ప్రపంచ కవులకు స్వగతం. మీ కవితలను ఇక్కడ పబ్లిష్ చేయవచ్చు. మీరు ముందుగా follow by Email బాక్సులో మీ మెయిల్ అడ్రసుని నింపి submit చేయండి. తరువాత followers ని click చేసి follower అవ్వండి. తరువాత మీ రచనను కొత్త కవులు పేజీలో అక్కడ సూచించిన విధంగా పంపండి. .
9, మార్చి 2025, ఆదివారం
దాశరధీ!కరుణాపయోనిధీ!
దాశరధీ!కరుణాపయోనిధీ!
"సంకరదుర్గమై దురిత సంకులమైన జగంబుజూచి స
ర్వంకషలీల ను త్తమ తురంగమునెక్కి కరాసిబూని వీ
రాంకవిలాస మొప్ప గలి కాకృత సజ్జనకోటికి న్నిరా
తంక మొనర్చితీవుకద దాశరథీ కరుణాపయోనిధీ. ॥ 78 ॥"
-కంచర్ల గోపన్న (రామదాసు)
కలికల్మషము నణగించి సంకరదుర్గమమై,పాపసంకులము నైన జగమునుధ్ధరింప అశ్వారూఢుడవై ఖడ్గమునుచేబట్టి కలికి అవతారివై సజ్జనుల నుధ్దరించెడు.కరుణామయా!దశరధరామా! నమోనమః!!🙏🙏🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷
శివుని మెడలో తాళి !
శివుని మెడలో తాళి !
సీ: చిన్ని వెన్నెల ఱేఁడు చెన్నైన సికపూవు ,
పసమించు పులితోలు పట్టుసాలు ,
" చిలువల యెకిమీడు బలుమానికపుఁ దాళి",
వాటంపు తెలిగిబ్బ వారువంబు ;
గఱికి పూజలు మెచ్చు గారాబు కొమరుండు ,
వలిగొండ కూతురు వలపు టింతి ;
జే జే తుటుము లెల్ల ఁ జేరి కొల్చెడు బంట్లు ,
నును వెండి గుబ్బలి యునికి పట్టు ;
గీ: లగుచుఁ జెలువొంద భువనంబు లనుదినంబు
రమణఁ బాలించు నిన్ను నేఁ బ్రస్తుతింతు
బుధనుత విలాస ! పీఠికాపుర నివాస!
కుముదహిత రహిత కోటి సంకాశ! కుక్కుటేశ!
రుక్మిణీకళ్యాణం-- కావ్యావతారిక--కూచిమంచి తిమ్మకవి .
కవులు ఘటనాఘటన సమర్ధులు. వారేమైనా కనగలరు. అనగలరు. కాక పోతే సదాశివుని కంఠసీమ నలంకరించిన
సర్పరాజును తాళిగా చెప్పగలరా? ఎగతాళిగాదిది, అక్షర సత్యం! తిమ్మకవి దానిని తాళిగా పేర్కొనినాఁడు. అదోకవితా విచిత్రం!
తిమ్మకవి విరచిత " రుక్మిణీ కళ్యాణ కావ్యావతారికలో నిపద్యమిది. పిఠాపురంలో నెలకొనిన కుక్కుటేశ్వర స్వామిని ప్రస్తుతిస్తూ , ఇలా అన్నాడాయన. "చందమామే నీకుశిరోభూషణం. పులిచర్మమే పట్టువస్త్రాలు. తెల్లటి ఎద్దే అశ్వం.పన్నగ ప్రభువే నీకంఠహారం .(చిలువల యెకిమీడు బలుమానికపుఁ దాళి) అంటూ వర్ణించు కొచ్చాడు కవి. అంటే పామే తాళిగామారిందని
భావం. ఈ తాళి యనేపదానికి ఉన్న పతకం, హారం ఇత్యాది నానార్ధములను బట్టి తిమ్మకవి యిలాప్రయోగించాడు.
చంద్రభాను చరిత్రం లో చరిగొండ మల్లన , ఉత్తర రామాయణంలో కంకంటి పాపరాజు కూడా హారాన్ని తాళిగా వర్ణిచారు. అన్నట్టు మనం యీమధ్య చూచిన గౌతమీపుత్ర శాతకర్ణి చిత్రంతో ప్రాచుర్యంలోకివచ్చిన ఒకప్రాచీన పదంకూడా యీపద్యంలో కనిపిస్తోంధి. అదే 'ఎకిమీడు' అనేపదం.దీనితోఁబాటు 'వెన్నెలఱేడు (చంద్రుడు ) పస (కాంతి ) తెలిగిబ్బ (తెల్లనియెద్దు)
వారువం (గుఱ్ఱము) వలిగొండ (మంచుపర్వతం) తుటుము (సమూహము ) వెండిగుబ్బలి(వెండికొండ)లాంటి అచ్చతెలుగు పదాలతోశివుడికి తిమ్మన అక్షరాభిషేకం చేశాడు.
తిమ్మకవి ప్రతిభ అపారం!
స్వస్తి!
తెలుగు వెలుగులు పత్రిక , సౌజన్యంతో!🙏🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷
అనగనగా
🔔 *అనగనగా...* 🔔
ఆఫీస్ నుంచి అలిసిపోయి వచ్చి స్కూటర్ షెడ్లో పెట్టేసి ఇంట్లోకి అడుగు పెట్టాను హూషారుగా. ఆఫీస్ లో ఎంత 'పాటు' పడి నీరసించి పోయినా ఇంట్లోకి అడుగు పెట్టడం మాత్రం ఉల్లాసభరితంగా ఉండాలన్నది మా ఆవిడ ఎప్పుడో ఇచ్చిన సూచన.
కాదు...కాదు.. వార్నింగ్! నేను నీరసంగా వస్తే ఆవిడగారి మూడ్ పాడైపోతుందట. అందుకే ఆఫీస్ లో చచ్చీచెడీ అలిసి పోయినా ఇంట్లోకి హుషారుగా నాకు రాని ఈలవేస్తూ అడుగుపెట్టడం అలవాటై పోయింది నాకు చాలా కాలంగా.
అరే! ఏమిటీ వింత? నేనెంతో హుషారుగా
వస్తే ఇల్లంతా ఇంత నిశ్శబ్దంగా ఉందేమిటీ? ఏమైంది చెప్మా! ఇంట్లో ఎవరూ లేరా అంటే వంటింట్లోంచి దోరగా వేగిన బజ్జీల వాసన కమ్మగా వెలువడుతోంది.
మా యిద్దరు బడుద్దాయిలూ ఓ మూల కూర్చుని బుద్ధిగా చదువుకుంటున్నట్లు నాటకమాడుతున్నారు. నా రూమ్ లోకి దూరి బట్టలు మార్చుకుని లుంగీ కట్టుకుని బయటికి వచ్చినా పరిస్థితిలో మార్చేమీ లేదు.
విసురుగా బజ్జీల ప్లేటు నా చేతిలో కొచ్చింది. నీళ్ళ గ్లాను టేబుల్ మీద నీళ్ళు ఒంపుకుంటూ నిలబడింది.
"ఏమిటోయ్ సత్యా! దేనికీ సత్యాగ్రహం? (సత్య+ ఆగ్రహం)" అడిగాను ఆశ్చర్యంగా - విసురుగా వంటగదిలోకి వెళ్ళిపోతున్న శ్రీమతిని ఆపి.
జవాబు ఫోర్స్ గా వచ్చింది. "ఇంక ఈ పిల్లల్ని ఆపడం నా వల్ల కాదంటే కాదు బాబూ! ఈ సెలవుల్లోనైనా వాళ్ళని హైదరాబాద్ తీసుకువెళ్ళకపోతే అస్సలు ఊరుకునేలా లేరు. మీరివాళ ఏదో ఒకటి తేల్చి చెప్పే వరకూ ఇద్దరూ పచ్చి మంచి నీళ్ళయినా ముట్టుకోమని వార్నింగిచ్చేరు. ఆ తరువాత మీ ఇష్టం."
ఓహో! అదా కారణం!
"హైదరాబాద్ వెళ్దాం డాడీ! చార్మినార్, గోల్కొండ చూద్దాం! మా ఫ్రెండ్సంతా ఎప్పుడో చూశారుట" అని పిల్లలు పాపం ఎప్పట్నుంచో అడుగుతున్నా నాకు ఏవో కారణాలతో కుదరడంలేదు. నేనూ, సత్యా కూడా హైదరాబాద్ చూడకపోవడంతో మాకూ చూడాలనే ఉంది.
ఐదు నిముషాలు ఆలోచించాను. బ్యాంక్ లో బ్యాలన్స్ వుంది. ఆఫీస్ లోనూ సెలవు దొరకడం పెద్ద కష్టమేమీ కాదు. ఇంకా వీళ్ళను బాధపెట్టడమూ మర్యాద కాదు.
కాసేపు తరువాత నెమ్మదిగా అన్నాను - "ఈ నెలలో మనం హైదరాబాద్ వెళుతున్నాం" అని.
అప్పటి వరకూ మన్ను తిన్న పాముల్లాగా పడి వున్న పిల్లలిద్దరూ "హేయ్" అంటు కల్లు తాగిన కోతుల్లా (పోలిక బాగా లేకపోతే వదిలేయండి) ఒక్క ఉదుటున లేచి వచ్చి నన్ను చుట్టుముట్టేశారు. నన్ను ముద్దుల్లో ముంచెత్తిన తరువాత బజ్జీల మీద దాడి చేశారు.
కాఫీ కప్పుతో మరియూ చిరునవ్వుతో నా దగ్గర కొచ్చి కప్పు చేతికి ఇచ్చింది సత్య 'నిజంగానా' అంటూ.
"నిజం. రేపటి నుంచీ ఆ పనిలోనే ఉంటాను" అన్నాను ఆవిడ బుగ్గ మీద సుతారంగా చిటికె వేసి. ఇదే మంచి తరుణం - నడుం నొక్కినా కిక్కురుమనదు.
ఆ మరునాడే లీవ్ శాంక్షన్ చేయించుకుని - గోదావరి ఎక్స్ ప్రెస్ కి నాలుగు టిక్కెట్లు రిజర్వ్ చేయించాను.
హైదరాబాద్ లో మా బ్రహ్మం ఉన్నాడు కాబట్టి ఉండడానికీ, తినడానికీ ఎటువంటి ప్రాబ్లమ్ లేదు. హోటల్ ఖర్చులు ఏమాత్రం వుండవు.
“హైదరాబాద్ వెళుతున్నాం గురూ! మన బ్రహ్మంగాడు ఎప్పట్నుంచో పాపం రమ్మని
అంటున్నాడు కూడాను. వారం రోజుల పాటు ఫ్యామిలీతో వాడింట్లోనే మకాం" చెప్పాను మరో మిత్రుడు పరాంకుశంతో హుషారుగా.
"బ్రహ్మం వాళ్ళింట్లో ఉంటారా?" చాలానే ఆశ్చర్యపోతూ నోరెళ్ళబెట్టాడు పరాంకుశం.
"అవును ఏం?" అన్నాను అయోమయంగా తెరచి ఉన్న వాడి నోట్లోని పిప్పి పళ్ళు లెక్కబెడుతూ.
"ఏం లేదులే. వెళుతున్నావుగా నీకే తెలుస్తుందిలే" అన్నాడు పరాంకుశం అదోలా నవ్వుతూ.
వాడి మాటలు నాకు అర్థంకాలేదు గానీ వాడి నోట్లోని పళ్ళలో ఇటు నాలుగు, అటు నాలుగు మొత్తం ఎనిమిది పళ్ళు మాత్రం పుచ్చిపోయినట్లు అర్థమయింది.
https://whatsapp.com/channel/0029VaAAuIn1NCrYXdsBqn2B
నేనూ, బ్రహ్మం, పరాంకుశం ఒకే ఊరివాళ్ళం. పైగా ఒకే క్లాసు వాళ్ళం. పదో తరగతి వరకూ కలిసే చదువుకున్నాం! కలిసే 'పిడత' పనులూ చేశాం. చిన్నప్పుడు చెట్ల మీదికి రాళ్ళు విసిరి చింతకాయలు, మామిడికాయలు, ఉసిరికాయలులాంటివి కొట్టుకొచ్చి మాకే కానీకి, పైసాకి అమ్మేవాడు బ్రహ్మంగాడు. ఏ గుడికో ప్రసాదాల కోసం వెళ్తే బయట మా చెప్పులకి కాపలా కాసినందుకు ఒక్కొక్కళ్ళ దగ్గరా అర్థణా చొప్పున వసూలు చేసిన మేధావి మా బ్రహ్మం. అలా ఎంతో సరదాగా గడిచింది మా బాల్యం.
"వీడు పెద్దయితే ఏ బ్యాంక్ ఆఫీసరో అవుతాడురా! కానీ ఎవ్వరికీ పైసా ఇవ్వడు" సరదాగా అప్పుడు మేం వేసుకున్న జోకులు నిజమై ఇప్పుడు హైదరాబాద్ లో ఓ పేరున్న బ్యాంక్ లో మేనేజర్ గా సెటిలయ్యాడు బ్రహ్మం.
