20, ఏప్రిల్ 2025, ఆదివారం

శ్రీవైష్ణవ దివ్యదేశాలు

 🕉 108 శ్రీవైష్ణవ దివ్యదేశాలు  ::


     106వ దివ్యదేశము 🕉


🙏శ్రీ నవమోహన కృష్ణ పెరుమాళ్ ఆలయం – ( తిరువాయిపాడి ),

గోకులము.

ఉత్తర ప్రదేశ్ 🙏


@ ప్రధాన దైవం: నవమోహన కృష్ణ

@ ప్రధాన దేవత: రుక్మిణీ-సత్యభామ

@ పుష్కరిణి: యమునానది

@ విమానం: హేమకూట విమానము

@ ప్రత్యక్షం:

నందగోపునకు, యశోధకు (విశ్వరూపం) ప్రత్యక్షము.


🛎 స్థలపురాణం : 


👉శ్రీమహావిష్ణువు యొక్క శ్రీకృష్ణావతారమును సంపూర్ణావతారము.


👉 ఆ కృష్ణ భగవానుడు కంసునిచే కారాగృహమున బంధించబడిన దేవకీ వసుదేవులకు అష్టమ గర్భమున జన్మించి , వసుదేవుని ద్వారా నంద గ్రామమున యశోద పొత్తిళ్లలోనికి చేర్పించుకొని , నందరాజు యశోదలకు ఆనందము నిచ్చు విధముగా వారి వద్ద పెరుగుచు బాల్యము నుండియే ఎన్నియో మహిమలను ప్రదర్శించెను .

 ఎందరో రాక్షసులను హతమొనర్చి జన కళ్యాణ కార్యములను చేసెను . బ్రహ్మదేవేంద్రాదులకు విశ్వాసము కలుగచేసి , వారి అజ్ఞానమును పారద్రోలి పరమాత్ముడైన తన విభూతులను దర్శింప చేసి . మాయా లీలా వినోదుడై గోవులతో ఆనందించుచు , గోవులను మందలుగా మేతకు కొనిపోవుచు ఇతర గోపాలకులతో క్రీడించెను . 

 

👉త్రేతాయుగమున శ్రీరామావతార సమయమున లక్ష్మణునిగా అవతరింప చేసిన ఆదిశేషుని ఈ కృష్ణావతారమున అన్న బలరామునిగా అవతరింప చేసి ( తమ్మునిగా లక్ష్మణుడు చేసిన సేవలకు ప్రతిగా , బలరాముని అగ్రజునిగా గౌరవించి సేవించు నిమిత్తము ) , బాల్య క్రీడలలో బలరామాది ఇతర బృందములతో గొల్లవాడలో వెన్న దొంగిలించి తాను తిని స్నేహబృందములో అందరకు తినిపించి గొల్ల భామలను ఆట పట్టించెను . గోప స్త్రీలకు పరతత్వమును గోపికా వస్త్రాపహరణ సందర్భమున బోధించెను . తల్లి యశోదకు నోటిలో చతుర్దశ భువనములను మన్ను తినిన సన్నివేశమున చూపించెను . తన ఆగడములకు తల్లి యశోద రోలునకు కట్టి వేయగా లాగుకొని మద్ది చెట్ల నడుమకుపోయి ఆ చెట్లను కూలద్రోసి గంధర్వులకు శాప విమోచనమును ప్రసాదించెను . నీటి మడుగులో విషము వెలువరించుచుండిన సర్పరాజు కాళీయుని పడగలపై నాట్యము చేసి ఆసర్పమును సకల భార్యలు పరివారముతో సహా పాతాళమునకు తరిమివేసెను . అసంఖ్యాక మహిమాన్విత , పరాక్రమోపేత లోక కళ్యాణ కార్యములొనర్చి బాల్యమును గడపినదే ఈ దివ్య దేశము అయిన గోకులము - నందగ్రామము .


👉రాధ కృష్ణుల పవిత్ర ప్రేమకు పుట్టినిల్లు గోకులం.

ఆ గోకులమును ప్రస్తుతము పురాతన గోకులము అను నామమున వ్యవహరించుచున్నారు . ఆ స్థలమును దర్శించుకొనుటలో ఎంతో అనుభూతికి లోనై మహదానందమును పొందుదుము .


