30, నవంబర్ 2020, సోమవారం

వివాహము విధాలు

 వివాహము విధాలు - వివాహ లగ్నము


వివాహము అంటే సమాజంలో ఇద్దరు భాగస్వామ్యుల మధ్య హక్కులు, బాధ్యతలను స్థాపించే ఒక చట్టబద్ధమైన ఒప్పందం. యువతీ-యువకుడు పెద్దల సమక్షంలో.. అగ్నిసాక్షిగా వేద మంత్రాల నడుమ పెళ్లాడటమన్నది సంప్రదాయం. పెండ్లి, వివాహం, పాణిగ్రహణం, కన్యాదానము, కళ్యాణము, సప్తాపది అనే పలు విధములుగా అర్థాలు ఉన్నాయి.


వివాహము అనేది మన శాస్త్ర, పురాణాల్లో 8 రకాలుగా ఉన్నాయి. అందులో.. బ్రహ్మం, దైవం, ఆర్షం, ప్రాజాపత్యం, అసురం, గాంధర్వం, రాక్షసం, పైశాచం అని పేర్లు ఉన్నాయి.


వీటిలో మొదటిది బ్రహ్మ వివాహం. వేదం చదివిన సచ్ఛీలవంతునికి పూజించి ఇచ్చే కన్యాదానాన్ని బ్రహ్మ వివాహం అంటారు. కన్యను అలంకరించి వరునికి ఇచ్చి జరిపించే వివాహం ఇది.


2వది దైవ వివాహం. యజ్ఞంలో రుత్విక్‌‌కు అలంకరించిన కన్యాదానంగా చెబుతారు. గోమిధునాన్ని వరుని నుంచి స్వీకరించి కన్యాదానం చేస్తే దాన్ని అర్ష (అర్షం) వివాహంగా చెబుతారు. మీరిద్దరు కలిసి ధర్మాచరణ చేయండి అని వరుడుని పూజించి కన్యాదానం చేస్తే దాన్ని ప్రాజాపత్య వివాహం అని పిలుస్తారు.


అదేవిధంగా.. జ్ఞానులు కన్యకు తన శక్తిమేరకు డబ్బిచ్చి వివాహం చేసుకుంటే దాన్ని అసుర వివాహంగా చెబుతారు. వధూవరులు పరస్పరం ఇష్టపడి స్వయంగా వివాహం చేసుకుంటే దాన్ని గాంధర్వ వివాహంగా చెబుతారు. బలవంతంగా తనంటే ఇష్టం లేని కన్యను అపహరించి వివాహం చేసుకుంటే అది రాక్షస వివాహం. నిద్రిస్తున్న మత్తులో ఉన్న స్త్రీని రహస్యంగా సంగమించుట ద్వారా వివాహమాడినట్లయితే అది పైశాచిక వివాహం.


వివాహ లగ్నము - వైవాహిక జీవితం

కుండలి స్థితిలో ఉన్న గ్రహములు వైవాహిక జీవితాన్ని సుఖమయంగా, కలహపూర్ణంగా చేయగలదని శాస్త్రం చెబుతోంది. అయితే ఈ తత్వములు ప్రమాణికమైనవి. యది వైవాహిక లగ్నమును సరైన రీతిలో విచారణ చేస్తే, వివాహం తర్వాత దాంపత్య జీవితంలో కలిగే సమస్యలు తగ్గుతాయి. వైవాహిక జీవితం సుఖమయమవుతుంది.


వివాహ సంస్కారములను వ్యక్తి రెండవ జీవితంగా గుర్తిస్తారు. దీని ప్రకారం వివాహ సమయములో శుభ లగ్నము.. మహత్యం కలిగి ఉండును, జన్మ కుండలిలో లగ్న స్థానములో శుభ గ్రహములు స్థితిలో ఉండును. వివాహం కొరకు లగ్నమును నిశ్చయించు సమయములో వధువు, వరుని కుండలిని గమనించి వివాహ లగ్నమును నిశ్చయించవలసి ఉంటుంది. కుండలి లేకపోతే గనక వరుడు, కన్య పేరులో ఉన్న రాశికి అనుగుణంగా లగ్నమును గుర్తించాలి. జ్యోతిష్య శాస్త్ర ప్రకారం.. జన్మ లగ్నము, రాశి నుంచి అష్టమ లగ్నం అశుభ ఫలదాయకముగా ఉండును. అంటే ఈ లగ్నంలో వివాహము గురించి ఆలోచించరాదు.


జన్మ లగ్నం, జన్మరాశి నుంచి 4వ, 12 వ రాశి గుణములను లెక్కించుటలో శ్రేష్టంగా ఉంటే గనక ఈ లగ్నంలో వివాహం సంభవము. అన్యతా జన్మ లగ్నము నుంచి చతుర్ధ, ద్వాదశ రాశితో లగ్నంలో వివాహం దోష పూరితంగా ఉండును. ఎవరి కుండలిలో లగ్నం నుంచి కేంద్ర స్థానములో శుభ గ్రహములు ఉండునో వారికి వివాహ లగ్న దోషం కలుగదు.


కుజ లగ్నం నుంచి బుధుడు, గురువు, శుక్రుడు యది కేంద్రంలో లేదా త్రికోణంలో ఉంటే గనక వివాహ లగ్నములో అనేక విధాలైన దోషములు.. అంటే దగ్దతిధి, గుడ్డి, చెవిడు కలుగవు. వివాహ లగ్నము సందర్భంను లెక్కించు సమయంలో రాహువు శనికి సరిసమమైన ప్రభావకారిగా ఉండును. ఇంకా కుజుడు కేతువుకు సమానంగా ఉండునని చెప్పదగ్గది.....మీ... *చింతా గోపీ శర్మ సిద్ధాంతి** *లక్ష్మీలలితా వాస్తు జ్యోతిష నిలయం* (భువనేశ్వరిపీఠం) పెద్దాపురం, సెల్:- 9866193557

Batakamma



 

God











 

క్షణభంగురం

 క్షణభంగురం


🍁🍁🍁🍁


 మా కురు ధన జన యౌవన గర్వం హరతి నిమేషాత్కాలః సర్వమ్

మాయామయమిదమఖిలం బుధ్వా బ్రహ్మపదం త్వం ప్రవిశ విదిత్వా ||


-----ఆదిశంకరుల భజగోవిందం నుండి


ధనము – జనము – యౌవనము చూచి గర్వపడకుము.వీటన్నిటినీ కాలము ఒక్కక్షణములో హరించును.


 మాయామయమయిన ఈ ప్రపంచమును విడిచి జ్ఞానివై బ్రహ్మపదము పొందుము.




ఈ ప్రపంచంలోని లౌకిక సంపదలన్నీ అనిత్యమైనవి, భ్రమాత్మకమైనవి.


 ఈ క్షణికమైన సంపదలను చూచుకొని మనిషి గర్విస్తాడు. అహంకరిస్తాడు. శాశ్వతమనుకొని భ్రమ పడతాడు. 


ధన జన యౌవన గర్వం:- కొందరికి ధన గర్వం, కావలసినంత ధనం ఉన్నదని, ఇళ్ళూ, వాకిళ్ళు, తోటలు, దొడ్లూ, భూములు, బ్యాంకు బ్యాలెన్సులూ ఉన్నాయని, ఎవరి దగ్గరా చేయి చాపనవసరం లేదని, గర్విస్తారు. వీటిని చూసుకొని కళ్లు మూసుకొని పోతాయి. ధన పిశాచి పట్టిన వాడికి భార్యా, పిల్లలు, బంధువులు, మిత్రులు, ఇరుగు, పొరుగు అనే భావం ఉండదు. అంతా డబ్బే. డబ్బున్నవారు మిత్రులు, డబ్బులేని వారు శతృవులు. అన్నింటిని డబ్బుతోనే విలువ కడతారు.  


 కొందరికి జనగర్వం. తన వెనుక ఎందరో ఉన్నారనుకుంటారు. తనవల్ల ఏదో ప్రయోజనం పొందాలని తన నాశ్రయించిన వారందరూ తనవారేననుకుంటారు. అందరూ తన శ్రేయోభిలాషులే అనుకుంటారు. సాధారణంగా రాజకీయ నాయకులు ఈ కోవలోకే వస్తారు. తన అధికారాన్ని చూచి తన చుట్టూ చేరిన వారిని చూచి గర్విస్తారు. కాని ‘అధికారాంతము నందు చూడవలె ఆ అయ్య సౌభాగ్యముల్’ అన్నట్లు అధికారం పోతే తెలుస్తుంది. తన శ్రేయోభిలాషులెవరో.


 ఇక కొందరికి యౌవన గర్వం. యవ్వనం శాశ్వతం అనుకుంటారు. శరీరంలోని బిగువులు ఎల్లప్పుడూ ఇలాగే ఉంటాయని అతడి గర్వం. ఆ గర్వంలో అతడు మంచి చెడూ గమనించడు. కళ్లు మూసుకుపోయి ప్రవర్తిస్తాడు. అహంభావంతో ఉంటాడు. ముసలివాళ్ళను ఎగతాళి చేస్తాడు. 


*హరతి నిమేషాత్కాలః సర్వం* :- ఈ మొత్తం ఒక్క క్షణంలో హరించిపోతాయి అని తెలిసుకోలేడు. ఒక్క 10 సెకండ్లు భూకంపం వస్తే నీ ఇళ్ళూ, వాకిళ్ళు, ధనసంపదలూ అన్నీ నేలమట్టమైపోతాయి. నాకేం? కోట్ల ఆస్తి ఉంది. బ్రహ్మాండమైన భవనం ఉంది అని గర్వించినవాడు మరుక్షణంలో ఎవరో దయతో పంపించే ఆహారపొట్లాల కోసం ఎగబడాల్సి వస్తుంది. ఇప్పుడేమయింది ఆ గర్వం? నీ ధనం నిన్ను రక్షిస్తుందా? నీ జనం నిన్ను రక్షిస్తారా? అలాగే యౌవనం కూడా ఎప్పుడూ శాశ్వతంగా ఉండేది కాదు. వృద్ధాప్యం ఎక్కిరిస్తూ మననెత్తి మీదికి వచ్చి కూర్చుంటుంది.


