6, అక్టోబర్ 2020, మంగళవారం
















 


 

పద్యం గురించి మీకు తెలుసా

 Hindu Dharmam Vardhillali (హిందూ ధర్మం వర్ధిల్లాలి):

🌹🌹 బెజవాడ ఆలయంలో రాజద్వారం పై ఉండే ఈ పద్యం గురించి మీకు తెలుసా !?🌹🌹


అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాల బెద్దమ్మ, సురారులమ్మ కడుపారడి పుచ్చినయమ్మ దన్నులో నమ్మిన వేల్పుటమ్మల మనమ్ముల నుండెడి యమ్మ దుర్గ, మాయమ్మ, కృపాబ్ధి యిచ్చుత మహత్త్వ కవిత్వ పటుత్వ సంపదల్!! 


విజయవాడ కనకదుర్గమ్మ తల్లి కోవెలలో ఇప్పటికీ రాజద్వారం మీద ఈ పద్యం రాసి ఉంటుంది. ఈ పద్యం పైకి ఒకలా కనపడుతుంది. మీరు తెలిసికాని, తెలియకకాని పోతనగారు వ్రాసిన పద్యములు కొన్ని నోటికి వచ్చినవి మీరు చదివినట్లయితే అవి సత్ఫలితాలనే ఇచ్చేస్తాయి.


    ఎందుకు అంటే మీరు కొన్ని కొన్ని చదవకూడదు. కొన్ని కొన్ని చేయకూడదు. పక్కన గురువు వుంటే తప్ప మేరువుని, శ్రీచక్రమును ఇంట్లోపెట్టి పూజ చెయ్యలేరు. అది మనవల్ల కాదు. మీరు బీజాక్షరములను ఉపాసన చెయ్యలేరు. అది కష్టం.


కానీ పోతనగారు ఈ దేశమునకు బహూకరించిన గొప్ప కానుక ఆయన రచించిన భాగవత పద్యములు.


’అమ్మలనుకన్న దేవతా స్త్రీలయిన వారి మనస్సులయందు ఏ అమ్మవారు ఉన్నదో అటువంటి అమ్మని మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్ – ఈ నాలుగింటికోసము నమస్కరిస్తున్నాను.


అటువంటి దుర్గమ్మ మాయమ్మ. ’ఇవీ ఆయన ఈ పద్యంలో చెప్పిన విషయములు, మీరు చెయ్యలేని ఒక చాలా కష్టమయిన పనిని పోతనగారు చాలా తేలికగా మీకు ప్రమాదం లేని రీతిలో మీతో చేయించేయడాని కని ఇటువంటి ప్రయోగం చేశారు. 


’అమ్మలగన్నయమ్మ’ – అమ్మలని చెప్పబడ్డవారు ఎవరు? మనకి లలితాసహస్రం ’శ్రీమాతా’ అనే నామంతో ప్రారంభమవుతుంది. ’శ్రీమాతా’ అంటే ’శ’కార ’ర’కార ’ఈ’కారముల చేత సత్వరజస్తమోగుణాధీశులయిన బ్రహ్మశక్తి, విష్ణుశక్తి రుద్రశక్తులయిన రుద్రాణి, లక్ష్మీదేవి, సరస్వతీదేవి – ఈ ముగ్గురికీ అమ్మ – ఈ మూడు శక్తులను త్రిమూర్తులకు ఇచ్చినటువంటి పెద్దమ్మ అమ్మ ఎవరు వున్నదో ఆయమ్మ – అంటే ’లలితాపరాభట్టారికా స్వరూపం’ – ఆ అమ్మవారికీ దుర్గాస్వరూపమునకు భేదం లేదు – అందుకని ’అమ్మలగన్నయమ్మ’ ’ముగ్గురమ్మల మూలపుటమ్మ’ – ఆ ముగ్గురు అమ్మలే మనం మహాకాళి, మహాలక్ష్మి, మహా సరస్వతి స్వరూపములుగా కొలిచే తల్లులు. ఈ ముగురమ్మల మూలపుటమ్మ. 


’చాల పెద్దమ్మ’ – ఇది చాలా గమ్మత్తయిన మాట. చాల పెద్దమ్మ అనే మాటను సంస్కృతంలోకి తీసుకువెడితే మహాశక్తి – అండపిండ బ్రహ్మాండములనంతటా నిండిపోయిన బ్రహ్మాండమయిన శక్తిస్వరూపం. ఈ శక్తి స్వరూపిణి చిన్నపెద్దా భేదంలేకుండా సమస్త జీవరాశులలోను ఇమిడి ఉంది. అలా ఉండడం అనేదే మాతృత్వం. ఇది దయ. దీనిని సౌందర్యం అంటారు. దయకు సౌందర్యం అని పేరు. అది ప్రవహిస్తే సౌందర్యలహరి. 


అండపిండ బ్రహ్మాండములనన్నిటినీ నిండిపోయి ఈ భూమిని తిప్పుతూ, లోకములనన్నిటినీ తిప్పుతూ ఇవన్నీ తిరగడానికి కారణమయిన అమ్మవారు ఎవరో ఆ అమ్మ.


’సురారులమ్మ కడుపారడి పుచ్చినయమ్మ’ – సురారి అనగా దేవతలకు శత్రువయిన వాళ్ళ అమ్మ. అనగా దితి. దితి అయ్యో అని ఏడిచేటట్టుగా ఆవిడకు కడుపుశోకమును మిగిల్చింది. అనగా రాక్షసులు నశించడానికి కారణమయిన అమ్మ. దేవతలలో శక్తిగా ఈమె ఉండబట్టే రాక్షసులు మరణించారు.


’తన్నులోనమ్మిన వేల్పుటమ్మల మనమ్ముల నుండెడియమ్మ’ – ఇదొక గొప్పమాట. అమ్మవారిని మనస్సులో నమ్ముకుని శక్తితో తిరుగుతున్న వారెవరు?


బ్రాహ్మి – మాహేశ్వరి – వైష్ణవి – మహేంద్రి

చాముండ – కౌమారి – వారాహి – మహాలక్ష్మి


మనకి సంప్రదాయంలో ’అష్టమాతృకలు’ అని ఉన్నారు. వాళ్ళని మనం ఎనిమిది పేర్లతో పిలుస్తూ ఉంటాము. బ్రాహ్మి, మహేశ్వరి, వైష్ణవి, మహేంద్రి, చాముండ, కౌమారి, వారాహి, మహాలక్ష్మి. 


ఇలా ఎనమండుగురు దేవతలు ఉన్నారు. వీరిని ’అష్టమాతృకలు’ అని పిలుస్తారు. ఈ అష్టమాతృకలు శ్రీచక్రంలో దేవతలుగా ఉంటారు. వీరు నిరంతరము అమ్మవారిని లోపల కొలుస్తూ, అమ్మవారి వలన శక్తిని పొంది మనని ఉద్ధరిస్తూ ఉంటారు. ఈ ఎనమండుగురునే మనం కొలుస్తూ వుంటాము.


’రక్తాంబరాం రక్తవర్ణాం రక్త సౌభాగ్యసుందరాం వైష్ణవీం శక్తిమద్భుతాం’


అంటారు దేవీభాగవతంలో వ్యాసభగవానుడు. ఈ ఎనమండుగురికీ శక్తినిచ్చిన అమ్మవారెవరో ఆవిడే వేల్పుటమ్మల మనమ్ముల నుండెడియమ్మ – దుర్గమాయమ్మ – ఈ దుర్గమ్మ ఉన్నదే లలితాపరాభట్టారిక – ఆవిడ లలితా పరాభట్టారిక – ఆ అమ్మ మాయమ్మ.


’మహత్త్వ కవిత్వ పటుత్వ సంపదల్’ – ఇప్పుడు ఆవిడ నాకు దయతో మహత్త్వ కవిత్వ పటుత్వ సంపదలను ఇవ్వాలి. నాకు అర్హత ఉన్నదని ఇవ్వనక్కరలేదు. దయతో ఇచ్చేయ్యాలి.


అమ్మవారికి ’శాక్తేయప్రణవములు’ అని కొన్ని బీజాక్షరములు ఉన్నాయి. ఓం ఐంహ్రీంశ్రీంక్లీంసౌః – ఈ ఆరింటిని శాక్తేయ ప్రణవములు అని పిలుస్తారు. దానిని ఎలాబడితే అలా ఉపాసన చెయ్యకూడదు. కాబట్టి బీజాక్షరములను అన్నివేళలా ఉపాసన చేయలేము. కానీ ఇప్పుడు పోతనగారు ఒక గొప్ప ప్రయోగం చేశారు. మహత్వమునకు బీజాక్షరము ’ఓం’, కవిత్వమునకు బీజాక్షరము ’ఐం’, పటుత్వమునకు భువనేశ్వరీ బీజాక్షరము ’హ్రీం”, ఆ తర్వాత్ సంపదల్ – లక్ష్మీదేవి – ’శ్రీం’. 


ఇపుడు ’ఓంఐంహ్రీంశ్రీం’ – అమ్మలగన్నయమ్మ ’శ్రీమాత్రేనమః’


మీరు బీజాక్షరములతో అస్తమానూ అలా అనడానికి వీలులేదు. కానీ మీరు రైలులో కూర్చున్నా, బస్సులో కూర్చున్నా స్నానం చెయ్యకుండా కూడా ఎక్కడ


ఉన్నా కూడా –


ముగురమ్మల మూలపుటమ్మ – అంటున్నారనుకోండి అపుడు మీరు మరోరూపంలో ’ఓంఐంహ్రీంశ్రీం శ్రీమాత్రేనమః’ – ఓంఐంహ్రీంశ్రీం శ్రీమాత్రేనమః’ అనేస్తున్నారు.


మీరు అస్తమాననూ అమ్మను తలచుకున్నట్లు అవుతుంది. అపుడు అమ్మవారు చాలా తొందరగా మీకు పలుకుతుంది. అందుకే లలితా సహస్రం ’శ్రీమాతా’ అంటూ అమ్మతనంతో ప్రారంభమవుతుంది.


ఆవిడ రాజరాజేశ్వరి. అయినా ఆవిడముందు అమ్మా అమ్మా అనేసరికి ఆవిడి పొంగిపోతుంది. ఇన్నిమార్లు ఆ పద్యంద్వారా అటూ ఇటూ అమ్మని మీరు పిలుస్తుంటే విసుక్కోవడం చేతకాని దయాస్వరూపిణి అయిన అమ్మ మీకోరికను తీరుస్తుంది. ఇప్పుడు మీరు ’ఓంఐంహ్రీంశ్రీం శ్రీమాత్రే నమః’ అనలేకపోవచ్చు.


కానీ ’అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాల పెద్దమ్మ’ అనడానికి కష్టం ఏమిటి?


ఈవిధంగా పోతనగారు శ్రీవిద్యా రహస్యములన్నిటిని ఔపోసనపట్టి తెలుగు వారందరికీ ఒక మహత్తరమయిన కానుకను బహూకరించిన మహాపురుషుడు ఆయన ఒక ఋషి. అందుకని ఆ పద్యమును అనుగ్రహించినారు.


ఆ తల్లి అనుగ్రహం అందరికీ లభించాలని ప్రార్థిస్తూ🌹🙏🙏🌹

🌿 ఉమా మహేశ్వర స్తోత్రమ్ 🌼🌿

 అత్యంత శక్తివంతమైన స్తోత్రం ఇది.భార్య, భర్తల మధ్య మనస్పర్థలు వచ్చినప్పుడు ఈ స్తోత్రం పఠించండి. ఆ పార్వతి,పరమేశ్వరుల అనుగ్రహం పొందండి.


