నీవు లేక నేను లేను నేను లేక నీవు లేవు అనేది ఒక సినిమా పాట అది మనందరికీ తెలిసిందే ఆ పాటలోపడా ఒక ప్రేమికులను ఉద్దేశించి అది రాసి ఉండవచ్చు కానీ ఒక భక్తుడికి భగవంతుడికి ఈ పాట సంపూర్ణంగా అనువర్తించవచ్చు భగవంతుడు నేను అంటే భక్తుడు ఇద్దరు వేరు కాదు నీవు లేకుండా నేను లేను అంటే నీవే నేను నేనే నీవు భగవంతుడా నీవు నాయందు ఉన్నావు నేనే భగవంతుడు అయి ఉన్నాను అనేటువంటి నగ్న సత్యం తెలుసుకోవడమే అది ఈ జీవితానికి పరమార్థం అదే మోక్షప్రదాయని
ప్రపంచ కవులకు స్వగతం. మీ కవితలను ఇక్కడ పబ్లిష్ చేయవచ్చు. మీరు ముందుగా follow by Email బాక్సులో మీ మెయిల్ అడ్రసుని నింపి submit చేయండి. తరువాత followers ని click చేసి follower అవ్వండి. తరువాత మీ రచనను కొత్త కవులు పేజీలో అక్కడ సూచించిన విధంగా పంపండి. .
7, నవంబర్ 2025, శుక్రవారం
పాఠకులకు మనవి
పాఠకులకు మనవి మీరు మన బ్లాగులో కుడివైపు గడియారాన్ని చూస్తున్నారు కదా అందులో సూచించే సమయం మీ దేశానికి సంబంధించిన నిజమైన సమయమా లేకపోతే ఇండియా సమయమా మీరు ఒక్కసారి మీ కామెంట్ రూపంలో పెట్టగలరు
సుశ్రుతుడు
ఆయుర్వేద పితామహుడు సుశ్రుతుడు గురించి విశేషాలు -
జననం - క్రీ .పూ 1000 సంవత్సరం .
జన్మస్థలం - వారణాసి .
తండ్రి - విశ్వామిత్రుడు .
గురువు - ధన్వంతరి .
రచనలు - సుశ్రుత సంహిత .
ప్రాచీన వైద్య శాస్త్రంలో ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన మహానుభావుడు , ప్రముఖుడు . ప్రపంచంలో సాటిలేని మేటి శస్త్రచికిత్స నిపుణుడు ముఖ్యంగా ప్లాస్టిక్ సర్జరీ చేయడంలో నిష్ణాతుడు . ఇతని కాలం నాటికే అంటే దాదాపు 3000 సంవత్సరాల క్రితం నాడే వైద్యరంగంలో భారతదేశం నేటి ప్రపంచం కన్నా ఎంతో ముందు ఉన్నది. దీనికై ఎంతోమంది భారతీయ వైద్యశాస్త్రవేత్తలు ఈ వైద్యరంగానికి ఎనలేని సేవలు చేశారు .
ప్రపంచం వైద్యశాస్త్రం గురించి కళ్లు తెరవకముందే వైద్యశాస్త్రాన్ని ప్రకాశింపచేసినది భారతీయులే . శస్త్రచికిత్సా రంగంలో ఉన్నత ప్రమాణాలతో కూడిన పరికరాలు ఉపయోగించడంలో సుశ్రుతుడు ఆద్యుడు అని చెప్పవచ్చు. దాదాపు 101 రకాల శస్త్రచికిత్సా పరికరాలను సుశృతుడు వివిధ సందర్భాలలో ఉపయోగించేవాడు . తెగిపోయిన అవయవాలను తిరిగి వాటి స్థానంలో అతికించడంలో సుశ్రుతుడుని మించినవారు మరొకరు లేరు .
మొట్టమొదట శవపరీక్ష నిర్వహించింది కూడా ఈయనే . శవాన్ని పరిశీలించడం ఆ మరణం ఏ విధముగా సంభవించిందో నిర్ధారించడంలో సుశృతుడు కడు నిష్ణాతుడు . అదేవిధముగా చెడు రక్తాన్ని శరీరం నుండి తొలగించడంలోనూ , ఆరోగ్యవంతమైన రక్తాన్ని శరీరానికి అందించడంలోనూ , మూత్రనాళాల్లో , మూత్రపిండాలలో ఏర్పడిన రాళ్లను తొలగించడంలోనూ మరియు అనేక నిగూడ మరియు భయంకర రోగాలను అనతికాలంలో అతి సునాయాసముగా నయంచేయడంలో సుశ్రుతుడుది అందవేసిన చేయి .