 కాబట్టి ఇదంతా మాయాజాలం అని, క్షణికమైనవని భావించు. అంటే అనుభవించు తప్పులేదు. కాని వాటితో సంగభావం పెట్టుకోకు.



T.me/namonarayana


🌸 *జై శ్రీమన్నారాయణ🌸* 


🍁🍁🍁🍁🍁

ధార్మికగీత - 96*

 🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲

                          *ధార్మికగీత - 96*

                                   *****

         *శ్లో:- నరత్వం దుర్లభం లోకే ౹*

                *విద్యా తత్ర సుదుర్లభా ౹*

                *వివేకో దుర్లభ స్తత్ర ౹*

                *దాతృత్వం చ విశేషతః ౹౹*   

                                        *****

*భా:- లోకంలో మిక్కిలి దుర్లభములు అని చెప్పదగినవి 4 ఉన్నాయి.1."నరత్వం" :- 84 లక్షల జీవరాసులలో నరజన్మ దుర్లభమని , శ్రేష్ఠమైనదని చెబుతున్నారు*. *మానవీయ,మాననీయ విలువల పరీమళాలతో దాన్ని సార్థకం చేసుకోవాలి. సమసమాజంలో మనీషిగా జీవించాలి. 2."విద్య":- నరునిగా పుట్టగానే సరిపోదు*. *అర్థము,పరమార్థము నివ్వగల విద్య నార్జించడం చాల కష్టము. దీక్ష-దక్షత; శ్రద్ధ-ఆసక్తి; నయము-భయము;* *వినయము-విధేయత;నిష్ఠ-నీమము లేనిదే చదువు వీసమైనా అబ్బదు. విద్యలేనివాడు* *వింతపశువే గదా! 3."వివేకము":- మనిషిగా పుట్టవచ్చు. అనేక విద్యలు నేర్వవచ్చు. కాని అట్టి వానికి "వివేకము" ఉండడం మిక్కిలి కష్టము. పశుత్వము నుండి మనిషిని వేరుచేసేది*వివేకము -విచక్షణ" అని గమనించాలి.అది లేని వ్యక్తి వాసన లేని పుష్పమే*.

 *4."దాతృత్వము":- నరునిగా పుట్టాడు. విద్యావంతుడైనాడు. వివేకం తోడైనది. కాని అతనికి "దానగుణం" అబ్బడం కుదరని పని. ఒక వేళ అబ్బితే విశేషాతిశయమే. కాన ఉత్తమ నరునిగా పుట్టి, విద్యాప్రావీణ్యంతో, వివేకవర్తనుడై , దానగుణంతో మానవసేవయే మాధవసేవగా, పరోపకారమే పరమార్థముగా, సేవలందిస్తూ, సుఖ జీవన యానం చేయాలని సారాంశము*.

                                  *****

                  *సమర్పణ : పీసపాటి*

🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲

శ్రీమన్నారాయణీయం

 *శ్రీమన్నారాయణీయం*


శ్రీ కృష్ణుని విషయానికి వస్తే నాలుగు ఆలయాలను ప్రధానంగా చెప్పుకోవచ్చు. ఇవి ఉత్తర భారతంలో ఉత్తరప్రదేశ్ లోని మధుర, గుజరాత్ రాష్ట్రంలో ద్వారక, కేరళలోని గురువాయూరు, కర్ణాటకలోని ఉడుపి.


నారాయణీయంతో సంబంధంవున్న గురువాయూర్ గురించి చూద్దాం. దక్షిణ ద్వారకగా పిలవబడే ఈ క్షేత్రంలో శ్రీకృష్ణుడు 'గురువాయూరప్పన్' అనే పేరుతో కొలవబడుతున్నాడు. 


నాలుగు చేతులలో పాంచజన్య శంఖం, సుదర్శన చక్రం, కౌమోదకం, పద్మాలయాలను ధరించి తులసి మాలలతో, ముగ్ధ మనోహర రూపంతో అలరించే బాలగోపాలుడి ఆలయం "గురువాయూర్". 


కేరళలోని త్రిసూర్‌కు 30 కిలోమీటర్ల దూరంలో ఉండే ఈ ఆలయంలోని స్వామిని కన్నన్, ఉన్నికృష్ణన్ (బాలకృష్ణుడు), ఉనికన్నన్, గురువాయురప్పన్ అనే పేర్లతో కొలుస్తుంటారు.


ఇక్కడి శ్రీకృష్ణ విగ్రహ ప్రతిష్ఠకు ముఖ్య కారకులు గురు - వాయువులు కాబట్టి ఈ ఊరిని 'గురువాయూరు' (గురువు+వాయువు+ఊరు) గా నిర్ణయించారు.


ఐదువేల సంవత్సరాలక్రితం నాటిదిగా చెప్పే ఆలయ గర్భగుడిలోని నారాయణ విగ్రహం పౌరాణిక ప్రాశస్త్యమైనది. ఈ విగ్రహాన్ని బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ముగ్గురూ ఆరాధించారని పురాణేతిహాసాలు చెబుతున్నాయి. పాతాళశిలతో తయారైన ఈ విగ్రహాన్ని వెుదట శివుడు బ్రహ్మకు ఇచ్చాడనీ ఆయన దాన్ని సంతానంకోసం తపిస్తోన్న సూతపాశ ఋషికి ప్రసాదించాడనీ, ఆయన నుంచి వారసత్వంగా కశ్యప ప్రజాపతి అందుకోగా ఆయన దాన్ని వసుదేవుడికి అనుగ్రహించగా, తండ్రి నుంచి దాన్ని శ్రీకృష్ణుడు అందుకుని ద్వారకలో ప్రతిష్ఠించి పూజించాడనీ పురాణాలు చెబుతున్నాయి. 


స్వర్గారోహణ సమయంలో కృష్ణుడు తన శిష్యుడైన ఉద్ధవుని పిలిచి 'త్వరలోనే ద్వారక సముద్రంలో మునిగిపోతుందనీ అప్పుడు ఈ విగ్రహం నీళ్లలో తేలుతుందనీ దాన్ని దేవతల గురువైన బృహస్పతికి అందజేయమ'నీ చెప్పాడని పురాణప్రతీతి. ఉద్ధవుని సందేశం ప్రకారం బృహస్పతి- వాయుదేవుడి సహాయంతో కేరళ తీరానికి వచ్చాడట.


అక్కడ ఓ కోనేరు సమీపంలో శివుడు తపస్సు చేస్తూ కనిపించి ఆ విగ్రహాన్ని కోనేటి ఒడ్డున ప్రతిష్ఠించమని చెప్పాడట. అదే ఈ విగ్రహ ప్రాశస్త్యం. ఆ కోనేరే నేటి రుద్రతీర్థం. గురువు-వాయువు ఇద్దరూ కలిసి ప్రతిష్ఠించడంవల్లే ఈ ప్రాంతం గురువాయూర్‌గా ప్రసిద్ధిచెందింది. 


గురువాయురప్ప బాలకృష్ణుడి రూపంలో భక్తులకీ అర్చకులకీ కలల్లో కనిపించి వాళ్ల తప్పొప్పుల్ని విప్పిచెప్పిన వైనం గురించిన గాథలెన్నో. ఆయన గురించి భక్తులూ, పురాణేతిహాసాలూ చెప్పేవన్నీ ఒక ఎత్తు. కవితాత్మకంగా కృష్ణుణ్ణి కీర్తిస్తూ నారాయణ భట్టతిరి రాసిన నారాయణీయం మరో ఎత్తు. 


ఇక్కడి క్రృష్ణుడిని భక్తులు గురువాయురప్పని కన్నన్‌, ఉన్నికృష్ణన్‌, బాలకృష్ణన్‌... అంటూ పలుపేర్లతో అర్చిస్తారు. ప్రధానపూజారి వేకువజామున 3 గంటలకే పచ్చిమంచినీళ్లు కూడా ముట్టకుండా ఆలయంలోకి ప్రవేశించి నాదస్వరంతో చిన్నికృష్ణుణ్ణి నిద్రలేపుతారు. దీన్నే నిర్మలదర్శనం అంటారు. రోజూ విగ్రహాన్ని పాలు, గులాబీ అత్తరు, కొబ్బరినీళ్లు, గంధాలతో అభిషేకించి, పట్టుపీతాంబరాలూ స్వర్ణాభరణాలతో అలంకరిస్తారు. 


బియ్యప్పిండి, బెల్లం, నెయ్యితో చేసిన తీపిరొట్టెలు; కొబ్బరి ఉండలు; కొబ్బరిపాలు, బెల్లం, బియ్యంతో చేసిన పాయసం; పాలలో ఉడికించిన పిండిరొట్టెల్ని స్వామికి నైవేద్యంగా పెడతారు. 


పుత్తడితో చేసిన స్వామి ఉత్సవవిగ్రహాన్ని అంబారీ ఎక్కించి మేళతాళాలతో ప్రహరీలోపల ఆలయం చుట్టూ మూడుసార్లు తిప్పుకొస్తారు. 


గురువాయురప్ప సన్నిధిలో రోజూ ఎంతోమంది చిన్నారులకు అన్నప్రాశన నిర్వహిస్తారు. ఇలా చేయడంవల్ల భవిష్యత్తులో ఆ పిల్లలకి ఎలాంటి విపత్తూ వాటిల్లదనేది భక్తుల విశ్వాసం. అలాగే స్వామిసమక్షంలో వివాహబంధం ద్వారా ఒక్కటైతే జీవితం ఆనందమయంగా ఉంటుందన్న నమ్మకంతో ప్రముఖుల నుంచి సామాన్యులవరకూ ఇక్కడ పెళ్లిళ్లు చేసుకునేందుకు ఇష్టపడతారు. అందుకే కేరళలో మరే గుడిలో లేనన్ని కల్యాణాలు ఇక్కడ జరుగుతుంటాయి. 


ఇక్కడ నిత్యం జరిగే మరో వేడుక తులాభారం. తమ బరువుకి సమానంగా అరటిపండ్లు, బెల్లం, కొబ్బరికాయలు, పంచదారల్ని స్వామివారికి నివేదిస్తారు భక్తులు. 


ఆ గురువాయూర క్రృష్ణ ఆరాధనతో ఈ నారాయణీయం మొదలవుతుంది.


 స్వస్తి. 

