6, ఆగస్టు 2023, ఆదివారం

శ్రీ సూర్య దేవాలయం

 🕉 మన గుడి : 




⚜ బీహార్ : డియో, ఔరంగాబాద్


⚜ శ్రీ సూర్య దేవాలయం



💠 డియో సూర్య దేవాలయం

దేశంలోని పురాతన సూర్య దేవాలయాలలో ఒకటి, 8వ శతాబ్దానికి చెందిన ఈ ఆలయం ఛత్ పూజ సమయంలో పూజలకు అత్యంత పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది.


💠 8వ శతాబ్దంలో చంద్రవంశ రాజు భైరవేంద్ర సింగ్ చేత నిర్మించబడిన ఇది దేశంలోని పురాతన సూర్య దేవాలయాలలో ఒకటి. ఆలయ ప్రస్తావన పురాణాలు మరియు ఇతర మత గ్రంథాలలో కూడా చూడవచ్చు. 

100 అడుగుల ఎత్తైన ఆలయం దాని నిర్మాణ రూపంలో కోణార్క్‌లోని ఆలయాన్ని పోలి ఉంటుంది. 


💠 డియో దేవాలయం యొక్క ప్రత్యేకత ఏమిటంటే ఇది తూర్పు వైపున ఉన్న సాంప్రదాయ సూర్య దేవాలయాల వలె కాకుండా పశ్చిమ దిశగా ఉంటుంది. 


💠 డియో అనేది ఛత్ (బీహార్‌లో సూర్య భగవానుడికి  అత్యంత పవిత్రమైన పండుగ) జరిగే ప్రదేశం అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. 

అక్టోబరు-నవంబర్‌లో సూర్య భగవానుని గౌరవార్థం జరుపుకునే పండుగ అయిన ఛత్ పూజ సమయంలో వేలాది మంది భక్తులు నాలుగు రోజుల పాటు ఈ ఆలయాన్ని దర్శించుకునేందుకు వస్తారు


💠 కుష్ఠురోగి అయిన మహారాణా ప్రతాప్ వంశస్థుడు రాజా ఫతే నారాయణ్ సింగ్ తన గుర్రానికి దాహం తీర్చుకోవడానికి వేటలో వెళ్లి ఆ "కుండ్" (చెరువు)లో పడ్డాడని ఈ ప్రాంతంలో జానపద కథలు ఉన్నాయి.  

అతని కుష్టు వ్యాధి మాయమైందని చెబుతారు.


💠 ఒకసారి , విశ్వకర్మను సూర్యుడు ఒక రాత్రిలో 3 ఆలయాలను నిర్మించమని కోరినట్లు చెబుతారు, మరియు విశ్వకర్మ ఒక రాత్రిలో డియో సూర్య ఆలయాన్ని నిర్మించాడు.


💠 ఈ ప్రాంతంలో ఒకే రాత్రిలో మూడు ఆలయాలను నిర్మించడం ప్రారంభించాడని, వాటిలో రెండు, దేవ్ మరియు ఉమ్గా దేవాలయాలు పూర్తయ్యాయి, కానీ దేవ్‌కుండ్‌లోని మూడవది ఉదయం కాకి కవ్వించడం ప్రారంభించినందున పూర్తి కాలేదు.  ఈ మూడు ఆలయాలు నిర్మాణ రూపకల్పనలో సరిగ్గా ఒకే విధంగా ఉన్నాయి.


💠 సాధారణంగా ఉదయించే సూర్యునికి కాకుండా, అస్తమించే సూర్యునికి ఈ ఆలయం పశ్చిమాభిముఖంగా ఉండటం వల్ల ఈ ఆలయం ప్రత్యేకంగా ఉంటుంది.

 

💠 స్థానిక స్థల పురాణం ప్రకారం, వాస్తవానికి ఈ ఆలయం తూర్పు ముఖంగా ఉండేది. 

ముస్లింలు, కాలాపహార్ దాడిలో, అతను దానిని నాశనం చేయడానికి ప్రయత్నించాడు.

 కానీ, ఆలయాన్ని ధ్వంసం చేస్తే అరిష్టం వస్తుందని పూజారులు అడ్డుకున్నారు. ఆలయం అంత అద్భుతంగా ఉంటే పశ్చిమం వైపు తిరగాలని కాలా పహార్ పూజారులకు సవాలు విసిరాడు. తదుపరి సూర్యో ఆలయం అద్భుతంగా పడమర వైపు తిరిగింది.


💠 చాలా సూర్య దేవాలయాలు ఉదయించే సూర్యునివై ఉన్నందున, కొంతమంది పండితులు ఈ ఆలయం మొదట బౌద్ధ దేవాలయంగా ఉండేదని, తరువాత ముహమ్మద్ బిన్ భక్తియార్ ఖల్జీచే నాశనం చేయబడిందని మరియు చివరకు భైరవేంద్రచే సూర్య దేవాలయంగా మార్చబడిందని నమ్ముతారు


💠 ఆలయానికి దక్షిణాన సూర్యకుండ్ కూడా ఉంది, ఇక్కడ ప్రజలు అస్తమించే మరియు ఉదయించే సూర్యుడికి అర్ఘ్యం చెల్లిస్తారు.  


 💠 ప్రస్తుతం గర్భగుడిలో మూడు విగ్రహాలు (విష్ణువు, సూర్యుడు మరియు అవలోకితేశ్వరుడు) ఉన్నాయి.

అవి అసలు ప్రధాన దేవత కాదు.  

విరిగిన దేవతను పూజించడం ఆచారం కానందున ప్రధాన గర్భగుడి ముందు  విభాగంలో 3 విరిగిన విగ్రహాలు ఉంచబడ్డాయి.  

విరిగిన శిల్పాలలో ఒకటి సూర్యుని (సూర్యదేవుడు) ఏడు గుర్రాల శిల్పం మరియు ఒకటి ఉమా-మహేశ్వర విగ్రహం మరియు మరొకటి విష్ణువు.  

ఒక శివలింగం మరియు గణేశ శిల్పం కూడా ఉన్నాయి.  


💠 ఆదివారం నాడు చత్ పూజ / అరుద్ర నక్షత్ర తిథి పండుగ సందర్భంగా ఈ ఆలయాన్ని సందర్శించడం చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది.  

సూర్య కుండ్ ఒక కి.మీ దూరంలో ఉంది, ఇక్కడ పూజాదికాల కోసం నైవేద్యాలు చేస్తారు. 


💠 రుద్ర కుండ్ (ఎడమ) మరియు సూర్య కుండ్ (కుడి) అని పిలువబడే రహదారికి ఇరువైపులా ఉన్న రెండు ట్యాంకులు కుష్టు వ్యాధి మరియు ఇతర తీవ్రమైన వ్యాధులను నయం చేస్తాయని నమ్ముతారు.


💠 ఇక్కడ ప్రధాన దేవతను త్రికాల్ సూర్యుడు అని పిలుస్తారు - బ్రహ్మ, శివుడు మరియు విష్ణువుల రూపాలు.

 బ్రహ్మ ఉదయించే సూర్యుడిని, 

 శివుడు మధ్యాహ్న సూర్యుడిని మరియు విష్ణువు అస్తమించే సూర్యుడిని సూచిస్తాడు.


💠 ఈ దేవాలయం వేసర, ద్రావిడ మరియు నాగర నిర్మాణ శైలుల కలయిక.

 దేవ్ సూర్య దేవాలయం పైన, గోపురం ఆకారపు చెక్కడం పైన బంగారు కలశం ఉంచబడింది.


💠 బీహార్ మరియు ఇతర ప్రాంతాల నుండి అనేక వేల మంది భక్తులు ఆలయానికి పూజలు చేయడానికి, ఛత్ మేళాలో పాల్గొనడానికి, పవిత్రమైన సూర్య కుండ్‌లో స్నానం చేయడానికి మరియు అర్ఘ్యం సమర్పించడానికి వస్తారు.


💠 సూర్య మందిర్  సమయాలు: 

ఉదయం 4.30 - రాత్రి 9.00



💠 ఔరంగాబాద్ నుండి బీహార్ దేవ్ సూర్య మందిరం దూరం - డియో-బహురా రోడ్ మీదుగా 36 నిమిషాలు (14.5 కిమీ)

🚩శ్రీ వివేకానందస్వామి🚩* . *🚩జీవిత గాథ🚩* *భాగం 3*

 🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹

.    *🌹చారిత్రాత్మక కథాస్రవంతి🌹*

.   *ఓం నమో భగవతే రామకృష్ణాయ*


.       *🚩శ్రీ వివేకానందస్వామి🚩*

.                *🚩జీవిత గాథ🚩*   


*భాగం 3*


దుడుకు, అల్లరి  బాలుడు నరేంద్రుడు. అతడిలో సదా చిలిపితనం చిందులాడేది. ఒకింతసేపు కూడా అతడు ప్రశాంతంగా ఉండేవాడు కాడు. అతణ్ణి అదుపులో ఉంచడం అసాధ్యం. ఎలాంటి గదమాయింపుతోను అతణ్ణి శాంతింపజేయడం కుదరనిపని. 


భువనేశ్వరి విసిగివేసారి "సాక్షాత్తు పరమేశ్వరుడే నాకు కుమారునిగా జన్మించాలని వరం కోరుకొంటే, ఆయన తన భూతగణాలలో ఒకదాన్ని పంపించాడు" అని వాపోవడం కద్దు. అతణ్ణి శాంతింప జేయడానికి ఒక్కటే దారి! 'శివ శివ' అంటూ తలమీద చన్నీరు కుమ్మరించడమే! మరుక్షణమే అతడి అల్లరి అణగిపోయేది. 


అతడి అల్లరితో విసిగిపోయే భువనేశ్వరి ఒక్కోసారి, "ఇదుగో చూడు బిలే! ఇలా అల్లరి పిల్లవాడిగా తయారయ్యావంటే పరమేశ్వరుడు నిన్ను కైలాసానికి రానివ్వడు" అని బెదిరించగానే నరేంద్రుడి అల్లరి మటుమాయమయ్యేది. 


అంతేగాక, "పరమేశ్వరా! ఇకమీదట ఇలా ప్రవర్తించను.ఈ ఒక్కసారికి మాత్రం క్షమించు" అని పరమేశ్వరుణ్ణి ప్రార్థించేవాడట.అతణ్ణి చూసుకోవడానికి ఇద్దరు దాదులను నియమించిన అల్లరి అట్లే కొనసాగేది.


తల్లి ఒడిలోనే బిడ్డ విద్యాభ్యాసానికి శ్రీకారం చుట్టబడుతుంది. తల్లి పాలు పాటు ఆమెలోని సద్గుణాలూ, ఉన్నతాదర్శాలూ గ్రోలడమే బిడ్డకు విద్యాభ్యాసం పరిణమిస్తుందనడం అతిశయోక్తి కాదు. తల్లి తన బిడ్డను పెంచే తీరు అతడి భవిష్యత్తును నిర్ణయించడంలో ప్రధానపాత్ర వహిస్తుంది. నరేంద్రుడి తల్లి అతడికి గరపిన సాటిలేనిది. "జీవితంలో నేను సాధించినవన్నింటికీ ఋణపడివున్నాను" అనేవారు కాలాంతరంలో స్వామి వివేకానంద. 


భారతీయ సంస్కృతిలోని దేవీదేవతల, ఋషుల, వారి త్యాగమయ జీవితాల, ఇతిహాస నాయకులను గూర్చి కథల ద్వారా, పాటల ద్వారా భువనేశ్వరీదేవి నుండి నరేంద్రుడు విన్నాడు. ముఖ్యంగా ఆమె చెప్పిన రామాయణ, మహాభారతం కథలు అతడి హృదయంలో చెరిగిపోని ముద్రవేశాయి. తన బామ్మ, ఆమె వద్ద అనేక భాగవత కథలు కూడా నరేంద్రుడు విన్నాడు.


రోజూ ఇంట్లో మధ్యాహ్నంపూట రామాయణ మహాభారతాలు పారాయణ చేసేవారు. ఆ సమయాల్లో కూడా తన చిలిపిచేష్టలు కట్టిపెట్టి నరేంద్రుడు ప్రశాంతంగా కూర్చుని వినేవాడు.🙏

*సేకరణ:- శ్రీ రమణమూర్తి గారి వాట్సాప్ పోస్ట్.*

🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁

👉 *రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*

🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

*శ్రీ వేంకటేశ్వర దివ్య చరిత్ర - 10*

 🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹

*శ్రీ వేంకటేశ్వర దివ్య చరిత్ర - 10* 


🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁


బాగుగా ఆలోచించిన వెనుక, బ్రహ్మ శివుడుండు వెండికొండకు వెడలినాడు బ్రహ్మరాకకు శంకరుడానందమును వ్యక్తమొనర్చుచు, ఆయనకు సకల మర్యాదలు చేసి, గౌరవించి, ఉచితాసన మలంకరింపజేసి


 ‘విధాతా! విశేషములేమైన నున్నచో నెఱిగించెదవా! అనెను.


అనగానే ‘‘శంకరా! భక్తవశంకరా! లక్ష్మీదేవి ఎడబాటు వలన శ్రీమహావిష్ణువు భూలోకమున శేషాచలమును చేరి ఒక పుట్టలో నివసించడము ప్రారంభించాడు. నిద్రాహారములు లేక శుష్కించి, శ్రీమన్నారాయణుడా పుట్టలో నున్నాడు. 


ఉపవాసములతో ఆయన దినదినమునూ కృశించుచున్నట్లు నారదుని వలన తెలిసినది. కనుక మనమీ దశలో నారాయణునకు ఉపకారము చేయవలసియున్నది. 


మన మిరువురమూఆవు యొక్క దూడయొక్క రూపములు ధరించి నారాయణుడున్నటువంటి పుట్టను చేరి ఆయనకు ఆహారముగా పాలనిచ్చిన, కొంతలో కొంత ఆయన కుపకారము చేసినవారమగుదుము’’ అనినాడు బ్రహ్మదేవుడు.


అది విని శంకరుడు ‘‘విధాతా! అంతకన్న మనకు కావలసినదేమున్నది? ఆపదయందున్నవారి నాదుకొనుటకన్న గొప్ప యగునదేమున్నది? అదియును గాక నారాయణుని పట్ల ఆ మాత్రము వ్యవహరించుట మనకు విధిగా నెంచుట తగును. నీ వనినట్లే చేయుదుము’’ అన్నాడు.


మన కార్యములు సాధించుటకు సంధానము చేయు వారలు ఎప్పుడూ కావలసియే వుండును గదా! అందువల్లనే బ్రహ్మ, శివుడూ యిద్దరూ సరాసరి భూమండలానికి వెళ్ళి కొల్లాపురము చేరినారు. 


అచ్చట తపస్సు చేసుకొనుచున్న రమాదేవిని దర్శించి ‘‘అమ్మా కోపము చాలా చెడు వస్తువు సుమా! చూడు నీవు విష్ణువు పై కోపగించి భూతలానికి వచ్చేసిన కారణముగా పండంటి మీ సంసారములో కలతల అగ్ని కణాలు రేగాయి,


 అవి మీ సంతోషాన్ని దహించివేశాయి. విష్ణువు విషయము నీకు తెలిసిందా అమ్మా ఆయన యిప్పుడు మునుపటివలె కళాకాంతులతో చిరునవ్వులు చిందించే విష్ణువు కాదు. దైన్యదశలోనున్నాడు. 


నీకై క్షణమొక యుగముగా భూతలమునకు వచ్చి వెదకుచూ వెదకి వెదకి వేసారి శేషాద్రిచేరి, అక్కడున్న ఒక పుట్టలో తలదాచుకొని నిద్రాహారములు లేక దిగాలు పడి శుష్కించి శుష్కించి వున్నాడు. 


ఆయన కెట్లయిననూ ఆహారము నందించవలెననీ మా కోరిక, ఇందుకై నీవు చేయవలసిన ఉపకారము ఒకటి లేకపోలేదు. మేము ముగ్గురము ఆనందించవలెననీ మా కోరిక, ఇందుకై నీవు చేయవలసిన ఉపకారము ఒకటి లేకపోలేదు. మేము యావుదూడల రూపములు ధరించెదము నీవు గొల్లభామ వేషం ధరించి ఆవు దూడలమయిన మమ్ము తోలుకొని చోళరాజునకు అమ్మవలెను. 


ప్రతిదినమూ ఆ చోళరాజు యొక్క మందతో కలసివెళ్ళి మేము పుట్టలో నున్న శ్రీమహా విష్ణువునకు క్షీరాహారము నిచ్చుట ప్రారంభించెదము, 


కనుక మా కోరిక మన్నించవలెనని అన్నారు. విధాత, శంకరుల మాటలకు లక్ష్మీదేవి వెనువంటెనే సమ్మతించినది.


