16, నవంబర్ 2020, సోమవారం

ధార్మికగీత - 80*

 *ధార్మికగీత - 80*

                                     


     *శ్లో:-  సూపం వినా భోజన మప్రశస్తం ౹*

             *యూపం వినా యాజన మప్రశస్తం ౹*

             *ధూపం వినా పూజన మప్రశస్తం ౹*

             *దీపం వినా మైధున మప్రశస్తమ్ ౹౹*



సూపము లేని భోజనము 

            చూడ  జగమ్మున నప్రశస్తమౌ 

యూపము లేని జన్నమిల

            యొప్పక శ్రేష్ఠత నప్రశస్తమౌ 

ధూపము లేని యర్చనము 

            దూష్యముయౌనుగ నప్రశస్తమై 

దీపము లేని మైథునము

            తీరుగ నుండదు యప్రశస్తమై

చరకమహర్షి

 చరకమహర్షి గర్భము మరియు గర్భలక్షణాల గురించి ఇచ్చిన వివరణ - 


     ఆయుర్వేద వైద్యులలో అగ్రగణ్యుడు చరకుడు . ఈయన మానవాళికి అందించిన అత్యద్భుత గ్రంథం " చరకసంహిత " 


        ఈ గ్రంథం 7 స్థానములతో అత్యద్భుతంగా లిఖించబడినది.  అవి 


  *  నిదానస్థానం .


  *  విమానస్థానం .


  *  శారీరస్థానం 


  *  ఇంద్రియస్థానం .


  *  కల్పస్థానం .


  *  సిద్ధిస్థానం . 


  *  చికిత్సాస్థానం .


           సూత్రస్థానం అనునది కూడా వీటిలో కలిసే ఉంటుంది. ఇందులో మీకు ఈ రోజు శారీరస్థానం గురించి వివరిస్తాను . ఈ శారీరస్థానంలో గర్భం అది ఏర్పడేవిధానం గురించి చాలా అత్యద్బుతంగా చరకుడు వివరించాడు . 


 గర్బం ఏర్పడేవిధానం - 


     పరిశుభ్రమైన శుక్రం కలిగిన పురుషునకు  పరిశుద్ధముగా ఉన్నటువంటి స్త్రీ యొక్క ఆర్తవం ప్రశస్తమైన ఋతుకాలం నందు సంయోగం చెంది ఎప్పుడు జీవుడు మనోగమనం పొందునో అప్పుడు గర్బం ఏర్పడును . 


  పిండమునకు ఎవరివలన యే విధమైన అవయవములు సంప్రాప్తినించును - 


    గర్బము తల్లివలన ఏర్పడును . గర్భస్థశిశువుకు తల్లి వలన చర్మము , రక్తము , మాంసము , మేధస్సు , నాభి , హృదయము , క్లోమము , కాలేయము , ప్లీహము , మూత్రపిండాలు , వస్తి , పురీషాశయం , ఆమాశయం , పక్వాశయం , గుద ప్రదేశం యొక్క ఊర్ధ్వ, అదో భాగములు చిన్నప్రేగులు , పెద్దప్రేగులు .


       ఇవన్ని తల్లివలన గర్భస్థ పిండముకు సంక్రమించును. 


      గర్బము తండ్రివలన కలుగును. కేశములు , మీసములు , గోళ్లు , రోమములు  దంతములు , ఎముకలు , సిరలు , స్నాయువులు , ధమనులు , శుక్రము అనునవి తండ్రి వలన కలుగును.


 పిండము ఆడ, మగ అనేవి నిర్ణయం జరుగు విధము - 


     మగవాడి యొక్క శుక్రం , స్త్రీ యొక్క ఆర్తవం కలిసినప్పుడు స్త్రీ యొక్క ఆర్తవం అధికంగా ఉండి మగవాని యొక్క శుక్రం తక్కువుగా ఉన్నచో వారికి తప్పకుండా ఆడ సంతానమే జనియించును.. అదేవిధంగా మగవాని శుక్రం ఎక్కువుగా ఉండి స్త్రీ యొక్క ఆర్తవం తక్కువుగా ఉన్నచో వారికి జనియించు సంతానం మగబిడ్డ అగును. శుక్రశోణిత సంయోగం నందు ఒక భాగం నందు ఆర్తవం ఒక భాగం నందు శుక్రం అధికం ఉండునట్లు శుక్రశోణితం రెండు భాగాలుగా విభజింపబడినచో ఒక ఆడ ,ఒక మగ సంతానం కలుగును. శుక్రం ఎక్కువుగా గల శుక్రశోణితం రెండు భాగాలుగా విభజన చెందినచో ఆ స్త్రీకి ఇద్దరు పుత్రులు జనియించెదరు . కొంతమందికి ఈ శుక్రశోణితం అనేక భాగాలుగా విభజన చెందును. దీనివలన ఒకేసారి అనేక మంది సంతానం జనియించును . ఇది కర్మవశమున జరుగును. 


 లక్షణాలని బట్టి పిండము ఆడ లేదా మగ అని తెలుసుకొనుట  - 


 * నోట నీరుకారుట.


 * శరీరం బరువుగా ఉండటం.


 *  శరీరం కృశించుట .


 *  బడలిక.


 * ఉత్సాహం లేకుండా ఉండటం.


 * హృదయము నందు భాధ .


 * తృప్తిగా ఉండటం.


      పైన చెప్పినవన్నీ మంచి గర్భమును సూచించు లక్షణాలు. 


  * ఎడమవైపు గల అవయవాలతో పనులు ఎక్కువ చేయుట .


 * గర్బము పొడుగు పెరుగుట.


 * ఎడమస్థనము నందు పాలు ఎక్కువుగా ఉత్పత్తి అగుట. 


   ఈ పై లక్షణములు కలిగిన స్త్రీ తప్పక ఆడ శిశువుని ప్రసవించును. ఈ లక్షణములు కు వ్యతిరేక లక్షణములు కలిగియున్నచో  

మగశిశువు జనియించును . ఈ రెండు లక్షణములు కలిగియున్నచో నపుంసకుడు జనియించును . 


         గర్భము కలుగు సమయమున స్త్రీ తన మనస్సు నందు ఎట్టి రూపమును తలచునో అట్టి రూపము గల సంతానం జనియించును . పూర్వజన్మ కర్మ వలన కూడా రూపం సంప్రాప్తించును. 


    గమనిక  -


           నాచే రచించబడిన "ఆయుర్వేద మూలికా రహస్యాలు " , " ప్రాచీన ఆయుర్వేద రహస్యాలు "  అను ఈ రెండు గ్రంథముల యందు అత్యంత రహస్యమైన సులభముగా ఇంటి యందు , చుట్టుపక్కల దొరికే మూలికలతోనే పెద్దపెద్ద రోగాలను నయం చేసుకొనే విధముగా అనేక వైద్య యోగాలను ఇచ్చాను. ఈ గ్రంథాలలో ఇచ్చినటువంటి యోగాలు అన్నియు గత 250 సంవత్సరాల నుంచి వంశపారంపర్యముగా మాకు వస్తున్న రహస్యయోగాలు పరోపకారార్థం దాచుకోకుండా ప్రచురించాను.


           మన చుట్టుపక్కల ఉండే మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల బొమ్మలతో మొక్కల చిత్రపటాలు ఇవ్వడం జరిగింది.


            రైతులకు ఉపయోగపడేవిధముగా చెట్లను , భూమిని బట్టి , రాళ్లని బట్టి భూమి యందు జలమును కనుగొను విధానం , ముహూర్తాలను అనుసరించి ఏయే సమయాలలో పంటలు వేయాలి . ఆయుర్వేద మూలికల సహాయముతో పురుగు మందులు వాడకుండా అత్యంత ఎక్కువ దిగుబడులు సాధించే రహస్య వృక్షయుర్వేద యోగాలు , పశువులకు సంబంధించిన వైద్య యోగాలు కూడా ఇవ్వడం జరిగింది . ఈ గ్రంథాలలో ఇచ్చిన యోగాలు ఉపయోగించటం వలన ఎటువంటి వ్యతిరేక ఫలితాలు రావు.


      ప్రాచీన ఆయుర్వేద రహస్యాలు గ్రంథం 288 పేజీలు ఉంటుంది . విలువ 350 రూపాయలు మాత్రమే . ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథం 384 పేజీలు ఉంటుంది . విలువ 450 రూపాయలు . కొరియర్ చార్జి 100  రూపాయలు అదనం .పుస్తకములు ఎక్కువ కాలం మన్నిక కొరకు కుట్టించి ఇవ్వడం మరియు అత్యంత నాణ్యమైన తెల్లటి 80GSM పేపరుతో ఉంటాయి.


            ఈ రెండు గ్రంథాలు కావలసినవారు డైరెక్టుగా 9885030034 నెంబర్ కి ఫోన్ చేయగలరు. కామెంట్లు , మెస్సేజెస్ సమాధానము ఇవ్వబడదు. కాల్ చేయగలరు .


                  కాళహస్తి వేంకటేశ్వరరావు 


                         9885030034 


               అనువంశిక ఆయుర్వేద వైద్యులు

ఇంద్రునికి

 పురాణాలలో ఇంద్రునికి తపస్సులు పాడుచెయ్యడం తప్ప మరొక పని లేదా?