🙏🙏🙏

సేకరణ

దశకరాము

శ్రీ సత్యనారాయణ స్వామి వ్రత మహాత్మ్య.ము

 శ్రీ సత్యనారాయణ స్వామి వ్రత మహాత్మ్య.ము



                 నాల్గవ అధ్యాయము 


అంత సాధువు , యల్లుడు యచట నున్న 

పుణ్యతీర్థంబు లెల్లను పూర్తిజేసి

విరివి దానంబు లిచ్చియు విప్రులకును 

పోవ సాగిరి సొంతూరు నావ పైన 119


అట్లు సంద్రంబు పైనను సాగుచుండ 

సత్యనారాయణస్వామి సాధుయొక్క 

సత్యశీలత వీక్షించ దలచి మదిలొ 

వచ్చె సన్యాసివోలెను వణిజు కడకు 120


అంత సన్యాసి వణిజుని చెంత కొచ్చి 

ప్రముఖునాతని, యాతనిపడవ జూచి 

"ప్రముఖవాణిజ్యశ్రేష్ఠుడా ! పడవలోన 

యేమి కల" వంచు యడిగెను యెరుగ దలచి. 121


యతి మాటలు విని వణిజుడు 

యతిమదమున పరిహసించి యపహాస్యమునన్ 

యితనొక దొంగని తలచియు 

మతిదప్పియు పలికెనిట్లు మఱచియు తనువున్ 122


"తస్కరుడ వీవు యడిగేవు తరచి తరచి 

సంగ్రహించెడి తలపున సంపదలను 

యాకు లలములు తీగెలు యంతె గాని 

యిందు యేమియు లేవింక వెడలు వెడలు " 123


అట్లు వణిజుడు బలుకగ నాలకించి 

" యట్లె యగుగాక " యనుచును యాగ్రహమున 

సత్యనారాయణస్వామి శాపమిచ్చి 

వెడలి నటనుండి నిలిచెను వేఱు స్థలిన. 124


సత్యదేవుని శాపాన సత్వరంబె 

నావలో నున్న సరుకులు నవ్య ధనము 

మాయమయ్యును లతలుగా మారిపోయి 

బరువు తగ్గియు యా నావ పైకి లేచె 125


కాలక్రియల పిదప గాంచెను వణిజుండు 

పడవ తేలికయ్యు పైకిలేవ 

పైకి లేచి నట్టి పడవను గాంచియు 

వింత జూచి మిగుల విస్తు పోయె 126


పడవ తేలి కవగ పరికించ వణిజుడు 

ధనపు మూటలెల్ల తరలి పోగ 

యాకు లలము లెల్ల యచ్చోట నగుపించె 

సత్యదేవు ఘోర శాపమునను 127



ధనమంతయు యావిధముగ 

కనులెదుటనె లేక జూచి కడు దుఃఖమునన్ 

తన కింకను దిక్కెవరని 

వణిజుడు యత్యంత గాను వలవల యేడ్చెన్ 128



మామ యారీతి యేడ్చుచు మహిని బడగ

యల్లు డత్యంత మదియందు తల్లడిల్లి 

"సర్వ మిది యయ్యె సన్న్యాసి శాపమునను"

యనియు మదినెంచి మామతొ ననియె నిట్లు 129


" ఇప్పు డిట్లేడ్వ సమకూరు నేమి ఫలము ?

శాపమిచ్చిన సన్యాసి సర్వ జ్ఞాని 

యతని పాదంబులంబడి యాశ్రయించ 

కామితంబును దీర్చును కరుణ జూపి " 130



                                  సశేషము…..


        ✍️గోపాలుని మధుసూదన రావు 🙏

N D I A N R U L E R S

 సమాచారం సేకరించిన మిత్రుడి కృషికి గొప్ప

అభినందనలు.🙏🙏🙏


 *🇮🇳I N D I A N R U L E R S🇮🇳*


 *బానిస రాజవంశం*

 1 = 1193 ముహమ్మద్ ఘోరి

 2 = 1206 కుతుబుద్దీన్ ఐబాక్

 3 = 1210 అరామ్ షా

 4 = 1211 ఇల్టుట్మిష్

 5 = 1236 రుక్నుద్దీన్ ఫిరోజ్ షా

 6 = 1236 రజియా సుల్తాన్

 7 = 1240 ముయిజుద్దీన్ బహ్రమ్ షా

 8 = 1242 అల్లావుద్దీన్ మసూద్ షా

 9 = 1246 నాసిరుద్దీన్ మెహమూద్

 10 = 1266 గియాసుడిన్ బల్బన్

 11 = 1286 కై ఖుష్రో

 12 = 1287 ముయిజుద్దీన్ కైకుబాద్

 13 = 1290 షాముద్దీన్ కామర్స్

 1290 బానిస రాజవంశం ముగుస్తుంది

 (ప్రభుత్వ కాలం - సుమారు 97 సం.)


 *ఖిల్జీ రాజవంశం*

 1 = 1290 జలాలుద్దీన్ ఫిరోజ్ ఖిల్జీ

 2 = 1296 అల్లాదీన్ ఖిల్జీ

 4 = 1316 సహబుద్దీన్ ఒమర్ షా

 5 = 1316 కుతుబుద్దీన్ ముబారక్ షా

 6 = 1320 నాసిరుదిన్ ఖుస్రో షా

 7 = 1320 ఖిల్జీ రాజవంశం ముగిసింది

 (ప్రభుత్వ కాలం - సుమారు 30 సం.)


 *తుగ్లక్ రాజవంశం*

 1 = 1320 గయాసుద్దీన్ తుగ్లక్ I.

 2 = 1325 ముహమ్మద్ బిన్ తుగ్లక్ రెండవ

 3 = 1351 ఫిరోజ్ షా తుగ్లక్

 4 = 1388 గయాసుద్దీన్ తుగ్లక్ రెండవ

 5 = 1389 అబూబకర్ షా

 6 = 1389 ముహమ్మద్ తుగ్లక్ మూడవ

 7 = 1394 సికందర్ షా మొదటి

 8 = 1394 నాసిరుదిన్ షా దుస్రా

 9 = 1395 నస్రత్ షా

 10 = 1399 నాసిరుద్దీన్ మహమ్మద్ షా వెంటాడే రెండవ స్థానంలో ఉన్నారు

 11 = 1413 డోలత్ షా

 1414 తుగ్లక్ రాజవంశం ముగుస్తుంది

 (ప్రభుత్వ కాలం - సుమారు 94 సం.)


 *సయ్యిద్ రాజవంశం*

 1 = 1414 ఖిజ్ర్ ఖాన్

 2 = 1421 ముయిజుద్దీన్ ముబారక్ షా రెండవ

 3 = 1434 ముహమ్మద్ షా నాల్గవ

 4 = 1445 అల్లావుద్దీన్ ఆలం షా

 1451 సయీద్ రాజవంశం ముగుస్తుంది

 (ప్రభుత్వ కాలం - సుమారు 37 సం.)


 * అలోడి రాజవంశం *

 1 = 1451 బహ్లోల్ లోడి

 2 = 1489 అలెగ్జాండర్ లోడి రెండవది

 3 = 1517 ఇబ్రహీం లోడి

 1526 లోడి రాజవంశం ముగుస్తుంది

 (ప్రభుత్వ కాలం - సుమారు 75 సం.)


 *మొఘల్ రాజవంశం*

 1 = 1526 జహ్రుదిన్ బాబర్

 2 = 1530 హుమయూన్

 1539 మొఘల్ రాజవంశం సమయం ముగిసింది


 *సూరి రాజవంశం*

 1 = 1539 షేర్ షా సూరి

 2 = 1545 ఇస్లాం షా సూరి

 3 = 1552 మహమూద్ షా సూరి

 4 = 1553 ఇబ్రహీం సూరి

 5 = 1554 ఫిరుజ్ షా సూరి

 6 = 1554 ముబారక్ ఖాన్ సూరి

 7 = 1555 అలెగ్జాండర్ సూరి

 సూరి రాజవంశం ముగుస్తుంది, (పాలన -16 సంవత్సరాలు సుమారు)


 *మొఘల్ రాజవంశం పున ప్రారంభించబడింది*

 1 = 1555 హుమాయు మళ్ళీ గడ్డిపై

 2 = 1556 జలాలుద్దీన్ అక్బర్

 3 = 1605 జహంగీర్ సలీం

 4 = 1628 షాజహాన్

 5 = 1659 u రంగజేబు

 6 = 1707 షా ఆలం మొదట

 7 = 1712 జహదర్ షా

 8 = 1713 ఫరూఖ్సియార్

 9 = 1719 రైఫుడు రజత్

 10 = 1719 రైఫుడ్ దౌలా

 11 = 1719 నెకుషియార్

 12 = 1719 మహమూద్ షా

 13 = 1748 అహ్మద్ షా

 14 = 1754 అలమ్‌గీర్

 15 = 1759 షా ఆలం

 16 = 1806 అక్బర్ షా

 17 = 1837 బహదూర్ షా జాఫర్

 1857 మొఘల్ రాజవంశం ముగుస్తుంది

 (ప్రభుత్వ కాలం - సుమారు 315 సంవత్సరాలు.)


 *బ్రిటిష్ రాజ్ (వైస్రాయ్)*

 1 = 1858 లార్డ్ క్యానింగ్

 2 = 1862 లార్డ్ జేమ్స్ బ్రూస్ ఎల్గిన్

 3 = 1864 లార్డ్ జాహోన్ లోరెన్ష్

 4 = 1869 లార్డ్ రిచర్డ్ మాయో

 5 = 1872 లార్డ్ నార్త్‌బుక్

 6 = 1876 లార్డ్ ఎడ్వర్డ్ లాటెన్లార్డ్

 7 = 1880 లార్డ్ జార్జ్ రిపోన్

 8 = 1884 లార్డ్ డఫెరిన్

 9 = 1888 లార్డ్ హన్నీ లాన్స్‌డన్

 10 = 1894 లార్డ్ విక్టర్ బ్రూస్ ఎల్గిన్

 11 = 1899 లార్డ్ జార్జ్ కర్జన్

 12 = 1905 లార్డ్ టివి గిల్బర్ట్ మింటో

 13 = 1910 లార్డ్ చార్లెస్ హార్డింగ్

 14 = 1916 లార్డ్ ఫ్రెడరిక్ సెల్మ్స్ఫోర్డ్

 15 = 1921 లార్డ్ రూక్స్ ఐజాక్ రైడింగ్

 16 = 1926 లార్డ్ ఎడ్వర్డ్ ఇర్విన్

 17 = 1931 లార్డ్ ఫ్రీమాన్ వెల్లింగ్డన్

 18 = 1936 లార్డ్ అలెగ్జాండర్ లిన్లిత్గో

 19 = 1943 లార్డ్ ఆర్కిబాల్డ్ వేవెల్

 20 = 1947 లార్డ్ మౌంట్ బాటన్


బ్రిటిషర్స్ పాలన సుమారు 90 సంవత్సరాలు ముగిసింది.