👉శ్రీ నవమోహన కృష్ణ పెరుమాళ్ ఆలయం ఉత్తర ప్రదేశ్ లోని మధుర జిల్లా యమునా నది ఒడ్డున ఉంది.


👉ఈ దేవాలయాన్ని గోకులం, తిరువైపాది దేవాలయం, గోకుల్ దేవాలయం, అయ్యర్‌పాది దేవాలయం మరియు బ్రజ భూమి అని కూడా పిలుస్తారు.


👉గోకులమునకు 1 కి.మీ దూరములో పురాణ గోకులము గలదు. అచట ఆలయమునకు ముందుభాగమున యమునానది ప్రవహించును. నందగోపులు, యశోద, బలరాములు-ఊయలలో శ్రీ కృష్ణుడు ఉంటాడు. ఇచట రెండు సన్నిధులు ఉన్నాయి. భక్తులు రెండింటిని దర్శిస్తారు. ఇది శ్రీకృష్ణుడు పెరిగిన స్థలము-బలరాముని అవతార స్థలము. ప్రతి ఆదివారము రాసక్రీడ, జలక్రీడ ఉత్సవములు జరుగుతుంటాయి.

🔔 గోపికాలోలా.... శ్రితజనపాలా...🔔


ద్వాపరయుగం శ్రీకృష్ణుడు పేరు చెప్పగానే వెంటనే మన కళ్ళముందు  వ్రేపల్లె , గోకులం,కృష్ణుని అష్టమహిషులు, రాసక్రీడలాడే పదహారువేలమంది గోపికలు  గోచరిస్తారు.

గోకులంలో జన్మించిన ఈ గోపీ జనమంతా శ్రీమహావిష్ణువు ఎత్తిన పలు అవతారాలలోని ఆయన దివ్యమంగళ విగ్రహాన్ని చూసి సమ్మోహితులై ఆ భగవానుడి కరుణా కటాక్షాలతో ఆయన పొందులో శాశ్వతంగా తరించాలని తపించిపోయినవారే.


ఈ గోపికలలో రకరకాల గోపికలు వున్నారు.


🔅శృతి గోపికలు 

🔅ఋషి గోపికలు

🔅మైధిలి గోపికలు 

🔅కోసల గోపికలు 

🔅అయోధ్యా గోపికలు అని అనేక వర్గాలు.


వారిలో ముఖ్యమైన వారి వివరాలేమిటో సంక్షిప్తంగా తెలుసుకుందాము.

👉ఋషి గోపికలు..

త్రేతాయుగంలో మహావిష్ణువు రామావతారం ధరించి వనవాసం చేసిన సమయంలో, ఆయా వనాలలోని  ఋషి పుంగవులంతా రాముని సౌందర్యం చూసి " పుంసా మోహన రూపాయ" అని

మోహితులైనారు. తామంతా రామునికి దేవేరులై సేవచేసే భాగ్యం కల్పించమని వేడుకున్నారు. రాముడు తాను ఏకపత్నీ వ్రతుడనని వారి కోరిక కృష్ణావతారంలో

నెరవేరగలదని వాగ్దానం చేశాడు. 

ఆ వాగ్దానం ప్రకారం వంగ దేశంలో మంగళుడు అనే గొల్లవానికి పుత్రికలుగా

రామాయణ కాలం నాటి ఋషులంతా జన్మించారు.

పుత్రికలు జన్మించగానే తన ప్రారబ్ధ కర్మ వలన మంగళుని సంపదలన్నీ తరగిపోయాయి. వారిని పెంచి పెద్ద చేయలేక తన పుత్రికలందరినీ రాజైన జయుడి ద్వారా నందగోపుని వద్దకు పంపించివేశాడు. అక్కడ ఆ గోపికలకు తమ పూర్వజన్మ స్మృతి కలిగింది.

శ్రీ కృష్ణుని పొందాలనే కోరికతో కృష్ణుడు మేపే గోవుల పేడతో మహావిష్ణువు మూర్తిని తయారు చేసి యమునా నదీతీరాన ప్రతిష్టించి విష్ణువు అంశయైన కృష్ణునిలో లీనమవ్వాలనే కోరికతో పూజలు చేశారు. వారి పూజల ఫలితంగా, పూర్వపుణ్య ఫలితంగా వారు కోరుకున్నది లభించింది..