 *అనాధ రక్షక గోవిందా, ఆపద్భాంధవ గోవిందా, కరుణాసాగర గోవిందా,* *శరణాగత నిదే గోవిందా; |* 

 *గోవిందా హరి గోవిందా, వేంకట రమణా గోవిందా, గోవిందా హరి గోవిందా, వేంకట రమణా* *గోవిందా* .||10||


*శ్రీవేంకటేశ్వరుని దివ్య లీలల లో మరికొన్ని తదుపరి సంపుటిలో తెలుసుకుందాం 🙏*

*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.* 

🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

డాక్టర్ బృంద ఐఏఎస్



 ఆమె…. డాక్టర్ బృంద ఐఏఎస్… కాంధమాల్ అనే జిల్లాకు కలెక్టర్ ఆమె…! కాస్తోకూస్తో జనం కోణంలో… ఏదైనా మంచి చేయాలనుకునే కలెక్టర్…! అదసలే ఒడిశా… బీమారు రాష్ట్రాల్లో ఒకటి… అంతులేని పేదరికం, జాడతెలియని అభివృద్ధి… అనేకానేక గ్రామాలకు రోడ్లుండవు, చదువు అసలే ఉండదు, వైద్యం అందదు… ఆమె ఓరోజు పత్రికలు చదువుతుంటే ఆమెను ఓ వార్త ఆకర్షించింది…


అది సంపూర్ణంగా చదివింది… వివరాలు తెప్పించుకున్నది… ఓ కలెక్టర్‌గా సిగ్గుపడింది… ఈ వ్యవస్థకు ఏమీ చేయలేకపోతున్నాను సుమా అని తలవంచుకున్నది… డ్రైవర్‌ను పిలిచింది, గుమ్సాహి అనే ఊరి దగ్గరకు తీసుకువెళ్లాలని చెప్పింది… డ్రైవర్ పరేషాన్… ఆమె బయల్దేరింది…


 ఆ ఊరు చేరుకున్నది… ఇక్కడ జలంధర్ నాయక్ అంటే ఎవరు అని అడిగింది…. ఏమిటీ కథ నేపథ్యం..?ఆయన ఓ మట్టిమనిషి… వయసు 45… పుల్బనీ తాలూకాలోని గుమ్సాహి తన సొంతూరు… ఒంటిచేత్తో కొండను తొలిచి తమ ఊరికి రోడ్డు వేసిన బీహారీ దశరథ్ మాంఝీ కథ తెలుసు కదా… సేమ్, ఆయన ఒడిశా మాంఝీ… ఎందుకో తెలుసా..? తనూ అంతే… ఆ ఊరికి రోడ్డు లేదు, నిజం చెప్పాలా..? కరెంటు కూడా లేదు, మంచినీటి సరఫరా ఆశించేదే లేదు…


 ఒక్కొక్కరే ఊరు విడిచి వెళ్లిపోయారు… ఆ స్థితిలో ఆ ఊరికి రోడ్డు తనే సొంతంగా వేయాలని నిర్ణయం తీసుకున్నాడు ఈ జలంధర్… ఎందుకు..? తన ఊరి నుంచి పుల్బనీలోని పాఠశాలకు పిల్లలు వెళ్లాలన్నా అవస్థలే… ఎవరిని ఎన్నేళ్లు వేడుకున్నా ఫలితం లేదాయె… లంచాలు తప్ప ఇంకేమీ తెలియని అధికారులకు అస్సలు పట్టదాయె… అసలు ఈ దేశానికి పట్టిన దరిద్రమే ఈ నాయకులు, ఈ అధికారులు అని అర్థమైంది… దాంతో ఓ ఆలోచనకు వచ్చాడు… కనీసం తన ఊరికి రోడ్డు వేసుకోలేనా…?భార్య సద్దిమూట కట్టి ఇచ్చింది… ఓ పలుగూ, ఓ పార పట్టుకుని బయల్దేరాడు… రోజూ పొద్దున మొదలు పెట్టి సాయంత్రం దాకా తనే రోడ్డు వేయడం మొదలు పెట్టాడు…


రాళ్లూరప్పల్ని తొలగిస్తూ, రోడ్డు వేసుకుంటే పోతున్నాడు… మొత్తం 15 కిలోమీటర్ల రోడ్డు తన టార్గెట్… ఒక్కడూ సహకరించినవాడు లేడు… అయితేనేం..? ఆ గడ్డపార ఆగలేదు, ఆ పార అలిసిపోలేదు… రెండేళ్లు… నమ్మండి… రెండేళ్లపాటు కష్టపడ్డాడు… 


నా జీవిత లక్ష్యం అదే అని తీర్మానించుకుని అదే పనిలో మునిగిపోయాడు… 8 కిలోమీటర్ల రోడ్డు తనొక్కడే నిర్మించాడు… ఓరోజు ‘గుండెలో తడి’ ఇంకా మిగిలిన ఓ స్థానిక పత్రిక జర్నలిస్టు ఆ కథను రాశాడు… అదీ ఆ కలెక్టర్ దగ్గరకు చేరింది… ఆమె చదివింది… ఆమె కళ్లు చెమర్చాయి…


 ఈ వ్యవస్థలో భాగమైన తను కూడా సిగ్గుపడాలి కదానే భావన ఆమెను తలవంచుకునేలా చేసింది… అందుకే ఆ ఊరికి బయల్దేరింది…అతన్ని కలిసింది… మాట్లాడింది… ‘ఏం లేదు మేడమ్… మూడేళ్లు ఆగండి, నేనా రోడ్డును పూర్తి చేస్తాను’ అన్నాడు జలంధర్… ఆమె మరింత సిగ్గుపడింది… ఓసారి రోడ్డు చూద్దామంటూ వెళ్లింది…


ఒక మనిషి శ్రమను, లక్ష్యాన్ని, నిబద్ధతను, కష్టాన్ని, సంకల్పాన్ని చూసింది… ఆమెలో కలెక్టర్ అనే పాత్ర నిద్రలేచింది… అయ్యా, మీ త్యాగం నిరుపమానం అని ఆయన చేతులు పట్టుకున్నది… మిగతా ఆ ఏడు కిలోమీటర్ల రోడ్డు నిర్మాణం ఇక నాకు వదిలెయ్ అని చెప్పింది… తనకు అందుబాటులో ఉన్న ఏవో నిధులను అడ్జస్ట్ చేసింది… ఆ రోడ్డు పూర్తయ్యేదాకా దాని నిర్మాణ పర్యవేక్షణకూ తననే నియమించింది… అంతేకాదు, ఇప్పుడా ఊరికి కరెంటు పోల్స్, లైన్స్ పడుతున్నాయి… మంచినీటి సరఫరా ప్రణాళికా రూపుదిద్దుకున్నది…


 మరో విషయం… ఈ రెండేళ్లపాటు తను చేసిన పనికి ఉపాధిహామీ కింద డబ్బులు ఇవ్వటానికి కూడా ఆమె అంగీకరించింది… వావ్… ఇవీ కదా సక్సెస్ స్టోరీలు… ఇవీ కదా పది మందికీ స్పూర్తినిచ్చే అసలు విజయగాథలు…!!

అరుణతార

 అరుణతార.


ఎర్రసూరీడు వాలిపోయాడు

గొంతు మూగబోయేను

నల్ల గొంగళి జారి పోయేను

చేతి కర్ర పట్టు జారేను


నేలన మాయమయ్యే

విప్లవ తార నింగి జేరే

పోరాటం కానరాకనే

పాట,ఆట కన్నీరయ్యే.


పిక్కటిల్లే స్వరం ఆగే

యుద్ధనౌక కనుమరుగై

పీడిత ప్రజల ధైర్యం పోయే

ఎర్ర చుక్క గగనాన చేరే..


ఉద్యమ గొంతు ఆగిపోయింది

హక్కుల గానం మాయమైంది

ఎర్రని సూరీడు కనుమరుగై

గానం, రాగం ఇక నిద్రించే..


పోరుకి సరికొత్త రూపు

వెలుగు నడిచిన తీరు

పోరాట చుక్కల చేరు

ఆట, పాటే అతని పేరు.


నల్ల గొంగళి ధరించి

చేత కర్ర పట్టి

స్వరం పిక్కటిల్లే

అడుగు వేసే..


అన్యాయం రాజ్యమేలే చోట

అకృత్యం బరితెగించిన వేళ

నిస్పృహాన కన్నీటీ మనిషికి

నేనున్నా అనే ఎర్ర బావుటా.


అతడే "గద్దర్"!.


గద్దర్ మరణం 

సమాజానికి, బాధిత పీడిత వర్గాలకు తీరని లోటు.


అశృతర్పణాలతో అరుణతారకు అంతిమ వీడ్కోలు..


అశోక్ చక్రవర్తి. నీలకంఠం.

Panvhangam monday


 

దర్శనే స్పర్శనే వాపి

 *స్నేహం అనగా*


"దర్శనే స్పర్శనే వాపి

 భాషణే భావనే తథా

 యత్ర ద్రవత్యంతరంగం

స స్నేహః ఇది కథ్యతే"


ఎవరినైతే చూసినప్పుడు గాని, స్పృశించినప్పుడు కానీ, మాట్లాడినప్పుడు కానీ, మనసులో భావించినప్పుడు కానీ మనస్సు ఆహ్లాదంతో, ఆనందంతో, ఆత్మీయతతో, ఆర్ద్రతతో ద్రవిస్తుందో దానిని స్నేహం అని అంటారు.



అందరికీ స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు  💐💐

Interpretation of *Ramayana

 ॐ    A forwarded message to be read by everybody 


What a beautiful interpretation about 

*Rama* 

and *Ramayana* 


The Interpretation of *Ramayana*

As a *Philosophy of Life*…


‘ *Ra* ’ means *light*, 

‘ *Ma* ’ means *within me*, 

*in my heart*. 

  

So, 

*Rama* means the *Light Within Me*…


*Rama* was born to *Dasharath & Kousalya*…


*Dasharath* means 

‘ *Ten Chariots* ’…


The ten chariots symbolize the *five sense organs* ( *Gnanendriya* ) 

& *five organs of action* ( *Karmendriya* ) ...


*Kousalya* means 

‘ *Skill* ’…


*The skillful rider of the ten chariots can give birth to Ram*…


When the ten chariots are used skillfully,

*Radiance* is born within…


*Rama* was born in *Ayodhya*.


*Ayodhya* means ‘ *a place where no war can happen* ’…


When There Is No Conflict In Our Mind, 

Then The Radiance Can Dawn…


The *Ramayana* is not just a story which happened long ago..


It has a *philosophical*, *spiritual significance* and 

a *deep truth* in it…


It is said that the *Ramayana is happening in our Own Body*…


Our *Soul* is *Rama*, 

Our *Mind* is *Sita*, 

Our *Breath* 

or *Life-Force* ( *Prana*) is *Hanuman*, 

Our *Awareness* is *Laxmana* 

and 

Our *Ego* is *Ravana*…


When the *Mind* (Sita),

is stolen by the *Ego* (Ravana), then the *Soul* (Rama) gets *Restless*…


Now the *SOUL* (Rama) cannot reach the *Mind* (Sita) on its own…


It has to take the help of the *Breath – the Prana* (Hanuman) by Being In *Awareness*

(Laxmana)


With the help of the *Prana* (Hanuman), & *Awareness*

(Laxmana),

The *Mind* (Sita) got reunited with The *Soul* (Rama) and The *Ego* (Ravana) *died/ vanished*…


*In reality Ramayana is an eternal phenomenon happening all the time*… 


My continuation 


 ॐ Well. 

     We have to interpret Sugriva too. 

     Hunuman (Life - Force/Breath i.e. Prana) brings Rama to Sugriva. 

     Su (good) griva (throat) means Veda. 

     We enchant Veda comes through the throat. 

    So Sugriva means the right knowledge of Veda to be followed. 

     The Vedas came from the breath of the Divine.

శ్రీవారి లీలలు..

 శ్రీవారి లీలలు..


తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు ఆఫీసు

*****************************

 పి వి ఆర్ కే ప్రసాద్ తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు executive officer గా పనిచేస్తున్నారు..సరిగ్గా అవే రోజుల్లో దేవస్థానం వారు కూడా తమ స్వర్ణోత్సవపు సంవత్సరం సందర్భంగా తిరుమల శ్రీవారి ఆలయ చరిత్రలోనే ఎప్పటికీ నిలిచి పోయేటట్లుగా ఏదన్నా కొత్త పని మొదలు పెడితే బావుంటుందన్న ఆలోచనలో వున్నారు..


వారంతా ఆలోచనయితే చేసారు గానీ ఎన్ని దఫాలుగా ఎన్ని మీటింగులు పెట్టి ఎంత చర్చించినా ఆ ఆలోచనని ఆచరణలో పెట్టటంలో మాత్రం ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేక పోయారు..సమయం దగ్గర పడుతోంది..ఏం చేయాలో దిక్కు తోచని స్థితి..వెంటనే ఏదో ఒకటి ప్లాన్ చెయ్యకపోతే అభాసుపాలు అవుతామేమోనన్న భయం అందర్లోనూ ఏ మూలో ఉంది….


అక్కడున్న వారిలో TTD బోర్డు మెంబర్లుగా ఉన్నకొద్ది మంది పేరొందిన ప్రముఖులతో పాటు మరి కొంత మంది ముఖ్యమైన ఆలయ అధికారులు కూడా ఉన్నారు..అప్పుడక్కడ వేడిగా వాడిగా చర్చ జరుగుతోంది..చర్చ అయితే జరుగుతోంది కానీ తమ స్వర్ణోత్సవ సంవత్సరం సందర్భంగా స్వామి వారికి కొత్తగా ఏం చేస్తే బాగుంటుంది అన్న విషయంలో మాత్రం అక్కడున్న పెద్దలు ఒక perfect అవగాహనకు రాలేక పోతున్నారు..


సమయం  గడుస్తున్నకొద్దీ EO పీ వీ ఆర్ కే ప్రసాద్లో అసహనం ... ఆయనకు క్లియర్ గా అర్థం 


సరిగ్గా అదే సమయంలో తలుపు తోసుకొని ఆఫీస్ అటెండర్ మెల్లిగా ప్రసాద్ దగ్గరికి వచ్చాడు..అసలే చిరాగ్గా ఉన్న ప్రసాద్ టైం గాని టైం లో వచ్చిన ఆ అటెండర్ని చూస్తూ ‘ఏంటయ్యా” అని మరింత చిరాకు పడిపోతూ అడిగారు..కంగారు పడ్డ ఆ అటెండర్ తన నోటికి చెయ్యి అడ్డం పెట్టుకుంటూ ఆయన ముందుకొంగి “సార్ మిమ్మల్ని కలవటం కోసం గుంటూరు నుండి ఎవరో భక్తుడు వచ్చాడు.. ” అని మెల్లిగా చెప్పాడు..


చిర్రెత్తుకొచ్చింది ప్రసాద్ కి.. “..ఎవరయ్యా అతను..ఇప్పుడింత అర్జెంటుగా మీటింగులో ఉంటే నన్ను డిస్టర్బ్ చేసి మరీ చెప్పాల్సినంత అవసరం ఏమొచ్చింది..కాసేపుండమను…”మరి కాస్త చిరాకు పడిపోతూ అన్నారు ప్రసాద్…”చెప్పాను సార్..కానీ ఏదో అర్జెంటుగా మీతో మాట్లాడాలట..అతని పేరు షేక్ మస్తాన్ అని చెప్తున్నాడు..” కొద్దిగా భయపడుతూ చెప్పాడు అటెండర్..


“.. షేక్ మస్తానా…” అని ముందు కాస్త ఆశ్చర్య పోయినా..”ఎవరో ముస్లిం భక్తుడు ఏదో రికమండేషన్ లెటర్ తో వచ్చి ఉంటాడు.. మా వాళ్ళు నా దగ్గరికి పంపించుంటారు..మళ్ళీ బయటకు పోవటం ఎందుకు..ఏదో రెండు నిమిషాలిక్కడే మాట్లాడి పంపించేస్తే సరిపోతుంది కదా ” అని మనసులో అనుకుంటూ.. “.. సర్లేవయ్యా..ఇక్కడికే రమ్మను..” ..అని అటెండర్ తో చెప్పి పంపించేసారు  ప్రసాద్..


అప్పుడు దుద్రుష్టవసాత్తు ప్రసాద్ కి గానీ అదే రూం లో ఉన్నఏ ఇతర బోర్డు మెంబర్లకి గానీ తెలినీ విషయం ఏమిటంటే కాసేపట్లో తమ ముందుకు రాబోతున్న ఆ ముస్లిం భక్తుడు కేవలం ఒక భక్తుడు మాత్రమె కాదని స్వయంగా తమ స్వామి వారు పంపిస్తే తమ దగ్గరికి వస్తున్నాడని అంతేకాకుండా అతని ద్వారానే తాము ఇన్నాళ్లుగా తలలు బద్దలు కొట్టుకుంటున్న తమ స్వర్ణోత్సవ సంవత్సర సమస్యకు కూడా గొప్ప పరిష్కారం దొరకబోతోందని..


ఇవేమీ తెలీని ఆ పెద్దలంతా ఆ రూంలో వెయిట్ చేస్తుంటే ఆ ముస్లిం భక్తుడొక్కడూ బయట వెయిటింగ్ హాల్లోవెయిట్ చేస్తున్నాడు.. సరిగ్గా అప్పుడే అటెండర్ బయట కొచ్చిఆ ముస్లిం భక్తుడి దగ్గర కెళ్ళి చెప్పాడు “సార్..మా సార్ మిమ్మల్ని రమ్మంటున్నారు” అని..


అప్పటిదాకా తను కూర్చున్నచెక్క కుర్చీ లోంచి లేచి ఆ అటెండర్ కి థాంక్స్ చెప్తూ ఆ ముస్లిం భక్తుడు ఒక్కో అడుగూ వేసుకొంటూ బోర్డు రూం లోపలికి మెల్లిగా నడుచుకుంటూ వెళ్ళాడు..వెళ్తూనే రెండు చేతులు జోడించి అక్కడున్నవారందరికీ ఎంతో వినమ్రంగా నమస్కారం చేసి ఆ తరువాత మెల్లిగా ప్రసాద్ వైపు తిరిగి ఇలా చెప్పటం మొదలు పెట్టాడు..


