10, ఏప్రిల్ 2024, బుధవారం

అధర్మఫలం

 💎🌅  *_-|¦¦|శుభోదయమ్|¦¦|-_* 🌄🪔

🪔 ॐ卐  *_-|¦¦|సుభాషితమ్|¦¦|-_* ॐ卐 💎


శ్లో𝕝𝕝  

*యది నాత్మని పుత్రేషు నచేత్పౌత్రేషు,నప్తృషు౹*

*నత్వేవ తు కృతోஉధర్మః కర్తుర్భవతి నిష్ఫలః॥*



*మానవుడు తాను చేసిన అధర్మఫలం తాను అనుభవించకపోతే, దానిని అతని కుమారుడు గానీ, అతని మనుమడు గానీ, మునిమనుమడు గానీ తప్పక అనుభవించ వలసినదే*.... అధర్మఫలకర్తృత్వం ఎప్పటికీ సమసిపోయేదికాదు ..... చేసిన నేరాలకు శిక్ష ఎప్పటికైనా తప్పదు....

శుద్ధజలము

 💎🌅 *_-|¦¦|శుభోదయమ్|¦¦|-_* 🌄🪔

🪔 ॐ卐 *_-|¦¦|సుభాషితమ్|¦¦|-_* ॐ卐 💎


శ్లో𝕝𝕝 

*నాస్తి మేఘసమం తోయం*

*నాస్తి చాత్మసమం బలమ్‌౹*

*నాస్తి చక్షుఃసమం తేజో*

 *నాస్తి ధాన్యసమం ప్రియమ్‌॥*


తా𝕝𝕝 మేఘ జలముతో సమానమైన శుద్ధజలము లేదు....ఆత్మ బలముతో సమానమైన బలము శరీరములో కాని పృథివిలో కాని రెండవది లేదు....కన్నుతో సమానమైన తేజస్సు గల యింద్రియము శరీరములో మఱొకటి లేదు.... ధాన్యముతో (అన్నముతో) సమానమైన వస్తువు మఱొకటి లేదు.

విచార సంగ్రహం- 15 .

 విచార సంగ్రహం- 15 .

( భగవాన్ రమణమహర్షులు )


ఈ చిన్నగ్రంధము ఎంతో విలువైనది. ఎందువలన అంటే, 1901 -02 లో భగవాన్ రమణమహర్షి మౌనవ్రతంలో వుంటున్నప్పుడు, వారి పాదాలను ఆశ్రయించుకుని వున్న బ్రాహ్మణ పరమ భక్తాగ్రేసరుడు అయిన ‘ గంభీరం శేషయ్య ‘ గారికి ఆకాలంలో, వారు అడిగిన సందేహాలకు రమణులు వ్రాతపూర్వకంగా అనుగ్రహించిన వేదాంతసారం, యిందులో పొందుపరచ పడినది. 


ఇందులో ముముక్షువులైన సర్వాధికారులకు అధికఫలం ఇచ్చే ఉపదేశములు వుండడడం వలన ఇది ' విచార సంగ్రహము ' అనే పేరుతో పిలువబడినది.


జ్ణానాష్టాంగము 


ఇక్కడ మనం యమనియమాలను గురించి క్లుప్తంగా చెప్పకుందా౦  


ముందుగా ‘ యమము ‘ అంటే, ' దేహము మొదలైన అనాత్మ విషయాలు అనిత్యము అయినవి. '  అని తెలుసుకుని, ఇంద్రియ వృత్తుల వ్యాపకాలను అణచివేయుట.   విషయ రహితమైన, దృశ్య రహితమైన ప్రపంచంలో మనస్సును నిలపడానికి నిరంతరమూ కృషి చెయ్యడం.   


‘ నియమము ‘ , ఆత్మ సంబంధమైన అనగా పరమాత్మ విషయముల మీద అపరిమిత ఆసక్తి పెంచుకోవాలి.  విజాతీయ విషయములందు, తిరస్కారము చూపించాలి.  


ఇక ‘ ఆసనము ‘ అనగా, ధ్యానానికి కూర్చునే ముందు, ఫలానా విధమైన ఆసనం వుండాలనే నిబంధన ఏదీలేదు.   దేనిమీద కూర్చుంటే, ఎడతెగని బ్రహ్మచింతన సుఖముగా వీలు అవుతుందో,  దేహముఎక్కడ సహకరిస్తుందో, అదే సరిఅయిన ఆసనము.  అయితే అలాంటి సుఖమైన ఆసనము నిద్రలోకి దారితీసేటట్లు వుండకూడదు.  


ప్రాణాయామము :   రేచకమంటే వాయువును ముక్కు రంధ్రములద్వారా బయటకు వదలడం అని చెప్పుకున్నాముకదా ! ఆ బయటకు వదలడమనే ప్రక్రియను దేహాది అనిత్య ప్రపంచము యొక్క నామ రూపాలను బయటకు వదలడంగా అన్వయించుకోవాలి.  పూరకమంటే,  వాయువును గ్రహించడం అని తెలుసు కదా !   నామరూపములను వదిలిన తరువాత కలిగే సత్ చిత్ ఆనందములనే మూడు అంశాలను గ్రహించినట్లు భావించాలి.   కుంభకం అనగా వాయువును  బంధించి వుంచుకున్నట్లు,  ఆ గ్రహి౦చిన సచ్చిదానంద స్వరూపాన్ని నిలుపుకోవడమే.    


