5, సెప్టెంబర్ 2021, ఆదివారం

సంస్కృత మహాభాగవతం*

 *5.09.2021 సాయం కాల సందేశము*


*వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం*


*ఏకాదశస్కంధము - ఆరవ అధ్యాయము*


*బ్రహ్మాదిదేవతలు 'పరంధామమునకు విచ్చేయుము' అని శ్రీకృష్ణుని అర్థించుట - భగవానుని ఆదేశముతో ప్రభాసతీర్థమునకు వెళ్ళుటకు సిద్ధమగుచున్న యాదవులను చూచి ఉద్ధవుడు శ్రీకృష్ణుని కడకు ఏతెంచుట*

🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

*శ్రీశుక ఉవాచ*


*6.1 (ప్రథమ శ్లోకము)*


*అథ బ్రహ్మాఽఽత్మజైర్దేవైః ప్రజేశైరావృతోఽభ్యగాత్|*


*భవశ్చ భూతభవ్యేశో యయౌ భూతగణైర్వృతః॥12376॥*


*6.2 (రెండవ శ్లోకము)*


*ఇంద్రో మరుద్భిర్భగవానాదిత్యా వసవోఽశ్వినౌ|*


*ఋభవోఽఙ్గిరసో రుద్రా విశ్వే సాధ్యాశ్చ దేవతాః॥12377॥*


*6.3 (మూడవ శ్లోకము)*


*గంధర్వాప్సరసో నాగాః సిద్ధచారణగుహ్యకాః|*


*ఋషయః పితరశ్చైవ సవిద్యాధరకిన్నరాః॥12378॥*


*6.4 (నాలుగవ శ్లోకము)*


*ద్వారకాముపసంజగ్ముః సర్వే కృష్ణదిదృక్షవః|*


*వపుషా యేన భగవాన్నరలోకమనోరమః|*


*యశో వితేనే లోకేషు సర్వలోకమలాపహమ్॥12379॥*


*శ్రీశుకుడు నుడివెను* శ్రీకృష్ణభగవానుని దర్శించుటకై బ్రహ్మదేవుడు ఒకనాడు ద్వారకకు విచ్చేసెను. అతనితోపాటు ఆయన కుమారులైన సనకాది మహామునులును, దేవతలును, ప్రజాపతులును ఏతెంచిరి. భూతపతియైన పరమశివుడు భూతగణముతోగూడి విచ్చేసెను. మరుద్గణసహితుడై ఇంద్రుడు, ద్వాదశాదిత్యులు, అష్టవసువులు, అశ్వినీ దేవతలు, ఋభవుడు, అంగిరసుడు, ఏకాదశరుద్రులు, విశ్వేదేవతలు, సాధ్యగణములవారు, గంధర్వులు, అప్సరసలు, నాగులు, సిద్ధులు, చారణులు, యక్షులు, ఋషులు, పితృదేవతలు, విద్యాధరులు, కిన్నరులు మున్నగువారు అందరును శ్రీకృష్ణదర్శనమునకై బ్రహ్మదేవుని వెంట విచ్చేసిరి. శ్రీకృష్ణపరమాత్ముని యొక్క దివ్యరూప సౌభాగ్యము నరలోక వాసుల హృదయములను దోచుకొనునదియై యుండెను. ఆ ప్రభువు అద్భుతలీలా విలాసములతో తన యశస్సును దిగంతముల వరకును విస్తరింపజేసెను. ఆ లీలలను గానము చేసినవారు, విన్నవారు, కీర్తించినవారు సకలపాపములనుండి ముక్తులగుదురు.


*6.5 (ఐదవ శ్లోకము)*


*తస్యాం విభ్రాజమానాయాం సమృద్ధాయాం మహర్ద్ధిభిః|*


*వ్యచక్షతావితృప్తాక్షాః కృష్ణమద్భుతదర్శనమ్॥12380॥*


ఆ ద్వారకానగరము సకలభాగ్యభోగోపకరణాదులతో సమృద్ధమై తేజరిల్లుచుండెను. అందు విరాజిల్లుచున్న శ్రీకృష్ణప్రభువుయొక్క అద్భుతమైన రూపసౌందర్యమును గాంచి వారు కృతార్థులైరి. ఆ దివ్యరూపమును ఎంతగా దర్శించినను తనివితీరకుండెను.


(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి ఏకాదశ స్కంధములోని ఆరవ అధ్యాయము ఇంకను కొనసాగును)


🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తుi🙏🙏


*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం*

7702090319, 9505813235

శ్రీమద్భాగవతము

 *05.09.2021*

*వందేమాతరం*


*భక్తపోతన గారి శ్రీమద్భాగవతము:* 🙏  

*రోజుకో పద్యం: 2252(౨౨౫౨)*


*10.1-1365-*


*క. బలభద్రుండును లోకులు*

*బలభద్రుం డనఁగఁ బెనఁగి పటుబాహుగతిన్*

*బలభేది మెచ్చఁ ద్రిప్పెను*

*బలవన్ముష్టికునిఁ గంసు బలములు బెగడన్.* 🌺



*_భావము: ఈ లోగా అక్కడ సభికులంతా బలరాముని చూచి "భేష్ బలరామా! నీవు మహా బలశాలివి", అంటున్నారు. అప్పుడు బలరాముడు, ఆ ముష్టిక మల్లునితో పోరాడి, తన భుజబలంతో బాహు విన్యాసాలతో బలాసురసంహారి యగు ఇంద్రుడు మెచ్చుకొనేటట్లుగా, ఆ ముష్టికుడిని గిరగిర తిప్పాడు. ఈ దృశ్యం చూసి కంసుని సేనలు భయంతో గడగడా వణికాయి._* 🙏



*_Meaning: Meanwhile the spectators turned on Balarama with encouraging accolades like, "You are great balarama!". He took on Mushtika and fought with him. Earning the praise of Indra, the killer of Balasura. Balarama then got hold of Mushtika and twirled and turned him round and round, causing bewilderment and consternation in the army of Kamsa._* 🙏



*-ప్రభాకర శాస్త్రి దశిక (9849795167)*

*శ్రీ రాజమౌళి నిడుమోలు (8977500180) &*

*Kiran (9866661454)*

*Pavan Kumar (9347214215).*

ప్రత్యక్ష దార్శనికత వినాయక చవితి " వి

 " సృష్టి రహస్యమనదగ్గ ప్రకృతి ఆరాధనకు ప్రత్యక్ష దార్శనికత వినాయక చవితి " విశ్వ జీవరాశి సంరక్షణ, సిద్ధి వినాయక దివ్య ఆశీఃఫలమై శోభించే తరుణమిది ! ప్రకృతి నేర్పెడి నిత్య సత్య చైతన్య స్ఫూర్తి, సన్మైత్రీ భావనాత్మక చింతన ! సకల జీవ ప్రశాంత మనుగడ, విశ్వ మానవాళి సన్మార్గ జీవన పథాన బంగరు భవితగ శోభించే క్షణం ! ఈ పవిత్ర పృధ్విపై ఆవిర్భవించిన ప్రకృతి శోభ, పచ్చని వనాలతో నిత్య చైతన్య దార్శనికత ! సకల లోక గణాలకు నాయకుడైన విఘ్నేశ్వరుడు, సమస్త విఘ్న నివారకుడన్నది, నిత్య సత్య వాక్కు ! "వినాయక చవితి పండగ ", ప్రకృతి ప్రసాదిత ఉత్పత్తుల ప్రత్యక్ష సద్వినిమయ దర్పణం ! జగజ్జనని పార్వతీ మాత ప్రియతమ తనయుడు వినాయకుడు, పరమేశ్వర కృపతో గజాననుడయ్యె ! సద్భక్తి పూర్వక మాతాపితరుల సేవ, వినాయకుని సకల లోక గణాలకధిపతిగ తీర్చిదిద్దిన వైనం ! సకల లోకాలందు, ప్రప్రథమ పూజలందుకునే గణేశుడు, గణాధ్యక్షుడై నిలిచెడి అభయ వరప్రదాత ! భక్తవత్సలుడై తన భక్తులు స్థిరచిత్తంతో ఒసగెడి ప్రకృతి ప్రసాదిత ఫలపుష్ప పత్రాదులను స్వీకరించి, వారి కోరికలీడేర్చే దేవదేవుడు ! గణేశారాధనలో వాడెడి ప్రకృతి ఉత్పత్తుల మహిమ వర్ణనాతీతం, సకలలోక సంపూర్ణ పరిరక్షణం ! సర్వకాల సర్వావస్థలందు విఘ్నేశ్వరుని నమ్మి కొలిచే భక్తాళికి ఎట్టి విపత్తి రాదనేది, పురాణేతిహాసాల సత్య చైతన్య దార్శనికత ! " ఓం గం గణపతయే నమః ", అనే మనఃపూర్వక నిత్య ఆరాధనా సంపూర్ణ ఫలం, సకల లోక పరిపూర్ణ సంరక్షణం ! 🙏🌹🌺🌹💐🌻🌹 💐🌻🌸🌹🙏🙏🙏 రచన : గుళ్లపల్లి ఆంజనేయులు

*రేపే పోలాల అమావాస్య

 *రేపే పోలాల అమావాస్య!*


శ్రావణ మాసం లో వచ్చే బహుళ అమావాస్యను ‘పోలాల అమావాస్య‘ అంటారు. ఈ పోలాల అమావాస్య వ్రతంకు ఎంతో విశిష్టత వుంది. సౌభాగ్యం కోసం, పిల్లల యోగ క్షేమాల కోసం, తమ కుటుంబంకోసం శ్రావణ అమావాస్యనాడు "పోలాల అమావాస్య" వ్రతం ఆచరిస్తారు. ఇది ప్రాంతాచారం. గృహాచారం ఉన్నవారు చేసే వ్రతం.