వాడెప్పుడు ఫోన్ చేసినా "ఫ్యామిలీతో సహా ఓసారి రా గురూ మా ఇంటికి!' అని ఆహ్వానిస్తుంటాడు ఆప్యాయంగా. అందుకే నేను పరాంకుశం మాటలకు పెద్దగా ప్రాముఖ్యత ఇవ్వలేదు. మా ఆవిడ సూట్ కేసుల్లో బట్టలు సర్దుతూ "నాలుగు దుప్పట్లు, నాలుగు దిళ్ళూ పెడుతున్నాను. సరిపోతాయా" అంటుంటే -
"దుప్పట్లు, దిళ్ళూ ఏమీ వద్దు. మనం వెళుతున్నది మా ఫ్రెండ్ బ్రహ్మం ఇంటికి. హోటల్లో రూములు, బయటి తిళ్ళూ జాన్తా నై. అన్నీ వాడే చూసుకుంటాడు. ఆ డబ్బులు మిగులు మనకు. ఆ ఎమౌంట్ తో నీకేమైనా కొంటాలే తరువాత" అన్నాను- ఆవిడ ముఖం మెరిసిపోతుండగా!
📖
మమ్మల్ని రిసీవ్ చేసుకోడానికి సికింద్రా బాద్ స్టేషన్ కొచ్చాడు బ్రహ్మం. ఆటోల్లో వాడి ఇంటికి చేరుకున్నాం.
"రా వదినా రండి అన్నయ్యగారూ" అంటూ సాదరంగా మమ్మల్ని ఆహ్వానించింది బ్రహ్మం భార్య అందరి ఆడవాళ్ళలాగానే వరస కలిపేస్తూ. మా ఫ్యామిలీ కోసం ఓ రూమ్ అప్పటికే ఎలాట్ చేశారు.
"మీరు ఉన్నంత కాలం నిర్మొహమాటంగా ఈ రూం వాడుకోండి. మేం మీ గదిలోకి రాం" అన్నాడు బ్రహ్మం.
వాడికి 'థ్యాంక్స్' చెప్పి “ఒరేయ్ బ్రహ్మం! ఈ హైదరాబాద్ లో ఏది ఎక్కడుందో నాకు ఏమీ తెలీదు. దగ్గరుండి అన్నీ సరిగ్గా చూపించాల్సిన భారం నీదే" అన్నాను.
"అలాగేరా! నేనున్నానుగా. నీకెందుకు బెంగ. దగ్గరుండి అన్నీ నేను చూపిస్తాను" అభయ ముద్ర చూపించాడు ఎన్. టి. రామా... సారీ... శ్రీకృష్ణుడిలా.
"త్వరగా స్నానాలు చేసేసి తయారవ్వండి. ఈ రోజు సాలార్ జంగ్ మ్యూజియమ్, చార్మినార్ చూసేద్దాం" అన్నాడు బ్రహ్మం.
"ఏరా! గీజర్ ఉంది. వేన్నీళ్ళతో స్నానం చేస్తారా?చన్నీళ్ళేనా?" అడిగాడు బ్రహ్మం.
ఇంకా చలి ముదరలేదు. ఐనా వేడినీళ్ళ స్నానంలో ఉన్న హాయే వేరు.
"లేదురా! వేన్నీళ్ళతోనే చేస్తాం. మాపిల్లలకు చన్నీళ్ళ స్నానాలు పడవు" అన్నాను.
అందరం వేడినీళ్ళ స్నానాలు కానిచ్చేశాం.
బ్రహ్మం భార్య ఉప్మా, పూరీ చేసింది. జీడిపప్పు వేసి నేతితో చేసిన ఉప్మా ఘుమ ఘుమలాడుతుంటే ఇక మారువడ్డించుకో కుండా ఉండలేకపోయాను. వేడివేడి పూరీలు దుంపల కూరతో లాగిస్తుంటే లెక్క తెలీలేదు.
📖
సాలార్ జంగ్ మ్యూజియంలో ఒక్కో గదీ చూస్తుంటే టైము తెలియలేదు. పన్నెండు అవుతుండగా గంటల గడియారం దగ్గరకు తీసుకువెళ్ళి చూపించాడు. ఆ కొత్త(పాత) రకం గడియారాన్ని చూసి కేరింతలు కొట్టారు మా పిల్లలు. అటు నుంచి దగ్గర్లోని చార్మినార్ కి వెళ్ళి పైకెక్కి నగరం అందాలు చూశాం. చార్మినార్ దగ్గర సత్యా, పిల్లలు గాజులూ, పూసల దండలు లాంటివి ఏవేవో కొనుక్కున్నారు.
అలసిన శరీరాలతో ఇంటికి తిరిగి వచ్చిన మేము వేడినీళ్ళ స్నానాలతో సేదతీరాం!
బ్రహ్మాం టీవీ పెట్టాడు. డైలీ సీరియల్ ఏదో వస్తోంది.
"ఏరా! సోఫాల్లో కూర్చుని చూస్తారా? లేకపోతే గాడ్రేజ్ కుర్చీల్లో కూర్చుని చూస్తారా?" అని అడిగాడు.
"సోఫాలుండగా గాడ్రేజ్ కుర్చీలెందుకులేరా! సోఫాల్లోనే కూర్చుని చూస్తాం" అన్నాను కులాసాగా.
అందరం సోఫాల్లో కూర్చుని సీరియల్స్ చూశాం హాయిగా నవ్వుకుంటూ. తర్వాత భోజనాలకు పిలుపు వచ్చింది. డైనింగ్ టేబులు చుట్టూ సర్దుకున్నాం అందరం.
“ఏరా! ఐస్ వాటరా? లేకపోతే మామూలు నీళ్ళేనా?" అడిగాడు బ్రహ్మం.
"ఐస్ వాటర్ లేందే ముద్ద దిగదురా బాబూ మాకెవరికీ. ఐస్ వాటర్ పెట్టించు" అన్నాను. ఐస్ వాటర్ బాటిల్స్ ఫ్రిజ్ లోంచి తీసి గ్లాసులు నింపాడు బ్రహ్మం. విందు భోజనం వడ్డించింది బ్రహ్మం భార్య. కమ్మని భోజనం కడుపు నిండా తిని ఆఖర్న సేమియా పాయసం తాగేసరికి ఇంక భుక్తాయాసం రానే వచ్చింది. పిల్లలూ, ఆడవాళ్ళు టీ వీలో ఏదో కామెడీ సినిమా చూస్తున్నారు సీరియస్ గా. నేనూ, బ్రహ్మం వాడి గదిలో చేరి మా చిన్ననాటి ముచ్చట్లు జ్ఞాపకం చేసుకుని ఆ రోజులు మళ్ళీ తిరిగి రావని తీర్మానించాం.
అలసిపోయిన శరీరానికి నిద్రముంచుకు వస్తుంటే పడుకోవడానికి లేచాను. టీ వీలో సినిమా కూడా అయిపోవడంతో మా ఆవిడ, పిల్లలు కూడా లేచారు. మేం మాకు ఎలాట్ చేయబడిన రూంలోకి వెళ్ళిపోయాం.
ఆ రాత్రి కి "ఏరా! ఎ.సి. ఉంది. వెయ్యమంటారా? అక్కరలేదా?" అడిగాడు బ్రహ్మం.
వాతావరణం అంత వేడిగా ఏంలేదు. ఐనా ఉన్న సౌకర్యం ఎందుకు వదులుకోవాలి?
"ఎ.సి. లోనే పడుకుంటాంరా! వెయ్యి" అన్నాను.
వాడు ఎ.సి. ఆన్ చేసి 'గుడ్ నైట్' చెప్పి వెళ్లిపోయాడు. ఏం మర్యాదలు! ఏం మర్యాదలు! ఏం కావాలో అడిగి మరీ సమకూరుస్తున్నాడు మా బ్రహ్మంగాడు.
స్వర్గం లోకి చొచ్చుకొచ్చినట్లుగా ఉంది మాకు. మరి ఆ పరాంకుశం గాడెందుకలా సాగదీసాడు, బ్రహ్మం ఇంట్లో ఉంటున్నారా అంటూ?
ఎ.సి. చల్లని గాలిలో ఆదమరచి నిద్రించాం. రోజూ మా ఆవిడ బ్రహ్మం భార్యకు వంట పనిలో సాయం చేసేది.
మా పిల్లలిద్దరూ రోజూ రాత్రిపూట వాళ్ళ కొచ్చిన మేజిక్, మిమిక్రీ కళలు ప్రదర్శించే వారు. బ్రహ్మం పిల్లలిద్దరూ మా వాళ్ళ ప్రతిభకు ఆశ్చర్యపోతుంటే- వాళ్ళకూ మేజిక్, మిమిక్రీ నేర్పించారు మా పిల్లలు. వాళ్ళకు స్టేజ్ ప్రదర్శనలిచ్చిన అనుభవం ఉంది.
రోజుకో ప్రదేశం చొప్పున హైదరాబాదంతా తిప్పి చూపిస్తున్నాడు బ్రహ్మం. ఎక్కడా నన్ను పర్స్ తీయనీయడంలేదు. కానీ అప్పుడప్పుడూ వాడు నోట్ బుక్ లో ఏవో లెక్కలు రానుకోవడం గమనించాను.
ఓ సాయంత్రం టాంక్ బండ్ మీద చల్లగాలి పీల్చి బిర్లామందిర్ కెళ్ళాం. ఆ మర్నాడు గోల్కొండ కోటకి వెళ్ళాం. మా అందరికీ బాగా నచ్చింది.
ఓరోజు అందరం కలిసి సినిమాకి వెళ్ళి అట్నుంచి అటు ఏదయినా మంచి హోటల్లో డిన్నర్ చేసి రావాలని నిశ్చయించుకున్నాం.
"ఏరా! బస్ లో వెళ్దామా? లేకపోతే టాక్సీలో వెళదామంటావా?" అని అడిగాడు బ్రహ్మం.
ఎప్పుడైనా సరే - బస్ కంటే టాక్సీ నే బెటర్. బస్ లో సీట్లు దొరుకుతాయన్న గ్యారంటీ లేదు. టాక్సీ ఐతే ఇంటి ముందే ఎక్కి కూర్చుని డైరెక్ట్ గా థియేటర్ ముందు దిగొచ్చు. అదే చెప్పాను.
"అయితే ఫోన్ చేసి టాక్సీ పిలిపిస్తాను. ఎ.సి. టాక్సీలో వెళదామా లేకపోతే మామూలు టాక్సీలో వెళదామా" మళ్ళీ అడిగాడు బ్రహ్మంగాడు.
అయ్యబాబోయ్! వీడి మర్యాదలు భరించ లేకపోతున్నానురా బాబూ! నాతోపాటు పిల్లలందరూ కూడా ఏ.సి టాక్సీకే ఓటు వెయ్యడంతో ఫోన్ చేసి ఎ.సి. టాక్సీ రప్పిoచాడు వాడు.
ఎ.సి. థియేటర్ లో సినిమాకి టిక్కెట్లు కూడా ఫోన్ లోనే బుక్ చేశాడు. ఇంత దర్జాగా మేమెప్పుడూ సినిమాకి వెళ్ళలేదు. ఈసురోమని ఏ బస్ లోనో, ఆటో లోనో వెళ్ళేవాళ్ళం - ఆదీ నాన్ ఏ.సి. థియేటర్ కి. వాడి పుణ్యమా అని ఆ అదృష్టం ఇలా కలిసివచ్చింది. ఎప్పట్లానే బ్రహ్మం అక్కడా నన్ను పర్సు తీయనీయలేదు. సినిమా చూసి మంచి హోటల్లో భోజనాలు కానిచ్చి టాక్సీలో ఇంటికొచ్చేసరికి పదకొండు దాటింది.
మర్నాడు జూకి తీసుకువెళ్ళాడు. జూలో వాడి పిల్లలూ, మా పిల్లలూ కలిసి చేసిన హంగామా అంతా ఇంతా కాదు.
హైదరాబాద్ లో ముఖ్యంగా చూడాల్సినవి అన్నీ చూశాం. ఆ మరునాడు ఉదయమే మా తిరుగు ప్రయాణం. ఆ రాత్రి భోజనాల దగ్గర ఈ వారం రోజులూ వాడిచ్చిన ఆమోఘమైన అతిథ్యానికి కృతజ్ఞతలు తెలియజేసుకున్నాను.