🌼🌿 ఉమా మహేశ్వర స్తోత్రమ్ 🌼🌿

( శ్రీ ఆది శంకరాచార్య విరచితం)


నమః శివాభ్యాం నవయౌవనాభ్యాం పరస్పరాశ్లిష్టవపుర్ధరాభ్యాం

నగేంద్రకన్యావృషకేతనాభ్యాం నమో నమః శంకరపార్వతీభ్యాం || 


నమః శివాభ్యాం సరసోత్సవాభ్యాం నమస్కృతాభీష్టవరప్రదాభ్యాం

నారాయణేనార్చితపాదుకాభ్యాం నమో నమః శంకరపార్వతీభ్యాం || 


నమః శివాభ్యాం వృషవాహనాభ్యాం విరించివిష్ణ్వింద్రసుపూజితాభ్యాం

విభూతిపాటీరవిలేపనాభ్యాం నమో నమః శంకరపార్వతీభ్యాం || 


నమః శివాభ్యాం జగదీశ్వరాభ్యాం జగత్పతిభ్యాం జయవిగ్రహాభ్యాం

జంభారిముఖ్యైరభివందితాభ్యాం నమో నమః శంకరపార్వతీభ్యాం || 


నమః శివాభ్యాం పరమౌషధాభ్యాం పంచాక్షరీపంజరరంజితాభ్యాం

ప్రపంచసృష్టిస్థితిసంహృతాభ్యాం నమో నమః శంకరపార్వతీభ్యాం || 


నమః శివాభ్యామతిసుందరాభ్యాం అత్యంతమాసక్తహృదంబుజాభ్యాం

అశేషలోకైకహితంకరాభ్యాం నమో నమః శంకరపార్వతీభ్యాం || 


నమః శివాభ్యాం కలినాశనాభ్యాం కంకాళకల్యాణవపుర్ధరాభ్యాం

కైలాసశైలస్థితదేవతాభ్యాం నమో నమః శంకరపార్వతీభ్యాం || 


నమః శివాభ్యామశుభాపహాభ్యాం అశేషలోకైకవిశేషితాభ్యాం

అకుంఠితాభ్యాం స్మృతిసంభృతాభ్యాం నమో నమః శంకరపార్వతీభ్యాం || 


నమః శివాభ్యాం రథవాహనాభ్యాం రవీందువైశ్వానరలోచనాభ్యాం

రాకాశశాంకాభముఖాంబుజాభ్యాం నమో నమః శంకరపార్వతీభ్యాం || 


నమః శివాభ్యాం జటిలంధరాభ్యాం జరామృతిభ్యాం చ వివర్జితాభ్యాం

జనార్దనాబ్జోద్భవపూజితాభ్యాం నమో నమః శంకరపార్వతీభ్యాం || 


నమః శివాభ్యాం విషమేక్షణాభ్యాం బిల్వచ్ఛదామల్లికదామభృద్భ్యాం

శోభావతీశాంతవతీశ్వరాభ్యాం నమో నమః శంకరపార్వతీభ్యాం || 


నమః శివాభ్యాం పశుపాలకాభ్యాం జగత్రయీరక్షణబద్ధహృద్భ్యాం

సమస్తదేవాసురపూజితాభ్యాం నమో నమః శంకరపార్వతీభ్యాం || 


స్తోత్రం త్రిసంధ్యం శివపార్వతీభ్యాం భక్త్యా పఠేద్ద్వాదశకం నరో యః

స సర్వసౌభాగ్యఫలాని భుంక్తే శతాయురాంతే శివలోకమేతి ||

హిందూ పురాణాలన్నీ

 హిందూ పురాణాలన్నీ బుద్ధుడి తర్వాత రాసుకున్నవే !...



ఎరుక బ్రహ్మ మనియె యిల శంకరార్యులు

తెలివి బ్రహ్మమనుచు దెలిపె వ్యాసు

లెరుక తెలివి రెంటి నెరుగడు వేమన

విశ్వదాభిరామ వినురవేమ!


ఇది విశ్వాసాల యుగం కాదు. వాస్తవాల యుగం నిజ నిర్ధారణల యుగం. అన్వేషించి, శోధించి, సాధించే యుగం. వైజ్ఞానికంగా అన్నింటికీ అన్ని సాక్ష్యాధారాలు సంపాదించుకోగల యుగం. అబద్ధాల పొరలు తొలగిపోయి, నిజాలు ప్రకాశిస్తున్న కొద్దీ మనిషి వివేకం పెరుగుతూ వస్తోంది. ''ఉపనిషత్తులు, వేదాలు, పురాణాలు అన్నీ భగవదనుగ్రహంతో ఈ మానవజాతికి అందాయి'' అని చెప్పే కట్టుకథలకు ఆధారాలు లేవు. కామన్‌ ఎరాకు ముందు కాలాన్ని Before Common Era గా, ఆ తర్వాత కాలాన్ని Common Era గా మనం విభజించుకున్నాం. దీన్నే లోగడ క్రీ.పూ - క్రీ.శ. అని వ్యవహరించే వాళ్ళం. దాని ప్రకారం జీవ పరిణామం ఏర్పడి మనిషిగా రూపొందిన నాటి నుంచి నేటి వరకు ప్రపంచంలో జరుగుతూ వచ్చిన సామాజిక, చారిత్రక, రాజకీయ, ధార్మిక అంశాలనన్నింటినీ దాదాపు ఖచ్చితంగా బేరీజు వేసుకోగలుగుతున్నాం. 


ఇక మనదేశానికి మాత్రమే పరిమితమై చూసుకుంటే కాలాన్ని ఐదు విభాగాలుగా చేసుకోవచ్చు. 1. సింధూ నాగరికతకు, పూర్వకాలం (3300 బీసీఈకి పూర్వం) 2.సింధూ నాగరికత కాలం (3300-1300 బీసీఈ) 3. అంధకార కాలం (1300-563 బిసీఈ) 4. బౌద్ధుల కాలం (563-480 బీసీఈ) 5. బ్రాహ్మణవాద ప్రారంభ కాలం (700-750 బీసీఈ). హరప్పా, మొహంజోదారోలో దొరికిన ఆధారాలు సింధూనాగరికతను తేటతెల్లం చేశాయి. సింధూనాగరికతకు, బుద్ధుడి కాలానికి మధ్య చాలా కాలం గడిచిపోయింది. దాన్ని చరిత్రకారులు అంధకార కాలంగా గుర్తించారు. ఎందుకంటే ఆ కాలానికి సంబంధించిన ఏ ఆధారమూ ఇప్పటి వరకు దొరకలేదు. తర్వాత వచ్చింది బుద్ధుడి కాలం. మనకు తవ్వకాల్లో లభించిన శిల్పాలు, స్థూపాలు, ఆరామాలు, గుహలు వంటి ఆధారాలన్నీ బుద్ధయుగానికి సంబంధించినవే. తర్వాత బ్రాహ్మణవాద యుగం ప్రారంభమైంది. బుద్ధుడి ఆరామాలు విగ్రహాలు మార్చి మార్చి ఏవిధంగా హిందూ ఆలయాలుగా, దేవతా విగ్రహాలుగా ప్రకటించుకున్నారో చరిత్ర చెపుతూ ఉంది. వాటి ప్రకారం హిందూ పురాణాలు ఎప్పుడు రాయబడ్డాయన్న దానికి ఆధారం దొరికింది.


హిందువుల వేదాలు 1700-1100బీసీఈ ప్రాంతంలో, ఉపనిషత్తులు 1250-600బిసీఈ మధ్యలో రాయబడ్డ తర్వాత.. జైన తీర్థంకరుడు మహావీరుడు 599-527 బీసీఈ మధ్య కాలంలో జీవించాడు. గౌతమ బుద్ధుడు 563-480 బీసీఈ మధ్య కాలంలో జీవించాడు. తర్వాత చాలా కాలానికి మౌర్య సామ్రాజ్యం విస్తరించింది (322-180 బీసీఈ). అశోకచక్రవర్తి 250 బీసీఈ ప్రాంతంలో రాజ్యమేలాడు. బౌద్ధాన్ని స్వీకరించి, దానికి విస్తృత ప్రచారం తీసుకొచ్చాడు. ఇప్పటికీ మన ప్రభుత్వ చిహ్నంగా ఉన్న ధర్మచక్రం ఆయనదే. దేశంలో బౌద్ధ స్థూపాలు, ఆరామాలు, కట్టడాలు ఎన్నో కట్టించాడు. తర్వాత వచ్చిన మౌర్యవంశపు రాజులు కూడా ఆ పనిని కొనసాగించారు. అలా బౌద్ధం మనదేశంలోనూ, ఇతర దేశాల్లోనూ వెయ్యి సంవత్సరాల పాటు కొనసాగింది. ప్రజాదరణ తగ్గినా ఆ జీవన విధానం ఇప్పటికీ కొనసాగుతూ ఉంది. 


ఇక పురాణాల విషయానికొస్తే...


 అన్నీ బుద్ధుడి తర్వాతనే రాయబడ్డాయి. అంటే ఇప్పటికి 1600-500 సంవత్సరాలకు పూర్వం మాత్రమే రాయబడ్డాయి. అందులో మార్పులు, చేర్పులు, కూర్పులు వంటివెన్నో ఆ మధ్య కాలంలో చేయబడుతూ వచ్చాయన్న విషయం ప్రసిద్ధ చరిత్ర కారులంతా దృవపరిచారు. మార్కండేయ పురాణం 400-500 సీఈ (క్రీ.శ) రాయబడితే, కూర్మపురాణం 500-600 సీఈలో, వామన పురాణం 700 సీఈలో రాయబడ్డాయి. నారదపురాణం 700-800 సీఈలో అగ్ని పురాణం 700-1100సీఈలో రాయబడ్డాయి. ఇక భవిష్య, బ్రహ్మ, వైవర్త పురాణాలు కేవలం 520 సంవత్సరాలకు పూర్వం అంటే 1500 సీఈలో రాయబడ్డాయి.


 


భారతదేశ చరిత్ర అంటే...


 చొరబాటుదారు లెవరెవరూ? వారి వారి రాజ్యస్థాపనలు ఎలా జరిగాయి? ఎంతెంత కాలం పరిపాలించారు - అనేది మాత్రమే కాదు, బహు ముఖాలుగా విస్తరిస్తూ వచ్చిన భారతీయ కళలు, సాహిత్యం, నిర్మాణాలు, మతాలు, నైతిక విలువలు. వీటన్నిటికీ వెన్నెముకగా నిలిచిన భారతీయ వైజ్ఞానిక ఆలోచనా ధోరణులు కూడా పరిశీలించాల్సి ఉంటుంది. రాజకీయపరంగా ఒకప్పుడు గ్రీకులు, హుణులు, పఠాన్లు, మొగలులు, బ్రిటిషర్లు ఈ దేశాన్ని ఆక్రమించారు. నిజమే! కొందరు జనరంజకంగా కూడా పరిపాలించారు. అయినా కూడా ఇక్కడి ప్రజల హృదయ సామ్రాజ్యాన్ని పూర్తిగా గెలుచుకోలేక పోయారు. అందుకే ఈ దేశంలో ఎన్నో ధర్మాలు, ఎన్నో విశ్వాసాలు, ఎన్నో సంస్కృతులు, సంప్రదాయాలు ఏకకాలంలో విలసిల్లుతూ వచ్చాయి. ఒకప్పుడు బౌద్ధం వ్యాపించి ఉన్న రోజుల్లో వైదిక ధర్మం లేకుండా పోలేదు. ఇప్పుడు దేశంలో హిందువులు సంఖ్యాపరంగా అధికులైనంత మాత్రాన ఇస్లాం, క్రైస్తవ, సిక్కు, జైన మతస్థులు లేకుండా పోలేదు. ఏది ఏమైనా, దేశం సమైక్యంగా ఉంటూ వచ్చిందన్నది చారిత్రక సత్యం!


