్చి చూసుకొనేవరకూ బిక్కు బిక్కు మంటూ ఉంటారు. అలా కాకుండా తాళం వేసినప్పుడు కొంచెం దృష్టి పెట్టడం కానీ లేదా ఆ సమయంలో ఏదో ఒక సంఘటన అంటే 'పాపం రామారావు కి ఎలా ఉందో' అనో లేదా 'ఆ వీధి కుక్క ఎలా అరుస్తోందో'..ఇలా ఏదో ఒకటి అనుకుని ఆ పని చేసామనుకో. అప్పుడు మనకి ఆ అనుమానం వచ్చినప్పుడు వెంటనే ఆ సంఘటన జ్ఞాపకం వచ్చి, ఒత్తిడికి దూరం అవుతాం" చెబుతున్న అమ్మ, గీతోపదేశం చేస్తున్న గీతాచార్యుడులా కనిపించింది సుధకు.


"అమ్మా, చక్కటి విషయాలు చెప్పావు. నువ్వు చెప్పిన జపమాల పద్దతి ఇప్పటి నుంచే ఆచరిస్తాను" అంటూ తక్షణ కర్తవ్యంగా సెల్ ఫోన్ స్విచ్చాఫ్ చేసి, తల్లి వద్దే పడుకుండి పోయింది సుధ.


  ****🌷 ****🌷 ****🌷 ****


ఉదయమే లేచి బ్రష్ చేసుకుని, కిచెన్ లోకి వచ్చిన సుధ, అక్కడ సింక్ లో గిన్నెలు కడుగుతున్న కూతురు, డైనింగ్ టేబుల్ వద్ద కూర్చుని బెండకాయలు తరుగుతున్న కొడుకు, కాఫీ పెడుతున్న భర్తను చూసి, 

"ఏమిటి షడన్ గా ఈ మార్పు" అని అడిగింది ఆశ్చర్యపోతూ.


"చూడు సుధా! అత్తయ్య గారు చెప్పిన జపమాలలోని మొదటి పథకాన్ని, మా వంతుగా మేము అమలుపరుస్తున్నాం. మిగతా మూడు పథకాలు ఫాలో అవ్వడం ఇక నీ చేతుల్లో ఉంది" చెబుతున్న భర్తని ఆశ్చర్యంగా చూస్తూ, ఒత్తిడిని జయించిన మొహంతో, పిల్లలను దగ్గరకు తీసుకుంది సుధ, మనసులో తల్లికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ తనుకూడా రెడీ అయి ఉద్యోగానికి వెళ్ళింది .


  .... 🌷.... 🌷.... 🌷.... 🌷....

   

ఇప్పటికీ భర్త/తండ్రి కష్టపడి సంపాదిస్తుటే వారికి ఏ విధంగానూ సహాయ సహకారాలు అందించకుండా టీవీల ముందు గానీ, సెల్ ఫోన్ లోగాని, భక్తి వంకతో పూజ గదిలో గాని యోగా, ధ్యానం అనిగాని... సమయం వ్రుదా చేసి కాలక్షేపం చేస్తూ ఇంటిపనికి ఒకరు, వంటపనికి ఒకరు, తోటపని ఒకరు, పాచిపనికి ఒకరు, కారు తుడిచేవాడు ఒకడు, దానిని నడపటానికి ఒకడు. అని దర్పం చుబిస్తు.. శరీరానికి వ్యాయామం లేక, కనీసం చమట కూడా పట్టే పరిస్తితి లేకుండా... వాళ్ళ ఒళ్ళు వాళ్ళే మోయలేక వాళ్ళ పిల్లలని ఎత్తుకోవటానికి పనిపిల్లలను పెట్టుకొని, వాళ్ళు మాత్రం కుక్కపిల్ల ఎత్తుకొని వాకింగ్ పేరుతో తిన్నది అరిగేవరకు రొడ్లవెంట తిరిగే వారు ఉన్న ఈ రోజుల్లో. .. 