పోలాల అమావాస్య పూజా విధానం:


పూజచేసే చోట శుభ్రంగా అలికి, వరిపిండితో ముగ్గువేసి, ఒక కందమొక్కను వుంచి, దానికి పసుపుకొమ్ము కట్టిన నాలుగుతోరాలను అక్కడ వుంచి, ముందుగా వినాయకుడికి పూజను చేయాలి. (కందమొక్క దొరకని పక్షంలో కందపిలక పెట్టి పూజ చేసుకొనవచ్చును.)

తర్వాత మంగళగౌరీదేవిని కానీ, సంతానలక్ష్మిని కానీ ఆ కందమొక్కలోకి ఆవాహనచేసి షోడశోపచార పూజను చేయవలెను. తొమ్మిది పూర్ణం బూర్లు మరియు తొమ్మిది గారెలు, తొమ్మిది రకముల కూరగాయలతో చేసిన ముక్కల పులుసు అమ్మవారికి నైవేద్యంగా సమర్పించాలి. తదుపరి కధను చదువుకొని కధా అక్షతలను శిరస్సున ధరించాలి. ఆ తర్వాత కందమొక్కకు ఒక తోరాన్ని కట్టి, మరొకటి తను మెడలో కట్టుకుని, మిగిలిన తోరాన్ని సంతానం మొలలో కట్టాలి(సంతానం ఇంకా లేనివారు అక్కడ ఉన్న పిల్ల కందమొక్కకు సమర్పించవచ్చును).అనంతరం ముత్తయిదువును పూజించి నైవేద్యం పెట్టని తొమ్మిది పూర్ణంబూర్లు, ఒక తోరాన్ని, ఆమెకు వాయనంగా సమర్పించి దీవెనలు అందుకోవాలి.


సంతాన క్షేమం కోసం స్త్రీలు ఆచరించే ఈ పూజలో పూర్ణం బూర్లు, గారెలు, తొమ్మిది రకముల కూరగాయలతో చేసిన ముక్కల పులుసు అమ్మవారికి నివేదిస్తారు. 


ఆడపిల్లకావాలనుకునేవాళ్ళు( ఉన్నవాళ్ళు) గారెలు సమర్పించాలి.


మగపిల్లవాడు కావాలనుకునేవాళ్ళు బూరెలు (ఉన్నవాళ్ళు ) అమ్మవారికి సమర్పించాలి.

నిర్జల ప్రదేశం నందు చెట్ల ద్వారా జలము కనుగొనుట

 నిర్జల ప్రదేశం నందు చెట్ల ద్వారా జలము కనుగొనుట - 


 * తాటి చెట్టుకి కాని టెంకాయ చెట్టుకి గాని పుట్ట ఆవరించి ఉండిన దానికి పశ్చిమమున 6 మూరల దూరమున నాలుగు మాటల లోతున దక్షిణమున నుంచి వచ్చెడి జలధార ఉండును. 

 

 * టెంకాయ చెట్టుకి దక్షిణమున పుట్ట ఉండిన దానికి ఏడు మూరల దూరమున 5 మట్టుల లోతున సంరుద్ధజాలం కలిగి ఉండును. ఒక నిలువు లోతున నానా వర్ణములు కలిగిన శల్యములు , నల్లని రంగు కలిగిన మ్రుత్తికయు , ఆయుధములతో చేధించ దగిన పాషాణం ( రాయి ) , తెల్లని మన్ను, దాని క్రింద పడమట నుంచి ప్రవహిన్చేడు జలధార యు ఉండును. మరియు పుట్టలు ఉండిన యెడల వాటి సమీపమున జలము ఉండును. 

  

 * మారేడు చెట్టు, కానుగ చెట్టు, జీడి చెట్టు, మద్ది చెట్టు, చిత్తముధపు చెట్టు, వీటి యందు యే చేట్టుకైనా పుట్ట చుట్టుకొని యుండిన దానికి ఉత్తరమున మూడు మూరల దూరము నందు నాలుగున్నర నిలువు లోతున సమృద్ధిగల జలం ఉండును. నీరు లేని నిర్జల ప్రదేశం నందు గంబీరమైన శబ్దం పుట్టిన యెడల అచ్చట 35 పురుష ప్రమాణమున ఉత్తరమునకు ప్రవహించే జలనాది ఉండును. 


  * పెద్ద మాను చెట్టు కొమ్మలు అన్ని సరీగా ఉండి వాటిలో ఒక కొమ్మ నేలకు వంగి గాని , తెలుపు వర్ణం కలిగి కాని యున్దినట్లితే అచ్చట మూడు మట్ల లోతున జలం ఉండును. 


  * యే వృక్షం అయినా వాటి వాటి స్వభావం మారి చిగుళ్ళు, పువ్వులు, కాయలు మొదలగు వాటి వరనములు బెధముగా ఉండిన యెడల దానికి తూర్పున మూడు మూరల దూరమున నాలుగు మట్టుల లోతున జలం ఉండును. దాని యందు తెల్లని మన్ను రాళ్ళు ఉండును. 

 

 * రెండు తలల ఖర్జూరం చెట్లు ఉండిన యెడల దానికి పడమర మూడు మూరల దూరం నందు మూడు మట్టుల లోతులో స్వచ్చ జలం ఉండును. 

 

 * తెల్ల మోదుగ చెట్టు ఉండిన దానికి దక్శినమున మూడు మూరల దూరము నందు మూడు మట్టుల లోతున జలము ఉండును. 

 

 * యే ప్రదేశమున వేడి పొగలు ఉండునో అచ్చట రెండు నిలువుల లోతు అదిక ప్రవాహము గల జలదార ఉండును.


 * యే ప్రదేశము నందు పైరులు నలుపక్కల కోమలముగా నుండి మద్య యందు మాడిపోయి ఉండిన , తెలుపు వర్ణం కలిగి యుండినను మికకిలి కొమలముగా నుండినను అచ్చట అదిక ప్రమాణం గల జలదార నిలువు లోతు ఉండును. 

 

 * మరుభూమి అనగా నిర్జలమైన కొండల యందు ఉండు అరణ్యభుమి ములు మొదుగ చెట్టు కు పడమర పుట్ట యుండిన దానికి దక్షిణమున మూడు మూరల దూరము నందు 12 నిలువుల లోతున పడమటి నుండి ప్రవహించే జలనాడి ఉండును. 


 * దురద గొండి చెట్టుకి ఉత్తరమున పుట్ట యుండిన దానికి మూడు మూరల దూరము నందు 10 మట్టుల లోతున దక్షిణమున నుండి ప్రవహించే జలనాడి ఉండును. మరియు నిలువు లోతున పచ్చని వర్ణం గల కప్ప ఉండును . 

 

 * మరియు మద్ది చెట్టుకి ఉత్తరమున పుట్ట యుండిన యెడల దానికి దక్షిణమున రెండు మూరల దూరమున 15 పురుషుల ప్రమాణమున దక్షిణము నుంచి ప్రవహించే ఉప్పు నీటి జలదార ఉండును. 

 

బావి తవ్వునప్పుడు రాళ్లు పడినప్పుడు వాటిని బెధించుటకు ఉపాయం - 

 

 

 * బావి తవ్వునప్పుడు శిలలు కనిపించినప్పుడు వానిని పగలగోట్టుటకు మోదుగు కట్టెలను , దూబర కట్టెలను కాల్చి ఆ బూడిదను సున్నపు నీళ్ళలో కలిపి రాతిని తడిపి పగలగొట్టిన రాయి పగులును.


  * పూర్వము చెప్పినట్టుగా మోదుగ , తుబుర కట్టెలను కాల్చిన బూడిదను , దర్భల బస్మము , మొక్కలపు చెట్టు చెక్కలను, కాల్చిన బూడిద నీళ్లలో కలిపి ఆ నీళ్లు చక్కగా కాచి కాల్చిన బండ మీద 7 పర్యాయములు పోసి తడపగా రాళ్లు పగులును. 

 

 * ఉత్తరేను, తిప్పతీగా, వేపచెక్క, ఆకు, తుభర కట్టెలు, నువవు కట్టెలు, వీని బూడిద ను ఆవు ముత్రములో కలిపి కాచి 6 దినములు రాళ్ళ మీద పోసి నానబెట్టిన యెడల శిలలు పగులును. 

 

 * అరటి పట్టలను కాల్చి ఆ బూడిదను మజ్జిగ యందు కలిపి చక్కగా కాచిన తరువాత అందులొ రాతిని పగలగొట్టడానికి ఉపయొగించే ఆయుధములు ఒక దినమంతయు అందులొ నానబెట్టి రాతిపై ప్రయోగించగా ఆ ఆయుధములు చెడకుండా ఉండును. అలాగే ఆ ఆయుధముల చేత రాళ్లు , ఇనుము మొదలగు వాటిని పగలగొట్టిన ఆ ఆయుధములు మెరుపు , పదును పోకుండా ఉండును. 


 మరిన్ని రహస్య యోగాలు నేను రాసిన గ్రంథాలలో ఇచ్చాను.

  

          నేను రాసిన గ్రంథాలలో మరిన్ని అనుభవ యోగాలు ఇవ్వడం జరిగింది. 


      గమనిక -


           నాచే రచించబడిన "ఆయుర్వేద మూలికా రహస్యాలు " , " ప్రాచీన ఆయుర్వేద రహస్యాలు " అను ఈ రెండు గ్రంథముల యందు అత్యంత రహస్యమైన సులభముగా ఇంటి యందు , చుట్టుపక్కల దొరికే మూలికలతోనే పెద్దపెద్ద రోగాలను నయం చేసుకొనే విధముగా అనేక వైద్య యోగాలను ఇచ్చాను. ఈ గ్రంథాలలో ఇచ్చినటువంటి యోగాలు అన్నియు గత 250 సంవత్సరాల నుంచి వంశపారంపర్యముగా మాకు వస్తున్న రహస్యయోగాలు పరోపకారార్థం దాచుకోకుండా ప్రచురించాను.


