20, అక్టోబర్ 2020, మంగళవారం

ధర్మశాస్త్రం

 స్త్రీలకు ధర్మశాస్త్రం చెప్పేది


సుమంగళి స్త్రీలు నెత్తిన కుంకుమ లేకుండా ఎప్పుడు వుండకూడదు

రెండు చేతులతో తల గీరుకోరాదు

అయినదానికీ కానిదానికి ఎప్పుడు కంట నీరు పెట్టుకోరాదు. ఇది దారిద్ర్యమును తెచ్చిపెట్టును

ఒక ఆకులో వడ్డించిన దానిని తీసి మరియొక ఆకులో వడ్డించ కూడదు

ఇంటికి వచ్చిన సుమంగళి స్త్రీలకు పసుపు, కుంకుమ, తాంబూలాదులు విధిగా ఇచ్చి సత్కరించ వలెను

గర్భిణి స్త్రీలు టెంకాయ పగులకొట్ట రాదు. టెంకాయ కొట్టే స్థలంలో కూడా వుండ కూడదు

గర్భిణి నిమ్మకాయను కోసి దీపము వెలిగించ కూడదు

గర్భిణి స్త్రీలు గుమ్మడి కాయ కొట్టకూడదు

సూర్యోదయాత్ పూర్వమే ఇంటి ముందు కల్లాపు చల్లి ముగ్గు వేయడం లక్ష్మి కటాక్షము. ఇంటిలో ఈ పని చేయడానికి మనిషి ఉన్న ఇంటి యజమానురాలు చేయడం లక్ష్మి లోగిలోకి రావడానికి దోహదం

చేతితో ఎప్పుడు అన్నం, ఉప్పు, కూరలు వడ్డించకూడదు

ఏ వస్తువు అయిన ఇంట్లో లేకపోతే లేదు అనకుండా తీసుకురావాలి లేక నిండుకుంది అనడం సబబు. నాస్తి నాస్తి అంటుంటే మనకు అన్ని నాస్తిగానే అవమని అశ్వినిదేవతలు మరియు తథాస్తు దేవతలు కూడా పలుకుదురు

అమ్మ వారి ఆలయం

 




















భగవంతుని లీలలు స్వామి

 






కీర్తన చేస్తూ

 



తప్పెవరిది

 


హారతి

 


ప్రకృతి

 


గురూపదేశం

 ఏ మంత్రమైనా గురూపదేశం లేనిదే ఫలించదు. మంత్రాన్ని పుస్తకాలలోనూ, టివిలలోనూ, రేడియోలలోనూ, క్యాసెట్లలోనూ తీసుకొని చేస్తే మహాపాపం. కఠోరమైన నియమాలున్నాయి. ప్రమాణ శ్లోకాలతో చూపిస్తే భయపడతాం. మనకి తొందరగా కోరిక తీరాలనే ఆబ, ఆశ, ఎక్కువ. త్వరగా సంపాదించాలనే ఆశ వాళ్ళకి ఎక్కువ. ఈరెంటి మధ్య కలియుగంలో మంత్రములు బజారు పాలు అవుతున్నాయి.


రింగ్ టోన్ల రూపంలో గాయత్రి మంత్రం, మృత్యుంజయ మంత్రం వినపడుతున్నాయి. ఎంత దౌర్భాగ్యకరమైన పరిస్థితులలో ఉన్నామో ఆలోచించుకోండి. ఇవి మనల్ని పతనం చేస్తాయి. మంత్రములు ఎప్పుడూ పాటలు కారాదు. మననం చేయవలసింది మంత్రం. గురూపదేశం ద్వారా పొంది మనస్సులో చేయాలి. మంత్రాలు పాటలు, భజనలు కావు. పాటలు, భజనలు కావలసినన్ని ఉన్నాయి. చేసుకోండి. అన్నమాచార్య కీర్తనలు, త్యాగరాజ కీర్తనలు చాలా ఉన్నాయి. హాయిగా పాడుకోండి. రామ, శివ, శంభో అని నామం చేసుకోండి. తప్పులేదు. కానీ మృత్యుంజయ మంత్రం, గాయత్రీ మంత్రం బయటికి అంటాం, భజనలు చేస్తాం, ఎలుగెత్తి పలుకుతాం అంటే మహాపాపం. శక్తివంతమైన వాటిని జాగ్రత్తగా వాడాలి. Hi Voltage Electricityని జాగ్రత్తగా వాడుతున్నామా? లేదా? ఉపయుక్తమైనది, మంచిది, గొప్పది అని తీగను పట్టుకుంటే ఏమౌతుందో అదే అవుతుంది ఇవన్నీ చేస్తే. శాస్త్ర ప్రమాణములున్నాయి దీనికి. ఒకమందు ప్రిస్కిప్షన్ లేనిది పుచ్చుకోకూడదని డాక్టర్లు చెప్తారు. మనకి ఇప్పుడు ఇంటర్నెట్ ఒకటుంది. ఏ జబ్బుకి యేమందో లిస్ట్ దొరుకుతుంది. నచ్చిన మందు వేసుకుంటే యే డాక్టర్ ఒప్పుకుంటాడో చెప్పండి. జబ్బు, మందు తెలిసినప్పటికీ వాడకూడదు. వైద్యుడు దగ్గరికి వెళ్ళాల్సిందే. వైద్యుడు కూడా ఇద్దరు డయాబెటిక్ పేషేంట్స్ కి ఒకే మందు వ్రాయడు. ఒక మందు ఇవ్వడానికి రోగిని వైద్యుడు ఎంత పరీక్షించాలో ఒక మంత్రిమివ్వడానికి గురువు శిష్యుడిని అంత పరీక్షించాలి. వాని పద్ధతి, జీవన విధానం, పరంపర, పుట్టిన నక్షత్రం ఇవన్నీ చూసి ఇవ్వాలి. దీనిని అర్వణ శాస్త్రం అంటారు.


అయితే కొన్ని మంత్రాలకి ఎక్కువ నియమాలుంటాయి. కొన్ని మంత్రాలకు పెద్ద నియమాలుండవు. అలాంటివి  కొన్ని ఉన్నాయి. అలాంటి వాటిలో పంచాక్షరి ఒకటి. . ఉపదేశం ఉన్నవారు మాత్రమే ప్రణవంతో చేయాలి. ఉపదేశం లేని వారు ప్రణవసహితంగా చేయరాదని శాస్త్రం చెబుతోంది.  అశాస్త్రీయం అలవాటు అయిపోయి అసలు శాస్త్రం చెప్తే కోపం వచ్చే రోజులలో ఉన్నాం. ఉపదేశం లేకుండా పంచాక్షరి చేస్తే సత్ఫలితం ఇస్తుంది. అందులో ఏమీ తేడాలేదు. అయితే ఉపదేశం లేకుండా చేస్తే దానికి సాధ్యమంత్రము అని పేరు. ఉపదేశం పొంది చేస్తే సిద్ధమంత్రము అని పేరు. ఉపదేశం చేసే దానికంటే ఉపదేశం పొంది చేసే మంత్రం కోటిరెట్లు ఎక్కువ ఫలితం ఇస్తుంది. ఉపదేశం ఇచ్చిన వారు మంత్రంలో సిద్ధి పొందిన వారు అయితే అప్పుడు ఆ మంత్రం సుసిద్ధ మంత్రం అవుతుంది. గురువులేనిదే యేవిద్య కూడా భాసించదు.


ఒక చెట్టును ఫోటోతీసి ఇంట్లో ఉంచుకొని, అందులోంచి చెట్టు ప్రయోజనాల్ని పొందడం ఎలాంటిదో – రికార్డు చేసిన మంత్రాలద్వారా అనుష్ఠానం, అర్చనాదులు చేయడం అలాంటిదే. అందులోంచి ప్రాణశక్తిని పొందలేం.


నేర్చుకోవడానికి, లేదా విని అనుభూతిని పొందడానికి ఈ కేసెట్స్ పనికిరావచ్చు. అంతేగానీ వ్రతాలు, అభిషేకాలు చేయడానికి మాత్రం పనికిరావనే చెప్పాలి.


వ్రతాది యజ్ఞ (ఆరాధనా) కార్యాలలో బ్రహ్మను (విప్రుని) ఉచిత స్థానంలో ఆసీనుని చేయాలి. యజ్ఞాలో ’ఋత్విగ్వరణం’ ఇదే. అలాగే పూజాదులను స్వయంగా అనుష్ఠించలేనప్పుడు, బ్రహ్మస్థానంలో ఒకరిని నియమితుని చేసి వారు మంత్రోచ్చారణ చేస్తుంటే వీరు ఆచరిస్తుంటారు.


న సిద్ధ్యతి క్రియాకాపి సర్వేషామ్ సద్గురుం వినా!

మయా శ్రుతా పురా సత్యం శ్రుతిరేషా సనాతనీ!!


సద్గురువు లేనిదే యే సాధనా ఫలించదన్న విషయం సనాతనమైన వేదవాక్యము.

మాతృమూర్తిగా

 స్త్రీని మాతృమూర్తిగా గౌరవించడం చాలా విశేషం. 


🕉🌹🕉🌹🕉🌹🕉🌹🕉🌹🕉


స్త్రీలయందు మాతృభావన చూపించడం అనేది పురుషుడు చిన్నతనం నుంచి అభ్యాసం చేసుకోవలసిన అంశం. స్త్రీయందు మాతృభావన అనేది కలిగినట్లయితే తప్పకుండా స్త్రీ పట్ల పురుషుడు గౌరవంగా ప్రవర్తిస్తాడు, అవమానించడు, అత్యాచారాలు చేయడు. 


తనయందు నఖిల భూతములందు నొక భంగి సమహితత్వంబున జరుగువాడు

పెద్దల బొడగన్న భృత్యునికైవడి  చేరి నమస్కృతుల్  సేయువాడు

కన్నుదోయికి నన్యకాంతలడ్డంబైన  మాతృభావన సేసి మరలువాడు – అని ప్రహ్లాదుని వర్ణిస్తారు పోతనగారు. 


మానవుడికి సహజంగా పశువు వలె కొన్ని పాశవిక ప్రవృత్తులు ఉంటూ ఉంటాయి. చదువు వల్ల, పెద్దల బోధల వల్ల, సంస్కారం ఏర్పరచుకొని నిగ్రహంతో గౌరవ భావాన్ని తెచ్చుకోవాలి. 

స్త్రీని తల్లిగా చూడడం, తల్లిని దేవతగా చూడడం – ఈ రెండు ప్రతి పురుషుడూ అలవరచుకోవలసినది. 


పతితా మపి మాతరం బుభ్రుయాత్ - తల్లిదండ్రులు దుర్మార్గులు అయితే తండ్రిని విడిచిపెట్టవచ్చేమో గానీ దుర్మార్గురాలు అయినప్పటికీ తల్లిని విడిచిపెట్టరాదు (బోధాయనుడు తన సూత్రాలలో)


 ‘సర్వేషామేవ శాపానాం ప్రతిఘాతో హి విద్యతే| 

న తు మాత్రాభిశప్తానాం మోక్షః క్వచనవిద్యతే!!(మహాభారతం – ఆదిపర్వం)

సృష్టిలో శాపాలను ఎవరైనా అనుభవించక తప్పదు. కానీ లోకంలో ఎవరి శాపం నుంచైనా పరిష్కారం, ప్రతిక్రియ చేసుకోవచ్చు. కానీ మాతృ శాపానికి మాత్రం ప్రతిక్రియ లేదు, పరిష్కారం లేదు. 


తల్లి గానీ తిట్టి బాధపడితే అది తప్పకుండా ఫలిస్తుంది. ఇది గ్రహించి మాతృమూర్తి మనస్సు క్షోభ పడకుండా చూడాలి. ఆవిడ క్షోభ పది ఒక్క మాట అన్నా అది ఫలించి తీరుతుంది. అదే ఆవిడ సంతోషించి దీవెన చేస్తే అది కూడా ఫలించి తీరుతుంది. కనుక దీవెనలు పొందే ప్రయత్నాలు చేయాలి ప్రతివాడూ. 


మాతృత్వం అనేది దైవత్వం. జగన్మాతయైన పరాశక్తి యొక్క విభూతిని కన్నతల్లిలో చూడగలగాలి. 


మాతృభక్తి, పితృభక్తి, గురుభక్తి – ఈ మూడూ మానవులను ధన్యులను చేస్తాయి.

వినోదం

 


వేదం

 



 

సూర్యా భగవానుడు


 

అరటి పండ్లు తింటే


 

జీవితం అన్ని నేర్పుతుంది

 🙏🙏జీవితం అన్ని నేర్పుతుంది అంటారు 

ఏం నేర్పుతుంది? 