వేడినీళ్లు చన్నీళ్ళు అన్నట్లుగా, రూపాయికి మరొక రూపాయి కుడబెట్టటానికి శ్రమించే ప్రతిఒక్క మహిళా శ్రమజీవి కి.. పాదాభివందనం🙏🙏


*(మహిళా ఉద్యోగినులకు అందరికీ అంకితం)*


   💥 సర్వేజనాః సుఖినోభవంతు

మానవాళికి ముప్పు పొంచి ఉందా

 ఇంటర్‌నెట్ డెస్క్: మానవాళికి ముప్పు పొంచి ఉందా? అతిశయోక్తి అని నాడు కొట్టిపడేసింది.. ఇప్పుడు నిజమవబోతోందా? వచ్చే పదేళ్ల కాలంలో ఏం జరగబోతోంది? శాస్త్రవేత్తల అధ్యయనాలు ఏం చెబుతున్నాయి? జీవన నాణ్యత పడిపోతుంది! ఆహారోత్పత్తి, పారిశ్రామిక ఉత్పత్తి పతనమైపోతాయి. క్రమంగా మానవ జనాభా తగ్గిపోతోంది. మస్సాచుసెట్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ-ఎంఐటీ పరిశోధకులు మానవాళి భవిష్యత్తు గురించి 1972లో వేసిన అంచనా ఇది. కేవలం ఆర్థిక వృద్ధిపైనే దృష్టి సారించి పర్యావరణ, సామాజిక మార్పులను పట్టించుకోకుండా ముందుకు సాగితే 21వ శతాబ్దంలో మానవ సమాజం పతనమైపోతుందని అప్పట్లో పరిశోధకులు హెచ్చరించారు. ‘లిమిట్స్‌ టు గ్రోత్‌’ పేరుతో వారు రాసిన పుస్తకం అప్పట్లో బెస్ట్‌ సెల్లర్‌గా కూడా నిలిచింది. ‘ఆ.. ఇదంతా మరీ అతిశయోక్తి’ అని చాలా మంది కొట్టిపారేశారు కూడా. కానీ.. వారి అంచనాలను ప్రస్తుత పరిస్థితులతో పోలిస్తే అవి నిజమయ్యే దిశగా పరిణామాలు సంభవిస్తున్నాయని ప్రముఖ వృత్తి సేవల సంస్థ కేపీఎంజీ ఇంటర్నేషనల్‌కు చెందిన గయా హెర్రింగ్టన్‌ అనే పరిశోధకురాలు అభిప్రాయపడ్డారు. మానవుల తీరు ఇలాగే కొనసాగితే దశాబ్దకాలంలో ఆర్థికాభివృద్ధి.. 2040 నాటికి మానవ సమాజం పూర్తిగా పతనమైపోతుందని హెచ్చరించారు. 1972లో ఎంఐటీ పరిశోధకులు ఈ అధ్యయనాన్ని 1900 నుంచి 2060 దాకా మానవ సమాజ వికాసం గురించి అంచనా వేశారు. అధ్యయనంలో ప్రపంచ జనాభా, జనన, మరణాల రేటు, పారిశ్రామికోత్పత్తి, ఆహార ఉత్పత్తి, వైద్య, విద్యా సేవలు, పునరుత్పాదక ఇంధనాల వినియోగం, కాలుష్యాన్ని ఆధారంగా తీసుకున్నారు. అప్పట్లో దీనికి ‘వరల్డ్‌ 1’ అనే కంప్యూటర్‌ ప్రోగ్రామ్‌ను వినియోగించారు. ఆ ప్రోగ్రామ్‌ను రాసింది ఎంఐటీకి చెందిన జెర్రీ ఫాస్టర్‌. 