30, మే 2025, శుక్రవారం

భూషలుగావుమర్త్యులకు

 శు భో ద యం 🙏



భూషలుగావుమర్త్యులకు భూరిమయాంగదతారహారముల్

భూషిత కేశపాశమృదుపుష్ప సుగంధజలాభిషేకముల్ భూషలుగావు,పూరుషుని భూషితుజేయు పవిత్రవాణివా 

గ్భూషణమే సుభూషణము

భూషణముల్ నశియించు నెప్పుడున్,

భర్తృహరి సుభాషితములు!!

భావము:మానవులకు నిజమైన భూషణము విద్యయేవిద్యను మించిన భూషణములులేనేలేవు.

      బంగరునగలు,ముత్యాలహారములు వివిధ అలంకార విశేషములెవ్వియు భూషణాభాసములేతప్పభూషణములుగావు పవిత్రవాణియే నిజమగుభూషణము.తక్కినభూషణములు రావచ్చును పోవచ్చును.విద్యాభూషణము మాత్రమే సుస్థిరమైనది

                         స్వస్తి!!🙏🙏🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷

శ్రీరామచంద్ర ప్రభువు

 🕉️ *శ్రీరామచంద్ర ప్రభువు యొక్క గొప్పవైన 16 గుణములు* 🕉️


*కో అస్మిన్ సాంప్రతం లోకే గుణవాన్ కశ్చ వీర్యవాన్౹*

*ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ సత్యవాక్యో దృఢవ్రతః ॥*

*చారిత్రేణ చ కో యుక్తః సర్వభూతేషు కో హితః౹*

*విద్వాన్ కః కః సమర్థశ్చ కః ఏక ప్రియదర్శనః ॥*

*ఆత్మవాన్ కో జితక్రోధో ద్యుతిమాన్ కోనసూయకః౹*

*కస్య బిభ్యతి దేవాశ్చ జాతరోషస్య సంయుగే ॥*


ధర్మము తప్పకుండా మనిషి అనేవాడు ఇలా జీవించాలి అని చూపించినవాడు శ్రీరాముడు. 16 గుణములు పుష్కలంగా కలిగి ఉన్నవాడు రాముడు. అవే.. 1. గుణవంతుడు, 2. వీర్యవంతుడు, 3. ధర్మాత్ముడు, 4. కృతజ్ఞతాభావం కలిగినవాడు, 5. సత్యం పలికేవాడు, 6. దృఢమైన సంకల్పం కలిగినవాడు, 7. చారిత్రము కలిగినవాడు, 8. అన్ని ప్రాణుల మంచి కోరేవాడు, 9. విద్యావంతుడు, 10. సమర్థుడు, 11. ఎన్నిసార్లు చూసినా ఇంకా చూడాలనిపించేంతటి సౌందర్యము కలిగినవాడు, 12. ధైర్యవంతుడు, 13. క్రోధాన్ని జయించినవాడు, 14. తేజస్సు కలిగినవాడు, 15. ఎదుటివారిలో మంచిని చూసేవాడు. 16. అవసరమైనప్పుడు కోపాన్ని తెచ్చుకోగలిగినవాడు.

గణపతి ఉపనిషత్తు 🙏 రెండవ భాగం

 గణపతి ఉపనిషత్తు 🙏

                     రెండవ భాగం 

సర్వం జగదిదం త్వత్తో జాయతే! సర్వం జగదిదం త్వత్తస్తిష్ఠతి! సర్వం జగదిదం త్వయి లయమేష్యతి! సర్వం జగదిదం త్వయి ప్రత్యేతి! త్వం భూమిరాపోఽనలోఽనిలో నభః త్వం చత్వారి వాక్పదాని! 5

సర్వం జగదిదం త్వత్తో జాయతే! 

ఈ సకల చరాచర జగత్తు నీనుండే ఉద్భవించినది.

సర్వం జగదిదం త్వత్తస్తిష్ఠతి! 