‘ ప్రత్యాహారం ‘ అనగా, రేచకంలో వదిలిన నామ రూపములను మనస్సు మరల గ్రహించుకోకుండా కాపాడుకోవడం.   మరి ‘ ధారణ ‘ అంటే, కుంభకం లో పూరించుకున్న సచ్చిదానంద స్వరూపమే తన ఆత్మస్వరూపం అని తెలుసుకున్న తరువాత, దానిని మనసు దాటి వెలుపలకు పోనీయకుండా, హృదయ కమలంలో నిలుపుకొనడం.  


‘ ధ్యానం  ‘ అంటే, పంచకోశయుత దేహము నేనుకాదని బాగుగా గుర్తెరిగి  ' నేను ఆత్మ స్వరూపమును  ' అని నిశ్చయించుకుని,  అహం స్వరూపంలో ఎడతెగకుండా వుండుట.  చివరగా, ‘ సమాధి స్థితి ‘ అంటే, అహం స్ఫురణ కూడా  కొట్టుకునిపోయి వున్న పరబ్రహ్మ సాక్షాత్కార స్థితి.  అనగా తురీయాతీత స్థితి అని చెప్పుకున్నాము కదా !  అది  అన్నమాట. 


ప్రాణాయామము గురించి మరికొంత రేపు తెలుసుకుందాం.  


స్వస్తి.

రమణుల అనుగ్రహంతో....🙏🏻🙏🏻🙏🏻🙏🏻

*సప్త వ్యసనాలు

 *సప్త వ్యసనాలు అంటే ఏమిటి?*


ఏ మనిషయినా దుర్వ్యసనాలకి లోనయితే జీవితంలో బాగుపడలేడు. 

ఈ వ్యసనాలకి లోనయి నాశనమయ్యేవాళ్ళు ఈ కాలంలోనే కాదు, పూర్వమూ వున్నారు. ముఖ్యంగా దుర్వ్యసనాలు ఏడు అంటారు. అవేమిటంటే

*1.పరస్త్రీ వ్యామోహం – ఏ కాలంలోనైనా మనిషిని అధఃపాతాళానికి తొక్కేసే వ్యసనం ఇది. ఈ వ్యసనంతో సర్వనాశనం తెచ్చుకున్నవాళ్ళల్లో పూర్వ కాలంలో రావణాసురుడు ముఖ్య ఉదాహరణ. సీతాదేవిని అపహరించి, ఎన్నో కష్టాలను కొని తెచ్చుకోవటమేగాక తన కుటుంబాన్నీ, వంశాన్నీ, అయినవారినీ, చివరికి రాజ్యాన్నికూడా కోల్పోయాడు.

*2.జూదం .. ధర్మరాజు అంతటి వాడు జూదం వల్ల ఎన్ని అగచాట్లు పడ్డాడో అందరికీ తెలుసు. (ఆంతటి గొప్పవాడే ఆ రోజుల్లో అన్ని అవస్తలు తాను పడటమే కాకుండా, తన తమ్ములూ, భార్యా కూడా అవస్తలు పడటానికి కారకుడయ్యాడే, మరి ఈ రోజుల్లో ఈ పేకాట వగైరా వ్యసనాలబారినపడి ఎన్ని కుటుంబాలు ఎన్ని అవస్తలు పడుతున్నాయో)

*3.మద్యపానం – పురాతన కాలంలో దీనికి ఉదాహరణ శుక్రాచార్యుడు. ఈయన రాక్షసులకు గురువు. ఆయనకి మృత సంజీవినీ విద్య తెలుసు. ఆ విద్యతో చనిపోయిన రాక్షసులను వెంటనే బ్రతికించేవాడు. అలాంటివాడు మద్యపాన మత్తులో ఏమి చేస్తున్నాడో తెలుసుకోకుండా తాను తాగే పానీయంలో కచుడి చితాభస్మం కలిపి సేవిస్తాడు. (పురాతన కధలు అందరికీ వివరంగా తెలియక పోయినా కచుడి చితాభస్మం తాగటం వివరాలు నేనూ ఇప్పుడు తెలుసుకోవాలి) నేటి సమాజంలో మద్యపాన మహిమ అందరికీ తెలిసినదే.

*4. వేట -- పూర్వం దశరధ మహారాజు వేటకోసం వెళ్ళి, నీటి శబ్దాన్నిబట్టి బాణం వేసి శ్రవణకుమారుడిని చంపుతాడు. ఆయనకి తెలియక చేసిన పాపమయినా శ్రవణుడి వృధ్ధ తల్లిదండ్రుల శాపానికి గురయి తన కుమారుడు శ్రీ రామచంద్రుడికి దూరమయి రాముణ్ణే కలవరిస్తూ మరణిస్తాడు. (ఇదివరకంటే కృర మృగాల (kroora - inscript లో ఎలా టైప్ చెయ్యాలో రాలేదు నాకు) బారినుండి ప్రజలను కాపాడటానికి రాజులు వేటాడేవారు. ఈ రోజుల్లో మాత్రం ఇది , స్ధితి పరులకు వ్యసనమే. దానితో పట్టుబడ్డవారెన్ని కేసులెదుర్కుంటున్నారో పేపర్లల్లో చూస్తున్నాంగా).ఆదిత్యయోగీ..