1900 నుంచి జనాభా ఎలా పెరుగుతూ వచ్చింది.. జీవన నాణ్యత 1900 నుంచి 1940 దాకా ఎలా పెరిగిందీ... అక్కడి నుంచి పెరుగుదల వేగం మందగించి.. 2020కి పతాకస్థాయికి చేరి ఆ తర్వాత ఎలా పతనమయ్యేది... ఆ ప్రోగ్రామ్‌ ద్వారా గ్రాఫ్‌ల రూపంలో చూపారాయన. 1972 తర్వాత జీవన నాణ్యత ఎలా పడిపోబోయేది కూడా ఆ ప్రోగ్రామ్‌ సరిగ్గానే ఊహించగలిగింది. 2020ని మానవ నాగరికతకు శిఖరస్థాయిగా ఆ ప్రోగ్రామ్‌ ఊహించింది. ‘‘2020 నాటికి ప్రపంచం పరిస్థితి విషమంగా మారుతుంది. దాన్ని నివారించడానికి ఏమీ చేయకపోతే జీవననాణ్యత సున్నాకు పడిపోతుంది’’ అని 1973లో ఫాస్టర్‌ హెచ్చరించారు. ''కాలుష్యం మనుషుల ప్రాణాలు తీయడం మొదలుపెట్టే స్థాయికి చేరుకుంటుంది. దానివల్ల జనాభా తగ్గిపోవడం మొదలై.. 2040-2050 నాటికి ప్రపంచ జనాభా 1900 కన్నా తక్కువకు పడిపోతుంది. నాగరిక జీవనం మనుగడ కోల్పోతుంది.’’ అని ఫాస్టర్‌ 1973లో హెచ్చరించారు. అప్పట్లో ఫాస్టర్‌ బృందం ఈ అంచనాలకు వినియోగించిన నమూనానే కేపీఎంజీ పరిశోధకురాలు హెర్రింగ్టన్‌ కూడా వాడారు. అయితే వరల్డ్‌1 ప్రోగ్రామ్‌కు బదులు.. దాని మూడో తరం వెర్షన్‌ ‘వరల్డ్‌ 3’ ప్రోగ్రామ్‌ను వినియోగించారు. అప్పట్లో వారు ప్రధానంగా తీసుకున్న జనాభా, జనన, మరణాల రేటు వంటి అంశాలకు అదనంగా ఎకలాజికల్‌ ఫుట్‌ప్రింట్‌ అంటే.. మనిషి పర్యావరణాన్ని ఎంత విచ్చలవిడిగా వాడేశాడు అనే అంశాన్ని కూడా పరిగణనలోకి తీసుకున్నారు. మానవుల తీరులో ఎలాంటి మార్పులూ లేకుండా ఇదే రీతిలో కొనసాగితే పదేళ్లలోనే ఆర్థికాభివృద్ధి మందగించిపోతుందంటున్నారు హెర్రింగ్టన్‌.. 2040 నాటికి మానవ సమాజం పూర్తిగా పతనమయ్యే ముప్పు పొంచి ఉందని ఆమె హెచ్చరిస్తున్నారు. అయితే.. సాంకేతికంగా మరింత పురోగతి సాధించి, ప్రజాసేవలపై మరింత ఎక్కువ పెట్టబడి పెట్టగలిగితే మాత్రం ఈ ముప్పు నుంచి తప్పించుకోవచ్చని ఆమె అభిప్రాయపడ్డారు. ఈ అధ్యయన ఫలితం యేల్‌ జర్నల్‌ ఆఫ్‌ ఇండస్ట్రియల్‌ ఎకాలజీ ప్రచురిచింది.