           మన చుట్టుపక్కల ఉండే మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల బొమ్మలతో మొక్కల చిత్రపటాలు ఇవ్వడం జరిగింది.


            రైతులకు ఉపయోగపడేవిధముగా చెట్లను , భూమిని బట్టి , రాళ్లని బట్టి భూమి యందు జలమును కనుగొను విధానం , ముహూర్తాలను అనుసరించి ఏయే సమయాలలో పంటలు వేయాలి . ఆయుర్వేద మూలికల సహాయముతో పురుగు మందులు వాడకుండా అత్యంత ఎక్కువ దిగుబడులు సాధించే రహస్య వృక్షయుర్వేద యోగాలు , పశువులకు సంబంధించిన వైద్య యోగాలు కూడా ఇవ్వడం జరిగింది . ఈ గ్రంథాలలో ఇచ్చిన యోగాలు ఉపయోగించటం వలన ఎటువంటి వ్యతిరేక ఫలితాలు రావు.


      ప్రాచీన ఆయుర్వేద రహస్యాలు గ్రంథం 288 పేజీలు ఉంటుంది . విలువ 350 రూపాయలు మాత్రమే . ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథం 384 పేజీలు ఉంటుంది . విలువ 450 రూపాయలు . కొరియర్ చార్జి 100 రూపాయలు అదనం .పుస్తకములు ఎక్కువ కాలం మన్నిక కొరకు కుట్టించి ఇవ్వడం మరియు అత్యంత నాణ్యమైన తెల్లటి 80GSM పేపరుతో ఉంటాయి.


            ఈ రెండు గ్రంథాలు కావలసినవారు డైరెక్టుగా 9885030034 నెంబర్ కి ఫోన్ చేయగలరు. కామెంట్లు , మెస్సేజెస్ సమాధానము ఇవ్వబడదు. కాల్ చేయగలరు .


                  కాళహస్తి వేంకటేశ్వరరావు 


                         9885030034 


               అనువంశిక ఆయుర్వేద వైద్యులు

గుర్వనుగ్రహయాచనం

 🌻గుర్వనుగ్రహయాచనం🌻


సనాతనభారతీయ

సంస్కృతీ.

సంప్రదాయములు

పతనమవడానికి.

కొంతమనఅలసత్వం

కారణమవగా.

మరికొంత

కాలంబలీయమై

బుధ్ధులువక్రగతినపడి.

కాపాడుకోలేక

అచేతనమైస్థితిలో

ఉండిపోయామనేది.

వాస్తవమైనవిషయం.


ఇప్పటికైనాసరే.

పొరపాటుదొర్లిన

కొన్నివిషయాలను

విశ్లేషించుకుని

సవరణంగావించుకుందాం.

మరలా!

మనభావితరాలను

ఈసనాతనవైదికమార్గ

అనుయాయులుగ

తీర్చిదిద్దబడేందులకుగాను

మనవంతు

ప్రయత్నంచెద్దాము.


1;సంధ్యావందనంచేయనివిప్రులు.


2; నుదుటిన

బొట్టుపేట్టుకోవడానికి

నామర్దాపడేజనాలు.


3;వేదంచదవనినోరు.


4;ధర్మశాస్త్రచర్చరహితమైనబుధ్ధి.


5;శస్త్రంలేనిహస్తం.


6;శుధ్ధంలేనటువంటిమనస్సు.


7;శ్రధ్ధలేనటువంటికర్మ.


8;భక్తిలేనటువంటిఆరాధన.


9;అనుభవంలేనివేదాంతజ్ఞానం.


10;శుశ్రూషారహితమైనగుర్వాశ్రయం.


11;స్వార్థముతోవృత్తులను

చెపట్టడం.


12;దేశభక్తిరహితమైనసమాజం.


13;సంస్కారంనేర్పనిచదువులు.


14; వేదశాస్త్రాదులకొసం

త్యాగంచేయలేనిసంపద.


15.అనవసరమవిషయములపై

అన్వేషణంచేయుట.


16.మహదాచార్యుల

ప్రబోధములను

చింతనగావించకపొవుట.


ఈపదహారుఅంశములను

ప్రస్తుతపుతరం

ఈక్షణంనుండే

సవరణంగావించుకొనుట

ప్రారంభంచేసినయడల

భావితరమైనసరే.

సనాతనభారతీయ

ధర్మావలంబులై.

దేశభక్తి.దైవచింతన.

ధర్మరక్షణ.

సంస్కృతీ-సంప్రదాయ

అనుసరణం.వంటి.

మనమహర్షులు

ఉపదేశంచేసిన

పంథాను

అవలంబించి.

మరలా!మనభారతదేశమును

విశ్వమునకే

గురుస్థానములొనిలబేట్టి.

భరతమాతఖ్యాతిని

దశదిశలావ్యాపింపజేయగలరు.


ఇవన్నీ

మనంసాధించుటకుగాను

తగిశక్తియుక్తులను

ప్రసాదించమని

ఈఉపాధ్యాయ పర్వముదివసమునందు

మనపూర్వాచార్యులందరినీ

ప్రార్థిస్తూ. వాళ్ళఅనుగ్రహమును

యాచిస్తున్నాను...



జైగురుదేవ్ 

జైభారత్ మాత.


*పూషారక్షతునోవయమ్*


స్వస్తి

...జగర్లపూడివీరభద్రశర్మ...

Gurukuls

 The first school in England opened in 1811 . At that time India had 732000 Gurukuls.


Find out how our Gurukuls got closed. How did Gurukul learning end.

First will tell you what disciplines were taught in Gurukul culture (in the Sanatan culture) !  


Most Gurukuls taught the following subjects.


01 Agni Vidya (Metallurgy)

02 Vayu Vidya (Wind)

03 Jal Vidya (Water)

04 Antriksh Vidya (Space Science)

05 Prithvi Vidya (Environment)

06 Surya Vidya (Solar Study)

07 Chandra and Lok Vidya (Lunar Study)

08 Megh Vidya (Weather Forecast)

09 Dhaatu Urja Vidya (Battery energy)

10 Din aur Raat Vidya.

12 Srishti Vidya (Space Research)

13 Khagol Vigyan (Astronomy)

14 Bhugol Vidya (Geography)

15 Kaal Vidya (Time studies)

16 Bhoogarbh Vidya (Geology & Mining)

17 Gemstones and Metals (Gems & Metals)

18 Aakarshan Vidya (Gravity)

19 Prakash Vidya (Energy)

20 Sanchaar Vidya (Communication)

21 Vimaan Vidya (Plane)

22 Jalayan Vidya (Water Vessels)

23 Agneya Astra Vidya (Arms & Ammunition)

24 Jeevavigyaan Vidya (Biology, Zoology, Botany)

25 Yagna Vidya (Material Sic)

* This is the talk of scientific education. Now let's talk about professional and technical disciplines that were covered!*

26 Vyapaar Vidya (Commerce)

27 Krishi Vidya (Agriculture)

28 Pashu Paalan Vidya (Animal Husbandry)

29 Pakshi Paalan (Bird Keeping)

30 Yaan Vidya (Mechanics)

32 Vehicle Designing

33 Ratankar (Gems & Jewellery Designing)

36 Kumhaar vidya (Pottery)

37 Laghu (Metallurgy & Blacksmith)

38 Takkas

39 Rang Vidya (Dyeing)

40 Khatwakar

41 Rajjukar (Logistics)

42 Vaastukaar Vidya (Architecture)

43 Khaana Banane ki Vidya (Cooking)

44 Vaahan Vidya (Driving)

45 Waterways Management

46 Indicators (Data Entry)

47 Gaushala Manager (Animal Husbandry)

48 Baagvaani (Horticulture)

49 Vann Vidya (Forestry)

50 Sahyogee (Covering Paramedics)


All this education was taught in Gurukul, but with time, when Gurukul disappeared, this knowledge was made to disappear by the British! It started with Macaulay. Today, the future of the youth of our country is being destroyed by the Macaulay method. 


How did Gurukul culture end in India?

The introduction of Convent education ruined Gurukuls. Indian Education Act was formed in 1835 (revised in 1858). It was drafted by 'Lord Macaulay'. 


Macaulay conducted a survey of education system here while many Britishers had given their reports about India's education system. One of the British officer was G.W. Luther and the other was Thomas Munro! Both of them had surveyed different areas at different times. Luther, who surveyed North India (Uttar Bhaarat), wrote that there is 97 % literacy here and Munro, who surveyed South India (Dakshin Bhaarat), wrote that here there is 100% literacy.


Macaulay had clearly said that if India (Bhaarat) is to be enslaved forever, its ′′*indigenous and cultural education system* ′′ must be completely demolished and replaced with ′′ English education system ′′ and only then will Indians be physically Indians, but  mentally become English.  When they leave the convent schools or English universities, they will work in the interest of British.


Macaulay is using an idiom - ′′ Just as a farm is thoroughly ploughed before a crop is planted, so must it be ploughed and brought in the English education system. ′′ That's why he first declared Gurukuls illegal. Then he declared Sanskrit illegal and set the Gurukuls on fire, beat the teachers in it and put them in jail.

Till 1850 there were ' 7 lakh 32 thousand ' Gurukuls & 7,50,000 villages in India. Meaning almost every village had a Gurukul and all these Gurukuls used to be 'Higher Learning Institutes' in today's language. 18 subjects were taught in all of them and these people of Gurukul Samaj used to run these together, not by the king.

Education was imparted free.

Gurukuls were abolished and English education was legalized and the first convent school opened in Calcutta. That time it was called 'free school'. Under this law, Calcutta University, Bombay University & Madras  University were created. These three slavery-era universities are still in the country!


