11, ఆగస్టు 2025, సోమవారం

మర్మశాస్త్ర విజ్ఞానం

 మర్మశాస్త్ర విజ్ఞానం - వివరణ . 

       

 మానవ శరీరం నందు ప్రాణాధారములు అగు కొన్ని ముఖ్యస్థానములు కలవు. వీటినే మర్మస్థానములు అని అంటారు. ఈ మర్మస్థానముల గురించి తెలుసుకొనుట వైద్యులకు , వైద్యేతరలకు కూడా చాలా అవసరం . విద్రది వంటి శారీరక వ్రణములు మరియు కొన్నిరకాల వ్యాధులు ముందు ఈ మర్మస్థానములకు కొంతదూరమున పుట్టి అవి మర్మస్థానములకు చేరగానే ప్రాణములు హరించుచున్నవి. శస్త్రాల వలన తగిలిన దెబ్బలు , అనుకోకుండా మర్మస్థానముల యందు దెబ్బలు తగలడం వలన నేత్రములు , చెవులు , ముక్కు మొదలగు జ్ఞానేంద్రియములు చెడి గుడ్డితనం , చెముడు మొదలగునవి కలుగుట , హస్తములు , పాదములు మొదలగు కర్మేంద్రియాలు చెడి సొట్ట , కుంటి మొదలగు దుష్ఫలితాలు కలుగుట , తీవ్రవేదన కలుగుట , కొన్ని అసాధ్యవ్యాధులు సంభవించి చివరకి ప్రాణములు పోవుట సంభవించును . 

            

. వైద్యుడు ప్రధానంగా మర్మవిజ్ఞానం కలిగి ఉండవలెను . ప్రమాదకరమగు వ్యాధి మర్మస్థానము నందు జనించినదా ? లేక మర్మస్థానమునకు చేరనున్నదా ? ప్రాణములు హరించుటకు ఎంత వ్యవధి ఇంకనూ ఉన్నది ? అని తెలుసుకుని శీఘ్రముగా ఫలితాలను ఇచ్చు ఔషధాలను ఉపయోగించి వ్యాధి మర్మప్రదేశమునకు చేరక మునుపే చికిత్స చేసి రోగిని మృత్యువు దరిచేరకుండా కాపాడవచ్చు . కావున వైద్యుడు తప్పకుండా మర్మవిజ్ఞానం తెలుసుకుని ఉండవలెను 

                  

. ఈ మర్మవిజ్ఞానం ప్రధానంగా శస్త్రచికిత్సకు అవసరము . శస్త్రచికిత్స చేయునపుడు మర్మస్థానములను గుర్తెరిగి చేయవలెను . లేనిచో యావజ్జీవితము అంగవైకల్యము లేదా కొద్దిరోజులకు ప్రాణములను హరించు వ్యాధులు , అసాధ్యవ్యాధులు చివరికి మరణమును కలిగించును. ఇవి వెంటనే జరగకపోవటం చేత మరియు మర్మవిజ్ఞానం లేకపోవుట చేత ఈ శస్త్రకర్మ వలన లేక దెబ్బతగులుట వలన లేక పుండు పుట్టుట వలన మరణం సంభవించింది అని వైద్యులు గాని రోగులు గాని భావిస్తారు. నిజానికి అది మర్మస్థాన సంబంధ మరణం అని గుర్తించరు . 

              

. మర్మశాస్త్ర ప్రకారం అకస్మాత్తుగా హస్తపాదములందున్న , అంగుష్ట మధ్యముల యందలి క్షిప మర్మములకు , అరికాలు , అరచేయి మధ్యమము నందు ఉండు తల , హృదయ మర్మములకు దెబ్బ తగిలిన యెడల ఈ 8 మర్మలును కొంతకాలం పిదప ప్రాణాలను హరించును . 15 నుంచి 30 రోజులలో దెబ్బ యొక్క తీవ్రతనుబట్టి ప్రాణాలను తప్పక తీయును . కావున తెలిసిన వైద్యుడు వెంటనే చేతి మర్మకు దెబ్బ తగిలిన మణిబంధము వద్ద , పాదములోని మర్మలకు దెబ్బ తగిలిన చీలమండ వద్దను హస్తపాదములను తీయవలెను అలా చేసిన మాత్రమే కనీసం ప్రాణం అయినను దక్కును . 