జీవితం ఏం నేర్పదు 

మన చుట్టూ వున్న మనుషులు నేర్పితారు 


ఓ సారి నమ్మకం 

ఓ సారి మోసం 


ఓ సారి ఆనందం 

ఓ సారి బాధ 


ఓ సారి ప్రేమ 

ఓ సారి ద్వేషం 


ఓ సారి ఇష్టం 

ఓ సారి అస్సహ్యం 


ఓ సారి జాగ్రత్త 

ఓ సారి నిర్లక్ష్యం 


ఇలా అన్ని మన చుట్టూ వుంటూ 

మనకి అన్ని నేర్పేది మనుషులే 


జీవితం ఏమి నేర్పదు 

అందుకే ప్రతిదీ నేర్చుకోటానికి సిద్ధంగా వుండు🙏🙏

🙏ధర్మాన్ని ఆచరించండి ఆ ధర్మమే మిమ్మల్నీ కాపాడుతుంది🙏

సుప్రసిద్ధ విద్వాంసులు

 🌀🌀🌀🌀🌀🌀🌀🌀


*తెలుగు దేశంలో సుప్రసిద్ధ విద్వాంసులు చాలామంది జన్మించారు. అనేకమంది మహాకవులు అద్భుత కవితా ఖండాలను సృష్టించి ఖ్యాతిగడించారు. కాని విద్వత్కవులుగా కీర్తి ప్రతిష్ఠ లార్జించినవారు తక్కువ సంఖ్యలోనే ఉన్నారు. అట్టివారిలో గుంటూరు శేషేంద్ర శర్మ గారొకరు. శ్రీశర్మగారు బహుముఖ ప్రజ్ఞాశాలి, భాషాపరశేషభోగి. తెలుగు, సంస్కృత, ఆంగ్ల భాషా సాహిత్యాలలో నిష్ఠాతులేగాక, హిందీ, ఉర్దు సాహిత్యాలలో సహితం గణనీయమైన కృషి చేశారు.*


*గుంటూరు శేషేంద్ర శర్మ*

*జననం అక్టోబర్ 20, 1927*

*నాగరాజపాడు, నెల్లూరుజిల్లా.*

*వృత్తి రీత్యా ప్రభుత్వోద్యోగి (ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో డిప్యూటీ మునిసిపల్ కమీషనరుగా పని చేశారు) ప్రవృత్తి మాత్రం సాహిత్యం. వారి సాహిత్య జీవితం అత్యంత మహోన్నతమైనది. శ్రీనాథ మహాకవి వలె నూనూగు మీసాల నాడే అంటే 20వ ఏటనే (1947లో) రచనా వ్యాసంగం మొదలెట్టారు. అనువాద కావ్యం "సొరాబు" తో ఆయన సాహిత్య ప్రస్థానం ఆరంభ మయింది. తర్వాత 1961వ సంవత్సరం లో శర్మగారి "చంపూవినోదిని" పద్య కావ్యం ప్రచురిత మయింది. ఆ కావ్యం శర్మగారి ఆశు కవిత్వ పటిమకు, పాండిత్య ప్రకర్షకు అద్దం పడుతుంది. శ్రీ శేషేంద్రశర్మ గారు 11 పద్య కావ్యాలు, 12 విమర్శనా గ్రంథాలు రచించి పేరు ప్రతిష్ఠలు ఆర్జించారు. అన్నింటా ఆయన సంప్రదాయ, ఆధునిక తత్వాల మేళవింపు. 'సర్వేజనా స్సుఖినోభవంతు' అన్నది ఆయన ఆత్మనినాదం, ఘోషం. ఆత్మీయులకూ, అభిమానులకూ ఆయన శేషేన్, శేషేంద్ర. అటూ ఇటూ బంధుత్వాలను తగిలిస్తే ఆయన పేరు గుంటూరు శేషేంద్ర శర్మ.*


*కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత. ఈయన రచనలు అంతర్జాతీయ ఖ్యాతి గాంచాయి. "నా దేశం-నా ప్రజలు" 2004 నోబెల్ సాహిత్య పురస్కారానికి నామినేట్ అయ్యింది. శేషేంద్ర శర్మ గారు 1975లో విడుదలైన ప్రముఖ తెలుగు సినిమా ముత్యాలముగ్గులో నిదురించే తోటలోకి పాట ఒకటి వచ్చింది ,ఆ ప్రసిద్ధమైన పాట  రాశారు.*


🌀🌀🌀🌀🌀🎲🌀

తస్మాత్ జాగ్రత్త

 ఇక మీద గోవు మాంసం తినలనుకునే వారికీ చావు తప్పేలా లేదు...

అహమ్మదాబాద్ ఎల్.డి. యూనివర్సిటీ కి చెందిన ద్రువ్ పటేల్,

ఈ మధ్యనే భారత దేశంలోని పశుపోషణ ప్రాముఖ్యతని దృష్టిలో ఉంచుకొని ఒక రసాయనాన్ని తాయారు చేసారు...


ఈ రసాయనం పశువులకు యాంటి వైరస్ లా పని చేయనుంది.

దీన్ని తయారు చేయటానికి ఆయనికి దాదాపుగా 2 సంవస్తరాలు పట్టింది.

ఈ రసాయనాన్ని ఇంజక్షన్ రూపంలో ఆవులకు ఎక్కించనున్నారు.

దీని ప్రత్యేకత గురించి చెబుతూ ఈ ఇంజక్షన్ ఎక్కించిన పశువుకు ఎటువంటి ఆరోగ్య సమస్య రాదనీ కనీసం దాని ఆయుర్దాయం లో కూడా తేడా రాదనీ, కాని పశువు మరణించాక లేదా చంపి మాంసాన్ని తింటే మాత్రం తిన్న వ్యక్తులు 4 గంటల్లో మరణిస్తారు... 

ఈ ఇంజక్షన్ ఖరీదు 150 రూపాయలు ఉండవచ్చు.

వైజ్ఞానికుడు అయిన తేజ్ సింగ్ చెప్పటం ప్రకారం ఈ ఇంజక్షన్ గోశాల నిర్వహించే వారికి ఉచితంగా ఇవ్వనున్నట్టు తెలిపారు.గోశాల నిర్వాహకులు వివరాలతో రిజిస్ట్రేషన్ చేయిన్చుకోవలసింది గా తెలిపారు.

తద్వారా గోమాత మీద జరుగుతున్న అత్యాచారాలను ఆపదలచారు ఈ విషయం లో ఈ ఇంజక్షన్ రామబాణం కానున్నది.

ఈ విధంగా గోమాత ని రక్షించుకోవటం కోసం ldceahmd@gmail.కం కి వివరాలతో మెయిల్ చేసి రిజిస్టర్ చేసుకోగలరు...


ఈ పోస్ట్ ని షేర్ చేయటం ద్వారా కూడా ఎంతో కొంత మందికి ఈ విషయం తెలిసేలా చేయగలరని భావిస్తున్నాను

మనస్సు చేసే చేష్టలు

 


అన్నపూర్ణాతత్వము

 దేవీనవరాత్రులు - అన్నపూర్ణాతత్వము


ఈ రోజు ఆ తల్లి మనలను అందరిని అన్నపూర్ణాదేవిగా కాశి క్షేత్రాన్ని ఆధారంగా చేసుకుని మనలను అందరిని అనుగ్రహిస్తూ ఉంటుంది. ప్రత్యేకంగా అన్నపూర్ణోపాసన చేసేవారు కూడా మనకు కనిపిస్తూ ఉంటారు. శ్రీవిద్యోపాసనలో అన్నపూర్ణాదేవిని అమృత శక్తిగా, అమృతేశ్వరీదేవిగా పూజిస్తారు. అన్నపూర్ణ అనగానే మనకి గుర్తుకు వచ్చేటటువంటి మూర్తి ఎడమచేతిలో మణిమాణిక్యాలతో పొదగపడిన బంగారు గిన్నెను పట్టుకుని, కుడిచేతిలో బంగారు తెడ్డును మణిమకుటాలతో అలంకరింపబడింది పట్టుకుని ఆ తల్లి మొదట పరమశివునికి అన్నం వడ్డిస్తున్నట్లుగా ఉంటుంది. అన్నపూర్ణ అనేటటువంటి నామము మహా మంత్రం. "అన్న" శబ్దానికి ఐశ్వర్యం అని కూడా అర్ధం. ఏ ఇంట అన్నపూర్ణ ఆరాధన జరుగుతూ ఉంటుందో ఆ ఇంట దరిద్రం ఉండదు. 


పూర్వకాలంలో దుర్గమాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడు. ఈ రాక్షసుల ఆలోచన ఎల్లవేళలా కూడా మనలను హింసించడం, ఎదో ఒక రకంగా ఎదుటివారిని బాధపెడుతూ ఆనందించడం. నిజానికి ఇలాంటి పృవృత్తి ఉన్న అందరినీ రాక్షసులుగానే పరిగణించవచ్చు. ఈ దుర్గమాసురుడు బ్రహ్మగారి గురించి గొప్ప తపస్సు చేశాడు. ఈ దుర్గముడి యొక్క తపస్సుకు మెచ్చిన బ్రహ్మగారు ఏమి వరం కావాలో కోరుకొమ్మన్నాడు. మరి రాక్షసుడు కాబట్టి వాడి ఆలోచనలు కూడా అలాగునే ఉంటాయి. వెంటనే వాడు వేదాలన్నీ నాలోకి వచ్చెయ్యాలి అని, ఇప్పటి వరకు వేదం చదువుకున్నవారు కూడా దానిని మర్చిపోవాలి అని కోరుకున్నాడు. వెంటనే బ్రహ్మగారు తధాస్తు అన్నారు. ఎప్పుడైతే వేదాలన్నీ వాడిలోనికి వెళ్లిపోయాయో అందరూ కూడా వేదమంత్రాలు మర్చిపోయారు. వేదమంత్రాలను మర్చిపోయేసరికి మరి భగవంతునికి హవిస్సు ఇవ్వడం లేదు. భగవంతునికి హవిస్సు లేదు కాబట్టి వర్షాలు లేవు. వీటన్నింటికి కూడా అవినాభావ సంబంధం. వర్షాలు లేక దేశంలో కరువుకాటకాలు ఏర్పడ్డాయి. ఎవరో కొంతమంది పెద్దలు వారికి తెలిసిన రీతిలో అమ్మవారి ఆరాధన చేశారు. కొంతమంది కీర్తన ద్వారా, కొంతమంది ధ్యానం ద్వారా, కొంతమంది నృత్యం ద్వారా తమ తమ భక్తిని ఆవిష్కరించారు. 


దీనిని బట్టి మనకు ఏమి అర్ధం అవుతుంది. ఆ తల్లిని ఏ రకంగానైనా ఆరాధన చేయవచ్చు. ఆ తల్లి అనుగ్రహించి తీరుతుంది. కావలసిందల్లా భక్తి, శ్రద్ధ. అలా భక్తులందరూ పిలిచేసరికి ఆ కరుణామయి అయిన ఆమె తన యొక్క చూపులతోనే అందరిని పోషించింది. అందుకే ఆ తల్లిని శతాక్షి అన్నారు. ఆ తల్లి తన శరీరం అంతా కళ్ళు చేసుకుని మనలను పోషించింది కాబట్టి శతాక్షి అయింది. మరి అందరికీ ఆకలిగా ఉంది. ఆ తల్లి తన శరీరం నుండే అనేక రకాలైన కాయగూరలను, పండ్లని సృష్టించి మీ ఆకలి తీర్చుకోండి అంటూ అనుగ్రహించింది. శాకంభరీ రూపంలో ఈ తల్లి ఆ దుర్గమాసురుని సంహరించి 'దుర్గ' అనే నామాన్ని పొందింది. వేదాలన్నింటిని తనలో నుంచి ప్రకాశింపచేసింది. వేదారణ్యం అనే ప్రాంతంలో తిరుపతికి దగ్గిరలో ఉంటుంది. శతాక్షి, విశాలాక్షి, శాకంబరీ, అన్నపూర్ణ అందరూ ఒక్కటే. మనం మొదట్లో చెప్పుకున్న ఆ అన్నపూర్ణాదేవి మొదటి వడ్డన తన భర్తకు చేస్తుంది. 


దీనినిబట్టి మనకు అర్ధం అయ్యేది ఏంటి? ఇంట ఒండిన పదార్ధాలు ముందుగా భర్తకు పెట్టాలని. ఇంకొక రకంగా ఒండిన పదార్ధాలను మొదటిగా భగవంతునికి చూపించాలి. 


"అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణ వల్లభే

జ్ఞాన వైరాగ్య సిధ్యర్ధం భిక్షామ్ దేహీచ పార్వతీ"


ఈ శ్లోకం ప్రతిరోజు భోజనం చేసేటప్పుడు చదువుకొని ఆ తల్లి నుండి జ్ఞాన సంపద కోరుకుందాం. 


"అమ్మ దయ ఉంటే అన్ని ఉన్నట్లే"


సర్వేజనా సుఖినోభవంతు.


శ్రీమతి జొన్నలగడ్డ జ్యోతి

+91 8886240088

కూష్మాండ

 కూష్మాండ


ప్రధమం శైలపుత్రీచ ద్వితీయం బ్రహ్మచారిణీ!

తృతీయం చంద్రఘంటేతి కూష్మాండేతి చథుర్ధకమ్!

పంచమమ్ స్కంధమంతేతి షష్టం కాత్యాయనతిచ!

సప్తమం కాళరాత్రేతి మహాగౌరీతి అష్టమం!

నవమ సిధ్ధిధాత్రీచ నవదుర్గాః ప్రకీర్తితాః 



నవదుర్గలలో నాల్గవ రూపం కూష్మాండ. కూష్మాండం అంటే గుమ్మడికాయ అని అర్ధం. కేవలం గుమ్మడికాయ అని కాదు. అందులో పరమార్ధం ఉన్నది. గుమ్మడి గింజలలో విపరీతమైన వేడి ఉంటుంది. ఆ వేడి ఉపయోగకరమైనది కాదు. లోకంలో మూడు రకములైన వేడిలు ఉంటాయి. అవి పరమ భయంకరమైన వేడి. 


ఆధ్యాత్మిక తాపం (వేడి) 


అంటే అది ఆ వ్యక్తి యొక్క శారీరక, మానసిక వేడికి సంబంధించింది. శరీరంలో వచ్చే వ్యాధులకు ఆధ్యాత్మిక తాపం అని పేరు. ఇది వారి వరకే ఆలోచిస్తే (వారి శరీరం) వారిని పరమస్వార్ధమపరులు అంటాము. ఎవరికి ఏ వ్యాధి వచ్చినా తనకే వచ్చినట్లు బాధపడే వారిని ధర్మాత్ములు అంటాము. అలాంటి అమృత హృదయం ఆ తల్లి కృప ఉంటేనే మనకి అలాంటి హృదయం అబ్బుతుంది. రోగం వల్ల మనసులో పుట్టే తాపం ఆధ్యాత్మిక తాపం. అనారోగ్యం కలగటం తద్వారా చేసే పనులకు విఘ్నం.


ఆధిభౌతికం


అనేక రకములైన మహమ్మారి స్వరూపాలైన అంటువ్యాధులు రావడం, అంటువ్యాధులు ప్రబలడం వలన కళ్ళు ఎర్రబడిపోతూ బయట ఉన్న క్రిమి కీటకాదుల వల్ల అంటురోగాల బారిన బడడానికి బయట వారు చేసే పనివల్ల (దొంగతనం) మనం బాధపడడాన్ని ఆధిభౌతిక తాపం అంటారు. 


ఆధిదైవికం 


ఇది పరమ ప్రమాదకరం. అవైదిక ప్రక్రియలు ఎక్కువైపోవడం వల్ల కురవవలసిన సమయంలో వర్షాలు కురవకపోవడం, ప్రకృతి అసమతుల్యతకి లోనవడం, ఇలాంటి వన్నీ అవైదిక ప్రక్రియల వల్లే జరుగుతాయి. ఉదా: భూకంపములు ఎక్కువవడం, సునామీలు రావడం, పిడుగులు పడటం ఆధిదైవిక తాపం.


ఈ మూడు తాపాలు, అనగా మూడు రకములైన కుత్సితమైన వేడి తగ్గాలంటే ఆ లోకమాత పాదాలను ఆరాధించవలసినదే. ఆమె పాదాల చెంత భక్తిగా చిటికెడు కుంకుమ వేస్తే ఆ తల్లి తాపాన్ని పోగొడుతుంది.