Macaulay had written a letter to his father. It is a very famous letter, in it he writes: ′′ These convent schools will bring out children who look like Indians but are English by brain and they don't know anything about their country. They won't know anything about their culture, they won't have any idea about their traditions, they will not know their idioms, when such children are there in this country, even if the British go away, English will not leave this country.′′ The truth of the letter written at that time is clearly visible in our country even today. See the misery created by this  act. We feel inferior of ourselves who are ashamed to speak our own language & recognise our own culture.


A society that is cut off from its mother tongue never flourishes and this was Macaulay’s strategy! Today's youth here knows more about Europe than India. Considers Indian culture not so cool, but imitates Western country...

గురువు

 గురువు అంటే మనలోని అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానజ్యోతిని వెలిగించేవాడు అని అర్దం.

చిన్నతనంలొ గురువు మేష్టారు (Teacher), కళాశాలలో అద్యాపకుడు (Lecturer), విశ్వవిద్యాలయంలో ఆచార్యుడు (Professor) గాను పిలువబడతాడు. కాని చిత్రమేమిటంటే మేష్టారు అన్ని సబ్జక్టులు అంటే తెలుగు, ఇంగ్లీషు, లెక్కలు, సామాన్య, సాంఘిక శాస్తాలలో విద్యా బోధనతో పాటు ఆటలు, పాటలు, కరంట్ ఎయిర్స్ (జనరల్ నాలెడ్జ్) రంగాలలో పిల్లల ఎదుగుదల, మానశికోల్లాసము మరియు మంచి భావిభారత పౌరులుగా స్థిరపడడానికి బీజం వేస్తాడు.

అధ్యాపకుడు తనకు నిర్దేశించిన విషయమును మాత్రమే వివరిస్తాడు. ఇక్కడ గురువు ప్రాధాన్యత తక్కవ. విద్యార్ధి యొక్క కృషి, అభిరుచుల ప్రాధాన్యత ఎక్కువ.

ఆచార్యుడు విద్యార్ధి యొక్క ఉత్సుకత, అభిరుచి, ఆసక్తతలను గమనించి విషయ జ్ఞానాన్ని అందిస్తారు.

వీరందరు కూడా గురువులే. 

కాని విద్యార్ది తన జీవిత కాలంలో తనపై ఎక్కువ ప్రభావాన్ని చూపిన గురువుని మాత్రమే జీవిత చరమాంకము వరకు జ్ఞప్తియందు ఉంచుకుంటాడు. 

కావున ఈ కాలంలో, తన శిష్యులు తమ జీవితాంతం గుర్తుంచుకునేలా మెలగవలసిన బాధ్యత గురువులపై ఎంతగానో ఉంది. అప్పుడే తమ శిష్యుల పురోభినృధ్దితో పాటు దేశానికి కూడా మంచి పౌరులని అందించిన వారౌతారు. 

ఈ దిశలో, మన తెలుగువాడు, ప్రియతమ నేత శ్రీ సర్వేపల్లి రాధాకృష్ణ గారిని ఆదర్శంగా తీసుకుని వారి ఆశయ సాధనకు కృషి చేస్తూ, మన భావి తరాలకు మన భాష, సంప్రదాయాలను అందించే ప్రయత్నం చేద్దాం.

తెలుగులోనే చదువుట, వ్రాయుట, మాట్లడుట ప్రారంభిద్దాము. మన మాతృ భాషను గౌరవిద్దాము.

తులాపురుషదానం

 తులాపురుషదానం చేసేస్తారా ఏమిటి ? అలాగైతే ఎలా చేయాలో తెలుసుకోండి.

.....................................................


దానాలలో పదిరకాల దానాలు, షోడషమహా (16) దానాలున్నాయని మొన్నీమధ్యనే మీరు తెలుసుకొన్నారు కదా. షోడషమహాదానాల గురించి సంపూర్ణ వివరాలు పంపమని కొందరు జిజ్ఞాసతో అడిగారు వారి కోసం....


(1) తులాపురుషదానం > తుల అంటే తక్కెడ, త్రాసని పురుష అంటే వ్యక్తి అర్థమంతే. కాని పురుషుడంటే కేవలం మగవాడని కాదు. ఉద్యోగం పురుషలక్షణమంటే కేవలం మగవారు మాత్రమే కొలువులు చేయాలని కాదు. ఇక్కడ పురుష అనేమాటకు మనిషని, ఉద్యోగమనే మాటకు పని అని అర్థము చేసుకోవాలి.


ఇక తులాపురుషదానమంటే పుట్టిన రోజున, శత్రువుపై విజయం సాధించినరోజున, సంతానం కలిగినపుడు, పరలోకంలోని అమ్మానాన్నల, పితృదేవతల పుణ్యంకోసం, ఇంకా దేవుడు తాను కోరిన కోర్కెలు తీర్చినరోజున దేవాలయంలోని తులాభార మండపంలోనున్న కోరికలు తీరినవ్యక్తి తక్కెడలో ఒక సిబ్చెలో కూర్చుని మరొక సిబ్బెలో తనశక్తికొద్ది బంగారు ఆభరణాలో, బంగారు నాణ్యాలో*, వెండి ఆభరాలో, ఇంకా ఇప్పటి నాణేలను** కరెన్సిలనో,బియ్యం, బేడలు, బెల్లం,చక్కెర, పుస్తకాలు, నూతనవస్త్రాలు మొదలైనవి తనబరువుతో తూచి దేవుడికో పేదలకో దానం చెయ్యడం. 

దీనినే తులాపురుషదానం అంటారు.తిరుమల మలయప్పస్వామి గుడిలో తులాభార కార్యక్రమాలు నిత్యం జరుగుతుంటాయి.


ప్రతిప్రాచీన దేవాలయంలోనూ పొడుగైన ఊయల మండపాలుంటాయి. కొందరు ఈ మంటపాలనే తులాభార మంటపాలని కూడా అంటారు.


* నాణేలను ( Coins) చాలా మంది నాణ్యాలని పలుకుతుంటారు. నాణ్యము అంటే మేలైనదని అర్థం కాబట్టి

** నాణెము, నాణేములు అని పలకాలి. మీరు పలకరు, పలకలేరు ఎందుకంటే ఆంగ్లమోజులోపడి హండ్రెడ్ రుపీస్ కు చేంజ్ వుందా అని అడుగుతారు.అలా అడిగినప్పుడల్లా తెలుగుతల్లి గుండెలో గుణపం గుచ్చినవారమైతాం.

ఆంగ్లంలో మాట్లాడి తెలుగుతల్లిని క్రూరహింసకు గురి చేస్తారో, తెలుగులోనే మాట్లాడి ఆమెను సంతోషింపచేస్తారో మీ ఇష్టం.


(2) హిరణ్యగర్భదానం > 75 చేతివేళ్ళ పొడవు, 48 చేతివేళ్ళ వెడల్పుతో ఒక బంగారు కుండను చేయించి, తిలలు కుప్పగా పోసి ఆ కుండను ఆ కుప్పపైనుంచాలి. దాత ఆ బంగారుకుండకు ఉత్తరాభిముఖంగా దాత ఆసీనుడై, చేతులలో బ్రహ్మ, ధర్మరాజు బంగారు విగ్రహాలు పట్టుకొని 5 సార్లు తలను మోకాళ్ళపై వుంచి ఊపిరి బిగబట్టి పైకి లేపాలి. ఇలా చేయడం వలన మాతృగర్భంలోని పిండాన్ని అనుసరించడమైతుంది.


తరువాత పురోహితుడు గర్భదాన పుంసవన సీమంత, యవన మంత్రములు చదువును. దాత కుండతోపాటు ప్రక్కకువచ్చును. పిమ్మట అన్నప్రాసన సంస్కారం జరుపుతారు. దాత హిరణ్యగర్భాన్ని (బంగారుకుండ) ఉద్దేశిస్తూ నేను తల్లిగర్భనుండి మర్త్యుడై జన్మించినాను, ఇపుడు హిరణ్యగర్భమున జనించినట్లైంది, అంటే నాకు దేవత్వం లభించిందని చెప్పి బంగారు ఆసనముపై కూర్చుని "దేవన్వత్వా'' అనే మంత్రాన్ని జపిస్తూ బంగారుకుండకు అభిషేకం చేసి, దానిని పురోహితునికో, గురువుకో, బ్రాహ్మణుడికో లేదా పేద మాలమాదిగలకో దానం చేస్తాడు.


(3) బ్రహ్మండదానం > బ్రహ్మండదానమంటే ఏమిటో తెలియదని నాకు మొన్ననే మనవి చేసుకొన్నా. ఐనా నా స్వబుద్ధికి తోచింది వివరిస్తా. అది ఒప్పయిన, తప్పయిన కావచ్చును.


" సమగ్రహారాన్ దతతోగ్రహారదానం కియద్యస్య వదాన్యమౌలే:

కింవా బ్రహ్మత్యఖిల విశ్వచక్ర బ్రహ్మాంశ దాతు: కిమ దేయస్తు"


పై శ్లోకంలో 1505 ACE లో ఇమ్మడిదేవరాయలు బ్రహ్మండ దానాన్ని చేశాడు. శాసనశ్లోకంలో అగ్రహార ప్రస్తావనలున్నాయి కనుక బ్రహ్మండమంటే అగ్రహారదానమని నా భావన.

పైగా బ్రహ్మండమంటే విశాలవిశ్వం, భూమి అనికూడా అర్థము కదా ! కాబట్టి శాస్త్రోక్తంగా భూమిని దానం చేయడమని నా అభిప్రాయం.


(4) కల్పవృక్షదానం > బంగారుతో ఒక చెట్టును తయారుచేసి పూజాధి కార్యక్రమాలు నిర్వహించి అర్హులకు దానం చేసి పాపవిముక్తం కావడమనుకొంటాను. బంగారుతో నిర్మించిన వృక్షం కనుక కల్పవృక్షమైంది.