 

హిందూ సంస్కృతి అతి పురాతనమైనదే కాని, అంతకన్నా పురాతనమైన సంస్కృతులు ప్రపంచంలో కొన్ని ఉన్నాయన్నది మరువకూడదు. ఆది శంకరుడు అద్వైతానికి రూపకల్పన చేసిన తర్వాతనే, హిందూ అంటే వైదిక సంస్కృతి బాగా విస్తరించింది. ఆది శంకరుడు (700-750సీఈ) దక్షిణ భారతదేశంలోని కేరళ-కొచ్చి ప్రాంతంలో జన్మించాడని చెపుతారు. అయితే ఆయన జీవించిన కాలం కచ్చితంగా నిర్ధారణ కాలేదు. కాని, అది చాళుక్యులు పరిపాలించిన కాలం అని తెలుస్తోంది. అప్పటికి ఉచ్ఛస్థితిలో ఉన్న బౌద్ధాన్ని నాశనం చేయడానికి ఆయన తన సర్వశక్తుల్ని ఒడ్డారు. బౌద్ధం ఆత్మ లేదని చెపితే, ఈయన ఉందని ప్రతిపాదించాడు. బౌద్ధం దేవుడు లేడని అంటే ఈయన ఉన్నాడని వాదించాడు. బౌద్ధరచనలు, బోధనలు పాళి భాషలో సాగుతూ ఉంటే, ఈయన వైదిక మత ప్రచారం సంస్కృతంలో ప్రారంభించాడు. వేదాల, ఉపనిషత్తుల, భగవద్గీతల సారాంశాన్ని దేశ వ్యాప్తంగా ప్రచారం చేస్తూ, భారత ఉప ఖండమంతా ప్రయాణించాడు.

'మీమాంస-అనేది ప్రచారంలోకి తెచ్చాడు. బౌద్ధం నిర్వాణ (LIBERATION) అని అంటే, ఈయన 'మోక్షం' అని అన్నాడు. వేదాలలో, ఉపనిషత్తులలో ఉన్నవన్నీ 'ఆప్తవచనాలే' అని అన్నాడు. అదంతా గొప్ప 'జ్ఞాన సంపద' అని చెప్పాడు. చివరకు నేటి ఉత్తరాఖండ్‌లోని కేదార్‌నాథ్‌లో కన్నుమూశాడు.


 తర్వాతకాలంలో తమిళనాడులోని శ్రీపెరంబుదూర్‌లో రామానుజుడు (1017-1137సి.ఈ) రంగం మీదికి వచ్చాడు. శ్రీవైష్ణవంలో అతి ముఖ్యమైన 9రచనలు చేశాడు. అందులో గీతాభాష్యం, శ్రీభాష్యం, వేదార్థ సంగ్రహం, వేదాంత సారం, నిత్య గ్రంథం, శ్రీవైకుంఠ గద్యం, శ్రీరంగ గద్యం వంటివి ఉన్నాయి. రచనలకు, బోధనలకు ఈయన సంస్కృత భాషనే వాడాడు. వేదాంతాన్ని, వైష్ణవైద్వైతాన్నీ ప్రచారం చేస్తూ సుదీర్ఘకాలం 120ఏండ్లు జీవించి, చివరకు శ్రీరంగంలో కన్నుమూశాడు. శంకరాచార్య ఆరాధ్యదైవం శివుడయితే, రామానుజా చార్య ఆరాధ్య దైవం విష్ణువు. ఈ రెండువాదాలు వైదిక ధర్మంలోంచి వెలువడినవే అయినా, పూజించే దేవుళ్ళు వేరుకావడం వల్ల రెండుగా చీలిపోయిన వీరి అనుయాయుల మధ్య.. హోరాహోరిగా కొట్లాటలు జరిగేవి. చరిత్రకారుడు నీలకంఠ శాస్త్రి ఈ విషయాల్ని క్షుణ్ణంగా అధ్యయనం చేశారు.


 

ఆది శంకరాచార్యుని మించిన గురువు, వేదాంతి మరొకరు లేరని హిందువులు భావిస్తారు. కాని ప్రాచీన భారత చరిత్ర - సంస్కృతులపై పరిశోధనలు చేసిన వారి అభిప్రాయం వేరుగా ఉంది. ఆయన జీవించి ఉన్న కాలం కన్నా ఆయన మరణం తర్వాత అంటే దేశంలో మొగలులు ప్రవేశించిన 14వ శతాబ్దం తర్వాత - ఆయన జీవిత చరిత్రలు విరివిగా రాయబడ్డాయి. ఆదిశంకరుడి తర్వాత, ఆయన స్థానానికి వచ్చిన వారినందరినీ శంకరాచార్యగానే భావించేవారు. అందువల్ల ఆ జీవిత చరిత్రలు ఎవరివన్నది కచ్ఛితంగా తెలియదు. జ్యోతిర్‌ పీఠం (ఉత్తరం) శారదాపీఠం (పడమర) గోవర్ధన పీఠం (తూర్పు) కంచిపీఠం, బద్రి వంటి పీఠాల నిర్వహణ బాధ్యతలు చేపట్టేవారిని ఇప్పటికీ శంకరాచార్య అనే పిలుస్తున్నారు. అందుకే తొలి శంకరాచార్యను ఆది శంకరాచార్య అని సంభోదిస్తారు. వీరు కర్మసిద్ధాంతాన్ని, వర్ణాశ్రమ ధర్మాన్ని, పంచాయతన పూజను పూర్తిగా సమర్థించారు. పంచాయతన పూజ అంటే - ఐదుగురు దేవుళ్ళను ప్రార్థించడం. విష్ణు, శివుడు, దుర్గ, సూర్యుడు, గణేషుడు. ఇందులో ఎవరో ఒకరిని మాత్రమే ఎంచుకుని పూజించుకోవచ్చు. దాన్ని ఇష్టదేవత - కుల దేవత అని అన్నారు. వీరిలో ఏకాదశి ఉపవాసాలు, కుంభమేళాలు ప్రారంభించింది మాత్రం శృంగేరి శారదా పీఠానికి 12వ గురువు అయిన విద్యారణ్య (మాధవ).


ప్రసిద్ధ చరిత్రకారుడు సురేంద్రనాథ్‌ దాస్‌ గుప్తా - ''ఎ హిస్టరీ ఆఫ్‌ ఇండియన్‌ ఫిలాసపీ'' - 5 సంపుటాలు ప్రకటించారు. వైదికులు మొదట బౌద్ధాన్ని అనుకరిస్తూ కాలక్రమంలో దాన్ని నాశనం చేస్తూ పూర్తి వ్యతిరేకులుగా ఎలా మారారో సోదాహరణంగా వివరించారు. ఉదాహరణకు బౌద్ధంలో నాగార్జునుడు ప్రతిపాదించిన 'శూన్యాన్ని' శంకరుడు 'బ్రహ్మ' అని అన్నాడు. శూన్యవాద, విజ్ఞానవాద బౌద్ధంలోని అంశాలే ఉపనిషత్తులలో కలుపుకున్నారని వివరించాడు. మహాయాన బౌద్ధంలోని అనేక విషయాలు శంకరుడు నేరుగా తీసుకున్న విషయాన్ని ఆయన ఆధారాలతో ధృవీకరించారు. సమదృష్టితో వాస్తవాల్ని వాస్తవాలుగా నమోదు చేసిన చరిత్రకారుడు సురేంద్రనాథ్‌ దాస్‌ గుప్తా (1887-1952) ఎస్‌.ఎన్‌.దాస్‌ గుప్తగా ప్రసిద్ధులు. కలకత్తా విశ్వవిద్యాలయానికి చెందిన ఈయన 1935-39 మధ్య కాలంలో రోమ్‌, బెర్లిన్‌, జురిచ్‌, పారిస్‌, ఇంగ్లండ్‌ వంటి ఒక డజను యూనివర్సిటీలకు విజిటింగ్‌ ప్రొఫెసర్‌గా పనిచేశారు. రెండు పి.జి. డిగ్రీలు తీసుకున్నవారు ఉంటే ఉంటారు గానీ, ఈయన రెండు పీహెచ్‌డీలు కూడా తీసుకుని తన ప్రత్యేకతను నిలుపుకున్నారు. కలకత్తా యూనివర్సిటీ నుంచి పీహెచ్‌డీ తీసుకున్నాక, మళ్ళీ మరో పీహెచ్‌డీ కోసం కేంబ్రిడ్జి వెళ్ళారు. భారతదేశంలో బౌద్ధం క్షీణించడానికి కొన్ని శతాబ్దాల కాలం పట్టింది. పైగా అది అనేక కారణాల వల్ల క్షీణిస్తూ వచ్చింది. ధర్మాలలో మార్పులు, ఆరామాలలో మార్పులు ఎలా జరుగుతూ వచ్చాయో ఎస్‌.ఎన్‌.దాస్‌ గుప్త రచనలు తేటతెల్లం చేస్తాయి.


 శబరిమల, తిరుపతి, తిరువనంతపురం, పూరీ, బద్రీనాథ్‌లలో గల ప్రసిద్ధ హిందూ దేవాలయాలన్నీ మార్పులకు గురైన బౌద్ధారామాలే నన్నది స్పష్టమవుతుంది. వందల సంఖ్యలో పురాతన హిందూ విగ్రహాలన్నీ మార్పులకు గురైన బుద్ధుడి విగ్రహాలేనన్నది రుజువవుతుంది. ఎవరి మత విశ్వాసాలు వారివే.. కానీ, నిజమైన చారిత్రక విశేషాలు వైజ్ఞానిక దృక్పథంతో అధ్యయనం చేయాలనుకునే వారికి ఈ దేశంలో ముడిసరుకు చాలా ఉంది.


....డాక్టర్‌ దేవరాజు మహారాజు

సుప్రసిద్ధ సాహితీవేత్త, జీవశాస్త్రవేత్త

ది..02.10.2020.. నవతెలంగాణ దినపత్రిక నుంచి...

New technology


 

అమ్మవారికి ప్రత్యేక పూజలు


 

నేత్రాభీనయం


 

మధుర గాయకులు


 

అవధాని


 

ధర్మం


 

ముక్కు తెగినప్పుడు సుశ్రుతాచార్యుడు శస్త్రచికిత్స

 ముక్కు తెగినప్పుడు సుశ్రుతాచార్యుడు శస్త్రచికిత్స చేసిన విధానం - 


      చెట్టుయొక్క ఆకుని తీసి తెగియున్న ముక్కుభాగమును సరిగ్గా కొలతపెట్టి అంతప్రమాణం గల చర్మమాంసములు తో కూడిన పోరని దగ్గరగా ఉండు చెక్కిలి భాగం క్రిందనుండి మీదకి కోసి మీదభాగం పట్టు ఉండునట్లు ఉంచి ఆ పొరని ముక్కు యొక్క మొదలు వరకు పదునైన అంచుతో శస్త్రం తో గీచి రక్తం స్రవించునట్లు చేసి దానితో అంచులని అతికించి నాసారంధ్రములకు రెండింటికి తేలికైన గలగడ్డితో చేసిన గొట్టములని దూర్చి పైన ముక్కుయొక్క ఆకారంనకు సరిగ్గా ఆ కండపోరని సర్ది అప్రమత్తముగా , శీఘ్రముగా మీదకి ఎత్తి సూత్రాదులతో ( దారాలతో ) చక్కగా బంధనం చేసి దానిపైన రక్తచందనం , యష్టిమధూకం , రసాంజనం వీని చూర్ణంని చల్లి ఆ పైన తెల్ల దూదిపింజతో కప్పి నువ్వులనూనెని మాటిమాటికి వేసి తడుపుచుండవలెను . మరియు ఆ రోగికి జీర్ణం అయ్యేంత తగినంత నెయ్యిని త్రాగించి కొంచం స్థిమితపడిన తరువాత శాస్త్రానుసారం విరేచనం చేయించవలెను. 


          ఇలా చేయుచూ చక్కగా ఆ పోర అతుకుకున్న తరువాత అంతకు ముందు కొంచం పట్టు ఉంచిన కండ భాగాన్ని ఛేదించవలెను . ఇలా చక్కగా అతుకుకొనిన తరువాత కొంచం కృశించి ఉన్నచో ఆ భాగం నకు వెనక చెప్పిన తైలాది చికిత్సలను అనుసరించి ఆ భాగం పెరుగునట్లు చేయవలెను . ఒకవేళ అక్కడ మాంసం ఎక్కువుగా వృద్ధిచెంది యున్నచో సమముగా ఉండునట్టి ఉపాయం జూచి తగ్గించి సరిచేయవలెను . ఒక్కోసారి లలాటభాగం నందలి మాంసపుపొర కూడా కోసి అతకవలసి యుండును.