*5. కఠినంగా, పరుషంగా మాట్లాడటం -- దుర్యోధనుడు దీనికి మంచి ఉదాహరణ. పాండవులను దుర్భాషలాడి ఏ స్దితి తెచ్చుకున్నారో అందరికీ తెలిసిందే. (పూర్వకాలంలో కఠినంగా మాట్లాడేవాళ్ళని వేళ్ళమీద లెక్కబెట్టేవాళ్ళు...ఇప్పుడు అలా మాట్లాడనివాళ్ళని....)

*6.కఠినంగా దండించటం -- దీనికికూడా దుర్యోధనుడే ఉదాహరణ. ఒకసారి దుర్యోధనుడు తన తాతగారిని, మేనమామలని కూడా బందిఖానాలో పెడతాడు. వారికి ఆహారం కూడా అతి తక్కువ ఇచ్చి నానా ఇబ్బందులూ పెడతాడు. వాళ్ళందరికీ ఇచ్చిన అతి కొద్ది మెతుకులను శకుని ఒక్కడే తిని ప్రాణాలు నిలుపుకుని దుర్యోధనుడి చెంత చేరతాడు. కౌరవులమీద పగ తీర్చుకోవటానికి వారితో వున్నట్లు నటించి వారు నాశనమయ్యేటట్లు చేస్తాడు.

ఈ రోజుల్లోకూడా ఏ కారణంవల్లనైతేనేమి తల్లిదండ్రులు పిల్లల్ని దండించటం, టీచర్లు పిల్లల్ని కఠినంగా దండించటం ఎక్కువైంది. (ఎవరిమీదైనా ఏమైనా కక్షవుంటే దాన్ని తీర్చుకోవటానికి అనేక మార్గాలు ఎన్నుకుంటున్నారు. ఇది ఎవరికీ మంచిది కాదు).

*7.ఆఖరిది డబ్బు. కొందరికి డబ్బు వృధాగా ఖర్చుచెయ్యటం అలవాటు. బాగా డబ్బున్నా, క్రమ శిక్షణా, సరైన ఆలోచన లేకపోవటంవల్ల అవసరముందా లేదా అని కూడా ఆలోచించకుండా డబ్బు దుర్వినియోగం చేస్తారు. మహాలక్ష్మిని ప్రయోజనకరమైనవాటికి కాకుండా దుర్వ్యసనాలకు వినియోగిస్తే దుర్గతే లభిస్తుంది అపజయమే తప్ప జయం వుండదు. అందుకే ధనాన్ని సద్వినియోగం చెయ్యాలి.

మంచీ చెడూ తెలుసుకుని మనుగడ సాగించటమే మనిషి జన్మకి సార్ధకత...

.


మనని మరొకరు మన్నించడం, క్షమించడం కాదు. 'ఎవరికి వారు ఆత్మ పరిశీలనతో తన తప్పును గ్రహించి, పశ్చాత్తాపంతో తనకు తానే మానసికంగా శిక్ష విధించుకుని, నూతన జీవితాన్ని ఆశ్రయించాలి. మనసే మన 'కర్మ'లకు మొదటి సాక్షి!'..

.

*భగవంతునికి - భక్తులు - అనే అర్హత ఎప్పుడు పొందగలము?*


భగవంతుని గుర్తించి మనము స్వీకరిస్తే ఆయన ఉంటాడు, కనబడుతాడు... 

ఆయనను తిరస్కరిస్తే ఆయన ఉండడు, కాక కనబడడు కూడా.... 

హిరణ్యకశిపుడు హరి ఎక్కడా లేడన్నాడు, కనుక ఎక్కడా కనబడలేదు, అతనికి...

అంతటా ఉన్నాడని ప్రహ్లాదుడు విశ్వసించాడు... 

కాబట్టి స్తంభము నుండి వెలిసి, ప్రహ్లాదుని విశ్వాసం సత్యమని నిరూపించాడు...

అంతే కానీ, హిరణ్య కశిపుని సవాలు ఎదుర్కోవడం కోసమని స్తంభములో  ప్రవేశించడం కాదు...


అన్నిటా, అంతటా నిండి ఉన్నట్లే, ఆ స్తంభములో కూడా ఆయన ఎప్పుడూ ఉన్నాడు... 

ఆ క్షణంలో తన ఉనికి ప్రదర్శించాడు, అంతే!...


సాధు సత్పురుషులు, మహర్షులు, ఆర్తితో ప్రార్ధించినపుడు, భగవంతుడు అవతరిస్తాడు...


*ఆయన కర్తవ్యాలు మూడు...!!!*


వేద రక్షణ, 

ధర్మ రక్షణ, 

భక్త రక్షణ...


నిశ్చలమైన విశ్వాసము, నిర్భయం, నిరహంకారం, సద్గుణం, ఇవి లేకుండా, ఆడంబరంగా పూజ చేస్తే, వ్యర్థమే... కాలము, శక్తీ, అన్నీ వృధా అవుతాయి...


ఇలాంటి సందర్భంలో మనము పవిత్ర గ్రంధాల నుండీ, పురాణముల నుండి, ఉపనిషత్తులనుండి, ప్రసంగాల నుండీ మనము పొందుతున్న లాభమేమిటి?...


వీటి మూలంగా మనమైనా బాగు  పడ్డామా? లేక చదివితేనే పుణ్యము వస్తుంది, అనుకొంటే మనకన్నా ముందు టేబురికార్డులకు, మన సెల్లులకు ముందుగా పుణ్యం వస్తుంది, అవి నిత్యం పటిస్తున్నాయి కాబట్టి...