ఆహారవైద్యం

 *"ఆహారవైద్యం"*


*ఇవి మీకు తెలుసా" ?*


*• 1.అల్లం తింటే ఎక్కిళ్ళు తగ్గుతాయి.*


*• 2.కరివేపాకు రక్తహీనతను తగ్గిస్తుంది.*


*• 3.నేరేడు పండ్ల గింజల్లో ఉండే జంబోలిన్ అనే గ్లూకోసైట్, మధుమేహాన్ని అదుపులో ఉంచుతుంది.*


*• 4.గుమ్మడికాయ మూత్ర సంబంధిత వ్యాధులను తగ్గిస్తుంది.*


*• 5.అవకాడో ఫలాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి . ఇవి తరచుగా తింటే మలబద్దకం పోతుంది.*


*• 6.జామపళ్ళు హార్మోన్ల హెచ్చుతగ్గులను నివారిస్తాయి.*


*• 7.బ్లాక్ టీ మధుమేహాన్ని దూరంగా ఉంచుతుంది.*


*• 8.సజ్జల్ని ఎక్కువగా తీసుకుంటే, పైల్స్ బాధ నుంచి ఉపశమనం లభిస్తుంది.*


*• 9.మామిడిపండుకి మూత్రపిండాల్లోని రాళ్ళను కరిగించే శక్తి ఉంది.*


*• 10.బీట్ రూట్ .. బీపీని క్రమబద్దీకరిస్తుంది.*


*• 11.మునగాకు తింటే గ్యాస్ట్రిక్ సమస్యల నుండి విముక్తి లభిస్తుంది.*


*• 12.దానిమ్మరసం కామెర్లకు మంచి మందుగా పనిచేస్తుంది.*


*• 13.ఆవాల్ని క్రమం తప్పకుండా తీసుకుంటే ఇన్సులిన్ వృద్ది చెందుతుంది.*


*• 14.అల్లం కడుపు ఉబ్బరాన్ని తగ్గిస్తుంది . మలబద్దకాన్ని కూడా వదిలిస్తుంది.*


*• 15.కీరదోసలో ఉండే సిలికాన్, సల్ఫర్ లు శిరోజాలకు మేలు చేస్తాయి.*


*• 16.మునగాకు గ్యాస్ట్రిక్ అల్సర్ ని దరికి చేరనివ్వదు.*


*• 17.ద్రాక్షలో అధికపాళ్ళలో ఉండే బోరాన్ .. ఆస్టియో పొరాసిస్ రాకుండా కాపాడుతుంది.*


*• 18.బీట్ రూట్ రసం ‘లో బీపీ ‘ సమస్య నుంచి గట్టేక్కిస్తుంది.*


*• 19.క్యారెట్ జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తుంది.*


*• 20.మూత్రపిండాల వ్యాధులున్న వారికి మొక్కజొన్న మంచి ఔషదం.*


*• 21.ఉల్లిపాయ శ్వాసకోశ సమస్యలను తగ్గిస్తాయి.*


*• 22.అనాసపళ్ళలో బ్రోమిలిన్ అనే ఎంజైమ్ ఉంటుంది. వాపుల్ని తగ్గిస్తుంది.*


*• 23.పుచ్చకాయలో ఉండే లైకొపీన్ .. గుండె, చర్మ సంబందిత వ్యాధుల నుంచి కాపాడుతుంది.*


*• 24.సపోటాపళ్ళు మలబద్దకాన్ని నివారిస్తాయి.*


*• 25.దాల్చిన చెక్కకు పంటి నొప్పిని తగ్గించే శక్తి ఉంది.*


*• 26.ఆవాలు అజీర్తిని తగ్గిస్తాయి.*


*• 27.చేపలు తింటే రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశాలు తగ్గుతాయి.*


*• 28.కమలాఫలాలు న్యుమోనియాకు చక్కని మందు.*


*• 29.క్యారెట్లు నరాల బలహీనత నుండి కాపాడతాయి.*


*• 30.యాపిల్ తింటే నిద్ర బాగా పడుతుందని పరిశోధనలో తేలింది.*


*• 31.వాము దంత వ్యాధులను తగ్గిస్తుంది.*


*• 32.పచ్చి జామకాయలో ఉండే టానిస్ మాలిక్, ఆక్సాలిన్ ఆమ్లాలు నోటి దుర్వాసనను పోగోడుతాయి.*


*• 33.ఉలవలు ఊభకాయాన్ని తగ్గిస్తాయి.*


*• 34.ఖర్జూరం మూత్ర సంబంధిత వ్యాధుల్ని తగ్గించి, మూత్రం సాఫీగా అయ్యేలా చేస్తుంది.*