 * ఆజాద్ ఇండియా, ప్రధాని *

 1 = 1947 జవహర్‌లాల్ నెహ్రూ

 2 = 1964 గుల్జారిలాల్ నందా

 3 = 1964 లాల్ బహదూర్ శాస్త్రి

 4 = 1966 గుల్జారిలాల్ నందా

 5 = 1966 ఇందిరా గాంధీ

 6 = 1977 మొరార్జీ దేశాయ్

 7 = 1979 చరణ్ సింగ్

 8 = 1980 ఇందిరా గాంధీ

 9 = 1984 రాజీవ్ గాంధీ

 10 = 1989 విశ్వనాథ్ ప్రతాప్సింగ్

 11 = 1990 చంద్రశేఖర్

 12 = 1991 పివి నరసింహారావు

 13 = అటల్ బిహారీ వాజ్‌పేయి

 14 = 1996 H.D. దేవేగౌడ

 15 = 1997 ఐకె గుజ్రాల్

 16 = 1998 అటల్ బిహారీ వాజ్‌పేయి

 17 = 2004 డాక్టర్ మన్మోహన్ సింగ్

 * 18 = 2014 నుండి నరేంద్ర మోడీ *


 764 సంవత్సరాల తరువాత, ముస్లింలు మరియు బ్రిటిష్ వారి బానిసత్వం నుండి స్వేచ్ఛ పొందబడింది.  ఇది హిందువుల దేశం.  ఇక్కడ మెజారిటీ ఉన్నప్పటికీ, హిందువులు తమ దేశ బానిసలుగా మారుతున్నారు, నేడు ప్రజలు చెబుతున్నారు.  హిందువులు మతతత్వమయ్యారు ,,,,,,, 


 🚩🚩🚩🚩🚩

 ఈ ముఖ్యమైన సమాచారాన్ని యువకులందరి దృష్టిలో వీలైనన్ని సమూహాలలో పంపండి....


మనం 1000 సంవత్సరాలు కొన్ని కోట్ల మంది పోరాటం ఫలితంగా ఈ దేశం ఇంకా హిందూ దేశంగా మనుగడలో ఉన్నది.

 🙏🙏🙏

NON JUDICIAL STAMP PAPERS

 SC : NON JUDICIAL STAMP PAPERS DO NOT HAVE ANY EXPIRY PERIOD BEING USED FOR A DOCUMENT.

The Trial Court and the High Court have doubted the genuineness of the agreement dated 5.1.1980 because it was written on two stamp papers purchased on 25.8.1973 and 7.8.1978. The learned counsel for first respondent submitted that apart from raising a doubt about the authenticity of the document, the use of such old stamp papers invalidated the agreement, as the stamp papers used in the agreement of sale were more than six months old, they were not valid stamp papers and consequently, the agreement prepared on such 'expired' papers was also not valid.

Apex Court held that that the Indian Stamp Act, 1899 nowhere prescribes any expiry date for use of a stamp paper. Section 54 merely provide that a person possessing a stamp paper for which he has no immediate use (which is not spoiled or rendered unfit or useless), can seek refund of the value thereof by surrendering such stamp paper to the Collector provided it was purchased within the period of six months next preceding the date on which it was so surrendered. The stipulation of the period of six months prescribed in section 54 is only for the purpose of seeking refund of the value of the unused stamp paper, and not for use of the stamp paper. Section 54 does not require the person who has purchased a stamp paper, to use it within six months. The stamp papers do not have any expiry period. Section 54 does not require the person who has purchased a stamp paper, to use it within six months. Therefore, there is no impediment for a stamp paper purchased more than six months prior to the proposed date of execution, being used for a document.

Supreme Court of India

Thiruvengada Pillai vs Navaneethammal & Anr on 19 February, 2008

Bench: R. V. Raveendran, P.Sathasivam

Citation:(2008) 4 SCC 530:AIR 2008 SC 1541

spoken about the Hindus._*

 *_A compilation of speeches given by the prominent Muslim leaders who have spoken about the Hindus._* 



👉1. "Hindus shouldn’t make the mistake of considering Indian Muslims any different from the Pakistani Muslims. If India dare attack Pakistan, then all the 25 crore Indian Muslims will join the Pakistan Forces and fight against India!"

- *Asaduddin Owaisi, Member of Parliament, MIM, Hyderabad.*




👉2. "Hindus do not have any rights to vote in Arab land, Pakistan or any one of the 56 Islamic nations. I challenge, have even a single Hindu the strength (guts) to impose restrictions on our (Muslims) voting rights in India?"

- *Maulana Badarrudin Ajmal, Loksabha Sansad, AIUDF, Assam*.



👉3. "In Hyderabad, our Muslim population have crossed 50% and now we are in a majority. Therefore I demand the administration to impose restrictions on the celebration of the Hindu festivals such as Ram Navami and Hanuman Jayanti. In the Bhagya Lakshmi temple near Charminar, we have already shown our strength by stopping the ringing of the bell/gong. We Muslims will ensure that this temple is also destroyed!"

- *Akbaruddin Owaisi, Sansad, Majlis-e-Ittehadul-Musalmeen, (AIMIM), Hyderabad, India.*



👉4. "I regret the continuing of massacre of Hindus and Buddhists in Bangladesh, but Bangladesh is an Islamic nation and not secular. Now the Muslims are in majority here. Under the circumstances if Hindus and Buddhists want to live safely, they should either convert to Islam or go to India!"

- *Begum Khalida Zia, President, Bangla National Party.*



👉5. "Hindu Leaders may wear a Muslim cap any number of times, but we Muslim leaders will never put on a Tilak. Let the Hindus give any amount of respect to our namaaz, but we're Muslims will surely boycott Vande Mataram because in Islam both Secularism and Patriotism are haram (prohibited/unclean)!"- 

- *Azam Khan, Leader of Samajwadi Party, U.P.*



👉6. "Muslims have ruled India for 1100 years. Lakhs of Hindus were beheaded. Crores of Hindus were converted into Islam. We divided India and snatched Pakistan and Bangladesh. We demolished 2000 temples and converted these into mosques. 

It is out of our fear that Hindus even today chant, 'Hindu Muslim Bhai Bhai!' 

This is the strength of Islam!" 

- *Zakir Nayek, Mumbai.*



👉7. "Let the Hindus consider a cow as a mother, even then we Muslims will surely cut the cows because cow sacrifice is the Muslim's religious right. Allah demands sacrifice. Muslims don’t fight an oral war; we do everything directly with our might. We are not afraid of any ruler or Government because we the Muslim community have already grown sizeably. If any mother’s son intervenes, we will deal with him, but we will certainly cut Cows!" 

- *Nuroor Rahman Barkati, Shahi Imam, Tipu Sultan Masjid, Kolkata, India.*



👉8. "In the face of our strength (might), Hindus are unable to build even a single Ram Temple in their own Country. Do Hindus have the spunk to even stall the construction of a Mosque in Saudi Arabia, Pakistan or any one of the 56 Islamic countries?"

- *Maulana Saiyad Ahmad Bukhari, Shahi Imam, Jama Masjid, Delhi.*



👉9. "Hindus don’t have the spunk to stop infiltration (illegal) of our Bangladeshi Muslim brothers into Assam. We will continue to come (infiltrate)!" 

- *Maulana Badarrudin Ajmal, Loksabha Sansad, AIUDF, Assam.*


 *" WAKE UP HINDU BROTHERS AND SISTERS🙏.

విషు శక్తి యెుక్క వ్యాప్తమును

 శుక్ల వర్ణం అంబరధరం శశి వర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం  ధ్యాయేత్ సర్వ విఘ్నోప  శాంతయే. గణపతి వర్ణన కాని ఆయన లక్షణములు అంతకు ముందు ఎవరికీ తెలియదు. యీ శ్లోకార్ధం విషు విష్ణువు గురించి. విషు శక్తి యెుక్క వ్యాప్తమును వర్ణించుట. వర్ణన చేయుట అనగా శక్తి పదార్ధ లక్షణమును దాని వ్యాప్తిని తెలుపుట.విష్ణు తత్వాన్ని తెలియుటతెలియుటఅఙ్నానమైన ఆత్మరూపి దేహి తెలియుట అసంభవం. కావున అమ్మ సృష్టి చేసి విష్ణు తత్వాన్ని మనకు తెలియజేసి నది. అది సర్వ సమస్త దేవతలకు శక్తికి ఙ్ఞానానికి మూలమైనది. తద్వారా విష్ణు మూలతత్వ రూపమైన ఙ్ఞాన రూపమైన సూర్యకాంతిని తెలియుటకు వుపయోగం. పరమేశ్వరునితో సహా విష్ణు బ్రహ్మలకు కూడా సృష్టి యెుక్క మూలమును తెలుపుట యే. విష్ణు తత్వాన్ని తత్ వ్యాప్తిని తెలియుట వలన ఙ్ఞానిగా మారి పునరావృత్తిలేనతత్వమే అమ్మ లో కలియుట.