 ఈ జగత్తంతా నీలోనే ఉంటుంది. 

సర్వం జగదిదం త్వయి లయమేష్యతి

ఈ జగత్తు మొత్తంగా లయమయ్యేదీ నీలోనే. 

సర్వం జగదిదం త్వయి ప్రత్యేతి

ఈ జగత్తంతా నీవైపే ప్రవహిస్తుంది (త్వయి ప్రత్యేతి) నిన్నే పొందుతుంది. 

త్వం భూమిరాపోఽనలోఽనిలో నభః

నీవే భూమివి, నీరు, వాయువు, అగ్నివి, ఆకాశానివి.

త్వం చత్వారి వాక్పదాని

 పరా పశ్యంతి మధ్యమా వైఖరి గా పేర్కొనబడే వాక్కు యొక్క నాలుగు పదాలు నీవే.

త్వం గుణత్రయాతీతః! త్వం దేహత్రయాతీతః! త్వం కాలత్రయాతీతః! త్వం అవస్థాత్రయాతీతః!

త్వం మూలాధారస్థితోఽసి నిత్యమ్! త్వం శక్తిత్రయాత్మకః! త్వాం యోగినో ధ్యాయంతి నిత్యమ్!

త్వం బ్రహ్మా త్వం విష్ణుస్త్వం రుద్రస్త్వమింద్రస్త్వమగ్నిస్త్వం వాయుస్త్వం సూర్యస్త్వం చంద్రమాస్త్వం బ్రహ్మ భూర్భువః స్వరోమ్! 6


త్రిగుణాలకు (సత్వ రజస్ తమో) నీవు అతీతునివి, నీవు స్థూల సూక్ష్మ కారణ శరీరాలుగా పేర్కొనబడే దేహత్రయానికీ అతీతునివి. నీవు భూత భవిష్యత్ వర్తమాన కాలాలకు అతీతునివి. నీవే కుండలినీ శక్తిగా నిత్యమూ మూలాధార చక్రంలో స్థితమైన (ఉండే) శక్తివి. నీవే మూడు శక్తులకు (ఇఛ్ఛా జ్ఞాన క్రియా శక్తులు) అతీతమైన వానివి.

నిత్యం యోగులచే ధ్యానం చేయబడే వానివి నీవే. త్రిమూర్తులు, ఇంద్రాగ్ని వాయు సూర్య చంద్రాదుల రూపంలో భాసిల్లే వానివి నీవే. ముల్లోకములలో (భూః, భువః సువః) నీవే, ముల్లోకములూ నీవే అయిన వాడివి.


గణాదిం పూర్వముచ్చార్య! వర్ణాదీం స్తదనంతరమ్! అనుస్వారః పరతరః! అర్ధేందులసితమ్!

తారేణ ఋద్ధమ్! ఏతత్తవ మనుస్వరూపమ్! గకారః పూర్వరూపమ్ అకారో మధ్యమరూపమ్ అనుస్వారశ్చాంత్యరూపమ్! బిందురుత్తరరూపమ్! నాదః సంధానమ్! సంహితా సంధిః!

సైషా గణేశవిద్యా! గణక ఋషిః! నిచృద్గాయత్రీచ్ఛందః! శ్రీ మహాగణపతిర్దేవతా ఓం గం గణపతయే నమః!7

"గం" అనేది గణపతి బీజం. దానిని ఉఛ్చరించే పద్దతి చెపుతున్నారిక్కడ. "గ్" ను ముందుగా ఉఛ్చరించాలి అటు పిమ్మట వర్ణములకు ఆది అయిన "అ"కారాన్ని ఉఛ్చరించాలి. తదుపరి అనుస్వరాన్ని ఉఛ్చరించాలి. ఇది "గం" అవుతుంది. అదే గణపతి బీజం. (దీని సాధనచేత ఆ స్వామి గోచరమౌతాడు).