భగవంతుని దర్శన భాగ్యం పొందిన మనము ఎంతవరకు పురోగమించాము? 

దర్శనమాత్రమునే పుణ్యము వస్తుంది, మోక్షానికి అర్హత వస్తుంది అనుకుంటే, మనకన్నా ముందు, నిత్యం ఆయన కోవెలలో ఉన్న చీమలకు, దోమలకు, కీటకాలకు వస్తుంది...

ఎందుకనగా అవి నిత్యం ఆయనను అంటిపెట్టుకుని ఉంటున్నాయి కాబట్టి...ఆదిత్యయోగీ..


ఆయన దగ్గర నుంచి పారమార్థిక జీవిత రహస్యం , తెలుసుకున్న దానికి  నిదర్శనంగా మన జీవన సరళిలో ఏదైనా మంచి మార్పు కన పడాలి...

మనలోనుండి మధుర భాషణం, విజయ, పరాజయాలకు పొంగని, కృంగని ఆత్మ నిగ్రహం మనము ప్రదర్శించాలి...

ఇవన్నీ మన భక్తికి సంకేతాలు, లేశమైన అహంభావము లేకుండా, భగవంతుని శరణాగతి పొందాలి...  

అప్పుడే మనము భక్తులు అని పించుకోగల అర్హత పొంద గలుగుతాము...

.

 ప్రత్యయస్య పరచిత్త జ్ఞానమ్


ఇదే విధంగా సంయమం ద్వారా పరుల చిత్తమును అతీత జ్ఞానముతో పరిశీలించిన యోగికి పరుల చిత్త జ్ఞానము కూడా లభిస్తుంది. ప్రతి మనిషి ప్రవర్తన అతడి చిత్తముపై ఆధారపడి వుంటుంది.


ఒక మనిషి లాగా మరొకమనిషి ప్రవర్తించకపోవడానికి అతడి మనస్సులో పుట్టే


ఆలోచనలే కారణం. ఆ ఆలోచనలనుబట్టే అతడి తీరు. ప్రవర్తన చర్యలు జరుగుతుంటాయి. ఇవి ఒక మనిషిని పోలి మరొక మనిషికి ఎప్పుడూ వుండవు. ఇందుచేతనే అనేక కోట్ల


మందిలో ప్రతి ఒక్కరూ ఎవరికి వారుగా గుర్తించ బడతారు.


ఈ చిత్త ప్రవృత్తులు ఆ వ్యక్తి ముఖ భావాలు, చూపులు, హావభావాల ద్వారా బహిర్గత మవుతుంటాయి. మనం ఒక మనిషిని చూస్తూనే అతడుచాలాకోపంగా వున్నాడని గ్రహించగలుగుతాము. అలాగే మరొకడి ముఖాన్ని బట్టి అతడు సంతోషంగా వున్నాడనో, దుఖ్కంతో వున్నాడనో గ్రహించగలుగుతాము.


మనకి ఇలాంటి గ్రహింపుకి కారణం ఆయా వ్యక్తుల హావభావాలు. ఈ హావభావాలనేవి


చిత్తములోని ఆలోచనలకి ప్రతిబింబాలుగా ప్రదర్శించబడుతాయి.ఆదిత్యయోగీ..


కనుక ఈ హావభావాలని బట్టి అతడి చిత్తములో ఎలాంటి భావాలు నెలకొని వున్నాయో సులభంగా గ్రహించగలము.అయితే మరికొందరుంటారు. వారి చిత్తములో ఎలాంటి సంఘర్షణలు జరుగుతున్నా హావభావాల ద్వారా బయటపడకుండా జాగ్రత్తపడతారు. నిండు కుండ తొణకదంటారే, అట్లా! అయినప్పటికే అలాంటి వారిని పలకరించినప్పుడు 'నాకేం. నేను బాగానే వున్నా' నంటూనే అప్రయత్నంగా సూక్ష్మంగా తమ హావభావాల ద్వారా చిత్త వృత్తిని ప్రదర్శిస్తారు. అప్పుడు మనం 'అతడలా అంటున్నాడు గానీ, మనస్సులో ఏదో వుంది' అనుకుంటాము. దీనినే చిత్తవృత్తి అంటారు.


సమాధి స్థితి పొందిన యోగికి సాధనకి పూర్వము నుండి తన చిత్త వృత్తుల తీరు స్వానుభవమే. అతడు యోగాభ్యాస సాధన ద్వారా చిత్త వృత్తులను వరుసగా జయిస్తూ సమాధి స్థితి పొందుతాడు.


అంటే అనేక భావాలకి ఆలవాలమైన తన చిత్తమును తన వశం చేసుకుంటాడు. అట్టి అనుభవజ్ఞానం తనకి వుండటం చేత, ఎట్టి కోరికలూ, వృత్తులూ లేక శూన్యంగా వున్న తన చిత్తమును పరచిత్తముతో సంయమం చేస్తాడు.


అంటే ఇతరులచిత్త స్థితిగతులను శూన్యంగావున్న తన చిత్తముద్వారావశం చేసుకున్నప్పుడు ఇతరులచిత్తము ఎలావుంది? అప్పుడే విషయం ఆలోచిస్తోంది? అది ప్రశాంతంగా వుందా? అలజడత్వస్థితిలో ఉందా? మట్టిముద్దలావుందా? అనేకసంఘర్షణలతో సతమతమవుతోందా?' అనేవిషయాలు తనకి లభించిన అతీంద్రియ జ్ఞానం ద్వారా తెల్సుకోగలుగుతాడు...