       ఈ విధముగా సుశ్రుతాచార్యుడు శస్త్రచికిత్సలు కడు ఉపాయంతో సులభంగా చేసేవారు.


 

  గమనిక -


           నాచే రచించబడిన "ఆయుర్వేద మూలికా రహస్యాలు " , " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు " అను ఈ రెండు గ్రంథముల యందు అత్యంత రహస్యమైన సులభముగా ఇంటి యందు , చుట్టుపక్కల దొరికే మూలికలతోనే పెద్దపెద్ద రోగాలను నయం చేసుకొనే విధముగా అనేక వైద్య యోగాలను ఇచ్చాను. ఈ గ్రంథాలలో ఇచ్చినటువంటి యోగాలు అన్నియు గత 250 సంవత్సరాల నుంచి వంశపారంపర్యముగా మాకు వస్తున్న రహస్యయోగాలు పరోపకారార్థం దాచుకోకుండా ప్రచురించాను.


           మన చుట్టుపక్కల ఉండే మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల బొమ్మలతో మొక్కల చిత్రపటాలు ఇవ్వడం జరిగింది.


            రైతులకు ఉపయోగపడేవిధముగా చెట్లను , భూమిని బట్టి , రాళ్లని బట్టి భూమి యందు జలమును కనుగొను విధానం , ముహూర్తాలను అనుసరించి ఏయే సమయాలలో పంటలు వేయాలి . ఆయుర్వేద మూలికల సహాయముతో పురుగు మందులు వాడకుండా అత్యంత ఎక్కువ దిగుబడులు సాధించే రహస్య వృక్షయుర్వేద యోగాలు , పశువులకు సంబంధించిన వైద్య యోగాలు కూడా ఇవ్వడం జరిగింది . ఈ గ్రంథాలలో ఇచ్చిన యోగాలు ఉపయోగించటం వలన ఎటువంటి వ్యతిరేక ఫలితాలు రావు.


      ప్రాచీన ఆయుర్వేద రహస్యాలు గ్రంథం 288 పేజీలు ఉంటుంది . విలువ 350 రూపాయలు మాత్రమే . ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథం 384 పేజీలు ఉంటుంది . విలువ 450 రూపాయలు . మీకు కొరియర్ ద్వారా వస్తాయి. పుస్తకములు ఎక్కువ కాలం మన్నిక కొరకు కుట్టించి ఇవ్వడం మరియు అత్యంత నాణ్యమైన తెల్లటి 80GSM పేపరుతో ఉంటాయి.


            ఈ రెండు గ్రంథాలు కావలసినవారు డైరెక్టుగా 9885030034 నెంబర్ కి ఫోన్ చేయగలరు. కామెంట్లు , మెస్సేజెస్ సమాధానము ఇవ్వబడదు. కాల్ చేయగలరు . రెండు గ్రంథముల ఖరీదు కొరియర్ ఛార్జీలతో కలిపి 900 రూపాయలు . 


                 కాళహస్తి వేంకటేశ్వరరావు 


             అనువంశిక ఆయుర్వేద వైద్యులు 


                         9885030034

వక్త్రలక్ష్మీపరీవాహచలన్మీనాభలోచనా

 Sri Lalitha Paraabhattarika Naama Vaibhavam -- 19 by Pujya Guruvulu Brahmasri Chaganti Koteswara Rao Garu


 ‘’


ఈ నామములో అమ్మవారి కన్నుల గురించి మాట్లాడుతున్నారు. అమ్మవారి నేత్ర వైభవము కాంతి కదలికలతో ప్రవాహముతో ఉన్న సరస్సుగా భావనచేస్తే అందులో ఉండే చేపపిల్లలే ఆమెకన్నులు. అక్షరవర్గము మీద అధికారమున్న వశిన్యాదిదేవతల అనుగ్రహము లేకపోతే నోటివెంట ఒక్కమాట పలకలేరు. సంస్కృతములో కన్నులను అక్షి అని, మీనములని అంటారు కనక మీనాక్షి అయింది. స్తోత్రములో ఎక్కడా మీనాక్షి అన్న నామము అనలేదు. కన్నులు చేపల్లా ఉంటాయి కనక మీనాక్షి అని చెప్పకనే చెప్పారు. ఇందులో తెలుసుకోవలసిన నిగూఢమైన రహస్యము ఒకటి ఉన్నది. పైకి కనిపించే అర్థము చూస్తే ఒక స్థాయిలో అనుభవించడము జరుగుతుంది. బాగా ధ్యానము చేసి ఆలోచిస్తే దొరికే అమృతము వేరుగా ఉంటుంది. చేపలతో ఎందుకు పోల్చారని పరిశీలన చేస్తే – చేపలో మూడులక్షణములు ఉంటాయి. చేపయే సృష్టికర్త, స్థితికర్త, ప్రళయకర్త. ‘సృష్టికర్త’ - బాహ్యములో స్త్రీ పురుష సంపర్కము చేత ఆయా జాతులు వృద్ధి పొందుతాయి. చేపలలో మాత్రము స్త్రీ పురుష మీనముల సంపర్కము ఉండదు. చేపలను కనాలన్న కోరిక కలగగానే ఆడచేప మగచేపవంక ఆ భావనతో చూస్తుంది. చూడగానే ఆడచేపకు సంతానము పెంచకలిగిన శక్తి ఉద్బుదమయి చేపకి పిల్లలు వస్తాయి. పోషించవలసి వస్తే స్తన్యము ఇవ్వదు. ‘స్థితికర్త’ - తన చూపులతో పోషిస్తుంది. సృష్టిలో ఇది చాలా ఆశ్చర్యకరమైన విషయము. ఇంకా ఆహారము తినడము చేతకాని పిల్ల అమ్మవంక చూస్తే తల్లిచేప మీ ఆకలి తీరుగాక అన్నట్టుగా తలనుతిప్పి చూస్తే ఆ చేపపిల్లల కడుపు నిండిపోతుంది. ‘ప్రళయకర్త’ - చేపకు ఆహారము చేపే. పెద్దచేప చిన్నచేపను తనజాతిదే అని తెలిసుండి తినేస్తుంది. అమ్మవారి కన్నులు సృష్టించి, పోషించి, తినేసిన చేపలయితే ఆవిడే తన చూపులతో సృష్టి చేస్తూ, పోషిస్తూ, లయం చేస్తున్నది. మీనాక్షి అన్న నామము ప్రకటనముగా వాడకుండా మీనాక్షీతత్త్వమును తీసుకువచ్చారు. 


అమ్మవారు ఈ లోకములో పుట్టి పెరిగి పెళ్లి చేసుకుని బిడ్డలను కని మనలను పోషించడము కోసమని వచ్చి కూర్చున్న రూపమే మీనాక్షి. ప్రస్తుతము మధురై అని పిలుస్తున్న ప్రాంతములో ఒక మహారణ్యము ఉండేది. అందులో నుంచి ధనుంజయ్ అన్న వ్యాపారి వెడుతూ మార్గ మధ్యములో ఒక ప్రాకారము కనపడితే అందులో పడుకుందామని అనుకున్నాడు. ఇంతలో దేవతలు పూజలు చేస్తున్న చప్పుడు వినపడి లోపలకు వెళ్ళి చూస్తే అమ్మవారు పూజలు స్వీకరిస్తున్నది. అమ్మవారు ఆ వ్యక్తి ద్వారా విషయము లోకానికి ప్రకాశింప చేయాలని అనుకున్నది. ఆ విషయము వ్యాపారి వెళ్ళి రాజుగారికి చెప్పాడు. ఆ రాజు పేరు కులశేఖరపాండ్యన్ ఆయన వచ్చి చూస్తే పరాశక్తి వెలిసి ఉన్న ఒక దేవాలయము కనపడింది. రాజుకి బిడ్డలు లేరు. అమ్మవారిని వేడుకుంటే మలయధ్వజపాండ్యన్ అన్న కొడుకు కలిగాడు. ఆతనికి బిడ్డలు కలగలేదు. అమ్మవారి గుడికి వచ్చి నాకు బిడ్డలనివ్వమని ఒక హోమము చేసాడు. అందరు చూస్తుండగా ఆశ్చర్యకరముగా ‘చిదగ్నికుండసంభూత’ హోమకుండములోనుంచి ఆడపిల్ల పైకి వచ్చింది. చిత్రముగా ఆ పిల్లకు మూడుస్తనములు ఉన్నాయి. అశరీరవాణి - ఈ పిల్లను సామాన్యకాంతగా భావించి వరుని తీసుకునివస్తారేమో అని అలా పుట్టింది. భర్త ఎవరో అమ్మాయే వెతుక్కుంటుంది. వరుడు కంటపడిననాడు మూడవస్తనము అదృశ్యమవుతుందని చెప్పింది. ఆ పిల్ల పెరిగి పెద్దయి ఎన్నో విలువిద్యలు నేర్చుకుని పురుషుడు అన్నవాడిని విడచి పెట్టకుండా ఓడించింది. పురుషులకు పురుషుడు కైలాసపతి, పినాకపాణి అయిన పరమేశ్వరుని ఓడిస్తానని కైలాసమునకు వెళ్ళి శివుని యుద్ధానికి పిల్చింది. ఆయన నవ్వుతూ బయటకు రాగానే మూడవ స్తనము మాయమయింది. ఆయనే తన వరుడని కైలాసమునుంచి భూమిమీదకు తీసుకుని వచ్చింది. ఆయనే సుందరేశ్వరుడు. వారికి సుబ్రహ్మణ్యేశ్వరుని అంశలో ఉగ్ర పాండ్యన్ పుట్టాడు. ఇప్పటికీ మధురైలో పరిపాలన అంశ అమ్మవారిదే. తలుచుకున్న ఉత్తరక్షణములో మధుర మీనాక్షి అనగానే చూపులతో కాపాడటానికి మధురైలో వెలిసి ఉంటానని అక్కడ మీనాక్షిగా వెలిసింది. నరకాంత ఎలా ఉంటుందో అలా రెండుచేతులతో ఉంటుంది. అమ్మా! అని పిలిస్తే చాలు అన్నిటినే ఏక కాలములో ఇవ్వకలిగిన తల్లి వెంటనే కోరికలు తీరుస్తుంది.   

అమ్మ కన్నులలోని కారుణ్యము పలుపాయలుగా ప్రవహిస్తుంది. ఎన్నిపాయలైనా తియ్యని నీరు. అమ్మవారి కన్నుల గురించి బాగా వింటే తల్లి కన్నులతో కన్నులు కలిపి చూసి రక్షణ పొందగలుగుతారు. కనుబొమలు, కబరీబంధము చూడటము కష్టము. అమ్మవారి కన్నులు చూడటానికి ఏ బెంగా ఉండదు. యధార్థమునకు ఏ తల్లి కన్నులలో అయినా అమ్మ కన్నులు చూడవచ్చు. నల్లటి, చల్లటికన్నులతో ఆవిడ జగమంతా పోషిస్తున్నది. చంద్రశేఖర పరమాచార్య - ఆ తల్లి కన్నుల గురించి నాలుగు మాటలు మాట్లాడితే ఆమె పొంగిపోయి ఒడిసి పట్టుకుని తన ఒడిలో కూర్చోపెట్టుకుంటుంది అంటారు. అమ్మ కన్నులవంక చూసినట్లయితే ఆమె ఉద్ధరిస్తుంది. అమ్మవారి నయనవైభవము చాలా గొప్పది. 


శంకరాచార్యులవారు అమ్మవారి కళ్ళల్లో నవరసాలు ఉన్నాయని అంటూ అద్భుతమైన శ్లోకము చెప్పారు. 