సుశృతుడు రాసిన సుశ్రుత సంహిత నందు శల్యతంత్రం ( శస్త్రచికిత్స , సర్జరి ) గురించి మరియు అష్టాంగ వైద్యవిధానం గురించియు మరింకెన్నో విషయాలకు సంబంధించిన పలువివరాలను క్షుణ్ణంగా ఈ గ్రంథంలో సుశృతుడు వివరించిన కారణంగా ఈ గ్రంథం ప్రమాణ గ్రంధంగా గ్రహింపబడుతుంది. సుప్రసిద్ధ రససిద్ధుడు ఆచార్య నాగార్జునుడు ఈ గ్రంథం ప్రశస్తమైనది అని ప్రస్తుతించాడు . ఈ గ్రంథాన్ని క్రీ . పూ 800 వ సంవత్సరం నందు అరబ్ భాషలోకి అనువదించుకొని వెళ్లి వారివారి ప్రాంతాలలో వైద్యశాస్త్ర అభివృద్ది చేసుకున్నారు . రోమన్లు కూడా భారతీయ మౌళిక ఔషధవిధానాన్ని అనుసరించారు.
ఇప్పుడు మీకు ముక్కు తెగినప్పుడు సుశ్రుతాచార్యుడు సర్జరీ చేసే విధానం గురించి మీకు వివరిస్తాను.
ముక్కు తెగినప్పుడు సుశ్రుతాచార్యుడు శస్త్రచికిత్స చేసిన విధానం -
చెట్టుయొక్క ఆకుని తీసి తెగియున్న ముక్కుభాగమును సరిగ్గా కొలతపెట్టి అంతప్రమాణం గల చర్మమాంసములు తో కూడిన పోరని దగ్గరగా ఉండు చెక్కిలి భాగం క్రిందనుండి మీదకి కోసి మీదభాగం పట్టు ఉండునట్లు ఉంచి ఆ పొరని ముక్కు యొక్క మొదలు వరకు పదునైన అంచుతో శస్త్రం తో గీచి రక్తం స్రవించునట్లు చేసి దానితో అంచులని అతికించి నాసారంధ్రములకు రెండింటికి తేలికైన గలగడ్డితో చేసిన గొట్టములని దూర్చి పైన ముక్కుయొక్క ఆకారంనకు సరిగ్గా ఆ కండపోరని సర్ది అప్రమత్తముగా , శీఘ్రముగా మీదకి ఎత్తి సూత్రాదులతో ( దారాలతో ) చక్కగా బంధనం చేసి దానిపైన రక్తచందనం , యష్టిమధూకం , రసాంజనం వీని చూర్ణంని చల్లి ఆ పైన తెల్ల దూదిపింజతో కప్పి నువ్వులనూనెని మాటిమాటికి వేసి తడుపుచుండవలెను . మరియు ఆ రోగికి జీర్ణం అయ్యేంత తగినంత నెయ్యిని త్రాగించి కొంచం స్థిమితపడిన తరువాత శాస్త్రానుసారం విరేచనం చేయించవలెను.
ఇలా చేయుచూ చక్కగా ఆ పోర అతుకుకున్న తరువాత అంతకు ముందు కొంచం పట్టు ఉంచిన కండ భాగాన్ని ఛేదించవలెను . ఇలా చక్కగా అతుకుకొనిన తరువాత కొంచం కృశించి ఉన్నచో ఆ భాగం నకు వెనక చెప్పిన తైలాది చికిత్సలను అనుసరించి ఆ భాగం పెరుగునట్లు చేయవలెను . ఒకవేళ అక్కడ మాంసం ఎక్కువుగా వృద్ధిచెంది యున్నచో సమముగా ఉండునట్టి ఉపాయం జూచి తగ్గించి సరిచేయవలెను . ఒక్కోసారి లలాటభాగం నందలి మాంసపుపొర కూడా కోసి అతకవలసి యుండును.
ఈ విధముగా సుశ్రుతాచార్యుడు శస్త్రచికిత్సలు కడు ఉపాయంతో సులభముగా చెసెడివారు .
ఆయుర్వేదములోని ఎన్నొ రహస్య మూలికల అనుభవ యోగాల గురించి నా గ్రంథాల యందు సంపూర్ణముగా , అందరికి అర్థమయ్యే సులభ భాషలో వివరించాను . వాటిని చదివి మరింత విజ్ఞానాన్ని పొందగలరు .