           

. మర్మలకు దెబ్బతగలని యెడల ఎంత పెద్దపెద్ద దెబ్బలు పాదములు , తొడలు , భుజములు , పొట్ట , శిరస్సు వంటి వాటికి తగిలినను ప్రాణాపాయం ఉండదు. కాని మర్మకు దెబ్బ తగిలినను దెబ్బ పైకి కనపడనంతటి చిన్నది అయినను ప్రాణములను తీయును . కావున మర్మల పైన దెబ్బ తగలకుండా జాగ్రత్త వహించవలెను . చికిత్స చేయు వైద్యుడు మర్మలకు సన్నిహితముగా ఉండు వ్యాధులను గుర్తించి రోగులను కాపాడవలెను . 

       

. శరీరంలో మొత్తం 107 మర్మలు ఉండును. వీటి గురించి మరొక పోస్టు నందు వివరిస్తాను. నా తరువాతి పోస్టు నందు ఆయుర్వేదం నందు గల "శిరావేధ " అనే ఒక గొప్ప చికిత్స గురించి వివరిస్తాను ఇది ప్రపంచములో ఏ వైద్యవిధానములో లేదు . ఈ వైద్యవిధానము గురించి అత్యంత విలువైన , అరుదైన సమాచారం మీకు సంపూర్ణముగా వివరిస్తాను. 


మరింత విలువైన సమాచారం మరియు అనేక రోగాలకు సులభ చిట్కాల కొరకు నేను రచించిన గ్రంథాలు చదవగలరు . 


గమనిక -

     

 నేను రాసిన " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు " మరియు " ఆయుర్వేద మూలికా రహస్యాలు " రెండు గ్రంథాలలో ఎన్నొ రహస్య చిట్కాలు , మా కుటుంబపరంగా గత 250 సంవత్సరాల నుంచి మా పెద్దవారు మాకు అందించిన ఎంతో అనుభవసారాన్ని ఈ గ్రంథాలలో అందరి అర్థం అయ్యే విధంగా సామాన్య బాషలో వివరించాను. ఇంట్లో ఉండి మరియు అందుబాటులో ఉన్న వాటితోనే పెద్ద పెద్ద రోగాలు నయం చేసుకునే విధంగా అత్యంత సులభయోగాలు మన ప్రాచీన భారతీయులు రచించిన చెట్లను బట్టి భూమిలో నీటిని కనుక్కునే విధానాలు , వృక్షాలకు ఆయుర్వేద మూలికల ఉపయోగించి దిగుబడి పెంచే వృక్షాయుర్వేద చిట్కాలు , రైతులకు ఉపయోగపడే విధంగా ఏయే నక్షత్రాలలో పంటలు వేస్తే ఫలితాల ఎక్కువుగా ఉంటాయో తిథి, నక్షత్ర, వారాలతో సహా ఇవ్వడం జరిగింది. ఆయుర్వేదం నేర్చుకోవాలి అనుకునేవారికి ఇది మంచి దిక్సూచిలా ఉపయోగపడును. 

           

. నా మూడొవ గ్రంథము నందు 50 రకాల మొక్కల గురించి అత్యంత విపులంగా ఇవ్వడం జరిగింది . ఈ మొక్కలన్నియు ప్రతి ఒక్కరికి తెలిసినవి మరియు మన ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటివే . ఈ గ్రంధములలో మీకు లభ్యమయ్యే సమాచారం మరే గ్రంథములలో లభ్యం అవ్వదని చెప్పగలను . మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల చిత్రములు కూడా ఇవ్వడం జరిగినది . ఏయే జబ్బులకు ఎటువంటి ఆహారపదార్థాలు తీసుకోవలెనో , తీసుకోకూడదో కూడా సంపూర్ణముగా మీకు ఇందులో లభ్యం అగును . ఔషధాలు మరియు తీసుకోవాల్సిన ఆహారవిహారాలు ఒకేదగ్గర లభ్యం అగును . 