అర్ధేందులసితం... అక్షరములు ధ్వనులకు సంకేతాలు. ధ్వని నాద భరితము. బిందువు తదుపరి వచ్చే నాదాన్ని "అర్ధేందు" అనే సంకేతంతో సూచించారు. ఆ నాదంతో ప్రకాశించే వాడు.

తారేణ రుద్ధం... తార అనగా తరింప చేసే మంత్రము దానినే ఓంకారము లేదా ప్రణవము అంటున్నాము. రుద్ధము పరివేష్టితుడు. ప్రణవము చేత పరివేష్టితుడు లేదా ప్రణవ స్వరూపుడు.

ఇది అతని యొక్క మంత్ర రూపము.

(ఇక పోతే సామాన్యార్థంలో చెప్పుకుంటే....శివ సంబంధమైన వాడు గణపతి కాబట్టి అతడు అర్ధేందుచే (అష్టమినాటి చంద్రుని) ప్రకాశించే వాడు. తారకలచే (నక్షత్రములు) పరివేష్ఠితుడు, అని చెప్పు కోవచ్చు... కాని ఇది సంప్రదాయము కాదు.)

“గం” బీజం సాధన చేసే సమయంలో... "గ్" కారం పూర్వ రూపం, "అ" కారం మధ్యమ రూపం, అనుస్వరం అంత్య రూపం అవుతుంది కాగా బిందువు (౦) ఉత్తర రూపంగా ఉంటుంది. దీనిని పలికి నప్పుడు వచ్చే నాదమే సంధానము. దీనితో అత్యంత సాన్నిహిత్యం కలిగినది సంధి.

ఇది మొత్తంగా (సైషా.. స ఏషా...) గణేశుని విద్య. దీనికి ఋషి గణక ఋషి. అనగా దీనిని దర్శించి ప్రవచించిన వాడు, గణకుడు అనే ఋషి. దీని ఛందస్సు నిచృద్ ఛందం. అధిష్టాన దేవత గణపతి.

“ఓం గణపతయే నమః ఏక దంతాయ విద్మహే, వక్ర తుండాయ ధీమహి, తన్నో దంతిః ప్రచోదయాత్”!

ఏకదంతం చతుర్ హస్తం పాశమంకుశధారిణమ్

రదం చ వరదం హస్తైర్బిభ్రాణం మూషకధ్వజమ్!

రక్తం లంబోదరం శూర్పకర్ణకం రక్తవాససమ్ 

రక్తగంధానులిప్తాంగం రక్తపుష్పైః సుపూజితమ్!

భక్తానుకంపినం దేవం జగత్కారణమచ్యుతమ్ 

ఆవిర్భూతం చ సృష్ట్యాదౌ ప్రకృతేః పురుషాత్పరమ్!

ఏవం ధ్యాయతి యో నిత్యం స యోగీ యోగినాం వరః 9

ఏకదంతుడు, నాలుగు చేతులలో.... పాశము, అంకుశము, దంతము, (ఇది ఏనుగు దంతం, త్యాగానికి సంబంధించినది. మహాభారత రచనా కాలంలో తన దంతాన్ని విరిచి వ్రాసాడు) అభయ ముద్రను ధరించినవాడు, ఎలుక వాహనమును ధ్వజముగా కలిగిన వాడు, పెద్దదైన పొట్టను కలిగిన వాడు, చాటల లాంటి చెవులను కలిగిన వాడు, రక్త వర్ణ వస్త్రములను ధరించిన వాడు, ఎర్రనైన సుగంధములను పులుముకున్న శరీరము కలిగిన వాడు, ఎర్రనైన పుష్పములచే చక్కగా పూజిlతుడు, భక్త కోటిపై అమితమైన అనుకంప (దయ) కలిగిన వాడు, భగవంతుడైన వాడు, ఈ జగత్తుకు కారణమైన వాడు, అచ్యుతుడు (జారిపోని వాడు), సృష్టి ఆదిలోనే ఆవిర్భూతుడు, ప్రకృతి పురుషులకు కూడా పరమమైన వాడు, ఎవరైతే ఉన్నాడో (గణపతి) వానిని నిత్యం ఎవరైతే ధ్యానిస్తారో వారు యోగులలో శ్రేష్టునిగా చెప్పబడతారు.