శక్తి అగ్నికి మారు రూపము. అయితే అగ్ని శక్తిగా మారిన దాని ప్రయోజనం ఏమైనా కలదా. ఏ ప్రయోజనం లేకుండా అగ్ని ధాతు పరమైన పదార్ధ లక్షణముగా మారు చున్నది. దీనివలన జీవ సృష్టి. సృష్టి ప్రకృతి మూలం. ప్రకృతి సహజంగా మార్పులు. సహజ మార్పులు దేహ మార్పుల వలెనే వాటంతట అవి మారి జీవ చైతన్యప్రయెూజనమునకు నాందిగా మారు చున్నవి. వాటిని జీవులు అనుభవించుచూ కాలగణనలో వక భాగము అను చున్నారు. యిది తెలియాలి. అనగా సాధన చేయాలి. ఊరకనే వుంటే ఏమీ కాదు. ఏదో వకటి క్రయ అసంకల్పితంగా చేయరాదు. సంకల్పించి చేయాలి. అగ్ని ప, ఫ, రెండుగా మారును . రెండవది ఫ ఫల్గుణీ ముదటి ప అనగా రూపంలేని అగ్ని ఫల్గుణీ కాంతి గా భావము రూపంలో గల ఫాస్పరస్ లక్షణము గల కాంతి గా మారును. అది సూర్య శక్తి వలననే. అనగా ప్రకృతిలో మనం ఏమీ సృష్టించ కుండా ప్రకృతిని అనుభవించుచున్నాము. దీనికి సర్వదా కృతఙ్ఞతలు కలిగి యుండవలె. అదియే స్ర్తీ తత్వం క్షేత్ర తత్వం. క్షేత్రమును ఆశ్రయించు జవ రూప అగ్ని తత్వం. దీనికి మానవ ప్రయత్నమే మూలం

ప్రయత్నం అహంకారమైన పతనం. త థ అక్షర శక్తి కూడా అటులనే. తత్ అనే అది లక్షణము మామూలుగా తెలియదు. భావ,రూప గుణ లింగ లక్షణము లేనిది కావున. తెలియదు. అది ధాతు గుణ రూప లింగ మైన సకొంతవరకు ఫ పదార్ధ రూపమైన కాంతి తెలియును. అదియే సూర్య భూమి సంబంధం. తెలుసుకొంటూనే వుందాం.

మొగిలిచెర్ల అవధూత

*ఆశీర్వాదం..ఆయుష్షు..*


అప్పటికి మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామివారు కపాలమోక్షం ద్వారా సిద్ధిపొంది సుమారు రెండు సంవత్సరాల కాలం గడిచింది..ఆ సరికే మొగిలిచెర్ల చుట్టుప్రక్కల ఓ ముప్పై కిలోమీటర్ల పరిధిలోని గ్రామాల్లో శ్రీ స్వామివారి గురించి కథలు కథలుగా చెప్పుకోసాగారు..శ్రీ స్వామివారి ని నమ్మి కొలిస్తే తమకు కష్టాలు తీరుతాయని ప్రచారం జరిగిపోయింది..


1978 వ సంవత్సరం..ఒక పల్లెటూరు నుంచి మరొక పల్లెటూరికి ప్రయాణం చేయాలంటే..ఎడ్లబండి కానీ..కాలినడక గానీ శరణ్యం అనుకునే రోజులు..తాము ఉంటున్న వెంగళాయిపల్లె గ్రామం (ప్రస్తుత ప్రకాశం జిల్లా..P C పల్లె మండలం) నుంచి కరణం మాలకొండయ్య, లక్షమ్మ దంపతులు, ఇరవై కిలోమీటర్ల దూరం నడచివచ్చి, మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామి వారి సమాధి ముందు నిలుచున్నారు..తమ మనసులో సుడులు తిరుగుతున్న వేదన..ఆ స్వామికి విన్నవించుకుందామనే బలీయమైన కోరిక.. వారిని అంతదూరం నడిపించింది..కారణం..అప్పటికి తమకు పుట్టిన ఇద్దరు బిడ్డలూ అల్పాయుష్కులై చనిపోయారు..కడుపుకోత భరించలేనిదిగా ఉంది..


ఆ సమయంలో, శ్రీ దత్తాత్రేయ స్వామి వారికి మొక్కుకుంటే ఫలితం ఉంటుందనే ఆశతో..మొగలిచెర్ల శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరానికి వచ్చారు..స్వామి దగ్గర మంటపంలో సాగిలపడి, తమ బాధ చెప్పుకున్నారు..అలా వరుసగా ఐదు శని,  ఆదివారాల పాటు, రాను ఇరవై, పోను ఇరవై కిలోమీటర్ల దూరం కాలినడకనే ప్రయాణం చేసి, శ్రీ దత్తాత్రేయుడిని కొలుచుకున్నారు..


ఈసారి వారి ప్రార్ధన ఆ స్వామివారినీ కదిలించిందేమో..1980 లోమగపిల్లవాడు పుట్టాడు.. దంపతులిద్దరూ..ఆ పిల్లవాడిని  మొగిలిచెర్ల అవధూత దత్తాత్రేయుడి ప్రసాదంగా భావించి "దత్తాత్రేయుడు" అని పేరు పెట్టుకున్నారు..ఆ తరువాత మరో రెండేళ్లకు ఆడపిల్ల పుట్టింది..ఆ అమ్మాయికి.."దత్తాత్రేయమ్మ" అని పేరు పెట్టారు..


ఇక పిల్లలిద్దరి భారం శ్రీ స్వామివారి మీదే వేసి..తమ బిడ్డలు ఇంతకుముందు పుట్టిన వాళ్ళలా అల్పాయుష్కులు కాకూడదని శ్రీ స్వామివారిని వేడుకున్నారు..భక్తితో ఆర్తిగా వేడుకుంటే స్వామివారు కరుణించరా...?..స్వామివారి చల్లటి చూపుతో పిల్లలిద్దరూ లక్షణంగా పెరిగారు..


పిల్లలిద్దరికీ...తాము మొగలిచెర్ల దత్తాత్రేయుడిని నమ్ముకోబట్టే.. మీరిద్దరూ ఇలా  లక్షణంగా ఉన్నారు అని చెప్పుకునేవారు ఆ దంపతులు..ఆ పిల్లలకూ స్వామి వారి మీద అపరితమైన విశ్వాసం కుదిరింది..వివాహాలూ జరిగాయి..జీవితంలో ఏ కష్ట సుఖాలైనా దత్తాత్రేయుడి కృపే నని ఆ సంసారం మొత్తం నమ్మి, స్వామివారిని కొలిచేవారు..


 కొన్నాళ్ల క్రితం  శ్రీ మాలకొండయ్య గారు మరణించారు.."నాన్నగారు మరణించి సంవత్సరం దాటిపోయింది..ఏటి సూతకం అయిన తరువాత, ఈరోజు స్వామివారిని దర్శించుకోవడానికి వచ్చాను.." అంటూ బెంగుళూర్ లో PG (పేయింగ్ గెస్ట్ హోమ్) నడుపుతున్న మాలకొండయ్యగారి పెద్దకుమారుడు దత్తాత్రేయుడు నాతో చెప్పుకొచ్చాడు..శ్రీ స్వామివారి దయవల్ల తన సోదరి కూడా బాగుందని..క్రమం తప్పకుండా స్వామి వారిని దర్శించుకుంటామనీ..భక్తి పూర్వకంగా చెప్పుకున్నాడు..సాక్షాత్తూ శ్రీ స్వామివారి ఆశీస్సులతో పెరిగిన ఆ పిల్లలకు ఏ ఇబ్బందీ లేదు కదా...


సర్వం..

శ్రీ దత్తకృప!


(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగలిచెర్ల గ్రామం.. లింగసముద్రము మండలం..ప్రకాశం జిల్లా.. పిన్ : 523 114..సెల్..94402 66380 & 99089 73699).

అభేదదృష్టి

 .      *🌻ఆదిశంకరులు - అభేదదృష్టి🌻*


       మానవుడు జీవన్ముక్తుడు కావాలంటే అభేదదృష్టి అత్యావశ్యకం. అభేదదృష్టితో మనః ప్రక్షాళనం జరుగుతుంది. ముక్తి కరతలామలక మౌతుంది. శ్రీ శంకర భగవత్పాదులు విరచించిన కొన్ని రచనలలోను, వాటి నేపథ్యంలోను, వారు పంచాయతన పూజా విధిని ప్రవేశపెట్టడంలోను అభేదదృష్టి ఏవిధంగా ప్రతిబింబించిందో దిఙ్మాత్రంగా చూపటం ప్రస్తుత వ్యాసోద్దేశ్యం.


*సౌందర్య లహరి*


     యత్ కరోషి , యదశ్నాసి,

     యజ్జుహోషి దదాసియత్

     యత్ తపస్యసి కౌంతేయ! 

      తత్ కురుష్వ మదర్పణమ్ 9-27

     అని భగవద్గీతలో చెప్పబడినట్టు సమస్త కర్మలూ పరమాత్మునికి సమర్పణం చేశాక అవన్నీ పరమాత్ముని సేవలుగానే పరిణమిస్తాయి. ఇది పూజా కార్యక్రమం, ఇది నిత్యకృత్యం అనే తేడా అంతరించిపోతుంది. సర్వత్ర అభేదమే వెల్లివిరుస్తుంది.

     అందుకే ఆదిశంకరులు సౌందర్య లహరిలో ఇలా స్తుతిస్తాడు.


        జపో జల్ప శ్శిల్పం సకల మపి

            ముద్రా విరచనం

        గతిః ప్రాదక్షిణ్య క్రమణ మశనా

             ద్యాహుతి విధిః

         ప్రణామః సంవేశః సుఖ మఖిల

             మాత్మార్పణ దృశా

          సపర్యా పర్యాయ స్తవ భవతు

              య న్మే విలసితమ్


     మాటలే జపాలుగా మారుతాయి. చేతులు అటూ ఇటూ తిప్పడమే ముద్ర లౌతాయి.వీధుల్లో తిరుగడాలే ప్రదక్షిణలుగా మారిపోతాయి. తినే తిం డ్లన్నీ యజ్ఞంలో వేస్తున్న హవిస్సు లైపోతాయి. పడుకోవడాలే సాష్టాంగ ప్రణామాలుగా మారిపోతాయి. 

     ఎప్పుడూ అర్చనలు చేయలేము. నిత్య కృత్యాలూ మానుకోలేము. కాని రోజు వారీ పనులనే దేవీ సేవలుగా భావించి చేస్తే అవన్నీ అలాగే పరిణమిస్తాయి. ముక్తి అన్నది చాలా సులభ మౌతుంది..