ఆ తల్లి 'సువాసినీ సువసిన్యర్చనప్రీతా', కాబట్టి ఆ తల్లి పాదాల చెంత చిటికెడు కుంకుమ భక్తితో వేస్తే, దుర్గ అష్టోత్రం చేస్తే, దుర్గ సప్తశతి పైకి చదువుతూ వింటే, చండీ హోమం చేస్తే, హవిస్సు ఇస్తూ పూర్ణాహుతి చేస్తే, ఆవిడ పరమ ప్రీతీ చెంది ఈ మూడు రకములైన వేడులను ప్రబలకుండా చేస్తుంది.


"మాతాచ పార్వతీదేవి పితాదేవో మహేశ్వరః" అంటూ అందరం ఆ తల్లికి దేవాలయంలో మన చేతనైన సహాయం చేసి ఆ తల్లిని ఉపాసన చేస్తే కుష్మాండ స్వరూపం తాపత్రయాన్ని తగ్గించే తల్లి. 


త్రుప్తితో బ్రతక గలిగినవాడు ఐశ్వర్యవంతుడు. ఎంత ఉన్నా లేదని ఏడ్చినవాడు బాహ్యంలో ధనవంతుడిగా కనబడినా వాడు దరిద్రుడు. అటువంటి వేడి పుట్టకుండా ధర్మంలో అర్ధకామములను ముడివేసి చల్లార్చగలిగిన తల్లి ఈమెయే. అందుకే ఆమె కూష్మాండ. అటువంటి తల్లి నవదుర్గా స్వరూపాలలో కూష్మాండ అని పేరు పొందినది. అందువల్ల ఆ తల్లి ఆరాధన తప్పక చెయ్యాలి. తద్వారా మనము ప్రకృతిని శాంతింప చెయ్యగలం.


అలాగే ధర్మబద్ధమైన జీవితం గడపడం వల్ల అర్ధాన్ని, అలాగే ధర్మబద్ధమైన కామాన్ని అనుభవించడం వల్ల, తద్వారా మోక్షాన్ని పొందేటట్లు చెయ్యగలిగిన శక్తి ఆ తల్లికే ఉన్నది.


నవదుర్గలలో ఒకరైన ఆ కూష్మాండ మాతను మనమందరం మన శక్తి మేర భక్తితో ఆరాధన చేసి ఆ తల్లి కృపకు మనం పాత్రులం అయ్యెదముగాక.


సర్వేజనా సుఖినోభవంతు


శ్రీమతి జొన్నలగడ్డ జ్యోతి


WhatsApp Number: +91 8886240088

దసరానవరాత్రులు - వైష్ణవి

 దసరానవరాత్రులు - వైష్ణవి 


శృంగేరి సంస్థానానికి చెందిన దేవాలయాలలో అమ్మవారిని ఈ రోజు వైష్ణవిరూపంలో ఆరాధన చేస్తారు. ఈ తల్లి కూడా సప్తమాతృకలలో ఒక తల్లి. పరమశివుడు అంధకాసుర సంహారమునందు సహాయము కోసం ఈ సప్తమాతృకలను సృష్టించగా ఆయా దేవతామూర్తులు ఈ మాతృకలకు వారి శక్తిని ధారపోశారు. వైష్ణవి అనగా విష్ణుమూర్తి యొక్క శక్తి.


ఈ వైష్ణవి శబ్దానికి దేవీపురాణము నాలుగు అర్ధాలను తెలియచేసింది. అందు 1. వైష్ణవివలె శంఖచక్రములను ధరించినది కనుక ఈమె వైష్ణవి. 2. విష్ణువుకు మాత (తల్లి) కనుక వైష్ణవి. 3. విష్ణువు వలె శత్రువులగు రాక్షసులను సంహరించింది కనుక వైష్ణవి. 4. విష్ణుస్వరూపురాలు కనుక వైష్ణవి. ఎందు చూసినా విష్ణుశబ్దమే తెలియబడుచున్నది.


అసురులు అనగా ఈ కలియుగంలో ఎవరో కాదు. వారు ఎక్కడో ఉండి మనలను పీడించడం ఉండదు. అసురులు అనగా మన మనసులో కలిగే ఆలోచనా శక్తినిబట్టి వారు ఆసురీ ప్రవృత్తి కలవారా? లేక ఇంకొకరా? అన్నది తెలుస్తుంది. అనగా ఈ తల్లులకు మనలో కలిగే దుష్టమైన ఆలోచనలను సరిఅయిన మార్గంలో పెట్టగలిగే శక్తి ఉన్నది. అదీ ఎప్పుడు? అమ్మా! నేను నీ వాడను అన్నప్పుడే.


ఈ తల్లియొక్క వాహనము గరుడవాహనము. గరుడుడు రెక్కలు అల్లార్చుకుంటూ వస్తూఉంటే వేదనాదం వినిపిస్తుంది కనుక జ్ఞ్యానప్రదాయిని. అంత గొప్పదైన నామము కనుకనే మనము ఈ శరన్నవరాత్రులలో ఈ నామాన్ని ఉచ్చరించి కొంత శక్తిని పొందగలుగుతాము. లేకపోతే ఈ నామాన్ని గురించి ఆలోచించం కదా?


"జయ జయ శంకర హర హర శంకర"


'అమ్మ దయ ఉంటే అన్ని ఉన్నట్లే'


సర్వేజనా సుఖినోభవంతు


శ్రీమతి జొన్నలగడ్డ జ్యోతి

WhatsApp Number: +91 8886240088

మూసీ నది ఒడ్డున

 


రహస్యాన్ని

 ఈ #రహస్యాన్ని 

ఆలయాన్ని పాడుచేయకుండా ఛేదించగలరా???

శివలింగం పైకి నీళ్లు ఎక్కడినుండి వస్తున్నాయి?





#గుజరాత్‌లోని #విజయపూర్ నగరానికి సమీపంలో ఉన్న #సప్తేశ్వర్_మహాదేవ్_శివలింగంపై 

#3400సంవత్సరాలుగా నిరంతరాయంగా ప్రవాహం రహస్యంగా ప్రవహిస్తోంది.ఈ నీరు ఎక్కడ నుండి వస్తుంది అనే విషయాన్ని శాస్త్రవేత్తలు సైతం ఈ రహస్యాన్ని ఇప్పటి వరకు కనుగొనలేకపోయారు.

ఉచితలకు

 ప్రస్తుతం దేశంలో ప్రతి రాష్ట్రంలో 5 సంవత్సరాలు ఒకసారి ఎలక్షన్ వచ్చినప్పుడు రాజకీయ నాయకులు ఇచ్చే ఉచితలకు అలవాటు పడితే ఇదే పరిస్థితి.


ఒక బస్సు విజయవాడ నుండి హైదరాబాద్ వెళుతుంది అందులో చాలామంది ప్రయాణికులు ఎక్కారు..


ఆ బస్సు బయలు దేరుతుంది, కండక్టర్ టికెట్లు తీసుకుంటుండు అందర్నీ టికెట్ ఇవ్వాలని కోరుతూ ముందుకు వస్తున్నాడు..


అలా సగం మంది టికెట్లు తీసుకోగా కండక్టర్ ఒకాయన దగ్గరికి వచ్చాడు ఓ పెద్దాయన టికెట్ తీసుకో అని అడిగాడు.


ఆ పెద్దమనిషి తన జేబులు అన్ని తడుముకొని చూసి అరే అరే నా జేబులో ఐదు వందల రూపాయల నోటు ఉండాలి అది ఎక్కడో పడిపోయింది అని చెప్పాడు.


అప్పుడు కండక్టర్, లేదు నువ్వు కచ్చితంగా టికెట్ తీసుకోవాలి లేదంటే నిన్ను ఈ మధ్యలోనే బస్సులో నుంచి దింపి వేయడం జరుగుతుంది అంటూ ఆ పెద్దమనిషిని తిట్టసాగాడు.


ఆ పెద్దమనిషి, అయ్యా నేను ఒక ముఖ్యమైన పనిమీద వెళుతున్నాను నేను ఈ క్షణాన అక్కడికి వెళ్లకపోతే చాలా నష్టం జరుగుతుంది, నేను కచ్చితంగా వెళ్ళాలి అని కండక్టర్ ని వేడుకుంటూ ఉన్నాడు.


ఇంతలో ఆ బస్సులోనే ఇంకొక  పెద్ద మనిషి-

అయ్యా అతని టికెట్ నేను తీసుకుంటాను అతని తిట్టొద్దు అంటూ రెండవ పెద్ద మనిషి మొదటి పెద్ద మనిషికి టికెట్ తీసుకున్నాడు..


మొదటి పెద్దమనిషి ఆ టికెట్ తీసుకున్న రెండవ పెద్ద మనిషిని చూసి అయ్యా నువ్వు నిజంగా దేవుడవయ్యా అన్ని మొక్కడం మొదలుపెట్టాడు.


నాకు ఈ ప్రయాణం ఎంతో ముఖ్యం ఇంతమంది ఉండగా నువ్వు మాత్రమే నాకు టికెట్ తీసుకున్నందుకు నువ్వు దేవుడవయ్యా అని అన్నాడు.


అలా బస్సు దిగి ఇంటికి పోయిన తర్వాత కూడా బస్సులో ఒక పెద్ద మనిషి నాకు టికెట్ తీసుకున్నాడు అంటూ ఇంకా మనసులో ప్రార్థిస్తూ ఉన్నాడు ఇలా సాయం చేసినందుకు జీవితాంతం ఆ పెద్దమనిషిని మరవకుండా కొలవడం ఈ పెద్దమనిషి పని అయింది..


అయితే తన దగ్గర ఉన్న 500 రూపాయలు ఎక్కడో పడిపోయి అనుకున్నాడు మొదటి పెద్దమనిషి..

కానీ 

రెండో పెద్ద మనిషే ఇతని 500 రూపాయలను దొంగలించింది.. 


ఐదు వందల రూపాయలు దొంగలించి 5 రూపాయల బస్సు టికెట్ తీసుకుని దేవుడవయ్యా అనిపించుకున్నాడు ఆ రెండవ దొంగ పెద్దమనిషి. 


"#రాజకీయాలలో ఉన్న పెద్ద మనుషులు అందరూ తమ సొంత కష్టార్జితం సంపాదించి తన ఇంట్లో నుంచి ఇస్తున్నట్టుగా-


పించన్ ఇస్తున్నాం

రేషన్ ఇస్తున్నాం

ఉచిత గొర్రెలు

ఉచిత బర్రెలు

ఉచిత కరెంటు ఇస్తున్నాం

ఉచిత భూములు ఇస్తున్నాం

ఉచిత త్రాగునీరు ఇస్తున్నాం

ఉచిత ఇండ్లను ఇస్తున్నాం

మరెన్నో ఇంకా ఉచితం... ఉచితం..... ఉచితం.....


కాపీ పోస్టు


ఇవి మొత్తం ఉచితం అయితే సమాజంలో ప్రజలపై

టాక్సెస్ పెరిగినాయి.

పెట్రోలు పెరిగింది.

బస్సు చార్జీలు పెరిగాయి.

కరెంటు చార్జీలు పెరిగాయి.

రాష్ట్రంలో దేశంలో అప్పులు పెరిగాయి.

ఇలా చాలా చాలా దోపిడీ చేస్తోంది.

*రాజకీయ వ్యవస్థ*


 కాబట్టి అల్ ఫ్రీ అనే వాళ్ళని తరిమి కొట్టండి. తెలివిగా ఆలోచించండి..

🙏🙏🙏

శుద్ధ చెతన్యం

శుద్ధ చెతన్యం 

మనం చూసే ప్రతి జీవి అది భూమిమీద వున్నా, గాలిలో తిరిగిన, నీటిలో వున్నా అన్నిటిలో మనం ఒక సాధారణ విషయాన్ని చూస్తున్నాము అదే జీవత్వం. జీవత్వం వున్నది కాబట్టే వాటిని జీవులు అని అంటున్నాము. ఈ జీవత్వం మనం చూసే జీవులకన్నా భిన్నంగా ఉండి జీవులను చెతన్యవంతులుగా చేస్తున్నది. అంటే జంతువులు కదలటం శ్వాసించటం, సంతానోత్పత్తి చేయటం లాంటి అనేక జీవన  వ్యాపారాలు చేస్తున్నాయి. నిజానికి మన కంటికి కనిపించే జీవులకు  మన కంటికి కనిపించని ఏదో ఒక శక్తి ఈ జీవులను చెతన్యవంతంగా చేస్తున్నది అని మనకు గోచరిస్తుంది. . ఆ శక్తి వల్లనే విత్తుగా వున్నది భూమిలోనాటంగానే  మొలకగా, మొక్కగా, చెట్టుగా, లతగా, వృక్షాముగా ఇలా వేరు వేరు రూపాంతరాలు పొంది మరల పూలు, కాయలు, విత్తులను ఇస్తున్నది. ఈ కార్యాలు అన్ని మన కంటికి గోచరిస్తూవున్నాయి.  మరి ఈ కార్యాలకు కారణమైన ఆ కారణభూతి ఎవరు.  ఆ కారణమే ఒక అద్భుతమైన శక్తి ఆ శక్తికి మీరు ఏ పేరైనా పెట్టండి కానీ ఆ శక్తి మాత్రం వున్నదని ప్రతి మనిషి ఒప్పుకొని తీరవలసిందే. ఎప్పుడైతే ఆ శక్తి జీవులని వీడుతుందో అప్పుడు జీవులు చెతన్య రహితంగా అవుతున్నాయి  ఆ స్థితినే మనం మరణం అని అంటున్నాము. 

ఇట్లా ప్రతి జీవిని చెతన్యవంతం చేసే ఆ శక్తే శుద్ధ చెతన్యం. ఆ చెతన్యం గూర్చిన విషయాలు తెలుసుకొనే దిశలోనే  మన పయనం. 

ఓం తత్సత్ 

**********************

గంధం

 పూజలో గంధం ఎందుకు వాడతారు.