👉మైధిలి గోపికలు..

మహాబలవంతుడైన రావణుడు ఎత్తలేక పోయిన శివ ధనస్సును  శ్రీరాముడు సునాయాసంగా ఎత్తిన రాముని భుజ బల వీర పరాక్రమాన్ని , సౌందర్యాన్ని చూసి మోహించిన మిధిలా నగర  సుందరీమణులు రాముని భర్త కావాలని తపమాచరించారు.

వారి తపో ఫలితంగా నవ నందనులు పేరిట తొమ్మిదిమంది గృహాలలో  జన్మించి మార్గశిర మాసంలో  యమునానదీ తీరాన కాత్యాయనీ వ్రతం చేయ ఆరంభించారు. 

ఈ గోపికల వస్త్రాలనే కృష్ణుడు దాచివేసి వారి భక్తిని పరీక్షించినట్లు భాగవతపురాణం వివరిస్తోంది.   విల్లిపుత్తూరు ఆండాళ్ కూడా యీ గోపికలను మార్గదర్శకం చేసుకుని మార్గశిర మాసంలో   కాత్యాయనీ నోము నోచి భగవంతుని చేరుకున్నది.


👉కోసల గోపికలు,

అయోధ్యా గోపికలు, ..

వీరు అయోధ్య రాజ్యంలో  నివసించే ప్రజలు శ్రీరాముని రూపలావణ్యం కి మోహితులై ఇటువంటి భర్తని పొందాలి అనుకున్నారు....అలాంటి వారు కూడా గోపికలు గా గోకులం లో పుట్టారు.


👉శృతి గోపికలు : 

సకల వేదాలు, శాస్త్రాలు , శృతి, పురాణాలు సైతం..ఆ వేద పురుషుని తమ భర్తగా పొందాలి అనుకున్నాయి.

వాటి తర్వాత అంశ అవతారమే శృతి గోపికలు.


🙏జై శ్రీమన్నారాయణ 🙏

🙏జై రాదా కృష్ణ 🙏

దశావతారం

 _*🕉️🍀🕉️👍🕉️🍀🕉️🍀🕉️🍀🕉️🍀


🙏మానవ జన్మే ఒక "దశావతారం"🙏*_



మాతృమూర్తి గర్భoలో ఈదుతూ ఎదిగే - _*"మత్స్యo"*_


నీటి నుంచి నేల మీదకు ప్రాకే బాల్యం ఒక - _*"కూర్మo"*_


వయసులోని జంతు ప్రవర్తన ఒక - _*"వరాహo"*_


మృగం నుంచి మనిషిగా మారే దశ - _*"నరసిoహo"*_


మనిషిగా మారినా ఎదగాలని ఎగిరితే నాడు - _*"వామనుడు'*_


ఎదిగినా క్రోధo తగదని తేలిస్తే వాడు - _*"పరశురాముడు"*_


సత్యo, ధర్మ, శాoతి ప్రేమలతో తానే ఒక - _*"శ్రీరాముడు"*_


విశ్వమoతా తానే అని విశ్వసిస్తే నాడు- _*"శ్రీకృష్ణుడు"*_


ధ్యానియై , జ్ఞానియై జన్మ కారణమెరిగినవాడు ఒక - _*"బలరాముడు"*_


కర్తవ్య మొనరిoచి జన్మసార్ధకతతో కాగలడు - _*"కల్కి"*_


✅👉 తెలుసుకుంటే కర్మ యొక్క ప్రతి దశలోని అంతరo.. _*దశావతారo*_


✅👉 మలుచుకుంటే ఒక్కజన్మలోనే మనిషి - _*దశావతారo*_


🙏 _*యతో ధర్మస్తతో జయః*_ 💐


❀┉┅━❀🕉️❀┉┅━❀

🙏 *సర్వే జనాః సుఖినోభవంతు* 

🙏 *లోకాస్సమస్తా సుఖినోభవంతు*🙏


✡️🍀✡️🍀✡️🍀✡️🍀✡️🍀✡️🍀

విలువైన బహుమతులు

 *తల్లిదండ్రులు వదిలిపెట్టిన అత్యంత విలువైన బహుమతులు మన అన్నదమ్ములు అక్కాచెల్లెళ్లు!!!*