గమనిక -
నేను రాసిన " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు " మరియు " ఆయుర్వేద మూలికా రహస్యాలు " రెండు గ్రంథాలలో ఎన్నొ రహస్య చిట్కాలు , మా కుటుంబపరంగా గత 250 సంవత్సరాల నుంచి మా పెద్దవారు మాకు అందించిన ఎంతో అనుభవసారాన్ని ఈ గ్రంథాలలో అందరి అర్థం అయ్యే విధంగా సామాన్య బాషలో వివరించాను. ఇంట్లో ఉండి మరియు అందుబాటులో ఉన్న వాటితోనే పెద్ద పెద్ద రోగాలు నయం చేసుకునే విధంగా అత్యంత సులభయోగాలు మన ప్రాచీన భారతీయులు రచించిన చెట్లను బట్టి భూమిలో నీటిని కనుక్కునే విధానాలు , వృక్షాలకు ఆయుర్వేద మూలికల ఉపయోగించి దిగుబడి పెంచే వృక్షాయుర్వేద చిట్కాలు , రైతులకు ఉపయోగపడే విధంగా ఏయే నక్షత్రాలలో పంటలు వేస్తే ఫలితాల ఎక్కువుగా ఉంటాయో తిథి, నక్షత్ర, వారాలతో సహా ఇవ్వడం జరిగింది. ఆయుర్వేదం నేర్చుకోవాలి అనుకునేవారికి ఇది మంచి దిక్సూచిలా ఉపయోగపడును.
నా మూడొవ గ్రంథము నందు 50 రకాల మొక్కల గురించి అత్యంత విపులంగా ఇవ్వడం జరిగింది . ఈ మొక్కలన్నియు ప్రతి ఒక్కరికి తెలిసినవి మరియు మన ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటివే . ఈ గ్రంధములలో మీకు లభ్యమయ్యే సమాచారం మరే గ్రంథములలో లభ్యం అవ్వదని చెప్పగలను . మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల చిత్రములు కూడా ఇవ్వడం జరిగినది . ఏయే జబ్బులకు ఎటువంటి ఆహారపదార్థాలు తీసుకోవలెనో , తీసుకోకూడదో కూడా సంపూర్ణముగా మీకు ఇందులో లభ్యం అగును . ఔషధాలు మరియు తీసుకోవాల్సిన ఆహారవిహారాలు ఒకేదగ్గర లభ్యం అగును .
ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు గ్రంథము 288 పేజీలతో ఉండును . దీని విలువ 400 రూపాయలు , ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథము 384 పేజీలతో ఉండి 500 రూపాయలు , సర్వమూలికా చింతామణి గ్రంథము 352 పేజీలతో ఉండును . దీని విలువ 550 రూపాయలు . అందరికి అర్ధమయ్యేలా సులభ బాషలో ఉండును. గ్రాంథిక భాష ఉపయోగించలేదు .
. ఈ గ్రంథములు కావలసిన వారు 9885030034 నంబర్ కు Phonepay or Googlepay or Paytm కు డబ్బు పంపించి ఇదే నంబర్ కు Whatsup నందు screenshot పెట్టి మీ పూర్తి Adreass ఇవ్వగలరు . కొరియర్ చార్జీ 100 రూపాయలు అదనం .
. ఈ గ్రంథాలు కావలసినవారు క్రింద ఇచ్చిన నంబర్ కి ఫోన్ చేయగలరు .
. కాళహస్తి వేంకటేశ్వరరావు
. అనువంశిక ఆయుర్వేద వైద్యులు
. 9885030034
కార్తీకపురాణం - 17 వ అధ్యాయము*
🌴🌹🪔🕉️🛕🕉️🪔🌹🌴
🍁 _*శుక్రవారం*_🍁
🕉️ *నవంబర్ 7, 2025*🕉️
*కార్తీకపురాణం - 17 వ అధ్యాయము*
🕉🕉🕉🕉🕉🕉️🕉️🕉️
*ధన లోభికి తత్వోపదేశం*```
అప్పుడు అంగీరసుడు మునులతో ఇలా అంటున్నాడు…. “ఓ మహా మునులారా! ఓ ధనలోభి! మీకు కలిగిన సంశయాలకు సమాధానమిస్తాను. సావధానంగా వినండి” అంటూ ఇలా చెప్పసాగారు.
“కర్మల వల్ల ఆత్మ దేహధారణ సంభవిస్తున్నది. కాబట్టి, శరీరోత్పత్తి కర్మకారణంగా జరుగుతోందనే విషయాన్ని గుర్తించాలి. శరీరధారణం వల్ల ఆత్మ కర్మను చేస్తుంది. కర్మ చేయడానికి శరీరమే కారణమవుతోన్నది. స్థూల, సూక్ష్మ శరీర సంబంధాల వల్ల ఆత్మకు కర్మ సంబంధాలు కలుగుతాయని తొలుత పరమేశ్వరుడు పార్వతీదేవికి వివరించాడు. దాన్ని మీకు చెబుతున్నాను. ఆత్మ అనగా…
ఈ శరీరాన్ని అహంకారంగా ఆవహించి వ్యవహరించేది అని అర్థం” అని వివరించాడు.