కొన్ని కొన్ని పురాణాలకు వ్యాఖ్యానాలు రాసేవారు, మరికొన్ని విశ్లేషణలు చేసేవారు అనవసరంగా ఇంద్రుని తక్కువ చేసి రాస్తున్నారు. అసలు కొన్నింటికి ప్రతిపదార్ధం మాత్రం అనువాదం చేసి అక్కడ విషయాన్ని సరిగ్గా అందించక దేవతలలో ఉత్తముడిని పరమ లోలునికింద చూపుతారు. ఇక ఈ మధ్య వచ్చిన మాధ్యమాల వలన పాపం ఆయన అనవసరంగా అందరికీ లోకువ అయిపోయాడు. కేవలం ఇంద్రుడు అంటే మద్యం సేవించేవానిగా అప్సరసల నాట్యం తిలకించేవానిగా, పనికట్టుకుని ఎవరు తపస్సు చేస్తే వారి గురించి భయపడి వారిని చేడగొట్టే వానిగా ఇక మామూలు మానవులకు ఎన్ని అవలక్షణాలు ఉన్నాయో అవన్నీ ఆపాదించేసి దేవతలను తక్కువ చేసి చూపి మొత్తానికి మన హైందవ సంస్కృతి మీద మీ దేవుళ్ళు ఇలా అని దాడి చేస్తున్నారు. పూర్తిగా తర్కం తెలియని చాలా మంది హిందువులు అవును నిజం కాబోలు అని అనవసరంగా ఆయనను అలా చిత్రించేసుకున్నారు. అసలు ఈ ఇంద్రుడు ఎవరు, ఆయన బాధ్యతలు ఏమిటి, కొన్ని సార్లు ఎందుకు విపరీతంగా ఆయన నడిచారో తార్కికంగా చర్చించుకుందాము.


ఇంద్రుడు అన్నది ఒకరు కాదు, అది ఒక పదవి. మనమున్న కల్పంలో  వైవస్వత మన్వంతరంలో ఉన్న ఇంద్రుడు వాసవుడు, అదితి పుత్రుడు. ఈయన దేవతలకు అధిపతి. మనకున్న సమయాలను బట్టి ఆయన ఆయుర్దాయం ఒకసారి లెక్కకడితే 

1 మానవ సంవత్సరం = దేవతలకు ఒక అహోరాత్రం ( పగలు + రాత్రి )

360 దేవ అహోరాత్రాలు = 1 దేవతల సంవత్సరం ( 360 మానవ సంవత్సరాలు )

12000 దేవవత్సరాలు = 1 చాతుర్యుగం ( 12,000 * 360 = 43,20,000 మానవ సంవత్సరాలు)

(4800 దేవవత్సరాల సత్య యుగం + 3600 దేవవత్సరాల త్రేతాయుగం + 2400 దేవవత్సరాల ద్వాపరం + 1200 దేవవత్సరాల కలియుగం )

71 చాతుర్యుగాలు = 1 మన్వంతరం ( 1 మనువు ఆయుష్షు ) (30,67,20,000 మానవ సంవత్సరాలు ) 

14 మన్వంతరాలు = 1 కల్పం (429,40,80,000 మానవ సంవత్సరాలు ) – ఇది ఒక ఇంద్రుని ఆయుష్షు = బ్రహ్మకు ఒక పగలు.

కాబట్టి మనవంటి వారిలా ఆయనను లెక్క కట్టడం మన మూర్ఖత్వం.  ( మనం ఒక ఈగ తరపున ఆలోచించాము అనుకోండి, అది బ్రతికే 28 రోజుల వ్యవధికి మన ఆయుర్దాయం చాలా ఏళ్ళగా అనిపిస్తుంది )


ఒకరు ఇంద్రపదవి అధిష్టించాలి అంటే వారు 100 అశ్వమేధ యాగాలు చెయ్యాలి. ఇదేదో ఆషామాషీ వ్యవహారం కాదు. ఒక్క అశ్వమేధ యాగం అంటే అశ్వంలా పరుగులు పెట్టె తన ఇంద్రియాలను అదుపులో పెట్టుకుని ఎంతో శ్రద్ధగా క్రతువును నిర్వహించి తనకున్న సొమ్మును అంతా చాతుర్వర్ణ ప్రజలకు దానం చేసి దేవతలను సంప్రీతులను చెయ్యాలి. మరల సంపాదించి మరొక యాగం చెయ్యాలి. అంటే ఎన్ని సంవత్సరాలు తపస్సో ఒక్కసారి చెయ్యండి. ఈ యాగం చేసిన సంవత్సరం పొడుగునా ఏకభుక్తం, మరెన్నో నియమాలు ఉంటాయి.ఇవన్నీ పాటించాలి అంటే ఎంతో ఇంద్రియనిగ్రహం ఉండాలి, ఎంతో సాధన ఉండాలి, ఎంతో త్యాగం చెయ్యాలి. ఈ ప్రయాణంలో ఎన్నో ఆటంకాలు ఎదురవ్వవచ్చు, ఎన్నో అవరోధాలు కల్పింపబడతాయి. వాటిని ఎంతో ధైర్యంగా అధిగమించి, సాధన చేసి ఆ పదవికి యోగ్యత సాధిస్తారు. వారికి దేవతల రాజుగా ఉండే అదృష్టం దక్కుతుంది. ఎంతో తపస్సు చేస్తే తప్ప సాధ్యం కాదు. భూలోకానికి కావలసిన వర్షం, మనుగడకు కావలసిన సౌకర్యాలు కల్పించడం ఆయన కర్తవ్యం. ఎంతో ప్రేమ, దయ వుంటే తప్ప ఆ పదవికి అర్హులు కారు. 


ప్రతీ యుగంలో ఎందరో సాధన చేస్తూ ఉంటారు. వారిని పరీక్షించి వారిని మరింత ఉన్నతికి చేరువగా చేర్చడం ఆయన కర్తవ్యం. తపస్సు అందరూ చేస్తారు, దేవతలు, రాక్షసులు కూడా. దైవాన్ని చేరుకునె తపస్సు సాత్వికం, పరపీడనా పరాయణులు చేసే తపస్సు తామసికం. వారికి వరాలు అందితే చేసేది అందరినీ పీడించడం. ఆయనకు ఈ లోకాలను కాపాడవలసిన బాధ్యత వుంది కావున ఆయన ఎవరి తపస్సు ఎటువంటిదో అని పరీక్షిస్తూ ఉంటాడు. వారికి ఎటువంటి లౌల్యం ఉందొ ఆ తపస్సు మానడం వలన వారికి తెలిసి వచ్చి దానిని అధిగమించి మరింత పురోగామిస్తారు. ఉదాహరణకు విశ్వామిత్రుని తపోభంగం వలన ఆయనకు తన తప్పు తెలిసివచ్చి మరింత కృషి చేసి బ్రహ్మర్షి అయ్యాడు. కొందరు ఆ పరీక్షలలో లౌల్యానికి గురయ్యి పతనం చెందితే నూటికో కోటికో ఒకరు దాన్ని దాటి పురోగమించారు. ఆయన విశ్వపాలనాధికారి అయిన విష్ణువు యొక్క ఆదేశం మేరకు తన కర్తవ్యం నిర్వహిస్తాడు తప్ప అందులో ఆయన తప్పు ఉండదు. కానీ దేహదారికి కనుక అప్పుడప్పుడు దైవాపరాధాలు జరిగి వెంటనే సరిదిద్దబడతాయి. ఉదాహరణకు శ్రీకృష్ణుడు కూడా భూలోకంలో దేహంతో ఉన్నందున భూలోక వాసుల మీద ఆయన అధికారం ఉంది కనుక ఆయనను ఇబ్బందిపెట్టబోయి తన తప్పు తెలుసుకుని ఆయన పాదాలు పట్టాడు. 


ఆయన మనకు ఉన్న ప్రభువు. సకాలంలో వర్షాలు కురిపించి, సరైన వాతావరణం చేకూర్చి పంటలు పండి యజ్ఞయాగాలు నిర్విఘ్నంగా జరిపించాలి అన్నది ఆయన కర్తవ్యం. ఆ కర్తవ్య నిర్వహణలో కొందరు వారి కర్మానుసారం ఆయన పరీక్షలకు లోనయి తత్ఫలితాలు అనుభవిస్తారు. ఉదాహరణకు అహల్య ఇంద్రుని మీద ఎప్పటినుండో మనసు పడి దేవతల నాయకుడు అయిన ఆయన మీద మనస్సు ఉండి పెళ్ళయి కూడా పరుని మీద వ్యామోహం ఉన్నది కావున గౌతముని వలన సరిదిద్దబడాలి అని ఆయన నాటకంలో భాగం అయ్యాడు, లేకపోతే మనుషులు ఎక్కడ దేవతలు ఎక్కడ వారి దేహాలు ఏమిటి మనుష్యుల దేహాలు ఏమిటి, మనుష్యుల దేహం మీద వారికి మోహం ఏమిటి ఒకసారి ఆలోచించండి? ఇక తపస్సు చేసే వారు నిజంగా వేటిని పట్టించుకోక కేవలం తమ ఏకాగ్రత తపించే మంత్రం మీద వున్నదా, ఆ దేవతాశక్తి మీద ఉన్నదా అని తెలుసుకోవడం కోసం కొన్ని వ్యతిరిక్త పరిస్థితులను కల్పించి వారికి సహాయం చేస్తూ ఉంటాడు. 