“.. అయ్యా.. నా ఏరు షేక్ మస్తాన్..మాది గుంటూరు జిల్లా..మాది చాల పెద్ద కుటుంబం..అన్నదమ్ములందరం కలిసి ఉమ్మడిగా ఒకే  ఇంట్లో ఉంటాం..మా కుటుంబానికక్కడ ఓ చిన్న పాటి వ్యాపారముంది..ఎన్నోతరాలుగా మేమంతా స్వామి వారి భక్తులం..”


“..మా తాత ముత్తాతల కాలం నుండీ కూడా మా కుటుంబ సభ్యులమంతా చిన్న పిల్లలతో సహా ఒక పద్ధతి ప్రకారం పొద్దున్నేలేచి స్వామి వారి ముందు నిలబడి శ్రీ వేంకటేశ్వర సుప్రభాతం పటిస్తాం..అట్లాగే ఏ మాత్రం తప్పులు పోకుండా శ్రీ వేంకటేశ్వర  ప్రపత్తి, మంగళాశాసనం కూడా పటిస్తాం..నా మటుకు నేను శ్రీనివాస గద్యం మొత్తం పొల్లుపోకుండా అప్పజెప్పగలను..”


“తరతరాలుగా మా ఇంట్లో మరో ఆచారం కూడా ఉంది..అదేమిటంటే మేమంతా కలిసి ప్రతి మంగళ వారం పొద్దున్నే లేచి మా పెరట్లో పూచే రకరకాల పూలతో స్వామి వారి 108 నామాలూ ఒక్కొక్కటిగా పటిస్తూ ఒక్కో నామానికి ఒక్కో పువ్వు చొప్పున సమర్పిస్తూ శ్రీ స్వామి వారికి అష్టోత్తర శత నామ పూజ చేస్తాం..”


“అయ్యా ఇంతకీ నేను చెప్పొచ్చేదేమిమిటంటే..మా తాతగారు అంటే మా తండ్రి గారి తండ్రి గారు తన చివరి రోజుల్లో స్వామి వారికి తన స్వార్జితంతో 108 బంగారు తామర పూలు చేయించి శ్రీవారి ఆలయంలో సమర్పిస్తానని మొక్కుకున్నారు..మొక్కయితే మొక్కుకున్నారు గానీ పాపం వారి ఆరోగ్యమూ అంతంత మాత్రమే ఆర్ధిక స్తోమతా అంతంత మాత్రమె కావటం చేత కొద్ది మాత్రం బంగారు తామర పూలు మాత్రమే చేయించ గలిగారు..”


“..ఆ తరువాత తండ్రి గారి మొక్కు తీర్చే బాధ్యత తనది కూడా అవుతుంది కాబట్టి మా తండ్రిగారు కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో ఒక్కో రూపాయి కూడ పెట్టి మరికొన్ని బంగారు పూలు చేయించారు..అంత కష్టపడీ చివరికా మొక్కు తీర్చకుండానే మా తండ్రి గారు కూడా వారి తండ్రి గారి లాగానే తమ చివరి రోజుల్లో ఎంతో బాధపడుతూ స్వామి వారి పాదాల్లో ఐక్యమై పోయారు..”


“..మరి మా తాతగారిది తండ్రిగారిది మొక్కు తీర్చాల్సిన బాధ్యత ఇంటికి పెద్ద కొడుగ్గా నా మీద కూడా వుంటుంది కాబట్టి నా ఆర్ధిక పరిస్థితి కూడా పెద్దగా సహకరించక పొయినా నేను కూడా ఎంతో కష్టపడి నా వంతు ప్రయత్నంగా ఆ మిగతా బంగారు పూలు కూడా పూర్తి చేయించాను..ఈ మధ్యనే కరెక్టుగా 108 పూల లెక్క పూర్తయ్యింది..ఎంతో భక్తితో అవి స్వామి వారికి సమర్పించాలని మా కుటుంబ సభ్యుల మంతా మొత్తం 54 మందిమి కలిసి ఇందాకే కాలి బాటన కొండెక్కి పైకి చేరుకున్నాం..”


అంటూ కాసేపాగి అందరివేపు ఒక్క నిమిషం తదేకంగా చూసాడు షేక్ మస్తాన్..ఆ తరువాత మెల్లిగా అసలు విషయం బయట పెట్టాడు… 


“అయ్యా..ఇప్పటికే మీ అమూల్యమైన సమయం చాలా తీసుకున్నాను..కానీ చివరగా పెద్దలందరికీ నాదొక చిన్న విన్నపం.. మూడు తరాలుగా మా కుటుంబ సభ్యులంతా ఎంతో శ్రమపడి ఈ బంగారు తామర పూలు చేయించాం..ఇవి ఒక్కోటి 23 గ్రాముల బరువుంటాయి..”


“..కాదనకుండా మీరు వాటిని స్వీకరించి ఏదో రూపేణా స్వామి వారి కైంకర్యంలో ఉపయోగిస్తే మా కుటుంబం మొత్తానికి కూడా గొప్ప సాయం చేసిన వారవుతారు..మా తండ్రీ తాతగారి ఆత్మలు కూడా శాంతిస్తాయి..ఇది విన్నవించు కుందామనే మీ దగ్గరకు వచ్చాను ..ఇక మీ ఇష్టం..నిర్ణయం మీకే వదిలేస్తున్నాను..”


అంటూ వినమ్రంగా అందరికీ రెండు చేతులెత్తి మరోసారి నమస్కారం చేసి అప్పుడు మెల్లిగా తన చేతిలో ఉన్న ఒక బరువైన సంచీని తీసి ప్రసాద్ ముందున్న టేబుల్ మీద పెట్టాడు షేక్ మస్తాన్ అనబడే ఆ అతి గొప్ప ముస్లిం భక్తుడు..


నిశ్శబ్దం..నిశ్శబ్దం..నిశ్శబ్దం..


గుండెలు పిండేసే నిశ్శబ్దం.. రాతిని కరిగించే నిశ్శబ్దం.. బరువైన నిశ్శబ్దం.. గుండె చెరువైన నిశ్శబ్దం.. నిర్వెదమైన నిశ్శబ్దం… నిలువెల్లా మనిషిని నివ్వెర పరిచే నిశ్శబ్దం.. మనసంతా నిశ్శబ్దం.. మనసుని కలవర పరిచే నిశ్శబ్దం.. గతి తప్పిన నిశ్శబ్దం.. మనసుని గతి తప్పించే నిశ్శబ్దం.. నిశ్శబ్దం.. నిశ్శబ్దం.. నిశ్శబ్దం.. 


కొన్ని క్షణాల పాటక్కడ ఇంతకంటే వర్ణించటానికి వీలుకాని నిశ్శబ్దం తాండవించింది..అక్కడున్నవారందరూ ఓ మహాశిల్పి చెక్కేసి గదిలో వొదిలేసిన మహాత్ముల శిలా విగ్రహాల్లాగా freeze అయిపోయి కూర్చున్నారు..అక్కడ గది మూలల్లో ఏర్పాటు చేసిన pedestal fans తిరుగుతూ చేసే శబ్దం తప్ప ఆ సమయంలో అక్కడ మరే ఇతర శబ్దం వినిపించటంలేదు..


ఎంతో సాదా సీదాగా కనపడుతూ తమ మధ్యన మామూలుగా నిలబడి ఎన్నో అద్భుత విషయాలు చెప్పిన ఆ గొప్ప శ్రీవారి ముస్లిం భక్తుడి మాటలకు చేష్టలుడిగి పోయి ఉన్నారంతా.. అందరికంటే ముందు తేరుకున్నవాడు పీ వీ ఆర్ కే ప్రసాద్..


“దివినుండి దేవ దేవుడే దిగి వచ్చినాడా..” 


అన్న ఒక్క అతి చిన్న అనుమానం లిప్త పాటు కాలంలో ఓ మహోగ్ర రూపం దాల్చిఆయన మనసంతా ఆక్రమించింది..ఇంకొక్క ఉత్తర క్షణం కూడా ఆలస్యం చెయ్యకుండా ఒక్క ఉదుటున లేచి షేక్ మస్తాన్ దగ్గరికి చేరుకున్నారు  ప్రసాద్..


కళ్ళనుండి ధారగా కన్నీళ్లు కారిపోతుండగా షేక్ మస్తాన్ రెండు చేతులు పట్టుకొని ఎంతో ఆర్త్రతతో,”మస్తాన్ గారూ..మమ్మల్ని దయచేసి క్షమించండి..మీరెవరో తెలీక ఇంతసేపూ మిమ్మల్ని నిలబెట్టే మాట్లాడించాను..రండి ..” అంటూ ముందు తన కుర్చీ దగ్గరికి తీసుకెళ్ళి తన పక్కనున్న కుర్చీలో కూర్చోపెట్టుకుని ఆ తరువాత మెల్లిగా ఇట్లా అన్నారు..


“మస్తాన్ గారు..ఇక్కడున్న మేమంతా మా సర్వీసులో ఎంతో మంది గొప్ప గొప్ప భక్తుల్ని చూసాం..కానీ మీ అంతటి అద్వితీయమైన  భక్తుడ్నిమాత్రం ఇప్పుడే చూస్తున్నాం..ఒక రకంగా మిమ్మల్ని చూడగలగటం మా పూర్వజన్మ సుకృతం అనుకోండి..బహుశా మిమ్మల్ని ఆ శ్రీనివాసుడే మా దగ్గరికి  పంపించాడేమో..ఎవరికి తెలుసు..”


“..కానీ నాదొక విన్నపం..ఈ అమూల్యమైన బంగారు తామర పూలను TTD తరఫున ఒక బాధ్యత కలిగిన ఆఫీసర్ గా నేను తప్పకుండా స్వీకరిస్తాను..కానీ వీటిని స్వామి వారి సేవలో వెంటనే ఉపయోగిస్తామని మాత్రం ఈ క్షణం లో మీకు మాటివ్వలేను.. ఎందుకంటే పేరుకి మేము కూడా శ్రీవారి సేవకులమే అయినా ప్రభుత్వం తరఫున బాధ్యతలు నిర్వర్తిస్తున్నాం కాబట్టి మాకు కొన్ని పరిమితులుంటాయి.. వాటిని అధిగమించటానికి మాకు చాలానే సమయం పడుతుంది..”


“అయినా సరే.. ప్రయత్నలోపం లేకుండా నా వంతు కృషి చేసి వీలున్నంత తొందరగా మీ పని పూర్తి చేసి మీకు కబురు పెడతాను.. ఏం చేస్తాననేది మాత్రం ఇప్పుడే చెప్పలేను..మీరు మీ అడ్రస్సు ఫోన్ నెంబర్  మాకిచ్చి వెళ్ళండి..మిగతా విషయాలు నేను చూసుకుంటాను..అంతవరకూ కాస్త ఓపిక పట్టండి..”


 అంటూ షేక్ మస్తాన్ రెండు చేతులూ పట్టుకొని ప్రసాద్ ఇట్లా అన్నారు.. 


” మస్తాన్ గారు.. చివరగా ఒక్క మాట.. ప్రస్తుతం మీకూ మీ కుటుంబ సభ్యులందరికీ కూడా ఇక్కడ మా వాళ్ళు దర్సనం వసతి ఏర్పాటు చేస్తారు..హాయిగా  మీ స్వామి వారిని దర్శించుకొని వెళ్ళండి..thank you very much..”


ఉపసంహారం 


ఆ తరువాత పనులన్నీ చకచకా జరిగిపొయినయి.. ఇంకో రెండు మూడు మీటింగుల తర్వాత చివరికి శ్రీ వారికి ఒక కొత్త అర్జిత సేవను ప్రవేశ పెట్టాలని TTD బోర్డు ఏకగ్రీవంగా తీర్మానించింది..ఆ సేవలో భాగంగా స్వామి వారికి వారానికొకసారి అష్టోత్తర శతనామ పూజ జరపబడుతుంది.. 


ఆ పూజలో స్వామి వారి 108 పేర్లను ఒక్కొక్కటిగా పటిస్తూ షేక్ మస్తాన్ కుటుంబం సమర్పించిన ఒక్కొక్క బంగారు తామర పూవును పూజారులు స్వామి వారి పాదాల మీద ఉంచుతారు..TTD ఈ ఆర్జిత సేవను 1984 లో స్వామి వారికి తమ స్వర్మోత్సవపు కానుకగా ప్రవేశ పెట్టింది.. 


శ్రీ వారి పట్ల షేక్ మస్తాన్ కుటుంబానికున్న గొప్ప భక్తి వలన స్వామి వారికి ఒక కొత్త ఆర్జిత సేవ ప్రారంభం అవటమే కాకుండా అదే కుటుంబం వలన TTD బోర్డుకి కూడా తమ స్వర్ణోత్సవ సంవత్సరాన్ని తిరుమల శ్రీవారి ఆలయ చరిత్రలో ఎప్పటికీ గుర్తుండిపోయేలా జరుపుకొనే ఒక గొప్ప సదవకాశం లభించింది.. 


గత 30 సంవత్సరాలకు పైగా ప్రతి మంగళవారం స్వామి వారికి జరపబడే ఈ సేవలో ఇప్పటికీ షేక్ మస్తాన్ ఇచ్చిన బంగారు తామర పూలనే వాడతారు..కాలక్రమేణా ఈ సేవ భక్తుల్లో ఎంతో ప్రాముఖ్యాన్ని సంతరించుకుంది..మొదట్లో ఈ సేవను “అష్టదళ స్వర్ణ పద్మ పూజ” అని పిలిచినా ఇప్పుడది “అష్టదళ పాద పద్మారాధన సేవ” గా మరింత ప్రాముఖ్యాన్ని సంతరించుకుంది.......


🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

Vantakam


 

Fraud


 

దాతలు కావలెను

 దాతలు కావలెను 

జంతూనాం నరజన్మ దుర్లభం అని  వివేకచూడామణి లో శ్రీ ఆదిశంకరాచారులవారు వచించారు.  అంటే జంతుకోటిలో అనగా 84 లక్షల జీవరాసులలో మనిషిగా పుట్టటం చాలా దుర్లభమైనది. అంతే కాకుండా ఇంకా ఆచారులవారు ఏమన్నారంటే 

జన్తూనాం నరజన్మ దుర్లభమ్ అతః పుంస్త్వం తతో విప్రత తస్మాద్
వైదిక-ధర్మమార్గపరత విద్వత్త్వం అస్మాత్ పరమ
ఆత్మనాత్మవివేకనమ్ స్వనుభవో బ్రహ్మాత్మనా సస్స్థితిః
ముకీత్ర్ణో శతకోటిజన్మసు కృతైః పునైర్వినా లభ్యతే ॥

అంటే మనిషిగా పుట్టటం కన్నా పురుషునిగా పుట్టటం అందులోను బ్రాహ్మణుడుగా జన్మించి వైదిక్ ధర్మాన్ని ఆచరిస్తూ విద్యావంతుడు అయి ఆత్మాఅనాత్మ అనే వివేకముకలిగి స్వంతంగా బ్రహ్మజ్ఞ్యానం సముపార్జించటం అనేది తత్ద్వారా ముక్తిని పొందటం అనేది శతకోటి జన్మల సుకృతం కలిగి ఉంటే కానీ లభ్యం కాదు అని పేర్కొన్నారు. 

ఈ రోజుల్లో మనం చాలామందిమి దైవానుగ్రహం వలన బ్రాహ్మణులుగా అందునా పురుషులుగా జన్మించినాము.  నిజానికి ఇలాంటి జన్మను పొందటం మన పూర్వజన్మ సుకృతం కాక మరొకటి కాదు. ప్రతి బ్రాహ్మడు తెలుసుకోవలసినది ఏమిటంటే మనకు ఈ జన్మే ఆఖరు జన్మ కావలి అని. అది ఎట్లాగ అంటే ఈ జన్మను మనం సార్ధకత చేసుకొని బ్రహ్మజ్ఞ్యాన సముపార్జన చేస్తే కచ్చితంగా అవుతుంది.  ఈ సత్యం తెలుసుకోనుక అనేకమంది విప్రవర్యులు ఇతరులవాలె ఐహిక వ్యామోహాలకు సాంఘిక విషయ మొహాలకు బానిసలుగా మారి తమ విద్యుత్వ కర్తవ్యాన్ని మరచిపోతున్నారు.  అలాంటి మన బ్రాహ్మణ సోదరులను తట్టి లేపి వారి ఘాఢనిద్రను వదిలించి కర్తవ్యోన్ముఖులను చేయవలసిన ధర్మం, ధర్మాచరణను ఆచరిస్తున్న ప్రతి శ్రోస్త్రియ బ్రాహ్మణుడి మీద వున్నది.  కాబట్టి మనమంతా ఒక సంఘటితముగా మారి ప్రతి బ్రాహ్మణుడిని బ్రహ్మజ్ఞ్యాన సముపార్జనవైపు దృష్టిసారించే విధంగా పురిగొల్పి బ్రాహ్మణులను సత్బ్రహ్మణులుగా మార్చ ప్రయత్నం చేద్దాం. మరి అది ఎలా సాధ్యం అంటే ముందుగా ప్రతి బ్రాహ్మణుడు విధిగా " పంచ కట్టుడు పిలక పెట్టుడు చేయాలని" ఒక ఉద్యమంగా తీసుకొని అందరు  బ్రాహ్మణులు  పంచ కట్టటం  నేర్చుకొని రోజు ఉదయం బ్రహ్మి ముహూర్తంలో నిద్రలేచి కాని పరిస్థితుల్లో సూర్యోదయ కాలంలో నయినా నిద్రలేచి కాలకృత్యాలు తీర్చుకొని గాయత్రి మంత్ర జపం చేసే విధంగా ప్రాత్సహిద్దాం. 