*మనం వృద్ధాప్యంలో ఉన్నప్పుడు మన తల్లిదండ్రులు వదిలిపెట్టిన అత్యంత విలువైన బహుమతులు అన్నదమ్ములు, అక్కాచెల్లెళ్లు మాత్రమే అని మనము గ్రహించ గలము.*


*మనము బాల్యం లో ఉన్నప్పుడు, అన్నదమ్ములు అక్కాచెల్లెళ్లు మనతో సన్నిహితముగ ఆడుకున్న వారే.*


*ప్రతిరోజూ, మనము ఒకరిని ఒకరు వెంబడిస్తూ & సందడిగా ఉల్లాసంగా గడిపాము & కలిసి మంచి బాల్యాన్ని గడిపాము.*


*పెద్దయ్యాక, మనము మన స్వంత కుటుంబాలను కలిగిన తరువాత , మన స్వంత ప్రత్యేక జీవితాలను గడుపుతాము & సాధారణంగా అరుదుగా కలుసుకుంటాము. మనందరినీ కనెక్ట్ చేసే ఏకైక లింక్ మన తల్లిదండ్రులు.*


*మనం వృద్ధాప్యం సమీపించే సమయానికి అప్పటికే మన తల్లిదండ్రులు మనల్ని విడిచిపెట్టి వెళ్తారు మరియు మన చుట్టూ ఉన్న బంధువుల సంఖ్య తగ్గిపోతుంది, అప్పుడే మనకు క్రమంగా ఆప్యాయత విలువ తెలుస్తుంది.*


*నేను ఇటీవల ఇంటర్నెట్‌లో ఒక వీడియోను చూశాను, అందులో 101 ఏళ్ల అన్నయ్య తన దూరపు 96 ఏళ్ల చెల్లెల్ని చూడటానికి వెళ్లాడు.* *కొంత సమయం గడిపిన తర్వాత ఇద్దరూ విడిపోవడానికి సిద్ధంగా ఉన్నప్పుడు, చెల్లెలు తన అన్న కారుని వెంబడించి, తన సోదరుడికి కొంత డబ్బు ఇచ్చి, తినడానికి ఏదైనా మంచిది కొనుక్కోమని కోరింది. ఆమె మాటలు చెప్పడం పూర్తికాకముందే ఇద్దరూ కన్నీళ్లు పెట్టుకున్నారు.*


*ఇంత వృద్ధాప్యంలో కూడా అన్నదమ్ములు మరియు అక్కాచెల్లెళ్లు ఉండటం నిజంగా చాలా అదృష్టమే.*


*అవును, ఈ లోకంలో మనకు రక్తసంబంధం ఉన్న వ్యక్తిని కలిగి ఉండటం ఎంత ముఖ్యమో మనం వృద్ధాప్యంలోకి వచ్చిన తర్వాత మాత్రమే మనకు తెలుస్తుంది.*


*మీరు పెద్దవారైనప్పుడు & మీ తల్లిదండ్రులు ఇద్దరూ వెళ్లిపోయినప్పుడు, మీ అన్నదమ్ములు అక్కాచెల్లెళ్లు ఈ ప్రపంచంలో మనకు అత్యంత సన్నిహితులవుతారు.*


*స్నేహితులు దూరంగా వెళ్లిపోవచ్చు, పిల్లలు పెరిగి ఎగిరి పోవచ్చు కానీ మీ పక్కన మీ జీవితభాగస్వామి తప్ప, మీ జీవితపు చివరి అంకాన్ని పూర్తి చేయడానికి మీ అన్నదమ్ములు అక్కాచెల్లెళ్లు మాత్రమే వుంటారు.*


*మనము వృద్ధాప్యంలో ఉన్నప్పుడు కూడా అన్నదమ్ములు అక్కాచెల్లెళ్లు ఒకచోట చేరడం చాలా ఆనందంగా వుంటుంది.*


*వారితో కలిసిమేలిసి ఉండడం వల్ల ఎలాంటి ఇబ్బందులు వచ్చినా భయపడం. మనము వృద్ధాప్యానికి చేరుకున్న తరుణంలో దయచేసి మీ అన్నదమ్ములు అక్కాచెల్లెల్ల తో కరుణ మరియు దయతో ఉండండి.*