(5) సహస్రధేనుదానం > సహస్ర అంటే వేయి, ధేను అంటే గోవు. వేయి గోవులను దానం చేయడం.నా ప్రకారం వేయి + పదహారు > వేయిన్ని పదహారు కనకగోవులను తయారు చేయించి, పీఠముపై వాటిని అధిష్టింపచేసి, సచేల స్నానానంతరం పూజప్రార్థన హోమాది కార్యక్రమాలు నిర్వహించి వాటికి క్షిరాభిషేకం చేయించి 1016మంది బ్రాహ్మణపురోహితశుద్ర చండాలురకు ఆ బంగారుగోవులను దానం చేయడం.


(6) హిరణ్యకామధేనుమహాదానం > హిరణ్యమంటే బంగారం.ధేనువంటే గోవు. ఇది కూడా ఇంచుమించు పైదానిలాంటిదేనని నా అభిప్రాయం. కాకపోతే పూజాదిక్రతువులు వేరువేరుగా వుండవచ్చును.


(7) హిరణ్యాశ్వ > బంగారుతో చేసిన ఉత్తమాశ్వాలను దానం చేయడం. యుద్ధసమయంలో గుర్రం పాత్ర ఎంతో ముఖ్యమైనది. పోరులో తనకు చెందిన ఉత్తమ అశ్వాన్ని కోల్పోయినపుడు ఏ రాజో మహమండలేశ్వరుడో, దండనాయకుడో ఆ గుర్రానికి కూడా ఉత్తమగతులు సంప్రాప్తించాలని చేసే దానమని నా ఊహ.


(8) హిరణ్యరథదానం > బంగారంతో దేవుడి రథాన్ని తయారుచేయించి, దానిని ఊరేగించి తన ఇలవేలుపు కొలువుదీరిన దేవాలయానికి దానం చేయడమేమోనని నా అభిప్రాయం.


(మిగతా ఎనిమిది దానాలగురించి తరువాత)

............................................................................................................... జి.బి.విశ్వనాథ.9441245857. అనంతపురం.

సంస్కృత మహాభాగవతం*

 *5.09.2021 ప్రాతః కాల సందేశము*


*వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం*


*ఏకాదశస్కంధము - ఐదవ అధ్యాయము*


*భగవంతుని సేవింపనివారిగతి - భగవంతుని పూజావిధానము*

🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

*5.41 (నలుబది ఒకటవ శ్లోకము)*


*దేవర్షిభూతాప్తనృణాం పితౄణాం న కింకరో నాయమృణీ చ రాజన్|*


*సర్వాత్మనా యః శరణం శరణ్యం గతో ముకుందం పరిహృత్య కర్తమ్॥12364॥*


మహారాజా! భగవంతుడు సర్వలోక శరణ్యుడు. ఆ సర్వేశ్వరుని సర్వాత్మనా శరణుజొచ్చినవాడు ఆ స్వామి అనుగ్రహ ప్రభావమున వివిధములగు కర్మబంధముల నుండియు, వాటి వాసనలనుండియు సంపూర్ణముగా ముక్తుడగును. అంతట దేవతలు, ఋషులు, కుటుంబీకులు, మానవులు, సకలప్రాణులు, పితృదేవతలు మున్నగువారి ఋణములనుండి అతడు విముక్తిపొందును. అందువలన అతడు వీరిలో ఎవరికిని కింకరుడు కాడు. ఆ విధముగా అతడు భగవదనుగ్రహమునకు పాత్రుడై పరంధామమునకు చేరును.


*5.42 (నలుబది రెండవ శ్లోకము)*


*స్వపాదమూలం భజతః ప్రియస్య త్యక్తాన్యభావస్య హరిః పరేశః|*


*వికర్మ యచ్చోత్పతితం కథంచిద్ధునోతి సర్వం హృది సన్నివిష్టః॥12365॥*


దేవాదిదేవుడైన ఆ పరమపురుషుని అనన్యభావముతో శరణుపొందిన పరమభక్తునివలన ఎట్టి పాపకృత్యములు ఘటిల్లవు. ఒకవేళ ఎప్పుడైనను అతనివలన పాపకర్మగాని, నిషిద్ధకర్మగాని (అతని సంకల్పములేకుండా) ఘటిల్లినచో సకలప్రాణుల హృదయములలో నివసించు చుండెడి భగవంతుడు అతని పాపవాసనలను అన్నింటిని క్షాళితమొనర్చును. ఆ విధముగా అతనిని పరిశుద్ధుని జేయును.


(తొమ్మిదిమంది యోగీశ్వరులయొక్క చర్చలతోగూడిన ఈ ప్రకరణము శరణాగతితోనే ప్రారంభమయినది. ఈ ప్రకరణముయొక్క ముగింపుగూడ శరణాగతితోనే పూర్తియగుచున్నది. కావున మానవుడు శ్రేయస్సును పొందుటకు భగవంతుని శరణుజొచ్చుటయే సర్వోత్కృష్టసాధనమని స్పష్టమగుచున్నది)


*నారద ఉవాచ*


*5.43 (నలుబది మూడవ శ్లోకము)*


*ధర్మాన్ భాగవతానిత్థం శ్రుత్వాఽథ మిథిలేశ్వరః|*


*జాయంతేయాన్ మునీన్ ప్రీతః సోపాధ్యాయో హ్యపూజయత్॥12366॥*


*నారదుడు నుడివెను* మిథిలాధిపతియగు నిమిమహారాజు ఈ విధముగ భాగవతధర్మములను సావధానముగావిని మిగుల సంతుష్టుడయ్యెను. పిమ్మట ఆ ప్రభువు తన ఋత్విజులతో, ఆచార్యులతోగూడి జయంతి (ఋషభదేవుని భార్య జయంతి) కుమారులైన ఆ మునీశ్వరులను విధ్యుక్తముగా పూజించెను.


*5.44 (నలుబది నాలుగవ శ్లోకము)*


*తతోఽన్తర్దధిరే సిద్ధాః సర్వలోకస్య పశ్యతః|*


*రాజా ధర్మానుపాతిష్ఠన్నవాప పరమాం గతిమ్॥12367॥*


పిమ్మట అక్కడివారు అందరును చూచుచుండగనే ఆ యోగిపుంగవులు అంతర్థానముచెందిరి. నిమిమహారాజు వారి ఉపదేశములను పూర్తిగా అనుష్ఠించి, పరమగతిని పొందెను.


*5.45 (నలుబది ఐదవ శ్లోకము)*


*త్వమప్యేతాన్ మహాభాగ ధర్మాన్ భాగవతాన్ శ్రుతాన్|*


*ఆస్థితః శ్రద్ధయా యుక్తో నిఃసంగో యాస్యసే పరమ్॥12368॥*


మహాత్మా! వసుదేవా! నీవు వినిన ఈ భాగవతధర్మములను భక్తిశ్రద్ధలతో ఆచరింపుము. అంతట సకలబంధములనుండి విముక్తుడవై పరమపదమును పొందెదవు.


*5.46 (నలుబది ఆరవ శ్లోకము)*


*యువయోః ఖలు దంపత్యోర్యశసా పూరితం జగత్|*


*పుత్రతామగమద్యద్వాం భగవానీశ్వరో హరిః॥12369॥*


సర్వశక్తిమంతుడైన శ్రీహరి మీకు పుత్రుడుగా జన్మించెను. అందువలన మీ దంపతులయొక్క (దేవకీవసుదేవులయొక్క) యశస్సు జగత్తునందు అంతటను వ్యాపించును.


*5.47 (నలుబది ఏడవ శ్లోకము)*


*దర్శనాలింగనాలాపైః శయనాసనభోజనైః|*


*ఆత్మా వాం పావితః కృష్ణే పుత్రస్నేహం ప్రకుర్వతోః॥12370॥*


మీరు శ్రీకృష్ణప్రభువును దర్శించుట, అక్కునజేర్చుకొనుట, ముచ్చట్లాడుట, పరుండబెట్టుట, ఆసీనునిగావించుట, భోజనము పెట్టుట మొదలగు క్రియలద్వారా ఆయనపై మీ వాత్సల్యము ప్రదర్శించితిరి. తత్ఫలితముగా మీ హృదయములు పరిశుద్ధములైనవి. మీరు పునీతులైతిరి.


*5.48 (నలుబది ఎనిమిదవ శ్లోకము)*


*వైరేణ యం నృపతయః శిశుపాలపౌండ్రశాల్వాదయో గతివిలాసవిలోకనాద్యైః|*


*ధ్యాయంత ఆకృతధియః శయనాసనాదౌ తత్సామ్యమాపురనురక్తధియాం పునః కిమ్॥12371॥*


వసుదేవా! శిశుపాలుడు, పౌండ్రకుడు, సాల్వుడు మొదలగు రాజులు, తాము పరుండినప్పుడు, కూర్చొనియున్నప్పుడును, తదితర సమయములయందును వైరభావముతో నైనను శ్రీకృష్ణప్రభువు యొక్క గమనమును లీలావైభవములను, విలోకనములు మొదలగువాటిని ధ్యానించిరి. ఫలితముగా వారు సారూప్యమోక్షమును పొందిరి. ఇక మిగుల ప్రేమానురాగములతో ఆ స్వామిని లాలించి పాలించుచుండెడి మీ విషయమును గూర్చి చెప్పనేల?


*5.49 (నలుబది తొమ్మిదవ శ్లోకము)*


*మాపత్యబుద్ధిమకృథాః కృష్ణే సర్వాత్మనీశ్వరే|*


*మాయామనుష్యభావేన గూఢైశ్వర్యే పరేఽవ్యయే॥12372॥*


వసుదేవా! నీవు శ్రీకృష్ణుని మీ పుత్రునిగా మాత్రమే భావింపవలదు. అతడు పరమాత్ముడు, సర్వేశ్వరుడు, కారణాతీతుడు, శాశ్వతుడు. ఆ స్వామి తన దివ్యత్వమును మరుగుపరిచి మాయా మానుష రూపములో అవతరించి, తన లీలలను ప్రదర్శించెను.