అలాగే వారికి వారి తత్త్వపరిశోధనలో ఆయన సహాయం అర్ధిస్తే అది ఇస్తారు. ఉదాహరణకు భరద్వాజ మహర్షి వేదం మొత్తం చదవాలని ఎంతో కోరిక మేర తపస్సు చేసి ఇంద్రుని వలన మూడు సార్లు వెయ్యి వెయ్యి సంవత్సరాల ఆయుర్దాయం పెంపొందించుకుని వేదసారాన్ని అభ్యసిస్తూ ఉంటారు. చివరకు ఇంద్రుడే ఆయనముందు ప్రత్యక్షమై నాయనా నీవు ఈ మూడు వేల సంవత్సరాలలో చదివింది ఇది అని మూడు కొండల నుండి మూడు గుప్పెళ్ళ మట్టి ఇచ్చి, నువ్వు నేర్చుకున్నది ఇంత, తెలుసుకోవలసినది మరి ఎంతో చూడు అని ఆయనకు దిశానిర్దేశం చేస్తారు. ఇలా చెప్పుకోవాలంటే ఎన్నో ఆయన మహిమలు ఉన్నాయి. ఋగ్వేదంలో ఇంద్రుని పరమపురుషుని ప్రతినిధిగా పొగుడుతూ ఆయనే దేవుడు అని చెప్పే ఎన్నో ఋక్కులు ఉన్నాయి. 


రాబోయే కల్పానికి ఇంద్రుడు బలిచక్రవర్తి. ఆయనను స్వయంగా విష్ణువే అనుగ్రహించి త్రివిక్రమావతారంలో ఆయనను పాతాళానికి పంపి అక్కడ ఆయన చేస్తున్న తపస్సుకు ప్రత్యక్ష్యంగా ఆయనే కాపు కాస్తున్నాడు. ఆయనకు ఉన్న అహంకారాన్ని తీసేసి ఆయనను ఇంద్రపదవికి అర్హత సంపాదించేలా ఆయనను ఈ దేవ దానవ గొడవలనుండి దూరం చేసి, తపస్సు మీద మనస్సు లగ్నం చేసే విధంగా పరిస్థితి కల్పించి నేర్పుతున్నాడు స్వయానా విష్ణువు. ఇప్పటి వాసవుడు కూడా ఇతఃపూర్వం అంతటి తపస్సు చేసి పరబ్రహ్మ అనుగ్రహం సంపాదించినవాడే కదా. భగవద్గీతలో శ్రీకృష్ణుడు దేవతలు, మానవులు ఒకరికి ఒకరు సహాయకారిగా సృష్టిలో ఉండాలని ఆయన శాసనమని తెలియచేస్తాడు. ఆయన అంశతో ఉన్నవాడే రాజు కాగలడు, అటువంటి సూక్ష్మమైన అంశ కలిగిన ఇంద్రుడు సాక్షాత్తు మనకు మాననీయుడు. సదా మనల్ని అనుగ్రహించే పరమ మిత్రుడు. కావున ఆయనను మనం మన స్వామి ప్రతినిధిగా గౌరవించి పూజించాలి తప్ప తక్కువ ఆలోచనలు కూడదు.

Divali











 

Jai hind














 

Singer









 

రుద్రం-నమకం-చమకం

 రుద్రం-నమకం-చమకం


మనము నిత్యమూ ఆ పరమ శివుని దివ్య మంగళ లింగ రూపమునకు అభిషేకాదులు భక్తితో నిర్వహిస్తూ ఉంటాము. నమక చమకములతో, ఉదాత్తానుదాత్త స్వరితాలతో భక్తి పారవశ్యంతో కొలుస్తూ ఉంటాము. ఐతే మనం చేసే అభిషేకంలో చెప్పే మంత్రార్థం మాత్రం తెలియకుండా అభిషేకము చేయడంకంటే ఆ మంత్రార్థము తెలిసి అభిషేకము చేసినట్లైతే ఒక్క శాతం ఫలము పొందే స్థానంలో వంద శాతం ఫలాన్ని పొందగలం.

యదధీత మవిజ్ఞాతం నిగదేనైవ శబ్ధ్యతే

అనాగ్నావివ శుష్కేంధౌ నతజ్జలతి కర్హిచిత్.


తాత్పర్యము:- చదివిన దానికి తప్పక ఆర్థము తెలుసుకొన వలయును. జప మంత్రములకు జప కాలములో అర్థభావన చేయవలయును. అర్థము తెలియని అక్షర జపము వలన అగ్ని లేని ఎండు కట్టెలు వలె అది జ్వలించదు. అనే ఆర్యుల అభిప్రాయంలో ఎంతో ఔచిత్యం ఉంది.


🌹 రుద్ర నమకము - చమకము - భావము మీకు తెలుసా? 🌹*

 *భాగము 2


రుద్రము - నమకము


🌻 అనువాకము 1 - 1🌻


దీనిలో మొత్తం 15 మంత్రములు కలవు.


1వ మంత్రము.


 నమస్తే రుద్రమన్యవ ఉతోత ఇషవే నమః.

నమస్తే అస్తు ధన్వనే బాహుభ్యాముత తేనమః.


ఓ రుద్రుఁడా! నీ కోపమునకు నమస్కారము. నీ కోపము నా బాహ్యాంతశ్శత్రువులపైన ప్రవర్తించును గాక. (నన్ను బాహ్యాంతశ్సత్రుహీనునిగా చేయుదువు గాక అని భావము) అంతే కాదు. నీ బాణమునకు, ధనుస్సునకు ధనుర్బాణ సహితములైన నీ బాహువులకు ఇదే నా నమస్కారము.*


*2వ మంత్రము.*


**యాత ఇషుః శ్శివతమా శివం బభూవ తే ధనుః**

శివాశరవ్యా యా తవ తయానో రుద్ర మృడయ.


ఓ రుద్రుఁడా! నీ యీ శరము చాలా శాంతమైనదాయెను. నీ ధనుస్సు శాంతమైనదాయెను. నీ యమ్ములపొది శాంతమైనదాయెను. కావున శాంతించిన శరీరము తోడను, అమ్ములపొది తోడను మమ్ములను సుఖపరచుము.


3వ మంత్రము.


యాతే రుద్ర శివా తనూః అఘోరా పాపకాశినీ.

తయా నస్తనువా శంతమయా గిరిశంతాభిచా కశీహి.


ఓ రుద్రుఁడా! మమ్ములను అనుగ్రహించు నీ శివ యను శరీరము మా పట్ల అఘోరమై యుండును గాక. ఆ నీశరీరము మా పట్ల హింసారూపమైన అనిష్టమును ప్రకాశింప జేయకుండును గాక.(ఇట పాపమనగా హింసా రూపమగు అనిష్టము) ఓ పరమ శివా నీ శరీరము మమ్ములను స్వయముగా హింసింప కుండుటయే కాదు. పరుల వలన యే అనిష్టము కలుగ నీయక కాపాడ వలయును. మమ్ములనెవరును హింసింపకుండ కాపాడవలెను. మాకేపాపములు అంటనీయక కాపాడవలెను. మాలోనేవేని పాపములు, లోపములు ఉన్నచో తొలగింపుము. వానిని బహిర్గతములు కానీయకుము, అని మేము నిన్ను ప్రార్థించు చున్నాము.


4వ మంత్రము.


యామిషుం గిరిశంత హస్తే బిభర్ష్యస్తవే

శివాం గిరిత్ర తాం కురు

 మా హిగ్ంసీః పురుషం జగత్.


ఓ గిరిశంత! రుద్ర! వైరులపై చిమ్ముటకు నీవు చేత బాణములను దాల్చితివి. కైలాస గిరిని పాలించు ఓ రుద్రుఁడా! శత్రువులను శిక్షించుటకు చేత దాల్చిన నీ యా బాణమును మాపై చిమ్మక, దానిని శాంతము కలదిగ నుంచుము. పురుషులమగు మమ్ములను, మనుష్య వ్యతిరిక్తమై స్థావర జంగమములతో నిండిన యే జగత్తును హింసింపకుము తండ్రీ! అని ప్రార్థించెను.


5వ మంత్రము.


శివేనవచసాత్వా గిరిశాచ్ఛా వదామసి.

యధానః స్సర్వమిజ్జగత్  

అయక్ష్మగ్ం సుమనా అసత్.


మహా శివా! నీవు కైలాసమున నివసించు చున్నావు. నిన్ను జేరుటకు మంగళకరమైన స్తుతు లొనర్చుచు ప్రార్థించుచున్నాను. మాదగు ఈ సర్వ జగత్తు మనుష్య పశ్వాది జంగమములతో నిండి యున్నది. ఈ జంగమ ప్రపంచము నిరోగమై సౌమనస్య సంపన్నమగులట్లు గావింపుము తండ్రీ!


6వ మంత్రము.


అధ్యవోచ దధివక్తా ప్రథమోదైవ్యోభిషక్.

అహీగ్ంశ్చ సర్వాన్ జంభయన్ సర్వాశ్చ యాతు ధాన్యః


మహాదేవా! మాయందరిలో నీతడే యధికుఁడని నిన్నుద్దేశించి చెప్పుటచే నీవే అధివక్తవైతివి. దేవతలలో నీవే ప్రథముఁడవు, ముఖ్యుఁడవు కదా! నీవు దైవ్యుఁడవు(దేవతలనెల్లస్వయముగా పాలింప సమర్థుఁడవు) నిన్ను దలంచి నంతనే సర్వ రోగములును ఉపశమించును. కాన నీవు చికిత్సకుఁడవు. సర్వ సర్పములను, వ్యాఘ్రాదులను, సర్వ రాక్షసులను నశింపజేయువాఁడవు కదా! కావున మమ్ములను కాపాడుము తండ్రీ!