"చాలా థాంక్స్ రా! పాపం మా కోసం ఈ వారం రోజులూ నువ్వు ఆఫీస్ కి సెలవు కూడా పెట్టేసి అన్నీ దగ్గరుండి చక్కగా చూపించావు. మీ మర్యాదలు చూస్తుంటే మళ్ళీ వచ్చే సంవత్సరం కూడా ఇక్కడికి రావాలనిపిస్తోంది. చెల్లెమ్మా! అన్నపూర్ణ తల్లిలా నువ్వు ఇచ్చిన ఆతిథ్యాన్ని జీవితాంతం మరిచిపోలేం. చాలా థాంక్సమ్మా! మీ రుణం ఎప్పటికీ తీర్చుకోలేము" అన్నాను.
"దాందేముందిలేరా! ఇందులో మేము చేసింది ఏమీ లేదు. ఇదిగో మొత్తం అంతా ఇందులో లెక్కరాసి ఉంచాను. చెక్ చేసుకుని పే చేసేస్తే సరిపోతుంది. రుణం ఇప్పుడే తీరిపోతుంది" అంటూ నా చేతిలో నాలుగు పేజీల లిస్ట్ ఏదో పెట్టాడు బ్రహ్మం.
ఆ లిస్ట్ చూసేసరికి మూర్చ వచ్చినంత పనైంది నాకు. అది.. అది... బ్రహ్మంగాడు మా కోసం పెట్టిన ఖర్చుల లిస్టు. నేను ఇప్పుడు అది పే చెయ్యాలన్నమాట.
రూం రెంట్ రోజుకి 200 రూపాయల చొప్పున ఆరు రోజులకు 1200. రెండు పూటలా రెండు టిఫిన్లు ప్లస్ కాఫీ నలుగురికి ఆరు రోజులకు 20x2×4×6= 960.
పై విధంగానే రెండుపూటలా రెండు భోజనాలు (లంచ్ మరియు డిన్నర్) నలుగురికి ఆరు రోజులకు 30×2×4×6=1440.
ఆరు రోజులకు నలుగురికి గీజర్ వేసుకున్నందుకు కాలిన కరంట్ యూనిట్లు రేటు, సోఫాలో కూర్చుని టీవీ చూసినందుకు, ఎ.సి. టాక్సీ రెంట్, ఐస్ వాటర్ కి, ఎ.సి. దియేటర్లో సినిమా ఖర్చు మొత్తం ఎనిమిది మందికి డివైడెడ్ బై రెండు, మాకోసం వాడు ఆరు రోజులు సెలవు పెట్టినందుకైన హాఫ్ పే లీవ్ శాలరీ.
చివరికి మా రెండోవాడి చేతిలోంచి పొరపాటున కిందపడి పగిలిపోయిన అణా కానీ గాజుగ్లాసు ఖరీదు... ఇలా ఇలా సాగిపోయిందా బిల్లు. నాలుగో పేజీ చివర్లో టోటల్ చూస్తే అది 5236.75 రూపాయలు గా తేలింది.
నేను తలెత్తి చూశాను. వాడు నవ్వుతూ, "ఒరేయ్! ఈ ఊళ్ళో నేను లేకపోతే నువ్వు ఏ హోటల్లోనో ఉండాల్సిందే కదా! అప్పుడు ఈ ఖర్చులన్నీ నువ్వే భరించాలి కదా. హోటల్ లో ఉండి నువ్వే ఈ ఖర్చులన్నీ పెట్టుకుంటే దీనికి రెట్టింపు అవుతుంది తెలుసా! అయినా ఈ విషయం నీకు తెలీదని కాదనుకో" అన్నాడు.
నేనలా నిర్ఘాంతపోయి మాట రాక మాట్లాడలేక చూస్తూ ఉండిపోయాను.
పరాంకుశం అన్న మాటల్లోని భావం ఇప్పుడు అర్థమైంది నాకు. అందుకేనా అంత ఆశ్చర్యపోయాడు వాడు. ఐనా ఇంత అన్యాయమా! వాడిన్ని ఖర్చులు పెడుతుంటే, వెళ్ళిపోయే ముందు వాళ్ళ పిల్లల చేతిలో ఎంతో కొంత పెడదామని అనుకున్నానే. సరే ఏం చేస్తాం! చేతులు ఆల్రెడీ కాలాయి.. ఇప్పుడు ఆకులు పట్టుకున్నా ఏం లాభం!
ఎంతో మర్యాద చేస్తున్నవాడిలా ఏ.సి. వెయ్యాలా? గీజర్ వెయ్యమంటారా? సోపాలో కూర్చుంటారా? అని వింతగా అడుగుతుంటే మర్యాద చేస్తున్నాడని అనుకున్నాను గానీ ఇలా గుండెలు తీసిన బంటులా బిల్ చేతిలో పెడతాడని ఉహించలేకపోయాను. ప్రతీ దానికీ డబ్బులు వసూలు చేసే బుద్ధి ఇంకా పోలేదన్నమాట వీడికి.
ఏం చెయ్యాలి ఇప్పుడు? డబ్బులు పే చేసేయవచ్చు. కానీ వీడికి బుద్ధి చెప్పాలనీ, ఎవరూ నేర్పని గుణపాఠం నేర్పాలనీ అనిపిస్తోంది నాకు. చిన్నప్పటి ఫ్రెండ్ కదా అని ఇంటికి వస్తే ఆదరించి బిల్ చేతిలో పెడతాడా!
"అవున్రా! నిజమే! మేము హోటల్ లో దిగితే ఇంకా ఎక్కువే ఖర్చయ్యేది. ఒక్కసారి బిల్ చెక్ చేసి పే చేసేస్తాను" అంటూ మా 'అద్దెరూం' లోకి వచ్చేశాను.
మరునాడు మా సామానులు ఆటోలో వేసుకుని "ఇదుగోరా నా బిల్లు" అన్నాను వాడి చేతిలో ఓ కాగితం పెడుతూ. వాడు ఆశ్చర్యంగా చూస్తుండగా...
"ఏం లేదురా! ఈ వారం రోజులపాటు మా పెద్దాడు తన మేజిక్ ప్రదర్శన తోనూ, మా చిన్నాడు తన మిమిక్రీ కళతోనూ మిమ్మల్ని ఎంటర్ టైన్ చేశారుకదా! దానికీ, మీ పిల్లలిద్దరికి మేజిక్, మిమిక్రీ నేర్పినందుకూ, మా ఆవిడ ఈ వారంరోజులూ మీ ఆవిడకు వంటపనిలోనూ, అంట్లు తోమడంలోనూ సాయపడినందుకు మొత్తం అయిన బిల్లు 6500 రూపాయలు. ఇందులో నేను నీకు ఇవ్వాల్సిన 5236-75 రూపాయలు మినహాయించుకుని మిగిలిన 1263-25 రూపాయలు ఇచ్చేస్తే మేమిక స్టేషన్ కి బయలుదేరుతామురా. అన్నట్టు ఒరేయ్ - మా పిల్లల మేజిక్, మిమిక్రీ కళలు లాంటివి ప్రదర్శించడానికి వాళ్ళను బుక్ చేసుకున్నా మీ పిల్లలకు మేజిక్, మిమిక్రీ ఎవరైనా గురువు దగ్గిర నేర్పించినా, మా ఆవిడ బదులు నువ్వు ఎవరినైనా పనిమనిషిని పెట్టుకున్నా మొత్తమంతా కలిపి ఇంతకంటే ఎక్కువే అవుతుంది తెలుసా? అయినా ఈ విషయం నీకు తెలియదని కాదనుకో" అన్నాను ఆటో ఎక్కికూర్చుని.
వాడి ముఖంలో కత్తివేటుకి నెత్తురు చుక్క లేదు. ఇంతకీవాడు నాకు ఇవ్వాల్సిన బ్యాలన్స్ అమౌంట్ ఇచ్చాడా లేదా అని కదా మీ అనుమానం? పోనీలే చిన్నప్పటి స్నేహితుడు కదా అని నేనే ఆ మొత్తం వదిలేశాను. అదీ సంగతి!
వచ్చే సంవత్సరం సెలవులకి మళ్ళీ హైదరాబాద్ కి కాకుండా వేరే ఊరుకి వెళ్లాలని అప్పడే నిర్ణయించుకున్నాను...
.🙏🏻🙏🏻🔔🔔🔔🙏🏻🙏🏻
వ్యాపారం..వాత్సల్యం..* వ్యాపారం..వాత్సల్యం..*
*మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామివారితో అనుభవాలు..*
*వ్యాపారం..వాత్సల్యం..*
1980 వ సంవత్సరం లో (అప్పటికి శ్రీ స్వామివారు సిద్ధిపొంది నాలుగు సంవత్సరాల కాలం పూర్తి అయింది..) శ్రీ మీరాశెట్టి గారికి కందుకూరులో నూనె మిల్లు స్థాపించి, వంట నూనెల వ్యాపారం చేయాలని ఆలోచన వచ్చింది..తనకు తోడుగా తన బావమరిది రామయ్య శ్రేష్టి ని కలుపుకోవాలని అనుకున్నారు..రామయ్య శ్రేష్టి కూడా అందుకు సమ్మతించారు..ఆ సమయం లో నేను కూడా కందుకూరు లో వ్యాపారం చేస్తూ వున్నాను..శ్రీ మీరాశెట్టి గారు కూడా మా దుకాణం నుంచే తన వ్యాపార కార్యకలాపాలు చూసుకోవాలని నిర్ణయం తీసుకున్నారు..
ఏదైనా పని మొదలు పెట్టేముందు..మొగలిచెర్ల వెళ్లి, శ్రీ దత్తాత్రేయ స్వామి వారి సమాధి వద్ద నమస్కారం చేసుకొని రావడం శ్రీ మీరాశెట్టి గారికి అలవాటు..అదే ఆనవాయితీ పాటిస్తూ..శ్రీ రామయ్య శ్రేష్టి తో కలిసి మొగలిచెర్ల లోని శ్రీ స్వామివారి మందిరానికి వచ్చారు..తాము చేయబోయే వ్యాపారానికి శ్రీ స్వామివారి అనుమతి తీసుకోవాలని మీరాశెట్టి గారి అభిప్రాయం..ఉదయాన్నే శ్రీ స్వామివారి సమాధి వద్దకు వెళ్లి నమస్కారం చేసుకున్నారు..ఉత్సవ విగ్రహం వద్ద అర్చన చేయించుకున్నారు..ఆ సమయం లో మీరాశెట్టి గారి మనసులో ఒక రకమైన వేదన కలిగింది..శ్రీ స్వామివారి నుంచి అనుమతి రాలేదు అనే భావన కలిగింది..అయినా సర్దిచెప్పుకున్నారు..మనం చేసేది మంచి పనే కదా..ఇంకెందుకు ఆలోచించడం అని ఒక భరోసాను తనకు తానే ఇచ్చుకున్నారు..కానీ ఆరోజు రాత్రి మీరాశెట్టి గారికి శ్రీ స్వామివారు స్వప్న దర్శనం ఇచ్చి.."అనవసరపు ఆర్భాటాలు వద్దు..ఉన్నంతలో జీవితాన్ని గడుపమని" చెప్పారట..ఉలిక్కిపడి లేచి కూర్చున్నారు..వ్యాపారం కొనసాగించాలా?..వద్దా?..అనే మీమాంసే లేదు..శ్రీ స్వామివారు వద్దు అని సంకేతం ఇచ్చారు..ఇక కొనసాగించడం మంచిదికాదు..కానీ..ముందుగానే కొంత పెట్టుబడి పెట్టి, బావమరిది రామయ్య ను కూడా కలుపుకొని వున్న కారణంగా..ఎలా వెనక్కురావాలని రెండు రోజుల పాటు బాధ పడ్డారు..చివరకు రామయ్య శ్రేష్టి కి అసలు విషయం చెప్పారు.. రామయ్యశ్రేష్టి గారు తాను నిర్వహించుకుంటానని గట్టిగా చెప్పారు..మీరాశెట్టి గారు తనకు శ్రీ స్వామివారి ఆదేశం ఇచ్చిన సంగతిని కూడా దాచుకోకుండా చెప్పేసారు..అయినా రామయ్య శ్రేష్టి గారు తాను నూనె వ్యాపారం చేస్తానని పట్టుబట్టారు..విధిలేక మీరాశెట్టి గారు ఆ వ్యాపారాన్ని ఆయన కు అప్పచెప్పారు..
మరో నెలరోజుల కల్లా..రామయ్యశ్రేష్టి నూనె వ్యాపారాన్ని ప్రారంభించాడు..ఆరేడు నెలలు గడిచాయి..రామయ్య శ్రేష్టి గారు అనుకున్నట్లు గా వ్యాపారం జరుగలేదు..నష్టం కనబడసాగింది..అప్పుడు శ్రీ స్వామివారు మీరాశెట్టి గారిని హెచ్చరించిన విషయం స్ఫురణకు వచ్చింది..ఇక ఆలస్యం చేయకుండా..మరింత నష్టం మూటకట్టుకోకుండా.. ఆ వ్యాపారాన్ని మూసి వేశారు రామయ్య గారు..తక్కువ నష్టాలతో బయటపడ్డారు..శ్రీ స్వామివారు వాత్సల్యం తో సకాలంలో హెచ్చరించి.. తనను నష్టాల పాలుకాకుండా కాపాడారని మీరాశెట్టి గారు పదే పదే చెప్పుకునేవారు..