     శివే శృఙ్గారార్ద్రా తదితరజనే కుత్సనపరా 

     సరోషా గఙ్గాయాం గిరిశచరితే విస్మయవతీ ।

     హరాహిభ్యో భీతా సరసిరుహ సౌభాగ్యజననీ

     సఖీషు స్మేరా తే మయి జనని దృష్టిస్సకరుణా ॥


  కారుణ్యమూర్తి అమ్మ కంటిలో నవరసములను శంకరాచార్యులు వర్ణిస్తారు. పరమశివునికి సంభందించిన విషయాలను తలచుకున్నప్పుడు అమ్మవారి కళ్ళల్లో ‘శృంగారరసము’ తొణికిసలాడుతుంది. ఆవిడ తనకు ఉన్న శృంగారరసము చేత కప్పేసి తెల్లటి అయ్యవారిని ఎర్రటి అయ్యవారుగా మార్చేసింది. శంకరులు అమ్మవారి పాతివ్రత్యము చేత అయ్యవారి మనసుని వశము చేసుకోవడము గురించి చెపుతున్నారు. అమ్మ నవ్వు చూసేప్పటికి శివుడు ఎంతో ఆనందపడతాడు. భార్యముఖము చూస్తే భర్త మనసు ఉల్లాసము పొందాలి. మానసికమైన విశ్రాంతి పొందాలి. వారు ఇద్దరూ ఒకరియందు ఒకరు రమించే హృదయము ఉన్నవారు.   


అమ్మవారి కళ్ళల్లో భీభత్సరసము ఎప్పుడు కనపడుతుంది అనగా మూడు లోకములలోని సర్వప్రాణులూ ‘ఆబ్రహ్మకీటకజననీ’ ఆవిడ పిల్లలే. కానీ ఈ వచ్చిన పిల్లలు అమ్మవారిలోని అమ్మతనము చూడక ఆడతనము చూస్తే అమ్మవారి కళ్ళల్లో ‘భీభత్సరసము’ కనపడుతుంది. ఆరోజున ‘జయజయహే మహిసాసురమర్ధిని రమ్యకపర్ధినిశైలసుతే’ అవుతుంది. 


అమ్మవారు సింహాసనముమీద కూర్చుని ఉండగా సరస్వతీదేవి వచ్చి కూర్చుంటే అమ్మవారు ప్రసాదము తీసుకుని తాంబూలము వేసుకుని సరస్వతీదేవి ఒకపాట పాడమని అంటుంది. సరస్వతీదేవి విపంచి పట్టుకుని పరమశివుని వైభవము స్తోత్త్రము చేస్తూ పాడుతుంది. ఆ పాట వింటూ ఉండగా మా ఆయన కదా ఇంత గొప్పపనులు చేసిందని అయ్యవారి చేసి గొప్పపనులు గురించి వినేసరికి అమ్మకళ్ళల్లో ‘అద్భుతరసము’ కనపడుతుంది. తాంబూలము నములుతున్న నోటితో సన్నగా నవ్వితే తాటంకములు బుగ్గలలో ప్రతిఫలిస్తూ ఉండగా అటూ ఇటూ ఊగుతాయి. శివుని గొప్పతనము వర్ణిస్తూ పాడిన ఆ పాటకి పొంగిపోతూ ‘సెహభాష్’ అంటుంది. సరస్వతీదేవి ఇంత పాట పాడాను కానీ ‘సెహభాష్’ అన్న నీ మాటలో ఉన్న తియ్యదనము ఈ పాటలో లేదు. ఎంత బాగా అన్నావమ్మా అని తన వీణకు గలీబు తొడిగేసుకుంటుంది. శివునియొక్క వైభవమును అంతగా వర్ణిస్తూ ఉంటే తలమీద గంగమ్మ నేనూ భార్యనే కదా అన్నభావముతో తొంగిచూసేసరికి, ఏమే! పరమశివుడు పాణిగ్రహణము చేసి తాళి కట్టినది నాకు. శివుడు నిన్ను భరించాడు అంతే అని గంగమ్మని చూసేసరికి తల్లి కళ్ళల్లో ‘కోపము’ కనపడుతుంది. ఎంత అమ్మవారయినా పాతివ్రత్యము పాతివ్రత్యమే. భర్తను వేరొకరు పంచుకున్నారు అంటే ఆమె కళ్ళల్లో అది కనపడకపోతే ఏదో తేడా ఉన్నట్లు.  


శంకరాచార్యులు ఒక నాటకీయ సన్నివేశమునకు తెర తీసారు. శ్రీమహారాజ్ఞి అయిన అమ్మవారు సభతీర్చి కూర్చుని ఉన్న సమయములో ఈ లోగా అమ్మవారు సింహాసనము మీద కూర్చుని ఉండగా ఒక ప్రతీహారి వచ్చి ‘భవస్యాభ్యుత్థానే’ - (భవుడు అంటే లోకములన్నీ పోషించ కలిగినవాడు) పరమశివుడు సభలోకి విజయం చేస్తున్నాడని చెప్పాడు. అమ్మవారు సింహాసనము మీద నుంచి లేచి గబగబా ఆయనకు ఎదురు వెళ్ళింది. శంకరుడు కనపడినప్పుడు పొంగిపోయి మోకాళ్ళ మీద ఒంగి అయ్యవారి కాళ్ళమీద తన బొట్టు ముద్రపడేట్లుగా నమస్కరిస్తుంది. ఒక కొడుకు దర్శనము చేసినట్లుగా శంకరులు అమ్మవారిని దర్శనము చేసారు. తల్లి వెళ్ళి అయ్యవారి పాదములకు నమస్కారము చేసి శివునితో కలసి వచ్చి సింహాసనము మీద కూర్చుంటుంది. పక్కన భర్త కూర్చుంటే అసలే బుగ్గలు ఎరుపయిన అమ్మవారి బుగ్గలు ‘సిగ్గుతో’ రాగ రంజితములయిపోతాయి. ఎంతో గొప్పవాడని కదా సరస్వతీదేవి గానము చేసింది. మా ఆయన -- అని ఒక్కసారి చెయ్యిపట్టుకుందామని పరమశివుని చెయ్యి పట్టుకోబోయింది. శంకరుని ఆభరణములు అన్నీ పాములే ఆయన తన చేతికి ఒక పిల్లపాముని చుట్టుకున్నాడు. ఆ పాము అమ్మవారి చేతిని చూసి ఇదేదో ఎర్రతామరపువ్వులా ఉందని ఆమె చేతిమీదకి ఎక్కింది. చల్లగా తగిలేసరికి అమ్మో! పాము! అని ఒక్కసారి అమ్మవారి కళ్ళల్లో ‘భయము’ కనపడింది. నిజముగా ఆవిడకు భయము లేదు. సమస్త జీవకోటిలో కుండలినీ స్వరూపములో పాముగా పడుకునేది, లింగాకారములో ఉన్న శివలింగమును చుట్టుకుని పడుకునేది ఆవిడే ఇక్కడ శంకరుల దర్శనము అమ్మా! అప్పుడు నీకళ్ళల్లో ‘భయము’ కనపడింది అన్నారు.    


నీ చెలికత్తెలు అందరితో నువ్వు హాస్య ప్రసంగము చేస్తూ ఉంటావు. వాళ్ళను చుట్టూ కూర్చోపెట్టుకుని సంతోషముగా, ఉల్లాసముగా మాట్లాడుతూ ఉంటావు. అప్పుడు నీకళ్ళల్లో ‘హాస్యరసము’ కనపడింది అన్నారు. 

వీరరసము చెప్పినప్పుడు మహిషాసురుని, భండాసురుని చంపిన కధలు చెప్పరు. అమ్మ దగ్గర చెప్పేప్పుడు మంచి సంతోషముగా, లాలిత్యముగా ఉండాలి. నీ పాదముల దగ్గర పూజచేసిన తెల్లతామరలు ఎర్రగా ఎందుకు కనపడుతున్నాయి అంటే, ఆ తామరపూలు నీవంక చూసి అచ్చు అమ్మవారి కళ్ళు మా కళ్ళలా ఉంటాయని అంటారు అనుకుంటూ చూసినప్పుడు మీకూ, నాకూ పోలికా ? అని వాటివంక ఒకసారి చూసేసరికి అమ్మవారి కళ్ళల్లోని ఎరుపుతనము ఆ తెల్లతామరలకు వెళ్ళి అవి ఎర్రగా అయిపోయాయి. ఈ విధముగా తన చూపులతో గెలిచినప్పుడు నీ కళ్ళల్లో వీరరసము కనపడిందమ్మా! – అన్నారు.  


అమ్మా! నన్ను చూసేప్పటికి నేను నీ పిల్లవాడిని కదమ్మా! నీ కళ్ళలలో ‘కరుణరసము’ కనపడింది. ఈ విధముగా శంకరులు ఎనిమిది రసములను చెప్పారు. ఈ శ్లోకములో తొమ్మిదవరసమును చెప్పలేదు. మరి నవరసాలు కదా అంటే శంకరులు గడుసుతనముతో అసలు అమ్మవారి స్వరూపమే శాంతము అన్నారు. పిల్లలు అందరకి అమ్మ దగ్గరకు వెళ్ళి చేరిపోవడములో ఉన్నతృప్తి ఇంక దేనిలోనూ ఉండదు. అందుకనే వచ్చి అమ్మ ఒళ్ళో పడిపోతారు. అమ్మచేతి ముద్ద తిననివారు దురదృష్టవంతులు. అమ్మ మాట్లాడిన ప్రతిమాటలో తాపత్రయము, పరమేశ్వరుని ఆశీర్వచనము, పెట్టే ప్రతిముద్దలో అమృతము కలసి ఉంటుంది. అమ్మ ఆలోచనలో సర్వకాలములలోనూ బిడ్డడి అభ్యున్నతి కోరుకుంటుంది. తొమ్మిదవరసమైన శాంతరసములో నుంచే అన్నిరసములు వచ్చాయి. ఇన్ని విషయములను దృష్టిలో పెట్టుకుని శంకరులు -- ‘మయి జనని దృష్టిస్సకరుణా’— అమ్మా! జగజ్జననివి కదా! నువ్వు నావంక చూసినప్పుడు ‘కరుణ’ తప్ప ఇంకొకటి ఉండదు అన్నారు. తొమ్మిదవరసము ఎక్కడనుంచి వచ్చింది? ‘శాంతరసము’ లోనుంచి ఈ ఎనిమిది రసములు వచ్చాయి. మళ్ళీ ఈ ఎనిమిదీ శాంతరసములోకి వెళ్ళిపోతాయి. అమ్మవారి కళ్ళల్లో నవరసములనూ ఒలికించి అలా చూడడములో మనసు వెళ్ళి అక్కడ నిలబడితే ఒక్కసారి అమ్మవారిని చూస్తే ఆవిడ పొంగిపోతుంది. మామూలుగా కళ్ళగురించి చెపితే వినరని అమ్మకళ్ళల్లో నవరసములను, పాతివ్రత్యము, అమ్మతనమును, అనుబంధమును పండించి, మనసు లయము అయ్యేట్లుగా చేసి అమ్మ చూపువలన కృతార్థులయ్యేట్లుచేసి ముప్పైరెండుఏళ్ళల్లో ఉద్ధరించుకోవడానికి అంత పరిశ్రమచేసి ఇన్ని స్తోత్త్రములను ఇచ్చిన ఆయన పాదములకు శిరస్సువంచి నమస్కారము చెయ్యడము తప్ప శంకరులకు ఏమిచ్చినా ఋణముతీరదు. అమ్మవారి కన్నులను అన్ని రకములుగా శంకరులు వర్ణిస్తే ఏ ఒక్కరోజైనా ఈ శ్లోకం చదివి అర్థము చేసుకున్నప్పుడు కలిగిన అనుభూతితో తెలియకుండానే ఎవరికైనా అమ్మ కళ్ళు దర్శనమవుతాయి. ఉత్తరక్షణములో మీనాక్షీ అమ్మవారి అనుగ్రహముతో అక్కడితో బ్రతుకు పండిపోయినట్లే.