7వ మంత్రము.


అసౌయస్తామ్రో అరుణ ఉత బభ్రుః సుమంగళః.

యేచేమాగ్ం రుద్రా అభితో దిక్షుః శ్రితాస్సహస్రశోవైషాగ్ం హేడఈమహే.


ఏ రుద్రుఁడు ఈ మండలస్థాదిత్య రూపుఁడో అతఁడు ఉదయ కాలమున అత్యంత రక్త వర్ణుఁడాయెను. ఉదయాత్పూర్వము ఇంచుకంత రక్త వర్ణుఁడాయెను. అంతే కాదు ఉదయానంతర కాలమున పింగళ వర్ణుఁడాయెను.ఆయా కాలములందు అతనిలో మిగిలిన వర్ణములు కలవు. అంధకారాదులను నివారించుటచే అత్యంత మంగళ స్వరూపుఁడాయెను. కిరణ రూపులైన ఏ యితర రుద్రులు ఈ భూమిపై నంతటను, తూర్పు మున్నగు దిక్కులందును, వ్యాపించి యున్నారో వారునూ సహస్ర సంఖ్యాకులై కలరు. సూర్య రూపులును, సూర్య రశ్మి రూపులును అగు ఈ రుద్రులకు అందఱకును ఏ క్రోధ సదృశమైన తీక్షణత్వము కలదో దానిని భక్తి నమస్కారాదులతో నివారించు చున్నారము.

                 

8వ మంత్రము.


అసౌయో உవసర్పతి నీలగ్రీవో విలోహితః.

ఉతైనం గోపా అదృశన్

 అదృశన్ను దహార్యః.

ఉతైనంవిశ్వాభూతాని సదృష్టో మృడయాతినః. 


ఏ రుద్రుఁడు కాల కూటమను విషము దాల్చుటచే నీలగ్రీవము కలిగి యుండెనో, అట్టి ఈతఁడు విశేషమైన రక్త వర్ణము కలవాడై, మండల వర్తియై, ఉదయాస్తమయ సంపాదకుడై ప్రవర్తించుచున్నాఁడు. అంతే కాదు. వేద శాస్త్ర సంస్కార హీను లైన గోపాలురు కూడ ఈ ఆదిత్య రూపుఁడై మండలమున గల రుద్రుని చూచుచున్నారు. నీరమును గొనివచ్చు వనితలును ఈ రుద్రుని చూచుచున్నారు. అంతే కాదు ఆదిత్య రూపుఁడగు ఈ రుద్రుని గోవులు, బఱ్ఱెలు మున్నగు సకల ప్రాణులును చూచుచున్నవి. వేద శాస్త్రజ్ఞుల చేతను, వేదశాస్త్రములు తెలియని వారిచేతను, పశుపక్ష్యాదుల చేతను చూడ బడువాఁడైన రుద్రుఁడు మమ్ములను సుఖ వంతులనుగా చేయును గాక.


9వ మంత్రము.


నమో అస్తు నీలగ్రీవాయ సహస్రాక్షాయ మీఢుషే

అధోయే అస్య సత్వానో உహం తేభ్యోకరం నమః.


తాత్పర్యము : ఇంద్ర మూర్తి ధారణచే వేయి కన్నులవాఁడైన శివునకు నమస్కార మగును గాక. ఫర్జన్య రూప ధారియై, వృష్టి కర్తయై సుఖమొసగు శివునకు నమస్కారము. అంతే కాదు. ఏవి ఈ రుద్రుని యొక్క భృత్య రూపములైన ప్రాణులు కలవో వానికి నేను నమస్కారము చేయుచున్నాను.


10వ మంత్రము.


ప్రముంచధన్వ నస్త్వం ఉభయోరార్త్నియోర్జ్యాం*

*యాశ్చతే హస్త ఇషవః. పరాతా భగవోవప.


ఓ భగవంతుఁడా! నీవు పూజా వంతుఁడవు. మహదైశ్వర్య సంపన్నుఁడవు. ఓ రుద్రా! నీవు నీ ధనుస్సున రెండు చివరలకు కట్టిన త్రాటిని విడువుము. విప్పివేయుము. నీ చేతనున్న బాణములను విడిచిపెట్టుము. మాపై విడువకు తండ్రీ!*


11వ మంత్రము.


అవతత్యధనుస్త్వగ్ం

  సహస్రాక్ష శతేషుధే.

నిశీర్య శల్యానాంముఖా శివోనఃస్సుమనాభవ.


ఇంద్ర రూపుఁడవైన ఓ రుద్రుఁడా! వందల కొలదీ అమ్ములపొదులు కలవాఁడా! ధనుస్సును దించి, బాణముల యొక్క ముఖములను అంప పొదులలో నుంచి, మా పట్ల అనుగ్రహ యుక్తుఁడవై శాంతుఁడవు కమ్ము.


12వ మంత్రము.


విజ్యంధనుః కపర్దినో విశల్యోబాణవాగ్ం ఉత

అనేశన్నస్యేషవ ఆభురస్య నిషంగధిః.


జటాజూటము గల శివుని యొక్క ధనుస్సు విగతమైన వింటి త్రాడు కలది యగు గాక. అంతే కాదు. నీ యొక్క బాణములు గల అంప పొది బాణములు లేనిది అగు గాక. ఈ రుద్రుని యొక్క బాణములు అంప పొదిలో నుండుటచే చంపుట కసమర్ధములు అగుగాక. ఈ రుద్రుని యొక్క అంప పొది బాణ వహన మనెడి చిన్న పని చేయుటకు మాత్రమే సమర్ధము అగు గాక. కత్తులు దాచు ఒర కత్తులు మోయుటకు మాత్రమే సమర్ధమగు గాక.


13వ మంత్రము.


యాతే హేతిర్మీఢుష్టమ

 హస్తే బభూవతే ధనుః

తయాస్మాన్ విశ్వత

స్త్వమ యక్ష్మయా పరిబ్భుజ.


అందరి కోరికలను అధికముగా తీర్చే ఓ శివుఁడా! ఏ నీ ఆయుధము ఖడ్గాది రూపమున కలదో, నీ యొక్క చేతియందు ఏ ధనుస్సు కలదో, నీవు ఉపద్రవములు కావింపని ఆ ఆయుధముచే, ఆ ధనుస్సుచే, మమ్ములను అంతటను అన్ని విధములా పరిపాలింపుము.


14వ మంత్రము.


నమస్తే అస్త్వాయుథాయా உ

అనాతతాయ ధృష్ణవే

ఉభాభ్యాముతతే నమో 

బాహుభ్యాం తవ ధన్వనే.


ఓ రుద్రుఁడా! ధనుస్సున బంధింప బడని కారణమున ప్రసరింపఁ జేయఁ బడినట్టియు, స్వరూపము చేతనే చంప సమర్ధమైనట్టి నీ యొక్క ఆయుధమునకు నమస్కార మగు గాక. అంతే కాదు నీయొక్క రెండు భుజములకు నమస్కారము అగు గాక. నీ యొక్క ధనుస్సునకు నమస్కార మగు గాక.


15వ మంత్రము.


పరితే ధన్వనో హేతిః

అస్మాన్ వృణక్తు విశ్వతః.

అథోయ ఇషుధిః

స్తవా உరే అస్మన్నిధేహితం.


ఓ శివుఁడా! నీధనుస్సునకు బాణాది రూపమైన ఆయుధము మమ్ములను అన్ని విధముల విడుచును గాక. అంతే కాదు. నీ యొక్క ఏ అంప పొది కలదో దానిని మా కంటె దూరముగా ఉంచుము.


అనువాకము 1 సమాప్తము.


సశేషం...

             ....

🙏🙏🙏

సేకరణ

శ్రీ సత్యనారాయణ వ్రత మహాత్మ్యము

 శ్రీ సత్యనారాయణ వ్రత మహాత్మ్యము


క. నారద సంయమి యంతట 

    నారాయణు నెదుట నిలిచి నతమస్తకుడై 

    ధారాళ మైన నుడులతొ 

    యీ రీతిగ ప్రస్తుతించె యీప్సిత మదితోన్ 8


ద్వి. "శ్రీకరా !శుభకరా !శ్రీచిద్విలాస!

        శ్రీ లక్ష్మి సంసీవ్య ! శ్రీ వత్స చిహ్న ! 

        కామితార్థ ప్రదాత ! కౌస్తుభ భూష !

        వాసుదేవా ! హరీ ! వైకుంఠ వాస !

        శంఖ గదా చక్ర శార్ఙ్గ సంకాశ !

        యభయ వరద హస్త యాస్రితపోష !

        దేవదేవ ! వరద ! దివ్య ! జీవాత్మ !

        దేవవంద్య ! వినుత ! తేజితదేహ !

        పరమపురుష ! విష్ణు ! పావననామ !

        జయము నారాయణా ! జగదీశ ! విష్ణు !

        మాధవా ! కేశవా ! మధుకైటబారి !

        శ్రీధరా !గోవింద! శ్రీహృషీకేశ !