మీరాశెట్టి గారికి సంబంధించినదే మరో అనుభవం..
ఒకసారి మీరాశెట్టి దంపతులు శ్రీ స్వామివారి వద్దకు రావాలని బయలుదేరారు..వారి స్వగ్రామం నుండి శ్రీ స్వామివారి ఆశ్రమానికి సుమారు పది కిలోమీటర్ల దూరం ఉంది..నడుచుకుంటూ వచ్చారు..శ్రీ స్వామివారు ఆ సమయానికి ఆశ్రమం బైట వున్నారు..మీరాశెట్టి దంపతులను చూసి.."రండి..మీ కోసమే ఎదురుచూస్తున్నాను.." అన్నారు..శ్రీ స్వామివారికి నమస్కారం చేసుకొన్నారు..వారిద్దరినీ తీసుకొని ఆశ్రమం లోపలికి వెళ్లారు శ్రీ స్వామివారు..తాను ధ్యానం చేసుకునే గది బైట మీరా శెట్టి గారిని కూర్చోమని చెప్పి..ఆ దంపతుల కెదురుగా పద్మాసనం వేసుకొని స్వామివారు కూర్చున్నారు.."మీరాశెట్టి..మీరు నా మీద విశ్వాసం తో ఈ ఆశ్రమాన్ని కట్టించారు..భవిష్యత్ లో ఇది ఒక దత్త క్షేత్రంగా మారుతుంది..మీ పేరు కూడా నిలిచిపోతుంది..మీకు నా పరిపూర్ణ ఆశీస్సులు ఉంటాయి.." అన్నారు..శ్రీ స్వామివారు ఆదరంతో చెప్పిన ఆ మాటలను మీరాశెట్టి గారు ఎప్పుడూ మననం చేసుకుంటూ వుండేవారు..
శ్రీ స్వామివారికి అత్యంత సన్నిహితంగా మెలిగినా.. ఏనాడూ తన పరిధులు దాటి అహంకరించకుండా..శ్రీ స్వామివారిని భక్తి విశ్వాసాలతో కొలచిన ధన్యజీవి శ్రీ మీరాశెట్టి గారు..
సర్వం..
శ్రీ దత్తకృప!
(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగలిచెర్ల గ్రామం..లింగసముద్రం మండలం..SPSR నెల్లూరు జిల్లా..పిన్ : 523 114..సెల్..94402 66380 & 99089 73699).
ఐదువారాల నిద్ర..*
*మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామివారితో అనుభవాలు..*
*ఐదువారాల నిద్ర..*
"నేను చాలా ఇబ్బందుల్లో వున్నాను..దిక్కు తోచడం లేదు..నువ్వు కొద్దిగా డబ్బు సర్దుబాటు చేస్తే..మళ్లీ నేను కోలుకున్నాక నీ డబ్బు నీకు వడ్డీ కలిపి తిరిగి ఇచ్చేస్తా..కాదనకు.. ఇవి చేతులు కావు, కాళ్లనుకో.." అంటూ ఆ వ్యక్తి శ్రీ మీరాశెట్టి గారి వద్ద ప్రాధేయపడసాగాడు..మీరాశెట్టి గారు అతనిని అనునయించాలని చూస్తున్నారు గానీ వీలు కుదరటం లేదు..ఇప్పటికిప్పుడు ఎంతో కొంత డబ్బు అతని చేతిలో పెడితేగానీ వదిలేటట్లు కనిపించడం లేదు..
ఆ వచ్చిన వ్యక్తి పేరు వెంకటేశ్వర్లు..మీరాశెట్టి గారికి బాగా తెలిసిన వాడే..వ్యాపారం చేసి అందులో నష్టపోయాడు.. అప్పులపాలయ్యాడు..నిజానికి అతను వ్యాపారం మొదలుపెట్టిన నాడు ఏ ఇబ్బందీ లేదు..ఉన్నంతలో సర్దుకొని అలానే కొనసాగించి వుంటే..ఈ పరిస్థితి దాపురించేది కాదు..అత్యాశకు పోయి..అప్పులు తెచ్చి వ్యాపారాన్ని పెంచుకోవడానికి ప్రయత్నం చేసాడు..తాను పెట్టిన పెట్టుబడి కి, రాబడికి వ్యత్యాసం పెరిగిపోయి..అప్పుల్లో పడ్డాడు..ఇక దిక్కుతోచక మీరాశెట్టి గారి వద్దకు వచ్చాడు..
"నువ్వంతగా బాధ పడుతున్నావు కాబట్టి..నేను నీకు పదివేల రూపాయలు సహాయం చేస్తాను..అదికూడా నువ్వొక మాట ఇస్తేనే.." అన్నారు మీరాశెట్టి గారు..ఏమిటో చెప్పామన్నాడు వెంకటేశ్వర్లు..ఐదు వారాల పాటు, వారానికి ఒకరోజు లెక్కన.. భార్యతో కలిసి..మొగలిచెర్ల గ్రామం వద్ద ఉన్న శ్రీ దత్తాత్రేయ స్వామి వారి మందిరం వద్ద నిద్ర చేయాలని..తన సమస్యలు తీరిన తరువాత..శ్రీ స్వామివారి మందిరం వద్ద అన్నదానం చేయాలని..షరతులు పెట్టారు మీరాశెట్టి గారు..సరే అన్నాడు వెంకటేశ్వర్లు..
అనుకున్న ప్రకారం..వెంకటేశ్వర్లు కు పదివేల రూపాయల ఆర్థిక సహాయం చేసారు మీరాశెట్టి గారు..(1980 ప్రాంతంలో పల్లెటూరులో..పదివేల రూపాయాలంటే పెద్ద మొత్తం క్రిందే లెఖ్ఖ!). వెంకటేశ్వర్లు ఆ డబ్బును వెంటనే ఖర్చు పెట్టలేదు..ముందుగా మీరాశెట్టి గారికి మాట ఇచ్చిన ప్రకారం..ఆరోజు సాయంత్రమే బయలుదేరి మొగలిచెర్ల లోని శ్రీ దత్తాత్రేయ స్వామి వారి మందిరానికి భార్యతో సహా వెళ్ళాడు..ఆరోజు రాత్రి శ్రీ స్వామివారి మందిరం లో నిద్ర చేశారు వెంకటేశ్వర్లు దంపతులు..తెల్లవారి లేచి..శ్రీ స్వామివారి సమాధిని దర్శనం చేసుకొని..తిరిగి తన ఊరికి వచ్చేశాడు..మీరాశెట్టి గారిని కలిసి, తాను మొగలిచెర్ల వెళ్లొచ్చిన సంగతి చెప్పాడు..
మరో వారం గడిచేసరికి మీరాశెట్టి గారు వెంకటేశ్వర్లు సంగతి దాదాపుగా మర్చిపోయారు..అతని బాధ అతను పడుతున్నాడు..పదే పదే అతని వెంటపడటం ఎందుకని మీరాశెట్టి గారి భావన..పైగా వెంకటేశ్వర్లు సమస్యను ను మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామివారి కి అప్పచెప్పాము కదా..ఆ స్వామే అన్నీ చూసుకుంటాడు అనే నమ్మకం మీరాశెట్టి గారిది..
మరో రెండువారాలు గడిచాయి..మొత్తం మూడువారాలు వెంకటేశ్వర్లు మొగలిచెర్ల వెళ్లి, శ్రీ స్వామివారి సమాధి మందిరం లో నిద్ర చేసి వచ్చాడు..అతని ఆర్ధిక పరిస్థితి లో మార్పు రాసాగింది..అప్పుల వాళ్ల వత్తిళ్ళు కొద్దిగా తగ్గడమే కాదు, తనకు రావాల్సిన పైకం కూడా వసూలు అవడం జరిగింది..మీరాశెట్టి గారి వద్ద తీసుకున్న పదివేల రూపాయల లో ఏమీ ఖర్చు కాలేదు..అలానే ఉండిపోయింది..వెంకటేశ్వర్లు కు శ్రీ స్వామివారి మీద నమ్మకం ఏర్పడింది..నాలుగో వారం కూడా మొగలిచెర్ల వెళ్లి, నిద్ర చేసి వచ్చాడు..ఐదు వారాలు పూర్తయ్యే సరికి..వెంకటేశ్వర్లు లో మునుపటి నైరాశ్యం లేదు..ఉత్సాహంగా వున్నాడు..ఇంకో రెండు నెలల కల్లా..వ్యాపారం గాడిలో పడింది..అనవసరపు ఆర్భాటాలు తగ్గించుకున్నాడు..ఉన్నంతలో వ్యాపారం చేసుకోసాగాడు..చిత్రమేమిటంటే..ఐదు వారాల పాటు శ్రీ స్వామివారి మందిరం వద్ద నిద్ర చేయాలనుకున్న వెంకటేశ్వర్లు..ప్రతి వారం మొగలిచెర్ల వచ్చి, మందిరం వద్ద నిద్ర చేసి వెళ్లసాగాడు..
మీరాశెట్టి గారి వద్ద తాను అప్పుగా తెచ్చిన పదివేల రూపాయలను తిరిగి ఇవ్వడానికి ఆయన వద్దకు వెళ్లి.."నువ్వు ఇచ్చిన ఈ డబ్బు ఖర్చు పెట్టలేదు..ఇంట్లోనే ఉంచుకున్నాను..తీవ్రమైన అవసరం వస్తేనే ఖర్చుపెట్టాలని అనుకున్నాను..కానీ ఈలోపలే ఆ దత్తాత్రేయ స్వామి దయ వల్ల నా ఇబ్బందులు తొలిగాయి..చిన్న చిన్న సమస్యలను నేను పరిష్కరించుకోగలను..నువ్వు ఆరోజు మొగలిచెర్ల వెళ్లి, శ్రీ దత్తాత్రేయ స్వామి వద్ద నిద్ర చేయాలని నాచేత ప్రమాణం చేయించుకున్నావు..నువ్వు చెప్పినట్లే చేసాను..ఆ స్వామి కరుణించాడు.. ఇంకెప్పుడూ అత్యాశకు పోను..ఉన్నంతలో వ్యాపారం చేసుకుంటాను..ఇదిగో నువ్విచ్చిన డబ్బు..వడ్డీ తో కలిపి తెచ్చాను.." అన్నాడు..
మీరాశెట్టి గారు వడ్డీ తీసుకోకుండా తానిచ్చిన పదివేల రూపాయలు మాత్రం తీసుకున్నారు..మొగలిచెర్ల దత్తాత్రేయ స్వామి వారి పాదాలను నమ్ముకోమని..వాటిని విడవకుండా పట్టుకోమని..వెంకటేశ్వర్లు కు మళ్లీ సలహా ఇచ్చారు..
మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామి వారితో మీరాశెట్టి గారిదే మరో అనుభవం..రేపు..
సర్వం..
శ్రీ దత్తకృప!
(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగలిచెర్ల గ్రామం..లింగసముద్రం మండలం..SPSR నెల్లూరు జిల్లా..పిన్ : 523 114..సెల్..94402 66380 & 99089 73699).
మొగలిచెర్ల అవధూత
*మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామివారితో అనుభవాలు..*
*ప్రతిభ..పరీక్ష..*
"శ్రీ దత్తాత్రేయ స్వామివారిని మనస్ఫూర్తిగా నమ్మానండీ..శ్రీ స్వామివారి కృప వల్ల నాకు ఈరోజే మేలు జరిగింది..మీరు రోజూ భక్తులు పొందిన అనుభవాలను పోస్ట్ చేస్తున్నారు కదా..నేను చదువుతూ ఉన్నానండీ..నాకూ కొన్ని అనుభవాలు కలిగాయి..నిజంగా మొగలిచెర్ల అవధూత దత్తాత్రేయుడే నాకు మేలు చేశాడండీ..మీతో చెప్పుకోవాలని అనిపించి మీకు ఫోన్ చేస్తున్నాను..ఈ అనుభవాన్ని కూడా మీరు తప్పకుండా వ్రాయండి.."
వరంగల్ లో లాయర్ గా పనిచేస్తున్న శ్రీమతి ప్రతిభ గారు నాకు ఫోన్ చేసి ఎంతో ఉద్వేగంతో చెప్పిన మాటలివి..ప్రతిభ గారు ఫోన్ చేసే క్షణం దాకా వారెవరో నాకు తెలీదు..నిజానికి ఈరోజు దాకా వారిని నేను కలుసుకోలేదు..ఆవిడ గారు తనను మొగలిచెర్ల లో సిద్ధిపొందిన శ్రీ దత్తాత్రేయ స్వామి వారే దగ్గరుండి అన్నివిధాలా ఆదుకున్నారని త్రికరణ శుద్ధిగా నమ్మారు..