అమ్మా! నీ దృష్టి గొప్పది. నావంక ఒకసారి చూస్తే నీకు ఏమీ హాని ఉండదు. నువ్వు మీనాక్షివి. ఒకసారి నావంక చూసావంటే జన్మ ధన్యమవుతుంది. అమ్మవారి చూపులతో లోకమును ఎన్ని రకములుగా పోషించకలదో వశిన్యాదిదేవతలు, శంకరులు, మూకశంకరులు, పోతనగారు, వాల్మీకిమహర్షి ఎందరో మహానుభావులు ఆ నామమును అనుసంధానము చేసుకుని జీవితములను తరింప చేసుకున్నారు. 


https://www.facebook.com/ChagantiGuruvuGariFollowersUnofficialPage

విద్యా దదాతి వినయం

 🚩🕉️ *హిందూ ఆధ్యాత్మిక వేదిక*🕉️🚩

                                *****

    *శ్లో:- విద్యా దదాతి వినయం ౹*

           *వినయా ద్యాతి పాత్రతాం ౹*

           *పాత్రత్వా ద్ధన మాప్నోతి ౹*

           *ధనా ద్ధర్మం తత స్సుఖమ్ ౹౹*

                                *****

*భా:- "విద్య" సర్వాభరణము. "విద్య" సర్వధన ప్రధానము."విద్య" మూడవ నేత్రము. "విద్య" నృపాలపూజితము అని వింటుంటాము.అట్టి విద్య వలన వినయము, విధేయత అలవడతాయి. వినయము లేని విద్య విద్యయే కాదు. అవిద్యయే. వినయము వల్ల పాత్రత-అర్హత లభిస్తుంది. ఆ అర్హతతో ఉపాధి, తద్వారా ధనప్రాప్తి కలుగుతుంది. ఆ ధనంతో సంసారంలో ఉత్తమ గృహస్థుగా వివిధ దానాలు చేస్తూ, తక్కిన బ్రహ్మచర్య, వృద్ధ,వానప్రస్థాశ్రమా నుయాయులను విధ్యుక్తకర్మగా సేవిస్తూ, ధర్మాచరణ, ధర్మరక్షణకై పూనుకుంటాడు. ఆ ధర్మమే అతనికి సిరిసంపదలు, భోగభాగ్యాలను ప్రసాదించి ఇహ, పరలోక సుఖాలను అనుభవింపజేస్తుంది. జ్ఞాన ప్రదాయినియై ముక్తికి మార్గం సుగమం చేస్తుంది. దీనికంతటికీ మూలము "విద్య"యే యని సారాంశము. కొద్ది జీవితాన్ని విద్యకు అంకితమిస్తే, అది జీవితాంతం మనకు తోడూనీడగా ఉండి, అమేయసుఖాలు అందించి తరింపజేస్తుంది*. 

                              *****

              

🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲

సామాజిక సూత్రం*

 *


లోకంలో మనుషుల నడవడి విచిత్రంగా ఉంటుంది. తనదైతే ఒకలా, ఇతరుల విషయంలో మరోలా ప్రవర్తిస్తుంటారు. మనిషి ఎప్పుడు ఎలా నడుచుకోవాలో మహాభారతం చెప్పినట్టు మరే గ్రంథం చెప్పలేదేమో! భారతం ధర్మజ్యోతి.

భీష్ముడు అంపశయ్య మీద ఉన్నాడు. కురుక్షేత్ర సంగ్రామంలోని మరణాల వల్ల ధర్మరాజు ఎంతో మనస్తాపం చెందాడు. అతడి మనసులోని కలతను తీర్చడానికి ఎందరో హితవచనాలు పలికినా శాంతి చేకూరలేదు. వాసుదేవుడు అతణ్ని భీష్ముడి దగ్గరకు తీసుకువెళ్లాడు. ధర్మరాజుకు ధర్మోపదేశం చేయమని కోరాడు. భీష్ముడు మహాజ్ఞాని. రాజనీతికి సంబంధించిన సమస్త విషయాలూ బోధించాడు. ధర్మం చాలా సూక్ష్మమైందని అది పలురీతుల్లో గోచరిస్తుందని చెబుతూ భీష్ముడు పరమ ధర్మమేమిటో వివరించాడు.

మహాభారతం శాంతిపర్వంలోని ‘ఒరులేమేమి యొనర్చిన నరవరయప్రియంబు తన మనంబున కగు...’అనే పద్యం ప్రపంచ వాంగ్మయంలోనే గొప్ప సూక్తి. కందుకూరి వీరేశలింగం ‘వివేకవర్ధిని’ పత్రికలో ఈ పద్యాన్ని ముఖతిలకంగా తీర్చిదిద్దారు. అనంతర కాలంలో కాశీనాథుని నాగేశ్వరరావు కూడా ‘ఆంధ్రపత్రిక’లో తమ ఆదర్శవాక్యంగా దీన్ని ప్రచురించేవారు. నాటికీ నేటికీ ఉత్తమ వ్యక్తిత్వానికి మార్గదర్శకమైన ప్రబోధం ఇందులో ఉంది.

ఇతరులు ఏది చేస్తే తన మనసుకు అప్రియం అవుతుందో తాను దాన్ని ఇతరులకు చేయకుండా ఉండటం సకల ధర్మాలకూ కుదురులాంటిది. ధర్మం రెండు విధాలుగా ఉంటుంది. అవి విధి నిషేధాలు- చేయవలసినవి, చేయకూడనివి. జన సామాన్యం కోసం ప్రతిపాదించిన ధర్మం- నిషేధాత్మకమైంది. అంటే- ఏం చేయకూడదో తెలియజేస్తుంది. తననెవరైనా కొట్టినా, గాయపరచినా దేహానికి నొప్పి కలుగుతుంది. అది మనసుకూ బాధ కలిగిస్తుంది. కొన్ని శారీరకమైనవి కావు... మానసికంగా బాధిస్తాయి. నింద, హేళన, చులకన చేసే మాటలు- ఇవన్నీ మనసును గాయపరుస్తాయి. కొన్ని మనసులో నాటుకుపోయి బతికినంతకాలం పీడిస్తూనే ఉంటాయి. అటువంటి పనులు తాను ఇతరులకు చేయ రాదని భారతం హెచ్చరిస్తుంది. అందరిపట్లా సమబుద్ధి కలిగిఉండాలి. లౌకికంగా ఇది చాలా ప్రయోజ నకరం. ఇతరులపై పగ ఉంటే ఎవరూ ప్రశాంతంగా నిద్రపోలేరు. మనసులో పగ ఉంటే పామున్న ఇంట్లో నివసిస్తున్నట్టే అని భారతం చెబుతోంది. ఇతరుల విషయంలో మనం ఏం మాట్లాడాలన్నా, ఏం చేయాలన్నా ఒక్క క్షణం వివేకంతో ఆలోచిస్తే మనం మంచి నిర్ణయం తీసుకోగలుగుతాం. ఎవరినీ బాధపెట్టం. తరవాత మనమూ బాధపడం.

దీన్ని మరోవిధంగానూ అన్వయించుకోవచ్చు. ఇతరులు తనపట్ల చేసిన ఏ పనులు తనకు ఆహ్లాదం కలిగించాయో అటువంటి పనులు తాను ఇతరులకు చేస్తూ ఉండటమే గొప్ప ధర్మం.

భారతంలోనే ఒక కథ ఉంది. సరమ దేవతల శునకం. సారమేయుడు దాని కొడుకు. జనమేజయుడు యజ్ఞం చేస్తుంటే ఆ పరిసరాలకు సారమేయుడు వచ్చి తిరుగాడుతున్నాడు. రాజుగారి తమ్ముళ్లు దాన్ని కొట్టి తరిమేశారు. అది ఏడుస్తూ తల్లితో మొరపెట్టుకుంది. సరమ ముందుగా తన కొడుకును అక్కడేమైనా పాడుపని చేశావా అని అడిగింది. ఏ తప్పూ చేయలేదని నిర్ధారించుకున్నాక రాజు దగ్గరకు వెళ్లింది. పసివాడు ఏ అపవిత్ర కార్యమూ చేయకుండా సంతోషంగా ఆడుకుంటూ తిరుగుతుంటే అతడి తమ్ముళ్లు అకారణంగా కొట్టి బాధించారని- ఇది చేయవచ్చు, ఇది చేయరాదని కొంచెమైనా ఆలోచించక సాధుజీవుల్ని హింసించే దుర్మార్గులకు ఆపదలు ముంచుకొస్తాయని నిందించి వెళ్లిపోయింది. నిష్కారణంగా, అనాలోచితంగా ఎవరికీ హాని కలిగించకూడదని ఇందులోని అంతరార్థం.

(ఈనాడు-అంతర్యామి)

✍🏻డాక్టర్‌ దామెర వేంకట సూర్యారావు

*తెలుగు వెలుగు సమూహంలో చేరాలనుకుంటే క్రింద నంబర్ కు నన్ను చేర్చమని సందేశాన్ని పంపండి మీకు లింక్ పంపడం జరుగుతుంది. 9985831828*

*నారసింహ విజయము*


     

                 శ్రీ ప్రహ్లాద భక్తి    

************************

173శ్లోకము కొనసాగింపు 

**************************

" ఘణఘణాయమాన మణికింకిణీగణ ముఖరిత మేఖలావలయ వలయిత పీతాంబరశోభిత కటిప్రదేశుండును, నిర్జరనిమ్నగావర్తవర్తుల కమలాకరగంభీర నాభివివరుండును, ముష్టిపరిమేయవినుత తనుతరస్నిగ్ద మధ్యుండును, కులాచల సానుభాగ సదృశ కర్కశవిశాల వక్షుండును, దుర్జన దనుజభట ధైర్య లతికా లవిత్రాయమాణ రక్షోరాజ వక్షోభాగ విశంకటక్షేత్ర విలేఖన చంగలాంగలాయమాన ప్రతాప జ్వల జ్వాలాయమాన శరణాగత నయన చకోర చంద్రరేఖాయమాణ వజ్రాయుధ ప్రతిమాన భాసమాన నిశాతనఖరతర ముఖనఖరుండును, శంఖ, చక్ర, గదా, ఖడ్గ, కుంత, తోమర ప్రముఖ నానాయుధమహిత మహోత్తుంగ మహీధరశృంగసన్నిభ వీరసాగరవేలాయమాన మాలికా విరాజమాన నిరర్గళానేకశత భుజార్గళుండును,"


 *భావము* : “ఆ ఉగ్రనరసింహుని ఊరువులు క్షీరసముద్రంలో పుట్టిన ఐరావతం తొండాల లాగా బలిష్ఠంగా బలవత్తరంగా ఉన్నాయి. పీతాంబరం ధరించిన ఆ స్వామి నడుము చుట్టి ఉన్న మణులు పొదిగిన మువ్వల ఒడ్డాణం గణ గణ మని మ్రోగుతోంది. ఆ స్వామి నాభి ఆకాశగంగా నదిలో సుళ్ళు తిరుగుతున్న మడుగులాగా గంభీరంగా ఉంది. ఆ నరసింహుడి నడుము పిడికిలిలో ఇమిడేటంత సన్నంగా ఉండి నిగనిగ మెరుస్తోంది. వక్షస్థ్సలం పెద్ద కొండ చరియ లాగా అతి కఠినంగా, విశాలంగా ఉండి ప్రకాశిస్తోంది. ఆ భీకరాకారుని గోళ్ళు వంకరలు తిరిగి వాడి తేలి, రాక్షససేనల ధైర్యలతలను తెగగోసే కొడవళ్ళలాగా ఉన్నాయి. రాక్షసరాజుల బండబారిన గుండె లనే పొలాలను దున్నే పదునైన నాగళ్ళు ఆ గోళ్ళు. శత్రువుల కళ్ళకి మిరుమిట్లు గొలిపే మంటలు మండుతున్న నెగళ్ళు ఆ గోళ్ళు. అవి గోళ్ళు కావు వజ్రాయుధాలు. అయినా అవి శరణాగతులైన భక్తుల నేత్రాలకు మాత్రం చకోరాలకు చంద్రరేఖలలాగా అందంగా కనిపిస్తాయి. మహోన్నతమైన పర్వత శిఖరాలవంటి ఆ నరసింహ స్వామి మూర్తి బాహువులు శంఖ, చక్ర, గదా, ఖడ్గ, కుంత, తోమరాది వివిధ ఆయుధాలు కలిగి ఉన్నాయి. వందలాదిగా ఉన్న ఆ బాహువులు వీరరసం అనే సముద్రానికి చెలియికట్టలలాగా ఉన్నాయి.”