        వాసుదేవా ! హరే ! వామన ! విష్ణు ! 

        యనిరుద్ధ ! ప్రద్యుమ్న ! యచ్యుతా ! దేవ !

        నారాయణా ! విష్ణు ! నళినాయ తాక్ష !

        పురుషోత్తమా ! దివ్య ! పుండరీకాక్ష !

        పాహిమాం పాహిమాం పరమాత్మ! దేవ !

        గో విప్ర రక్షకా ! గురుమీన రూప !

        కౌస్తుభ మణిహార ! కచ్ఛప రూప !

        గోపాల పాలకా ! క్రోడంబ రూప !

        నారాయణా ! హరీ ! నరహరి రూప !

        వందిత విక్రమా ! వామన రూప !

        పృధివీశబలహరా ! భృగురామ రూప !

        రాజీవలోచనా ! రఘురామ రూప !

        పాలితయాదవా !బలరామ రూప !

        శ్రీచిద్విలాస యో శ్రీకృష్ణ రూప !

        వినుతింతు మనసార విష్ణు స్వరూప !

        కామితార్థప్రదాత !కరుణించు మమ్ము 

        జయమునారాయణా ! జయము యో దేవ !" 9


క. సురముని నారదు స్తుతులను 

    సిరినాథుడు విష్ణు వినియు స్థిఱ నగవులతోన్ 

    పరికించుచు యాతని గని 

    కరుణతొ యిట్లనియెనపుడు కడుశాంతమునన్ 10


✍️ గోపాలుని మధుసూదన రావు 🙏

ధార్మికగీత - 82*

 🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲

                          *ధార్మికగీత - 82*

                                    *****

     *శ్లో:- రాజవత్ పంచ వర్షాణి ౹*

            *దశ వర్షాణి దాసవత్ ౹*

            *ప్రాప్తే తు షోడశే వర్షే ౹*

            *పుత్రం మిత్రవ దాచరేత్ ౹౹*

                                 *****

*భా:- సంస్కృతిలో అపురూప దాంపత్య ఫలాలు బిడ్డలు.వారే వంశాభివృద్ధికి,సమున్నతికి కారకులు. అట్టి బిడ్డల పెంపకంలో మూడు కీలక దశలు గమనించాలి. 1. "రాజవత్":- బిడ్డని ఐదేండ్ల(1-5) వరకు రాచమర్యాదలతో ఆలనా, పాలనా చేయవచ్చు. అతడు కోరిందే తడవుగా అచ్చట,ముచ్చట తీర్చవచ్చు. లాలించి,బుజ్జగించి ముద్దులొలికే పలుకులు, చిలిపి పనులతో మురిసిపోవచ్చు. మహారాజులా పెంచి పోషించవచ్చు. 2. "దాసవత్":- పదేండ్లపాటు (6-15) అతనిని "చక్కని నగ తయారీకి బంగారపు కడ్డీని సుతారంగా సుత్తె దెబ్బలతో మలిచినట్లుగా", క్రమశిక్షణ గరపుతూ, విద్యాబుద్ధులతో పాటు దైవప్రీతి, పాపభీతి,సంఘనీతి,మర్యాద,మన్నన, నయము,వినయములలో, సామదానభేదదండోపాయాలతో సుశిక్షణ నిచ్చి తీర్చిదిద్దాలి. ఈ దశలో ఒక సేవక భావనతో కఠినంగా వ్యవహరించాలి. 3."మిత్రవత్" :- బిడ్డకి పదహారో యేడు వచ్చీ రాగానే, అతణ్ణి వర్ధమాన పౌరునిగా గుర్తించాలి. మిత్రునిగా భావించాలి. ప్రియమిత్రుని వలె ఆదరంతో మన్ననగా అడిగి పనులు చేయించుకోవాలి. అతని పనులలో మనం చేయూత అందించి ప్రోత్సహించాలి. అప్పుడే వారి మదిలో,హృదిలో మనపై ప్రేమ,నమ్మకము,పెద్దరికం, ఆదరణ బలపడతాయి. ఆ పవిత్రబంధం కడదాకా పెనవేసుకుపోతుంది. "పుత్రాత్ ఇచ్ఛేత్ పరాజయం" అన్నట్టుగా బిడ్డని మంచిగా, తన కన్నా మిన్నగా తీర్చిద్దిద్ది, అతని చేతిలో ఓటమిని మనసారా కోరుకోగలిగినవాడే నిజమైన తండ్రి యని సారాంశము*.

                                  *****

                   *సమర్పణ : పీసపాటి*

🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲

శివానందలహారీ

 🙏శివానందలహారీ🙏



కరస్థే హేమాద్రౌ గిరిశ నికటస్థే ధనపతౌ 

గృహస్థే స్వర్భూజామరసురభి చింతామణి గణే

శిరస్థే శీతాంశౌ చరణయుగళస్థే2ఖిలశుభే

కిమర్థ : దాస్యే2హం భవతు భవదర్థ0 మమ మనః



పరమేశ ! నీ చేత బంగారు కొండుండె

          దాపులో నీ కడ ధనదుడుండె

కల్పకతరువుండె కామధేనువు నుండె

         చింతామణుండె నీ చెంత లోనె

శీత శుభ్రా0శుండు శిరముపై శోభిల్లె

         చరణ యుగళి చెంత సకల ముండె

సర్వ మంగళ నిధులు నీ సన్నిధు0డె 

యీశ్వరా ! యింక నేనేమి యీయ గలను ?

నిరత పరవశ భక్తితో నిన్ను గొలుచు

చిత్త మర్పణ సేతును స్వీకరించు           27 #



సారూప్యం తవపూజనే , శివ ! మహాదేవేతిసంకీర్తనే 

సామీప్యం శివభక్తి ధుర్య జనతా సాంగత్య సంభాషణే

సాలోక్యం చ చరాచరాత్మక తనుధ్యానే భవానీపతే !

సాయుజ్యం మమ సిద్ధ మత్ర భవతి స్వామిన్ ! 

కృతార్థో2స్మ్యహమ్ 



శంకరా ! భవదీయ సత్పూజనములతో

         సారూప్య ముదయించె సత్వరముగ

శివ మహాదేవంచు స్థిరముగా కీర్తించ

         సామీప్య ముదయించె సత్వరముగ 

సహ భక్త సాంగత్య సంభాషణంబున

         సాలోక్య ముదయించె సత్వరముగ

సకల చరాచర సధ్యాన ఫలముగా

         సాయుజ్య ముదయించె సత్వరముగ

ఈశ ! సర్వాను భవములీ యిహమునందె

భవ్యమౌ నీదు కరుణతో ప్రాప్త మయ్యె

నిండు మనమున కృతార్థుండ నైతి

భవము ధన్యత నొందెను పార్వతీశ !       28 #



✍️గోపాలుని మధుసూదన రావు 🙏

దుర్గా సప్తశతి - 9 /

 *🌹. శ్రీ దేవీ మహత్యము - దుర్గా సప్తశతి - 9 / Sri Devi Mahatyam - Durga Saptasati - 9 🌹*

✍️. మల్లికార్జున శర్మ 

📚. ప్రసాద్ భరద్వాజ 


*అధ్యాయము 2*

*🌻. మహిషాసుర సైన్యవధ - 3 🌻*


దేవతలు, ఋషులు తనను కొనియాడుచుండగా, ఆయాస లక్షణాలు ఏమీ లేని ముఖంతో, ఈశ్వరి అసుర దేహాలపై తన శస్త్రాస్త్రాలను ప్రయోగించింది. 


దేవి వాహనమైన సింహం కూడా కోపంతో జూలు విదుర్చుచు అరణ్యంలో కార్చిచ్చువలె అసురసైన్యంలో సంచరించింది. యుద్ధం చేస్తూ దేవి విడిచే నిట్టూర్పులు వెంటనే నూర్లకొలది, వేలకొలది ఆమె సైన్యగణంగా రూపొందుచున్నాయి. 


దేవి శక్తిచే అభివృద్ధి నొందుతున్న ఉత్సాహంతో ఈ సైన్యం గండ్రగొడ్డళ్ళతో, గుదియులతో,

అడ్డకత్తులతో తాకి అసురగణాలను నాశమొనర్చెను. ఈ సైన్యంలో కొందఱు ఆ యుద్ధమహోత్సవంలో తప్పెటలు కొట్టారు; కొందరు శంఖాలు ఊదారు. (50-54)


మణికొందఱు మృదంగం వాయించారు. అంతట దేవి తన త్రిశూలంతో, గదతో, బల్లెంలు కురిపించడంతో, ఖడ్గాదులతో నలకడంచేత, నూర్లకొలది మహాసురులను వధించింది. కొందఱిని తన ఘంటానినాదంతో అవశులైన వారిని పడద్రోసింది. ఇతరులను తన పాశంతో బంధించి నేలపై ఈడ్చింది. కొందఱు తీక్ష్మమైన ఆమె ఖడ్గపు వ్రేటులచే రెండుగా నఱకబడ్డారు. 