అయితే, ఈ పరచిత్త జ్ఞానము పరుల చిత్తము యొక్క స్థితి గతులను మాత్రమే గ్రహించగలదు.


అంటే ఆ వ్యక్తి చిత్తము సంతోషంగా వుందా? దుఃఖ్క పూరితమై వుందా? ఏదైనా సంఘర్షణలతో బాధింపబడుతోందా? లేక ఆలోచనారహితంగా జడత్వంలా వుందా? ఇలా ఆ వ్యక్తిచిత్తముఏస్వరూపాన్నిధరించివున్నదోమాత్రమేటయోగిచిత్తము గ్రహించగలుగుతుంది.


అంతేగానీ ఆ వ్యక్తి సంతోషము లేదా దుఃఖ్కమునకు కారణం ఏమిటో, ఆ చిత్తము ఏ విషయం గురించి ఆలోచించడం వల్ల అలాంటి చిత్త స్వరూపం కలిగిందో ఆ విషయం లేదా ఆ వస్తువు ఏమైవుంటుందో, దాన్ని గ్రహించే జ్ఞానం కలగదు. ఆ చింతన ఆ వ్యక్తికి మాత్రమే స్వంతం.


కేవలం ఆ వ్యక్తి చిత్తములో కలిగిన భావ స్వరూపాన్ని మాత్రమే యోగి చిత్త జ్ఞానము గ్రహించగలుగుతుంది.అనగా యోగి చిత్తమునకు వశమైనది ఆ వ్యక్తి చిత్తమే గానీ, ఆ చిత్త క్షోభకి కారణమైన విషయవస్తువు కాదు. కనుక ఆ వ్యక్తి చిత్తము యొక్క స్థితి గతి ఏవిధంగా వున్నదోనని మాత్రమే యోగి చిత్తము గ్రహించగలుగుతుంది..*

.

తెలుగు సంపద. అష్టావధానం

 


శ్రీభారత్ వీక్షకులకు శ్రీక్రోధి నామ ఉగాది శుభాకాంక్షలు 🌹 అవధాన విద్య మన తెలుగు సంపద. అష్టావధానం, శతావధానం, సహస్రావధానం, బృహత్ సహస్రావధానం వంటి ఎంతో వైవిధ్యంతో, విభిన్న రూపాలలో అలరారే ఈ విద్యను సాక్షాత్తు సరస్వతీ రూపంగా చెబుతారు. నాలుగైదు శతాబ్దాల చరిత్ర కలిగిన ఈ అవధాన విద్య ను, దానిలో ఆరితేరిన ఎందరో అవధానుల గురించి శ్రీభారత్ వీక్షకులకు సీరియల్ గా పరిచయం చేస్తున్నారు ప్రముఖ సాహితీవేత్త ఆచార్య వేణు గారు. ఇటువంటి విశిష్టమైన ఎపిసోడ్స్ ఉచితంగా వీక్షించడానికి వెంటనే చానల్ ను subscribe చేయండి, శ్రీభారత్ కుటుంబ సభ్యులు కండి.🙏

షడ్రుచుల కొత్త ఉగాది

 


శ్రీభారత్ వీక్షకులకు శ్రీక్రోధి నామ ఉగాది శుభాకాంక్షలు 🌹కోయిల రాగాలు, కొత్త పలుకులు నవ వసంతం, చైత్ర సంగీతం... ఇవన్నీ కలిస్తే షడ్రుచుల కొత్త ఉగాది. చక్కటి ఉగాది పాటలతో కొత్త వసంతాన్ని ఆహ్వానించారు ప్రముఖ రచయిత్రి శ్రీమతి వాణీ ప్రభాకరి గారు. ఉగాది పండుగను ఎలా జరుపుకోవాలో, ఎలాంటి ఆనందాన్ని అనుభవించాలో చక్కగా వివరించారు. కొత్త ఉగాది, కొత్త కోయిల, కొత్త పలుకులు.. వినండి. ఇటువంటి విశిష్టమైన ఎపిసోడ్స్ ఉచితంగా వీక్షించడానికి వెంటనే చానల్ ను subscribe చేయండి, శ్రీభారత్ కుటుంబ సభ్యులు కండి.🙏

దివ్య రామాయణ

 *ఉగాది నుంచి శ్రీరామనవమి వరకు ఇంటింటా ప్రతిరోజూ దివ్య రామాయణ  పారాయణం*


        🌸🌸🌸🌸

           *1 వ  రోజు*


గురుర్ బ్రహ్మ గురుర్విష్ణు… గురుదేవో మహేశ్వరః

గురు సాక్షాత్ పర బ్రహ్మ… తస్మై శ్రీ గురవే నమః


శ్రీ విద్యాం శివవామ భాగ నిలయాం… హ్రీంకార మంత్రోజ్జ్వలాం

శ్రీ చక్రాంకిత బిందుమధ్య వసతిం… శ్రీమత్సభా నాయకీమ్

శ్రీ మత్‌షణ్ముఖ 

విఘ్నరాజ జననీం

శ్రీ మజ్జగన్మోహినీం… మీనాక్షీం ప్రణతోస్మి సంతత మహం…

కారుణ్య వారాంనిధిమ్‌…

               ***

శ్రీరాఘ‌వం ద‌శ‌ర‌థాత్మ‌జ మ‌ప్ర‌మేయం 

సీతాప‌తిం ర‌ఘుకులాన్వ‌య ర‌త్న‌దీపం

ఆజానుభాహుం అర‌వింద ద‌ళాయ‌తాక్షం

రామం నిశాచ‌ర వినాశ‌క‌రం న‌మామి.