*• 35.ద్రాక్షలో ఉండే పైటోకెమికల్స్ .. కొలెస్ట్రాల్ ని దరి చేరనివ్వవు.*


*• 36.జామపళ్ళు ఎక్కువగా తింటే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.*


*• 37.ప్రోస్త్రేట్ క్యాన్సర్ సోకకుండా అడ్డుకునే శక్తి టొమాటోలకు ఉంది.*


*• 38.నేరేడు పళ్ళు తింటే కడుపులో పురుగులు చచ్చిపోతాయి.*


*• 39.మొలల వ్యాధికి బొప్పాయి మంచి మందు.*


*• 40.మునగ కాయలు ఆకలిని పెంచుతాయి.*

ప్రాచీన కవుల ప్రౌఢత-సమర్ధత

  ప్రాచీన కవుల ప్రౌఢత-సమర్ధత 

ప్రాచీన కవుల ప్రౌఢత-సమర్ధత గూర్చి వేనోళ్ల పొగిడిన తక్కువే అవుతుంది.  ఛందస్సు శృఖలాలుగా భావించే నవ్య, నూతన, గేయ, భావ కవులు ఈ నాడు మన ప్రాచీన కవుల కవిత్వాన్ని, అందులోని రసాన్ని ఆస్వాదించే స్థితిలో లేరంటే కోపం వస్తుందేమో కానీ కొందరి విషయంలో మాత్రము ఇది అక్షర సత్యం. 
యతి, గణముల ప్రాధమిక పరిజ్ఞానం లేనివారు కూడా ఈ రోజుల్లో సుకవులుగా ప్రాచుర్యం పొందటం మన తెలుగు తల్లి చేసుకున్న పుణ్యం అనుకోవాలా అనిపిస్తుంది.  గతంలో నా దగ్గరకి ఒక కవి మిత్రుడు వచ్చి ఏదో సాహితి చర్చ చేస్తున్నాడు. ఇంతలో తానే నాకు కొంతమంది పద్య కవిత్వం వ్రాయమన్నారండి అని అని ఛందస్సు అంటే UUలు II లు పెడతారు అదేనా అన్నాడు. అంతేకాకుండా సుమతి శతకం, వేమన శతకంలోని పద్యాలూ మాములు మనం వ్రాసే గేయాల లాంటివే అని సెలవిచ్చారు.  అది విని నేను నిర్ఘాంత పోయాను. ఇక ఉరుకుంటే ఇంకా తన పాండిత్య గరిమ నా వద్ద ప్రదర్శిస్తారని తలచి  ఆర్య అవి ఆటవెలదులు, తేటగీతులు అనే దేశీయ ఛందస్సు అని వివరించటం జరిగింది. నాకు తెలిసింది చాలా చిన్ని ప్రపంచం కావచ్చు. ఈనాడు కూడా ప్రాచీన కవుల స్థాయికి తగట్టుగా ధీటుగా కవిత చెప్ప సమర్థులు  ఉండవచ్చు. కానీ చాలా మటుకు మిడి మిడి జ్ఞానంతో మన తేట తెలుగును అపభ్రంశం చేసే వారే ఉన్నట్లు తోస్తున్నది. ఇదంతా ఎందుకు వ్రాస్తున్నానంటే నేను ఇటీవల ఒక చాటు పద్యం చదవటం తటస్తించింది.  అది చదివిన తరువాత దానిలో ఆ కవి పలికిన పలుకులు ఒక సమర్ధ కవికి ఆదర్శంగా ఉంటుందని నేననుకున్న  ఆ పద్యాన్ని మీకు పరిచయం చేసే ముందు మీకు రెండు పదాల అర్ధం చెపుతాను (మీకు తెలిసే ఉండవచ్చు కానీ తెలియని వారికోసం మాత్రమే) 
1) "గడియ" అంటే ఒక కాలం కొలమానం అది మన 24 నిముషాలకు సమానం. 
2) "గంటము" అంటే తాటాకు మీద వ్రాయటానికి ఉపయోగించే వక సాధనము అంటే మన భాషలో కలము లేక పెన్ను 
ఇక ఆ పద్యాన్ని ఆస్వాదిద్దాము.  