ఇక రెండవ విషయం అందరము చక్కగా ముండనం చేసుకొని శిఖ ధారణ చేసే విధంగా ప్రాత్సహిద్దాం. ఈ రోజుల్లో చాలామంది బ్రాహ్మణులు శిఖాదారణ అటుంచి చక్కగా కేశాలకు, మీసాలకు రంగులు వేసుకొని నవ యవ్వనులుగా కనపడుటకు అనేక విధములుగా ప్రయత్నిస్తున్నారు. మిత్రమా ఇప్పుడు నీవు చేయవలసినది నీ వయస్సును కనిపించకుండా లోకానికి కనిపించటం కాదు నీవు పరిశుద్ధుడవు అయి లోకమాతకు (భవానీమాతకు) కనిపించే ప్రయత్నం చేయి.  అప్పుడే ఆ తల్లి నిన్ను తన దారికి చేర్చుకొని ముక్తిని ప్రసాదిస్తుంది. దానికోసం విధిగా శిఖాదారణ చేసి నిత్యకర్మలను ఆచరించి బ్రహ్మజ్ఞ్యాన సముపార్జన చేసి ముక్తికోసం ప్రయత్నం చేయాలి. 

ఈ పరంపరలోనే మనలోని ఆస్తిక జిగ్న్యాసపరులు శిఖాదారణ చేసే విధంగా ప్రోత్సహించటానికిగాను పురోహితం జీవనోపాధిగా లేనటువంటి బ్రాహ్మణులకు అంటే ఇతర వృత్తి, వ్యాపార మరియు ఉద్యోగములు చేసుకొనే వారు గతంలో శిఖాదారణ చేయనివారు ఇప్పుడు శిఖాదారణ చేయటానికి పూనుకొన్న వారికి శిఖాదారణ ప్రోత్సాహకంగా కొంత ద్రవ్యాన్ని వారికి శిఖాప్రోత్సాహకంగా ఇస్తే దానికి ఇష్టపడి వారు శిఖాదారణ చేస్తారనే భావనతో ఒక ఫౌండును ఏర్పాటు చేసి ఔత్సాహక శిఖాదారాకులకు ద్రవ్యరూపంగా ఇవ్వటం సమంజసం అని భావిస్తూ ఇది వ్రాస్తున్నాను. 

విప్రులు ఈ విషయాన్ని పరిశీలించి తగువిధంగా స్పందించగలరు.  అంటే కాదు ధనవంతులైన దాతలు స్పందించి భూరి విరాళాలు ఇస్తే ఔస్తాహికులైన నూతన శిఖాదారులకు ప్రత్సాహకంను ఇవ్వవచ్చు. ప్రతివారు ఈ విషయాన్ని కూలంకుషంగా విశ్లేషణ చేసి సామూహిక నిర్ణయం తీసుకుందాం. 

ఓం తత్సత్ 

ఓం శాంతి శాంతి శాంతిః 

మీ 

భార్గవ శర్మ 

 

 

Lemon chetny


 

D


 

K


 

Bala panditulu


 

G


 

Friendship

 


Vinoba Bhave ji

 Vinoba Bhave ji wrote while explaining the meaning of 'Association/friendships'.

--

"The rain drop from the sky, if it is caught in hands, is pure enough for drinking. 

If it falls on a hot surface, it perishes. 

If it falls on lotus leaf, it shines like a pearl, and finally, 

if it falls on oyster, it becomes a pearl. 

The drop is the same, but its existence & worth depend on with whom it is associated.

--

*"I thank you for being in my world. Knowing you in this life makes a difference in overall existence.💐*

😊_*#happyfriendshipday*_😊

శరీరానికి కావలిసిన

 శరీరానికి కావలిసిన అతిముఖ్య విటమినులు - అవి లభించు పదార్ధాలు .


     A , B , C , D , E అను పేర్లతో విటమిన్లు ప్రాముఖ్యం పొందినవి. వీటిని "దేహనిర్మాతలు " అని తెలుగులో పిలుస్తారు. ఇవి మనం తిను ఆహారం నందు లేకున్న శరీరపోషణం సరిగ్గా జరగదు. గుడ్లు , పాలు , పండ్లు , దంపుడు బియ్యం మొదలగు సహజసిద్ధముగా లభించు పదార్ధములలో ఈ విటమిన్లు ఎక్కువుగా ఉండును. 


           ఇప్పుడు ఈ అయిదు ముఖ్యవిటమిన్ల గురించి మీకు వివరిస్తాను.


 * "A" విటమిన్  -


       ఇది లోపించినవారికి "రేచీకటి" వచ్చును. కన్ను , నోరు , ఊపిరితిత్తులు మొదలైన సున్నితమైన చర్మం ఎండిపోయి రోగములు తెచ్చు సూక్ష్మజీవులు దాడిచేయుటకు అనువుగా ఉండును. శరీరం చక్కగా ఎదుగుటకు , గర్భధారణకు , బాలింతలుగా ఉన్న సమయమున ఈ విటమిన్ చాలా అవసరం .


              ఈ "A" విటమిన్ ఎక్కువుగా పాలు , పెరుగు , వెన్న , నెయ్యి , గుడ్లు , చేపలు , పచ్చికూరలు , కాడ్ లివర్ ఆయిల్ , టొమాటో , బొప్పాయి , నారింజపండ్లు , బచ్చలి , తొటకూర మొదలైన వాటిలో ఎక్కువుగా ఉండును.


 *  "B" విటమిన్  -


         ఇది లోపించిన నరముల నిస్సత్తువ , ఉబ్బసరోగం కలుగును.


           ఈ "B" పచ్చికూరలు , మాంసము , పప్పుదినుసులు , గుడ్లు మొదలయిన వాటిలో లభించును. "B6" విటమిన్ తెల్లరక్త కణాలు తయారీకి ఉపయోగపడును. అరటిపండులో , పచ్చటి ఆకుకూరలలో , పప్పుదినుసుల్లో , చిక్కుడు , బంగాళాదుంపలలో ఈ విటమిన్ ఎక్కువుగా ఉండును. "B12" విటమిన్ ఇది లోపించిన పెదవుల్లో పగుళ్లు వస్తాయి. ఎర్రరక్తకణాలు ఏర్పడటానికి , నాడీమండలం వ్యవస్థకు , నీరసం , జ్ఞాపకశక్తి తగ్గటం , నోటిపూత , నరాల కణాలు నశించిపోవడం వంటి సమస్యలు వస్తాయి. ఈ "B12" విటమిన్ పాలఉత్పత్తుల్లో , సోయాచిక్కుడు పాలలో పుష్కలంగా ఉండును.


 *  "C" విటమిన్ -


          శరీరంలో ఈ విటమిన్ "స్కర్వీ " అను వ్యాధి వస్తుంది. ఈ విటమిన్ యాంటిబయాటిక్ గా పనిచేయును . జీర్ణశక్తిని పెంచును. విటమిన్ C లోపించిన ఐరన్ ను ప్రేగులు గ్రహించలేవు . ఐరన్ లోపిస్తే రక్తహీనత ఏర్పడును . ఈ విటమిన్ ఎక్కువుగా నిమ్మకాయ , ఉశిరికాయ , కొత్తిమీర , పండ్లరసములు , మొలకెత్తిన గింజలలో , కలబందలో , వెల్లుల్లిలో , ముల్లంగిలో , పైనాపిల్ లో , కొబ్బరిబోండాలలో , మునగ ఆకులో పుష్కలంగా లభించును.


 *  "D" విటమిన్ - 


         బిడ్డల ఎదుగుదలకు ఈ విటమిన్ చాలా అవసరం . ఇది లోపించిన బిడ్డలు దొడ్డికాళ్ళు వారగును. ఇది A విటమిన్ తో కలిసి వెన్న , గుడ్డు లొని పచ్చసొనలో ఉండును. ఉదయం , సాయంకాలం శరీరముకు సూర్యరశ్మి తగులుట వలన శరీరానికి కావలసిన D విటమిన్ బాగుగా లభించును. ఈ విటమిన్ శరీరంలో కొంతమొత్తంలో తయారగును.


              ఈ D విటమిన్ మనశరీరంలో ఎముకలు క్షీణించకుండా చూస్తూ వాటిని దృడంగా ఉంచును. రోగనిరోధక శక్తి బలోపెతం చేసేగుణం ఈ విటమిన్ కు ఉండును. ఇన్సులిన్ శరీరం సంగ్రహించుటకు తోడ్పడును. విటమిన్ D కణవిభజనను నియంత్రిస్తుంది. ఫలితముగా క్యాన్సరు నివారణకు తోడ్పడును . విటమిన్ D లోపము వలన పేగు క్యాన్సరు,రొమ్ము క్యాన్సరు , ప్రొస్టేట్ గ్రంథి క్యాన్సరు , క్లోమ క్యాన్సరు ముప్పుని తొలగించును. ఉదయం 6 నుంచి 8 లోపు సూర్యనమస్కారాలు చేయుట మంచిది . ఈ విటమిన్ లోపం ఉన్నవాళ్లు తరచుగా పాలు , గోధుమలు , మరియు దేశివాళీ ఆవునెయ్యిలో తరచుగా తీసికొనవలెను .


 * "E " విటమిన్  -


          ఇది లోపించిన నపుంసకత్వం కలుగును. A విటమిన్ మరియు C విటమిన్లను మరియు ప్రోటీయాసిడ్స్ ని శరీరం నుండి నశించకుండా రక్షించే గుణం పైనాపిల్ లో ఉన్న E విటమిన్ లో ఉన్నది. వేరుశనగలో , బాదంలో , కాయగింజలలో , సొయాచిక్కుడు , గట్టి గింజలలో దొరుకును . గోధుమ , మొలకెత్తిన గింజలలో , మాంసములో ఎక్కువుగా లభించును.


              వీటితో పాటు విటమిన్ K కూడా మనకి ముఖ్యమయినది. ఈ విటమిన్ K రక్తం గడ్డకట్టుటకు ఉపయోగపడింది. ఈ విటమిన్ K లోపించడం వలన రక్తం గడ్డకట్టడం జరగదు. ఈ విటమిన్ K పచ్చిబఠాణీ , ఆవునెయ్యి , క్యారెట్ లలో ఎక్కువుగా ఉండును.


          నేను రాసిన గ్రంథాలలో మరిన్ని అనుభవ యోగాలు ఇవ్వడం జరిగింది. 


   

 What should be asked to Almighty.   Health, Whelth, Happiness and longlife?  Nothing.  Just pray Lord to look after your Yoga and Khema.  What is this Yoga and Khema?  Yoga means a step above to your present position or condition.   Khema means your present position or condition.  He knows what's to be given to us and what not.  Our job is only and nothing but "SHARANAGATI".

*శ్రీ వేంకటేశ్వర దివ్య చరిత్ర - 10*

 🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹

*శ్రీ వేంకటేశ్వర దివ్య చరిత్ర - 10* 


🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁


బాగుగా ఆలోచించిన వెనుక, బ్రహ్మ శివుడుండు వెండికొండకు వెడలినాడు బ్రహ్మరాకకు శంకరుడానందమును వ్యక్తమొనర్చుచు, ఆయనకు సకల మర్యాదలు చేసి, గౌరవించి, ఉచితాసన మలంకరింపజేసి


 ‘విధాతా! విశేషములేమైన నున్నచో నెఱిగించెదవా! అనెను.


అనగానే ‘‘శంకరా! భక్తవశంకరా! లక్ష్మీదేవి ఎడబాటు వలన శ్రీమహావిష్ణువు భూలోకమున శేషాచలమును చేరి ఒక పుట్టలో నివసించడము ప్రారంభించాడు. నిద్రాహారములు లేక శుష్కించి, శ్రీమన్నారాయణుడా పుట్టలో నున్నాడు. 


ఉపవాసములతో ఆయన దినదినమునూ కృశించుచున్నట్లు నారదుని వలన తెలిసినది. కనుక మనమీ దశలో నారాయణునకు ఉపకారము చేయవలసియున్నది. 


మన మిరువురమూఆవు యొక్క దూడయొక్క రూపములు ధరించి నారాయణుడున్నటువంటి పుట్టను చేరి ఆయనకు ఆహారముగా పాలనిచ్చిన, కొంతలో కొంత ఆయన కుపకారము చేసినవారమగుదుము’’ అనినాడు బ్రహ్మదేవుడు.


అది విని శంకరుడు ‘‘విధాతా! అంతకన్న మనకు కావలసినదేమున్నది? ఆపదయందున్నవారి నాదుకొనుటకన్న గొప్ప యగునదేమున్నది? అదియును గాక నారాయణుని పట్ల ఆ మాత్రము వ్యవహరించుట మనకు విధిగా నెంచుట తగును. నీ వనినట్లే చేయుదుము’’ అన్నాడు.


మన కార్యములు సాధించుటకు సంధానము చేయు వారలు ఎప్పుడూ కావలసియే వుండును గదా! అందువల్లనే బ్రహ్మ, శివుడూ యిద్దరూ సరాసరి భూమండలానికి వెళ్ళి కొల్లాపురము చేరినారు. 


అచ్చట తపస్సు చేసుకొనుచున్న రమాదేవిని దర్శించి ‘‘అమ్మా కోపము చాలా చెడు వస్తువు సుమా! చూడు నీవు విష్ణువు పై కోపగించి భూతలానికి వచ్చేసిన కారణముగా పండంటి మీ సంసారములో కలతల అగ్ని కణాలు రేగాయి,


 అవి మీ సంతోషాన్ని దహించివేశాయి. విష్ణువు విషయము నీకు తెలిసిందా అమ్మా ఆయన యిప్పుడు మునుపటివలె కళాకాంతులతో చిరునవ్వులు చిందించే విష్ణువు కాదు. దైన్యదశలోనున్నాడు. 


నీకై క్షణమొక యుగముగా భూతలమునకు వచ్చి వెదకుచూ వెదకి వెదకి వేసారి శేషాద్రిచేరి, అక్కడున్న ఒక పుట్టలో తలదాచుకొని నిద్రాహారములు లేక దిగాలు పడి శుష్కించి శుష్కించి వున్నాడు. 


ఆయన కెట్లయిననూ ఆహారము నందించవలెననీ మా కోరిక, ఇందుకై నీవు చేయవలసిన ఉపకారము ఒకటి లేకపోలేదు. మేము ముగ్గురము ఆనందించవలెననీ మా కోరిక, ఇందుకై నీవు చేయవలసిన ఉపకారము ఒకటి లేకపోలేదు. మేము యావుదూడల రూపములు ధరించెదము నీవు గొల్లభామ వేషం ధరించి ఆవు దూడలమయిన మమ్ము తోలుకొని చోళరాజునకు అమ్మవలెను. 


ప్రతిదినమూ ఆ చోళరాజు యొక్క మందతో కలసివెళ్ళి మేము పుట్టలో నున్న శ్రీమహా విష్ణువునకు క్షీరాహారము నిచ్చుట ప్రారంభించెదము, 


కనుక మా కోరిక మన్నించవలెనని అన్నారు. విధాత, శంకరుల మాటలకు లక్ష్మీదేవి వెనువంటెనే సమ్మతించినది.


 *అనాధ రక్షక గోవిందా, ఆపద్భాంధవ గోవిందా, కరుణాసాగర గోవిందా,* *శరణాగత నిదే గోవిందా; |* 

 *గోవిందా హరి గోవిందా, వేంకట రమణా గోవిందా, గోవిందా హరి గోవిందా, వేంకట రమణా* *గోవిందా* .||10||


*శ్రీవేంకటేశ్వరుని దివ్య లీలల లో మరికొన్ని తదుపరి సంపుటిలో తెలుసుకుందాం 🙏*

*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.* 

🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

శఠగోపం

 గుడిలో శఠగోపం తలమీద పెట్టడం ద్వారా ఏ ఫలితం వస్తుందో మీకు తెలుసా...??


శఠ గోప్యం అంటే అత్యంత రహస్యం. అది పెట్టే పూజారికి కూడా వినిపించనంత నెమ్మదిగా కోరికను తలుచుకోవాలి.

అంటే...మీ కోరికే షడగోప్యము.


మానవునికి శత్రువులైన "కామము,క్రోధము,లోభము, మోహము,మదము, మత్సర్యముల వంటి వాటికి ఇక దూరంగా ఉంటాను" అని తలవంచి ప్రమాణం చెయ్యడం మరో అర్థం. ఎప్పుడు గుడికి వెళ్లినా *శఠగోపం* తీసుకోవడం మర్చిపోకండి.


*రాగి,కంచు,వెండితో చేసిన శఠగోపo పైన విష్ణు పాదాలు* ఉంటాయి. ఈ షడగోప్యం తలమీద పెట్టినప్పుడు శరీరంలో ఉన్న విద్యుత్ ఈ లోహం తగలడం వల్ల విద్యుదావేశం జరిగి శరీరంలో *అనవసరవిద్యుత్* బయటకి వెళ్ళిపోతుంది. తద్వారా శరీరంలో ఆందోళన, అధిక ఒత్తిడి ,ఆవేశము తగ్గుతాయి.

మన పెద్దలు చేసే ప్రతి పనిలోనూ ఎన్నో సైంటిఫిక్ కారణాలు ఉన్నాయి. అర్ధం చేసుకోవాలి.🙏


మన సంప్రదాయాలు గౌరవిద్దాం.