                ****


 శ్రీ‌మ‌ద్ రామాయ‌ణం ఆదికావ్యం.

 వాల్మీకి మ‌హ‌ర్షి, బ్ర‌హ్మ అనుగ్ర‌హంతో 

మాన‌వాళిని త‌రింప‌చేయ‌డానికి ఈ మ‌హాకావ్యాన్ని మ‌న‌కు అందించారు.


వాల్మీకి మ‌హ‌ర్షి ఒక‌రోజు త‌మ‌సా న‌దికి స్నానాకి వెళ్ళాడు. 

అక్క‌డ ఎదురుగా ఉన్న ఒక చెట్టు కొమ్మ‌మీద క్రీడిస్తూ ఆనంద‌సాగ‌రంలో ఉన్న ఒక ప‌క్షుల జంట‌లోని మ‌గ‌ప‌క్షిపై కిరాతుడు ఒక‌డు బాణం వేశాడు. అది విల‌విలకొట్టుకుంటూ నేల‌రాలింది. ఆ బాణం దెబ్బ‌తో ఆ మ‌గ‌ప‌క్షి ప్రాణాలు విడిచింది. ఆ మ‌గ‌ప‌క్షి చుట్టూ తిరుగుతూ  ఆడ‌ప‌క్షి విల‌పిస్తుండ‌డం చూసిన వాల్మీకి మ‌హ‌ర్షి మ‌న‌సు ద్ర‌వించింది. ఆయ‌న హృద‌య లోని  శోకం,  శ్లోకంగా మారింది.


 మా నిషాద ప్రతిష్ఠాం త్వ మగమః శాశ్వతీః సమాః|

యత్ క్రౌంచమిథునాదేకమ్ అవధీః కామమోహితమ్| |


ఓ కిరాతుడా! క్రౌంచ పక్షులజంటలో కామ పరవశమైయున్న ఒక (మగ) పక్షిని చంపావు. అందువలన నీవు ఎక్కువకాలము జీవించియుండవు. (శాశ్వతముగా అపకీర్తి పాలగుదువు) అని ఆ కిరాతుడిని శ‌పించాడు . అదే క్ష‌ణంలో బ్ర‌హ్మ ప్ర‌త్య‌క్ష‌మై నీ నోట స‌ర‌స్వ‌తి ప‌లికింది. క‌విత్వం జాలువారింది. నువ్వు రామాయ‌ణ మ‌హాకావ్యాన్ని ర‌చించి మాన‌వాళిని త‌రింప‌చేయి . అది భూలోకంలో శాశ్వ‌తంగా ఉంటుంది.,అని  సూచించి అక్క‌డినుంచి వెళ్లిపోయాడు.


     *బాల‌కాండ*


అయోధ్యాన‌గ‌రంలో శ్రీ రామ ల‌క్ష్మ‌ణ భ‌ర‌త శ‌తృఘ్నులు ధ‌నుర్ విద్య‌లో ప్రావీణ్యం సంపాదిస్తున్నారు.మ‌హ‌ర్షుల యాగాల‌కు ఆటంకం క‌లిగిస్తున్న రాక్ష‌సుల‌ను అంతం చేయ‌డానికి ద‌శ‌ర‌థ‌మ‌హారాజు సాయం కోరి విశ్వామిత్రుడు అయోధ్యా న‌గ‌రానికి విచ్చేశాడు. రాజ‌మందిర ద్వారం వ‌ద్ద నిల‌బ‌డి త‌న రాక‌ను ద‌శ‌ర‌థ మ‌హారాజుకు తెలియ‌జేయ‌మ‌న్నాడు. విష‌యం తెలిసిన వెంట‌నే ద‌శ‌ర‌థుడు స‌క‌ల మ‌ర్యాద‌ల‌తో విశ్వామిత్ర మ‌హ‌ర్షికి సాద‌ర స్వాగ‌తం ప‌లికాడు. ఏం కావాల‌న్నా ఇస్తాన‌న్నాడు. విశ్వామిత్రుడు తాను వ‌చ్చిన ప‌నిని వివ‌రించాడు. మారీచ సుబాహువుల‌నే రాక్ష‌సులు య‌జ్ఞ‌యాగాల‌కు ఆటంకం క‌లిగిస్తున్నారు. వారిని శ‌పించ‌వ‌చ్చు కానీ, యజ్ఞ క్ర‌తువులో నిమ‌గ్న‌మైన‌పుడు కోపం ద‌రిచేర‌కూడ‌దు. అందువ‌ల్ల వారిని శ‌పించ‌డం లేదు.  ఇలాంటి ప‌రిస్థితుల‌లో యాగ‌రక్ష‌ణ జ‌ర‌గాలంటే శ్రీ‌రాముడిని త‌న వెంట పంపాల‌ని విశ్వామిత్రుడు ద‌శ‌ర‌థ మ‌హారాజు ను కోరాడు. ఈ మాట వింటూనే ద‌శ‌ర‌థుడికి దిక్కుతోచ‌లేదు. లేక లేక క‌లిగిన సంతానాన్ని ఇలా రాక్ష‌స సంహారానికి పంప‌డ‌మా అని బాధ‌ప‌డ్డాడు. రాముడి  బ‌దులు తాను వ‌స్తాన‌న్నాడు. ఏం కోరినా ఇస్తాన‌ని ఇప్పుడు మాట త‌ప్పుతావా ఇది రాజ‌ధ‌ర్మ‌మా అని విశ్వామిత్రుడు ద‌శ‌ర‌ధుడిని ప్ర‌శ్నించాడు . వ‌శిష్ఠుల వారి సూచ‌న మేర‌కు విశ్వామిత్రుడి వెంట రామ‌ల‌క్ష్మ‌ణుల‌ను పంప‌డానికి నిర్ణ‌యించాడు. 