అభిషేకం చేసిన తర్వాత దేవునికి వస్త్రం, యజ్ఞోపవీతం, అక్షతలతో బాటు గంధాన్ని సమర్పిస్తాం. వస్త్ర, యజ్ఞోపవీతాలను స్వయంగా సమర్పించక పోయినప్పటికీ, మంత్రపూర్వకంగా సమర్పించడం ఆచారంగా కొనసాగుతోంది.
గంధాన్ని మాత్రం నియమం తప్పకుండా ప్రతిరోజూ సమర్పించుకోవాలి. పూజ ముగిసిన తర్వాత గంధాన్ని మెడకు భక్తిగా రాసుకుని, అక్షతలను తలపై జల్లుకోవడం సంప్రదాయం.
గంధం ఎంత సువాసనాభారితంగా ఉంటుందో మనందరికీ తెలుసు. గంధపు చెట్ల పరిమళాలకు తాచుపాములు సైతం ఆకర్షితమై వస్తాయి. అందుకే గంధపు చెట్లు, పున్నాగ చెట్లు, మొగలి పొదల దగ్గర జాగ్రత్తగా ఉండమని పెద్దలు హెచ్చరిస్తారు. ఆ సంగతి అలా ఉంచితే, మంచి గంధపు సువాసన మాటలకు అందని సంతోషాన్ని ఇస్తుంది. అంతే కాకుండా దయాగుణాన్ని ప్రసాదిస్తుందని శాస్త్రాలు చెప్తున్నాయి.
మనకు తెలిసి, తెలీకుండా మన మనసు ఎక్కడెక్కడో సంచరిస్తుంటుంది. ఆ చంచలత్వం నుండి తప్పించి, మనసును స్థిరంగా ఉంచుకోడానికే మనం పూజలు, ధ్యానాలు చేస్తాం. మనసులో చెలరేగే ఆలోచనలను నియంత్రించడానికి, కలతలు, కష్టాలూ ఏమైనా ఉంటే అరికట్టడానికి పూజలు దోహదపడతాయి. అందుకు గంధం తనదైన పాత్ర పోషిస్తూ సహకరిస్తుంది.
గంధంలో ఉండే దయ, సంస్కారం అనే మంచి వాసనలు, రాగద్వేషాలు అనే మలినాలను పోగొడతాయి. ఇతరత్రా మనలో పేరుకున్న కుసంస్కారాలను సైతం నశింపచేసి సంతోషం పాదుకునేలా చేస్తాయి. అలాగే, తోటివారి మీద ప్రేమ, దయ అంకురించేలా చేస్తాయి.
ఇంకొంచెం లోతుగా వెళ్తే పూర్వ కర్మల వాసనలను అంతమొందించి మళ్ళీ జన్మ ఉండకూడదు అని పూజించడానికి గంధం, అక్షతలు తోడ్పడతాయి.
గంధం మనసుకే కాదు, శరీరానికీ ఎంతో మేలు చేస్తుంది. అందుకే గంధాన్ని కేవలం పూజల్లోనే కాకుండా అనేక సందర్భాల్లో శరీరానికి రాసుకుంటాం.
గంధంతో శరీర ఛాయ పెరుగుతుంది.
గంధం సూక్ష్మక్రిములను నశింపచేస్తుంది.
గంధం వల్ల చర్మం పేలడం, పొక్కడం లాంటి ప్రతిచర్యలు చూపదు.
గంధంతో చర్మవ్యాధులెన్నో నివారణ అవుతాయి. స్కిన్ రాషెస్, స్కిన్ ఎలర్జీలే కాకుండా చర్మపై వచ్చిన మచ్చలు కూడా తగ్గుతాయి. దురదలు నివారింపబడతాయి.
పొరపాటున చర్మం ఏమైనా కాలితే, కొంచెం గంధం రాస్తే వెంటనే ప్రయోజనం ఉంటుంది.
గంధపుచెక్క లేదా గంధపు పొడిని పట్టు వస్త్రాల మధ్య ఉంచితే సువాసన రావడమే కాకుండా పాడవకుండా భద్రంగా ఉంటాయి. 