ఇతరులు తీవ్రమైన ఆమె గదదెబ్బలు తిని భూమిపై పడిపోయారు. మరికొందరు ఆమె రొకటిపోటులతో

తీవ్రంగా గాయపడి నెత్తురు కక్కుకున్నారు. కొందరి వక్షం ఆమె త్రిశూల పోటుచే భిన్నమవడంతో భూమిపై పడిపోయారు. (55-59)


కొందరు సురవైరులు ఎడతెగక గ్రుచ్చుకొంటున్న బాణసమూహంచే ముళ్ళపందులను పోలి రణాంగణంలో ప్రాణాలు వదిలారు. కొందరి బాహువులు, కొందరి కంఠాలు తెగిపోయాయి. కొందరి శిరస్సులు నేలపై దొర్లాడాయి. కొందరి నడుములు ఖండింపబడ్డాయి. కొందరు మహాసురులు పిక్కలు తెగిపోవడంతో భూమిపై కూలారు. (60-61)


ఒకే చేయి, ఒకే కన్ను, ఒకే కాలు నిలిచి ఉన్న కొందరిని దేవి మరల రెండు ముక్కలుగా ఖండించింది. మరికొందరు శిరస్సులు ఛేదింపబడి పడిపోయి మళ్ళీ లేచారు. (62)


కొన్ని మొండాలు ఉత్తమాయుధాలు తీసుకుని దేవితో పోరాడాయి. మరికొన్ని మొండాలు ఆ యుద్ధంలో వాద్యాల లయను అనుసరించి నృత్యం చేసాయి. (63)


ఇతర మహాసురుల మొండాలు ఖడ్గాలు, బల్లాలు, కుంతములు ఇంకా చేతబట్టుకుని అప్పుడే తెగిన తలలతో “ఆగు, ఆగు” అని దేవిని ఉద్దేశించి కేకలు వేసాయి. 


ఆ యుద్ధం జరిగిన రంగం అసురులు, ఏనుగులు, గుఱ్ఱములు, రథములు కూలి ఉండడం చేత నడువ శక్యంకాకుండా ఉంది. అసురుల, వారి ఏనుగుల, గుజ్రాల రక్తసమూహం వెంటనే మహానదీరూపమై ఆ సైన్యం మధ్యలో ప్రవహించింది. 


గడ్డి, కట్టెల పెద్దరాశిని అగ్ని ఎలా క్షయమొనరుస్తుందో అలా ఆ అసుర మహాసైన్యాన్ని అంబిక క్షణమాత్రాన నాశనం చేసింది.

(64–67)


దేవి వాహనమైన సింహం జూలు విదుర్చుచు, మహానాదం చేస్తూ, సురవైరుల దేహాలలో ప్రాణాలకై వెదకుతున్నట్లు ఆ రణరంగంలో సంచరించింది. (68)


అక్కడ దేవీగణాలు అసురులతో చేసిన యుద్ధవైఖరిని చూసి సంతుష్టులై దేవతలు పుష్పవర్షాన్ని కురిపించారు. (69)


శ్రీమార్కండేయ పురాణమునందలి సావర్ణి మన్వంతరమున “దేవీ మాహాత్మ్యము” లో “మహిషాసుర సైన్యవధ” యను పేరిటి ద్వితీయాధ్యాయము.


సశేషం....

🌹 🌹 🌹

మొగలిచెర్ల అవధూత

 మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామివారితో అనుభవాలు..


*అణగారిన అహంకారం!.*


శ్రీ స్వామివారు కపాలమోక్షం ద్వారా సిద్ధిపొందిన రెండు మూడు సంవత్సరాలు గడిచిన తరువాత ఒక వేసవి కాలంలో..విజయవాడ నుంచి ఒక సిద్దాంతి గారు మొగలిచెర్ల వచ్చారు..పలు దేవాలయాల ప్రతిష్టలు ఆయన చేసివున్నారు..ఆ రోజుల్లో ఆలయాల వాస్తు చూడాలన్నా వారినే సంప్రదించేవారు..మా అమ్మా నాన్న గార్లకు ఆయనతో చాలాకాలం నుంచీ పరిచయం ఉంది..అప్పటికే సుమారు అరవై ఏళ్ల వయసు..మా అమ్మగారిని "అమ్మాయీ.." అనీ..నాన్న గారిని.."శ్రీధరా.." అనీ పిలిచేవారు..అంతటి చనువు ఉండేది..మా అమ్మగారు "బాబాయి గారూ.." అని పిలిచేది..


శ్రీ స్వామివారు మాలకొండలో తపోసాధన చేస్తున్న రోజుల్లో..ఈ సిద్ధాంతి గారిని తీసుకొని మా తల్లిదండ్రులు ఒక శనివారం నాడు మాలకొండ వెళ్లి, శ్రీ లక్ష్మీనృసింహుడి దర్శనం చేసుకొని..శ్రీ స్వామివారిని కూడా కలుద్దామని శ్రీ పార్వతీ దేవి మఠం వద్దకు వచ్చారు..నిజానికి ఈ సిద్దాంతి గారికి శ్రీ స్వామివారిని పరిచయం చేయాలని మా నాన్నగారికి కలిగిన కోరిక..అదేమీ చిత్రమో..ఆరోజు ఎంతసేపు ఎదురుచూసినా.. శ్రీ స్వామివారు రాలేదు..సాయంత్రం దాకా చూసి, మా అమ్మానాన్న గార్లు వెనక్కు వచ్చేసారు..సిద్దాంతి గారు ప్రక్కరోజు విజయవాడ వెళ్లిపోయారు..ఆ ప్రక్కవారమే మళ్లీ అమ్మా నాన్న మాలకొండ వెళ్లారు..ఆ వారం శ్రీ స్వామివారు వీళ్ళకోసమే ఎదురుచూస్తున్నట్లు కూర్చుని వున్నారు..


"పోయిన వారం ఒక సిద్ధాంతి గారిని తీసుకొచ్చాము నాయనా..మీ కోసం చాలా సేపు ఎదురుచూసి మొగలిచెర్ల వెళ్ళాము.." అన్నారు మా అమ్మగారు..


"తెలుసమ్మా..ఆ అహంకారిని కలవడం ఎందుకులే అని అనుకున్నాను.." అన్నారు స్వామివారు..అమ్మా నాన్న గార్లు ముఖాముఖాలు చూసుకున్నారు..తమకు పరిచయమైనప్పటినుండి..శ్రీ స్వామివారు ఎవ్వరి గురించీ..ప్రత్యక్షంగా గానీ.. పరోక్షంగా గానీ..ఎటువంటి వాఖ్యలూ చేయలేదు..చేయరు కూడా..కానీ ఈరోజెందుకో ఆ సిద్దాంతి గారిని అహంకారి అని అనేశారు..ఆ తరువాత, సిద్ధాంతి గారు ఇదే మొగలిచెర్ల రావడం..శ్రీ స్వామివారి మందిరానికి వెళదామని ఆయనే అమ్మా నాన్న గార్లతో చెప్పారు..సరే అని చెప్పి..ఎద్దులబండి కట్టించి..అందులో వారిని ఎక్కించుకొని..శ్రీ స్వామివారి మందిరానికి వచ్చారు..


శ్రీ స్వామివారి మందిరం ముందు బండి ఆపారు..బండి దిగి.."శ్రీధరా..ఈ మందిరం వాస్తు ఎవరు చూసారు?..చాలా మార్పులు చేయాలి.." అన్నారు సిద్ధాంతి గారు..అప్పటికి ఆయన  శ్రీస్వామివారి మందిరం లోపలికి అడుగు కూడా పెట్టలేదు..


"శ్రీ స్వామివారే దగ్గరుండి కట్టించుకున్నారు.." అన్నారు నాన్నగారు.."అవునా..ఒక్క నిమిషం శ్రీధరా..చుట్టూరా తిరిగి చూసి..ఆపైన మందిరం లోపలికి వెళదాము.." అన్నారు సిద్ధాంతి గారు..


నాన్నగారికి కొద్దిగా చిరాకు వేసినా..లోపలే అణచుకొని..సిద్ధాంతి గారిని మందిరం వెలుపలి వైపు చుట్టూ ప్రదక్షిణ గా తిరగసాగారు..సగం ప్రదక్షిణ పూర్తి అయిందో లేదో..సిద్దాంతి గారికి కడుపులో చిన్నగా  నొప్పి మొదలైంది..మరో రెండు అడుగులు వేసే సరికి నొప్పి తీవ్రం అయింది..రెండు నిమిషాల కల్లా ఆయన అడుగు కూడా వేయలేక అక్కడే నేలమీద కూలబడి పోయారు..నాన్నగారికి భయమేసింది..ఆయన్ను పొదివి పట్టుకొని..అతికష్టం మీద బండి దాకా తీసుకొచ్చి..బండిలో కూర్చోబెట్టారు..గబ గబా బండికి ఎద్దులు కట్టి మొగలిచెర్ల కు తిరిగి బైలు దేరారు..


బండి శ్రీ స్వామివారు ఆశ్రమం కట్టించుకున్న ఫకీరు మాన్యం హద్దులు దాటిందో లేదో..సిద్ధాంతి గారికి కడుపులో నొప్పి శాంతించింది..లేచి కూర్చున్నారు.. మళ్లీ వెనక్కు తీసుకెళ్ళకుండా నాన్నగారు సిద్ధాంతి గారిని మొగలిచెర్ల లోని ఇంటికి తీసుకొచ్చారు.. అమ్మతో జరిగిన విషయం అంతా చెప్పేసారు..అమ్మకు ఆరోజు శ్రీ స్వామివారు చెప్పిన "ఆ అహంకారిని కలవడం ఎందుకులే అని రాలేదమ్మా.." అనే మాటలు చెవుల్లో మారు మ్రోగాయి..నాన్నగారికి కూడా గుర్తుచేశారు..సమాధి లో కూర్చుని కూడా సిద్ధాంతి గారు తన వద్దకు రావడానికి శ్రీ స్వామివారు ఇష్టపడలేదని మా తల్లిదండ్రులకు అర్ధమైంది..