*గతంలో ఏది జరిగినప్పటికీ ఏది ఏమైనఅయినప్పటికీ, అన్నదమ్ములు అక్కాచెల్లెలళ్లు మరింత సహనంతో మరియు ఒకరినొకరు క్షమించుకుంటూ ఉండాలి.*


*అన్నదమ్ముల అక్కాచెల్లెళ్ల మధ్య విడదీయలేని ముడి లేదు. తొలగించలేని కవచం లేదు.*


*ఎప్పుడూ పాత చేదు సంగతులజోలికి వెళ్లకూడదు లేదా పాత పగ ద్వేషం పెట్టుకోకూడదు. ఎక్కువగా పరస్పర ఆధారపడటం & పరస్పర ప్రేమతో, సంబంధాలు మెరుగవుతాయి.*


*ఈ ప్రపంచంలో మన తల్లిదండ్రులు వదిలిపెట్టిన అత్యంత విలువైన బహుమతులు మన అన్నదమ్ములు అక్కాచెల్లెళ్లు.* 


*ఈ ఆణిముత్యం (మెసేజ్)నాకు లభించిన వాటిలో ఒక గొప్ప సేకరణ గా భావిస్తున్న.)*


ధన్యోస్మి

అబద్ధాలు” లేవు,

 “ స్వర్గంలో అన్నీ ఉన్నాయి కానీ “మరణం”లేదు, భగవద్గీతలో అన్నీ ఉన్నాయి,

కానీ “అబద్ధాలు” లేవు,


లోకంలో అన్నీ ఉన్నాయి కానీ సమాజంలో “ప్రశాంతత” లేదు మరియు ఆస్తులు, అంతస్తుల ఊబిలో కూరుకుపోయిన మనిషికి అన్నీ ఉన్నా అతనికి “మనశ్యాంతి” లేదు.”


ఏమి తీసుకురాకుండా వచ్చి,

ఏమీ పట్టుకుపోకుండా పోతాం

అని తెలిసికూడా.... 

కంటికి నచ్చింది, మనస్సుకు మెచ్చింది, విసుగు, విరామం లేకుండా కావాలనుకుంటూ పరుగులు పెడుతూ, ఇంకా ఏదో కావాలనుకుంటూ

ఓపిక ఉన్నన్నాళ్లు గడిపేస్తాం. ఎన్ని కోరుకున్నా, ఏది కోల్పోయినా, ఉన్నది పోదు, లేనిది రాదు అని తెలుసుకునే సరికి జీవితం గడిచిపోతుంది.

చిత్రంగా మొదలై విచిత్రంగా ముగిసిపోయేదే మానవజన్మ... 🙏

కాళిదాసు

 🙏కాళిదాసు🙏

                   మొదటి భాగం 

కవికుల గురువు కాళిదాసు అందరికి ఆదర్శం. అటువంటి మహాకవి భారత దేశంలో పుట్టడం మన అదృష్టం. అనంతర కవులకు మార్గదర్శి.

కొన్ని వేల సంవత్సరాల తరువాత, ప్రజాజీవితంలో ఎన్నో మార్పులు చోటు చేసుకుని, ప్రజల్లో జీవితాన్ని పండగలా చేసుకోవాలనే ఆరాటం మొదలైంది. ఆ రసమయ ప్రపంచాన్ని మనకందించడం లోనూ, తన సృజనాత్మకతతో పరిపుష్టం చేయడం లోనూ, అలాంటి జీవితాన్ని ఆనందించడానికి సరైన మానసికస్థితుల్ని తెలియజెయ్యడం లోనూ, మార్గదర్శకుడైన వాడు మహాకవి కాళిదాసు. వాల్మీకి, వ్యాసులని వ్యతిరేకించకుండా, ఆ ధర్మాన్ని చాటుతూనే, జీవితాన్ని ఆనందమయం చేసుకోవడం అన్న ప్రక్రియని తనవైన కొత్త భావాల్తో కవిత్వరూపంలో ఆవిష్కరించిన స్రష్ట. రసమయ జీవితాన్ని తరవాత తరాల కోసం రకరకాల రంగుల్లో చిత్రీకరించిన తొలికవి. ఆ తరవాత వచ్చిన కవులు ఈతని పంథాలోనే పయనించారు. రసమయ భావప్రపంచాల్ని కావ్యాలుగా మలచారు. కాని, ఏ కవులూ కాళిదాసుకున్న ప్రతిభావ్యుత్పత్తుల్ని ప్రదర్శించలేకపోయారన్నది అందరూ ఒప్పుకున్న సత్యం. ఈ భావాల్నే కొందరు చిన్న శ్లోకంలో చమత్కారంగా చెప్పారు.