కృష్ణం వందే జగద్గురుం🙏

సమాధానమేమిటి

 ప్ర : ' మన దేవాలయాల్లో గర్భాలయాలలోకి అడుగు వర్ణాలను ప్రవేశింపజేయరు. అగ్రవర్ణాలదే ప్రవేశం. కల్యాణోత్సవాలకు కూడా పల్లకీ మోయిస్తారే కానీ వేదిక పైకి రానివ్వరు. కేవలం ఒక్క వర్ణం వారికే పరిమితమైన దేవుళ్ళను ఆరాధించే మతంలో మేమెందుకుండాలీ' అని ప్రశ్నిస్తున్న వారికి సమాధానమేమిటి?

జ : మనం ఆరాధించే దేవుళ్ళు గుడిలో ఉన్నవారు కాదు. వారు సర్వవ్యాపకులు. కానీ గుడిలో ఆ దేవుని ఆరాధించినప్పుడు కొన్ని మర్యాదలుంటాయి. గుడిలో దేవుళ్ళు | అందరినీ కాపాడే శక్తి స్వరూపులు. మన ఆలయవ్యవస్థ, మతస్వరూపం వేరు. ఇతరులతో పోల్చడానికి లేదు.

ఆలయాలలో విగ్రహాలు కేవలం నమ్మకానికి ఆధారాలు కావు. దైవశక్తిని మంత్ర యంత్ర హోమాది పద్ధతుల ద్వారా ప్రతిష్ఠ చేశాక, కొన్ని నియమాలుంటాయి. వాటి పవిత్రతను 'శౌచం' వంటి సదాచారాలతో కాపాడుకోవాలి. అప్పుడు ఆ ఆలయశక్తి అందరినీ రక్షించగలుగుతుంది. అలా కాపాడి అర్చించడానికి ఆ దేవతా మంత్రానుష్ఠానం, యంత్రారాధన విధానం, దానికి తగిన సదాచారం పరంపరగా తెలిసిన వారికి సౌలభ్యం ఉంటుంది.

రోగి మన బంధువైనా డాక్టర్ మాత్రమే చికిత్స చేస్తారు.ఐసియూలో ఉంచినప్పుడు ఆత్మీయులనైనా రానివ్వరు. తగిన సమయంలో అనుమతించినా చెప్పులతో, మామూలు దుస్తులతో అనుమతినివ్వరు. ఎక్కువ సంఖ్యలో రానివ్వరు.

మామూలు కంటికి కనబడని సూక్ష్మవిజ్ఞానం ఇక్కడ ఉంది. అలాగే ఆలయాల్లో దివ్యత్వం అర్చావిధానంతో కేంద్రీకృతమై ఉంది. దానిని కాపాడే బాధ్యత కొందరిది. అది భౌతికోద్యోగాలవలె సాధించలేము. కేవలం అగ్రవర్ణాలలో పుట్టినంత మాత్రాన అందరినీ గర్భాలయంలో ప్రవేశింపజేయరు.

హఠాత్తుగా -'మేమూ స్నానం చేశాం' అనగానే లభించే అవకాశం కాదిది. దానికి తగిన సంస్కారాలు, విద్య అవసరం. ఆ విధంగా వాళ్ళు కొలుచుకుంటుంటే, మరికొందరు పల్లకీ మోసి, డప్పు మోగించి, భూములిచ్చి కొలుచుకుంటారు. ఇక్కడ ధనప్రశక్తి లేదు. దర్శించే వారికంటే నిరుపేదలైన అర్చకులు కూడా ఉంటారు. ఏవో కొన్ని ప్రధాన ప్రముఖాలయాల్లో తప్ప, అన్ని ఆలయాల్లోనూ గొప్ప ఆదాయమేమీ ఉండదు. కేవలం సదాచారాలకు అంకితమైతే తప్ప పూర్తికాలపు అర్చకత్వం సాధ్యం కాదు. అందరూ అలా జీవించడం కుదరదు. అన్ని రకాల వృత్తులవారు, కర్మశీలురు సమాజంలో ఉంటారు. అందరూ సదాచారాలతో పూజానుష్ఠానాలను తీరిగ్గా చేసే అవకాశం ఉండదు. అందుకే కొందరు దానికై అంకితమై ఉంటారు. అందునా

పూర్వీకుల నుండి ఇంటా బయటా అలవాటైన అర్చావిధులూ, మంత్రశాస్త్రాలూ అందరికీ అందేవి కావు.

వైద్య శాస్త్రం వైద్యుల చేతిలో ఉన్నా, ఆరోగ్యం అందరిదీను. అలాగే- అర్చకత్వం ప్రత్యేక వర్గం చేతిలో ఉన్నా, దాని ఫలితాలు అందరివీను. అందుకే ఆలయ మర్యాదల ననుసరించి కొన్ని కట్టు బాట్లతో లోపల అర్చనాదికాలు జరుగుతాయి. కొన్ని చోట్ల విరాళాలిచ్చినవారు, నిర్మించినవారు, కార్యనిర్వాహక వర్గం వారు

అసంఖ్యాకంగా ఉన్నా వారెవ్వరూ ఏనాడూ గర్భగుడిలో ప్రవేశించరు.

మరొక ముఖ్యాంశం- ఇటువంటి కఠిన నియమాలు లేని ఆలయాలు కూడా మనకు ఉన్నాయి. గ్రామదేవతల రూపంలో, మన ఇంట్లో విగ్రహాల, పటాల రూపాలతో దేవతలుంటారు. శ్రద్ధగా పూజిస్తే ఆ దేవతలు సైతం స్పందించి, ఎవరికైనా అనుగ్రహా న్నివ్వగలరు. అర్చనతో కొందరు, నిర్వహణతో ఇంకొందరు, పరిచర్యలకు, సమర్పణ, కైంకర్యాలకు ఇంకొందరు సిద్ధంగా ఉన్నారు. ఎవరి పద్ధతిలో వారు భగవంతుని కొలుచుకొని ధన్యులౌతారు. సరియైన శాస్త్ర, మర్యాదల ననుసరించే వారు వీటిని గౌరవిస్తారు, పాటిస్తారు.

మన దేవుళ్ళను కొలుచుకొనే సామాన్యులు, స్త్రీలు కూడా ఉన్నారు. అందరూ గుడిలోకి అందునా గర్భగుడిలోకి చొచ్చుకు వెళ్ళాలని నియమం లేదు. నైవేద్యం పెట్టేటప్పుడు ఉన్న నియమం, ప్రసాద భక్షణలో లేదు. నైవేద్యం పెట్టేవారు సదాచారంతో ఉండాలి. తినేవారికి ఆ నియమం లేదు కదా!

కొన్ని ఆలయాల్లో అగ్రవర్ణేతరుల నిర్వహణ, అర్చన కూడా ఉన్నాయి. పద్ధతుల్లో వారు అర్చించే విధానాలూ ఉన్నాయి. వైదిక, పౌరాణిక, తాంత్రిక భేదాలతో ఒకే దైవాన్ని వివిధ వర్గాల వారు అర్చించుకొనే రీతులు మనకు ఉన్నాయి. హరిదాసరి, నందనారు, నీలకంఠనాయనారు,ధర్మవ్యాధుడు లాంటి మన ధర్మంలో పూజ్యులైన ఆధ్యాత్మిక తత్త్వవేత్తలు.కేవలం హిందూమతంలో చీలికలు తేవడానికి జరుగుతున్న కుట్రలో భాగమే ఈ కువిమర్శలు.

విద్యా మిత్రం

 శ్లోకం ☝️

విద్యా మిత్రం ప్రవాసేషు భార్యా మిత్రం గృహేషు చ 


వ్యాధితస్యౌషధం మిత్రం ధర్మోమిత్రం మృతస్య చ


Meaning:


Knowledge is a friend during travel in foreign places. Wife is a friend in home. Medicines are the friends during illness and our good deeds (Dharma) are friends after death by which others remember us fondly!


తాత్పర్యం:


విదేశాలలో ఉన్నప్పుడు తన విద్యయే మిత్రుడు. ఇంటిలో ఉండే మంచి మిత్రురాలు తన భార్యయే, రోగం తో బాధపడే వానికి సరియైన ఔషధమే మిత్రుడు, చనిపోయిన వానికి అతని ధర్మమే అతనికి మిత్రము.


ప్రవాసాలలో ఉండే వారికి, విదేశాలలో ప్రయాణాలు చేసే వారికి నిజమైన స్నేహితుడు,  వారి యొక్క చదువు,  ఆ చదువు ద్వారా సమకూడిన జ్ఞానము, ఆ విద్యా సంపత్తితో వచ్చిన వినయ విధేయతలు మాత్రమే నిజమైన స్నేహితుడు. విద్య అనే ఆ మిత్రుడే అన్ని విధాలా సహాయకారి కాగలడు.


ఆచార వ్యవహారాలలోనూ, గృహకార్యాలలోనూ, కుటుంబ బాధ్యతలని సక్రమముగా నిర్వర్తించుటలోనూ కుటుంబ యజమాని అయిన భర్తకి  సర్వ విధాలా చేదోడు వాదోడుగా ఉండే భార్య, సర్వదా అన్నిటా ఇంటిలో ఉండే మిత్రుడు భార్య మాత్రమే.


వ్యాధిగ్రస్తుడైన వానికి ఆ వ్యాధి నివారణని చేయగలిగే మంచి ఔషధమే సరియైన మిత్రుడు.


జాతస్య మరణం ధృవం. పుట్టిన ప్రతి మనిషీ కూడా చనిపోవలసిన వాడే. అయితే, ఆ మనిషితో కూడా వెళ్ళగలిగేవి ఈ ప్రాపంచికమైన ఏ సంపదా కూడా కాదు. బంధుమిత్రాదులు, స్నేహితులూ ఎంతమాత్రమూ కాదు. తాను బ్రతికి ఉండినప్పుడు చేసిన ధర్మకార్యాలూ, మానవాళికి చేసిన ఇతరత్రా మంచి పనులు, తోటి జీవ జాలానికి చేసిన సహాయ సహకారాలూ మాత్రమే ఆ వ్యక్తిని కలకాలం గుర్తుపెట్టుకునేలా చేస్తాయి.


ఆ ధర్మం మాత్రమే అతని నిజమైన స్నేహితుడు, చనిపోయిన తరువాత తనతో కూడా వచ్చే మిత్రుడు.

పంచాంగం 06.08.2023 Sunday,

 ఈ రోజు పంచాంగం 06.08.2023  Sunday,

 

స్వస్తి  శ్రీ చాన్ద్రమాన శోభకృన్నామ సంవత్సర: దక్షిణాయనం వర్ష ఋతు అధిక శ్రావణ మాస కృష్ణ  పక్ష: పంచమి తదుపరి షష్థీ తిధి భాను వాసర: రెవతీ  నక్షత్రం ధృతి యోగ: తైతుల తదుపరి గరజి తదుపరి వణిజ తదుపరి గరజి తదుపరి వణిజ కరణం ఇది ఈరోజు పంచాంగం. 


పంచమి ఉదయం 07:11 వరకు తదుపరి షష్థి రేపు తెల్లవారుఝామున 05:20 వరకు.

రెవతి రాత్రి 01:46 వరకు.

సూర్యోదయం : 06:00

సూర్యాస్తమయం : 06:44

వర్జ్యం : మధ్యాహ్నం 02:21 నుండి 03:52 వరకు.

దుర్ముహూర్తం: సాయంత్రం 05:02 నుండి 05:53 వరకు.


రాహుకాలం : సాయంత్రం 04:30 నుండి 06:00 వరకు.


యమగండం : 12:00 నుండి 01:30 వరకు.  

 


శుభోదయ:, నమస్కార:

ఉత్తరావృత శంఖం

 ఉత్తరావృత శంఖం

~~



_*ఉత్తరావృత శంఖం విశేషాలు*_

~~~~~


పాంచజన్యం _ ఉత్తరావృత శంఖం


భగవాన్‌ శ్రీకృష్ణపరమాత్ముడి శంఖం పాంచజన్యం. ఆయన ఈ శంఖాన్ని కురుక్షేత్ర యుద్ధంలో పూరించేవాడు. వసుదేవుడు బలరామ , కృష్ణులకు గర్గాచార్యుడనే పురోహితుడి ద్వారా ఉపనయనం చేయించాడు. అనంతరం ఆచార్యులు వారికి గాయత్రీ మంత్రాన్ని ఉపదేశించారు. తరువాత బలరామ కృష్ణులను సాందీప మహాముని ఆశ్రమానికి తీసుకువెళతారు. ఆ ఆశ్రమంలో అన్ని విద్యలను ఆచార్యుల వారు వారికి బోధించారు. ఈ ఆశ్రమంలోనే కుచేలుడు  కృష్ణునికి స్నేహితుడిగా పరిచయమవుతాడు.


కొంతకాలం అనంతరం శిక్షణ ముగియడంతో బలరాముడు , కృష్ణుడు ఆచార్యులకు ప్రణమిల్లి గురుదక్షిణ ఏమివ్వాలో ఆజ్ఞాపించమని కోరతారు. వీరు సామాన్యులు కాదని వైకంఠం నుంచి భువిపై అవతరించిన వారని తన దివ్యజ్ఞానంతో సాందీపుడు తెలుసుకొంటాడు. తన మరణించిన కుమారుడిని తిరిగి బతికించమని కోరతాడు. గురుపత్ని శోకాన్ని నివారించినట్టు అవుతుందని వారికి సూచిస్తాడు.


గురుకుమారుడు కొంతకాలం క్రితం సముద్రస్నానం చేస్తూ భారీ అల రావడంతో కడలిలో మునిగి ప్రాణాలు కోల్పోయాడు. ఆ సముద్రతీరానికి వెళ్లిన బలరామ కృష్ణులు గురుకుమారుడిని తిరిగివ్వమని సాగరుణ్ని కోరారు. సాక్షాత్తు నారాయణుడే తన దగ్గరకు రావడంతో సముద్రుడు వారికి వినమ్రంగా నమస్కరించి *‘గురుపుత్రుడిని మింగింది పంచజనుడనే రాక్షసుడనీ , కడలి గర్భంలో దాగి వున్నాడనీ’* వెల్లడిస్తాడు. దీంతో వారు సముద్రంలోపలికి వెళ్లి పంచజనుడితో యుద్ధం చేసి అతన్ని సంహరిస్తారు. అనంతరం అతని కడుపును చీల్చిచూడగా గురు కుమారుడు కనిపించడు. ఒక శంఖువు మాత్రమే కనిపిస్తుంది. శంఖాన్ని శ్రీకృష్ణుడు తీసుకున్నాడు. గురుకుమారుడు నరకంలో వున్నాడని గ్రహించిన వారు అక్కడికి చేరుకుంటారు. అక్కడ ఆ శంఖువును పూరిస్తాడు కృష్ణుడు. ఆ శబ్దానికిభీతిల్లిన యమధర్మరాజు అక్కడకు చేరుకొని ఇద్దరినీ తీసుకెళ్లి అతిథి మర్యాదలు చేసి ఎందుకొచ్చారో తెలుసుకుంటాడు. భగవంతుని ఆజ్ఞ కావడంతో వెంటనే సాందీపుని కుమారుడిని వారితో పంపిస్తాడు. మునికుమారుడిని వెంటబెట్టుకొని ఆశ్రమానికి చేరుకుంటారు. మృతుడైన తమ కుమారుడు తిరిగి రావడంతో సాందీప దంపతులు ఎంతో సంతోషిస్తారు. పంచజనుడి నుంచి తీసుకున్న శంఖం కనుకనే దానికి పాంచజన్యం అని పేరొచ్చింది.


*శంఖం  ప్రాముఖ్యత*


దక్షిణావృత శంఖాలను పూజకు మాత్రమే ఉపయోగిస్తారు. ఉత్తరావృతాన్ని ఊదుటకు ఉపయోగిస్తారు. ఉత్తరావృత శంఖానికి ఎడమప్రక్క ఆవృతం(కడుపు) ఉంటుంది. శంఖాన్ని తూర్పుదిక్కుకి పట్టుకున్నప్పుడు ఉత్తరం వైపు ఆవృతం ఉంటుంది.


కాబట్టి ఈ శంఖాన్ని ఉత్తరావృత శంఖం అంటారు. విజయానికి సంకేతంగా శంఖాన్ని పూరిస్తారు. శంఖ ధ్వని విజయానికి , సమృద్ధికి , సుఖానికి , కీర్తి ప్రతిష్ఠలకు , లక్ష్మి ఆగమనానికి ప్రతీక.

ఉత్తరావృత శంఖాన్ని దుకాణాలలోను ఆఫీసుల్లోను ఫ్యాక్టరీలలోను స్థాపించి అభివృద్ధిని పొందుతున్నారు.


ఉత్తరావృత శంఖాన్ని ఊదటం కేవలం ఆద్యాత్మికపరమైన ప్రయోజనాలే కాకుండా శాస్త్రీయ మరియు ఆయుర్వేద ప్రయోజనాలు కూడా ఉంది. శంఖాన్ని ఊదినప్పుడు స్వచ్చమైన గాలి ఊపిరితిత్తులకు చేరుతుంది. మలినాలతో కూడిన గాలి బయటకు వస్తుంది. ఉత్తరావృత శంఖాన్ని ఊదటం వలన ఊపిరితిత్తుల వ్యాదులు నశించటమే కాకుండా ప్రేగులకు సంబందించిన వ్యాదులు నివారణవుతాయి. ఎవరికైనా మాటలు తడబడటం , నత్తి , గొంతు సంబంద సమస్యలు ఉన్నవారు ఉత్తరావృత శంఖాన్ని పూరించిన , ఉత్తరావృత శంఖ ద్వని విన్న గొంతు సంబంద వ్యాదులు నివారణవుతాయి. ఆస్తమా ఉన్నవారు క్రమం తప్పకుండా ఉత్తరావృత శంఖాన్ని పూరించినట్లైతే వ్యాది నుండి నివారింపబడతారు.


శాస్త్రవేత్తలు అభిప్రాయానుసారం ఉత్తరావృత శంఖ ధ్వని వల్ల వాతావరణంలో హాని చేసే కీటకముల నాశనం జరుగుతుందని - అనేక ప్రయోగాలు చేసి నిరూపించారు.  జర్మన్ శాస్త్రవేత్తల ప్రయోగాల పలితంగా ధైరాయిడ్ , హార్మోన్ లోపాల వంటి వ్యాదులు నివారింపబడతాయని ప్రయోగాత్మకంగా నిరూపించారు.


ఆశ్చర్యకరంగా కొన్ని ప్రాంతాలలో శంఖాన్ని పూరించినప్పుడు వెలువడే శబ్ధ కెరటాలు పరిసరాల్లో నివసించే ప్రజలకు ప్లేగు , కలరా వంటి వ్యాదులు ప్రబలవని నమ్ముతారు. ఉత్తరావృత శంఖాన్ని పూరించిన ఇంటిలో గాని , వ్యాపారసంస్ధలలో గాని నెగిటివ్ పోయి పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. ఉత్తరావృత శంఖాన్ని పూజ మందిరంలో గాని , ఇంటికి ఉత్తర దిక్కున గాని ఉంచిన సమస్త వాస్తు దోషాలు నశిస్తాయి.


🚩..ససేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్. 🙏🚩

*🚩శ్రీ వివేకానందస్వామి🚩* . *🚩జీవిత గాథ🚩* *భాగం 3*

 🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹

.    *🌹చారిత్రాత్మక కథాస్రవంతి🌹*

.   *ఓం నమో భగవతే రామకృష్ణాయ*


.       *🚩శ్రీ వివేకానందస్వామి🚩*

.                *🚩జీవిత గాథ🚩*   


*భాగం 3*


దుడుకు, అల్లరి  బాలుడు నరేంద్రుడు. అతడిలో సదా చిలిపితనం చిందులాడేది. ఒకింతసేపు కూడా అతడు ప్రశాంతంగా ఉండేవాడు కాడు. అతణ్ణి అదుపులో ఉంచడం అసాధ్యం. ఎలాంటి గదమాయింపుతోను అతణ్ణి శాంతింపజేయడం కుదరనిపని. 


భువనేశ్వరి విసిగివేసారి "సాక్షాత్తు పరమేశ్వరుడే నాకు కుమారునిగా జన్మించాలని వరం కోరుకొంటే, ఆయన తన భూతగణాలలో ఒకదాన్ని పంపించాడు" అని వాపోవడం కద్దు. అతణ్ణి శాంతింప జేయడానికి ఒక్కటే దారి! 'శివ శివ' అంటూ తలమీద చన్నీరు కుమ్మరించడమే! మరుక్షణమే అతడి అల్లరి అణగిపోయేది. 


అతడి అల్లరితో విసిగిపోయే భువనేశ్వరి ఒక్కోసారి, "ఇదుగో చూడు బిలే! ఇలా అల్లరి పిల్లవాడిగా తయారయ్యావంటే పరమేశ్వరుడు నిన్ను కైలాసానికి రానివ్వడు" అని బెదిరించగానే నరేంద్రుడి అల్లరి మటుమాయమయ్యేది. 


అంతేగాక, "పరమేశ్వరా! ఇకమీదట ఇలా ప్రవర్తించను.ఈ ఒక్కసారికి మాత్రం క్షమించు" అని పరమేశ్వరుణ్ణి ప్రార్థించేవాడట.అతణ్ణి చూసుకోవడానికి ఇద్దరు దాదులను నియమించిన అల్లరి అట్లే కొనసాగేది.


తల్లి ఒడిలోనే బిడ్డ విద్యాభ్యాసానికి శ్రీకారం చుట్టబడుతుంది. తల్లి పాలు పాటు ఆమెలోని సద్గుణాలూ, ఉన్నతాదర్శాలూ గ్రోలడమే బిడ్డకు విద్యాభ్యాసం పరిణమిస్తుందనడం అతిశయోక్తి కాదు. తల్లి తన బిడ్డను పెంచే తీరు అతడి భవిష్యత్తును నిర్ణయించడంలో ప్రధానపాత్ర వహిస్తుంది. నరేంద్రుడి తల్లి అతడికి గరపిన సాటిలేనిది. "జీవితంలో నేను సాధించినవన్నింటికీ ఋణపడివున్నాను" అనేవారు కాలాంతరంలో స్వామి వివేకానంద. 


భారతీయ సంస్కృతిలోని దేవీదేవతల, ఋషుల, వారి త్యాగమయ జీవితాల, ఇతిహాస నాయకులను గూర్చి కథల ద్వారా, పాటల ద్వారా భువనేశ్వరీదేవి నుండి నరేంద్రుడు విన్నాడు. ముఖ్యంగా ఆమె చెప్పిన రామాయణ, మహాభారతం కథలు అతడి హృదయంలో చెరిగిపోని ముద్రవేశాయి. తన బామ్మ, ఆమె వద్ద అనేక భాగవత కథలు కూడా నరేంద్రుడు విన్నాడు.


రోజూ ఇంట్లో మధ్యాహ్నంపూట రామాయణ మహాభారతాలు పారాయణ చేసేవారు. ఆ సమయాల్లో కూడా తన చిలిపిచేష్టలు కట్టిపెట్టి నరేంద్రుడు ప్రశాంతంగా కూర్చుని వినేవాడు.🙏

*సేకరణ:- శ్రీ రమణమూర్తి గారి వాట్సాప్ పోస్ట్.*

🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁

👉 *రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*

🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

*శ్రీ వేంకటేశ్వర దివ్య చరిత్ర - 10*

 🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹

*శ్రీ వేంకటేశ్వర దివ్య చరిత్ర - 10* 


🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁


బాగుగా ఆలోచించిన వెనుక, బ్రహ్మ శివుడుండు వెండికొండకు వెడలినాడు బ్రహ్మరాకకు శంకరుడానందమును వ్యక్తమొనర్చుచు, ఆయనకు సకల మర్యాదలు చేసి, గౌరవించి, ఉచితాసన మలంకరింపజేసి


 ‘విధాతా! విశేషములేమైన నున్నచో నెఱిగించెదవా! అనెను.


అనగానే ‘‘శంకరా! భక్తవశంకరా! లక్ష్మీదేవి ఎడబాటు వలన శ్రీమహావిష్ణువు భూలోకమున శేషాచలమును చేరి ఒక పుట్టలో నివసించడము ప్రారంభించాడు. నిద్రాహారములు లేక శుష్కించి, శ్రీమన్నారాయణుడా పుట్టలో నున్నాడు. 


ఉపవాసములతో ఆయన దినదినమునూ కృశించుచున్నట్లు నారదుని వలన తెలిసినది. కనుక మనమీ దశలో నారాయణునకు ఉపకారము చేయవలసియున్నది. 


మన మిరువురమూఆవు యొక్క దూడయొక్క రూపములు ధరించి నారాయణుడున్నటువంటి పుట్టను చేరి ఆయనకు ఆహారముగా పాలనిచ్చిన, కొంతలో కొంత ఆయన కుపకారము చేసినవారమగుదుము’’ అనినాడు బ్రహ్మదేవుడు.


అది విని శంకరుడు ‘‘విధాతా! అంతకన్న మనకు కావలసినదేమున్నది? ఆపదయందున్నవారి నాదుకొనుటకన్న గొప్ప యగునదేమున్నది? అదియును గాక నారాయణుని పట్ల ఆ మాత్రము వ్యవహరించుట మనకు విధిగా నెంచుట తగును. నీ వనినట్లే చేయుదుము’’ అన్నాడు.


మన కార్యములు సాధించుటకు సంధానము చేయు వారలు ఎప్పుడూ కావలసియే వుండును గదా! అందువల్లనే బ్రహ్మ, శివుడూ యిద్దరూ సరాసరి భూమండలానికి వెళ్ళి కొల్లాపురము చేరినారు. 


అచ్చట తపస్సు చేసుకొనుచున్న రమాదేవిని దర్శించి ‘‘అమ్మా కోపము చాలా చెడు వస్తువు సుమా! చూడు నీవు విష్ణువు పై కోపగించి భూతలానికి వచ్చేసిన కారణముగా పండంటి మీ సంసారములో కలతల అగ్ని కణాలు రేగాయి,


 అవి మీ సంతోషాన్ని దహించివేశాయి. విష్ణువు విషయము నీకు తెలిసిందా అమ్మా ఆయన యిప్పుడు మునుపటివలె కళాకాంతులతో చిరునవ్వులు చిందించే విష్ణువు కాదు. దైన్యదశలోనున్నాడు. 


నీకై క్షణమొక యుగముగా భూతలమునకు వచ్చి వెదకుచూ వెదకి వెదకి వేసారి శేషాద్రిచేరి, అక్కడున్న ఒక పుట్టలో తలదాచుకొని నిద్రాహారములు లేక దిగాలు పడి శుష్కించి శుష్కించి వున్నాడు. 


ఆయన కెట్లయిననూ ఆహారము నందించవలెననీ మా కోరిక, ఇందుకై నీవు చేయవలసిన ఉపకారము ఒకటి లేకపోలేదు. మేము ముగ్గురము ఆనందించవలెననీ మా కోరిక, ఇందుకై నీవు చేయవలసిన ఉపకారము ఒకటి లేకపోలేదు. మేము యావుదూడల రూపములు ధరించెదము నీవు గొల్లభామ వేషం ధరించి ఆవు దూడలమయిన మమ్ము తోలుకొని చోళరాజునకు అమ్మవలెను. 


ప్రతిదినమూ ఆ చోళరాజు యొక్క మందతో కలసివెళ్ళి మేము పుట్టలో నున్న శ్రీమహా విష్ణువునకు క్షీరాహారము నిచ్చుట ప్రారంభించెదము, 


కనుక మా కోరిక మన్నించవలెనని అన్నారు. విధాత, శంకరుల మాటలకు లక్ష్మీదేవి వెనువంటెనే సమ్మతించినది.


 *అనాధ రక్షక గోవిందా, ఆపద్భాంధవ గోవిందా, కరుణాసాగర గోవిందా,* *శరణాగత నిదే గోవిందా; |* 

 *గోవిందా హరి గోవిందా, వేంకట రమణా గోవిందా, గోవిందా హరి గోవిందా, వేంకట రమణా* *గోవిందా* .||10||


*శ్రీవేంకటేశ్వరుని దివ్య లీలల లో మరికొన్ని తదుపరి సంపుటిలో తెలుసుకుందాం 🙏*

*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.* 

🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

పాదగయ

 *మేము పవిత్రమూ ప్రసిద్ధము అయిన పాదగయ క్షేత్రం పిఠాపురం నందు బ్రాహ్మణులకు మాసికములు సాంవత్సరీకములు ఆబ్ధీకములు తీర్ధ విధులు గత కొన్ని సంవత్సరముల నుండి శాస్త్రోక్తముగా  నిర్వహిస్తున్నాము. తర్పణాలు మంత్రం, భోక్తలు, భోజనాలు వసతి సౌకర్యాలు మొదలగు సౌకర్యములు కల్పిస్తాము. కర్త లేని వారికి రాలేని వారికి విదేశాల్లో ఉన్న వారికి ఉపయోగపడే విధంగా యజమానస్య కర్తవ్యం జరిపించి వాట్సాప్  వీడియో కాలింగ్ ద్వారా చూపించబడును. పై కారక్రమాల కోసం సంప్రదించగలరు.*

*సంప్రదించండి :-*

*కోట సత్య ధర్మరాజు శర్మ*

*పాదగయ క్షేత్ర పురోహితులు* 9441089810

ప్రమధ గణాలు

 నిత్యాన్వేషణ:


ప్రమధ గణాలు ఎవరు?


ప్రమథ గణాలు మొదట శివుని నుండి ఉద్భవించిన వారు. కేవలం శివుని మాత్రమే కొలిచే వారు. తదుపరి ఎంతో మంది శివ భక్తులు ప్రమథులలో చేరారు.

"ప్రమథ" అంటే బాగా మథించ గలిగె వారని అర్థం. వీరు దేవతల కన్నా ఎక్కువ శక్తి గలవారు. దేవతలను కూడా శిక్షించ గలవారు. వీరంటే దేవతలకు భయము, మరియు భక్తి. దేవతలు తప్పు ద్రోవ పడితే వారిని నిగ్రహించే వారు ప్రమథులు. వీరు విశ్వమంతా వ్యాపించే నిగ్రహ శక్తులై సంచరిస్తాడు.

రుద్ర సూక్తం లోని ఏకాదశ అనువాకంలో

సహస్రాణి సహస్రశో యే రుద్రా అది భూమ్యాం ..