   

ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు గ్రంథము 288 పేజీలతో ఉండును . దీని విలువ 400 రూపాయలు , ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథము 384 పేజీలతో ఉండి 500 రూపాయలు , సర్వమూలికా చింతామణి గ్రంథము 352 పేజీలతో ఉండును . దీని విలువ 550 రూపాయలు . అందరికి అర్ధమయ్యేలా సులభ బాషలో ఉండును. గ్రాంథిక భాష ఉపయోగించలేదు . 

                

. ఈ గ్రంథములు కావలసిన వారు 9885030034 నంబర్ కు Phonepay or Googlepay or Paytm కు డబ్బు పంపించి ఇదే నంబర్ కు Whatsup నందు screenshot పెట్టి మీ పూర్తి Adreass ఇవ్వగలరు . కొరియర్ చార్జీ 100 రూపాయలు అదనం .

     

. ఈ గ్రంథాలు కావలసినవారు క్రింద ఇచ్చిన నంబర్ కి ఫోన్ చేయగలరు .

    

. కాళహస్తి వేంకటేశ్వరరావు  

 

. అనువంశిక ఆయుర్వేద వైద్యులు 

        

. 9885030034

వేపచెట్టులోని గొప్ప ఔషధ గుణాలు -

 వేపచెట్టులోని గొప్ప ఔషధ గుణాలు -

   

. మనకి వేపచెట్టు ఔషధ గుణాలు ఉన్న చెట్టుగా మాత్రమే తెలుసు. కాని ఎటువంటి ఉపయోగాలు ఉన్నాయో చాలామందికి తెలియదు. అందుకోసమే నేను చాలా పురాతన గ్రంథాలు పరిశోధించి మరియు నాయొక్క సొంత అనుభవాలు కలిపి మీకు ఇక్కడ తెలియచేస్తున్నాను. ఇప్పుడు నేను తెలియచేయబోయే విషయాలను జాగ్రత్తగా దాచుకోగలరు.

 

* ఎంతోకాలంగా ఉండి మానని మొండి కురుపులకు వేపాకు నూరి కట్టిన అవి చాలా తొందరగా నయం అగును.

 

* వేపాకు చిగురు ప్రతిరోజు ప్రాతఃకాలం నందు సేవించుచున్న రక్తం శుద్ధి అయ్యి శరీరం పైన ఉండు నల్లటి మచ్చలు ముఖ్యంగా ముఖంపైన ఉండు మచ్చలు తొలగిపోవును .

 

* వేపచిగురు ప్రతినిత్యం పరగడుపున భుజించువారికి కొంతకాలానికి చేదుగా కాక తియ్యగా అనిపించును. వారికి పాము కరిచినను విషం ఎక్కదు.

 

* వేపచెక్క గంధంని శరీరంపై పూసుకొనిన చర్మంపై వచ్చు చర్మవ్యాధులు హరించును. శరీరం పేలినట్లు ఉండటం, దురద, శోభి , మంగు, తామర వంటి చర్మవ్యాధులు హరించును .

 

* ముదురు వేపచెట్టు యొక్క వేరు చూర్ణం కొద్దిమోతాదుగా లోపలికి పుచ్చుకొనిన రక్తంని శుభ్రపరచును. శరీరానికి పుష్టి కలిగించును. జ్వరమును పారద్రోలును , క్రిములను నాశనం చేయును .

 

* వేపచెక్క చూర్ణం పసిపిల్లలకు ఇచ్చినచో కడుపులో ఉండు ఏలికపాములు , నులిపురుగులను సమర్ధవంతంగా నాశనం చేయును .


 * వేపచెక్క చూర్ణం పెద్దవారు సేవించిన అజీర్ణం వలన కలుగు జ్వరం తగ్గును.


 * వేపచెట్టు వేరు , బెరడు, ఆకు , ఈనే, పువ్వు, పిందె , కాయ, పండు, కల్లు , జిగురు ఇవి అన్నియు పలువిధములైన రుగ్మతలను నశింపచేయగలవు .


 * వేపాకు , పువ్వు శరీరం యొక్క తత్వమును మంచిస్థితికి మార్చి జీర్ణశక్తిని వృద్ధిపరచును.


 * వేపాకు రసం సేవించటం వలన జ్వరము, అజీర్తి, బలహీనం, పాండువు, క్రిమిరోగం, గండమాల , వ్రణములు, కుష్టు మొదలైనవి నశించును.