+++++++++++++++++++++

 *విష్ణుసహస్రం* .... అర్థం, పరమార్థం.

+++++++++++++++++++++

572) సర్వదృగ్య్వాస: - సమస్తమైన జ్ఞానములను వ్యాపింపచేయు వ్యాసుడు.

+++++++++++++++++++++

 *ఈ ఉదయం శ్రీహరి కీర్తన* 

+++++++++++++++++++++

" ఈ సురలు ఈ మునులు 

ఈ చరాచరములు  "

+++++++++++++++++++++

[06/10, 2:43 pm] +91 93913 24915: _*శ్రీ దేవి భాగవతం - 52 వ అధ్యాయము*_




🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️




*స్వయంవరమును గూర్చిన వాదోపవాదములు*




☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️




*వ్యాస సంయమి యిట్లు వాక్రుచ్చెను :*  ఈ విధముగ కేరళాధిపతి వాదింపగా యుధాజిత్తు మరల నిట్లనియెను : ఓ భూపాలా! ఈ రాజ సమాజమునందు సత్యవాది జితేంద్రియుడు అని పేరొందిన నీవు పలుకునది నీతియేనా? యోగ్యులైన నరపతు లిందఱుండగ కన్యారత్నము విషయమున అయోగ్యుడు తగియుండునా? ఇట్టి న్యాయము నీకు రుచించును. మఱి యితరులకు రుచించదు. సింహము పాలి సొమ్ము నక్క యెట్లనుభవించగలదు? రాజులపాలి యీ కన్యారత్నమును సుదర్శను డెట్లనుభవింపగలడు? విప్రులకు వేదము బలము. క్షత్రియులకు చాపము బలము. కాన నిట నేను అన్యాయ మేమి చెప్పుదును? వివాహముందు రాజులకు వీర్యమే శుల్క మగుట ప్రసిద్ధమేగద! బలవంతుడే కన్యను గ్రహింపవలెను. బలహీనుడెప్పుడును గ్రహింపరాదు. కాన నిపుడు కన్యను పణముగ నుంచుటయే నీతి. కాదేని రాజలోకమున పెద్ద కలవరము బయలుదేరును. ఈ విధముగ రాజుల మధ్య వాద వివాదములు చెలరేగగా నృపోత్తముడగు సుబాహు నృపతి సభామధ్యమునకు బిలువబడెను. తత్త్వవిదులగు రాజులెల్లరు సుబాహుని బిలిచి, ఓ రాజా! నీ వీ వివాహమున జక్కని నీతి పాటింపవలయును. నీవు చేయదలచిన కార్యము మాకు సమాహిత మతితో దెలుపుము. నీ మదిలో నీ పుత్రిక నెవ్వని కీయదలంచితివో నిక్కము బలుకుమనిరి. నా కూతురు తన మదిలో సుదర్శనునే పతిగ వరించినది. నేను వలదని యెంత చెప్పినను నా మాట వినుటలేదు. ఇంక నేనేమి చేతును? నా కూతురు మనసు నా వశమందు లేదు. సుదర్శనుడొంటరిగ నిరాకులుడై యేతెంచెను అని సుబాహుడనెను.



అపుడు శిష్టులైన రాజులందఱు సుదర్శనుని రావించిరి. అత డేకాకియై శాంతుడై రాగా వారతని కిట్లు నెమ్మదిగా బలికిరి : మహాభాగా! రాకుమారా! సువ్రతా! నిన్నెవరు పిలువగ నీ రాజుల సమాజమున కొంటరిగ నురుగుదెంచితివి? నీ చెంత సైన్యముగాని సచివులుగాని కోశముగాని మహాబలముగాని లేదే? మరియేల వచ్చితివో యథార్థము తెల్పుము. ఎల్లరాజులును యుద్ధకాములై సేనాసమేతులై కన్యకార్థము వచ్చిరి. నీవొక్కడవిక్కడ వట్టిచేతుల నేమి చేయవచ్చితివి? నీ సోదరుడు మహాసైన్యము వెంటబెట్టుకొని నిన్ను హతమార్చ వచ్చియున్నాడు. అతనికి యుధాజిత్తు సాయము చేయ వచ్చియున్నాడు. నీవున్న నుండుము. పోయిన పొమ్ము. నిజము చెప్పుము. నీవు బలహీనుడవై యున్నావు. కాన నీకు తగినొట్లనరింపుము. *సుదర్శుడిట్లు పలికెను :* ఇపుడు నా చెంత సుహృన్మిత్రులుగాని రాజభటులుగాని కోశముగాని దుర్గబలముగాని సాయమొనర్చువారుగాని ఎవ్వరును లేరు. ఇచట జరుగు స్వయంవరమును చూచు వేడుకతో నేతెంచితిని. కలలో భగవతి యగు శ్రీదేవి చేత ప్రేరితుడనైతిని. ఇందు సందియము లేదు. నా మదిలో మరెట్టి కోరికయు లేదు. అన్నియు నా తల్లియే నాకు జెప్పెను. నా తల్లి పలికిన పలుకు అక్షరాల జరిగి తీరును. నాకీ ప్రపంచమందంతట శత్రు వెవ్వడును లేడు - నాకెల్లెడల నెల్ల ప్రాణులందాభవానియే ప్రత్యక్షముగ గనంబడుచున్నది. నృపులారా! నాతో నెవడైన బగబూనినచో వానిని ఆ మహావిద్య దండించి తీరును. నేనుమాత్ర మెవ్వనితోడను శత్రుత్వము బూనను. ఏది జరుగనున్నదో అది జరిగి తీరును. వేరుగ జరుగదు. నేను దైవాధీనుడను - నాకింత చింత యెక్కడిది?



సురనరాది సకల భూతములందు నిరంతర మా దివ్య చైతన్యశక్తి విరాజిల్లుచుండును. ఆ శక్తి తలంపునకు భిన్నముగ నేదియును జరుగుటకు వీలులేదు. ఆ తల్లి తలచుకొన్నచో నెవ్వనినైన నిఱుపేదనైన రాజుగ చేయగలదు. నాకింక లేనిపోని చింతయేల? ఆ పరాశక్తి - జనని - దయలేనిచో దేవతలును హరిహర బ్రహ్మలు కూడ కదలశక్తులుగారు. ఇక నాకీ చింత యేటికి? నేనశక్తుడనో సుశక్తుడనో యెట్టివాడనో యట్టివాడను. నేనీ స్వయంవరమునకు ఆ జగన్మాతృ నానతి చేత వచ్చితిని. ఆ తల్లి యేది దలచిన నది చేసితీరును. ఇంక నడుమ నాకెందులకు విచారము? ఈ విషయమై శంకింప పనిలేదు. నేను చెప్పినది అంతయును సత్యము. జయాపజయముల విషయమున లేశమైన నాకు లజ్జ గలుగదు. నేనా తల్లి కధీనుడను. నాకేదైన లజ్జ కల్గిన నది ఆమెకే కలుగును. సుదర్శనుని వచనము లాలకించి నరపతు లొండొరుల మొగములు చూచుకొని నిశ్చితమతులై యతని కిట్లనిరి: ఓ సాధూ! నీ పలికినదంతయు నిజమే. అందులో సందేహమేమియు లేదు. కాని యుజ్జయినీపతి నిన్ను చంపుటకు చూచుచున్నాడు. నీ ఆచరణ చూచి నీమీది దయకొలది చెప్పుచున్నాము. నీకేది యుక్తమని తోచునో యది మనస్సులో చక్కగ విచారించి యాచరింపుము.



సుదర్శనుడిట్లనియె : ఓ నృపతులారా ! కృపాళురు సుహృజ్జనులునైన మీరు నిజము పల్కితిరి. నేనింక పలుక వలసినది లేదు. ఐనను చెప్పుచున్నాను. ఒకనిచావు మరొకని వలన నెన్నడు సంభవింపదు. స్థావర జంగమాత్మకమగు నీజగమంతయును దైవాధీనమే. ఈ జీవుడు సంతతమును స్వవశమునుండక కర్మ పరాధీనుడై యుండును. తత్త్వవిదులగు విబుధులు కర్మ ముత్తెఱంగుల నుండు నందురు. అవి సంచితము వర్తమానము ప్రారబ్ధము ననబరగును. ఈ బ్రహ్మాండమంతయును కాలము కర్మము స్వభావము వీనితో నిండి యున్నది. దేవడు గూడ కాలము రాని వానిని చంపజాలడు. కాని సనాతనమైన కాలము నిమిత్త మాత్రమున హతుడైన వానిని చంపివేయును. శత్రునిషూదనుడగు నా తండ్రి సింహము చేత నిహతుడయ్యెను. నా మాతామహుడును యుధాజిత్తు చేత చంపబడెను. కోటి ప్రయత్నములు చేయుచున్న వాడును దైవయోగమున వాయువు మూడిన నాడు చచ్చి తీరును. ఒకడు (నేలపై నూకలున్నవాడు) రక్షణ లేకున్నను దైవేచ్ఛచే వేయేండ్లు జీవింపగలడు. ధర్మిష్ఠులగు నృపులారా! యుధాజిత్తునకు నే నేనాడును భయపడుటలేదు. నేనన్నిటికి ఆ దైవమే పరమమని భావించి నిబ్బరముగ నున్నాను. నేను నిరంతరముగ నిత్య మాపరమ భగవతి మధురనామ సంస్మరణము చేయుచున్నాను. ఆ జగదేకమాత దేవి నాకు తప్పక కళ్యాణము జరుపగలదని దృఢముగ నాశించుచున్నాను. జీవుడు శుభమునుగాని - యశుభమునుగాని తన పూర్వార్జిత కర్మఫలమునే - యనుభవించును. అతడు స్వయంకృతము ననుభవించుచుండును. ఇది యెరిగిన జ్ఞానికి శోకమెట్లు గల్గును? బుద్ధిలేని మూఢుడు తన కర్మఫలానుసారముగ దుఃఖము లనుభవించుచు నల్పబుద్ధియగుటచే నా దుఃఖములకు నిమిత్త కారణమైన పరులతో పగ పెంచుకొనును. నాకు వైరమును శోకమును భయమును లేవు. కనుకనే నేను నిశ్శంకముగ నీ రాజన్యుల నడుమకు రాగలిగితిని. నేనీ యుత్తమ స్వయంవరమును వీక్షించు కాంక్షతో శ్రీ చండికాదేవి యనుమతి బడసి యేతెంచితిని. ఏది జరుగనున్నదో అది జరిగి తీరును. నాకు పరమ భగవతి వచనమే యన్నివిధాల ప్రమాణముగ మదిలో నమ్మియున్నాను. ఇంకెవ్వరిని నమ్ముట లేదు. నా తల్లి నాకు కలుగచేసిన సుఖముగాని దుఃఖముగాని వేఱుగ కాదు. నదియు ఆ యుధాజిత్తునే సుఖము బడయనిండు. నాకు మాత్ర మతని పట్ల ఎట్టి వైరము లేదు. నా యందెవ్వనికైన వైరమున్నచో దాని ఫలము నతడనుభవించి తీరును.