పురా కవీనాం గణనా ప్రసంగే కనిష్ఠికాధిష్ఠిత కాళిదాసా

అద్యాపి తత్తుల్యకవే రభావాదనామికా సార్ధవతీ బభూవ


పూర్వం కవుల్ని లెక్క పెడదామని మొదలు పెట్టి, లెక్కపెట్టేవాడు చిటికిన వేలెత్తి ‘కాళిదాసు’ అన్నాడు. తర్వాత పక్కనున్న వేలు ఎత్తి ఇంకో కవి పేరు చెప్పాలంటే (అది ఉంగరం వేలు, చిటికినవేలు కన్న పెద్దది) అంతకన్న పెద్దకవిని లెక్కపెట్టాలి. అలాంటివాడు లేడు కాబట్టి ఆ లెక్కపెట్టేవాడు అక్కడే ఆగిపోయాడు. ఆ కారణం వల్ల ఉంగరం వేలుకి అనామిక (పేరులేనిది) అన్న పేరు సరిగ్గా సరిపోయింది.)


మిగిలిన కవులు కూడా గొప్ప కవిత్వాన్ని సృష్టించారనడంలో సందేహం లేదు. ఈ విషయాన్ని జయదేవుడు ఒక శ్లోకంలో మనోహరంగా చెప్తాడు.


యస్యాశ్చోర శ్చికురనికరః కర్ణపూరో మయూరో

భాసో హాసః కవికులగురుః కాళిదాసో విలాసః

హర్షో హర్షో హృదయవసతిః పంచబాణస్తు బాణః

కేషాం నైషా కథయ కవితాకామినీ కౌతుకాయ


[యస్యాః = ఎవరికి; చోరః = చోరకవి; చికురనికరః = చిక్కని జుట్టో; మయూరః = మయూరుడు; కర్ణపూరః = చెవికమ్మయో; భాసః = భాసుడు; హాసః =నవ్వో; కవికులగురుః = కవికులగురువైన; కాళిదాసః = కాళిదాసు; విలాసః = విలాసమో; హర్షః = శ్రీహర్షుడు; హర్షః = ఆనందమో; బాణః= బాణుడు; హృదయవసతిః = మనసులో నిలచిన; పంచబాణః = మన్మథుడో ; ఏషా కవితాకామినీ = అట్టి ఈ కవితాకామిని; కేషాం = ఎవరికి; కౌతుకాయ = ఉత్సాహము కొరకు (ఉత్సాహమునిచ్చునది); న తు = కాదో; కథయ = చెప్పుము?]


(కవితాకామినికి చోరకవి కేశపాశం, మయూరుడు చెవులకి ఆభరణంలాంటి వాళ్ళు. భాసుడు ఆమె చిరునవ్వు. కవికులగురువు కాళిదాసు ఆమె విలాసం. హర్షుడు ఆమె ఆనందం. బాణుడు ఆమె మనసులో నిలచిన మన్మథుడు. )


ఈ ప్రశంసలో జయదేవకవి ఒక్క కాళిదాసుని గురించి చెప్పినప్పుడు మాత్రమే కవికులగురుః అని సంబోధించాడు.


భాష, భావం, రసఙ్ఞత, దృశ్యచిత్రీకరణ, పరిసరాల పరిశీలన, మనోహరమైన భావవ్యక్తీకరణ, శిల్పసౌందర్యం, రమ్యంగా కథ చెప్పడం, మనోవిశ్లేషణ, విషయపరిజ్ఞానం, … ఇలా ఎన్నో విషయాలు కవితాత్మలో భాగాలు. కాళిదాసు వీటన్నిటినీ నభూతో నభవిష్యతి అన్నట్లు పోషించి ప్రతి కావ్యాన్నీ, ప్రతి శ్లోకాన్నీ, ప్రతి నాటకాన్నీ భారతీయ సంస్కృతికి దర్పణంగా సృష్టించి అర్పించి కవికులగురువయ్యాడు. అంతే కాదు, అలాంటి విద్యని అభ్యసించడానికి పునాదుల్ని వేసి జాతికి అధ్యాపకుడయ్యాడు.