గడియకు నూరు పద్యములు గంటము లేక రచింతు తిట్ట గా

      దొడగితినా పఠీలు మని తూలి పడన్ కులశైల రాజముల్
      విడువకనుగ్రహించి నిరు పేద ధనాధిపు తుల్యు చేతునే
      నడిదము వాడ సూరన సమాఖ్యుడ నాకొకరుండు సాటియే 


ఇక్కడ కవిగారు తాను  గడియకు   (24 నిముషాలకు ) నూరు పద్యాలూ రచిస్తారట అవి ఎలా వుంటాయో కూడా తెలుపుతూ తన పేరు కూడా తెలియచేసారు అది నడిదము సూరన అట 

ఇలా అనేక చాటు పద్యాలు మన తెలుగు నాట వున్నాయి కొన్ని కనుమరుగయ్యాయి. 



మొగలిచెర్ల అవధూత

 మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామివారితో అనుభవాలు..


*అమ్మాయి పెళ్లి..*


మొగలిచెర్ల లో సిద్ధిపొందిన అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామివారి మందిరం వద్ద అప్పుడప్పుడూ వివాహాలు జరుగుతూ ఉంటాయి..శ్రీ స్వామివారి సన్నిధిలో వివాహం చేస్తే తమ బిడ్డల భావి జీవితం సుఖంగా సాగిపోతుందని కొందరు..శ్రీ స్వామివారి దయవల్లే తమకు సంతానం కలిగింది కనుక, ఆ సంతానం యొక్క వివాహాలు కూడా ఇక్కడే జరిపితే..వాళ్ళ మీద కూడా స్వామివారి కృపా కటాక్షణాలు వుంటాయని మరికొందరూ..శ్రీ స్వామివారి వద్దే వివాహం జరిపించుకోవాలని మొక్కుకునేవారు ఇంకొందరూ..ఇలా కారణాలు ఏవైనా..శ్రీ స్వామివారి మందిరం వద్ద వివాహాలు చేసుకుంటూ వుంటారు..


రెండు సంవత్సరాల క్రిందట ఇద్దరు పెద్దవాళ్ళు మా దగ్గరకు వచ్చి.."మా పిల్లవాడికి పెళ్లి నిశ్చయం అయింది..వచ్చే నెలలోనే ముహూర్తం.. వివాహాన్ని స్వామివారి సన్నిధిలో చేయాలని నిర్ణయం తీసుకున్నాము..ఇక్కడ పెళ్లి చేసుకోవాలంటే ఏమైనా నిబంధనలు ఉన్నాయా?.." అని అడిగారు..వివాహం చేసుకోబోయే అమ్మాయి, అబ్బాయి ల తాలూకు వయసు ధ్రువీకరణ పత్రాలు కావాలని..ఇద్దరిలో ఏ ఒక్కరు మైనర్ అయినా ఇక్కడ వివాహం చేసుకోవడానికి అంగీకరించమనీ..చెప్పాము.."ఆ ఇబ్బందేమీ లేదు..ఇద్దరూ ఇరవై నాలుగేళ్ల పై బడిన వారే.." అని చెప్పి..ముహూర్తం రోజుకు వస్తామని చెప్పి..రెండు గదులు తమకు కేటాయించమని చెప్పి వెళ్లారు..