"బాబాయి గారూ..మిమ్మల్ని శ్రీ స్వామివారు దూరంగా పెట్టారు..మీలోని అహంకారమే అందుకు కారణం.." అని మా అమ్మగారు చెప్పారు.."నిజమే తల్లీ..నేను ఆ మహానుభావుడు కట్టించుకున్న ఆశ్రమానికే వంకలు పెట్టబోయాను.. ఆరోజు స్వామివారు జీవించి ఉండగా ఆయన దర్శనభాగ్యం కలుగలేదు..ఈరోజు కనీసం ఆ స్వామి నన్ను తన సమాధి దర్శనానికి కూడా అనుమతించలేదు.."అన్నారు కళ్లనీళ్లు పెట్టుకుంటూ..సిద్ధాంతి గారు ఆరోజే విజయవాడ కు వెళ్లిపోయారు..


ఆయన తన జీవితకాలంలో మరెప్పుడూ మొగలిచెర్ల రాలేదు..


సర్వం..

శ్రీ దత్తకృప.


(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగలిచెర్ల గ్రామం..లింగసముద్రం మండలం..ప్రకాశం జిల్లా..పిన్: 523114.. సెల్..94402 66380 & 99089 73699).

జీవ లక్షణము

 జీవ లక్షణము ప్రకృతికి సంబంధమును వేదం చాలా చోట్ల చాలా సందర్భములలో వివరించినది. దాని వివరణ పృథివ్యాపస్తేజోవాయుః ఆకాశాత్... అని ఆకాశాత్ వాయుః వాయెాః అగ్ని అగ్ని ఆపః ఆపః పృథ్వి పృథ్వి పృథ్వీ అంతరిక్షం... మంత్ర పుష్పం కూడా అగ్నిః వా అపాం.. వాయుః వా అపాం... పర్జన్యో వా అపాం... చంద్రమావా  అపాం... అసోవై తపన్నపాం.. నక్షత్రాణివా అపాం... సంవత్సరోవాః అపాం... వీటి పరిణామం కూడా సమస్త జగత్తుకు మూలమైన శక్తిని విగ్రహ రూపంలో అనగా మన జీవ దేహం రూపము వలనే అయిన సర్వాంతర్యామిని తెలుసుకొనుటయనే ప్రయత్నమే. అసౌయెూ వసర్పతి నీలగ్రీవో ... అన్న అసౌయెూ పదము... అసోవై తపన్నపాం ఆయతనం అని అసీత్ అంతరిక్షం. సత్ అసత్గా అసత్ సత్ గా తెలియుట. యిదియే జీవ మూల పరిణామతత్వంగా తెలియుచున్నది. అసతోమా సద్గమయ...పంచభూతాత్మకమైన శరీరముగా జీవుని ద్వారానే సమస్తం తెలియబడును. అందుకే ఎన్ని జన్మల పుణ్యమెూ...అని అన్నమయ్య...కీర్తనలు వింటాం. పాడుతాం సాధన చేసి వాటి వలన డబ్బులు కీర్తి ప్రతిష్ట గౌరవం సంపాదనకు మాత్రమే సాధనముగా ఉపయెూగించుట.  అంతే అయితే అది అహంకారం. పరమాత్మ తత్వం తెలుసుకొనుటకు అనేక విధములుగా తెలియుటకు యివి వక మార్గములు మాత్రమే.జన్మలు ఎత్తుటను ప్రమాణంగా ఎందరో తెలిపినారు.కాని అవి తెలియుటకు ప్రయత్నమే లేదు.వేదముల ఉపాంగములైన సంగీతము, జ్యోతిష, తర్క, న్యాయ మీమాంసాది సమస్తములు, నిర్గుణ, నిరంజన, నిరామయ, నిర్వికల్ప తత్వమును తెలియుటకు మాత్రమేయని తెలుసుకుంటూనే వుందాం. దాని వివరణ యే మంత్ర పుష్పం వివరణ.

*మజ్జిగ వాడకం

 ప్రాచీన భారతంలో 

*మజ్జిగ వాడకం*


ఒకనాడు ప్రతి ఊరిలో 

ప్రతి ఇంటిలో లెక్కకు మించి 

ఆవులు , గేదెలు, పాలిచ్చే పశువులు ఎన్ని ఉన్నా ఇంటి నిండా, కుండల నిండా ఎంత పెరుగు ఉన్ని ఆనాటి కుటుంబ సభ్యులు ఎవరూ ఆ పెరుగు వాడే వారు కాదు . 


ప్రతి రోజూ ఉదయాన్నే ఆ పెరుగును చిలికి పూర్తిగా వెన్న తీసి 

తగినన్ని మంచి నీరు కలిపి పలుచని తీయని మజ్జిగ తయారు చేసుకొని ఆహరంలో ఉపయోగించే వారు. ఇది మన అందరికీ తెలిసిన విషయమే. 


*కాని కమ్మని గడ్డ పెరుగును వదిలి పెట్టి పలుచని నీరు వంటి మజ్జిగను తాగడం లో ఉన్న ఆంతర్యము ఏమిటో మనకు తెలియదు*. ఈనాడు ఆ ఆంతర్యం గురించి తెలుసుకుందాం .


*ఆధునిక భావ బానిస భారతంలో - పెరుగు వాడకం*


ఈనాడు దాదాపు నూటికి 90% మంది ప్రజలు తమ ఆహారంలో మజ్జిగను పూర్తిగా మానేశారు. 


రోజూ రెండు పూటలా పెరుగును మాత్రమే వాడుతున్నారు. 


పెరుగును చిలికి వెన్న తీసి మజ్జిగను తయారు చేయడానికి కొంత సమయం వెచ్చించాలి. 


కాబట్టి ఆ విధంగా సమయం వృధా చేయకుండా అన్నములో పెరుగును కలుపుకొని తినడమే గొప్ప నాగరికత అని ఈనాడు అంతా మురిసిపోతున్నారు. 


*అయితే పెరుగు ఆయుక్షీణం*. 


ముఖ్యంగా రాత్రి సమయంలో అసలు వాడకూడదు. అలా వాడితే ఉదరంలో వాయువు ఎక్కువ అయ్యి అనేక వాత రోగాలు వస్తాయని ఆయుర్వేద మహర్షులు మనకు నిక్కచ్చిగా తేల్చి ఏనాడో చెప్పారు.


అయినా 

రోజరోజుకు కష్టపడి పని చేసే స్వభావం కోల్పోతూ,

బద్ధకస్తులుగా మారుతున్న నేటి గృహిణులు మజ్జిగను తయారు చేసి వాడడం కన్నా పెరుగును వాడటానికే ప్రాధాన్యత ఇస్తున్నారు.


*మజ్జిగ  5 రకాలు* 


1 మధితము అనే మజ్జిగ: 


పేరుకొన్న పాలల్లో నీరు కలపకుండా చిలికి తయారు చేసిన మజ్జిగను మధిత మజ్జిగ అంటారు . ఇది చిక్కగా జిడ్డుగా ఉంటుంది. ఈ మజ్జిగను ఆహారం లో వాడుతూ ఉంటే నీరసం , ఉదర రోగాలు పైత్యము వల్ల కలిగిన వాతము నాలుకకు రుచి తెలియక పోవడం, మూత్రము ఆగిపోవడం, నీళ్ళ విరోచనాలు మొదలైనవి హరించి పోయి శరీరానికి మంచి బలం కలుగుతుంది. ఈ రకమైన మజ్జిగ ను మన రెండు రాష్ట్రాల ప్రజలు గ్రీష్మ, శరత్, హేమంత, శిశిర బుుతువులలో సేవించి ఆరోగ్యం పొందవచ్చు.


2 మిళితమను మజ్జిగ : 


పెరుగు ఒక వంతు నీళ్లు మూడు వంతులు పోసి చిలికి తయారు చేసిన మజ్జిగ మిళిత మజ్జిగ అనబడుతుంది. ఇది శరీరంలో పైత్యాన్ని అరుచిని అతిసార విరోచనాన్ని రక్తంలో చేరిన వాతాన్ని ఇంకా అనేక రోగాలను పోగొడుతుంది. ఈ మజ్జిగ అన్ని కాలాలలో తీసుకోవచ్చు శ్రేష్ఠమైనది.


3 గోళము అను మజ్జిగ : 


ఒక వంతు పెరుగు ఒకటిన్నర వంతు నీళ్లు కలిపి తయారు చేసినది. ఈ విధమైన మజ్జిగ వాడుతుంటే శరీరానికి మంచి కాంతి వస్తుంది. కంటికి మంచి మేలు చేస్తుంది. ఉదరములో మందాగ్ని విష దోషాలు మేహము ప్రమేహము కఫ రోగము ఆమ రోగము పోగొడుతుంది. ఈ రకమైన మజ్జిగ గ్రీష్మ, వర్ష బుుతువులయందు తీసుకోవాలి.