హే వ్రాత పతి (సమూహమునకు భర్త) నీకు నమస్సులు. గణములకు పతియైన నీకు నమస్సులు, ప్రమథ గణములకు పతివైన నీకు నమస్సులు, లంబోదరుని వైన నీకు నమస్సులు, ఏకదంతుని వైన నీకు నమస్సులు (ఏక దంతము త్యాగానికి చిహ్నము) విఘ్నములను నశింప చేసే నీకు నమస్సులు, శివ సుత నీకు నమస్సులు (శివము అంటే మహదానందము.. దానికి పుత్రుడు అంటే ఆనంద మూర్తియే... పోతన గారు కూడా మహానందాంగనా డింభకుడు అని అంటారు. మహా ఆనందము అనే అంగనకు డింభకుడు) వరద మూర్తయే... అపరిమితమైన దయా కారుణ్యాలకు ఆకృతి వస్తే ఎలా ఉంటుంది అంటే అది గణపతి వలె ఉంటుంది అనేందుకు వరద మూర్తయే అన్నారిక్కడ. ఆ వరద మూర్తికి నమస్సులు.

ఇక చివరగా ఫల శ్రుతి....

ఈ అథర్వ శీర్షంను ఎవరైతే శ్రద్ధతో, చక్కగా అధ్యయనం చేస్తారో, వారు (స) బ్రహ్మ స్థానాన్ని పొందుతారు. వారు సర్వ విఘ్నములనుండి విముక్తుడవుతాడు, వారు సర్వత్రా సుఖములను పొందుతారు, వానికి పంచ మహా పాతకముల నుండి విముక్తి కలుగుతుంది.

సాయం సమయంలో దీనిని అనుష్ఠించడం వల్ల పగలు చేసిన పాపములు తొలగిపోతాయి. ప్రాతఃకాలంలో అనుష్ఠించినట్లయితే రాత్రి చేసిన పాపములు తొలిగిపోతాయి. సాయం ప్రాతస్సులలో అనుష్ఠించిన వానికి పాపములు అంటుకొనవు. సర్వత్రా ఏ కార్యములలో నైనా ఏ విధమైన విఘ్నములు కూడా అతనికి కలగవు. అతడు ధర్మార్ధ కామ మోక్షములను పొందగలడు. ఇది అధర్వ శీర్షం.

దీనిని శిష్యులు కాని వారికి ఇవ్వకూడదు. ఇక్కడ శిష్యుడు అంటే నేర్చుకోవాలనే జిజ్ఞాసతో గురువును సభక్తికంగా చేరిన వాడు. అశ్రద్ధ లేనివాడు, ఉపాసన యందు అనురక్తి కలిగిన వాడు. విషయంపైన భక్తిభావన కలిగిన వాడు. అలాంటి లక్షణాలు లేని వానికి ఈ విద్యను ఇవ్వగూడదని చెపుతుంది, ఈ సూక్తం. ఏ ప్రలోభాలకైనా లోనై అలా అనర్హులకు ఈ సూక్తాన్ని ఇచ్చినట్లయితే అతడు పాప కూపంలొ పడిపోతాడని హెచ్చరిస్తుంది.

ఏ ఏ కోరికలతో నైనా సహస్రావర్తనంగా దీనిని అనుష్ఠించినట్లయితే దీని చేత (అనేన) ఆ కోరికలు సాధింపబడతాయి. ఈ ఉపనిషత్ చేత గణపతిని అభిషేకించినట్లయితే అతడు చక్కని వాక్పటుత్వం కలిగిన వాడవుతాడు.