అలా విశ్వామిత్రుడి వెంట రామ‌ల‌క్ష్మ‌ణులు ముందుకు సాగుతున్నారు.  అలా త‌న‌ను అనుస‌రిస్తున్న రామ‌ల‌క్ష్మ‌ణుల‌కు   స‌రయూ న‌దీతీరంలో - ఆక‌లి, ద‌ప్పిక‌లు లేకుండా బ‌ల , అతి బ‌ల అనే విద్య‌ల‌ను విశ్వామిత్రుడు వారికి అనుగ్ర‌హించాడు. దీనివ‌ల్ల వారికి ఎన్న‌టికీ ఆక‌లి , ద‌ప్పిక‌లు ఉండ‌వు.

 ఆ రాత్రి వారు అక్క‌డే విశ్ర‌మించారు. 

మ‌రునాడు ఉద‌యం తెల తెల వారుతుండ‌గా


కౌసల్యా సుప్రజా రామ పూర్వాసంధ్యా ప్రవర్తతే ।

ఉత్తిష్ఠ నరశార్దూల కర్తవ్యం దైవమాహ్నికం ॥ 1 


కౌసల్యాదేవికి సుపుత్రుడవగు ఓ రామా! 

పురుషోత్తమా! తూర్పు తెల్లవారుతోంది, దైవ సంబంధాలైన కార్య‌క్ర‌మాలు  చేయవలసి ఉంది. క‌నుక లెమ్ము అంటూ ఆ శ్రీ‌రామ చంద్ర‌మూర్తిని, విశ్వామిత్ర మ‌హ‌ర్షి మేల్కొలిపాడు. 

మ‌హ‌ర్షి మేల్కొలుపుతో లేచి, సంధ్యావంద‌నాది కార్య‌క్ర‌మాలు ముగించుకుని వారు అక్క‌డి నుంచి బ‌య‌లుదేరారు. అలా న‌డుచుకుంటూ వారు మ‌హార‌ణ్యంలో ఒక జ‌న‌ప‌దం చేరారు. అక్క‌డ తాట‌క అనే రాక్ష‌సి ఉంటున్న‌ది. దాని గురించి రాముడికి తెలిపాడు మ‌హ‌ర్షి. అగ‌స్త్యుని ఆశ్ర‌మ ప్రాంతాన్ని ధ్వంసం చేస్తూ , జ‌నాన్ని తింటూ ఇది బ‌తుకుతున్న‌ద‌ని రాముడికి వివ‌రించాడు. దీనికి వెయ్యి ఏనుగుల బ‌లం ఉంటుంద‌ని చెప్పాడు. తాట‌క స్త్రీ క‌దా చంప‌డం ఎలా అని సంకోచించ‌కుండా , దుష్ట శ‌క్తిని సంహ‌రించ‌మ‌ని సూచించాడు విశ్వామిత్రుడు.

రాముడు ధ‌నుష్ఠంకారం చేశాడు. ఆశ‌బ్దానికి తాట‌కి ఉగ్రురూపిణి అయి శ‌బ్దం వ‌చ్చిన దిక్కుగా వ‌చ్చింది. రాముడు దాని చేతులు ఖండించాడు. సాయంత్రం అయితే దాని బ‌లం ఇంకా పెరుగుతుంది క‌నుక వెంట‌నే దానిని సంహ‌రించ‌మ‌న్నాడు. రాముడు తాట‌కిని సంహ‌రించాడు. వెంట‌నే విశ్వామిత్రుడు రాముడికి దివ్యాస్త్రాలు అనుగ్ర‌హించాడు.  దండ‌చ‌క్ర‌, ధ‌ర్మ‌చ‌క్ర‌, కాల‌చ‌క్ర‌, విష్ణు చ‌క్ర‌,బ్ర‌హ్మాస్త్ర‌, కాల‌పాశ‌,ధ‌ర్మ‌పాశ‌, వ‌రుణ‌పాశ‌, ఆగ్నేయాస్త్రం, వాయ‌వ్యాస్త్రం ఇలా స‌మ‌స్త్ర అస్త్రాల‌నూ అనుగ్ర‌హించాడు.

 తాట‌కి వ‌ధ‌తో లోకం లో పుష్ప వ‌ర్షం కురిసింది. అక్క‌డి నుంచి విశ్వామిత్ర మ‌హ‌ర్షి యాగం చేస్తున్న సిద్ధాశ్ర‌మానికి వారు చేరుకున్నారు.