శ్రీమతి ప్రతిభ గారు వరంగల్ లో వుంటారు..ప్రస్తుతం లాయర్ గా ప్రాక్టీస్ చేస్తున్నారు..వృత్తి పరమైన పరీక్ష నిర్వహిస్తున్నారని తెలిసి..తాను కూడా ఆ పరీక్ష వ్రాయాలని సంకల్పించారు..దరఖాస్తు చేసుకున్నారు..కానీ ఆ పరీక్షకు ముందురోజు దాకా హాల్ టికెట్ రాలేదు..ప్రతిభ గారు పూర్తిగా ఆందోళన చెందారు..రాత్రి తొమ్మిది గంటల దాకా ఎదురు చూశారు..హాల్ టికెట్ రాలేదు..ప్రక్కరోజు ఉదయం పది గంటలకు హైదరాబాద్ లో పరీక్ష వ్రాయాలి..ఆవిడకు దిక్కు తోచలేదు..
"స్వామీ దత్తాత్రేయా..నువ్వే దిక్కు..నేను పరీక్ష వ్రాయడానికి మార్గం చూపించు తండ్రీ!.." అని మనసులో పదే పదే ప్రార్ధన చేసుకోవడం మొదలుపెట్టారు..
తెల్లవారింది..ఆదివారం ఉదయం ఏడు గంటలకు ప్రతిభ గారు పరీక్ష గురించి ఆశ వదులుకున్నారు..కానీ చిత్రంగా ఆ సమయం లో హాల్ టికెట్ ఇంటర్నెట్ ద్వారా వచ్చింది..తన కళ్ళను తానే నమ్మలేక పోయారు..కానీ మరో సమస్య ఉన్నది.. ఇప్పటికిప్పుడు బైలుదేరినా.. పరీక్ష కు సమయానికి అందుకోవడం చాలా కష్టం..వరంగల్ నుంచి హైదరాబాద్ మూడు గంటల ప్రయాణం ఉన్నది..అయినా ప్రతిభ గారు..భారం అంతా శ్రీ స్వామివారి మీద వేసి..తాను తయారయ్యి..కారు మాట్లాడుకుని..ఉదయం ఎనిమిది గంటలప్పుడు హైదరాబాద్ బయలుదేరారు..ఆ మూడుగంటల ప్రయాణం లో ఆవిడ శ్రీ స్వామివారినే ధ్యానం చేస్తూ వున్నారు..పరీక్ష వ్రాసే చోటుకు చేరేసరికి..సుమారు పదకొండు గంటల సమయం అయింది..నిజానికి అంత ఆలస్యం అయితే..అధికారులు పరీక్ష వ్రాయడానికి ఒప్పుకోరు..ప్రతిభ గారు అధికారులను కలిసి..తాను వరంగల్ నుంచి వస్తున్నాననీ..హాల్ టికెట్ ఆలస్యంగా రావడం వలన..ఈ జాప్యం జరిగిందని తెలిపారు..అధికారులు ప్రతిభ గారిని పరీక్షకు అనుమతించారు..పరీక్ష వ్రాసి బైటకు వచ్చిన ప్రతిభ గారికి..శ్రీ స్వామివారు చూపిన దయ వల్లే..తనకు ఈరోజు ఇలా అన్నీ కలిసొచ్చాయని నమ్మి..శ్రీ స్వామివారికి మనసులోనే నమస్కారాలు చేసుకున్నారు..
పై విషయాన్ని స్వయంగా ప్రతిభ గారు ఫోన్ చేసి తెలుపుతూ..తనకు శ్రీ స్వామివారి విభూతి పంపమని కోరారు..పంపించాము..మళ్లీ ఒక పది రోజులకు ఫోన్ చేశారు..ఎన్నాళ్ల నుంచో తాము ఇంటి ఋణం గురించి ప్రయత్నాలు చేస్తున్నామనీ..bank అధికారులు మంజూరు చేయకుండా ఆలస్యం చేస్తున్నారని..శ్రీ స్వామివారిని శరణు వేడు కున్నాననీ..రెండురోజుల్లో ఆ ఋణం మంజూరు చేసినట్లు తెలిపారనీ..చెప్పారు..మొదటిరోజు ఎంత ఉద్వేగంతో మాట్లాడారో..అదే ఉద్వేగం..అదే సంతోషం..ఆవిడ మాటల్లో మళ్లీ వినిపించాయి..
ప్రతిభ గారు ఇంతవరకూ మొగలిచెర్ల రాలేదు..శ్రీ స్వామివారి మందిరాన్ని దర్శించనూ లేదు.. కేవలం శ్రీ స్వామివారిని మనస్ఫూర్తిగా నమ్మారు....ప్రస్తుతం ప్రతిభ గారికి మొగలిచెర్ల లో సిద్ధిపొందిన దత్తాత్రేయుడే సర్వస్వం..నమ్మకం తో కూడిన భక్తి ఎక్కడ ఉంటుందో..అక్కడ దైవం తప్పక ఉంటాడు..అది మరొక్కసారి ఋజువయింది..
సర్వం..
శ్రీ దత్తకృప!.
(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగలిచెర్ల గ్రామం..లింగసముద్రం మండలం.. SPSR నెల్లూరు జిల్లా..పిన్ : 523 114..సెల్..94402 66380 & 99089 73699).
ఎండలు ముదురుతున్నాయ్
*జై శ్రీమన్నారాయణ*
09.03.2025,ఆదివారం
*ఎండలు ముదురుతున్నాయ్.. జర జాగ్రత్త...*
ఈ ఏడాది దేశంలో మార్చి మొదటి వారం నుంచే ఎండలు దంచి కొట్టుతున్నాయి.. ఇలా మార్చి నుంచే ఎండలు మండిపోతే ఇక ఏప్రిల్, మే నెలల్లో ఎండలు ఎలా ఉంటాయోనని చాలా మంది ఇప్పటి నుంచే బెంబేలెత్తిపోతున్నారు.
ఈ నెల మొదటి వారంలోనే ఉష్ణోగ్రత 40 డిగ్రీలను తాకింది. రాష్ట్రంలోని 301 మండలాలు 'హేట్ వేవ్స్' నమోదయ్యే ప్రాంతంలో ఉన్నాయని, వడగాలుల ముప్పు సైతం పొంచి ఉందని వాతావరణ శాఖ ఇప్పటికే అప్రమత్తం చేసింది. తెలంగాణ ప్రాంతం మెట్ట నేలలతో కూడుకుని ఉండటంతో భూమి త్వరగా వేడెక్కుతుందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు...
*ఇలా ముదురుతున్న ఎండలకు - మనం తీసుకోవల్సిన జాగ్రత్తలు..*
* శరీర సాధారణ ఉష్ణోగ్రత 98.4 డిగ్రీల ఫారెన్ హీట్ ఉంటుంది. అంతకంటే ఎక్కువైతే.. జ్వరం వస్తుంది. మీ శరీర ఉష్ణోగ్రతలు 104, 106 డిగ్రీల ఫారెన్ హీట్కు పెరిగితే వడదెబ్బకు గురైనట్లు గుర్తించాలి. దీనికి వెంటనే చికిత్స చేయకపోతే మెదడు దెబ్బతింటుంది. అంతర్గత అవయవాల పనితీరును కూడా పాడవుతుంది.
* ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో తగిన జాగ్రత్తలు తీసుకోవడం అవసరం.
* ముఖ్యంగా చిన్న పిల్లలు వృద్ధుల పట్ల జాగ్రత్తగా ఉండాలి.
* తగినన్ని నీళ్లు తాగుతూ డి హైడ్రేట్ కాకుండా ఉండాలి. బయటకు వెళ్లే వ్యక్తులు హైడ్రేట్గా ఉండేలా చూసుకోవాలి.
* అలాగే గాలి పీల్చుకునే తేలికపాటి బట్టలు ధరించడం ఉత్తమం.
* తప్పని పరిస్థితుల్లో బయటికి వెళ్లేవారు గొడుగులు, స్కార్లు ధరించాలి.
* మరీ ఎండ ఎక్కువగా సమయంలో బయటికి రాకుండా ఉండాలి. సాయంత్రం పూట బయటికి వెళ్ళాలి. (ఎక్కువగా ఉండే మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఎండలో తిరగకూడదు.)
* కొబ్బరి నీళ్లు, ద్రవపదార్థాలు ఎక్కువగా ఉండే తాజా పళ్లు తీసుకోవాలి.
* కానీ ఇటీవల కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలకు తగ్గడం లేదు.
* ఉక్కపోతతో పాటు చెమట ఇబ్బంది పెడుతోంది. తరచూ
* చెమట పట్టడం వల్ల శరీరంలోని నీటి పరిమాణం, ఉప్పు శాతం తగిపోతాయి.
* ఏసీ రూంలో ఉన్నాం కదా, చెమట లేదు కదా అని నిర్లక్ష్యంగా ఉండకూడదు. తగినంత నీరు తీసుకుంటూ ఉండాలి. వేడి వాతావరణంలో తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే ఆరోగ్యం దెబ్బతినే ప్రమాదం ఉంది.
* ప్రస్తుతం ఉష్ణోగ్రతలు కాస్త తక్కువగా ఉన్నప్పటికీ, రానున్న కాలంలో మరింత ముదిరే అవకాశం ఉంది. అందుకే జాగ్రత్తలపై అవగాహన కలిగి ఉండటం, ఎప్పటికపుడు జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి..
దేవుడు సృష్టించిన అద్భుతం
Men ను కలుపుకొని women అయింది
He ను నింపుకొని she అయింది
మహిళ అనే పదంలోనే "మహి"(ప్రపంచం) ఉంది
దేవుడు సృష్టించిన అద్భుతం- జీవజాతులలో అపూర్వం
అణుకువ ఆమె సొంతం-అందం ఆమె పాదక్రాంతం
ఆకలేస్తే అన్నపూర్ణ -అరాచకం చేస్తే ఆదిశక్తి
కష్టం వస్తే కన్నతల్లి- ఓపికలో నేలతల్లి
పేగు బంధాన్ని పంచే అమ్మ-కొత్త బంధాల్ని పెంచే భార్య
అనురాగంలో అక్క- చిలిపిదనంలో చెల్లి
ఆమె చేసిన బొమ్మలం-ఆమె కన్నా ఎక్కువ అని ఎలా అనగలం?
ఆమె చేయని పాత్ర లేదు-నెరవేర్చని ఘనతలేదు
ఉద్యోగం లో రానించగలదు-రాజ్యాన్ని సైతం పాలించగలదు.
ఎంత గొప్పవాడైనా ఆమె గర్బాన గడపాల్సిందే!
ఎంత మొనగాడైనా ఆమె ప్రేమను పొందాల్సిందే!
*మహిళామనులందరికీ మరియు మహిళ నడిపించే మనుషులందరికి "మహిళా" దినోత్సవ శుభాకాంక్షలు*
ఇట్లు
ఓ మహిళ మలిచిన మనిషి
స్వార్థ పూరిత చర్యలు.
*
దేశ గణ తంత్ర దినోత్సవము/స్వపరిపాలన (26-1-1947) నాటికి అంతర్జాతీయ ఆర్థిక గణాంకాల పట్టిక ప్రకారం అమెరికా దేశపు డాలర్ తో పోల్చినప్పుడు ఒక డాలర్ విలువ 4 రూపాయల 76 పైసలు. నేడు అనగా 2025 సంవత్సరంలో ఒక డాలర్ విలువ 87 రూపాయల 81 పైసలు. రూపాయి మారకం విలువ తగ్గిపోయినందుకు కారణం...అమెరికన్ డాలర్ బలపడటమే అని తేలికగా చెప్పేసి, నెపాన్ని ఇతర దేశాలపై రుద్దేస్తున్నాము. కాని, వాస్తవానికి రూపాయి మారకం విలువ ఇంతగా దిగజారడానికి ముఖ్య కారణం నీతిమాలిన వ్యక్తుల యొక్క స్వార్థ పూరిత చర్యలు.
ఈ తగ్గుదలను ద్రవ్యోల్బణము అని వ్యవహరిస్తూ ఉంటాము. ఈ ద్రవ్యోల్బణము వలన క్రమంగా కొనుగోలు శక్తి నశిస్తూ ఉంటుంది. ఈ పరిస్థితి నానాటికీ అధిక శాతం ప్రజలను బీదరికం వైపు నెట్టుతుంది. *ఈ పరిస్థితి ఆందోళనకరమే గాకుండా అభివృద్ధి చెందాలనుకున్న దేశాలన్నిటికీ హానికరము గూడా*.