అంటూ వీరు అన్నిచోట్లా వ్యాపించి ఉండే రుద్రశక్తులుగా ప్రార్థించబడ్డారు. కోట్లకొలది గణాలు ఉంటారు. మహాభక్తులై శివలోకానికి చేరే జీవులు కూడా శాశ్వత శివ సాయుజ్యం పొంది రుద్ర గణాలుగా ఉండి పోతారని ప్రతీతి.

అయితే వారికి నాయకులు లేదా గణాధిపతులు కూడా ఉంటారు. వీరిలో ముఖ్యులు:

వీరభద్రుడు: దక్షయజ్ఞంలో శివాపచారం చేసిన దక్షున్ని, విష్ణ్వాది దేవతలను శిక్షించిన శివ జటోధ్భవుడు. తిరుగు లేని పరాక్రమవంతుడు. సాక్షాత్ శివస్వరుపంగా పోగడబడే వాడు. అందరికన్నా ముఖ్యమైన గణాధిపతి.

ఆది వృషభం: ధర్మదేవత. శివున్ని మోయ గలిగె వరం పొంది, అతని సమీపంలో ఎప్పుడు సంచరించే తెల్లని వృషభ మూర్తి. విష్ణు బ్రహ్మాదుల సృష్టికి పూర్వమే శివుడు ద్వితీయ శంభునిగా ధర్మ దేవతను వృషభ రూపంలో సృష్టిస్తాడు.

నందీశ్వరుడు: శిలాదుని పుత్రుడు. అది వృషభం యొక్క అవతారం. శివునికి రక్షగా, ఆంతరంగికునిగా ఉండే గణ మూర్తి. కైలాసానికి ఎవరు వచ్చినా ఇతని అనుమతి పొందితే గానీ శివదర్శనం లభించదు.

భృంగి: శివుని యొక్క పరమ భక్తుడు. భ్రమరము లాగా శివుని చుట్టూ ప్రదక్షణం చేయడం పనిగా ఉన్న వాడు కాబట్టి భృంగి అని పిలవబడ్డాడు. కేవలం శివున్ని ఆరాధిస్తూ పార్వతీ దేవిని విస్మరించి శాపగస్తుడై తల్లి వల్ల వచ్చే రక్త, మాంసములను కోల్పోయి పడిపోతే శివుడు మూడవ కాలు ప్రసాదించాడు. stability కోసం.. tripod లాగా.

స్కందుడు: కుమారస్వామి శివకుమారుడు. దేవసేనాధిపతి. బ్రహ్మజ్ఞాని.

పై ఐదుగురు వీరమహేశ్వర గురువులు. వారి గోత్ర పురుషులు. నేటికీ వీరశైవులు ఈ గోత్రములతో ఉన్నారు.

రేణుక, దారుక, ఘంటకర్ణ, విశ్వకర్ణ, ధేనుకర్ణ: శివుని పంచముఖాల నుండి ఉద్భవించిన గణశ్రేష్ఠులు. భూమిపైకి అయోనిజులై లింగమునుంది వచ్చి పంచ మఠములను స్థాపించి, శివాద్వైతాన్ని బోధించారు. మరల లింగైక్యు లయ్యారు.

కాలాగ్నిరుద్రుడు లేదా కాలభైరవుడు: బ్రహ్మ ఐదవ తలను తీసేసిన రుద్రుడు. కపాల హస్తుడు. కాశీ పురాదీశుడు

రిటి: ఉద్దాలకుని పుత్రుడు. శివకృప చేత పరమ జ్ఞానిగా మారి శివ గణములలో చేరాడు.

బాణుడు: శివుని పరమభక్తుడు. శివునితోనే యుద్ధం కోరాడు. తత్సముడైన వానితో నీ అభీష్టం నెరవేరుతుందని వరం పొందాడు. శ్రీ కృష్ణునితోయుద్ధం చేసి సహస్ర బాహువులు పోగొట్టుకొని శివగణాలలో చేరాడు. నర్మదా నదిలో బాణలింగాలు ఇతనికి ఇచ్చిన వరం వల్ల బాణ లింగాలని పిలువ బడతాయి.

చండీశుడు: ఒక గోప బాలుడు. శివపూజకు గుడిలో అనుమతించరు అని, గొర్రె పెంటికను శివలింగంగా భావించి గొర్రె పాలతో పూజించాడు. భక్తి తన్మయత్వంలో ఆ పెంటిక శివలింగంపై పడబోతున్న తన తండ్రి కాలినే నరికేసాడు. కైలాసం నుండి శివుడు పరుగున వచ్చి ఆ బాలునికి గణ ఆధిపత్యాన్ని, శివ ఉచ్చిష్టంపై అధికారాన్ని కలిగించాడు. శివ నింద చేసేవారికి అతడు చండశాసనుడు.

ఇలా ఎందరో ప్రమథ నాయకులు.

దదీచి, అగస్త్యుడు, ఉపమన్యుడు, పప్పిలాదుడు , దుర్వాసుడు మొదలైన అనేక మంది ఋషులు కూడా శాంభవ దీక్ష స్వీకరించి గణములలో స్థానం పొందినారు.

అంతే గాక విభూతి, రుద్రాక్షలు, శివలింగాన్ని ధరించి శాంభవ దీక్షలో ఉంటూ సంచరిస్తూ ఉండే ఎంతో మంది శివయోగులు కూడా ప్రమథ కులము వారే. బ్రహ్మ సృష్టి పరంపరలో వచ్చే వర్ణాశ్రమ ధర్మములకు, అగ్నిష్టోమాది క్రతువులకు వీరు అతీతులు. కేవలం శివకర్మ మాత్రమే విధిగా సంచరిస్తారు. అనన్యశివభక్తి ఉన్నవారు అందరూ సమానులని వీరి విశ్వాసము. ఈనాటికీ వీరు వీరమాహేశ్వరులని, జంగమదేవతలని పిలువబడతారు.

ఇక జంగమలు గురుపరంపరలో ఉంటే , శిష్య పరంపర చెందిన శివశరణులు కూడా గణములలో స్థానం పొందారు. ఎంతో మంది స్త్రీలు శరణులయ్యారు. అక్క మహాదేవి, హేమరెడ్డి మల్లమ్మ వంటి వారు. 12వ శతాబ్దానికి చెందిన బసవ, అల్లమ ప్రభు, చెన్నబసవ, సిద్ధరామ ఇత్యాది శరణులెళ్లరు శివగణాల అవతారాలు అని బసవ పురాణం చెబుతుంది.

గణాలలో ఎన్నో రకాల వారు ఉంటారని బసవ పురాణం వివరిస్తుంది. కొందరు శివ సారూప్యం తో ఉంటారు, కొందరు ఇచ్చాధార రూపాలతో ఉంటారు.రకరకాల ముఖాలతో, రక రకాల శరీరాలతో, అవయవాలలో వింతగా ఉంటారు ప్రమథ గణాలు. వీరి శక్తుల, లీలల గురించి తెలుసుకోవాలంటే పాల్కురికి సోమనాథుని బసవ పురాణం చదవాల్సిందే!!

వీలున్నప్పుడు అనేకానేక ప్రమథ గణముల వర్ణన బసవపురాణం నుండి సేకరించి జత చేస్తాను!!

వీరి పేర్లు తలచుకోవడమే మహా ప్రసాదము. ప్రశ్న అడిగిన వారికి ధన్యవాదాలు.

సాయం సంధ్య-పద్మ ముకుళనం!



సాయం సంధ్య-పద్మ ముకుళనం! 


             చ:  ఇనుఁడు  కరంబులం బొదవి ,యింపుగ  సంగమమాచరింపఁ  బ


                   ద్మిని  వదనంబునన్నగవు  మీఱ  వికాస విలాస మూని ,  లో


                   నన  ద్రవముబ్బి , సొక్కి ,  నయనంబులు మూయుచు నిద్రచెందెనో


                   యన ,  ముకుళీభవించె , దివసాంతమునందుఁ  బయోజ షండముల్. 


                          అనిరుధ్ధ చరిత్రము-3  ఆ: 5 పద్యం:  కనుపర్తి అబ్బయామాత్యుడు;


              

                కఠిన పదములకు అర్ధము:-  ఇనుడు-సూర్యుడు (రాజు లేదా నాయకుడు) కరంబులు-కిరణములు (చేతులు) సంగమము-కలయిక( సంభోగము)  వికాస విలాసము- విరసించెడు శోభ;( మనస్సు ఆనందమును పొందినకలుగు ఉత్సాహము) ద్రవముబ్బి-మకరందము స్రవింప(  కరగిపోయి) సొక్కి-పరవసించి;( శరీరమును మరచి;  ముకుళించె- ముడుచుకుపోయె; పయోజ షండములు-తామరల సముదాయము; దివసాంతము-సాయంత్రము


          భావము: ;సూర్యుడు తనకిరణ ప్రసార  సంగమముచే  పద్మిని నలరింప  వికసించి అందమును ప్రకటించుచు రసీ భూతయై యాపరవశమున కనులు మూయుచున్నదా యనునట్లు  పద్మములు  ముకుళించుచున్నవి;


                  విశేషాంశములు; ఈపద్యమును బోలిన  పద్యమొకటి  మనసాహిత్యమున కానరాదు. అంతగొప్ప పద్యము.


                     ప్రకృతిలో  జరుగు నొకమార్పును  ఒక లౌకికేతివృత్తముతో  నుపమించుచునూహించుట.

 యిందలి చిత్రము.

       

            భర్తవలన సంగమ సుఖమంది  నగుమోమున  విలాసములను ప్రకటించుచు  రతిపారవస్యముచే లోస్రవించుచు కనులు మూసి

నిదురించుట  వనితాసామాన్యమైన విషయము. ఇది నెల్లరకు అనుభూతమే!


                        సూర్యస్తమయవేళ  పద్మములు  ముకుళించుటను  కవియాదృశ్యముతో  నుపమించుచు,నుత్ప్రేక్షించుట,ఇందలి  విశేషము.


                    పద్మిని-  ఇనుడు : అనేపదాల నాధారంగా  వానికిగల  శ్లేషను ఉపయోగించి ఆదృశ్యమును  భర్తృ సుఖితయై పరవసించి కనులు మూయు భామిని  వృత్తముతో  సమముగా నున్నదనుచున్నాడు.

   

                    సంగమము, వికాస విలాసము ,లోద్రవముబ్బుట,  సొక్కుట , నయనంబులు మూయుటయు  నివియన్నియు శృం గార కృత్యములు. పద్మిని యందును వనితయందును ఇవిసమానమే


                     ఈరీతిగా ఊహలు సారించి, వేరెవ్వరు చూపని విధముగా  భావ ప్రసారణ చేసి  భావుకులను  మెప్పించిన  అబ్బయామాత్యుని  ఊహాశక్తికి  ఆవిష్కరణమొనర్చిన  తీరునకు  నమోవాకములు. 


                     అలంకారం:  ఉత్ప్రేక్ష                                        స్వస్తి!🙏🌸🌸🌸🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌸🌷

మోక్షం

 🍀🌅  *_-|¦¦|శుభోదయమ్|¦¦|-_* 🌄🍀

🪔 ॐ卐  *_-|¦¦|సుభాషితమ్|¦¦|-_* ॐ卐 💎


 𝕝𝕝శ్లోకం𝕝𝕝 


*_ద్వే పదే మోక్ష బంధస్య*  

*మమేతి  న మమేతి చ_*

*_మమేతి బద్ధ్యతే జంతుః* 

*న మమేతి విముచ్యతే_*


𝕝𝕝తా𝕝𝕝

ముక్తికి గానీ బంధానికి గానీ రెండు పదాలు కారణము..... “మమ”  "ఇది నాది" అనుకుంటే అది బంధం.... న మమ ” ఇది నాది కాదు" అనుకుంటే మోక్షం.

ॐ శ్రీ శివ సహస్రనామ స్తోత్రమ్

 ॐ   శ్రీ శివ సహస్రనామ స్తోత్రమ్ 


                             శ్లోకం:39/150 


మునిరాత్మా నిరాలోక 

స్సంభగ్నశ్చ సహస్రదః I 

ప్లక్షీచ ప్లక్షరూపశ్చ 

అతిదీప్తో విశాంపతిః ॥ 39 ॥  


* మునిః = మౌనముగా ఉండువాడు, 

* ఆత్మా = తానే (అందఱి) ఆత్మ అయినవాడు, 

* నిరాలోకః = దర్శనం లేనివాడు, 

* సంభగ్నః = పలువిధములుగ విభజింపబడినవాడు, 

* సహస్రదః = వేయి (అనేకమైన) వాటిని ఇచ్చువాడు, 

* ప్లక్షీ = (భూమియందలి) ప్లక్ష ద్వీపమున నివసించువాడు, 

* ప్లక్షరూపః = జువ్విచెట్టుయొక్క రూపము తానే అయినవాడు, 

* అతిదీప్తః = మిక్కిలి ప్రకాశించువాడు, 

* విశాంపతిః = మానవజాతికంతటికీ అధిపతి.


                    కొనసాగింపు ... 


https://youtu.be/L4DZ8-2KFH0 


                    =x=x=x= 


  — రామాయణం శర్మ 

           భద్రాచలం

వైదిక ధర్మ ప్రభావం

 వైదిక ధర్మ ప్రభావం


ఆచార్యపురుషులకు, తదనుయాయులకు ఆత్మబలం సచ్చరిత్రం, నీతీసంపదా ఉన్నట్టయితే వారి మతములకు సుస్థిరత్వం ఏర్పడుతుంది. అట్టి ఆచార్య పురుషుల వల్లనే వైదిక మతము అనేక గండములు గడచి నేటికి సుస్ధిరంగా వుంటున్నది.


గౌతమబుద్దుడు కపిలవస్తు నగరంలో అవతరించి, 2500 ఏండ్ల గడచినవి. వారి త్యాగనిరతీ, వైరాగ్యనిష్ఠ ప్రజల మనస్సులను లోగొన్నవి. బుద్ధుని జీవితగాథ విన్నప్పుడు దేశమంతటా కానవచ్చే బుద్ధవిగ్రహాలను కన్నప్పుడు మనకు శాంత్యానందములు, కరుణా లభిస్తూవుంటవి. బౌద్ధము నాస్తిక మతమైన కారణాన దానికే దేశంలో నిలువనీడ లేకపోయిందనే అభిప్రాయ మొకటి ఈ వరకు ఉంటూవచ్చేది. కాని, సంస్కృతంలో పాళీభాషలో వున్న బౌద్ధధర్మ గ్రంథాలను, అశోకుని శిలాశాసనాలను పరికిస్తే బుద్ధదేవుని మహానుభావం మనకు తెలిసివస్తుంది. అట్టి మహనీయుని పుట్టుకచే ఈ దేశం ధన్యమయినదనిపిస్తుంది. ''ప్రాగ్దిశాజ్యోతి'' అనే గ్రంథంలో ఎడ్విను ఆర్నాల్డు కవి బుద్ధుని దివ్యజీవనాన్ని కీర్తించాడు. ఈ బౌద్ధమతం తమిళ దేశంలోను వ్యాపించింది. బౌద్ధధర్మాలనేకం తమిళ గ్రంథాలలో కానవస్తున్నవి. ఇంతగా గౌరవాస్పదమైన బౌద్ధమతం మనదేశంలో ఏల నిలువ జాలకపోయిందా అని ఆశ్చర్యం కలుగుతూ వుంటుంది.


తమిళ సాహిత్యంలో ఎక్కడ చూచినా జైనమత ప్రచారం కనిపిస్తుంది. దీనినిబట్టి బౌద్ధముకంటే జైనధర్మానికే తమిళనాడులో ప్రాబల్యం లభించిందనుకోవాలి. ఉత్తర భారతంలో గుజరాతు మొదలైన ప్రాంతాల్లో జైనమతస్థు లధికంగా ఉంటున్నారు. బౌద్ధ జైనములు రెండూ అహింసనే పరమధర్మంగా చెపుతున్నా, బౌద్ధులు ఇతరులు చంపిన మృగముల మాంసం తినేవారు. జైనులు మాంససేవనం చప్పగా నిషేధిస్తారు. జైన విగ్రహాలు, ధర్మశాసనాలుకూడా మన దేశమంతటా కనిపిస్తున్నవి. సాంఖ్యమతమనేది కూడా పురాతనమే. బౌద్ధ, జైనములందు కంటే సాంఖ్యమతంలో జ్ఞానులు, ఋషులు ఎక్కువగా ఉన్నా, వారివారి విగ్రహాలుగాని, వారి మతాన్ని ప్రచారంచేసే గాధలు, గీతములుగానీ ఎక్కడా వినరావు మరి తత్త్వశాస్త్ర గ్రంథాలలో చూడబోతే, బౌద్ధ, జైనముల కంటే సాంఖ్యమతానికి ఎక్కువ ప్రస్తావము కనిపిస్తుంది.


వైదికమతాలలో శైవ వైష్ణవాలు తమిళదేశంలో బహుళప్రచారాన్ని పొందినవి. వైష్ణవసిద్దాంతానికి శ్రీమధ్వమునీ శ్రీ రామానుజులు ఆచార్యపురుషులు, రామానుజుల వైష్ణవాన్ని, శైవసిద్ధాంతమూలకమైన శైవాన్ని అవలంబించినవారు తమిళనాడులో విరివిగా ఉన్నారు. వైష్ణవాలయాలన్నిటా రామానుజులకు, నమ్మాళ్వారులకు, మనవాళమునికి వేదాంత దేశికులకు, మరియెందరో ఆళ్వారులకు అర్చా విగ్రహాలు వెలసినవి. శైవాలయాల్లో అట్లే అప్పయ్య, సుందరయ్య, సంబంధయ్య, మాణిక్యవాచకయ్యవార్ల విగ్రహాలు పూజలందుకొంటున్నవి. అంతేకాదు; శేవదివ్యస్థలాల్లో అరువత్తిమూడు నాయనార్ల విగ్రహాలుకూడా నెలకొన్నవి. వైష్ణవాలయాలలో ప్రబంధాలను, శైవాలయాలలో తిరిమరైలను గానంచేసేవారి కోసం వృత్తులు ఏర్పాటైవున్నవి. మరి అద్వైత స్థాపనాచార్యులైన శంకరుల విగ్రహాలు చూడబోతే శైవ వైష్ణవాచార్య విగ్రహాల్లో వెయ్యోవంతుకూడా కనుపించవు. అద్వైతాచార్యులలో ముఖ్యులైన సురేశ్వరాచార్యులకు, అప్పయ్యదీక్షితులకు ఎక్కడా విగ్రహములే కానరావు. పురావస్తుశాఖాధికారి ఒకరు చెప్పినట్లు శాసనాలు, విగ్రహాలు మెదలైన పురావస్తువులను బట్టి దేశచరిత్ర తిరిగి రచించి నట్లయితే, అద్వైతమతప్రసక్తే ఎక్కడా కనుపించకపోవచ్చు.