ఎవరు ముందు

 ఎవరు ముందు చెప్పినట్లు?


```స్ర్తీయొక్క మానసిక స్థితి ప్రభావం ఆమె గర్భంలోని పిండంపై పడుతుందనేది ఫ్రాయిడ్ చెప్పిన సిద్ధాంతం కదా!

          మరి ఈదేశంలో ఎప్పటినుంచో గర్భవతులు భక్తిగాథలూ వీరగాథలూ వినాలనీ చదవాలనీ ఎల్లపుడూ అందమైన ఆరోగ్యవంతమైన బిడ్డకోసం శ్రీరాముని చిత్రపటాన్ని చూస్తుండాలనీ స్మరించుకోవాలనీ..భయంకర వార్తలూ విషాదసంఘటనలకూ దూరంగా ఉండలనీ ఈ ఫ్రాయిడ్ చెప్పకముందునుండే ఎలా చెప్పేవారబ్బా?


బిగ్ బ్యాంగ్ థియరీ ఒక అగ్నిగోళం బ్రద్ధలయి శ్రుష్ఠి ఏర్పడిందని తేల్చింది కదా!

మరి మన దేశంలో అనామకుడు సైతం" బ్రహ్మాండం బద్దలయ్యిందనే "వేదజనిత శ్రుష్ఠి మూలం పలుకుతున్నాడెలా??


భూమి మీద ప్రక్రృతి ఏర్పడి దాదాపు 200కోట్ల సంవత్సరాలయిందని నేటి సైటింష్ఠులు చెబుతున్నారు కదా!

       మరి మన పురాణాలు చెప్పే కాలమానం ప్రకారం యుగాలు మహాయుగాలూ మన్వంతరాలూ సంధికాలం లను లెక్కేస్తే...మనం శ్వేతవరాహ కల్పంలో 28 వ మహాయుగంలో కలియుగంలో ఉన్నామని ప్రస్తుత సంవత్సరం ...అంటే 2017 నాటికి 197,29,49,119 సంవత్సరాలు అవుతోంది...మరి సైంటిస్టుల కాలగణనతో సరిపోతోందెలా??


బిగ్ బేంగ్ జరిగి విడిపోయిన పదార్థం వల్ల సృష్టి ఏర్పడిందని అది తిరిగి కేంద్రం వల్ల ఆకర్షింపబడి పదార్థం ఏర్పడటం వల్ల సృష్ఠి నశించి శూన్యం అవుతుందనీ అది తిరిగి మళ్ళీ బ్రద్దలయి సృష్ఠి మొదలవుతుందని ఇలా జరుగుతునే ఉంటుందని నేటి సైన్స్ చెప్పిన విశ్వముఖులిత సూత్రం కదా!

       మరి వేదసారమైన భగవద్గీత లో చెప్పబడిందేంటి?కల్పాంతమందు సకల ప్రాణులూ తనయందు లీనమవుతాయని మళ్ళీ కల్పకం ఆరంభంలో అన్నీ తననుండి పుట్టుకొస్తాయని భగవానుడు చెప్పినట్లు ఉందెలా??


ప్రతీ చర్యకూ సమాన స్థాయిలో ప్రతిచర్య ఉంటుందనేది న్యూటన్ చెప్పిన సూత్రం కదా!

    మరి వేల సంవత్సరాలనుండి భారతదేశంలో వినిపించే కర్మసిద్ధాంతం చెప్పేది ఏంటి?? ఎవరు ముందు చెప్పినట్లు?


తొలివిమాన నిర్మాణం చేసిన మేధావులు రైట్ సోదరులు కదా!

      అంతకుముందునుండే భారతీయులకు ఉన్న విమానశాస్ర్తాన్ని కూడా కాస్త పక్కనపెడదాం..రైట్ సోదరుల కంటే ముందు శివరాం బాపూజీ తళ్పాడే అనే పండితుడు మన పురాతన గ్రంధాల ఆధారంగా తయారుచేసిన "మరుత్సబి"గాలిలో ఎగిరింది కదా..మధ్యలో ఆగిపోయిన ఆవిమాన ప్లాన్ ని ఈయన వారసులు ఓ ఆంగ్లేయ కంపెనికీ అమ్మినట్లు తెలుస్తోంది...మరి అది ఏమైనట్లో...ఆ ప్రస్తావనే తేదెందుకు ఈ ప్రపంచం...


మొక్కలకు ఫీలింగ్స్ ప్రాణం ఉన్నాయని నిరూపించింది మన  దేశీయుడైన శాస్ర్తవేత్త జగదీశ్ చంద్రబోస్ కదా!

   మరి ముందు ఈ విషయం మనవారికి తెలియదా?మన గ్రంధాలలో వృక్షాల భావాల ప్రస్తావనలు లెక్కలేనన్ని ఉన్నాయే...మన ఋషులు మొక్కలను ప్రార్థించే దర్బలను సేకరించేవారు(భాధ పెడుతున్నందుకు క్షమించమని)..మరి వారికి ఈ విషయాలు తెలియదనే అనుకుందామా...


పెద్దపెద్ద వృక్షాలయే మొక్కల్ని రూపలక్షణాలు మారకుండా కుండీలలో చిన్నమొక్కలుగా పెంచే ప్రక్రియ"బోన్సాయ్"నేటి విజ్ఞాన శాస్త్రం కదా!

     మరి భారతీయ ప్రాచీన ఆయుర్వేద ఋషి చరకుడు తన చరకసంహిత గ్రంథంలో "వామన తను వృక్ష్యాది విద్య"అను ప్రకరణంలో వైద్యానికి ఉపయోగించే పెద్దవృక్షాలను గుణం చెడకుండా చిన్నమొక్కలుగా పెంచే ఈ విధానాన్నే తెలిపాడెలా??


సముద్రగర్భంలో అగ్నిపర్వాతాలు ఉన్నట్లు మనం ఈమధ్య గమనించినట్లు చెప్పుకుంటాం కదా!

      మరి మన పురాణాలకాలం వారికి ఈ "బడభాగ్ని"గురించి ఎలా తెలిసిందబ్బా...


లోహవిజ్ఞానంలో నేటిమనం చాలా అడ్వాన్స్ గా ఉన్నమని చెబుతాం కదా!

      మరి ప్రాచీన భారతీయులు ఢిల్లీలో నిర్మించిన ఇనుప స్తంభం ఇప్పటికీ తుప్పు పట్టకుండా నిలిచి ఉంటే దానికి పోటిగా ఆధునికులు నిర్మించిన ఇనుప స్తంభం తుప్పుపట్టి కనిపిస్తుందెలా??


నిర్మాణ రంగంలో ఆధునికులు చాలా ముందున్నాం అని చెప్పుకుంటాం కదా!

       మరి వేల సంవత్సరాల నాటి ఆలయాలు కోటలూ ఇప్పటికీ నిలచి ఉంటే గత 500సం లోపు నిర్మాణాలు నిలబడుటలేదేమి?

గోల్కొండకోటలోని శబ్ధప్రసారపద్దతి వివిధ దేవాలయాలోని సంగీతం పలికే స్తంభాలూ శివాలయంలో లింగంపై చెక్కుచదరని నీడ పడే నిర్మాణాలూ.....వీటన్నిటికీ ప్రాచీన భారతీయులకు నేటి ప్రపంచం ఇచ్చే సమాధానమేంటి??


అణువు పరమాణువు గురించి వాటిలోని శక్తి గురించి ఆధునికులకు మాత్రమే తెలుసు కదా!

      మరి భారతీయ గ్రంధాలు తిరగేస్తే పరమాణువుల గురించి "వైషేశిక సూత్రం"అంటూ ఓ గ్రంధమే కనిపిస్తుందే...దీనిని రాసిన కశ్యపుడను ఋషికి కణాల వివరణ చెప్పిన కారణంగా కణాదమహర్షి అను పేరువచ్చినట్లు తెలుస్తోంది....ఎవరు ముందు చెప్పినట్లు??


మెండలీఫ్ ఆవర్తన పట్టికలో పాదరసం,బంగారం పక్కపక్కన చూపించేవరకూ పాదరసం నుండి బంగారం చేయవచ్చని మనకు తెలియదు కదా!

        మరి వీటి గురించి తెలీకుండానే మన పూర్వీకులు ఈపని ఎలా చేశారు...ఈ పని చేసేవారిని "రసవాదులు"అనికూడా పేరెట్టి పిలిచారే.....


సూర్యుడు ఓ నక్షత్రమనీ చాలా నక్షత్రాలలో సూర్యుడు కూడా ఒకడు మాత్రమేనని మన నేటి శాస్రజ్ఞుల విజ్ఞానం కదా!

     మరి మన పూర్వీకులకు ఇది తెలియకుండానే అరుణ మంత్రంలో "సప్తదిశో నానా సూర్యాః"అని చెప్పారనుకుందామా??


భూమినుండి విడివడిన కొంతభాగమే చంద్రుడనీ ఆ భాగం విడివడిన చోటు పసిఫిక్ మహా సముద్రం ఏర్పడిందనీ శాస్ర్తవేత్తల పరిశీలన కదా!

       విజ్ఞానాన్ని కథలుగా చెప్పే సంస్కృతి గల మన దేశ పూర్వులు చెప్పిన సాగరమధనం కథ ద్వారా బాగా గమనిస్తే తెలిసేదేంటి?పాల సముద్రం నుండి చంద్రుడు పైకెగసినట్లు చెప్పారే...


ప్రపంచం నేడు చదువుతున్న చరిత్ర ప్రకారం గ్రహణం గురించి మొదటగా చెప్పింది చైనావారని చెప్తున్నారు కదా!(2137 క్రీ.పూ)

అంతకు పూర్వం వాడైన అత్రిమహాముని చరిత్రకు పనికిరానివాడెలా అయ్యాడు?ఆయన తయారు చేసిన "తురీయ బ్రహ్మ"అనే టెలిస్కోప్ సహాయంతో మొదటగా గ్రహణం పరిశీలించాడే(ఋగ్వేదం 5వమండలం 40-6 మంత్రం)

ఈ విషయం మన గ్రంధాలలో అనేక చోట్ల కనిపిస్తోందని శ్రీ బాలగంగాధర్ తిలక్ తేల్చారు కూడా.....


ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఎన్నెన్నో....మనకు జరిగిన అన్యాయం వర్ణించలేనిది...రాతి యగంలో వేదాలు రాసిన వారికి అంత జ్ఞానం ఉండదని విదేశీయులు నేర్పిన చిలకపలుకులు నేటికీ వల్లే వేసే బానిస మనస్కులు తెలుసుకోవలసిందీ ఒకటుంది...రాతియుగం పరాయి పాలన...అంతకుముందంతా రత్నయుగమేనని...


ప్రపంచం కళ్ళు తెరవక ముందే మనం చిరునవ్వు నవ్వాం, 

ఆటలాడి పాటలు పాడాం..```


*ఇప్పుడు చెప్పండి.. ఎవరు చెప్పినట్లు ముందు ఈలోకానికి లౌక్యం..?*

   

    తల్లీ భారతి నీకు శతకోటి వందనాలమ్మ నీకడుపున పుట్టే భాగ్యాన్ని నాకు ప్రసాదించినందుకు...👏🙏👏

దేవం






 

ప్రాచీన విజ్ఞానం


 

జ్యోతి

 


*సంధ్యా దీప దర్శన శ్లోకం*


*దీపం జ్యోతి పరబ్రహ్మ దీపం సర్వతమోపహమ్ |*

*దీపేన సాధ్యతే సర్వం సంధ్యా దీపం నమో‌உస్తుతే ||*


*భగవంతుడు జ్యోతి


స్వరూపుడు కనుక దీపాన్ని ఆరాధిస్తే అజ్ఞానం తొలగడమే కాక సర్వ శుభాలూ కలుగుతాయి.*


🪔🌷🪔🌷🪔🌷🪔🌷🪔

మహాభారతము ' ...55 .

 మహాభారతము ' ...55 . 


నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమమ్ /

దేవీం సరస్వతీమ్ వ్యాసం( చైవ ) తతో జయముదీరయేత్.//


సభా పర్వం..


కర్ణుడు పాండవులపట్ల, ద్రౌపదిపట్ల  ఏహ్యభావం కలిగించుకుని, దుర్యోధనునికి దగ్గరై, ' దుష్ట చతుష్టయం ' లో ఒకడిగా చోటు సంపాదించుకున్నాడు.    అందులో భాగంగానే, ద్రౌపదీ వస్త్రాపహరణంచేయ్యమని, దుశ్శాసనుని పురమాయించాడు.     అసలేకోతి, మద్యం సేవించింది అన్న చందాన,  అట్టి సలహావిన్న దుశ్శాసనుడు, వెంటనే ద్రౌపది వస్త్రాన్ని లాగడానికి కార్యోన్ముఖుడయ్యాడు.  


ఈ హఠాత్పరిమాణానికి  చిగురుటాకులా వణికిపోయింది ద్రౌపది.   వెంటనే, భర్తలవైపు చూసింది.  ఒక్కడూ తనను ఆదుకునే ప్రయత్నం చెయ్యలేదు, సరికదా, అట్టి జుగుప్సాకర సన్నివేశం చూడలేము అన్నట్లు తలలువంచి కూర్చున్నారు.    వారే కాదు,  సభలో అధికభాగం అందరిదీ అదేపరిస్థితి.  


ఇక తనకు శ్రీహరే దిక్కని ద్రౌపది నిశ్చయించుకుంది.  బాల్యంలో  తనకు గురూపదేశం చేస్తూ వశిస్తులవారు,  ఆపదకాలంలో హరిని స్మరించుకొమ్మని చెప్పిన గురువాక్యం గుర్తుకు తెచ్చుకున్నది.  అంతే ! సంపూర్ణ శరణాగతితో, సర్వస్వమూ మరచి, చేతులు పైకెత్తి జోడించి,  తన మానావమానాలు చూసుకునే బాధ్యత ఆ హరిదే అన్నట్లు,  బిక్కచచ్చి  ' హే కృష్ణా !  గోవిందా !! '  అని యెలుగెత్తి పిలుస్తూనే వున్నది.  


       ఆపత్స్యభయదం కృష్ణం లోకానాం ప్రపితామహం /

       గోవిందా ద్వారకావాసిన్ కృష్ణ గోపీజనప్రియ //


       కౌరవై : పరిభూతానాం మాం కిం న జానాసి కేశవ 

       హే నాథ హే రమానాధ వ్రజనాధ ఆర్తినాశనా 

        కౌరవార్ణవ మ  గనాo  మాముద్ధరస్య జనార్దన// 


       కృష్ణ కృష్ణ మహాయోగిన్ విశ్వాత్మన్ విశ్వభావన 

       ప్రసన్నాం పాహి గోవిందా కురుమధ్యే <వసీదతీమ్ //


'హే కృష్ణా ! గోవిందా !! క్లిష్ట పరిస్థితిలో వున్నాను.  యెవరికీ రాకూడని ఆపదలో వున్నాను.  కౌరవులు నన్ను అవమానిస్తున్నారు.   నీకు కనబడడం లేదా కేశవా !  కౌరవసముద్రంలో పడి మునిగిపోతున్న నన్ను ఉద్ధరించవా యోగులకే యోగివైన మహాయోగీ !  నన్ను రక్షించు తండ్రీ !   నీవే తప్ప ఇత:పరంబెరుగ ' అని గజేంద్రమోక్షఘట్టంలో గజరాజు యెలుగెత్తి పిల్చినట్లుగా,  ఆ అయోనిజ,  యజ్ఞసంభూత, కృష్ణ నామధేయ, ద్రౌపది  శ్రీకృష్ణుని పిలుస్తుంటే, దిక్కులు కంపించ సాగాయి.  సప్తసముద్రాల ఘోష సభికుల గుండెల్లో హోరెత్తింది. అతిరధ మహారథులవంటి పెద్దలంతా కూర్చున్న సింహాసనాలు వూగుతున్న అనుభూతి కలిగింది.  


ఆమె ఆర్తనాదం విన్న శ్రీకృష్ణుడు,  తన సోదరి కృష్ణ,  మానం కాపాడడానికి, యెవరికీ కనబడకుండా, ఊర్ధ్వ దిశనుండి, దక్షిణహస్తం పైకెత్తి అభయముద్రలో, వస్త్రదానం చేయసాగాడు.  ఆమెకట్టుకున్న వస్త్రం  ఆమె శరీరానికి అంటిపెట్టుకునే వున్నది. దుశ్శాసనుడు తనచేతిలో వుంచుకుని లాగుతున్న చీరఅంచును  అనుకుని అసంఖ్యాకమైన చీరలు పుంఖానుపుంఖాలుగా వస్తూనే వున్నవి.  చీరెలరాసులు అక్కడ పోగవుతున్నది.  ద్రౌపదీమాత వంటినున్న వస్త్రం మాత్రం చెక్కు చెదరక అలానే వున్నది.  దుశ్శాసనుడు యిక తన పైశాచికకృత్యం చెయ్యలేక,అలసిపోయి, చెమటలు గ్రక్కుతూ, అవమానభారంతో, సభామధ్యంలో చతికిలబడిపోయాడు.  