ముందు మన దేశంలోని నల్ల బజారు బడా బాబులను మరియు అక్రమ రవాణా దురంధరుల విషయం సమాలోచించుదాము. ప్రభుత్వ పరిధులు, పరిమితులు, చట్టాలకు లోబడని క్రయ విక్రయాల లావాదేవీలను నల్ల బజారు వ్యవహారంగా పరిగణించ వచ్చును. ఉదాహరణకు బియ్యం, గంజాయి, ఎర్ర చందనం, కలప అక్రమ, అక్రమ ఇసుక రవాణా. ఆపత్కాలంలో ప్రాణ రక్షణ మందులు, నాసి రకం వస్తువులు అధిక ధరలకు విక్రయించడం. విదేశీ మాదక, మత్తు మందులు (Drugs), పొగాకు, నకిలీ ఆయుధాలు, మానవ అవయవాలు చట్టం విరుద్ధంగా అమ్మడం. జనరంజక సినిమా టికెట్లు, జనాకర్షక బంగారం నల్ల బజారులో ఉంచడం. అక్రమ వెంచర్లు, దొంగ నోట్లు ముద్రణ ఇత్యాది.
దేశంలో ఇన్ని రకాల మోసాలు, అక్రమాలు జరుగుతూ ఉంటే ఇప్పుడేమయ్యిందని గగ్గోలు పెట్టేవారికి సమాధానం ఏమని చెప్పాలి? ఎవరు చెప్పాలి. ?
మళ్ళీ మన వాళ్ళే అంటారు...ఇవన్నీ చూడడం చట్టం మరియు భద్రతా అధికారుల బాధ్యత, మాకేమీ సంబంధం అని. *సమాజంలో ఉంటూ దేశద్రోహ మరియు ఆర్థిక క్షీణత కార్యక్రమాలు జరుగుచుంటే ఉదాసీనంగా ఉండడం నాగరికం కాదు*.
ధన్యవాదములు
*(సశేషం)*
భారతీ
చ.పరులకుఁ జెప్పు సూక్తులవి వర్ధిలుచుండు వినోద హేతువై
నిరతము శ్రీ ప్రతిష్ఠలననేక విధమ్ములఁ బెంచుఁ గాని యా
విరచిత భాషణమ్ములు వివేకముఁ గూర్చును చిత్త శుధ్ధితో
నరయుచు ధర్మ మార్గమున నాచరణమ్మునఁ జూప భారతీ!౹౹73
శా.శంభో శంకర భక్త రక్షక మహేశా యంచు సర్వజ్ఞు హే
రంబున్ పట్టిగ గాంచి నట్టి భవు నీలగ్రీవు ప్రార్థించి సం
రంభమ్మొప్పగ రక్ష సేయగల సర్వాత్మున్ సదా గొల్చెదన్
దంభమ్మేమియు లేని రీతి మదిలో ధ్యానించుచున్ భారతీ!౹౹ 74
🔥స్వప్నం ఎంత అందంగా ఉన్నా
🙏🕉️శ్రీమాత్రేనమఃశుభోదయం🕉️🙏 🔥స్వప్నం ఎంత అందంగా ఉన్నా నిద్ర లేవక తప్పదు.. బాధ ఎంత పెద్దది అయినా దాటుకుని వెళ్లక తప్పదు..జీవితం నీదైనప్పుడు దాని కోసం చేయాల్సిన కష్టం కూడా నీదే... ఓడినా గెలిచినా కష్టపడటం మాత్రం ఆపకు..నీ కష్టం ఇప్పుడు నీకు గెలుపునివ్వలేకపోవచ్చు..కానీ ఏదో ఒక రోజు ఆ గెలుపే నిన్ను అందరికీ పరిచయం చేస్తుంది🔥మన జీవితం ప్రతీ రోజు మనకు పాఠాలను నేర్పుతూ ఉంటుంది.. కానీ మనం ఆ పాఠాలను నేర్చుకుంటున్నామా లేదా ఉరికనే పేజీలు తిప్పుతున్నామా అనేది మన మీద ఆధారపడి ఉంటుంది..సమయం విలువైనది తెలివిగా ఉపయోగించుకోవాలి🔥ప్రేరణ అనేది ఒక పనిని ప్రారంభించడానికి పనికొస్తుంది.. కానీ అలవాటు అనేది దాన్ని కొనసాగించడానికి పనికొస్తుంది...నిజమైన జ్ఞానం గొప్ప మాటలు చెప్పడంలో లేదు.. గొప్ప సందేశాలు రాయడంలో కూడా లేదు.. ఒకరి మనసును గాయపరచకుండా ఉండగలిగినప్పుడే దైవత్వం సిద్దిస్తుంది... అలా ఉండాలని మనసుకు తోచినప్పుడు అద్భుతమైన జ్ఞానం మనకు సొంతమవుతుంది🔥🔥మీ *అల్లం రాజు భాస్కరరావు శ్రీ విజయ ఆయుర్వేదిక్ &జనరల్ ఏజన్సీస్ D.N.29-2-3 గోకవరం బస్టాండ్ దగ్గర స్టేట్ బ్యాంక్ ఎదురుగా రాజమండ్రి వైద్యసలహాలు ఉచితం మందులు అయి పోయిన వారు రాలేని వారికి కొత్తవారికి మందులు కొరియర్ ద్వారా మందులు పంపబడును * 🙏🙏🙏
వేద ఆశీర్వచనం
*నమస్తే సదా వత్సలే మాతృ భూమే*
*కలియుగాబ్ది 5125*
*శ్రీ శాలివాహన శకం 1946 స్వస్తి శ్రీ చాంద్రమాన క్రోధి నామ సంవత్సరం ఉత్తరాయణం - శిశిర ఋతువు - ఫాల్గుణ మాసం - శుక్ల పక్షం - దశమి - పునర్వసు - భాను వాసరే* (09.03.2025)
ప్రముఖ వేదపండితులు, తణుకు /తాలూకా ఇరగవరం వాస్తవ్యులు
*బ్రహ్మశ్రీ గుళ్ళపల్లి శివశర్మ ఘనపాఠీ* *(9491391009, 9440091234)* గారి నేటి వేద ఆశీర్వచనం.
.🙏🙏
భవదీయుడు
దశిక ప్రభాకరశాస్త్రి
9849795167
----------------------------------------------
*పిల్లలకి బతుకుతో పాటు భారతీయత కూడా నేర్పండి*
భగవంతుడు పూర్ణుడు
ఓం పూర్ణమిదః పూర్ణమదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణ మాదాయా పూర్ణమేవావశిష్యతే… ఓం శాంతి శాంతి శాంతిహి…ఈ శ్లోక అర్థము చెప్పగలరా?
ఓం పూర్ణమిదః పూర్ణమదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే
పూర్ణస్య పూర్ణ మాదాయా పూర్ణమేవావశిష్యతే...
ఓం శాంతి శాంతి శాంతి హి
భగవంతుడు పూర్ణుడు...పూర్ణానికి పూర్ణం కలిపినా....పూర్ణంలోంచి పూర్ణం తీసేసినా....మిగిలేది పూర్ణమే.
ఇదే శృతి వాక్యం. ఈ వాక్యాన్ని సరిగా అర్థం చేసుకుంటే ....జీవితమంతా ఇందులోనే దాగుంది. మోక్ష మార్గం ఇందులోనే దాగుంది....సమస్త సాధనాల సారం ఇందులోనే ఉంది.
0 + 0 = 0....
0౼0 = 0
కానీ...
0+1 = ఎంత అంటే.....
మనం వెంటనే 1 అని సమాధానం ఇస్తాం.....ఇక్కడ సున్నా ...ఒకటితో కలవగానే అది 1 గా మారిపోయింది.
0+2 =2...సున్నా 2 తో కలవగానే సున్న మాయమై....అది రెండుగా మారిపోయింది. అంటే....సున్న దేనితో కలిస్తే అది గా మారిపోతూంది.
గాఢ నిద్రలో మనం పూర్ణమైన భగవంతుడిగా ఉంటాం.మనకప్పుడు ఏ ఎమోషన్స్ ఉండవు. ఎప్పుడైతే సున్నలాంటి మనం నిద్రలేవగానే ప్రకృతితో కలుస్తామో ...మనం ప్రకృతే ఐపోతున్నాం.
మనం దేనితో కలుస్తామో ....దానిగా మారిపోతున్నాం...
బాగా గమనించు....నీ ఎదురుగా ఒక వ్యక్తి ఉన్నాడు....అతడు గతంలో నీకు ఎంతగానో సహాయం చేసాడు....ఆ వ్యక్తి ని చూడగానే ...నీలో అతనిపట్ల ఆత్మీయత కలుగుతుంది. నువ్వూ అతనికి ఎలాగైనా సహాయం చెయ్యాలని ఆలోచిస్తావ్.
ఒక వ్యక్తి నిన్ను ఎంతగానో బాధించాడు....అతను కనబడగానే నువ్వు కూడా అతన్ని ఎలాగైనా బాధించాలని ఆలోచిస్తావ్....
ఎదుటి వ్యక్తి ప్రేమతో వస్తే....నీకూ అతనిపట్ల ప్రేమ కలుగుతోంది...
ఎదుటి వ్యక్తి నిన్ను గౌరవిస్తే ...నీకూ అతనిపట్ల గౌరవం కలుగుతుంది...
అంటే....మనం ఎదుటి వ్యక్తిలో ని ఏ గుణాన్నాయితే గమనిస్తున్నామో...మనం మనకు తెలీకుండానే ఆ గుణంతో కలిసిపోయి...ఆ గుణంగానే మారిపోతున్నాం...
" మనం దేనితో కలుస్తున్నామో...అది గా మారిపోతున్నాం. "
మనలో సున్న( 0) లా ఉన్న పరమాత్మ తత్వం....ఎదుటి వ్యక్తీలోని కోపం తో కలవాగానే ....అది కోపంగా మారిపోయి...మనకు కోపం వస్తుంది.
నువ్వు ప్రేమతో...కలిస్తే ప్రేమగా.....ద్వేషం తో కలిస్తే ద్వేషం గా మారిపోతావ్.
ఎదుటివారిలోని అహంకారాన్ని చూస్తే....నీలో కూడా అహంకారం మొలుస్తుంది.
అందుకే....ప్రతి జీవిలోనూ...మనిషిలోనూ...పరమాత్మ ఉన్నాడని గ్రహించి....ఆయనతో అనుసంధానం అవ్వు.
అంటే నీలోని పూర్ణాన్ని....ఎదుటి వ్యక్తీలోని పూర్ణం తో కలుపు....వచ్చేది పూర్ణమే.
ఎదుటి మనిషిని చూడగానే అతనిలోని దోషాలను గుర్తిస్తే...మనం అతనిలో దేన్ని ముందుగా చూస్తామో....మనం అది గా మారిపోతామన్న
మహా సత్యాన్ని గమనించాలి.
అందుకే ఎలాంటి వారిలోనైనా ...భగవంతుణ్ణి చూడగల్గి.... ఆయనతో కలిస్తే...మనం కూడా భగవత్ తత్వంగా మారిపోవాలి.
సదా ఈ సృష్టిలోని ప్రతి వస్తువులోనూ పరమాణు స్వరూపంతో ఉన్న భగవంతునీతో...అనుసంధానమవుతూ....ఆయనలా మారిపోదాం!....
ఔషధాలు లేని జీవితం
*`ఔషధాలు లేని జీవితం`* *1.త్వరగా నిద్రపోవడం మరియు త్వరగా మేల్కొలపడం ఔషధం.* *2. ఓం జపించడం ఔషధం.* *3.యోగా ప్రాణాయామం ధ్యానం మరియు వ్యాయామం ఔషధం.* *4. ఉదయం మరియు సాయంత్రం నడక కూడా ఔషధం.* *5.ఉపవాసం అన్ని వ్యాధులకు ఔషధం.* *6. సూర్యకాంతి కూడా ఒక ఔషధం.* *7.కుండ నీరు తాగడం కూడా ఔషధమే.* *8.చప్పట్లు కొట్టడం కూడా ఔషధమే.* *9.ఆహారాన్ని పూర్తిగా నమలడం కూడా ఔషధమే.* *10. ఆహారంలాగే, నీరు నమలడం మరియు త్రాగే నీరు కూడా ఔషధం.* *11.ఆహారం తీసుకున్న తర్వాత వజ్రాసనంలో కూర్చోవడం ఔషధం.* *12.సంతోషంగా ఉండాలనే నిర్ణయం కూడా ఒక ఔషధం.* *13.కొన్నిసార్లు మౌనం కూడా ఔషధం.* *14.నవ్వు మరియు జోకులు ఔషధం.* *15. సంతృప్తి కూడా ఔషధం.* *16.మనశ్శాంతి మరియు ఆరోగ్యకరమైన శరీరం కూడా ఔషధం.* *17.నిజాయితీ మరియు సానుకూలత ఔషధం.* *18. నిస్వార్థ ప్రేమ కూడా ఒక ఔషధం.* *19.అందరికీ మంచి చేయడం కూడా ఔషధమే.* *20.ఎవరికైనా దీవెనలు కలిగించే పని చేయడం ఔషధం.* *21.అందరితో కలిసి జీవించడం ఔషధం.* *22.తినడం, త్రాగడం మరియు కుటుంబంతో కలిసి ఉండడం కూడా ఔషధమే.* *23.మీ ప్రతి నిజమైన మరియు మంచి స్నేహితుడు కూడా డబ్బు లేని పూర్తి మెడికల్ స్టోర్.* *24.సంతోషంగా ఉండండి, బిజీగా ఉండండి, ఆరోగ్యంగా ఉండండి మరియు సంతోషకరమైన మనస్సును కలిగి ఉండండి, ఇది కూడా ఔషధం.* *25.ప్రతి కొత్త రోజును సంపూర్ణంగా ఆస్వాదించడం కూడా ఔషధమే.* *26.చివరగా ఈ సందేశాన్ని ఎవరికైనా ప్రసాదంగా పంపడం ద్వారా ఒక మంచి పని చేయడంలో కలిగే ఆనందం కూడా ఒక ఔషధం.* *ప్రకృతి యొక్క "గొప్పతనం"ని అర్థం చేసుకోవడం మరియు దాని పట్ల కృతజ్ఞతా భావాన్ని కలిగి ఉండటం కూడా ఔషధం.* *`ఈ ఔషధాలు అన్ని మీకు పూర్తిగా ఉచితంగా లభిస్తాయి.`*
ఆదివారం
*ఆదివారం సెలవువద్దు...*
ఆదివారం పవిత్ర దినం, ఇకనైనా మేల్కొందాం! ఆదివారం నాడు ఏం చేయకూడదో చెప్పిన శాస్త్రాల లోని ఓక శ్లోకం..