 

* వేపాకు వడబెట్టి తలకు కట్టిన నరముల సంబంధం వలన వచ్చు "న్యూరాల్జియా"అను తలనొప్పి తగ్గును.

 

* వేపాకు వడబెట్టి తలకు కట్టిన తలలోని పేలు , ఈపి , చుండ్రు నశించును.

 

* చీముకారు పుండ్లకు వేపాకు నూరి ముద్దచేసి కట్టిన వాటిని మిగిల్చి మానునట్లు చేయును .

 

* వేప బెరడు , వేప ఈనెల కషాయం , రోజుమార్చి రోజు వచ్చు జ్వరం నశించును.

 

* వేపాకు ఆముదంతో వెచ్చచేసి కీళ్లవాపులకు కట్టిన తగ్గును.

 

* లేతవేప చెట్టు నుంచి తీయబడిన కల్లు తియ్యగా ఉండును.దీన్ని పులియబెట్టి సేవించిన ఆమాశయ సంబంధమైన అజీర్తిని , క్రిములను పోగొట్టి మంచి ఆకలిని కలిగించును.

 

* వేప కల్లు క్షయ, కుష్టు మొదలయిన అసాధ్యరోగాలను కూడా తగ్గించును .

 

* వేప విత్తనాల నూనె చేదుగా ఉండును. ఈ నూనె లొపలికి సేవించిన వాతము హరించి ఉద్రేకమును పుట్టించును. అనగా వేడిని పెంచును.


 * ఈ వేపనూనె చర్మవ్యాధులను, క్రిమిజాడ్యములకు, మూలవ్యాధిని , మూత్రవ్యాధిని తగ్గించును .

 

* వేపనూనె , ఆవనూనె, కొబ్బరినూనె సమభాగములాగా తీసుకుని కాచి చర్మవ్యాధులకు, కీళ్ళనొప్పులకు , వాపులకు , తలనొప్పికి ఉపయోగించవచ్చు.

 

* పురిటి ఇంటి యందు వేపచమురుతో దీపం పెట్టిన శిశువులకు బాలగ్రహాది పీడలు కలగవు అని హిందువులకు గాఢమైన నమ్మకం.

 

* వేప బంక పై పూతగా ఉపయోగించుట వలన సడలిపోయిన నరములు బిగువుగా అగును.


 * వేపాకు కషాయాంతో పుండ్లు కడిగిన త్వరగా మానును.

 

* వేపచెట్టు గాలి ప్రతినిత్యం తగులుచున్న మశూచి,కలరా వంటి వ్యాధులు దరిచేరవు.

 

* నూరు సంవత్సరములు కలిగిన వేపచెట్టు కాండంలో మూడు నుంచి నాలుగు లీటర్ల నీరు పట్టేంతగా తొర్రని తొలచి అందులో సుమారు ఒక కిలో బియ్యమును అన్నంగా వండి వేడి తగ్గక ముందే ఆ తొర్రలో వేసి ఆ వేపచెట్టు పచ్చికఱ్ఱతోనే ఆ తొర్ర మూసేవిధంగా బిరడాలా చేసి బిగించి లొపలికి గాలిపోకుండా పైన ఆవుపేడను పూసి మూసివేయవలను . ఒక సంవత్సరం పాటు అలా ఉంచి ఆఖరు దినమున ఆ అన్నమును తీసిన ఎర్రగా మారిపోయి ఉండును.దానిని బాగా ఎండించి పూటకు రెండు నుంచి 3 గ్రాముల చొప్పున రెండుపూటలా 40 దినములు పుచ్చుకొనిన కుష్టురోగం నశించును.


 * వేపాకు మోతాదు మించి ఎక్కువుగా తినినచో మత్తు, మైకం, వాంతులు , విరేచనాలు అగును . కావున 4 నుంచి 5 ఆకుల వరకు తినవచ్చు.

  

           ఆయుర్వేదములోని ఎన్నొ రహస్య మూలికల అనుభవ యోగాల గురించి నా గ్రంథాల యందు సంపూర్ణముగా , అందరికి అర్థమయ్యే సులభ భాషలో వివరించాను . వాటిని చదివి మరింత విజ్ఞానాన్ని పొందగలరు . 