దీనికి ధనలోభుడు తిరిగి ఇలా అడుగుతున్నాడు… “ఓ మునినీద్రా! మేం ఇప్పటి వరకు ఈ దేహమే ఆత్మ అని భావిస్తున్నాం. ఇంకా వివరంగా చెప్పండి. వ్యక్య్తార్థ జ్ఞానం, పదార్థ జ్ఞానం, అహం బ్రహ్మ అనే వ్యక్య్తార్థ్య జ్ఞానం గురించి తెలియజేయండి” అని కోరాడు.
అప్పుడు అంగీరసుడు తిరిగి ఇలా చెబుతున్నాడు “ఈ దేహం అంతఃకరణ వృత్తికి సాక్షి. నేను-నాది అని చెప్పే జీవాత్మయే అహం అను శబ్దం. సర్వాతంర్యామి అయిన పరమాత్మ న్ణ అనే శబ్దం. శరీరానికి ఆత్మలా షుటాదులు లేవు. సచ్చిదానంద స్వరూపం, బుద్ది, సాక్షి, జ్ఞానరూపి, శరీరేంద్రియాలను ప్రవర్తింపజేసి, వాటికంటే వేరుగా ఉంటూ… ఒకే రీతిలో ప్రకాశించేదే ఆత్మ. నేను అనేది శరీరేంద్రియానికి సంబంధించినది. ఇనుము అయస్కాంతాన్ని అంటిపెట్టుకుని ఎలా తిరుగుతుందో… ఆత్మకూడా శరీరాన్ని, శరీర ఇంద్రియాలను ఆశ్రయించి తిరుగుతుంది. అవి ఆత్మ వల్ల పనిచేస్తాయి. నిద్రలో శరీరేంద్రియాల సంబంధం ఉండదు. నిద్ర మేల్కొన్నతర్వాత నేను సుఖనిద్ర పొందాను అని భావిస్తారు. శరీర ఇంద్రియాలతో ప్రమేయం లేకుండా ఏదైతే సుఖాన్నిచ్చిందో అదే ఆత్మ. దీపాన్ని గాజుబుడ్డి ప్రకాశింపజేస్తుంది. అదేవిధంగా ఆత్మకూడా దేహ, ఇంద్రియాలను ప్రకాశింపజేస్తుంది. ఆత్మ పరమాత్మ స్వరూపం. తత్వమసి మొదలైన వ్యాక్యాల్లో త్వం అనే పదం కించిత్ జ్ఞాత్వాదిశాశిష్టమైన సచ్చిదానంద స్వరూపమని అర్థం. త్వం అంటే నీవు అని అర్థం. తత్వమసి అనేది జీవాత్మ, పరమాత్మల ఏకత్వాన్ని బోధిస్తుంది. ఈ రీతిగా సర్వజ్ఞత్వాది ధర్మాలను వదిలివేయగా సచ్చిదానంద రూపం ఒక్కటే నిలుస్తుంది. అదే ఆత్మ. దేహలక్షణాలు జన్మించుట, పెరుగుట, క్షీణించుట వంటివి ఆరు క్రమాలుంటాయి. అయితే ఆత్మకు అలాంటి లక్షణాలు లేవు. జ్ఞానానంద స్వరూపమే పూర్ణత్వం ఉన్నది. వేదాల్లో దేనికి సర్వజ్ఞత్వం, ఉపదేశం, సంపూర్ణత్వం నిరూపించబడి ఉందో… అదే ఆత్మ. ఒక కుండను చూసి, అది మట్టితో చేసిందని ఎలా గుర్తిస్తామో… అలాగే ఒక దేహాంతర్యామి అయిన జీవాత్మ పరమాత్మ అని తెలుసుకోవాలి. జీవుల కర్మ ఫలాలను అనుభవించేవాడు పరమేశ్వరుడేనని, జీవులు ఆ కర్మలను ఫలాలని భావిస్తారని తెలుసుకోవాలి. అందువల్ల మానవుడు గుణసంపత్తు కలవాడై… గురుశుశ్రూష ఒనర్చి, సంసార సంబంధమైన ఆశలను విడిచి, విముక్తిని పొందాలి. మంచి పనులు తలచినంతనే చిత్తశుద్ధి, తద్వారా జ్ఞానం, భక్తి, వైరాగ్యాలు కలిగి ముక్తిని పొందుతారు. అందువల్ల సత్కర్మానుష్టానం చేయాలి. మంచి పనులు చేస్తేగానీ ముక్తి లభించదు” అని అంగీరసుడు వివరించాడు.```
*ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహాత్యమందలి*
*పదిహేడవ అధ్యాయము*
*పదిహేడవ రోజు*
*పారాయణము సమాప్తం*
🌷 *సేకరణ*🌷
🌹🌷🌞🌞🌷🌹
*న్యాయపతి*
*నరసింహా రావు*
🙏🌹🍁🕉️🛕🕉️🍁🌹🙏