*5.50 (ఏబదియవ శ్లోకము)*


*భూభారాసురరాజన్యహంతవే గుప్తయే సతామ్|*


*అవతీర్ణస్య నిర్వృత్యై యశో లోకే వితన్యతే॥12373॥*


శ్రీకృష్ణప్రభువు భూమికి భారముగానున్న అసురప్రవృత్తిగల రాజన్యులను సంహరించుటకును, సత్పురుషులను రక్షించుటకును, అట్లే జీవులకు పరమశాంతిని, ముక్తిని ప్రసాదించుటకును అవతరించిన మహానుభావుడు. ఆయన తన యశోవైభవములను సకలదిశలయందును వ్యాపింపజేసెను.


*శ్రీశుక ఉవాచ*


*5.51 (ఏబది ఒకటవ శ్లోకము)*


*ఏతచ్ఛ్రుత్వా మహాభాగో వసుదేవోఽతివిస్మితః|*


*దేవకీ చ మహాభాగా జహతుర్మోహమాత్మనః॥12374॥*


*శ్రీశుకుడు పలికెను* పరీక్షిన్మహారాజా! మహాభాగ్యశాలులైన దేవకీవసుదేవులు నారదుడు తెలిపిన భవ్యవచనములను విని ఎంతయు విస్మితులైరి. వారు తమ పుత్రమోహమును త్యజించిరి.


*5.52 (ఏబది రెండవ శ్లోకము)*


*ఇతిహాసమిమం పుణ్యం ధారయేద్యః సమాహితః|*


*స విధూయేహ శమలం బ్రహ్మభూయాయ కల్పతే॥12375॥*


మహారాజా! పరమపవిత్రమైన ఈ ఇతిహాసమును ఏకాగ్ర చిత్తముతో ఆలకించి, దీనిని మనస్సున పదిలపరచుకొనినవారు భగత్ప్రాప్తికి ప్రతిబంధకములైన రాగద్వేషములనుండి ముక్తులై బ్రహ్మపదమును (పరమపదమును) పొందుదురు.


*ఇతి శ్రీమద్భాగవతే మహాపురాణే పారమహంస్యాం సంహితాయాం ఏకాదశస్కంధే పంచమోఽధ్యాయః (5)*


ఇది భాగవత మహాపురాణమునందలి ఏకాదశస్కంధము నందలి *భగవంతుని సేవింపనివారిగతి - భగవంతుని పూజావిధానము* అను

ఐదవ అధ్యాయము (5)


🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తుi🙏🙏


*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం*

7702090319, 9505813235g

శ్రీలలితా సహస్రనామ భాష్యము*

 *శ్రీమాత్రేనమః*


*శ్రీలలితా సహస్రనామ భాష్యము*


*407వ నామ మంత్రము* 5.9.2021


*ఓం శివమూర్త్యై నమః*


శివుడే తన స్వరూపముగా విరాజిల్లు పరమేశ్వరికి నమస్కారము.


శ్రీలలితా సహస్ర నామావళి యందలి *శివమూర్తిః* అను నాలుగక్షరముల (చతురక్షరీ) నామ మంత్రమును *ఓం శివమూర్త్యై నమః* అని ఉచ్చరించుచూ, ఆ పరమేశ్వరిని ఆరాధించు సాధకులకు మోక్షస్వరూపిణియైన పరమేశ్వరి కరుణచే, ఆ భక్తుల జీవనమంతయు మంగళకరమగును మరియు శాంతిసౌఖ్యములకు, సిరిసంపదలకు కొరతలేకుండా ఉండును.


శ్రీచక్రం లోని నాలుగు సమద్విబాహు త్రిభుజాలు ఉర్ధ్వముఖంగా ఉండి శివుణ్ణి లేదా పురుష శక్తిని సూచిస్తాయి. అయిదు సమద్విబాహు త్రిభుజాలు నిమ్మముఖంగా ఉండి శక్తిని లేదా స్త్రీని సూచిస్తాయి. కావున శ్రీ చక్ర యంత్రము వ్యతిరేక దివ్యశక్తుల సంగమమును సూచిస్తుంది. ఆ విధంగా శివశక్త్యైక్యము ప్రస్ఫుటమగుచున్నది. శ్రీచక్రంలో శివుడు బిందురూపంలో ఉంటాడు. శక్తి (శ్రీమాత) త్రికోణరూపిణియై ఉంటుంది. శివుడే శక్తి, శక్తియే శివుడు. శివశక్తులకు భేదములేదు గనుక అమ్మవారు *శివమూర్తీ* అనబడినది. శివుని శరీరంలో వామభాగమంతయు శక్తిరూపమగుటచే ఆ పరమేశ్వరి *శివమూర్తీ* అని యనబడుచున్నది. 


శక్తికి రూపములేదు. శివుని రూపమే శక్తిరూపము. ఆ విధముగా శివశక్తులకు అభేదము గలదు గనుకనే అమ్మవారు *శివమూర్తీ* అని యనబడినది.


జగన్మాతకు నమస్కరించునపుడు *ఓం శివమూర్త్యై నమః* అని యనవలెను.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

మహాగణపతి, బాల, శక్తిపంచాక్షరీ, పంచదశీ మంత్రోపదేశము, ఆంగ్లభాషలో అనర్గళ వాక్పటిమ ప్రదాతలు, నా జీవన వృత్తికి, ప్రవృత్తికి మార్గదర్శకులైన, కుర్తాళం మౌనస్వామి వారి ప్రియశిష్యులు, నాతొలిగురువర్యులు, కీ.శే కొండాకోటయ్య మహనీయుల అనుగ్రహముతోను, ఎనిమిది నెలలు(1977లో) తన పాదసేవాభాగ్యంతో నన్ను పునీతులను చేసిన జిల్లెళ్ళమూడి అమ్మ అనుగ్రహముతోను భాస్కరరాయలు వారి సౌభాగ్యభాస్కరము, మరియు కొందరు ఆధ్యాత్మికవేత్తల వ్యాఖ్యానముల పరిశీలనతోను అక్కడక్కడ భాస్కరరాయలు వారి శ్లోకములు మరియు ఆది శంకరాచార్యుల సౌందర్యలహరి శ్లోకములు తీసుకుంటూ, నా స్వీయ వివరణతో ఈ వ్యాఖ్యాన పుష్పాన్ని జగజ్జనని ఇచ్చిన ప్రసాదంగా భావిస్తూ అందరికీ పంచుతున్నాను. ఇచ్చిన పేరాలు, శ్లోకాలు జగజ్జనని ప్రసాదపుష్పంగా భావిస్తున్నాను. ఇందులో వ్యాఖ్యాన పంక్తులు గాని, శ్లోకాలు మొదలైనవన్నియు అమ్మవారి నుండి లభించిన ప్రసాద పుష్పము యొక్క దళములుగా భావించుచున్నాను. అట్టి పుష్పమునుండి ఏమి తొలగించిననూ ఆయా దళములు త్రుంచిన దోషమవుతుంది. జగన్మాత భక్తులయిన వారు యథాతథముగా ఎంతమందికి ఈ పుష్పాన్ని పంపిననూ సంతోషమే.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

 *పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం* 7702090319, 9505813235

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹


మీకు, మీకుటుంబ సభ్యులకు శుభోదయ శుభాభి వందనములు🌹🌹🌹🌹🌹🌻🌻🌻🌻🌸🌸🌸🌸💐💐💐

*శ్రీలలితా సహస్రనామ భాష్యము*

 *శ్రీమాత్రేనమః*


*శ్రీలలితా సహస్రనామ భాష్యము*


*990వ నామ మంత్రము* 5.9.2021


*ఓం అభ్యాసాతిశయజ్ఞాతాయై నమః*


చిరకాలాభ్యాసాతిశయముచే తెలియబడు తల్లికి నమస్కారము.


శ్రీలలితా సహస్ర నామావళి యందలి *అభ్యాసాతిశయజ్ఞాతా* యను ఎనిమిదక్షరముల (అష్టాక్షరీ) నామ మంత్రమును *ఓం అభ్యాసాతిశయజ్ఞాతాయై నమః* అని ఉచ్చరించుచూ, ఆ జగన్మాతను ఉపాసించు సాధకులకు ఆ తల్లి కరుణచే తాము చేయు సాధనలో పరిపూర్ణత ఏర్పడి తరింతురు.


నిత్యము నిద్రనుండి లేచినది మొదలు మరల నిద్రపోవు వరకూ, జీవితకాలమంతయునూ వేదాంతవిచారణ చేయుటయే అభ్యాసము. ఇది వేదవిహితము. ఆ విధమైన అభ్యాసము వలన అందులో ఉండే రహస్యాలు అవగాహనకు వచ్చి ఆత్మసాక్షాత్కారము లభించును. ఏదైనా విషయము పదే పదే వినుటవలన, ఆ విషయము మనసుకు అత్తుకుపోతుంది. అలాగే పరమేశ్వరి స్తోత్రములు గాని, పురాణవిషయములుగాని మరల మరల అభ్యాసము మాదిరిగా పారాయణ చేయుటచే, ఆ తల్లి గురించి తెలియుటయే గాక, పుణ్యకర్మఫలము సంప్రాప్తించును. స్తోత్రముగాని, మంత్రజపముగాని ఆవృత్తిగా చేయుటనే అభ్యాసాతిశయము అని అందురు. బ్రహ్మాండ పురాణములో 'పరమేశ్వరి కేవలధ్యానముచే తెలిదగినది అనియు, జ్ఞానమే శరీరముగాను, ఆత్మగాను తేజరిల్లుచున్నది' అని గలదు. ఆ తల్లి విలసిల్లునదే హృదయమందలి దహరాకాశమునందు. జీవేశ్వరైక్యమును చిరకాలము అనుష్ఠించుటవలనను, ఆత్మైక్యము వలనను ఆ తల్లిని మనోనేత్రములందు తెలియగలము గనకనే ఆ పరమేశ్వరి *అభ్యాసాతిశయజ్ఞాతా* యని అనబడినది.