బౌద్ధమతం వైదిక మతాన్ని ఖండించింది. జైనమేమో బౌద్ధాన్ని ఖండించింది. ఇట్లే మతాచార్యులందరూ వారి వారి కాలములందు ప్రచారంలో ఉన్న మతాలను ఖండిస్తూ, తమ మతాలను స్ధాపింపజూచారు. శైవం, వైష్ణవం మొదలైన ఈ మతాలన్నిటికీ వేర్వేరు లక్షణాలు స్ఫుటంగా కనిపిస్తూ ఉంటవి. శైవవైష్ణవాలు రెండూ ప్రతిమార్చనను అంగీకరించినవే అయినా, వైష్ణవం ఈశ్వరునకు సుగుణమూర్తిని కల్పిస్తే, శైవం ఈశ్వర సంకేతమాత్రమయిన లింగం చాలునంటుంది. ఇస్లాము, క్రైస్తవమతస్థులు, ఆర్య సమాజికులూ ప్రతిమార్చన మొదలైనవే పనికిరాదంటారు. హిందువులు అంగీకరించే వేద ప్రామాణ్యాన్ని బౌద్ధులు, జైనులు అంగీకరించరు. ఈ మతాచార్యులందరిచుట్టూ శిష్యగణం విస్తారంగా పోగవుతూ వుండేది.


నేడు మతస్థులస్థితిని పరిశీలించిచూస్తే మానవలోకంలో సగంమంది క్రైస్తవమును, ఇంచుమించు తక్కినసగం బౌద్ధమును అవలంబించియున్నారు. ఈ రెంటికీ చెందనివారు తక్కినమతాల నాశ్రయించి ఉన్నారు. మరియెన్నో మతాలు పుట్టి పెరిగి నశించిపోయినవి. ఈ మతాలిలా యెందుకు పుట్టుతున్నవి? ఎలా నశిస్తున్నవి? ప్రతిమతమూ తనకే సత్యదర్శనమైనదనీ, తన్ను మించిన పరమధర్మంలేదనీ చెప్పుకుంటూ వుంటుంది. నిజానికి సత్యమనేది ఒక్కటే. అది యిన్నివిధాల వుండదు. మరి ప్రతిమతానికి ప్రజలు అసంఖ్యాకంగా ఎగబడుతూనే వుంటారు. మతాల ఉత్కృష్టతను, వాని నవలంభించిన జనుల సంఖ్యను బట్టి నిర్ణయించుదామా అంటే సత్యం తమనొసటనే పొడిచిందని చెప్పుకొన్న మతములు క్షీణించిపోవుట ఎందువల్ల?సత్యబలంవల్ల మతములు ప్రజారంజకములవుతున్నవా? ప్రజారంజకములైన మతములే సత్యమతము లవుతున్నవా? ప్రజలు సత్యంకోసం మతాన్ని అవలంబిస్తా రనుకొందామా? అంతరించిపోయిన మతాలన్నీ అసత్యమతములనుకుందామా? ఇలా ఎన్నో ప్రశ్నలుదయిస్తున్నవి. ఇవన్నీ పరిశీలించిచూస్తే, ఒక్కవిషయం స్పష్టమవుతుంది. ప్రజారంజనమునుబట్టి, సంఖ్యాబలాన్ని బట్టి మతాలకు స్థిరత్వంగాని ప్రమాణ్యంగా ని నిలభించదని, మనకండ్లయెదుటనే గాంధిధర్మంకోసమని వేలాది ప్రజలు ఉపవాసంచేసి, బంధిఖానాలు నింపి, ప్రాణాలుకూడా అర్పించారు. మరి ఆ గాంధిధర్మమును, ఆ గాంధీజీ ప్రాయోపవేశాలను పట్టించుకోక ఎగతాళి చేసిన వారినీ మనమే చూచాము. అంతేకాదు, ఆ గాంధి ధర్మానుయాయుల సంఖ్య నానాటికి దిగనాసిల్లటంకూడా మనమే చూస్తున్నాము.


కాబట్టి సత్యప్రతిపాదనంవల్లనే మతాలు సుస్థిరములు, ప్రబలములు అవుతవని చెప్పలేము. మతములు ఏకారణంవల్ల పతనమైనవో తెలిసికొంటే వాని వృద్ధికిగల రహస్యంకూడా తెలిసిపోతుంది. మహాబలిపురంలో గుట్టలను ఆలయాలుగా మలిపించిన మహేంద్రవర్మ అనే రాజు ''మత్తవిలాస'' మనే ప్రహసనం రచించాడు. దానిలో బౌద్ధధర్మచ్యుతులైన భక్షువుల స్వేచ్ఛాచారాన్ని గూర్చిన ప్రస్తావనకనిపిస్తుంది. పురుషులతో పాటు స్త్రీలకు గూడా భిక్షుదీక్షలివ్వడం అపాయకరమని బుద్ధుడు ముందే ఊహించాడు. కాబట్టి తమ సచ్చరిత్రంవల్ల ఇతరులకు మార్గదర్శకులు కాదగిన భిక్షుమండలి ధర్మభ్రష్టమగుటవల్లనే బౌద్ధమతానికి పతనంకలిగిందని ఏర్పడుతున్నది. దీనినే వ్యతిరేకలక్షణతో చెపితే మతపరిరక్షణ కొర కేర్పడిన వారు నిష్కళంక చరిత్రులై తత్వజ్ఞులై ఉదారబుద్ధితో ఆచరణ ప్రచారములు ఎప్పటికప్పుడు చేస్తూవుంటే, మతములు సుస్థిరంగా వర్థిల్లుతవని చెప్పవచ్చు. మతకర్తల మహానుభావం వల్లనే మతాలకు ఆదిలో చోదనలభించుట నిజమే అయినా, తదనంతరం వచ్చే ఆచార్యపరంపరకు ఉత్సాహశక్తి, నియమనిగ్రహాలు, సచ్చరిత్రమూ అలవడాలి. తదనుయాయులకు శ్రద్ధా భక్తులుండాలి. అప్పుడే ఆ మతాలకు సుస్థిరత్వం, ప్రజారంజనం లభిస్తుంది. ప్రజాసామాన్యాన్ని ఆకరించేది ఆచార్యపురుషుల మహానుభావమే. కాని, మత పరమార్థం కాదు. ఎవరో పండితులు మాత్రమే ఆ పరమార్థాన్ని విచారించగలుగుతారు. చిరప్రతిష్ఠితములైన, మతములు గూడా మహనీయులైన ఆచార్యపురుషులు కరవగుటవల్లనే క్రమంగా క్షీణించిపోతవి.


కనుక ఏమతమయినా తదనుయాయులు భక్తిశ్రద్ధలతో ధర్మాచరణం చేస్తూవుంటే సుప్రతిష్ఠితమై వర్ధిల్లుతుంది. ప్రజాబాహుళ్యం ఎగబడి సందడి చేసినంతమాత్రాన చేకూరేది వాపేగాని బలుపుగాదు. నిజానికి సాంఖ్యాద్వైతమతాలకు సందడి చాలాతక్కువ. అనాదియైన వైదికమతానికి కర్తలెవరో ఎరుగము. అయినా, అది నేటికీ బహుజనుల కాలంబమై నిలిచి వున్నదంటే త్యాగధనులు, సచ్చరిత్రులు, భక్తులు అయిన ఆచార్యపురుషు లెందరో దానికాలంబమై ఆచరణ ప్రచారములు చేస్తూవుండటమే కారణం. కనుక, మనయీమతం చిరకాలం ఇలాగే వర్ధిల్లి లోకాన్ని ఉద్ధరించాలనే అభిలాష మనకుండాలి. అట్టి అభిలాషతో మనం సదాచారులమై, ధర్మపరాయణులమై, మనోవాక్కాయములచే సత్కర్మాచరణం చేస్తూవుండాలి.


--- “జగద్గురు బోధలు” నుండి


అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం

శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।।


#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం

ఉత్తములకే కష్టాలు

 ఉత్తములకే కష్టాలు ఎందుకు వస్తాయి.


మానవుడికి అతడి మొత్తం జన్మల రూపం సంచిత కర్మ...

అందులో ఒక జన్మ కి కేటాయించిన కర్మ ప్రారబ్ధ కర్మ.

మనకు సందేహం వస్తుంది మనకి ఇంకా ఎన్ని జన్మలున్నాయి ..అని..గతంలో చేసుకున్న కర్మల కారణంగా , ఆ కర్మలన్నీ తీరి పోవడానికి మరొక 100 జన్మలు అవసరం అవుతాయని అనుకుందాము.

అతడి కర్మలను బట్టి, ఈ రాబోయే జన్మల సంఖ్య ఒక్కో మానవుడికి ఒక్కో విధంగా ఉంటుంది..

రాబోయే జన్మ ల సంఖ్య లెక్క ఇప్పటి వరకు నిర్ధారించబడింది..ఆంటే. ఇప్పటి వరకు ఉన్న రుణాలు కొన్ని నిర్ధారితం జన్మలలో తీరుతాయి అని అర్ధం...

ఆంటే అది Bank loan Installment భాషలో ఇన్ని EMI లు ఉన్నాయి అని అర్ధం.

ఇక నుండి మనం కొత్త కర్మలు లేదా కొత్త రుణాలు చేయకపోతే.!

వ్యాధులు బాధలు కష్టాలు, శత్రుత్వాలు అప్పులు అన్నీ కర్మ ఋణాలే. ఇవన్నీ సహజంగా కాలగతి లో సమయాన్ని అనుసరించి వచ్చి , తీరిపోతాయి.

వీటిని భరించలేక మనం చేసే ప్రయత్నాల వలన కర్మలు అనుభవించవలసిన కాలం పెరిగి, ఆంటే మన జన్మ ల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నది..ఆంటే EMI లు పెరుగుతాయి.

భగవంతుడిని ప్రార్ధించి కొన్ని వ్యాధులు కొన్ని కర్మలని సమయం కన్నా ముందే పోగొట్టుకోవలనే తీవ్ర ప్రయత్నం వలన , ఆ కర్మలు ప్రస్తుత జన్మ లో అదృశ్యం అయి , తిరిగి వచ్చే జన్మలో నిర్ధారత సమయం వరకు వేధిస్తాయి..

ఈ కారణంగానే జ్ఞానులు, యోగులు. ఉత్తములు, కర్మలను త్వరగా అనుభవించేయాలని చూస్తారు..

ఇంక ఎన్నాళ్ళు మరో జన్మ ? "ఇంక జన్మ వద్దు మోక్షం కావాలి " అనుకునే వారు, ఆత్మజ్ఞానం తెలుసుకోవాలి, నేను ఎవరూ అనే విచారణ చేయాలి, దానికన్నా ముందుగా కర్మ అంటే ఏమిటో తెలుసుకుందాం!కర్మ అంటే ‘విధి’ కాదు. karma is not fate!ఈ రెండిటికీ చాలా తేడా ఉంది. కర్మ అనేది ఒక పని.అది మనంతట మనం కల్పించుకున్నదే!అది మంచిది కావచ్చు లేదా చెడ్డది కావచ్చు! అంటే కర్మ వేరు, కర్మ ఫలం వేరు. కర్మ అంటే మనం ఉదయం లేచిన దగ్గరనుండి రాత్రి పడుకునే వరకు మనం చేసే పనులన్నీ కర్మలే.కర్మ సిద్ధాంతం గురించి చెప్పేటప్పుడు గత జన్మ ఒకటుందని,మరణించిన తర్వాత మరొక జన్మ ఉంటుందని నమ్మి తీరాల్సిందే!అయితే,నేను దీన్ని గురించి ఇంకా డోలాయమాన పరిస్థితిలోనే ఉన్నాను.ఇంకా నాకు ఒక నిశ్చితమైన అభిప్రాయం ఏర్పడలేదు.అందుకే నా కొన్ని వ్యాసాల్లో భిన్నమైన అభిప్రాయాలు కనపడుతుంటాయి. అర్ధం చేసుకున్నవారు accept చేస్తారు. అర్ధం చేసుకోనివారు నిలకడలేని మనిషిగా నన్ను భావిస్తుంటారు. నిజానికి నేను కోరుకునేది కూడా ఈ నిలకడలేని స్థితినే! మనం వృక్షాలలాగో, కొండలలాగో ఒకేచోట ఉండలేం,ఉండకూడదు కూడా! మానవ జీవితం నిత్యం ప్రవహించే ఒక చైతన్య స్రవంతి లాగా ఉండాలి. దానితో పాటు మనం కూడా అన్ని చోట్లా తిరుగుతూ నిత్యం ప్రవహించాలి. అప్పుడే జీవితం చైతన్యవంతం అవుతుంది.ఎన్నో విషయాలు అనుభవంలోకి వస్తాయి.సందర్భం వచ్చింది కనుక ఇదంతా చెప్పక తప్పలేదు.మరణానంతరం జీవితం ఉందా, లేడా అనే సందేహం నన్ను కొంతవరకు పీడిస్తుంది. ఈ రెండు భిన్నమైన అభిప్రాయాల ఘర్షణలో మనసు తీవ్రమైన అన్వేషణ ప్రారంభించింది. ఈ అన్వేషణలోనే నాకు ఏది సత్యమో బోధపడుతుందని నా విశ్వాసం. అది నా అంతట నేను తెలుసుకోవలసిన సత్యమే!దీన్ని గురించి ఎవరో చెప్పింది నమ్మటానికి ఇష్టపడను.ఎందుకంటే అది వారి నమ్మకం మాత్రమే,అది సత్యం కాకపోవచ్చు!నమ్మకాలు సత్యాలు కావు. సత్యాన్ని ఎవరికి వారే అన్వేషించి కనుక్కోవాలి!నాలో పేరుకుపోయిన కొన్ని నమ్మకాలు కొన్నిటిని నమ్మటానికి అంగీకరించటం లేదేమో!ముందుగా ఆ నమ్మకాలనుండి నేను విముక్తుడిని కావాలి. దీనికి సాధన అవసరం. కర్మ సిద్దాంతము ప్రకారము జీవుడు పుట్టడానికి మునుపు ఆ జీవి కొంత కర్మ చేసుండొచ్చు, ఆ కర్మఫలం అతను ఆ జన్మలో అనుభవించకపోతే దాన్ని అనుభవించడానికి మళ్ళీ జన్మిస్తాడు. ఆ కర్మ ఇంకా మిగిలి ఉంటే దాన్ని అనుభవించడానికి ఈ జన్మ లాగే మరో జన్మని కూడా పొందొచ్చు!కర్మ సిద్దాంతాన్ని నాస్తికులు, భౌతిక వాదులు నమ్మరు.అబ్రహమిక్ మతాల (యూదు మతం, క్రైస్తవ మతం, ఇస్లాం మతం) ప్రకారం మనిషి చేసే ప్రతిచర్య భగవంతుని సంకల్పాలే. భగవంతుడే వారి చేత చేయించాడని వారి నమ్మకం. విధిరాతనే వారు

కర్మగా భావిస్తారు.హిందూ మతం ప్రకారం మనిషి ఆధీనంలో కర్మ మరియు భగవంతుని ఆధీనంలో కర్మ ఫలం ఉంటాయి. ఈ వ్యత్యాసం ఎరుగక కొందరు కర్మని విధి నిర్ణయం (fate) గా పొరబడతారు.మనం పుట్టిన దగ్గర నుండి చనిపోయేవరకు కర్మలు చేస్తూనే ఉంటాం! చేసే ప్రతి కర్మకు ఫలితం వస్తుంది. మనం చేసే ప్రతి కర్మ కూడ ఏదో ఒకనాడు ఫలితాన్నిస్తుంది.మనిషి చేసిన కర్మలకి అనుభవించే ఫలితాన్ని కర్మఫలం అంటారు.పాప పుణ్యాలు చేసేది మనుషులే! అందరూ అనుకున్నట్లుగా దేవుడు వాటిని చేయించడు. దేవుడు కేవలం కర్మ ఫలాన్ని మాత్రమే నిర్ణయిస్తాడు. మనము చేసే ప్రతి కర్మకు ఫలితమనేది ఉంటుంది. మంచి పనిచేసినంత మాత్రాన మంచి ఫలితం రాకపోవచ్చు. అది ఎలానంటే ,నోములు నోచి సంతానాన్ని పొందితే ,ఆ పుట్టిన కొడుకు దుర్మార్గుడు కావచ్చు!మంచి పని చేస్తేనే దుష్ఫలితం వస్తే, ఇక చెడ్డ పని చేస్తే వచ్చే ఫలితాన్ని గురించి చెప్పేదేముంది! కొందరికి మంచి సంతానం కలుగుతుంది, కొందరికి బిడ్డలు చనిపోతారు, కొందరికి సంతానమే ఉండదు! ఇలాంటి తేడాలు, తారతమ్యాలకు కారణం ఈ కర్మ సిద్దాంతమేనని చెప్పవచ్చు.అన్ని ప్రాణులు,మనుషులు జీవించటానికి ప్రాణమే మూలం . అది అన్నింటిలో సమానంగా ఉంటుంది, కానీ చూడటానికి అవి భిన్నంగా గోచరిస్తాయి. అయితే బాహ్యంగా అవి భిన్నంగా ఎందుకున్నాయి?ఆయా జీవుల సంచిత కర్మ ఫలాన్ని బట్టి జీవులు ఒకరికొకరు భిన్నంగా అనిపిస్తారు. ఆ దేహాలకు తగినట్లుగానే వాటి (వారి) లక్షణాలు ఉంటాయి. పులి మాంసం తింటుంది, పంది అమేద్యం తింటుంది. మనిషి రుచికరమైన ఆహారాన్ని తీసుకుంటాడు.జీవుల దేహ స్వభావమే అంత. ‘జీవి’ ఏ శరీరంలో ఉంటే దానికి ఆ లక్షణం వస్తుంది. ఇది సృష్టి ధర్మం. దీన్ని దేహ ప్రారబ్ధం అంటారు. దేహప్రారబ్ధ ఫలమే జన్మకు కారణం. ఈ దేహ ప్రారబ్ధమును అనుభవించకుండా ఎవరూ తప్పించుకోలేరు. అందుకే ప్రాణులు జనన మరణ చక్రంలో పడి తిరుగుతుంటాయి . కొన్ని కారణాలు కలిసి ఒక కార్యం జరుగుతుంది.మట్టిని సేకరించే పనినుండి,ఆ మట్టి నుండి కుండ తీసేవరకూ జరిగినదంతా కర్మే. కుండ ఏర్పడ్డాక , ఆ కుండను నిర్మించడానికి అవసరమైన ఏ కారణంతో ఆ కుండకు పనిలేదు. అంటే, కుండ ఏర్పడ్డంతోనే ఆ పని పూర్తయింది.

ఉత్తములు తమ కోరిక కి అనుగుణంగా, వారు మోక్షానికి వెళ్లి పోవడానికి, వారికి రాబోయే జన్మలన్నింటి కర్మలని ఇప్పుడే ఆనుగ్రహిస్తారు..

ఆత్మజ్ఞానం కలగాలంటే 3 మెట్లు ఎక్కాలి ...

1, భక్తి మార్గం,

2, కర్మ మార్గం,

3, జ్ఞాన మార్గం ...

ఈ ప్రయాణం లో, ముఖ్యంగా వైరాగ్యముతో, నిష్కామ ఖర్మలను ఆచరిస్తూ ఉండాలి. 

విపరీతంగా వ్యాధులు, అవమానాలు తిరస్కారాలు అప్పులు,ఇంట, బయట దుర్భరస్థితి ఏర్పడుతుంది.

మీరు గమనించవచ్చు...ప్రపంచం లో మహాత్ములందరికీ ఇదే స్థితి....

రమణ మహర్షి, రామకృష్ణ పరమహంస, జ్ఞానదేవ్ మహరాజ్, బుద్ధుడు, మీరాబాయి, వివేకానందుడు ... ఇలా ఎవరి చరిత్రలు చూసినా మనకు అర్థం అవుతుంది...

వీరంతా త్వరగా మోక్షం ఇప్పించు ప్రభు..అని వేడుకున్న వారే...

వీరు భగవంతుడిని నిరంతరం మనస్సులో నిలిపుకుని...

ఆవేదనలు అనుభవించారు, సక్కుబాయి

తుకారామ్ ,మీరా, ఎవరైనా ఇలాగే కర్మలు త్వరగా అనుభవించారు...

మీరు. "ఈ కష్టాలు బాధలు అనుభవించడం మా వల్ల కాదు " అన్నారో. మన జన్మల EMI లు పెరిగిపోతాయి. మహాత్ములు భక్తులు యోగులు ఎక్కువగా కష్టాలు పడటానికి కారణం ఇదే..