  

 గమనిక -

      

. నేను రాసిన " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు " మరియు " ఆయుర్వేద మూలికా రహస్యాలు " రెండు గ్రంథాలలో ఎన్నొ రహస్య చిట్కాలు , మా కుటుంబపరంగా గత 250 సంవత్సరాల నుంచి మా పెద్దవారు మాకు అందించిన ఎంతో అనుభవసారాన్ని ఈ గ్రంథాలలో అందరి అర్థం అయ్యే విధంగా సామాన్య బాషలో వివరించాను. ఇంట్లో ఉండి మరియు అందుబాటులో ఉన్న వాటితోనే పెద్ద పెద్ద రోగాలు నయం చేసుకునే విధంగా అత్యంత సులభయోగాలు మన ప్రాచీన భారతీయులు రచించిన చెట్లను బట్టి భూమిలో నీటిని కనుక్కునే విధానాలు , వృక్షాలకు ఆయుర్వేద మూలికల ఉపయోగించి దిగుబడి పెంచే వృక్షాయుర్వేద చిట్కాలు , రైతులకు ఉపయోగపడే విధంగా ఏయే నక్షత్రాలలో పంటలు వేస్తే ఫలితాల ఎక్కువుగా ఉంటాయో తిథి, నక్షత్ర, వారాలతో సహా ఇవ్వడం జరిగింది. ఆయుర్వేదం నేర్చుకోవాలి అనుకునేవారికి ఇది మంచి దిక్సూచిలా ఉపయోగపడును. 

            

. నా మూడొవ గ్రంథము నందు 50 రకాల మొక్కల గురించి అత్యంత విపులంగా ఇవ్వడం జరిగింది . ఈ మొక్కలన్నియు ప్రతి ఒక్కరికి తెలిసినవి మరియు మన ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటివే . ఈ గ్రంధములలో మీకు లభ్యమయ్యే సమాచారం మరే గ్రంథములలో లభ్యం అవ్వదని చెప్పగలను . మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల చిత్రములు కూడా ఇవ్వడం జరిగినది . ఏయే జబ్బులకు ఎటువంటి ఆహారపదార్థాలు తీసుకోవలెనో , తీసుకోకూడదో కూడా సంపూర్ణముగా మీకు ఇందులో లభ్యం అగును . ఔషధాలు మరియు తీసుకోవాల్సిన ఆహారవిహారాలు ఒకేదగ్గర లభ్యం అగును . 

   

. ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు గ్రంథము 288 పేజీలతో ఉండును . దీని విలువ 400 రూపాయలు , ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథము 384 పేజీలతో ఉండి 500 రూపాయలు , సర్వమూలికా చింతామణి గ్రంథము 352 పేజీలతో ఉండును . దీని విలువ 550 రూపాయలు . అందరికి అర్ధమయ్యేలా సులభ బాషలో ఉండును. గ్రాంథిక భాష ఉపయోగించలేదు . 

               

. ఈ గ్రంథములు కావలసిన వారు 9885030034 నంబర్ కు Phonepay or Googlepay or Paytm కు డబ్బు పంపించి ఇదే నంబర్ కు Whatsup నందు screenshot పెట్టి మీ పూర్తి Adreass ఇవ్వగలరు . కొరియర్ చార్జీ 100 రూపాయలు అదనం .

      

. ఈ గ్రంథాలు కావలసినవారు క్రింద ఇచ్చిన నంబర్ కి ఫోన్ చేయగలరు .

     

.       

. కాళహస్తి వేంకటేశ్వరరావు  

 

. అనువంశిక ఆయుర్వేద వైద్యులు 

       

. 9885030034

శ్రీమదాంధ్ర మహాభారతం*

 🔯🌹🌷🏹🕉️🏹🌷🌹🔯

*🪷శుక్రవారం 8 ఆగస్టు 2025🪷*


*శ్రీమదాంధ్ర మహాభారతం*

         *ఆదిపర్వము*

 *గ్రంథ ప్రారంభము (1 -1)*


గణపతి ప్రార్థన:- 

శ్లో"శుక్లాంబరధరం విష్ణుం, శశివర్ణం చతుర్భుజమ్| 

ప్రసన్నవదనం ధ్యాయేత్, సర్వ విఘ్నోప శాన్తయే||"


సరస్వతీ దేవి ప్రార్థన:- 

శ్లో"సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి! 

విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా!:


పరమేశ్వర ప్రార్థన:- 

శ్లో"వాగర్థావివ సంపృక్తౌ, వాగర్థ ప్రతిపత్తయే | 

జగతః పితరౌ వన్దే, పార్వతీ పరమేశ్వరౌ||"


గురు ప్రార్థన:- 

శ్లో" అనేకజన్మసంప్రాప్త కర్మబంధవిదాహినే | 

ఆత్మజ్ఞానప్రదానేన తస్మి శ్రీగురవే నమః ||


శ్లో " న గురోరధికం తత్త్వం న గురోరధికం తపః | 

తత్త్వజ్ఞానాత్సరం నాస్తి తస్మై శ్రీగురవే నమః || 


వ్యాస ప్రార్థన:- 

శ్లో "వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాసరూపాయ విష్ణవే |

నమో వైబ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః ||


శ్రీకృష్ణ ప్రార్థన:- 

మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం।

యత్కృపా తమహం వందే పరమానంద మాధవం॥


నాహం వసామి వైకుంఠే యోగినాం హృదయే న చ।

మద్భక్తా యత్ర గాయంతి తత్ర తిష్ఠామి నారద॥


శ్లో"కృష్ణాయ వాసుదేవాయ దేవకీనందనాయ చ| 

నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః":


“నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమమ్ |

దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్ ||”


నారాయణ స్వరూపుడైన శ్రీకృష్ణుడికి, నరోత్తముడైన అర్జునుడికి, వాళ్ళిద్దరి లీలలను తెలియచెప్పే సరస్వతీదేవికి, మహాభారత గ్రంథాన్ని రచించిన వ్యాసమహర్షికి నమస్కరించి మానవులలోని రాక్షసభావాలను తొలగించి, పవిత్రమైన మనసును ప్రసాదించే మహాభారతాన్ని చదవడం మొదలు పెట్టాలి.




పూర్వమొకప్పుడు నైమిశారణ్యంలో శౌనకముని పన్నెండేళ్ళ సత్రయాగాన్ని చేస్తున్నాడు. అప్పుడు అక్కడికి రోమహర్షణుడి కొడుకైన ఉగ్రశ్రవుడు వచ్చాడు. ఆయనను చూడగానే అక్కడ ఉన్న మునలందరికీ చిత్రవిచిత్రములైన కథలు వినాలనే కోరిక కలిగింది. వెంటనే అక్కడి మహర్షులంతా ఆయన చుట్టూ చేరి నమస్కరించి,

సత్కరించారు. ఉగ్రశ్రవుడు మహర్షుల యోగక్షేమాలు

అడుగుతున్నాడు. ఇంతలో ఒక ముని ఉగ్రశ్రవుని “మహర్షీ! మీరు ఇప్పుడు ఎక్కడ నుండి వస్తున్నారు? ఇప్పటివరకూ ఎక్కడు ఉన్నారు?" అని అడిగాడు. ఆ మహర్షులతో ఉగ్రశ్రవుడు "నేను పరీక్షిత్తు కొడుకైన జనమేజయుడు చేస్తున్న సర్పయాగానికి వెళ్ళి, అక్కడ వ్యాసుడు రచించిన భారతంలోని పవిత్రమైన, విచిత్రమైన

చాలా కథలను విన్నాను. అనేక ఆశ్రమాలు చూసి, తీర్థాలు సేవించి, కౌరవులు, పాండవులు యుద్ధం చేసిన శమంతక పంచక క్షేత్రాన్ని చూసి, అక్కడినుండి మిమ్మల్ని చూడాలనిపించి ఇక్కడికి వచ్చాను. మీరు అందరూ మీ మీ అనుష్ఠానాలను పూర్తి చేస్తుకుని, పవిత్ర మనస్కులై ఏకాగ్రతతో ఉన్నారు. ఇంతకీ మీకు ఏ కథ చెప్పమంటారు?” అని అడిగాడు. అప్పుడు మహర్షులు "వ్యాసుడు రచించిన వేదమయమైన భారత సంహితను వినాలనుకుంటున్నాము” అని చెప్పారు. అప్పుడు ఉగ్రశ్రవుడు “ఆద్యుడు, అంతర్యామి, సర్వవ్యాపకుడు, మంగళకరుడు, చరాచరగురువు అయిన హృషీకేశునికి నమస్కరించి, వ్యాసుడు రచించిన పవిత్రమైన మహా భారతాన్ని వర్ణించి చెప్తాను. ఈ గ్రంథం మూడు లోకాల్లోనూ అందరిచేతా విస్తారంగానూ, సంక్షిప్తంగానూ