జగన్మాతకు నమస్కరించునపుడు *ఓం అభ్యాసాతిశయజ్ఞాతాయై నమః* అని యనవలెను.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

మహాగణపతి, బాల, శక్తిపంచాక్షరీ, పంచదశీ మంత్రోపదేశము, ఆంగ్లభాషలో అనర్గళ వాక్పటిమ ప్రదాతలు, నా జీవన వృత్తికి, ప్రవృత్తికి మార్గదర్శకులైన, కుర్తాళం మౌనస్వామి వారి ప్రియశిష్యులు, నాతొలిగురువర్యులు, కీ.శే కొండాకోటయ్య మహనీయుల అనుగ్రహముతోను, ఎనిమిది నెలలు(1977లో) తన పాదసేవాభాగ్యంతో నన్ను పునీతులను చేసిన జిల్లెళ్ళమూడి అమ్మ అనుగ్రహముతోను భాస్కరరాయలు వారి సౌభాగ్యభాస్కరము, మరియు కొందరు ఆధ్యాత్మికవేత్తల వ్యాఖ్యానముల పరిశీలనతోను అక్కడక్కడ భాస్కరరాయలు వారి శ్లోకములు మరియు ఆది శంకరాచార్యుల సౌందర్యలహరి శ్లోకములు తీసుకుంటూ, నా స్వీయ వివరణతో ఈ వ్యాఖ్యాన పుష్పాన్ని జగజ్జనని ఇచ్చిన ప్రసాదంగా భావిస్తూ అందరికీ పంచుతున్నాను. ఇచ్చిన పేరాలు, శ్లోకాలు జగజ్జనని ప్రసాదపుష్పంగా భావిస్తున్నాను. ఇందులో వ్యాఖ్యాన పంక్తులు గాని, శ్లోకాలు మొదలైనవన్నియు అమ్మవారి నుండి లభించిన ప్రసాద పుష్పము యొక్క దళములుగా భావించుచున్నాను. అట్టి పుష్పమునుండి ఏమి తొలగించిననూ ఆయా దళములు త్రుంచిన దోషమవుతుంది. జగన్మాత భక్తులయిన వారు యథాతథముగా ఎంతమందికి ఈ పుష్పాన్ని పంపిననూ సంతోషమే.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

 *పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం* 7702090319, 9505813235

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹


మీకు, మీకుటుంబ సభ్యులకు శుభోదయ శుభాభి వందనములు🌹🌹🌹🌹🌹🌻🌻🌻🌻🌸🌸🌸🌸💐💐💐

వినాయక చవితి సందేశాలు వినాయక చవితి సందేశాలు

 ॐ వినాయక చవితి సందేశాలు 

      

                   -----------------------     


                                  సందేశం - 1


"తుండము నేకదంతమును తోరపు బొజ్జయు వామహస్తమన్


మెండుగ మ్రోయు గజ్జెలును మెల్లని చుాపులు మందహాసమున్


కొండొక గుజ్జురూపమును కోరిన విద్యల కెల్ల నొజ్జయై


యుండెడి పార్వతీతనయ! యోయి గణాధిప! నీకు మ్రొక్కెదన్"


 -- తుండము,ఏకదంతము,పెద్ద బొజ్జ,బాగా మ్రోగే గజ్జలు, విచిత్రమైన చూపులు-నవ్వు,మరుగుజ్జు రూపమూ గల ఓ పార్వతీ తనయా! గణాధిపా! నేను ఏ విద్య కావాలనుకొంటే దాన్ని నాకు బోధించేవాడా! నీకు మ్రొక్కుతున్నానయ్యా!అనుగ్రహించు!


---------------------------------------------------------


వివరణ


1. ముఖము - ఆహారము - ఇబ్బంది


 *తుండం,ఒకే దంతం,గాదెతో సమానమైన పెద్దబొజ్జా, పొట్టిచేయీ కలిగిన వాడు.


ఆహారం విషయంలో —


*తినేందుకు తొండం అడ్డం,


*పోనీ ఏదోవిధంగా ఆహారం తీసుకుందామంటే,ఆ ఒక్క దంతమూ అడ్డం.


*నెమ్మదిగా తిందామంటే,ఎక్కువ నిలువచేయదగిన పెద్ద పొట్ట.


2. నాట్యం - అసౌకర్యం


* కాళ్ళు పొడుగువి కానందున, గజ్జలు మాత్రం శీఘ్రంగా ధ్వనిస్తూ ఉంటాయి.


* ఆ ధ్వనికి అనుగుణంగా చూడడానికి మెల్లని చూపులు ఒక అడ్డంకి.


*ఆకర్షణీయమైన నవ్వు కాక, మంద(అజ్ఞాని వెర్రి)హాసము(నవ్వు).


3. రూపము - అందవిహీనం


* అదొకతీరు మరుగుజ్జు ( కొండొక గుజ్జురూపము).


           ఇలా పరిహాసం చేయదగిన విధంగా ఉన్న తన పుత్రుణ్ణి లోకంలో అందఱూ పూజించేలా, "కోరిన విద్యల కెల్ల ఒజ్జ" గా జ్ఞానప్రదాతను చేసింది జగన్మాత పార్వతీదేవి. 

          అందుకనే "వినాయకుడు" - "పార్వతీ తనయ!" అని మనచేత పిలిపించుకుంటున్నాడు.

          అజ్ఞానాంధకారాన్ని పోగొట్టేది విద్యే కదా!


4. విద్యా ప్రదాత


ఎవరు ఏ చదువు కావాలని కోరుకుంటే,వారికి ఆ చదువులన్నింటినీ ఇచ్చే ఉపాధ్యాయుడు ( కోరిన విద్యల కెల్ల ఒజ్జ).


-------------------------------------------------------


విశేషం


* విద్య పొందాలంటే,మనకి దాన్ని అందించగలిగే వానికి,

అ)విషయ పరిజ్ఞానం కలిగియుండాలి.

ఆ)దాన్ని బోధించే సంకల్పం ఉండాలి.

ఇ)అర్ఠమయ్యేలాగు చెప్పగలగాలి.


* బాహ్య సౌందర్యం( ఉదా॥ అష్టావక్రుడు) ఎలా ఉన్నా, అంతస్సౌందర్యం ముఖ్యం.


* కళల ప్రాధాన్యతకన్నా, పశుపతి పుత్రుడుగా,అజ్ఞానాంధకారాన్ని తొలగించి,జ్ఞానాన్ని అందజేయగలడు "వినాయకుడు"



ఒజ్జ:


గురువు - ఉపాధ్యాయుడు - ఆచార్యుడు

       -------------------------------------------


1. గురువు


గురుర్బన్ధురబన్ధూనాం గురుశ్చక్షు రచక్షుషామ్ I

గురుః పితాచ మాతాచ సర్వేషా న్యాయాయవర్తినామ్ II


----బంధువులెవరూ లేనివారికి గురువే బంధువు.కళ్ళు లేని వారికి గురువే కంటి చూపు.గురువే తల్లి, గురువే తండ్రి. యదార్థజ్ఞాన ప్రదర్శకుడు.న్యాయమార్గంలో ప్రవర్తింపచేయువాడు "గురువు"


2. ఉపాధ్యాయుడు


ఏకదేశం తు వేదస్య వేదాఙ్గాన్యపి వా పునః I

యో2ధ్యాపయతి వృత్యర్థమ్ ఉపాధ్యాయస్య ఉచ్యతే II


----వృత్యర్థం వేదాన్నీ వేదాంగాలనీ ఎవరైతే అధ్యాపనం (బోధన) చేస్తారో వారు "ఉపాధ్యాయులు"


3. ఆచార్యుడు


ఆచినోతి హి శాస్త్రార్థాన్ ఆచారే స్థాపయత్యపి I

స్వయమాచరతే యస్మాత్ తస్మాదాచార్య ఉచ్యతే II


----కేవలం శాస్తార్థాలను బోధించడమే కాక, తాను వాటిని ఆచరిస్తూ, సమాజ హితం కోసం ఆదర్శంగా ఆచరింప చేసేవాడు "ఆచార్యుడు"


--------------------------------------------------------


               రామాయణం శర్మ

                    భద్రాచలం

మొగలిచెర్ల అవధూత

 మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామివారితో అనుభవాలు..


*వెలుగు రేఖలు..*


1976 వ సంవత్సరం లో శ్రీ స్వామివారు కపాలమోక్షం ద్వారా సిద్ధిపొందే నాటికి మొగలిచెర్ల గ్రామానికి కానీ..శ్రీ స్వామివారి ఆశ్రమానికి కానీ విద్యుత్ సౌకర్యం లేదు..కిరోసిన్ తో వెలిగే లాంతర్లే అప్పటి దీపాలు..మా నాన్నగారు శ్రీ పవని శ్రీధరరావు గారు గ్రామానికి విద్యుత్ సౌకర్యం కలిగించాలని ఒకటే తపన పడేవారు..జిల్లా అధికారులను కలిశారు..రాజకీయంగా కూడా ప్రయత్నం చేశారు..సుమారు నాలుగేళ్ల తరువాత ఆయన ప్రయత్నాలు ఫలించి..ముందు మొగలిచెర్ల గ్రామానికి..తరువాత అతి కొద్దిరోజుల్లోనే శ్రీ స్వామివారి మందిరానికి విద్యుత్ సౌకర్యం ఏర్పడింది..