                     సశేషం 

సమర్పణ 

మారేపల్లి ఉదయ భాస్కర శర్మ

అదుగో

 అదుగో…

పర్వత సానువులు…

ఆ సానువుల్లో ఉబికి వస్తున్న ఝరీనాదాలు…


శిలాలోగిళ్లలో దుముకుతూ,

శిలాకౌగిళ్లలో నిమేషము ఒదుగుతూ,

తమ తనువులలో స్పందనలను నాదాలుగా నినదించి,

నేలమ్మ ఒడిలోకి ప్రవహించ 


డాంబిక ఢమరుక శబ్దాలై…

వినుత వీణానాదాలై…

తంబుర తరంగ సవ్వడులై…

సుస్వన సన్నాయి సద్దులై…


రంజిల్లు రవళుల రాగాలై…

హళాహళియై…

కోలాహలమై…

వీనుల విందై…

తనువుల స్పందనలై…


ఆ పుణ్యగాత్రాల సుస్వరాలై…

సంగీత ప్రపంచ పరిచయాలై…

ఆనందడోలికల ఓలలాడించు 

హొయలై…

లయలై…


నినదించు వేళ…!

మనసులకు పులకరింతల హేల…!


~ రావుల గిరిధర్, ఐపీఎస్.

19-04-2025.

ఆదివారం🌞* *🌹20, ఏప్రిల్,2025🌹*

 *卐ॐ ఓం శ్రీ 🌹గురుభ్యోనమః ॐ卐*

        *🌞ఆదివారం🌞*

   *🌹20, ఏప్రిల్,2025🌹*                  

      *దృగ్గణిత పంచాంగం*                  


*స్వస్తి శ్రీ విశ్వావసు నామ సంవత్సరం* 

*ఉత్తరాయణం - వసంత ఋతౌః*

*చైత్ర మాసం - కృష్ణపక్షం*


*తిథి      : సప్తమి* రా 07.00 వరకు ఉపరి *అష్టమి*

*వారం    : ఆదివారం* (భానువాసరే)

*నక్షత్రం   : పూర్వాషాడ* ఉ 11.48 వరకు ఉపరి *ఉత్తరాషాఢ*


*యోగం  : సిద్ధ* రా 12.13 వరకు ఉపరి *సాధ్య*

*కరణం   : భద్ర* ఉ 06.46  *బవ* రా 07.00 ఉపరి *బాలువ*


*సాధారణ శుభ సమయాలు* 

*ఉ 07.00 - 11.30 సా 02.00 - 04.00*

అమృత కాలం  : *ఉ 06.43 - 08.24*

అభిజిత్ కాలం  : *ప 11.41 - 12.32*


*వర్జ్యం             : రా 08.04 - 09.44*

*దుర్ముహూర్తం  : సా  04.43 - 05.34*

*రాహు కాలం   : సా 04.49 - 06.24*

గుళికకాళం       : *మ 03.15 - 04.49*

యమగండం     : *మ 12.06 - 01.41*

సూర్యరాశి : *మేషం* 

చంద్రరాశి : *ధనుస్సు/మకరం*

సూర్యోదయం :*ఉ 05.49*

సూర్యాస్తమయం :*సా 06.24*

*ప్రయాణశూల   : పడమర దిక్కుకు పనికిరాదు*


*వైదిక విషయాలు*

ప్రాతః కాలం          :  *ఉ 05.49 - 08.20*

సంగవకాలం         :*08.20 - 10.51*

మధ్యాహ్న కాలం    :     *10.51 - 01.22*

అపరాహ్న కాలం    : *మ 01.22 - 03.53*


*ఆబ్ధికం తిధి         : చైత్ర బహుళ సప్తమి*

సాయంకాలం        :  *సా 03.53 - 06.24*

ప్రదోష కాలం         :  సా *06.24 - 08.41*

రాత్రి కాలం            :  రా *08.41 - 11.43*

నిశీధి కాలం          :*రా 11.43 - 12.29*

బ్రాహ్మీ ముహూర్తం :*తె 04.17 - 05.03*

---------------------------------------------------

        *🌷ప్రతినిత్యం🌷*

        *_గోమాతను 🐄 పూజించండి_* 

        *_గోమాతను 🐄 సంరక్షించండి_*


*🌞శ్రీ సూర్య చంద్ర కళా స్తోత్రం🌝*


*ఆదిత్యాఖ్యానసూయాఖ్యా దేవీగర్భసముద్భవౌ |*

*ఆరోగ్యాహ్లాదకర్తారౌ సూర్యచంద్రౌ గతిర్మమ ||*


🙏 *ఓం నమో సూర్యాదేవాయ నమః* 

          