చదవబడుతుంటుంది. అనేక రకాల ఛందస్సులతో ఉన్న ఈ

గ్రంథం దేవతల, మానవుల మర్యాదలు ఎట్లా ఉండాలో

స్పష్టంగా తెలియచేస్తుంది. ఈ ప్రపంచమంతా అజ్ఞానాంధకారంలో మునిగిపోయి ఉంది. అప్పుడు ఈ ప్రాణులన్నింటి పుట్టుకకు కారణమైన ఒక అండం పుట్టింది. అది దివ్యము, సత్యము, సనాతనము, జ్యోతిర్మయము, అలౌకికము. ఆ అండంలో నుంచే

బ్రహ్మదేవుడు బయటకు వచ్చాడు. ఆ తరువాత ప్రచేతసులు

శ్రీమహాభారతం పదిమంది, దక్షుడు, అతడి ఏడుగురు కొడుకులు,

సప్తఋషులు, పధ్నాలుగు మంది మనువులు పుట్టారు.

విశ్వేదేవులు, ఆదిత్య వసువులు, అశ్వినీకుమారులు, యక్ష,

సాధ్య, పిశాచ, గుహ్యకులు, పితరులు, బ్రహ్మర్షులు, రాజర్షులు, పంచభూతాలు, దిక్కులు, సంవత్సరాలు, ఋతువులు, నెలలు, పక్షాలు, పగలూ, రాత్రీ, ఈ ప్రపంచంలో ఉన్న సమస్త వస్తువులూ ఈ అండం నుంచే పుట్టాయి. ఋతువులు మారినప్పుడల్లా ఆయా ఋతువులు గుర్తులు వచ్చిపోతుంటాయి. అల్లాగే ఈ చరాచరజగత్తు అంతా ఏ పరమాత్మలో నుండి పుట్టిందో ఆ పరమాత్మలోనే కలిసి

పోతుంది. ఈ విధంగా సమస్త పదార్థాలనూ సృష్టించి నశింపచేసే కాలచక్రం అనాదిగా నడుస్తూనే ఉంది. అనంతంగా నడుస్తూనే ఉంటుంది. సంక్షిప్తంగా దేవతల సంఖ్య ముప్ఫైఆరువేల మూడువందల ముప్ఫైమూడు కోట్లు. వివస్వంతుడికి దివఃపుత్రుడు, బృహద్భానుడు, చక్షువు, ఆత్ముడు, విభావసుడు, సవిత, ఋచీకుడు, అర్కుడు, భానుడు, ఆశావహుడు, రవి, మనువు - అనే పన్నెండుమంది కొడుకులు. వీరిలో చివరివాడైన మనువుకి 'దేవభ్రాట్,

సుభ్రాట్' అని ఇద్దరు కొడుకులు. సుభ్రాట్కి "దశజ్యోతి, శతజ్యోతి, సహస్రజ్యోతి” అనే ముగ్గురు కొడుకులు. ఈ ముగ్గురికీ సంతానం కలిగింది. దశజ్యోతికి వెయ్యిమంది, శతజ్యోతికి లక్షమంది, సహస్రజ్యోతికి పదిలక్షల మంది పుట్టారు. వీళ్ళ నుండే కురు, యదు, భరత, యయాతి, ఇక్ష్వాకు మొదలైన రాజర్షుల వంశాలు పుట్టినాయి. ఈ పరంపరాక్రమంలోనే అనేక వంశాల, ప్రాణుల సృష్టులూ జరిగినాయి.


సశేషం


తంగిరాల చంద్రశేఖర అవధాని, కపిలేశ్వరపురం


                 *సేకరణ* 

 *న్యాయపతి నరసింహారావు* 

🔯🌹🚩🏹🛕🏹🚩🌹🔯