అనుకున్న ప్రకారమే ముహూర్తం రోజుకు ఆ పెళ్లి బృందం శ్రీ స్వామివారి మందిరం వద్దకు వచ్చారు..పెళ్లికూతురు తల్లిదండ్రులిద్దరూ ముందుగా మందిరం లోనికి వచ్చి.."అయ్యా..ఒక్కసారి శ్రీ స్వామివారి సమాధిని దర్శించుకుంటాము..ఈరోజు మా అమ్మాయి పెళ్లి జరగడానికి స్వామివారి దయ కారణం.." అన్నారు..లోపలికి వెళ్లి శ్రీ స్వామివారి సమాధిని దర్శించుకొని వచ్చారు..మరి కొద్దిసేపటికల్లా.. పెళ్లి జరిగిపోయింది..వధూవరులను తీసుకొని మందిరం లోనికి వచ్చారు..శ్రీ స్వామివారి సమాధి వద్ద నూతన దంపతులు నమస్కారం చేసుకొని ఇవతలికి వచ్చేసారు..


"మాకు పెళ్ళైన ఆరేళ్ళ దాకా బిడ్డలు పుట్టలేదు..మొగలిచెర్ల లో ఒక స్వామివారు సిద్ధిపొందారు..అక్కడికి వెళ్లి మొక్కుకోండి..మీకు సంతానం కలుగుతుందని మా ఊళ్ళో పెద్దలు చెపితే..ఇక్కడకు వచ్చాము..ఐదురోజుల పాటు నిద్రచేసాము..ఆ తరువాత సంవత్సరానికి ఈ అమ్మాయి పుట్టింది..స్వామివారి ప్రసాదం అనుకున్నాము..కానీ పుట్టిన తరువాత ఈ పిల్లకు ఐదేళ్ల వయసు దాకా మాటలు రాలేదు..డాక్టర్లకు చూపించాము..ఫలితం లేదు..మళ్లీ స్వామివారి వద్దకు వచ్చి వేడుకున్నాము..మా దుఃఖాన్ని ఆ స్వామి గ్రహించాడేమో..మరో మూడునెలలకు మాటలు వచ్చాయి..బడికి పంపించాము..బాగానే చదువుకున్నది..డిగ్రీ పూర్తిచేసింది..పెళ్లి చేద్దామని సంబంధాలు చూసాము..మూడేళ్ల పాటు ఒక్క సంబంధమూ కుదరలేదు..నాలుగు నెలల క్రిందట అమ్మాయిని తీసుకొని ఒక శనివారం సాయంత్రం ఇక్కడికి వచ్చి నిద్ర చేసి, "స్వామీ! అమ్మాయికి పెళ్లి కుదిరితే..నీ సమక్షం లోనే వివాహం చేస్తాము.." అని మ్రొక్కుకున్నాము..పది రోజుల్లోనే ఈ సంబంధం వచ్చింది..చిత్రమేమిటంటే..అబ్బాయి తల్లిదండ్రులు కూడా ఇక్కడే వివాహం చేయాలని మొక్కుకొని ఉన్నారట..మమ్మల్ని అడిగారు..అంతకంటే కావాల్సింది ఏమున్నదని మేమూ సంతోషంగా ఒప్పుకున్నాము..అబ్బాయి బెంగుళూరు లో ఇంజినీర్ గా పనిచేస్తున్నాడు..ఆ కుటుంబం కూడా స్వామివారి భక్తులే..అదే మాకు సంతోషం..మొదటినుంచీ మమ్మల్ని స్వామివారు అన్నివిధాల ఆదుకున్నారు.." అని చెప్పారు..


మరో పదిహేను నెలల తరువాత ఒక ఆదివారం నాడు ఆ దంపతులు తమ కూతురు అల్లుడు.. వాళ్లకు పుట్టిన మగ బిడ్డను తీసుకొని శ్రీ స్వామివారి దర్శనానికి వచ్చారు..ఆరోజు శ్రీ స్వామివారి వద్ద అన్నదానం చేశారు..వాళ్ల సంతోషానికి కారణం.. ఆ కారుణ్యమూర్తి మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయుడే కదా!..


సర్వం..

శ్రీ దత్తకృప!.


(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగలిచెర్ల గ్రామం..లింగసముద్రం మండలం.. ప్రకాశం జిల్లా..పిన్: 523 114..సెల్..94402 66380 & 99089 73699).