ఆ నల్లనయ్య, గోపికామానసచోరుడు, గోపెమ్మల వస్త్రాలను దొంగిలించి ముక్తిమార్గం చూపిన ఆ శ్రీకృష్ణపరమాత్మ, తనకు చీరలు దొంగిలించడమేకాదు, ఆపదసమయంలో,   స్త్రీల మానం కాపాడేవస్త్రాలు అశేషంగా యివ్వడమూ తెలుసు అన్నట్లు, చిరునవ్వుతో, దుశ్శాసనుని కుప్పిగంతులు చూస్తూ, ద్రౌపదికి అభయప్రదాత అయ్యాడు. 


సభలో యిదంతా చూసి సభికులందరూ ఆశ్చర్యానందాలతో పులకించి పోయారు.  ఆసమయంలో, భీమసేనుడు క్రోధంతో యెర్రబడిన నేత్రాలతో,   ముక్కుపుటాలు అదురుతుండగా, లేచినిలబడ్డాడు. కుడిపిడికిలి బిగించి  ' ఓ సభాసదులరా !పెద్దలారా !  నా ప్రతిజ్ఞ వినండి.  ఈ విధంగా గతంలో ఎవరూ ప్రతిజ్ఞ చేసివుండరు.  ఇక ముందు  చెయ్యవలసిన అవసరం రాకుండుగాక!  చతుస్సాగర పర్యంతమైన యీ భారతదేశంలో, భరతవంశంలో పుట్టి,  కళంకమైన కృత్యం చేసిన యీ దుశ్శాసనుని,  రాబోయే యుద్ధంలో, నా ముష్టిఘాతాలతో క్రింద పడవైచి, లోకభీకరంగా వధించి, వాడి వక్షస్తలం పగులగొట్టి, గుండెలు చీల్చి  అందునుండివచ్చే వేడివేడి రక్తాన్ని చుక్క మిగలకుండా పీల్చేస్తాను.  ఈ ప్రతిజ్ఞ నేను నెరవేర్చలేకపోతే, నా పితృదేవతల శాపానికి నేను గురి అగుదును గాక ! '  అని శపథం చేశాడు.  


ఇంతజరిగినా కర్ణునికి బుద్ధిరాలేదు.  అతను దుశ్శాసనుని వైపుచూసి, '  ఈమె నీదాసి, ద్రౌపదిని మీయింటికి తీసుకునిపో ! ' అన్నాడు.  ఆమాట అనగానే, అప్పటిదాకా సిగ్గుతో కూలబడి వున్న దుశ్శాసనుడు మళ్ళీలేచి ఆమె దగ్గరకు రాబోయాడు.   మళ్ళీ ద్రౌపది తనకు న్యాయం చెయ్యమని సభలో అందరినీ ప్రార్ధించింది.  


అందరూ మౌనంగావుంటే దుర్యోధనుడు రెచ్చిపోయి ' ద్రౌపదీ !  యెందుకు మాటిమాటికీ ధర్మం చెప్పమని సభికులను అడుగుతావు.  నీ అయిదుగురుభర్తలూ యిక్కడే వున్నారు కదా !  వారినే చెప్పమను.  ఒకవేళ నీభర్త ధర్మరాజు, నీవు పందెంలో ఓడిపోలేదని చెబితే, నీకు యిప్పుడే స్వేచ్ఛ ప్రసాదిస్తాను.  చెప్పమను ధర్మజుని. ' అని రెట్టించాడు.  


అప్పుడు భీమసేనుడు, '  ఈ ధర్మజుడు, తాను ఓడిపోకముందే నన్ను ఓడాడు. అలాకాకున్న, యీపాటికి యీసభను స్మశానవాటికను చేసేవాడిని. '  అని లేవపోతుండగా, భీష్మ ద్రోణ విదురులు అతనిని అడ్డుకున్నారు. 


మళ్ళీ వాతావరణం కౌరవులకు అనుకూలం కాగానే, ' ద్రౌపదీ ! యీ పాండవులకు నీపై యే అధికారం లేదు.  కౌరవులు నీ ప్రభువులు.  వారిలో, నిన్ను జూదంలో వొడ్దని వారిని యెవరినైనా, పతిగా యెంచుకో. సుఖపడు.' అని కర్ణుడు వికృతసంభాషణ మొదలుపెట్టాడు.


ఆ సమయంలో,  దుర్యోధనుడు ,  కర్ణుని కనుసైగచూసి,  ' ధర్మజా !  నీవే చెప్పు చివరిసారిగా అడుగుతున్నాను. ద్రౌపది జూదంలో   ఓడబడినదా, లేదా ? '  అని ద్రౌపది వైపు  కుటిలదృష్టితో చూస్తూ, చిరునవ్వుతో,  తనతొడపై వున్నవస్త్రాన్ని, ప్రక్కకు తొలగించి, తన యెడమతొడను ద్రౌపదికి చూపించాడు.    


అది గమనించిన భీమసేనుడు తిరిగి రోషభూయిష్ఠుడైనాడు .  దుర్యోధనుని తీక్షణంగా చూస్తూ, సభికులందరకూ వినబడేటట్లుగా, ' దుర్యోధనా !  నీవు చేసిన ఈ పైశాచిక సైగకు ప్రతిగా, నిన్ను యుద్ధంలో ఓడించి, నా గదతో, నీ తొడను విరుగకొట్టక పోయినచో నేను భీమసేనుడనే కాదు.  '  అని మరియొక శపథం చేశాడు.  


ఇంత జరుగుతుండగా, ప్రకృతికూడా విలయతాండవం చేసింది.  నక్కలు ఊళ వేశాయి.  గాడిదలు భయంకరంగా ఓండ్ర పెట్టాయి.  గ్రద్దలు సభామధ్యం లోనికి వచ్చి వికృత ధ్వనులు చేశాయి.  విదురుని ద్వారా, ఈ అపశకునాలు తెలుసుకున్న ధృతరాష్ట్రుడు, మొదటిసారిగా నోరువిప్పాడు. '  ఓరీ దుష్టుడా !దుర్యోధనా !  నీవు గెలిచినా ఓడినవాడితో సమానము.  మన యింటికోడలిని, కులస్తీని, ఇందరు ధర్మాత్ముల ముందు నిండు సభలో దుర్భాషలాడతావా ? ' అని దుర్యోధనుని అభిశంసించి, ద్రౌపదివైపు తిరిగి,

' అమ్మా !  ద్రౌపదీ !   నా కోడళ్లందరిలోకీ నీవు శ్రేష్ఠురాలవు.  జరిగినదానికి మమ్ము మన్నించు.   దీనికి ప్రాయశ్చిత్తంగా,  నీకు వరం ప్రసాదిస్తాను.  ఏమి కావాలో కోరుకో !'  అన్నాడు, యింటిపెద్దగా. 


వెంటనే ద్రౌపది, ' మహారాజా !  ధర్మమేసూత్రంగా జీవనయాత్ర సాగించే ధర్మరాజుకు బంధవిముక్తి కలిగించండి ' అని అడిగింది.  అట్లే అని,  ఆమె కోరికకు సంతోషించి, మరియొక వరం కోరు కొమ్మన్నాడు ధృతరాష్ట్రుడు.   ' రెండోవరంగా భీమార్జున నకుల సహదేవులను వారివారి అస్త్ర శస్త్రాలతో రధాలతో కూడి, దాస్యవిముక్తి కలిగించండి. ' అని కోరుకున్నది.  


రెండోవరం కూడా అనుగ్రహించి, ధృతరాష్ట్రుడు, ' ద్రౌపదీ ! నాకు యింకా సంతృప్తిగా లేదు.  మూడవవరం యేదైనా కోరుకో !  నీ గురించి నువ్వేమీ కోరుకోలేదు. ' అన్నాడు.   అయితే ద్రౌపది వినయంగా తిరస్కరించి, ' మహారాజా !  వైశ్యునకు ఒకకోరిక కోరే అర్హత మాత్రమే ఉంటుంది.  క్షత్రియులు రెండుకోరికలు కోరవచ్చు.  ఇక మూడువరాలు కోరుకునే అధికారం బ్రాహ్మణులకు మాత్రమే వున్నది.  మీకు తెలియనిధర్మాలు కావు కదా !' అన్నది.


ద్రౌపది మాటలకూ యెంతో సంతోషించి, ధృతరాష్ట్రుడు,  వారు జూదంలో ఓడిన రాజ్యంతోపాటు, వారిసంపదలు కూడా తిరిగి యిచ్చేయమని దుర్యోధనుని ఆదేశించాడు.   ఆ తరువాత ధర్మరాజుతో , ' ధర్మజా !  నీవు యెంతో శాంతమూర్తివి.  ధర్మమూర్తివి.  వినయవిధేయతలు నీకు పెట్టని ఆభరణాలు.   జరిగినదానిని మనసులో పెట్టుకోకు.  నేను అంధుడిని. గాంధారి నీ పెదతల్లి.  మమ్ములను దృష్టిలో పెట్టుకుని,  నీ తమ్ములను  దుర్యోధనాదులను క్షమింపు. ' అని ప్రాధేయపూర్వకంగా అన్నాడు.


పాండవులు ద్రౌపదితో సహా మళ్ళీ ఇంద్రప్రస్థం వెళ్లిపోయారు.  

       

స్వ స్తి.

వ్యాసానుగ్రహంతో మరికొంత రేపు తెలుసుకుందాం.


తీర్థాల రవి శర్మ

9989692844

విశ్వ వ్యాప్త పిరమిడ్ ధ్యాన మందిరం. హిందూపురం.

అమ్మ





















 

వీరాంజనేయుడు






*శ్రీ కుబేర వీరాంజనేయుడు:*


శ్రీ రామునికి పరమదాస భక్తుడైన వీరాంజనేయుని లీలా అద్భుతాలు

అనేకం. మాటలతో వర్ణించలేము. 


శ్రీ రామనామం జపించే భక్తులకు సదా సర్వకాలం తోడుగా వుంటూ వారి కష్టాలు తీర్చడం లో హనుమంతుని మించి వేరు దైవం లేదు. 

అంజనాదేవి పుత్రుడైన 

ఆంజనేయస్వామి , యీ భూలోకంలో అనేక 

భంగిమల్లో అనేక ప్రదేశాల్లో అవతరించి రామ భక్తుల హృదయాల్లో కొలువై వున్నాడు. అలా అవతరించిన స్ధలాలలో

రాణీపేట జిల్లాలో వాలాజీ పేటకు నాలుగు దిశలలోను కొలువై కటాక్షిస్తున్నాడు. 


ఇందులో నగరానికి ఉత్తర దిక్కున శ్రీ కామాక్షి పురంలో దర్శనం అనుగ్రహిస్తున్న హనుమంతుని ఆలయం 

ప్రసిద్ధి చెందినది. 


 ఆలయంలో కుబేర దిశలో కొలువై వున్నందున శ్రీ కుబేర

వీరాంజనేయునిగా పిలువబడుతున్నాడు. 


ప్రాచీనకాలంలో అగస్త్య మహర్షి స్ధాపించిన శివాలయం కూడా ఇక్కడ వుండడం ఒక విశేషం.

చాలా కాలం క్రితం ఈ ప్రాంత ప్రజలు పేరు తెలియని వ్యాధితో తీవ్రంగా బాధింపబడినారు. 


ఆ సమయంలో ఆర్కాడు ప్రాంత ప్రముఖులకు

ఒక విషయం తట్టినది. 

వారి ఆలోచనల ప్రకారం ,

వాలాజాపేటకి నాలుగు దిక్కులలోను నాలుగు

ఆంజనేయ స్వామి విగ్రహాలు ప్రతిష్టించి

పూజలు ప్రారంభించారు.

ఆ తరువాత ఆ వ్యాధి పూర్తిగా నిర్మూలమైనది. ఈనాటికీ

గ్రామస్థులు యీ విషయం

తలుచుకుంటూ వుంటారు. 


సుమారు వేయి సంవత్సరాల ప్రాచీనమైన

యీ ఆంజనేయుని విగ్రహం భూమిలో నుండి లభించినది. ఎడమచేయి నడుమున,

గదాయుధం పట్టు కొన్న

కుడిచేయి పైకెత్తి ఆకాశం వైపు చూస్తున్న

భంగిమలో దర్శనం ప్రసాదిస్తున్నాడు. 

విగ్రహం క్రిందవైపు శ్రీ రాముని పాదాలు కనిపిస్తాయి. ఆంజనేయుని

వాలం శిరస్సు పైకి చుట్టుకుని వుండగా, వాలమునకు ఒక గంట వుంటుంది. ఇటువంటి

విగ్రహాలను మధ్వాచార్యుల వారు

స్ధాపించినట్లు చెప్తారు.


ఇది ఉత్తరముఖ ఆలయం.

ఎదురుగుండా విజయనగర రాజులు తవ్వించిన పుష్కరిణి వున్నది. రాహు ,కేతువు, 

కాళింగ నర్తన కృష్ణుని

విగ్రహాలు ప్రతిష్టించబడి వున్నవి. ఈ విగ్రహాలను

పూజించిన రాహు కేతు

సర్పదోషాలు తొలగిపోతాయని విశ్వాసం.


కంచి మహా పెరియవరు తనను దర్శింపవచ్చిన వారికి హనుమంతుని 

పూజించమని , 

శ్రీరామ జయం లిఖించి జపించమని బోధించేవారు. 


ఆయన బోధనలతో భక్తులు 1008 సార్లు వారి వారి

భాషలలో శ్రీ రామజయం వ్రాసి ఈ ఆలయానికి పంపిస్తున్నారు. వాటిని స్వామి పాదాలపై వుంచుతారు.

ఈ ఆలయం

పునరుద్ధరణకి శ్రీరామ నామం ముద్రించిన ఒక లక్షా 

పదివేల ఇటుకలు ఉపయెగించడం విశిష్టమైనది. 


ఆంజనేయుని దర్శించిన

భక్తులకు సర్వ శుభాలు లభిస్తాయి.


తమిళనాడు రాణీపేట జిల్లా ,వాలాజీ పేటలో 

బి.డి.ఓ ఆఫీస్ వెనుక వున్న కామాక్షి పురంలో

శ్రీ కుబేర వీరాంజనేయ స్వామి ఆలయం వున్నది.

గానం







 

Nagamani konda


 

బాలాంబికాం భజరేరే మానస

 బాలాంబికాం భజరేరే మానస


మానసదౌర్బల్యవారిణీం అక్షమలాధారిణీం ||అంబ||


1) శ్రీలలితాంబికాత్మజశ్రీవిద్యబీజాత్మికాం 


   అరుణారుణవర్ణకల్హారాసనాసీనాం 


   త్రింశత్భండాసురపుత్రసంహారిణీం 

   

   మమ హృదయ వసతు మే సతతం ||



2) సకలజీవనాధారముఖ్యప్రాణస్వరూపిణీం  


   సకలపీఠాంతరస్థితసర్వాభిచారదోషభంజనీం 


   స్వర్ణకవచావిర్భావసకలభువనైకపాలినీం 


   మమ హృదయ వసతు మే సతతం ||

శ్రీ కామాక్ష్యంబాష్టకం

 శ్రీ కామాక్ష్యంబాష్టకం 

1) నక్షత్రగ్రహమండలాధిపత్యరవీంద్వగ్నితేజోమయరూపిణీం 

   ఏకామ్రేశ్వరహృదయకమలమధ్యస్థితముఖ్యప్రాణరూపిణీం  

   ప్రముఖమూకకవీశ్వరభావనామయజగద్రచనాసృష్టికారిణీం 

   కామాక్షీం పరశివాం భగవతీం కాంచీపురవాసినీం ||


2) సాంద్రానందకరుణాపూరితకలుషవిదూరకమలలోచనీం 

    పావనతులసీబిల్వమందారాదిపుష్పమాలాలంకృతాం

   మాతంగముఖశరవణభవసేవితపల్లవచరణకమలాం 

   కామాక్షీం పరశివాం భగవతీం కాంచీపురవాసినీం ||





3) త్రిబీజాత్మకత్రయీరాధితత్రిగుణాతీతతత్త్వాత్మికాం 

   శ్యామశాస్త్రిసంతతకీర్తితకోమలపర్వతరాజనందినీం 

   శ్రీఆదిశంకరాచార్యార్చితశ్రీకామకోటిపీఠాధిష్టాత్రీం  

   కామాక్షీం పరశివాం భగవతీం కాంచీపురవాసినీం ||


4) సత్సంతానసౌభాగ్యప్రదాయకజగన్మాతృకారుపిణీం 

   ఉద్యోగవ్యాపారాభివృద్ధిదాయకశుభమంగళచండికాం   

   సకలశతృబాధానివారకసర్వరక్షాకరసింహవాహినీం 

   కామాక్షీం పరశివాం భగవతీం కాంచీపురవాసినీం ||







5) తపోనిష్ఠాగరిష్ఠధ్యానసమాధిస్థితశ్రీచంద్రశేఖరభారతీరూపిణీం   

   సంగీతనృత్యతాళవాద్యబృందపరివృతలాస్యానందరూపిణీం

   నానావిధరత్నాభరణభూషితఅరుణవర్ణాంబరధారిణీం 

   కామాక్షీం పరశివాం భగవతీం కాంచీపురవాసినీం ||


6) రమావాణీసంతతసేవితమృదుమందస్మితవదనాంభోరుహాం 

   పవిత్రప్రదోషసమయసదాశివసహసుందరనాట్యకేళీవిలాసినీం 

   మోహాంధకారహరణమహాదుర్గతివారణకాలకాలకుటుంబినీం