అమిషం మధుపానం చ యః కరోతి రవేర్దినే |
సప్తజన్మ భవేద్రోగీ జన్మ జన్మ దరిద్రతా ||
స్త్రీ తైల మధుమాంసాని యే త్యజంతి రవేర్దినే |
న వ్యాధి శోక దారిద్ర్యం సూర్యలోకం స గచ్చతి ||
*తాత్పర్యం:*
మాంసం తినడం..! మద్యం తాగడం..!
స్త్రీతో సాంగత్యం..! క్షవరం చేసుకోవటం..!
తలకు నూనె పెట్టుకోవడం..!
ఇలాంటివి ఆదివారం నాడు నిషేధించారు, కానీ ఈ పనులన్నీ మనం ఆదివారమే చేస్తున్నాం..! ఈ కర్మలు చేసినవాడు జన్మ జన్మలకు దరిద్రుడు అవుతాడు అని నొక్కి చెప్పారు మన పెద్దలు దరిద్ర్యం అంటే డబ్బు లేకపోవడం ఒక్కటే కాదు..
కుటుంబ సౌఖ్యం లేకపోవటం...
ఆనారోగ్యం కూడా..!!
ఆదివారం సూర్యుడు జన్మించిన రోజు
ఇలాంటి పవిత్రమైనరోజు తాగుబోతులకి, తిండిపోతులకి ఇష్టమైన రోజు అయింది..!!
మన సనాతన ధర్మంలో పురాణ ఇతిహాసాల్లో ఏ రోజుకి ఇవ్వని ప్రాధాన్యత ఆదివారానికి ఇచ్చారు..!!
ఎందుకంటే.. అనాదిగా మన వాళ్ళందరూ సూర్యోపాసకులు.. సూర్యుణ్ని ఆరాధించే సంస్కృతి మన భారతీయ హైందవ సంస్కృతి..!! సూర్యుడు మనకు కనిపించే ప్రత్యక్షదైవం..!!
అందుకే మనకొచ్చే ముఖ్యమైన పండుగలన్నీ కూడా సౌరమానం అంటే సూర్యుని ఆధారం గానే వస్తాయి..!!
ప్రాతః కాలంలో నిద్రలేచి సూర్య నమస్కారాలు, సంధ్యా వందనాలు లాంటి సనాతన సాంప్రదాయ కర్మలు సూర్యుణ్ని ఆరాధించే పద్దతిలో ముఖ్యమైనవి..!!
ఇలాంటి ఆదివారం మనకి చాలా పవిత్రమైన రోజు..
అలాంటి ఆదివారాన్ని వీకెండ్ పేరుతో ఆదివారం సెలవు అనే పేరుతో అపవిత్రం పాలు చేశారు..!! చేస్తున్నాము..!!
మనది భిన్నత్వంలో ఏకత్వం అనే సంస్కృతి అందరికీ తెలుసు ...ఎన్ని ఆచారాలు, సంస్కృతులు భిన్నంగా ఉన్న మన అందరిది హిందూ ధర్మమే అనే ఏకత్వాన్ని తెలిపేది మన హైందవ సంస్కృతి...!!
అది చూసి తట్టుకోలేక బ్రిటీషు వాడు
(Thomas Babington Macaulay,
ఈ నీచుడు గురించి ఎంత చెప్పినా తక్కువే)
ప్రయోగించిన బ్రహ్మాస్త్రమే ఆదివారం సెలవు..
మన హిందువులే మన సంస్కృతిని నాశనం చేసేలా చేశారు..!!
ఆదివారం నాడు మన హిందూ దేవాలయాలు వెలవెల బోతాయి.!!
పూర్వకాలంలోవృత్తి పనులు చేసుకునే వారు అమావాస్యను సెలవు దినంగా పాటించేవారు.! ఇప్పటికీ కొన్ని దుకాణాల వారు అమావాస్య నాడు తెరువరు.!
మన హిందువులు ఆదివారాన్ని పరమ పవిత్రంగా భావించే వారు.. ఆరోజు జీవహింస చేసి మాంసాన్ని తినేవారు కాదు.. మధ్యాన్ని తాగేవారు కాదు..!!
కానీ ఇప్పుడు సీన్ అంతా రివర్స్ అయ్యింది!!
ఆదివారమొస్తే సెలవు దినం కదా అని మద్యాహ్నం 12 గంటల దాకా పడుకునే వారున్నారు.!
ఇప్పటికైనా కళ్ళు తెరవండి.! విదేశీ సంస్కృతిని విడనాడండి.! .స్వదేశీ సాంప్రదాయాలను పాటించండి..!
యోగ చేయండి.! ప్రాణాయామం చేయండి.!
సూర్యనమస్కారాలు చేయండి.!
సూర్యోపాసన చేయండి.!! ఆయురారోగ్య ఐశ్వర్యాలను పొందండి.!!
ఈ పోస్టు కొందరు సోదరులకు ఉత్సాహాన్ని మరియు
కొందరికి నిరుత్సాహాన్ని ఇచ్చి ఉంటుంది..!! కానీ
దీన్ని పాటించడానికి ప్రయత్నించండి..!!
ఒకేసారి అన్నీ మార్పులు సాధ్యపడకపోవచ్చు కానీ
క్రమ క్రమముగా ఒక్కొక్కటి మార్చుకుంటూ పోతే
కొన్ని సంవత్సరాలకు అన్నీ మార్పులు చేసుకోవచ్చు.
మొమ్మాయి
ఆయుర్వేద వైద్యంలో పేరుగాంచిన గొప్ప ఔషధం మొమ్మాయి గురించి సంపూర్ణ వివరణ -
మొమ్మాయి అనే ఈ ఔషధానికి ఆయుర్వేదంలో చాలా గొప్ప పేరు ఉంది. ఈ ఔషదానికి మరొక పేరు "గోమూత్ర శిలజిత్" మార్కెట్ లో పచారీషాపుల్లో అమ్ముతుంటారు కాని అది అంత స్వచ్ఛమైనది కాదు. ఇది అసలైనది తెప్పించి నేను ప్రయోగించాను . చాలా జబ్బులలో మంచి ఫలితాలు ఇచ్చినది. మనకి దొరికిన మొమ్మాయి అసలైనదా కాదా అని తెలుసుకొవడానికి ఒక చిన్న పరీక్ష ఉన్నది.
మొమ్మాయిని ఒక కందిగింజ అంత ఒక చిన్నగ్లాస్ నీటిలో వేయాలి . అప్పుడు నీరు ఎర్రగా మారుతుంది. అందులో ఒక పొడవాటి గుడ్డముక్కని వేసి నానబెట్టి ఒక కోడి కాలు విరగగొట్టి విరిగిన కాలుకు దీనిని చుట్టవలెను . కేవలం 15 నిమిషాలలో కాలు అతుక్కొని అది పరిగెత్తును . ఈ విధంగా పరీక్షించిన తరువాత మాత్రమే మొమ్మాయిని ఔషధంగా వాడవలెను .
ఒకసారి ఈ మొమ్మాయిని వాడితే అది శరీరంలో 44 సంవత్సరాలపాటు నిలిచి ఉంటుంది. ఇది ఎక్కువుగా ఇరాన్ దేశములోని కొండలలో దొరుకుతుంది. శిలాజిత్ కీలువలే నల్లగా కాంతి వలే మైనము వలే కొంచం ఎర్రగా ఉంటుంది . ఇది శరీరంలో అత్యంత త్వరితముగా వ్యాపించి తన ప్రభావాన్ని చూపును . దీని మోతాదు ఒక వడ్లగింజ నుంచి రెండు వడ్లగింజల ఎత్తువరకు వాడవచ్చు . శిలాజిత్ చూర్ణములలో కలుపవలసి వచ్చినపుడు పన్నీటితో ఎండబెట్టి కలుపుకొనవలెను. లేహ్యములలో కలుపవలసివచ్చినప్పుడు ఆవునేతితో శిలజిత్ ని కలిపి కాచి చల్లార్చి కలుపవలెను గాని ప్రత్యేకంగా కలుపకూడదు.
మొమ్మాయి ఉపయోగాలు -
* హృదయానికి బలమును ఇస్తుంది.
* మనస్సుకు సంతోషాన్ని ఇస్తుంది.
* పొట్ట, జీర్ణకోశం , రక్తం తదితర వాటిని శుభ్రపరచును .
* శరీరంలోని సమస్త అవయవాలకు , నరాలకు బలాన్ని ఇస్తుంది.
* శ్లేష్మాన్ని హరించును .
* విరిగిన ఎముకలను , కీళ్ళని బాగుచేయును .
* గాయములను మాన్పును .
* వ్రణాలను నయంచేయును .
* ఎక్కిళ్లు , కడుపులో మంట, గుండెల్లో దడ నివారించును.
* అజీర్ణం , పరిణామశూల మొదలగు శూలలను తగ్గించును .
* కీళ్లనొప్పులు హరించును .
* అన్నిరకాల జ్వరాలను తగ్గించును .
* పక్షఘాతము , పక్షవాతము , సర్వాంగవాతములను హరించును .
* అతిమూత్రవ్యాది మరియు సమస్త మూత్రవ్యాధులను హరించును .
* ఉబ్బు , శ్వాస సంబంధ సమస్యలు , మతిచాంచల్యం , మూర్చ, ముక్కుకి వాసన తెలియకపోవడం , ముక్కులోపల పుట్టెడు వ్రణం నివారించును.
* జీర్ణకోశమును అంటి ఉండే పేగు గట్టిపడు రోగం కూడా తగ్గును.
* ఒక చెయ్యి , ఒక కాలి యొక్క కీలులో పుట్టి అలా నిలిచి ఎంతకీ తగ్గని నొప్పిని కూడా తగ్గించును .
* స్త్రీల గర్భాశయం నందు జనించెడి పురుగులను చంపును.
* సుఖరోగాలను , చర్మవ్యాధులను నయం చేయును .
* బోధకాలు వ్యాధి , నాలిక మందం అయ్యే సమస్య , గొంతుకవ్యాధులను నయం చేయును .
* దవడనొప్పి , నాలుకలో నొప్పి సమస్యలకు వడ్లగింజ అంత మొమ్మాయి నీళ్లతో కలిపి ఆయా స్థలముల యందు పట్టువేసిన బాగు అగును.
* పిచ్చితనం ప్రారంభదశలో ఉండగా వడ్లగింజ ఎత్తు మొమ్మాయి గాడిదపాలతో కలిపి అరగదీసి లోపలికి ఇచ్చిన పిచ్చి తగ్గును.
* కొండనాలుక వాపుకు కాని గొంతుక వాపుకు మొమ్మాయి ఇప్పపువ్వు సారాయి తో కలిపి అంగిట పట్టించిన పై సమస్యలు తగ్గును. ఇప్పపువ్వు సారాయి దొరకనప్పుడు పెసరపప్పు కషాయం వాడవచ్చు .
పైనచెప్పినవే కాకుండా మరెన్నో రోగములకు ఈ మొమ్మాయి అమృతం వలే పనిచేయును . ఈ మొమ్మాయి వాడే సమయమున బెండకాయ కూర, ఆవాలు వాడకూడదు. అదే విధముగా మొమ్మాయి అవునేయ్యితో కలిపి ఇచ్చేప్పుడు స్వచ్చమైన దేశవాళీ ఆవునెయ్యిని మాత్రమే వాడవలెను. మార్కెట్లో దొరికే మొమ్మాయిని పరీక్షించి మాత్రమే వాడవలెను. నకిలీలు చాలా ఉన్నాయి .