భాద్రపద శుద్ధ చవితినాడు భోజనం చేయకుండా (చతుర్థ్యామనశ్నన్… అన అశనము) ఎవరైతే జపిస్తారో, అతడు విద్వాంసుడౌతాడు. ఇది అథర్వణ వాక్యము.

దీనిని బ్రహ్మ విద్యగా ఆచరించడం వల్ల కొద్దిగా కూడా భయం అనేది ఉండదు (నభిభేతి)

గణపతిని ... ఎవరైతే దూర్వారములచే అర్చిస్తారో అతడు అపర కుబేరుడౌతాడు. పేలాలతో ఎవరైతే అర్చిస్తారో అతడు యశస్కుడు అవుతాడు. మేధోవంతుడౌతాడు. మోదక సహస్రముచే ఎవరైతే అర్చిస్తారో వారికి వాంఛించిన ఫలితం లభిస్తుంది. ఎవరైతే ఆజ్యము (నేయి) సమిధలతో హవనం చేస్తారో వారికి ముమ్మాటికీ సర్వమూ లభిస్తుంది.

ఎనిమిది మంది వేద విదులైన బ్రాహ్మణులను చక్కగా సమకూర్చుకొని గణపతి నెవరైతే అర్చిస్తారో వారు సూర్య వర్చస్సును పొందుతారు.

సూర్య గ్రహణ కాలంలో, మహానది (జీవనది) వద్ద ప్రతిమ సాన్నిధ్యంలో జపించిన వారికి మంత్ర సిద్ధి కలుగుతుంది. వారికి మహా విఘ్నములు, మహా దోషములు, మహా పాపములు తొలగిపోతాయి. అతడు అన్నీ తెలిసిన వాడవుతాడు... ఇది తెలుసుకోండి అంటుంది.. ఈ గణపతి అథర్వశీర్ష ఉపనిషత్తు.

ఓం శాంతిః శాంతిః శాంతిః

సమర్పణ 

మారేపల్లి ఉదయ భాస్కర శర్మ

వేద ఆశీర్వచనం

 *నమస్తే సదా వత్సలే మాతృ భూమే*


*కలియుగాబ్ది 5126*

*శ్రీ శాలివాహన శకం 1947 స్వస్తి శ్రీ చాంద్రమాన విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం - గ్రీష్మ ఋతువు - జేష్ఠ మాసం - శుక్ల పక్షం -‌ చతుర్థి - పునర్వసు -‌‌ భృగు వాసరే* (30.05.2025)


ప్రముఖ వేదపండితులు, తణుకు /తాలూకా ఇరగవరం వాస్తవ్యులు 

*బ్రహ్మశ్రీ గుళ్ళపల్లి శివశర్మ ఘనపాఠీ* *(9491391009, 9440091234)* గారి నేటి వేద ఆశీర్వచనం.





.🙏🙏 

భవదీయుడు

దశిక ప్రభాకరశాస్త్రి 

9849795167

----------------------------------------------

*పిల్లలకి బతుకుతో పాటు భారతీయత కూడా నేర్పండి*

ఆధ్యాత్మికత

 *ఆధ్యాత్మికత - సమాజము*




*ఆధ్యాత్మికత* అంటే మతాలకు, సిద్ధాంతాలకు, వర్గాలకు అతీతంగా *భక్తిని* ఏర్పర్చుకోగల్గి ఉన్నతమైన, ప్రశాంతమైన, నిశ్చలమైన, నిర్మలమైన, అన్య భావనలచే మిశ్రితము కాని స్థితిని చేరుకోనుట అని సాధారణ అర్థము. కాని, అంతటి ప్రశాంతత ఇప్పటి పరిస్థితులలో సాధ్యము కాదన్న భావన కల్గుతుంది. *ఎందుకంటే మహా మహా భక్తులలో గూడా మా దేవుడు గొప్పవాడoటే మా దేవుడు గొప్పవాడని (వైష్ణవులు, శైవులు, శాక్తేయులు, లింగాయతులు, తదితరులు) భావ వైరుధ్యాలతో సతమతమవుతున్నారు*. ఇటువంటి పరిస్థితులలో నిఖార్సైన ఆధ్యాత్మికతకు అవకాశమెక్కడిది. 