      ఇదే విషయాన్ని "శంకరాభరణం" అనే సమూహంలో 17.2.18 నాడు "యెంతయో యనుకొంటి, మీ రింతె యంద్రు.." అనే సమస్యగా నొసంగగా.. మామూలు మాటలలో నే నిలా పూరించినాను.


"ఉబుసుపోని కబుర్లు నుత్తమ జపములౌ..

    పొసగఁ జేతులుఁ ద్రిప్ప ముద్ర లగును..

ఇటు నటు తిరుగుడులే ప్రదక్షిణ లగు..

    నశనముల్ లో నగ్ని కాహుతు లగు..

పొసగ సెజ్జల మీది పొర్లాటలే సుమ్మి

     పొరలుడు దండాల పొలుపు మీరు..

మన సుఖా లన్ని యాత్మ స్వరూపిణి, దేవి

     కర్పింప నిటు సపర్య లయి మించు..

ముక్తి యెంతయో సులభమైపోవు శిష్య!"

యనుచు *సౌందర్య లహరి* లో నాది శంక

రులు వచించిన తీరు గురు వరులైన

*మామిడన్న* చెప్పగ వింటి; మరల నంటి ---

"యెంతయో యనుకొంటి, మీ రింతె యంద్రు.."


*పంచాయతనం*


       ఆది శంకరుల కాలంనాటి పరిస్థితి పరిశీలిద్దాం!

       

       "ఆయన కాలం నాటికి మన దేశంలో చిన్నవి పెద్దవి కలిసి కొన్ని వందల మతా లున్నవి. కనుక అవన్ని చూసినప్పుడు శంకరునికి పరబ్రహ్మం ఒక్కటే అయినప్పుడు దాన్ని చేరడానికి ఇన్ని మతాలు ఇన్ని మార్గా లెందుకని అనిపించింది. అంతేగాక మతాలలో సత్య మున్నా వా రవలంబించు మార్గాలలో మాత్రం ఎన్నో అవకతవకలు అపక్రమాలు గూడ వున్నవి. అందువల్ల ఆయన ఆసేతు శీతాచలం పర్యటించి తన ప్రతిభతో ఆనా డున్న మతా లన్నింటిని ఖండించి వానిలో శైవం, వైష్ణవం, శాక్తేయం, గాణాపత్యం, సౌరం, కాపాలికం అనే ఆరు మతాలను మాత్ర మంగీకరించి షణ్మత స్థాపకు డైనాడు.....

    ....ఆరు మతాలలో కాపాలికం మాత్రం గృహస్థులకు యోగ్యం కా దని విడిచి తక్కిన ఐదింటితో పంచాయతన పూజ నేర్పాటు చేసినాడు. ఈ పంచాయతనం ఏ దేవుణ్ణి ప్రధానం చేసికొంటామో ఆ దైవంపేర పంచాయతన మనబడుతుంది..."


(కీ.శే. ఇమ్మడిజెట్టి చంద్రయ్య గారు రచించిన శ్రీ "చంద్రమౌళీశ్వర శతకం" (2004) లో నేను వ్రాసిన "శివపంచాయతనం" అనే పీఠికలోనుంచి పై సమాచారం స్వీకరించబడింది.)


       కుర్తాళం పీఠాధిపతి శ్రీ  సిద్ధేశ్వరానంద భారతీ స్వామి వారు ఒకసారి ఇలా వివరించారు. 

       "అందరు దేవతలూ ఒకటే!

ఏకం సత్ విప్రా... ఉన్న సత్ పదార్థం అనంత చైతన్యం ఒకటే! దాన్ని ధ్యానయోగులు ఋషులు ఒకడు శివునిగా ఒకడు విష్ణువుగా ఒకడు గణపతిగా ఒకడు సూర్యునిగా ఒకడు అమ్మవారిగా రకరకాలుగా దర్శించారు. ఎవరి దర్శనమూ తప్పు కాదు. అందరి దర్శనాలూ సత్యములే! అందరూ ఒకటే! అనంతమైన పరమ చైతన్యం యొక్క అభివ్యక్తీకరణమే రూపములూ భేదములూ కూడా. కనుక ఆ తత్వాన్ని ప్రపంచానికి తెలియజేయాలి. అందరూ ఒకటే!అన్నభావం.

    ఆ ఒకటే అని చెప్పినటువంటి సనాతన ధర్మం హిందూధర్మం కాబట్టి.. దీని ఆధిక్యాన్ని చెప్పాలి. అని చెప్పటంకోసం జగద్గురు శంకరాచార్యుల వారు తన కాలం నాడే దానికి మార్గదర్శనం చేశాడు. బాటలు వేశాడు.

    ఆ రోజుల్లో శైవులు, వైష్ణవులు పోట్లాడుకుంటూ వుంటుంటే అందరూ కూడా కలిసివుండండి. ఇదంతా ఒకటే జాతి. ఒకటే ధర్మం అని పంచాయతన పూజా విధానాన్ని ప్రవేశపెట్టా డాయన. శివుడు విష్ణువు సూర్యుడు గణపతి అమ్మవారు. ఐదుగురు ప్రధాన దేవత లానాడు. వీళ్ళల్లో వీళ్ళు పోట్లాడుకుంటుంటే ఆయ నన్నాడు

"మీరు మీ పంచాయతన పీఠం పెట్టుకోండి. మీ పీఠంమీద ఈ ఐదుగురు దేవతలనూ పెట్టుకోండి. ... మీ యిష్టదేవతను మధ్యలో పెట్టుకోండి. మిగిలిన దేవతలు ఆ దేవతకు పరివార మని అనుకోండి.  అందరూ ఒకటే ఐనా మీకు మీ దేవత యిష్టం. మీ దేవత గొప్పది." అని ఆయన ఆ రకంగా మత సామరస్యాన్ని తీసుకు రావటానికి, జాతి జీవన స్రవంతిలో పవిత్రమైనటువంటి భావనను తీసుకురావటానికి ఆయన ప్రయత్నం చేశాడు. ఆ శంకర భావనా ప్రపంచాని కందించాలి. 

   మహనీయుడైనటువంటి వివేకానంద స్వామి తన మొదటి ఉపన్యాసంలో చెప్పిం దదే!

త్రయీ సాంఖ్యం యోగం పశుపతి మతం వైష్ణవ మితి..అని పుష్పదంతుడు మహిమ్న స్తోత్రంలో చెప్పాడు.

    అన్ని నదులూ సముద్రంలోకి వెళ్ళినట్టుగా.. పరమేశ్వరా! అన్ని మతాలూ నీలోకే వెళుతున్నై. అ నన్నా డాయన.  ఆ భావన శంకరులవారు ఇచ్చినటువంటి భావన అది. శంకర సంప్రదాయానికి చెందినటువంటివాడు వివేకానందుడు ఆ మార్గాన్ని  అందించడానికి మొదటిసారి ఈ దేశంలో ప్రయత్నం చేశాడు అమెరికా ఖండంలో. అందువల్ల ఎవరు వచ్చినా ఏ సన్యాసి వచ్చినా భావన యిదే!"


(శ్రీ సిద్ధేశ్వరానంద భారతీ స్వామి స్పెషల్ ఇంటర్వ్యూ (మన టివి) 

డిసెం 2018 PMC వీడియో నుండి..)


*స్తోత్ర సాహిత్యం*


    ఆదిశంకరులు రూపుదాల్చిన విజ్ఞానం. ప్రపంచానికే జ్ఞానాన్ని అందించిన జగద్గురువు. లక్ష్మి, శారద, మీనాక్షి, నృసింహుడు, పరమేశ్వరుడు మొదలైన దేవతల నెందరినో తన భారత పర్యటనలో భాగంగా దర్శిస్తూ స్తుతిస్తూ సాగిపోయినారు.

     అన్ని స్తోత్రాలలో శివునిగురించి వారు రచించిన శివానందలహరి.. పార్వతి గురించి రచించిన సౌందర్య లహరి.. అనే స్తోత్రాలు సుప్రసిద్ధములు.

     వారు ఏయే దేవతలపై ఏయే స్తోత్రాలు వెలయించినారో అందినంతమేరకు అతి సూక్ష్మంగా గురుతుకు తెచ్చుకుందాం.


విష్ణువు... శ్రీ విష్ణు భుజంగ ప్రయాత స్తోత్రం

               షట్పదీ స్తోత్రం

               అచ్యుతాష్టకం

శివుడు... శ్రీ శివభుజంగ ప్రయాత స్తోత్రం

              శివపంచాక్షర నక్షత్ర మాలా స్తోత్రమ్

              ద్వాదశ జ్యోతిర్లింగ స్తోత్రం

              ఉమా మహేశ్వర స్తోత్రం

              శివనామావళ్యష్టకం

              శివాపరాధ క్షమాపణ స్తోత్రం

               దక్షిణామూర్తి స్తోత్రం

కాలభైరవుడు... కాలభైరవాష్టకం

గణపతి... గణేశ భుజంగ ప్రయాత స్తోత్రం

రాముడు... శ్రీ రామ భుజంగ ప్రయాత స్తోత్రం

కృష్ణుడు... కృష్ణాష్టకం, జగన్నాథాష్టకం

నృసింహుడు... లక్ష్మీ నృసింహ స్తోత్రం

                        లక్ష్మీ నృసింహ పంచరత్నం

పాండురంగడు... పాండురంగాష్టకం

హనుమంతుడు... హనుమత్ పంచరత్నం

లక్ష్మి... కనకధారాస్తోత్రము

పార్వతి... మీనాక్షీ పంచరత్నం

                మీనాక్షీ స్తోత్రం, భ్రమరాంబాష్టకం

                భవానీ భుజంగ ప్రయాత స్తోత్రం 

                అన్నపూర్ణాష్టకం,

సరస్వతి... శారదా భుజంగ ప్రయాతాష్టకం

లలిత... లలితా పంచరత్నం

గంగ... గంగాష్టకం, మణికర్ణికాష్టకం

యమున... యమునాష్టకం

నర్మద... నర్మదాష్టకం

    ఇంకా ఎన్నో...ఎన్నెన్నో...