మరిన్ని సులభ ఆయుర్వేద చిట్కాలు మరియు ఆయుర్వేద ఔషధాల వివరణాత్మకమైన సమాచారం కొరకు నేను రచించిన గ్రంథములు చదవగలరు .
గమనిక -
నేను రాసిన " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు " మరియు " ఆయుర్వేద మూలికా రహస్యాలు " రెండు గ్రంథాలలో ఎన్నొ రహస్య చిట్కాలు , మా కుటుంబపరంగా గత 250 సంవత్సరాల నుంచి మా పెద్దవారు మాకు అందించిన ఎంతో అనుభవసారాన్ని ఈ గ్రంథాలలో అందరి అర్థం అయ్యే విధంగా సామాన్య బాషలో వివరించాను. ఇంట్లో ఉండి మరియు అందుబాటులో ఉన్న వాటితోనే పెద్ద పెద్ద రోగాలు నయం చేసుకునే విధంగా అత్యంత సులభయోగాలు మన ప్రాచీన భారతీయులు రచించిన చెట్లను బట్టి భూమిలో నీటిని కనుక్కునే విధానాలు , వృక్షాలకు ఆయుర్వేద మూలికల ఉపయోగించి దిగుబడి పెంచే వృక్షాయుర్వేద చిట్కాలు , రైతులకు ఉపయోగపడే విధంగా ఏయే నక్షత్రాలలో పంటలు వేస్తే ఫలితాల ఎక్కువుగా ఉంటాయో తిథి, నక్షత్ర, వారాలతో సహా ఇవ్వడం జరిగింది. ఆయుర్వేదం నేర్చుకోవాలి అనుకునేవారికి ఇది మంచి దిక్సూచిలా ఉపయోగపడును.
నా మూడొవ గ్రంథము నందు 50 రకాల మొక్కల గురించి అత్యంత విపులంగా ఇవ్వడం జరిగింది . ఈ మొక్కలన్నియు ప్రతి ఒక్కరికి తెలిసినవి మరియు మన ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటివే . ఈ గ్రంధములలో మీకు లభ్యమయ్యే సమాచారం మరే గ్రంథములలో లభ్యం అవ్వదని చెప్పగలను . మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల చిత్రములు కూడా ఇవ్వడం జరిగినది . ఏయే జబ్బులకు ఎటువంటి ఆహారపదార్థాలు తీసుకోవలెనో , తీసుకోకూడదో కూడా సంపూర్ణముగా మీకు ఇందులో లభ్యం అగును . ఔషధాలు మరియు తీసుకోవాల్సిన ఆహారవిహారాలు ఒకేదగ్గర లభ్యం అగును .
ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు గ్రంథము 288 పేజీలతో ఉండును . దీని విలువ 400 రూపాయలు , ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథము 384 పేజీలతో ఉండి 500 రూపాయలు , సర్వమూలికా చింతామణి గ్రంథము 352 పేజీలతో ఉండును . దీని విలువ 550 రూపాయలు . అందరికి అర్ధమయ్యేలా సులభ బాషలో ఉండును. గ్రాంథిక భాష ఉపయోగించలేదు .
ఈ గ్రంథములు కావలసిన వారు 9885030034 నంబర్ కు Phonepay or Googlepay or Paytm కు డబ్బు పంపించి ఇదే నంబర్ కు Whatsup నందు screenshot పెట్టి మీ పూర్తి Adreass ఇవ్వగలరు . కొరియర్ చార్జీ 100 రూపాయలు అదనం .
. ఈ గ్రంధాలు కావలసిన వారు 9885030034 నెంబర్ నందు సంప్రదించగలరు.
. కాళహస్తి వేంకటేశ్వరరావు
.
. అనువంశిక ఆయుర్వేద వైద్యులు
. 9885030034
ఆరోగ్యం కోసం సూర్యుని మంత్రం
🌹🌷🌞🪔🛕🪔🌞🌷🌹
*🌞ఆరోగ్యం కోసం సూర్యుని మంత్రం🌞*
*🌞సూర్యమంత్రం🌞*
*నమః సూర్యాయ శాంతాయ*
*సర్వరోగ నివారిణే!*
*ఆయురారోగ్య ఐశ్వర్యo*
*దేహి దేహిదేవః జగత్పతే!!*
*🙏అర్థం🙏*
ఓ సూర్యదేవ! జగత్ పరిపాలకా! నీకిదే నా నమస్కారము. నీవు సర్వరోగములను తొలగించువాడవు. శాంతిని వొసంగువాడవు.
మాకు ఆయువును, ఆరోగ్యమును, సంపదను అనుగ్రహించుము.
*సూర్యనారాయణుడు* ప్రత్యక్ష దైవం సూర్యుడుకి నమస్కారం చేసే వారిలో ఇతరుల కన్నా రోగ నిరోధక శక్తి అధికంగా ఉంటుంది నమస్కార ముద్ర కూడా ఒక ఆసనం, అలా నమస్కారం చేస్తూ *12 సూర్య నామాలు* చదివే సమయం లేదా ఇక్కడ ఇచ్చిన *ఈ శ్లోకం కనీసం 12 సార్లు* అయినా జపిస్తూ సూర్యుడు ఎదురుగా నిల్చుని నమస్కారం చేస్తే నమస్కార ప్రియుడు అయిన సూర్యుడు సంపూర్ణ ఆరోగ్యం అనుగ్రహిస్తారు.. అలాగే ఇతరులతో పోలిస్తే సూర్య నమస్కారం చేసే వారి చుట్టూ రేఖీ అధికంగా ఉంటుంది.. ఈ రెండు వాక్యల చిన్న శ్లోకం పిల్లలకు అలవాటు చేయండి పిల్లలు ఇలా సూర్య నమస్కారం చేయడం వల్ల ఆరోగ్యం, జ్ఞాపకశక్తి పెరుగుతుంది క్రమశిక్షణ అలవాటు అవుతుంది.. పిల్లలు తల్లితండ్రుల మాట వింటారు..
*🙏సూర్య ద్వాదశ నామాలు🙏*
1. ఓం మిత్రాయనమః
2. ఓం రవయేనమః
3. ఓం సూర్యాయనమః
4. ఓం భానువేనమః
5. ఓం ఖగాయనమః
6. ఓం పూష్ణేనమః
7. ఓం హిరణ్య
గర్భాయనమః
8. ఓం మరీచయేనమః
9. ఓం ఆదిత్యా యనమః
10. ఓం సవిత్రేనమః
11. ఓం అర్కాయనమః
12. ఓం భాస్కరాయనమః
ఈ ద్వాదశ నామాలు కూడా స్మరించుకుంటే సూర్యనారాయణుడు ఆశీర్వాదం లభిస్తుంది.
*🙏🌞సేకరణ🌞🙏*
*🌹న్యాయపతి నరసింహారావు🌹*
ఆదివారం*🌞 *🌹09, మార్చి, 2025🌹* *దృగ్గణిత పంచాంగం*
*卐ॐ ఓం శ్రీ 🌹గురుభ్యోనమః ॐ卐*
🌞 *ఆదివారం*🌞
*🌹09, మార్చి, 2025🌹*
*దృగ్గణిత పంచాంగం*
*స్వస్తి శ్రీ క్రోధినామ సంవత్సరం*
*ఉత్తరాయణం - శిశిరఋతౌః*
*ఫాల్గుణ మాసం - శుక్లపక్షం*
*తిథి : దశమి* ఉ 07.45 వరకు ఉపరి *ఏకాదశి*
*వారం :ఆదివారం* (భానువాసరే)
*నక్షత్రం : పునర్వసు* రా 11.55 వరకు ఉపరి *పుష్యమి*
*యోగం : సౌభాగ్య* మ 02.59 వరకు ఉపరి *శోభన*
*కరణం : గరజి* ఉ 07.45 *వణజి* రా 07.41 ఉపరి *భద్ర*
*సాధారణ శుభ సమయాలు*
*ఉ 07.00 - 10.00 మ 02.00 - 04.30*
అమృత కాలం : *రా 09.28 - 11.06*
అభిజిత్ కాలం : *ప 11.54 - 12.42*
*వర్జ్యం : *ప 11.42 - 01.19*
*దుర్ముహూర్తం : సా 04.41 - 05.28*
*రాహు కాలం : సా 04.47 - 06.16*
గుళికకాళం : *మ 03.17 - 04.47*
యమగండం : *మ 12.18 - 01.48*
సూర్యరాశి : *కుంభం*
చంద్రరాశి : *మిధునం/కర్కాటకం*
సూర్యోదయం :*ఉ 06.20*
సూర్యాస్తమయం :*సా 06.16*
*ప్రయాణశూల : పడమర దిక్కుకు పనికిరాదు*
*వైదిక విషయాలు:*
ప్రాతః కాలం : *ఉ 06.20 - 08.43*
సంగవ కాలం : *08.43 - 11.06*
మధ్యాహ్న కాలం : *11.06 - 01.30*
అపరాహ్న కాలం : *మ 01.30 - 03.53*
*ఆబ్ధికం తిధి : ఫాల్గుణ శుద్ధ ఏకాదశి*
సాయంకాలం : *సా 03.53 - 06.16*
ప్రదోష కాలం : *సా 06.16 - 08.41*
రాత్రి కాలం : *రా 08.41 - 11.54*
నిశీధి కాలం :*రా 11.54 - 12.42*
బ్రాహ్మీ ముహూర్తం : *తె 04.43 - 05.31*
________________________________
*🌷ప్రతినిత్యం🌷*
*_గోమాతను 🐄 పూజించండి_*
*_గోమాతను 🐄 సంరక్షించండి_*
*🌞||సూర్యమండలాష్టకం||🌞*
*యన్మణ్డలం జ్ఞానఘనం త్వగమ్యం త్రైలోక్యపూజ్యం* *త్రిగుణాత్మరూపమ్ ।*
*సమస్త తేజోమయ దివ్యరూపం పునాతు*
*మాం తత్సవితుర్వరేణ్యమ్*
🙏 *ఓం నమో సూర్యాదేవాయ నమః*
🌞🪷🌹🛕🌹🌷🪷🌷🌞
*సర్వే జనాః సజ్జనో భవంతు !*
*సర్వే సజ్జనా స్వజనో భవంతు !!*
*సర్వే స్వజనా సుకృతో భవంతు !*
*సర్వే సుకృత జనః సుఖినో భవంతు !!*
<><><><><><><><><><><><><><>
🌷 *సేకరణ*🌷
🌹🌿🌞🌞🌿🌹
*న్యాయపతి వేంకట*
*లక్ష్మీ నరసింహా రావు*
🌷🍃🌞🌞🍃🌷
🌹🌷🌞🌞🌞🌞🌷🌹
ఇతరులకు సహాయం
దయచేసి పూర్తిగా చదవండి🙏
ఇతరులకు సహాయం చేసిన వారిమి అవుతాం
🤝
హైదరాబాద్ లోని
ఈ సి ఐ ల్ లో
అత్యాదునిక సదుపాయలతో 300 పడకల హాస్పటల్ ఉంది ...
కనుక ఈ సి ఐ ల్
దిగీ ఎవరిని అడిగినా
తులసి హాస్పటల్
అడ్రస్ చెబుతారు
అలాగే 15 సంవత్సరాల పై
నుండి 80 సంవత్ష రాల వరకు cardio(గుండె ) & ortho(విరిగిన ఎముకలు ) &Urology(కిడ్నీ రాళ్లు )
వైద్యమైనా సరే అంటే
10 లక్షలు అయ్యే హార్ట్ సంబంధిత వ్యాదులైనా ఉచితమే
సదుపాయాలు కార్పోరేట్ తరహాలో ఉంటాయి
కనుక
మనలో మన పక్కన
ఎంతో మంది పేదవాళ్ళు జీవితంలో సంపాదించిందంతా వైద్యానికే ఖర్చుచేసే మద్యతరగతి వారు ఉంటారు
అలాంటి వారికి
ఈ హాస్పటల్ గురించి దయచేసి చెప్పండి
మనమంతా కలసి
ఒక్క ప్రాణాన్పి కాపాడినా చాలు
ఎ ఒక్కరు కూడ
టెన్షన్ పడకూడదనే
నేను నా పోన్లో ఉన్న 550 వాట్సప్ మెంబర్స్కి
ఈ మెసేజ్ పంపుతున్నాను
మీరు ఒక్కొక్కరు 200 మంది వాట్సప్ మెంబర్స్కు పంపితే 185000 మందికి
ఈ విషయం తెలుస్తుంది
కనీసం 50 మంది ప్రాణాలు కాపాడుదాం
తీసుకుని రావలసింది ఆరోగ్య శ్రీ కార్డ్, రేషన్ కార్డ్, ఆధార్ కార్డ్
Contact number
040-49336699
9505108108
Hospital name
Tulasi hospitals Ecil Hyderabad
*Just forward please*🙏🏻