4 షాడభము అను మజ్జిగ : 

ఒకవంతు పెరుగు అయిదు వంతుల నీళ్ళు కలిపి తయారు చేసింది . ఇది శ్లేష్మ రోగాలను , గుల్మ రోగాలను, రక్త మూల వ్యాధిని పోగొడుతుంది. తేలికగా ఉండి ఉదరములో జఠరాగ్నిని పెంచి శరీరానికి కాంతి ఇస్తుంది.


5 కాలశేయము అను మజ్జిగ : 


ఒక వంతు పెరుగు రెండు వంతుల నీళ్ళు కలిపి తయారు చేసింది. ఈ మజ్జిగ బంక విరోచనాలు, విషములను, ఉబ్బులను, మంటను, వాతమును, మూల వ్యాధిని పోగొట్టి శరీరం త్వరగా ముడతలు పడకుండా కాపాడుతుంది. ఇప్పటికే పడిన ముడతలను కూడా తీసి వేస్తుంది.

కాంతిపర్వం

 🪔 🪔 🪔 *కాంతిపర్వం* 🪔 🪔 🪔


*_భారతదేశానిది ప్రధానంగా యజ్ఞ సంస్కృతి. దాని చిరు ప్రతిబింబమే దీపారాధనం._* 

*చీకటి-వెలుతురు, భయం-అభయం, దుఃఖం-ఆనందం... వంటి ద్వంద్వాల్లో మొదటివన్నీ తమస్సుకు ప్రతీకలు. రెండోవి వికాసానికి సంకేతాలు. ‘తమస్సు’ అనే పదానికి అంధకారం అవిద్య అవివేకం నరకం పాపం దుఃఖం... వంటి ఎన్నో అర్థాలను చెబుతుంది నిఘంటువు. తమస్సును సమూలంగా నిర్మూలిస్తూ వికాసం దిశగా సాగిపోవాలనే ఆత్మగత ఆరాటానికి అపురూప ఆధ్యాత్మిక ప్రతీకే- దీప ప్రకాశనం. ‘తమసోమా జ్యోతిర్గమయ’ అనే దివ్యమైన ఆకాంక్ష  దీనికి ఆధార  భూమిక!*


*_నేడు జాతుల మధ్య విస్తరిస్తున్న వైరి భావాలను తొలగించాలన్నా, కరోనా మహమ్మారి నుంచి క్షేమంగా తేరుకోవాలన్నా_*  *‘శుభం కరోతి కల్యాణం ఆరోగ్యం ధనసంపదా, శత్రుబుద్ధి వినాశాయ దీపజ్యోతిర్నమోస్తుతే’* *_అంటూ పరంజ్యోతి స్వరూపాన్ని ఆలంబనగా గ్రహించడం లోకానికి మేలు._* *ముఖ్యంగా తీవ్ర వాయుకాలుష్యం విషయమై జాతీయ హరిత ట్రైబ్యునల్‌ తాజాగా 18 రాష్ట్రాలకు తాకీదులు అందించిన నేపథ్యంలో- మనం ముట్టించవలసింది దీపాలనే కాని, బాణాసంచాను కాదని గ్రహించి తీరాలి. దీపావళినాడు మనం దీపాలను ఎక్కువ సంఖ్యలో వెలిగించాలి. అది బాణసంచాను ముట్టించడానికో, పర్యావరణాన్ని తుదముట్టించడానికో కాకూడదన్నదు ‘విలయ పయోధిమగ్నమయె విశ్వమహీ వలయంబు’ అని మహాభారతం చెబుతుంది. తమస్సు దాని అన్ని రకాల అర్థాలతోను లోకాన్ని ఆవహించిన వేళ మనకీ వివేచన చాలా అవసరం!*


*_దీపావళి శుభాకాంక్షలు

🪔 🪔 🪔 🪔 🪔 🪔 🪔 🪔

దీపావళి రోజు

 🪔 *దీపావళి రోజు పఠించాల్సిన లక్ష్మీ స్తోత్రం* 🪔


నమశ్రియై లోకధాత్ర్వై బ్రహ్మామాత్రే నమోనమః

నమస్తే పద్మనేత్రాయై పద్మముఖ్యై నమోనమః !!


ప్రసన్న ముఖ పద్మాయై పద్మ కాంత్యై నమోనమః

నమో బిల్వ వన స్థాయై విష్ణు పత్న్యై నమోనమః


విచిత్ర క్షామ ధారిణ్యై పృథు శ్రోణ్యై నమోనమః

పక్వ బిల్వ ఫలాపీన తుంగస్తన్యై నమోనమః !!


సురక్త పద్మ పత్రాభ కరపాదతలే శుభే

సరత్నాంగదకేయూర కాంచీనూ పురశోభితే !!


యక్షకర్ధమ సంలిప్త సర్వాంగే కటకోజ్జ్వలే

మాంగళ్యా భరణైశ్చిత్రైః ముక్తాహారై ర్విభూషితే !!


తాటంకై రవతం సైశ్చ శోభమాన ముఖాంబుజే

పద్మ హస్తే నమస్తుభ్యం ప్రసీద హరివల్లభే !!


ఋగ్యజుస్సామరూపాయై విద్యాయైతే నమోనమః

ప్రసీదాస్మాన్ కృపాదృష్టి పాతై రాలోక యాబ్దిజే

యేదృష్టాతే త్వయా బ్రహ్మరుద్రేంద్రత్వం సమాప్నుయుః


ఫలశ్రుతి

ఇతిస్తుతాతథాదేవైః విష్ణు వక్షస్స్థలాలయా

విష్ణునా సహసందృశ్య రమాప్రేతావదత్సురాన్

సురారీన్ సహసాహత్వా స్వపధాని గమిష్యథ

యే స్థానహీనాః స్వస్థానా ద్ర్భ్రం శితాయేనరాభువి

తేమామనే నస్తోత్రేణ స్తుత్వా స్థానమవాప్నుయుః !!

... ✍️ *హిందూ ధర్మచక్రం*

15-02-గీతా మకరందము


         పురుషోత్తమప్రాప్తియోగము

       

-పూజ్యశ్రీశ్రీశ్రీ విద్యాప్రకాశానందగిరి స్వాములవారు,

శ్రీశుకబ్రహ్మాశ్రమము, శ్రీకాళహస్తి.


అవతారిక - ఆ సంసారవృక్షమునే ఇంకను వర్ణించుచున్నారు - 

 

అధశ్చోర్ధ్వం ప్రసృతాస్తస్యశాఖా 

గుణప్రవృద్ధా విషయప్రవాలాః | 

అధశ్చ మూలాన్యనుసన్తతాని 

కర్మాను బన్ధీని మనుష్యలోకే || 

 

తాత్పర్యము:- ఆ (సంసార) వృక్షముయొక్క కొమ్మలు (సత్త్వరజస్తమో) గుణములచే వృద్ధిబొందింపబడినవియు, (శబ్దాది) విషయములనెడు చిగుళ్లుగలవియునై, క్రిందికిని (స్థావరము మొదలుకొని) మీదికిని (బ్రహ్మలోకమువఱకు) వ్యాపించియున్నవి. మనుష్యలోకమునందు కర్మసంబంధమును (కర్మవాసనలను) గలుగజేయునవియగు దాని వేళ్ళు క్రిందను (మీదనుగూడ) బాగుగ విస్తరించి (దృఢముగ నాటుకొని)యున్నవి. 


వ్యాఖ్య:- ఈ సంసారవృక్షము స్వల్పమైనదికాదు. అతివిశాలమైనది. అనాదికాలమునుండి కోట్లకొలది జన్మలనుండి బాగుగ దృఢపడుచువచ్చి, వేళ్ళు తన్నుకొని శాఖోపశాఖలుగ విస్తరించియున్నది. కర్మవాసనలే దీని వేళ్ళు. సత్వరజస్తమోగుణములచే దీని శాఖలు బలపడుచున్నవి. శబ్దాది విషయములయొక్క సేవనముచే దీని చిగుళ్లు వృద్దియగుచున్నవి. దీనినిబట్టి త్రిగుణరాహిత్యముచేత శాఖలు, విషయవిరక్తిచేత చిగుళ్ళు వాసనారాహిత్యముచేత వేళ్ళు ఈ సంసారవృక్షమునకు తప్పక నిర్మూలితములు కాగలవని స్పష్టమగుచున్నది. చెట్టునకు ముఖ్యాధారము మూలమే అయినట్లు ఆ సంసారవృక్షమునకు కర్మవాసనలే మూలము. కావున విజ్ఞుడు వైరాగ్యవిచారణాదులచే ప్రయత్నపూర్వకముగ ఆ వాసనలను తొలగించివేసికొని సంసారబంధవిముక్తుడు కావలయును. అట్లు కాకుండ, రాగద్వేషాదులచే ఆ వాసనలను ఇంకను బలపఱచుచు పోయినచో సంసారదుఃఖ మెన్నటికిని జీవుని వదలనేరదు. 


ప్రశ్న:- సంసారవృక్షమును ఇంకను వర్ణించి చెప్పము?

ఉత్తరము:- (1) దానికొమ్మలు (సత్త్వరజస్తమో) గుణములచే వృద్ధిబొందింపబడినవియు, (శబ్దాది) విషయములను చిగుళ్ళుగలవియునై క్రిందికి మీదికి అంతటను వ్యాపించియున్నవి. (2) మనుష్యలోకమున కర్మసంబంధమును గలుగజేయునవియగు దానివేళ్ళుగూడ క్రిందను మీదను బాగుగ వ్యాపించి దృఢపడియున్నవి.