2004 వ సంవత్సరం లో నేను బాధ్యతలు తీసుకునే నాటికి..శ్రీ స్వామివారి మందిరం వద్ద తరచూ విద్యుత్ సరఫరా లో అంతరాయం కలుగుతూ ఉండేది..ఒక్కసారి అంతరాయం ఏర్పడితే..మళ్లీ పునరుద్ధరించడానికి కొన్ని గంటల సమయం పట్టేది.. మేము సబ్ స్టేషన్ కు ఎన్ని సార్లు మొర పెట్టుకున్నా..ఫలితం మాత్రం వుండేది కాదు..ఒక్కొక్కసారి రాత్రి పూట సరఫరా ఆగిపోయేది..ఆ రాత్రంతా మందిరమూ..మందిరం వద్దనున్న అర్చక స్వాముల గృహాలూ..ఇతర వసతి సముదాయాలూ పూర్తిగా ఏవో గుడ్డి దీపాల వెలుగులో ఉండిపోవాల్సి వచ్చేది..


"స్వామీ!..ఈ కరెంట్ కష్టాలు కడతేర్చు తండ్రీ..అల్లాడిపోతున్నాము.." అని మనస్ఫూర్తిగా శ్రీ స్వామివారి సమాధి వద్ద మొర పెట్టుకున్నాను..


నా వేదన శ్రీ స్వామివారికి అర్ధమైందో ఏమో..రెండురోజుల తరువాత..విద్యుత్ శాఖలో విజిలెన్స్ లో పనిచేసే అధికారి గారు..సబ్ స్టేషన్ కు పరిశీలన కోసం వచ్చారు..సాయంత్రం దాకా అక్కడే ఉండి.."ఇక్కడికి దగ్గరలో దత్తక్షేత్రం వున్నదని విన్నాను..నేను రాత్రికి ఆ క్షేత్రం లో నిద్ర చేయాలని నిర్ణయించుకున్నాను..ఏర్పాట్లు చేయండి.." అన్నారు..అక్కడున్న సిబ్బంది నాకు ఫోన్ చేసి..ఇలా తమ అధికారి గారు మందిరానికి వస్తున్నారని..రాత్రికి అక్కడే ఉంటారని చెప్పారు..


ఆరోజు రాత్రికి ఆ అధికారి గారు శ్రీ స్వామివారి మందిర మంటపం లోనే చాప వేసుకొని పడుకున్నారు..సుమారు రాత్రి 10 గంటలప్పుడు విద్యుత్ సరఫరా ఆగిపోయింది..తెల్లవారిన దాకా పునరుద్ధరణ జరుగలేదు..ఆ రాత్రంతా ఆ అధికారి గారు చీకటి లోనే గడపాల్సి వచ్చింది..ఆయనకు విషయం అర్ధమైంది..తెల్లవారి సబ్ స్టేషన్ కు వెళ్లి..మందిరానికి నిరంతరమూ విద్యుత్ సరఫరా చేయాలంటే..ఏమి చేయాలో ఆలోచించి..ఒక పరిష్కారం కనుక్కుని..దానిని అమలుచేయమని సిబ్బందికి చెప్పారు...


తిరిగి వెళ్లిపోతూ..నాకు ఫోన్ చేసి.."ప్రసాద్ గారూ..అంతటి దత్తక్షేత్రం అలా గుడ్డి దీపాల వెలుగులో ఉండటం నచ్చలేదండీ..అతి త్వరలో ఆ క్షేత్రానికి నిరంతర విద్యుత్ సప్లై వచ్చే ఏర్పాటు చేయిస్తాను..మీ వద్దకు మా సిబ్బంది వస్తారు..వారితో మాట్లాడి..మీరు నిర్ణయం తీసుకోండి.." అన్నారు..నిరంతరమూ విద్యుత్ ఉంటుందంటే..అంతకంటే సంతోషం మరేముంటుంది?..


ఆ ప్రక్కరోజే..సబ్ స్టేషన్ నుంచి లైన్ మాన్ వచ్చారు.."ప్రసాద్ గారూ..ఒక అవకాశం వచ్చిందండీ..మన స్వామివారి మందిరానికి సమీపం లో 24 గంటలూ కరెంట్ వుండే లైన్ ఉన్నది..దానికి కానీ మందిరాన్ని అనుసంధానం చేస్తే..ఇక ఇబ్బంది ఉండదు..కాకుంటే లైన్ వేయడానికి మీరు ప్రభుత్వానికి కొంత మొత్తం చెల్లించాలి.."అన్నారు..సరే అన్నాను..అనుకున్న విధంగానే పది పదిహేను రోజుల్లో శ్రీ స్వామివారి మందిరానికి నిరంతర విద్యుత్ సరఫరా ఏర్పడింది..


అప్పుడప్పుడూ అనిపిస్తూ ఉంటుంది..ప్రతి చిన్నవిషయం లోనూ శ్రీ స్వామివారి కృప ఎలా ప్రసరిస్తూ ఉంటుందో అని..కాకుంటే..ఆ అధికారి గారు వచ్చిన రోజే..అంతరాయం కలగడం..ఆయన ఆఘమేఘాల మీద నిర్ణయం తీసుకోవడం..కాలయాపన లేకుండా అమలు కావడం..అన్నీ చక చకా జరిగిపోవడం..ఇదంతా..ఏదో మాయ లా ఉన్నదే అని..అది మాయ కాదు..శ్రీ స్వామివారి నిర్ణయం..అంతే!..


సర్వం..

దత్తకృప.


(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం.. మొగలిచెర్ల గ్రామం...లింగసముద్రం మండలం..ప్రకాశం జిల్లా..పిన్:523114..సెల్..94402 66380 & 99089 73699).

ఆయనే ఘన చరిత కలిగిన

 ఆయనే ఘన చరిత కలిగిన!.....


జన గణ మన అంటూ!

జాతి గీతాన్ని ఎలుగెత్తి చాటి

వందే మాతరం అంటూ!

మనదే భారత మంటూ!

దేశ భక్తిని చాటి

మా తెలుగు తల్లికి

మల్లె పూదండ అంటూ!

మన తెలుగు తేజాన్ని

విశేషంగా ప్రశంసించి

విశ్వ నరు డై. నిలిచి

నిరక్షరాస్యత అనే

అజ్ఞాన తిమిరాన్నీ తొలగించి

అక్షరాస్యత అనే విజ్ఞాన జ్యోతిని

వెలిగించి

చక్కని క్రమశిక్షణను నేర్పి

మంచి విద్యాబుద్ధుల నీ నేర్పించి

విద్యార్థుల పురోగ తే తమ సోపానమనీ యెంచి

దేశభక్తిని నేర్పించి

మాతృ,పితృ,దైవ భక్తుల్ని కలుగజేసి

విద్యార్థుల భవితకు

చక్కని బాటను వేసి

జాతి జాగృతి కి. ప్రతి రూపాలుగా

నిలిచి

"ఆచార్య దేవోభవ",!....అంటూ!

ఈ జగతి చే సదా కీర్తింప బడే

వారే

ఈ వసుధ కు నిజమైన

అక్షర బ్రహ్మ!

నిజంగా!..ఆయనే!

ఘన చరిత కలిగిన ఉపాధ్యాయుడు!


(సెప్టెంబర్ 5 న ఉపాధ్యాయ దినోత్సవ సందర్భంగా!....)


దోస పాటి.సత్యనారా

యణ మూర్తి

రాజమహేంద్రవరం

9866631877

ఉపాధ్యాయులం

 🌄🕉️🌄🕉️🌄🕉️🌄🕉️🌄


***ఉపాధ్యాయులం-మేం ఉపాధ్యాయులం

రచన:-

*******

భోగయగారి. చన్ద్రశేఖర శర్మ.✍️

కుషాయిగూడ,హైదరాబాద్

చరవాణి సంఖ్య-944౦౦44142.

~~~~~~~~~~~~~~~~~~~

పల్లవి:-

*******

ఉపాధ్యాయులం మేం ఉపాధ్యాయులం

విద్యార్థి లోకానికి శ్రేయోభిలాషులం

||ఉపాధ్యాయులం||

చరణం---1.

***********

పొద్దు పొద్దునే మేము నిద్దురను లేస్తాము

బడికి వేళైందని వడి అడుగులు వేస్తాము

ప్రార్థనకు అందాలని పరుగులనే తీస్తాము

ప్రార్థనకందకపోతే పశ్చాత్తపిస్తాము.

||ఉపాధ్యాయులం||

చరణం---2.

************

పఠన పాఠనాలను ప్రతినిత్యం చేస్తాము

ప్రపంచాన్ని పదిలంగా గదిలోకి తెస్తాము

ఆర్జించిన జ్ఞాన నిధిని మొత్తం పంచిస్తాము

మా శిష్యులు మాకంటే ఎదగాలని చూస్తాము.

||ఉపాధ్యాయులం||

చరణం---3.

***********

గోరంత పిల్లలను కొండంతగ చేస్తాము

పిసరంత పదోన్నతే ప్రసాదంగ భావిస్తాం 

ఉన్నంత జీతంతో సంతృప్తిగ బతికేస్తాం

ముత్యమంత మెచ్చుకుంటె మురిసి పులకరిస్తాము.

||ఉపాధ్యాయులం||

చరణం---3.

************

ఆలనతో పాలనతో స్వగృహాన్ని మరిపిస్తాం

ఆటలతో పాటలతో మనసులను మురిపిస్తాం

ప్రతిభ చూపు పిల్లలపై ప్రశంసలను కురిపిస్తాం

ఆడిస్తాం పాడిస్తాం అందలమే ఎక్కిస్తాం.

||ఉపాధ్యాయులం||

౿౿౿౿౿౿౿౿౿౿౿౿౿౿౿౿౿

కైమోడ్పు

 🌸 🙏🏼కైమోడ్పు🙏🏼🌸

---భోగయగారి. చన్ద్రశేఖర శర్మ.

కందం:-

*******

సర్వే పల్లికులజునికి,

సర్వోత్తమ గురువు జ్ఞాన సంద్రసమునికిన్,

సర్వోత్తమ వేదాంతికి,

గర్వ రహితునకు సతతము కైమోడ్పిడెదన్.*🙏🏼💐

౿౿౿౿౿౿౿౿౿౿౿౿౿౿౿౿౿