అక్క‌డ విశ్వామిత్ర మ‌హ‌ర్షి యాగం మొద‌లు పెట్టారు. అంతే రాక్ష‌సులు మారీచ సుబాహువుల అనుచ‌ర‌గ‌ణం అక్క‌డ‌కు చేరుకుంది. రాముడు బాణాల వ‌ర్షం కురిపించి వారిని హ‌త‌మార్చాడు. తాట‌క కొడుకు మారీచుడిపై బాణం సంధించాడు. వాడు వంద‌యోజ‌నాల దూరంలో స‌ముద్రంలో పోయి ప‌డ్డాడు.

ఇక రాక్షసులు ఎవ‌రూ అటువైపు క‌న్నెత్తి చూడ‌లేదు. యాగం నిర్విఘ్నంగా సాగిపోయింది. 

ఆ త‌ర్వాత వారు అక్క‌డ నుంచి మిథిలా న‌గ‌రానికి బ‌య‌లుదేరారు. మార్గ‌మ‌ధ్యంలో వారు గౌత‌మ మ‌హ‌ర్షి ఆశ్ర‌మం చేరుకున్నారు. అక్క‌డ అహ‌ల్య శాప గాథ‌ను విశ్వామిత్రుడు రాముడికి తెలిపాడు. నీ పాద స్ప‌ర్శ‌తో ఆమెకు  పూర్వ రూపం వ‌స్తుంద‌న్నాడు.  రాముడి దృష్టి ప‌డ‌గానే అహ‌ల్య పూర్వ రూపంతో లేచి నిల‌బ‌డింది. రామ‌ల‌క్ష్మ‌ణులు ఆ సాధ్వీమ‌త‌ల్లికి న‌మ‌స్క‌రించి ముందుకు సాగారు. మిథిలా న‌గ‌రంలో సీతా స్వ‌యంవ‌రం వార్త తెలుసుకుని విశ్వామిత్ర మ‌హ‌ర్షి రామ‌ల‌క్ష్మ‌ణుల‌ను మిథిల‌కు తీసుకువెళ్లాడు. శివ‌ధ‌న‌స్సును విరిచి సీతమ్మ‌త‌ల్లిని స్వ‌యంవ‌రంలో రామ‌చంద్ర‌మూర్తి ద‌క్కించుకున్నాడు. ద‌శ‌ర‌థుడికి క‌బురుపంపి సీతారామ క‌ల్యాణానికి ఏర్పాట్లు చేశారు.  ల‌క్ష్మ‌ణ భ‌ర‌త‌శ‌త్రుఘ్నుల‌కూ వివాహాలు జ‌రిపించారు. 

ద‌శ‌ర‌థుడు కొడుకులు, కోడ‌ళ్ల‌తో అయోధ్య‌కు బ‌య‌లుదేరాడు. మార్గ మ‌ధ్యంలో ప‌ర‌శురాముడు ఎదురై, శివ‌ధ‌నుస్సు విరిచినందుకు రాముడిపై ఆగ్ర‌హించాడు.  నూత‌న వ‌ధూవ‌రుల‌పై ఆగ్ర‌హం త‌గ‌ద‌ని ద‌శ‌ర‌ధుడు ప‌ర‌శురాముడిని వేడుకున్నాడు. కుద‌ర‌ద‌న్నాడు. త‌న ద‌గ్గ‌ర  ధ‌నుస్సు తీసుకుని బాణం ఎక్కుపెట్ట‌మ‌ని రాముడికి సవాలు విసిరాడు. రాముడు బాణం సంధించి వ‌దిలాడు. వ‌దిలిన బాణం ల‌క్ష్యాన్ని ఛేధించ‌క త‌ప్ప‌దు. నీ న‌డ‌క‌ను నిరోధించ‌నా  లేక నీవు త‌ప‌స్సుతో ఆర్జించిన పుణ్య‌లోకాల‌ను  వ‌దిలించ‌నా అన్నాడు రాముడు. పుణ్య‌లోకాల‌ను వ‌దిలిస్తే మ‌ళ్లీ త‌ప‌స్సు చేసి సాధించుకుంటాన‌ని పుణ్య‌లోకాల‌ను వ‌దులుకున్నాడు ప‌రశురాముడు.

రాముడి శ‌క్తి సామ‌ర్ధ్యాల‌ను కీర్తించి ప‌ర‌శురాముడు అక్క‌డి నుంచి వెళ్లిపోయాడు.


ఇక అక్క‌డ నుంచి ర‌థాలు అయోధ్య దిశ‌గా క‌దిలాయి........


            *****

ఆపదా మపర్తారం దాతారం సర్వసంపదామ్

లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహమ్.


        ****

శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే

సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే

       *****

రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేథసే 

రఘునాథాయ నాథాయ సీతాయాః పతయే నమః

 శ్రీరామ రామ 

రఘునందన రామ రామ!

 శ్రీరామ రామ 

భరతాగ్రజ రామ రామ! 

శ్రీరామ రామ 

రణకర్కశ రామ రామ!

 శ్రీరామ రామ శరణం

 భవ రామ రామ!

 శ్రీరామ చంద్ర చరణౌ

 మనసా స్మరామి!

 శ్రీరామ చంద్ర చరణౌ

 వచసా గృహ్ణామి! 

శ్రీరామ చంద్ర చరణౌ

 శిరసా నమామి! 

శ్రీరామ చంద్ర చరణౌ 

శరణం ప్రపద్యే!.

                         ****

                    

     ( బాల‌కాండ స‌మాప్తం)