     ఇవన్నీ మధురాతిమధురమైన నిత్య పఠనీయములైన స్తోత్రములు. వీటన్నిటి వెనుక నున్న పరమమైన ఉద్దేశ్యం.. పరతత్వం అంతా ఒకటే! రూపములు మాత్రం వేరువేరు.. అనేదే! అదే ఏకం సత్.. విప్రా బహుధా వదంతి.. ఆ ఏకమే... అద్వైతం.. (రెండవది లేనిది.) ఆదిశంకరుల భావన అదియే! సనాతన భారతీయ భావనా అదియే!


      రచన~డా.వెలుదండ సత్యనారాయణ

                          పరమార్థ కవి

                            29.11.20

చీనా పంచదార

 చీనా పంచదార , పంచదార - 


  * ఇది చలువ చేయును . రుచిని పుట్టించును .

 

  * వీర్య వృద్ది, బలము కలగచేయును. 

 

  * మూర్చ, సర్వ ప్రమెహములు , దాహము , జ్వరము, వాంతి , క్షయకు , ఎక్కిల్లకు పనిచేయును. .


 * మూత్రము నందు సుద్ధవలె పడు వ్యాధిని రూపు మాపును .

 

  * ఉన్మాదము, కామెర్లు, అతిగా దాహము వేయుట, తల తిప్పుతూ సృహ తప్పడం వీటికి బాగుగా పనిచేయును . 


  * పాండు రోగము నాకు మంచి మందుగా పనిచేయును .

 

  * నరుకులు, దెబ్బలు మాన్పును.

 

  * గొంతుకను, గుండెలు ( రొమ్ములు ) లొని రోగములు కు పనిచేయును .


   * ఉపిరితిత్తులకు మేలు చేయును . 


   * దీనిని ఇతర మందులతో అనుపానముగా ఇచ్చినచో వేగముగా దేహమంత వ్యాప్తి చెందును. ప్రాణమును కాపాడును.


   * కడుపులో వాతమును వెదలించును .

 

   * మంచి రక్తమును బుట్టిన్చును.


   * నరములకు, కార్జము ( లివర్ ) కు సత్తువ చేయును 

 

   * ముసలితనమును వేగముగా రాకుండా ఆపును. 

 

   * కడుపునొప్పిని తగ్గించును.


   * 20 దినములు ( సుమారు 6 తులముల ఎత్తు ) మోతాదుగా ఇచ్చిన రక్తమును శుద్ధి చెయును. 


   * దేహము నందు గట్టిపడిన దుష్ట పదార్ధ కూటమి ని కరిగించును. నీరు చెయును.


  * శరీరం కుళ్ళుని ఆపును.


          చీనా పంచదార తెల్లగా , పిండివలె ఉండును. తెల్ల పంచదార ఇసుక వలె తెల్లగా శుబ్రముగా ఉండును. చక్కీ పంచదార ఇసుక వలె ఉండును. కాని కొంచం ఎర్రగా ఉండును. 

     ఈ మూడింటి గుణం ఇంచుమించు ఒకేలా ఉండును గాని మొదటి దాని కంటే తక్కిన రెండు ఒకదాని కంటే ఒకటి తక్కువ చలువ , అదిక వేడి గలవి . పరగడుపున పొద్దున్నే పంచదార ఒట్టిగా తినినను, అధికముగా తినినను , ఆకలి మంధగించును. అజీర్ణం చెయును.


 దీనికి విరుగుళ్ళు - 

బాదం పప్పు, పచ్చిపాలు, పులుపు పదార్దములు 


 ఒట్టి పంచదార తిని నీళ్లు త్రాగరాదు. అలా త్రాగిన జలుబు, వాతము, శ్లేష్మము చెయును, జ్వరము తెచ్చును.


   

  

 గమనిక -


           నాచే రచించబడిన "ఆయుర్వేద మూలికా రహస్యాలు " , " ప్రాచీన ఆయుర్వేద రహస్యాలు " అను ఈ రెండు గ్రంథముల యందు అత్యంత రహస్యమైన సులభముగా ఇంటి యందు , చుట్టుపక్కల దొరికే మూలికలతోనే పెద్దపెద్ద రోగాలను నయం చేసుకొనే విధముగా అనేక వైద్య యోగాలను ఇచ్చాను. ఈ గ్రంథాలలో ఇచ్చినటువంటి యోగాలు అన్నియు గత 250 సంవత్సరాల నుంచి వంశపారంపర్యముగా మాకు వస్తున్న రహస్యయోగాలు పరోపకారార్థం దాచుకోకుండా ప్రచురించాను.


           మన చుట్టుపక్కల ఉండే మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల బొమ్మలతో మొక్కల చిత్రపటాలు ఇవ్వడం జరిగింది.


            రైతులకు ఉపయోగపడేవిధముగా చెట్లను , భూమిని బట్టి , రాళ్లని బట్టి భూమి యందు జలమును కనుగొను విధానం , ముహూర్తాలను అనుసరించి ఏయే సమయాలలో పంటలు వేయాలి . ఆయుర్వేద మూలికల సహాయముతో పురుగు మందులు వాడకుండా అత్యంత ఎక్కువ దిగుబడులు సాధించే రహస్య వృక్షయుర్వేద యోగాలు , పశువులకు సంబంధించిన వైద్య యోగాలు కూడా ఇవ్వడం జరిగింది . ఈ గ్రంథాలలో ఇచ్చిన యోగాలు ఉపయోగించటం వలన ఎటువంటి వ్యతిరేక ఫలితాలు రావు.


      ప్రాచీన ఆయుర్వేద రహస్యాలు గ్రంథం 288 పేజీలు ఉంటుంది . విలువ 350 రూపాయలు మాత్రమే . ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథం 384 పేజీలు ఉంటుంది . విలువ 450 రూపాయలు . కొరియర్ చార్జి 100 రూపాయలు అదనం .పుస్తకములు ఎక్కువ కాలం మన్నిక కొరకు కుట్టించి ఇవ్వడం మరియు అత్యంత నాణ్యమైన తెల్లటి 80GSM పేపరుతో ఉంటాయి.


            ఈ రెండు గ్రంథాలు కావలసినవారు డైరెక్టుగా 9885030034 నెంబర్ కి ఫోన్ చేయగలరు. కామెంట్లు , మెస్సేజెస్ సమాధానము ఇవ్వబడదు. కాల్ చేయగలరు .


                  కాళహస్తి వేంకటేశ్వరరావు 


                         9885030034 


               అనువంశిక ఆయుర్వేద వైద్యులు

మజ్జిగ గురించి సంపూర్ణ వివరణ

 మజ్జిగ గురించి సంపూర్ణ వివరణ - ఉపయోగాలు .


       పెరుగు , నీరు సమాన పాళ్ళలో కలిపి చిలికి తయారుచేసిన మజ్జిగ తేలికగా ఉండి శీఘ్రముగా జీర్ణం అగును. కొంచెం వగరును , పులుపును కలిగి ఉండును. జఠరాగ్నిని వృద్దిచెందించును. కఫవాతాలను హరించును . శోఫరోగం , ఉదరం , మొలలరోగం , బంక విరేచనాలు , మూత్రబంధం , నోరు రుచిని కోల్పోవుట , స్ప్లీన్ పెరుగుట, గుల్మం , అధికంగా నెయ్యి తాగుట వలన కలుగు సమస్య , విషము , పాండురోగం వంటి సమస్యలను నివారించును.


                 మజ్జిగలో కూడా రకాలు కలవు. ఇప్పుడు ఆ రకాలను మీకు వివరిస్తాను. పెరుగుకు నీళ్లు కలపకుండా కేవలం పెరుగును మాత్రం చిలికి చేయబడిన మజ్జిగని "గోళ " అని అంటారు. పెరుగుకు నాలుగోవ వంతు నీరు కలిపి కవ్వముతో చిలికి చేయబడిన మజ్జిగని "ఉదశ్విత" అనబడును. సగం భాగం నీరు కలిపి పెరుగును చిలికి చేయబడిన మజ్జిగని " తక్రము " అని పిలుస్తారు . పెరుగుకు మూడు వంతులు నీరు కలిపి చేయబడిన మజ్జిగని "కాలశేయ" అని పిలుస్తారు . వీటన్నింటిలో సగం పెరుగు , సగం నీరు కలిపి చేసిన తక్రము అని పిలిచే మజ్జిగ బహు శ్రేష్టమైనది. ఇప్పుడు మీకు తక్రము యొక్క విశేష గుణాలు గురించి వివరిస్తాను .


            తక్రమను మజ్జిగని వాడుట వలన శరీరం నందు జఠరాగ్నిని వృద్దిచెందించును. వాంతి , ప్రమేహము , వాపు , భగంధరం , విషము , ఉదరరోగము , కామెర్లు , కఫము , వాతాన్ని హరించును .


                   వెన్నపూర్తిగా తీయని మజ్జిగను మందజాతం అని పిలుస్తారు . ఇది అంత తొందరగా జీర్ణం అవ్వదు . జిడ్డు కొంచం కూడా లేకుండా చిలకబడిన మజ్జిగని అతిజాతం అనబడును. ఇది మిక్కిలి పులుపుగా ఉండి ఉష్ణాన్ని కలుగచేయును. దప్పికను పెంచును. వగరు , పులుపు రుచుల కలిసిన మజ్జిగ మలబద్దకం కలుగచేయును . కేవలం పుల్లగా ఉండు మజ్జిగ మలాన్ని బయటకి పంపును . ఏమి కలపకుండా ఉండు చప్పటి మజ్జిగ ఉదరం నందు ఉండు కఫాన్ని హరించును . కాని కంఠము నందు కఫాన్ని కలిగించును.


                 మజ్జిగని ఉపయోగించకూడని సమయాల గురించి ఇప్పుడు మీకు వివరిస్తాను. గాయాలు తగిలినప్పుడు , మూర్చరోగము నందు , భ్రమ , రక్తపిత్త రోగము నందు తక్రమను మజ్జిగ వాడరాదు. అదే విధముగా మంచు కాలం నందు , శరీరంలో జఠరాగ్ని మందగించి ఉన్నప్పుడు , కఫముచే జనించిన రోగముల యందు , కంఠనాళం సమస్య యందు , వాతం ప్రకోపించినప్పుడు తక్రము అను మజ్జిగని ఉపయోగించవలెను .