   కామాక్షీం పరశివాం భగవతీం కాంచీపురవాసినీం ||







7) శ్రీసదాశివలింగార్చితతపోమయజ్వలామాలినీం 

    పరమేష్ఠీమహేంద్రాదిసురసేవితసూక్ష్మశరీరిణీం 

    వేదవేదాంగరక్షణదీక్షాదక్షసత్సాంప్రదాయేశ్వరీం 

    కామాక్షీం పరశివాం భగవతీం కాంచీపురవాసినీం ||


8) చందనహరిద్రాకుంకుమద్రవదిగ్ధాంగకామేశ్వరమనఃప్రియాం 

   భక్తజనమోక్షానందప్రదాయకఅమృతకిరణస్వరూపిణీం 

   శమదమాదిషట్కసంపత్తిప్రదఆత్మానాత్మవివేకదాయినీం 

   కామాక్షీం పరశివాం భగవతీం కాంచీపురవాసినీం ||


    సర్వం శ్రీకామాక్షీపరాంబాదివ్యచరణారవిందార్పణమస్తు

జ్ఞానవైరాగ్యస్థిత్యర్థం

 *జ్ఞానవైరాగ్యస్థిత్యర్థం బిక్షం దేహిచ పార్వతి*


అమ్మవారి దగ్గరికి వెళ్లి స్వతంత్రంగా అడగాలి, అమ్మా ఉట్టి అన్నం కాదు, దాని వల్ల జ్ఞానం, వైరాగ్యం ఇవ్వు అని, శంకరులు అంతటా వారు ఎందుకు ఆవిడని అడగాలి అని చెప్పారు? ఆవిడ *ఆబ్రహ్మాకీటజనని* బ్రహ్మగారు మొదలుకొని కీటకం వరకు ఉన్న జీవులకు తల్లి కనుక, అనుకున్న వాడికి కాదు తల్లి, సమస్త జగమ్ములకు ఆవిడే అమ్మ. ఆవిడ అనుగ్రహిస్తే ఏది సత్యమో దాని వైపుతిప్పుతుంది, దేనిపై రాగం ఏర్పడాలో అటువైపు వైరాగ్యాన్ని కనిగిస్తుంది. వారికి నివేదించిన అన్నాన్ని ప్రసాద బుద్ధితో తీసుకుంటే, సత్వగుణం అలవడుతుంది.

సాదరనంగా కూడా మనం తినే ఆహారమే మన మనస్సుని, ఆలోచలనల్ని, కర్మలను ప్రభావితం చేస్తుంది, అందుకే మన పెద్దలు ఆహార విషయంలో చాలా నియమాలు చెపుతారు.


*అమ్మదయ వుంటే అన్నీ ఉన్నట్లే*

నవదుర్గలు -- ఆధ్యాత్మిక విశిష్టతలు:-

 నవదుర్గలు -- ఆధ్యాత్మిక విశిష్టతలు:-


1. శైలపుత్రి:-  ఆధ్యాత్మిక సాధన మనలో ఉన్న అజ్ఞానాన్ని తొలగించును అని తెలియజేసేదే  ''శైలపుత్రి''.


2.  బ్రహ్మచారిణి:-  నిరంతరం బ్రహ్మ తత్వంతో (శూన్యంతో),  మూలాత్మతో అనుసంధానం అయి ఉండమని తెలియజేసేదే "బ్రహ్మచారిణి" తత్వం.


3. చంద్రఘంట:-  ఎవరైతే మనస్సు నియంత్రణ కలిగి ఉంటారో వారికి  'త్రినేత్ర దృష్టి' ప్రాప్తిస్తుంది అని తెలియచేసే తత్వమే  "చంద్రఘంట".


4. కూష్మాండ:-  విశ్వంలోని అన్ని చీకట్లను తొలగించి వెలుగును ప్రసాదించే మార్గాన్ని అందించే తత్వమే  "కూష్మాండ".


5. స్కంద మాత:-  సాధకులు తమలోని అరిషడ్వర్గాలను జయించాలి అని తెలియచేసే తత్వమే "స్కందమాత".


6. కాత్యాయని:-  తమ ఆధ్యాత్మిక ప్రయాణంలో త్రిగుణాలకు (సత్వ, రజో, తమో గుణాలకు) అతీతంగా సాధన చేయాలి అని తెలియజేసేదే  "కాత్యాయని".


7. కాళరాత్రి:-  ప్రతి అంతం... ఒక నవ ఆరంభానికి సంకేతం అని తెలియజేసేదే  "కాళరాత్రి".


8. మహాగౌరీ:- మన ఆత్మ సాధన (ధ్యానం) మహా పాపాలను కూడా హరిస్తుంది అని తెలియజేసేదే  "మహాగౌరీ".


9. సిద్దిధాత్రి:-  ఆధ్యాత్మికత సర్వసిద్ధులను కలుగచేయును అని తెలియజేసే తత్వమే  "సిద్ధిధాత్రి".

పట్టుదల

 పట్టుదల


జయంకొండ అనే పల్లెటూరు పచ్చని పొలాలలో, పైరు పంటలతో చాలా అందంగా, చూడముచ్చటగా ఉండేది. ఆ పల్లెలో రవి అనే‌ పేద పిల్లవాడొకడు, 10వ తరగతి చదువుతూ ఉండేవాడు. అతనికి చిన్నప్పటి నుండి తెలివితేటలు, ఆలోచనా శక్తి, పట్టుదల చాలా ఎక్కువ. కొత్తగా ఏదో చేయాలని తపన, చదువంటే ఆసక్తి, శ్రద్ధ ఉండేవి. కానీ వాళ్ళ ఆర్థిక పరిస్థితి మాత్రం చాలా కష్టంగా ఉండేది.


'తను 10వ తరగతి పాసై, పెద్ద పెద్ద చదువులు చదివి ఓ గొప్ప శాస్త్రవేత్త కావాల'ని కలలు కనేవాడు రవి. అదే విషయాన్ని అతను ఒక రోజున వాళ్ళ నాన్నకు చెప్పాడు- కానీ వాళ్ళ నాన్న "బాబూ! మనకు పై చదువులు చదివే స్థోమత లేదు. నీ చదువు ఇంతటితో ముగించి, మాతో బాటే కూలికి వెళ్ళి నాలుగు డబ్బులు సంపాదించు" అన్నాడు.


రవి మనసు విరిగినట్లైంది. అయినా అతను నిరాశ చెందలేదు. వాళ్ళ అమ్మను అడిగితే ఆమె "నాయనా! చదువు నీకు అంత ఇష్టమైతే- చదువుకో. ఇల్లు తాకట్టు పెట్టయినా నిన్ను చదివిస్తాను" అని చెప్పింది.


ఆరోజు రాత్రి రవికి నిద్ర పట్టలేదు. "చదువు మానేద్దాంలే" అనిపించింది. "తల్లిదండ్రులను అంత కష్టపెడుతూ చదివేదెందుకు?" అనుకున్నాడు. 

అంతలో అతనికి తాను చదివిన పాత పుస్తకంలోని సాలెపురుగు కథ గుర్తుకు వచ్చింది. ఆ కథలో ఒక సాలెపురుగు చెట్టును ఎక్కడానికి ప్రయత్నిస్తుంది. కానీ ప్రతిసారీ తన ప్రయత్నంలో విఫలమవుతుంది. అయినా పట్టుదలతో మళ్ళీ ఎక్కేందుకు ప్రయత్నం చేస్తూ పోతుంది. తన ఆత్మబలాన్ని కోల్పోదు. అనేక ప్రయత్నాల తరువాత, చాలా కష్టపడి, చివరికి చెట్టు పైకి చేరుకుంటుంది. తను కూడా ఆ సాలెపురుగు లాగే తన కల నిజం చేసుకోవడానికి ఎన్ని ప్రయత్నాలైనా చెయ్యాలని నిర్ణయించుకున్నాడు రవి.


"అమ్మ, నాన్నలను ఇంతగా ఇబ్బంది పెట్టి చదవటం కంటే, ఈ సంవత్సరం నేను కూడా వాళ్లతోపాటు కూలికి వెళ్ళి డబ్బులు సంపాదిస్తాను. తరువాతి సంవత్సరం నుంచీ చదువుకుంటానులే" అని రవి నిర్ణయించు-కున్నాడు. ఆ నిర్ణయం ప్రకారమే మరునాటి నుండీ కూలి పనికి వెళ్ళసాగాడు. అదే సమయానికి కూలి రేట్లు పెరిగాయి. రవి రోజుకు వంద రూపాయల వరకూ సంపాదించగల్గాడు! నెల తిరిగేసరికి, మూడు వేల రూపాయలు కూడబెట్టగల్గాడు. తరువాతి నెలకు మరో మూడు వేలు! శలవలు పూర్తయ్యేసరికే రవి దగ్గర ఆరువేల రూపాయలు జమ అయ్యాయి!!


"ఈ డబ్బుతో నేను ఇంటర్ చదువుకుంటాను. ఉదయం వేళల్లో పేపరు వేస్తే కొన్ని డబ్బులు వస్తాయి. వాటితో నెల ఖర్చులు గడుస్తాయి" అనుకున్నాడు రవి. 

అయితే అనుకోకుండా అతనికి అదృష్టం కలిసి వచ్చింది: పదవతరగతిలో వచ్చిన మార్కుల ఆధారంగా అతనికి ప్రభుత్వ కళాశాలలో సీటు దొరికింది! అలా పై చదువులకు మార్గం సుగమమైంది. ప్రతి సంవత్సరమూ శలవలు ఇచ్చినప్పుడు రవి ఏదో ఒక పని చేసి, ఖర్చులకు అవసరమయ్యేన్ని డబ్బులు సంపాదించు-కునేవాడు.


ఈ విధంగా కష్టపడి చదివిన రవి ఇప్పుడు శాస్త్రవేత్త కాబోతున్నాడు- తను అనుకున్న లక్ష్యానికి అతనిప్పుడు చేరువలో ఉన్నాడు. మనందరికీ అతను ఆదర్శం కావాలి. శ్రద్ధ, పట్టుదల ఉంటే వేటినైనా సాధించవచ్చు.

చిన్న కధ

 *🕉చిన్న కధ  --  గొప్ప నీతి🕉


🌺 *నమ్మకం*🌺


🌷ఒక వ్యక్తి తన జుట్టు సమంగా కత్తిరించుకోవడానికి క్షవరసాలకి వెళ్లాడు. 


🌹అక్కడ మంగలి, పని మొదలుపెట్టగానే ఇద్దరూ చాలా విషయాలు మాట్లాడుకోవడం ప్రారంభించారు. 


🌷భగవంతుడి గురించి మాట్లాడడం మొదలుపెట్టేసరికి, మంగలి”నాకు భగవంతుడు ఉన్నాడు అని నమ్మకం లేదు” అన్నాడు.


🌹“ఎందుకు అలా అంటున్నావు”అని ఆ వ్యక్తి ఆడిగాడు.


🌷మంగలి ఇచ్చిన సమాధానం.” బైటకి వెళ్ళి చూస్తే, భగవంతుడు ఉన్నాడు అని నమ్మకం కలగదు.


🌹నిజంగానే భగవంతుడు ఉంటే, ఎందుకు మనుషులు సుస్తీతో బాధ పడుతున్నారు?


🌷ఇంతమంది అనాధపిల్లలు ఉంటారా? 


🌹ఎవరయినా బాధ పడతారా? 


🌷నిజంగా భగవంతుడికి ప్రేమ ఉంటే ఇవన్నీ చుస్తూ ఊరుకుంటాడా?


🌹ఆ వ్యక్తి కాసేపు ఆలోచించి, ఏమీ సమాధానం చెప్పలేదు.


🌷అనవసరంగా వాదన చేయడం ఇష్టం లేక. 


🌹మంగలి పని ముగించగానే, ఆ వ్యక్తి బయటికి వెళ్ళిపోయాడు. 


🌷రోడ్డు మీదఒక మనిషిని చూసాడు. పొడుగు జుట్టుతో సమంగా కత్తిరిచుకోకుండా, చూడడానికి అసహ్యంగా ఉన్నాడు.


🌹అప్పుడు, ఆ వెంటనే, మంగలి కొట్టుకి వెళ్ళి ఇలా అన్నాడు. “నీకు తెలుసా, మంగలి ఉన్నాడు అని నాకు నమ్మకం లేదు”


🌷అప్పుడు, మంగలి, “అలా ఎలా అనగలువు, నేను ఇప్పుడే నీకు క్షవరం పని చేశాను కదా”


🌹అప్పుడు ఆ వ్యక్తి ఇలా అన్నాడు, “నిజంగానే మంగలి ఉంటే, బయట ఆ మనిషి అలా, అంత జుట్టుతో అసహ్యంగా ఉండడు.”


🌷అప్పుడు మంగలి “నా దగ్గరికి రాకపోతే నేను ఏమి చేయ గలను” అని అన్నాడు.


🌹దానికి ఆ వ్యక్తి, “మనుషులు భగవంతుడి సహాయం కోసం, సాధనతో ఆయన దగ్గరికి వెళ్ళాలి.


🌷ఎప్పుడు అయితే భగవంతుడికి దగ్గర అవుతామో ,అప్పుడు సంతోషంగా ఆనందం గా ఉంటాము. భగవంతుడు నీలోను నాలోను అన్ని జీవరాసుల లో భగవంతుడు ఉన్నాడు.”


           *నీతి*


🌹భగవంతుడు కావాలి అని అనుకునే వాడికి, భగవంతుడు తప్పకుండా ఉంటాడు.


🌷భగవంతుని దర్శించాలనే వారు మంగలి పెరిగిన జుత్తును కటింగ్ చేసిన విధంగా మనం మనలోపల పెరిగిన కామ క్రోధ లోభ మధమాత్సర్యాలను ధ్యానం చేత కత్తిరించాలి.


🌹మంగలికి కత్తెర ఏలా అతనికి ఆయుధమెా అలా భగవంతుని దర్శించాలనే వారికి ధ్యానం ఏకైక ఆయుధం. 


🌷భగవంతుడు కావాలని కునేవారు నమ్మకంతో సాధన చేత  ఆయనకు చేరువకావాలి.


🌹భగవంతుడు ఎక్కడో లేడు?  నీ మొహంలో చిరునవ్వు, ఎదుటి వాడు బాధ పడుతుంటే జాలి చూపించటం, అహింస; కరుణ ; ప్రేమ; అన్ని జంతువుల పట్ల దయ చూపించడం. మన దగ్గర వాళ్ళతో  ప్రేమగా ఉండడం,అన్ని కూడా, భగవంతుడు మనలో ఉండి చేయిస్తున్నాడు. 


🌷భగవంతుడి కోసం మన హృదయంలో  నమ్మకంతో సాధన(ధ్యానం) తో మనం దృష్టి పెడితే నవ్వుతూ కనిపిస్తాడు.


🕉🌺🕉🌺🕉🌺🕉🌺🕉🌺🕉🌺*

కొంగముక్కు రాజు

 *కొంగముక్కు రాజు -- కథలు*


*నూరేళ్ళ క్రితం వరకు ఉత్తర పోలండ్‌ ప్రజలు రకరకాల చెట్లతో నిండిన ఒక చిన్న లోయకేసి చూపెడుతూ, ‘‘ఇక్కడే ఒకానొకప్పుడు అద్భుత శక్తులు కలిగిన వ్లాడిమీర్‌ ఆపిల్‌ చెట్టు ఉండేదట! అది ఇప్పుడు కూడా ఉంటే ఎంత బావుండేది!" అని చెప్పుకునేవారు. ఈనాడు అక్కడొక పట్టణం ఏర్పడడంతో ఆ పచ్చటి లోయకూడా కనుమరుగై పోయింది.*


*అయినా - వ్లాడిమీర్‌, అతడి వింత చెట్టును గురించిన విచిత్రమైన కథ మాత్రం ఆ దేశపు పూర్వగాథలలో చిరస్థాయిగా నిలిచిపోయింది: ఉత్తర పోలండ్‌కు చెందిన ఒక మహిళకు కొంత కాలం సంతానం లేకపోయింది. ఆమె దేవాలయానికి వెళ్ళి సంతానం కోసం ప్రార్థించినప్పుడు ఒక వింత వాణి వినిపించిన అనుభూతికి లోనయింది.*


*ఆమెకు అసాధారణమైన కొడుకు పుడతాడనీ; వాడు ధనవంతుడో, నిత్య సంతోషిగానో అవుతాడనీ; ఆ రెండింటిలో ఏది కావాలో కోరుకోమనీ వింతవాణి ఆదేశించింది. సంతోషం కలిగించే వివిధ వస్తువులలో, విషయాలలో ధనం ఒకటి మాత్రమే అవుతుంది. అది లేకుండానే సంతోషంగా ఉండగలిగినప్పుడు ఇక ధనం ఎందుకు? దాని వెంట వచ్చే బాదర బందీ ఎందుకు? అని ఆలోచించిన ఆమె తనకు నిత్యసంతోషి అయిన కొడుకే కావాలని కోరుకున్నది.*


*ఆమెకు కొన్నాళ్ళకు పండంటి కొడుకు పుట్టాడు. వ్లాడిమీర్‌ అని పేరుపెట్టి అల్లారు ముద్దుగా పెంచసాగింది. ఆమె పేదరాలు కావడంతో బిడ్డను, దూరంగా ఉన్న బడికి పంపలేక పోయింది. కొన్నాళ్ళకు అతన్ని బూట్లు కుట్టే పని నేర్చుకోమని ఒక పెద్ద చర్మకారుడి వద్దకు పంపింది. వ్లాడిమీర్‌ కొన్నాళ్ళు చర్మకారుడి ఇంటి వద్దే ఉన్నాడు గాని, ఒకనాడు తన ఇంటికి తిరిగివచ్చి, ‘‘అమ్మా, బూట్లు కావాలని వచ్చే వారందరూ ధనికులే.*