*ఈ మధ్యనే రామేశ్వరంలో శ్రీ రామచంద్రుల వారిచే శివ లింగ స్థాపన మరియు అర్చనపై పలు భిన్నాభిప్రాయాలు వెలువడుట ఆశ్చర్యకరము*.కాబట్టి ప్రస్తుతము నిరంతర భక్తి ప్రపత్తులు గలవారినే *ఆధ్యాత్మికులు* గా పరిగణిద్దాము. 


నీతి, ధర్మం ఈ రెండు మానవుణ్ణి సంస్కారవంతుడిని చేసి రాజమార్గంలో నడిపించేవి. నీతి అంటే దేశకాల పాత్రానుగుణంగా నడుచుకునే *హితరీతి* అని, ధర్మమంటే త్రికాలా సంబదితమైన *సత్యహిత* స్వరూపమని పెద్దలంటారు.


హృదయం, మేధ మానవుడికి జీవనాధారాలు. వీటిలో ఏది లోపించినా మానవత్వం సంపూర్ణం కాదు. ఈ రెండిటి సముచిత సమన్వయమే మానవత్వం. ఆ మానవత్వ సముపార్జనకై మానవుడు చేసే ప్రయత్నాలలో గ్రంథ పఠన, సాహిత్యోపాసన లలిత ప్రక్రియలు. 


ఈ క్రమంలో మానవుడు వేదాలను, వేదాంగాలను, ఉపనిషత్తులను, పురాణములను, ధర్మ శాస్త్రములను, ఆగమములను, ఇతిహాసములను (రామాయణ, మాహా భారత, భాగవతములు) మరియు భగవద్గీతను, ఇవే గాక లోక కళ్యాణ సంబంధమైన ఇతర గ్రంథములను అధ్యయనము చేసి ఉన్నాడు, కొనసాగిస్తున్నాడు కూడా. *ఇవి అన్నియు ఇహ పర సాధనాలే*. సాటిలేని నీతి, ధర్మ దర్పణాలు, ఇది విశ్వజనీనం. వీటిలోని ప్రతి వాక్యం, ప్రతి సన్నివేశం, ప్రతి కథ, ప్రతి పాత్ర గొప్ప నీతిని, ధర్మాన్ని స్పురింప జేస్తాయి.


ఆధ్యాత్మిక సూత్రాల ప్రకారము మానవ జన్మకు నాలుగు ప్రయోజనాలున్నాయి, వీటినే చతుర్విధ పురుషార్ధాలు అని అంటారు. అవి *ధర్మం*, *అర్థం*, *కామం*, *మోక్షం*. 


అర్థం, కామం, మోక్షం వ్యక్తిగతాలు. *లోక శ్రేయస్సును కల్గించేది "ధర్మం" మాత్రమే*. అందువల్ల ప్రతి ఒక్కరూ *ధర్మాన్ని రక్షించుకోవాలి*. దీనికి ప్రతిఫలంగా ధర్మం వ్యక్తుల్ని, సమాజాన్ని రక్షిస్తుంది. *ధర్మో రక్షతి రక్షితః*. సమాజంలో *ధర్మానికి* సమాంతరంగా *ధర్మ వ్యతిరేక* శక్తులు గూడా పనిచేస్తూ ఉంటాయి.


యోగ్యులైన వారు ఆ *పాపపు శక్తులను* చూస్తూ నిర్లక్ష్యము చేయరాదు. *ధర్మ రక్షణ* చేయకపోతే జాతి నిర్వీర్యమై పోతుంది. అందులో మనమూ (సామాన్యులు, మాన్యులు) ఉంటాము. *ఆధర్మాన్ని ఉపేక్షించడము ఆత్మహత్యా సదృశమే*.


*