         శరీరం నందు వాతము ప్రకోపించినప్పుడు పులిసిన మజ్జిగని సైన్ధవ లవణము కలిపి తాగవలెను . పిత్తము ప్రకోపించినప్పుడు తీపిగల మజ్జిగ పంచదార కలిపి తాగవలెను. అదేవిధముగా శరీరము నందు కఫము ప్రకోపించినప్పుడు త్రికటుకముల చూర్ణం అనగా శొంటి, పిప్పళ్లు, మిరియాలు సమాన చూర్ణం మరియు ఉప్పు కలిపిన మజ్జిగ తాగవలెను.

   

                  కొంచెం పుల్లగా ఉండు మజ్జిగ శుక్రవృద్ధికరం , మిక్కిలి పులుపు కలిగిన మజ్జిగ జఠరాగ్ని వృద్దిచేయును . పీనసరోగం అనగా ముక్కువెంట ఆగకుండా నీరుకారు రోగం , శ్వాస , రొప్పు వంటి రోగాలు ఉన్నప్పుడు మజ్జిగని కాచి తాగవలెను . శరీరంపైన వ్రణాలు లేచినప్పుడు మజ్జిగ వాడినచో అనేక సమస్యలు వచ్చును. మజ్జిగకు ద్రవాన్ని శోషించుకొనే గుణం ఉండటం వలన నీళ్ల విరేచనాలతో ఇబ్బంది పడుతున్నప్పుడు మజ్జిగ ఇవ్వడం వలన నీటిని గుంజి మలమును గట్టిపడచేయును అందువల్ల విరేచనాలు తగ్గును. గేదె మజ్జిగ కామెర్ల రోగము నందు , పాండు రోగము నందు అద్భుతముగా పనిచేయును . మేకల మజ్జిగ , గొర్రెల మజ్జిగ , చెడ్డవాసన కలిగిన మజ్జిగ త్రిదోషాలను పెంచును. కావున వాడరాదు.


            మనుష్యల రోగాలకు ప్రధానకారణం మనం తీసుకునే ఆహారం . మనయొక్క శరీరతత్వానికి అనుకూలమైన ఆహారాన్ని మనం తీసుకున్నంతవరకు మనకి సమస్య ఉండదు. తీసుకునే ఆహారం చాలా పరిమితంగా మాత్రమే తీసుకోవాలి . ఈ మధ్యకాలంలో నాదగ్గరకు వస్తున్న రోగులలో చాలావరకు ఆహారసంబంధ రోగాల వారు ఎక్కువగా వస్తుండటం గమనించాను. అదేవిధంగా ఆయుర్వేదంలో ఒక ప్రధాన సూక్తి కలదు. " త్రికాల భోజనే మహారోగి , ద్వికాల భోజనే మహాభోగి , ఏకకాల భోజనే మహాయోగి " అని గొప్ప విషయం అంతర్లీనంగా చెప్పబడింది. కావున మీ శరీరతత్వానికి అనుకూలమైన ఆహారాన్ని తీసుకుని అనారోగ్య సమస్యల బారిన పడవద్దు. 


   గమనిక -


      నేను రాసిన " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు " మరియు " ఆయుర్వేద మూలికా రహస్యాలు " రెండు గ్రంథాలలో ఎన్నొ రహస్య చిట్కాలు , మా కుటుంబపరంగా గత 250 సంవత్సరాల నుంచి మా పెద్దవారు మాకు అందించిన ఎంతో అనుభవసారాన్ని ఈ గ్రంథాలలో అందరి అర్థం అయ్యే విధంగా సామాన్య బాషలో వివరించాను. ఇంట్లో ఉండి మరియు అందుబాటులో ఉన్న వాటితోనే పెద్ద పెద్ద రోగాలు నయం చేసుకునే విధంగా అత్యంత సులభయోగాలు మన ప్రాచీన భారతీయులు రచించిన చెట్లను బట్టి భూమిలో నీటిని కనుక్కునే విధానాలు , వృక్షాలకు ఆయుర్వేద మూలికల ఉపయోగించి దిగుబడి పెంచే వృక్షాయుర్వేద చిట్కాలు , రైతులకు ఉపయోగపడే విధంగా ఏయే నక్షత్రాలలో పంటలు వేస్తే ఫలితాల ఎక్కువుగా ఉంటాయో తిథి, నక్షత్ర, వారాలతో సహా ఇవ్వడం జరిగింది. ఆయుర్వేదం నేర్చుకోవాలి అనుకునేవారికి ఇది మంచి దిక్సూచిలా ఉపయోగపడును. ఈ గ్రంథాలలో మొక్కలను సులభముగ గుర్తించుటకు మొక్కల చిత్రాలు రంగులలో ఇవ్వడం జరిగింది.


      ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు గ్రంథం 288 పేజీలు ఉంటుంది .వెల - 350 రూపాయలు .


      ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథం 384 పేజీలు ఉంటుంది. వెల - 450 రూపాయలు కొరియర్ చార్జీలు కలుపుకొని 


        ఈ గ్రంథాలు కావలసినవారు డైరెక్టుగా ఫొన్ చేయండి . సంప్రదించవలసిన నెంబర్ 

                   

                        9885030034 


         మెస్సేజిస్ , కామెంట్ల రూపంలో పెట్టవద్దు .


                  కాళహస్తి వేంకటేశ్వరరావు .


              అనువంశిక ఆయుర్వేద వైద్యులు .


                          9885030034

శ్రీ దేవీ మహత్యము

 *🌹. శ్రీ దేవీ మహత్యము - దుర్గా సప్తశతి - 30  / Sri Devi Mahatyam - Durga Saptasati - 30 🌹*

✍️. మల్లికార్జున శర్మ 

📚. ప్రసాద్ భరద్వాజ 


*అధ్యాయము 8*

*🌻. రక్తబీజ వధ - 4 🌻*


44. అతని శరీరం నుండి ఎన్ని రక్తబిందువులు నేలపై పడ్డాయో అంతమంది బలసాహస పరాక్రమాలలో అతని వంటివారు పుట్టారు.


45. అతని రక్తం నుండి ఉత్పత్తియైన వీరులు కూడ మాతృకలతో సమానంగా, అతిభీషణంగా, అత్యుగ్రశస్త్రాలు ప్రయోగిస్తూ పోరాడారు.


46. మళ్ళీ ఆమె వజ్రాయుధపు తాకిడికి అతని శిరస్సుగాయపడి అతని రక్తం ప్రవహించగా, ఆ రక్తం నుండి వేలకొద్ది వీరులు పుట్టారు.


47. ఆ అసురేశ్వరుణ్ణి వైష్ణవి తన చక్రంతో, ఐంద్రి తన గదతో, యుద్ధంలో కొట్టారు. 


48. వైష్ణవియొక్క చక్రంచే చీల్చబడినప్పుడు కారిన రక్తం నుండి పుట్టిన అతని ప్రమాణాలు గల మహాసురసాహస్రంతో జగత్తు నిండిపోయింది.


49. కౌమారి బల్లెంతో, వారాహి ఖడ్గంతో, మాహేశ్వరి త్రిశూలంతో రక్తబీజమహాసురుణ్ణి కొట్టారు. 


50. రక్తబీజుడు కూడా కోపావేశంతో ఆ మాతృకల నందరినీ తన గదతో గట్టిగా కొట్టాడు.


51. శక్తి శూలాది ఆయుధాల వల్ల అతనికి కలిగిన పెక్కుగాయాల నుండి భూమిపై పడ్డ రక్తసమూహం నుండి వందల కొద్దీ అసురులు ఉద్భవించారు.


52. ఆ రక్కసుని రక్తం నుండి ఉద్భవించిన ఆసురులు జగత్తునంతా వ్యాపించారు. అందుచే దేవతలు మహాభీతి చెందారు.


53. విషాదమొందిన దేవతలను చూసి చండిక నవ్వి, కాళితో ఇలా పలికెను : ఓ చాముండా ! నీనోటిని విస్తీర్ణంగా తెరువు!


54. నా బాణాలు తగలడంతో కలిగే రక్తాన్ని, ఆ రక్తబిందువుల నుండి ఉత్పత్తైన మహాసురులను ఆ నోటితో వెంటనే మ్రింగివేయి.


55. “అతని వల్ల పుట్టే మహాసురులను భక్షిస్తూ యుద్ధంలో  సంచరించు. ఈ దైత్యుడు అట్లు రక్త క్షయం వల్ల మరణిస్తాడు.


56. "నీవు ఇలా వారిని భక్షిస్తే క్రొత్త ఉగ్రరాక్షసులు ఉత్పత్తి కారు.” ఆమెకు ఇలా చెప్పి దేవి అతణ్ణి అంతట శూలంతో పొడిచింది.


57. అంతట కాళి రక్తబీజుని నెత్తుటిని తన నోటితో త్రాగేసింది. అతడు అంతట చండికను తన గదతో కొట్టాడు. 


58. ఆ గద దెబ్బవల్ల ఆమెకు అత్యల్పవేదన కూడా కలుగలేదు. కాని, గాయపడిన అతని శరీరం నుండి రక్తం మిక్కుటంగా కారింది.


59-60. అలా కారిన రక్తాన్ని ఎప్పటికప్పుడు చాముండ తన నోటితో మ్రింగుతుండెను. తన నోట్లోని రక్తం వల్ల పుట్టిన మహాసురులను చాముండ మ్రింగుతూ, రక్తబీజుని నెత్తుటిని సైతం త్రాగివేసింది.


61. దేవి శూలంతో, వజ్రాయుధంతో, బాణాలతో, ఖడ్గంతో ఈటెలతో రక్తబీజుణ్ణి కొట్టింది. చాముండ అతని రక్తాన్ని త్రాగివేసింది.


62. రాజా! ఆ రక్తబీజమహాసురుడు అనేక శస్త్రాలతో మిక్కిలి గాయబడి రక్తహీనుడై భూమిపై కూలాడు.


63. రాజా! అంతట దేవతలు మిక్కిలి హర్షం పొందారు, వారి నుండి పుట్టిన మాతృకాగణం రక్తపానోన్మత్తతతో నృత్యం చేసారు.


శ్రీ మార్కండేయపురాణంలో సావర్ణిమన్వంతరంలో “దేవీ మాహాత్మ్యము” లో “రక్తబీజవద" అనే అష్టమాధ్యాయము సమాప్తం.


సశేషం....

🌹 🌹 🌹