*పేదలకు బూట్లు కొనుక్కునే శక్తిలేదు. ధనికులకు మాత్రమే పనికివచ్చే వృత్తి నాకు ఇష్టం లేదు," అని చెప్పాడు. తల్లి సరేనని తల ఊపి, అతన్ని కుట్టుపని నేర్చుకోమని ఒక దర్జీ వద్దకు పంపింది. వ్లాడిమీర్‌ అక్కడ పని నేర్చుకోసాగాడుగాని, కొన్నాళ్ళకే అక్కడి నుంచీ తిరిగి వచ్చి, ధనికులు మాత్రమే కుట్టించుకున్న బట్టలు తొడుక్కుంటున్నారు; అలాంటివారికి సేవలు చేయడం తనకు ఇష్టం లేదని తల్లికి చెప్పాడు.*


*ఆ తరవాత తల్లి అతన్ని ఖడ్గాలు తయారు చేసే నిపుణుడి వద్దకు పంపింది. ఆ రోజుల్లో తరచూ యుద్ధాలు జరిగేవి గనక, ఖడ్గాలకు మంచి గిరాకీ ఉండేది. అయితే, వ్లాడిమీర్‌ అక్కడ కూడా ఒక వారం రోజులకు మించి ఉండలేక పోయాడు. ‘‘అమ్మా, మనుషులను చంపే ఆయుధాలను నేను తయారు చేయాలా?'' అన్నాడు బాధగా. ‘‘వద్దు నాయనా.*


*అయినా, నీకు నచ్చిన జీవనోపాధిని చూపలేక పోతున్నాను. అదే నాకు బాధగా వుంది," అని కొంతసేపు ఆలోచించిన తల్లి, ‘‘గ్రామంలోని ఇతర పిల్లల్లాగే నువ్వూ, పశువులను దాపులనున్న మైదానాలలోకి తోలుకు వెళ్ళి మేపుకుని, రా,'' అన్నది. వ్లాడిమీర్‌ తల్లి సలహాను పాటించాడు. పశుల కాపరులతో కలిసి మెలిసి ఆడుతూ, పాడుతూ పచ్చటి పొలాలగుండా తిరుగుతూ, పశువులను కాపలాకాయడం అతనికి ఎంతో ఆనందం కలిగించింది.*


*ఒకరోజు మిట్టమధ్యాహ్న సమయం. ఎత్తయిన ఒక బండ చుట్టూ నిప్పంటు కోవడం వ్లాడిమీర్‌ గమనించాడు. ఆ బండ మీద ఉన్న ఒక తొండ, నిప్పుల నుంచి బయట పడడానికి ప్రయత్నిస్తున్నది గాని, సాధ్యపడలేదు. వ్లాడిమీర్‌ తన వద్ద వున్న పొడవాటి కరన్రు ఉపెూగించి తొండను అగ్నిజ్వాలల నుంచి కాపాడాడు. మరుక్షణమే ఆ తొండ ఒక వృద్ధురాలిగా మారి, ‘‘నాయనా, నీ ఉపకారగుణం మెచ్చ తగింది.*


*ఇదిగో ఈ మొక్కను తీసుకుపోయి, నీ పెరట్లో నాటు. ఈ చెట్టు నుంచి కాచే ఆపిల్‌ పళ్ళకు వ్యాధులను నయం చేసే అద్భుత శక్తి ఉంటుంది," అంటూ ఒక మొక్కను ఇచ్చి, తొండగా మారి పొదలోకి వెళ్ళిపోయింది. వ్లాడిమీర్‌ ఆ మొక్కను తెచ్చి, తన ఇంటి కిటికీ పక్కన తోటలో నాటాడు. రెండు నెలల కల్లా అది ఏపుగా పెరిగి ఫలాలివ్వడం ప్రారంభించింది. వ్లాడిమీర్‌ మొట్టమొదటి పండును కోసి జ్వరంతో బాధపడుకున్న తన తల్లికి ఇచ్చాడు. వెంటనే ఆమె జ్వరం తగ్గి పోయింది.*


*ఆ తరవాత వివిధ వ్యాధులతో బాధపడుతున్న మరికొందరికి వ్లాడిమీర్‌ తన ఆపిల్‌ పళ్ళను ఇచ్చాడు. వాళ్ళ వ్యాధులన్నీ నయమై పోయాయి. ఈ సంగతి కొన్నాళ్ళకు ఆ ప్రాంతాన్ని పాలించే రాజుకు తెలియవచ్చింది. ‘‘మనం వ్లాడిమీర్‌ను మన ఆస్థాన ఉద్యోగిగా నియమిద్దాం," అన్నాడు రాజు. ‘‘అవసరం లేదు, ప్రభూ! వ్లాడిమీర్‌ చెట్టును తెచ్చి, మన ఉద్యానంలో నాటితే సరిపోతుంది," అన్నాడు ఆస్థాన వైద్యుడు.*


*‘‘అవునవును," అంటూ వైద్యుడి మాటకు వంత పలికాడు అతని బావమరది అయిన మంత్రి. రాజు వెంటనే ఆజ్ఞలను జారీ చేశాడు. సైనికులు వెళ్ళి, వ్లాడిమీర్‌తో ఒక మాటయినా చెప్పకుండా, అతని తోటలోని వింత చెట్టును పెకలించుకుని వచ్చి రాజోద్యానంలో నాటారు. అయితే, ఆ తరవాత ఆ చెట్టు ఒక్క కాయకూడా కాయలేదు. అందరూ ఆశాభంగానికి లోనయ్యారు. రాజవైద్యుడికీ, మంత్రికీ నోట మాటరాలేదు.*


*దీనికి సరైన పరిష్కారం చూడమని రాజు వారిని ఆగ్రహంతో హెచ్చరించాడు. రాజు కొన్నాళ్ళుగా తీరని జలుబుతో బాధ పడుతూ రాజవైద్యుడు ఎన్నిరకాల మందులిచ్చినా అది తగ్గక పోయేసరికి వింత చెట్టు నుంచి కాచే ఆపిల్‌ పండు కోసం ఎదురు చూస్తున్నాడు. అదే సమయంలో అక్కడ వ్లాడిమీర్‌, తన వద్దకు వచ్చే వ్యాధిగ్రస్తులకు ఎలాంటి సాయం చేయలేక పోవడంతో తీరని విచారానికి లోనయ్యాడు.*


*మైదానంలోకి వెళ్ళి, ఆనాడు తొండకనిపించిన బండ సమీపంలోని చెట్టు కింద కూర్చున్నాడు. ‘‘దయా స్వభావం గల తల్లీ, ఒకసారి కనిపించవూ," అని కళ్ళు మూసుకుని ప్రార్థించాడు. ఉన్నట్టుండి చిన్న సుడిగాలి రావడంతో అతని ముందున్న ఎండుటాకులు గిర్రున గుండ్రంగా తిరగసాగాయి. మరుక్షణమే అక్కడ వృద్ధస్ర్తీ కనిపించింది. వ్లాడిమీర్‌ ఆమెకు రాజూ, అతని మనుషులూ చేసిన దురాగతాన్ని వినిపించాడు.*


*ఆ వృద్ధస్ర్తీ, అతనికి ఒక బుట్టనిండా ఆపిల్‌ పళ్ళను ఇచ్చి, ‘‘వీటిని తీసుకుని రాజభవనం వద్దకు వెళ్ళి విక్రయించు. ఆ తరవాత జరిగే తమాషా చూడు," అని చెప్పి, తొండగా మారి, సుడిగాలి వీస్తూండగా పొదలకేసి తిరిగి వెళ్ళిపోయింది. వ్లాడిమీర్‌ పళ్ళ బుట్టను తీసుకుని రాజభవనం వద్దకు వెళ్ళాడు, ‘‘పళ్ళో పళ్ళు. ఈ పళ్ళు తింటే అనుకోని అద్భుతాలు జరుగుతాయి," అని అమ్మసాగాడు.*


*రాజభటులు అతన్ని రాజు వద్దకు తీసుకువెళ్ళారు. రాజు అతన్ని చూసి, ‘‘ఈ పళ్ళు, నా జలుబును పోగొట్టగలవా?" అని అడిగాడు. ‘‘పోగొట్టవచ్చు. ఇంకా మరేదైనా కూడా చేయవచ్చు," అన్నాడు వ్లాడిమీర్‌. రాజు, మరికొందరు రాజోద్యోగులు తలా ఒక పండు తీసుకుని తిన్నారు. చాలా బావుందన్నారు.*


*అయితే, మరుక్షణమే వారి ముక్కులు పొడవుగా కొంగ ముక్కుల్లా పెరిగి పోయాయి. ‘‘ఏమిటిది?" అని అరిచాడు కీచుకంఠంతో రాజు హడలిపోతూ. ‘‘ప్రభూ! తమరి జలుబు పోయిందా, లేదా మొదట ఆ సంగతి సెలవివ్వండి," అన్నాడు వ్లాడిమీర్‌ నిర్భయంగా. ‘‘జలుబు ఉందాలేదా అన్న విషయం కూడా తెలుసుకోలేనంత పెద్ద ముక్కు తయారయింది," అన్నాడు రాజు బాధగా. ‘‘ఏమిటిది? ఏమిటిది?"*


*అన్న హాహాకారాలు బయలుదేరాయి. పళ్ళను తిన్న సభా సదులందరికీ పెద్ద పెద్ద కొంగముక్కులు వచ్చేశాయి. ‘‘ప్రభూ, గౌరవనీయులైన తమరూ, తమ ఉద్యోగులూ పెద్ద పెద్ద ముక్కులతో ప్రత్యేకంగా కనిపిస్తున్నారు," అన్నాడు వ్లాడిమీర్‌. ‘‘అంత ప్రత్యేకంగా కనిపించడం మాకిష్టంలేదు. మా పాత మామూలు ముక్కులు ఉంటేచాలు.*


*వాటిని మళ్ళీ ఎలా పొందగలం?" అని అడిగాడు రాజు అసహనంగా. ‘‘బహుశా, నా తోటలో నుంచి తమరు దొంగిలించిన చెట్టు పళ్ళను తినడం ద్వారానే అది సాధ్యం కావచ్చు. దానిని తీసుకుపోయి యథాస్థానంలో నాటితేనే అది మళ్ళీ పళ్ళ నివ్వగలదు. అంత వరకు గొప్పవారైన తమరు గొప్ప ముక్కులతోనే తిరగక తప్పదు," అన్నాడు వ్లాడిమీర్‌ సాలోచనగా. ఆ చెట్టును పెకలించి వ్లాడిమీర్‌ తోటలో నాటడానికి రాజు క్షణాల్లో ఏర్పాటు చేశాడు.*


*ఆ చెట్టు మళ్ళీ ఫలాలివ్వడానికి ఒక వారం రోజులు పట్టింది. వ్లాడిమీర్‌ బుట్టనిండా ఆపిల్‌ పళ్ళతో వచ్చి, వారికి ఇచ్చాడు. వాటిని తినగానే వారికి మామూలు ముక్కులు వచ్చాయి. పెద్దగండం నుంచి గట్టెక్కినట్టు అందరూ పరమానందం చెందారు. రాజు వ్లాడిమీర్‌కు తన ఆస్థానంలో ఉన్నత పదవినిచ్చాడు. అయినా, వ్లాడిమీర్‌ జీతం పుచ్చుకునేవాడు కాదు. అవసరమని వచ్చిన వారికి అద్భుతశక్తిగల ఆపిల్‌ పళ్ళను ఇస్తూ సంతోషంగా చిరకాలం జీవించాడు. అతడు కాలధర్మం చెందడంతో, ఆ చెట్టు కాయడం ఆగిపోయింది.*

జాతీయం


🗣 జాతీయం🤔*



*శూర్పణఖ మేనకోడలు*



మేనమామ, మేనత్తల పోలికలు బిడ్డలకొస్తాయన్నది ఓ నమ్మకం. ఈ నమ్మకం ఆధారంగా ఈ జాతీయం ప్రయోగంలోకొచ్చింది. రామాయణకథలోని పాత్ర శూర్పణఖ. రావణాసురుడి చెల్లెలైన ఈమె రాక్షసస్వభావం, వంచన తత్వంతో కనిపిస్తుంది. ఇటువంటి స్వభావాలు స్త్రీలలో ఎవరి దగ్గరైనా కనిపించినప్పుడు ఈ జాతీయంతో సూచించటం ప్రయోగంలో ఉంది.

నేటి సుభాషితం🤘*



*మానవత్వాన్ని మించింది ఈ లోకంలో లేదు. మానవత్వం ఒక సముద్రం వంటిది. అందులో రెండు చుక్కల మలినం కలిసినంత మాత్రన సముద్రమంతా చెడిపోడు.*

                *--మహాత్మా గాంధీ*

*

 --------------------

🌻 *మహనీయుని మాట* 🍁

        -------------------------

" లేని గొప్ప తనాన్ని ప్రదర్శిస్తే 

నీలో ఉన్న నిజమైన గొప్పతనం మరుగున పడుతుంది. "

--------------------------

🌹 *నేటీ మంచి మాట* 🌹

      ---------------------------

" విజయం గొప్పది కాదు.. 

సాధించిన వాడు గొప్ప.!

బాధ పడటం గొప్ప కాదు..

బాధను తట్టుకునే వాడు గొప్ప.!

బాంధవ్యాలు గొప్ప కాదు..

వాటిని నిలబెట్టుకునే వాడు గొప్ప.!


🌻✨🌻✨🌻✨🌻✨🌻✨🌻✨🌻

సామెతలు

 *🤠 సామెతలు 🌸*



*ముసలి తనానికి దసరావేషం లాగ*



ఏవయసులో చేయాల్చిన పనులు ఆ వయసులోనే చేయాలని లేకుంటే నవ్వుల పాలవుతారని చెప్పే సామెత ఇది.



*ముసలితనంలో చింతామణి వేషం వేసినట్లు*


చింతామణి పాత్రను వెయ్యడానికి నవనవలాడుతూ నాజూకుగా ఉండి యవ్వన ప్రారంభ దశలో ఉన్న స్త్రీలే అర్హులౌతారు. అలాకాక వయసు ఉడిగి, ముసలితనం ముఖంలో స్పష్టంగా కనిపించేవారు చింతామణి పాత్ర వేస్తే ప్రేక్షకులకు చూడడానికి ఎబ్బెట్టుగా ఉంటుంది. ఏ సమయానికి ఏ వయసుకు తగిన పనిని వారుచేయాలికానీ, వేరొకరు చేస్తే బాగుండదు. కొంతమంది ఏ పనికైనా తామేనంటూ ముందుకు వస్తారు. అలా వచ్చేవారు ఆ పనిని తాము చేసినందువల్ల ఎవరికీ ఇబ్బంది కలగకుండా ఉండేలా చూసుకోవడం అవసరమని ఈ సామెత

ఆణిముత్యం

 *💎 ఆణిముత్యం💎*



దంతములకు మధ్య ఎంతో నేర్పును కల్గి

నాల్క సంచరించు నలగకుండ

నరుడు కూడ అటులె నడవంగ వలెనయా

సత్యమైన బాట సాయి మాట !

*భావం:*


కత్తుల బోనువంటి పలువరసలు మధ్యలో నాలుక ఏమాత్రమూ దెబ్బ తినకుండా ఎంతో మెలకువగా సంచరిస్తూ ఉంటుంది. మనిషి కూడా తోటి మానవుల మధ్య ఈ విధంగానే చాలా జాగ్రత్తగా నడుచుకోవాలి. సాయి చెప్పినట్లుగా నడుచుకోవడమే "సత్ప్రవర్తన" అనిపించుకుంటుంది.    

                        

*వివరణ:*


మన ఇంద్రియములు అన్ని ఒకే పనిని చేస్తాయి. కాని నోరు రెండు పనులు చేస్తుంది. దీని విషయంలో చాలా జాగ్రత్తగా వుండాలి. ఒకటి తినడం, రెండు మాట్లాడం. మనము తినే విషయంలో చాలా జాగ్రత్తగా వుండాలి. సాత్విక ఆహారం తీసుకోవాలి. ఇక నోరు మాట్లాడే దానిలో 4 తప్పులు చేస్తుంది. అబద్దాలు చెప్పడం, చాడీలు చెప్పడం, దూషించడం, అతిగా మాట్లాడం. స్వామి ఎపుడూ చెపుతుంటారు "అతి బాష మతి హాని, మిత బాష అతి హాయి". ఎక్కువ మాట్లాడడం వల్ల మనలో జ్ఞాపకశక్తి తగ్గుతుంది. అయినా నోరు మనకు చక్కని ఆదర్శన్ని చూపిస్తుంది.

1. చెడు పదార్దాన్ని నాలుక స్వీకరించదు, వెంటనే వుమ్మి వేస్తుంది. అలాగే మనం చెడు విషయాలను వెంటనే విసర్జించాలి.

2. నాలుక నీవు ఏ రకం తిన్నా అనగా తీపి,కారం,పులుపు,తన మీద వుంచుకోదు వెంటనే లోపలకి పంపుతుంది. అలాగే నీవు ప్రపంచములోని విషయములు నీలో వుంచకుండా జీవించాలి.

3. నీవు మాట్లాడే మాటల వల్ల నీ వ్యక్తిత్వం అందరికీ తెలుస్తుంది. మంచి మాట్లాడితే మంచివాడని, చెడు మాట్లాడితే చెడ్డవాడని.

4. నాలుక ఎంతో సున్నితంగా వుండి 32 పళ్ళ మధ్య పడకుండా అణిగి వుంటుంది. అలాగే ప్రపంచములోని వివిధ మానవత్వం కలవారి మధ్య మనము మంచిగా జీవించాలి అని బోధిస్తుంది.


*🎣సేకరణ:సొంటేల ధనుంజయ🎣*