🌞🪷🌹🛕🌹🌷🪷🌷🌞

*సర్వే జనాః సజ్జనో భవంతు !*

*సర్వే సజ్జనా స్వజనో భవంతు !!*

*సర్వే స్వజనా సుకృతో భవంతు !*

*సర్వే సుకృత జనః సుఖినో భవంతు !!*

<><><><><><><><><><><><><><>

         🌷 *సేకరణ*🌷

      🌹🌿🌞🌞🌿🌹

        *న్యాయపతి వేంకట*

       *లక్ష్మీ నరసింహా రావు*

      🌷🍃🌞🌞🍃🌷

 🌹🌷🌞🌞🌞🌞🌷🌹

వేసవి వైచిత్రి

 నేటి వేసవి వైచిత్రి 

మ॥

ఒకచో నెండల తీవ్రతం జెలగు నత్యుష్ణోగ్రతల్ గాడ్పులున్ 

ఒకచో మేఘమహోగ్రగర్జనలు వర్షోత్పాతముల్ హీరముల్ 

ఒకచోఁ బంటలఁ గ్లేశబెట్టు వడగండ్లోలిన్ ప్రభావమ్మునన్ 

అకటా! వేసవి చిత్రమై నిలచె దివ్యాటంకసంవర్థియై 

---------------

హీరములు=పిడుగులు 

---------------

*~శ్రీశర్మద* 

ది: 20-04-2025

వేద ఆశీర్వచనం

 *నమస్తే సదా వత్సలే మాతృ భూమే*


*విశ్వావసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు*


*కలియుగాబ్ది 5126*

*శ్రీ శాలివాహన శకం 1947 స్వస్తి శ్రీ చాంద్రమాన విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం - వసంత ఋతువు - చైత్ర మాసం - కృష్ణ పక్షం - సప్తమి - పూర్వాఫాడ -‌‌ భాను వాసరే* (20.04.2025)


ప్రముఖ వేదపండితులు, తణుకు /తాలూకా ఇరగవరం వాస్తవ్యులు 

*బ్రహ్మశ్రీ గుళ్ళపల్లి శివశర్మ ఘనపాఠీ* *(9491391009, 9440091234)* గారి నేటి వేద ఆశీర్వచనం.





.🙏🙏 

భవదీయుడు

దశిక ప్రభాకరశాస్త్రి 

9849795167

----------------------------------------------

*పిల్లలకి బతుకుతో పాటు భారతీయత కూడా నేర్పండి*

డబ్బుకు తలొంచులోకము

 *2083*

*కం*

డబ్బుకు తలొంచులోకము

జబ్బున పడినపుడు డబ్బు జనియించునిలన్.

డబ్బుకు ప్రాణము లుండవు

నబ్బురముగ గెలుచు డబ్బు లవనిన సుజనా.

*భావం*:--- ఓ సుజనా! డబ్బు కు లోకం తలవంచుతుంది. జబ్బు చేసి నప్పుడు డబ్బు అప్పుల రూపంలో పుడుతుంది. డబ్బు కు ప్రాణం ఉండదు కానీ అద్భుతముగా డబ్బు ఈ భూలోకంలో గెలుస్తుంది.

*** *కొంపెల్ల శ్రీనివాస శర్మ*

ప్రశ్నించేవాడు

 _*పృచ్ఛకో మార్గదర్శీ చ*_

_*ధైర్యశాలీ విదూషకః!*_

_*విశ్వాసీతి సుహృద్భేదాః*_

_*నరస్యావశ్యకా ఇహ!!*_


ప్రశ్నించేవాడు, సన్మార్గం చూపువాడు, ధైర్యం కలవాడు, నవ్వుతూ నవ్వించేవాడు, నమ్మకస్తుడు అను ఈ అయిదు రకాలైన మిత్రులు ఈ లోకంలో మానవుడికి ఉండాలి.