సుదర్శనుని మాటలకు రాజులు సంతసిల్లిరి. అతడును తన యాశ్రమమున కేగి సుఖముండెను. మరునాడు శుభసమయమున రాజులెల్లరును తన సుందర భవనమునకు రావలసినదిగ సుబాహువు ఆహ్వానించెను. రాజులందఱును శుభాలంకారములతోనేతెంచి శుభాసనములతో రచింపబడిన పీఠములపై నాసీనులైరి. వారు దివ్యవేషధారులైన విమానములందలి దేవతలో యన విరాజిల్లుచు స్వయంవరము నవలోకించు వేడుకతో నుండిరి. ఆ రాచకూతు రెప్పుడెప్పుడు వచ్చునో యామె శ్రుతకీర్తి భాగ్యవంతుడునైన యేరాచకుమారుని వరించునో యని యెల్లరును దారితెన్నులు చూచుచుండిరి. ఒకవేళ నామె సుదర్శనునే పూలమాలతో నలంకరించినచో రాజలోకమునందు నిస్సంశయముగ కల్లోలము బయలుదేరును. ఇట్టు లాసనములందున్న నరపతులు తలపోయుచున్నంతలో మంగళవాద్యఘోషములు చెలరేగెను. అంత శుచిస్నాతయై శుభ్ర వసనములును సొమ్ములును దాల్చి మధూక పుష్పమాలిక చేతబూని తన కూతురు రాగా లక్ష్మివలె నొప్పుచు వివాహ యోగ్య లక్షణములు గల్గి సువసనములు దాల్చి చింతలో మునిగిన తన కూతును జూచి నగుచు సుబాహువామె కిట్లనియెను : పుత్త్రీ! లెమ్ము. శుభసుమమాల చేబూనుము. ఈ రాజుల సమూహము బాగగ పరికించి చూడుము. ముందునకు సాగుము. ఇందఱిలో గుణవంతుడును కులీనుడును రూపసంపన్నుడునగు నే రాకుమారుడు నీ చిత్తమునకు నచ్చునో యతనినే వరింపుము. దేశదేశాలనుండి వచ్చిన రాజు లున్నతాసములం దుపవిష్టులై యున్నారు. వారినందఱిని చక్కగ గాంచి నీ కిష్టమైనవానినే వరింపుము.



తన తండ్రి మాటలు విని మితభాషిణియగు నా కన్య ధర్మసమ్మతమైన లలిత వచనము లిట్లు పలికెను : తండ్రీ! కాముకులును సామాన్యులునగు పురుషులను కన్నెత్తియైనను జూడను. తండ్రీ! స్త్రీచే నొక్కరుడే చూడదగినవాడుకాని వేరొకరిని చూడగూడదని ధర్మశాస్త్రమున నేను వింటిని. ఎవ్వతె పెక్కుమందితోడ గూడునో దాని సతీత్వము చెడిపోవును. అట్టి దానిని గని యందఱును నిది నాదిగనైన బాగుగనుండునని లోలోన దలంచుదురు. ఒక స్త్రీ తనచేత పూలమాలగొని యెప్పుడు స్వయంవర మంటపమెక్కెనో యప్పుడామె కులటవలె సర్వ సామాన్యగ తలంపబడును. ఒక వారవనిత వీథికేగి యచట గల నరుల జూచి వారి మంచి చెడ్డలను గూర్చి తనలో భావించుకొనుచుండును. కాముకు ననేక భావములతో వ్యర్థముగ గనుచుండు వారకాంతవలె నేను స్వయంవర మండపమునకు వచ్చి వారకాంతా కృత్యమును చేయవలయునా! పెద్దల చేత నిర్ణీతమైన యిట్టి స్వయంవర ధర్మమును నేను పాటింపజాలను. నేను వ్రతనిష్ఠను పూని ఇపుడు పత్నీవ్రత మాచరింపగలను. ఒక సామాన్యకాంత మండపమున కేతెంచి తన మదిలోన పెక్కురీతుల సంకల్పించుకొని యందొక్కని వరించునట్లు నేనిపుడు పతివ్రతనై యెట్లు చేయగలను? పూర్వము సర్వాత్మ భావముతో నేను సుదర్శనునే వరించితిని. అతనినిగాక యితరుని వరింపజాలను, తండ్రీ! నీవు నా మేలుగోరు దేనియొక శుభముహూర్తమున వివాహ విధిప్రకారముగ నన్ను సుదర్శనునకు కన్యాదాన మొనరింపుము.



*ఇది శ్రీదేవి భాగవతమందలి తృతీయ స్కంధమున ఇరువదవ అధ్యాయము.*

[06/10, 3:31 pm] +91 99660 06009: *తిరుమల తిరుపతి దేవస్థానం, తిరుమల*


1.తిరుమల  పూర్వ నామధేయమేమిటి?                         

Ans.: *వరహాపర్వతం.*


2.   శ్రీవారిఆలయంలో సరుకులు నిల్వ చేసే గిడ్డంగిని ఏమంటారు? 

Ans. : *ఉగ్రాణం.* 


3.    వెండివాకిలి కి ఇంకో పేరేమిటి?

Ans. : *నడిమిపడికావాలి.*


4.     స్వామివారికి అవసరమయ్యే పూలమాలలు తయారయ్యే ప్రదేశాన్ని ఏమంటారు? 

Ans.:  *పరిమళపు అర.* 


5.    సంపంగి ప్రదక్షిణ లో ప్రసాదాలు నిల్వ ఉంచి విక్రయించే ప్రదేశాన్ని ఏమంటారు?

Ans.: *పోటు.* 


6.   వెండి వాకిలి ఉన్న ప్రాకారం ఎత్తు ఎంత?

Ans. : *30 అడుగులు.* 


7.     విమాన ప్రదక్షిణ మార్గానికి ఇంకో పేరు ఏంటి?

Ans.: *అంగప్రదక్షణ.* 


8.    బంగారు వాకిలి ముందున్న మండపాన్ని ఏమంటారు?

Ans: *మహామణిమండపం.* 


9.      బంగారు వాకిలి దాటాక వచ్చేమండపాన్ని ఏమంటారు?

Ans.:  *కొలువు మండపం.*


10.     రాములవారి మేడ దాటాక వచ్చే మండపం ఏమిటి?

Ans. : *శయన మండపం.* 


11.         శ్రీవారి డోలోత్సవం ఎక్కడ జరుగుతుంది?

Ans.: *అద్దాల మండపం.* 


12.         అద్దాల మండపానికి ఇంకో పేరేమిటి? 

Ans.: *డోలా మండపం.*


13.          అద్దాల మండపానికి ఎదురుగా ఉన్న మండపం ఏమిటి?

Ans. : *రంగనాయకుల మండపం.*


14.   తిరుమల రాయ మండపంలో ఉన్న విగ్రహం ఎవరిది?

Ans.: *రాజా తొదరమల్లు.* 


15.    ధ్వజ స్థంబాన్ని అనుకుని ఉన్న పీఠాన్ని ఏమంటారు?

Ans.: *బలి పీఠం.*


16.     శ్రీవారి ఆలయాన్ని శుద్ధిచేసే కార్యక్రమాన్ని ఏమంటారు?

Ans. : *కోయిల్ తిరుమంజనం.*


17.       చక్రస్నానం ఏడాదికి ఎన్నిసార్లు చేయిస్తారు?

Ans. : *4 సార్లు.*


18.      విష్ణు సహస్రనామాల్లో ''శ్రీనివాస'' అని ఎన్ని సార్లు వస్తుంది?

Ans.: *2 సార్లు* 


19.    సుప్రభాతం లో ఎన్ని శ్లోకాలున్నాయి?

Ans. : *29*


20.       ఏడాదిలో ఆలయాన్ని ఎన్నిసార్లు తిరుమంజనం చేస్తారు?

Ans. : *7 సార్లు*

[06/10, 3:38 pm] +91 93913 24915: *పిల్లలు చెడిపోవడానికి అస్సలు కారకులు మొబైల్స్ కాదు మీరే (తల్లిదండ్రులే)...!!!*


పిల్లల్ని గారాబంగా చూసుకోవడం మంచిదే కానీ, అది మరీ *శృతిమించితే మొత్తానికే నష్టం వస్తుంది..* 


పిల్లల పట్ల మనం చూపిస్తున్న అతి ప్రేమనే వారిని చాలా వరకు బద్దకస్తుల్ని చేస్తుంది, ఇది ముమ్మాటికీ నిజం..


వారిని సుకుమారంగా చూసుకోవాలి అనే ప్రీతిలో వారిని సోమరులుగా మారుస్తున్నారు..


ఇప్పుటి తరం పిల్లలు..

(10 సంవత్సరాలు దాటిన వాళ్ళు)


🔥  తల్లిదండ్రుల కారు, బండి తుడవమంటే తుడవరు..

🔥 మంచి నీళ్ళు, పాలు, కిరాణా సరుకుల కోసం బయటికి వెళ్ళమంటే వెళ్లరు..

🔥  లంచ్ బ్యాగ్ లు, స్కూల్ బ్యాగులు శుభ్రం చేసుకోరు..

🔥  కనీసం ఇంటి దగ్గర చిన్న చిన్న పనులలో సహాయం చేయరు...

🔥 రాత్రి 10 గంటల లోపు పడుకుని, ఉదయం ఆరు లేదా ఏడు గంటల లోపు నిద్ర లేవ మంటే లేవరు...

🔥  గట్టిగా మాట్లాడితే ఎదురుతిరగబడి సమాధానం చెబుతారు..

🔥  తిడితే వస్తువులను విసిరి కొడతారు..


ఎప్పుడు అయినా దాచుకోమని డబ్బులు ఇస్తే మనకు తెలియకుండా ఐస్ క్రీమ్ లు, కూల్ డ్రింక్ లు, నూడుల్స్ ప్యాకెట్లు, ఫ్రెండ్స్ కి పార్టీలు, ఫ్రెండ్స్ కోసం గిఫ్ట్ లు కొనుగోలు చేస్తున్నారు..


🔥  ఆడపిల్లలు అయితే తిన్న కంచం కూడా కడగటం లేదు..

🔥  ఇల్లు ఊడ్చమంటే కోపాలు వచ్చేస్తున్నాయి..

🔥  అతిథులు వస్తే కనీసం గ్లాసుడు మంచి ఇవ్వాలన్న ఆలోచన లేని అమ్మాయిలు కూడ ఉన్నారు..

🔥 20 సంవత్సరాలు దాటిన చాలామంది ఆడపిల్లలకు వంట కూడా చేయడం రావటం లేదు..

🔥  బట్టలు పద్ధతిగా ఉండాలి అంటే ఎక్కడలేని కోపం వీరికి..

🔥  కల్చర్, ట్రెండ్, టెక్నాలజీ పేరిట వింతపోకడలు..

 వారిస్తే వెర్రి పనులు..


మనమే పిల్లలచేత అవన్నీ చేయించడం లేదు,

కానీ కారణం మనమే..

ఎందుకంటే *మనకు అహం, పరువు, ప్రతిష్టలు అడ్డొస్తున్నాయి..*

చూసేవాళ్లకు మనం మంచి హోదాలో ఉండాలి, రిచ్ లుక్, స్టేటస్ మెయింటైన్ చేయాలి అని భ్రమలో ఉన్నాం..

గారాభంతో పెరిగిన వారు మధ్యలో మారమంటే మారడం అస్సలు జరగదు..

*వారిని కష్ట పెట్టమని కాదు ఇక్కడ చెప్పేది*.. 

*కష్టం గురించి తెలిసేలా పెంచండి* 

కష్టo, డబ్బు, సమయం, ఆరోగ్యం *విలువ తెలియకపోతే.. వారికి జీవితం విలువ తెలియదు..*


ప్రేమతో, గారాబంగా మనం చేస్తున్న తప్పుల వల్లే.. కొందరు యువత 15 ఏళ్లకే సిగరేట్స్, మందు, బెట్టింగ్, దొంగతనాలు, డ్రగ్స్, రేప్ లు, హత్యలు చేస్తున్నారు..

మరికొంతమంది సోమరిపోతులు లా తయారు అవుతున్నారు..


*అభినయాలు కనపడడం లేదు, అనుకువగా ఉండటం రాదు, సంస్కృతి, సంప్రదాయాలు పట్టించుకోవడం లేదు..*

ఇలాగే ఉంటే కొంత కాలానికి తల్లిదండ్రులను గౌరవించే పద్ధతి కూడా లేకుండా పోయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు..


భార్యకు వంట వండటం సరిగా రాదని నేటి యువత బిర్యానీలు, కర్రీ పాయింట్ ల వెంట పడుతూ చిన్న వయసు లోనే గ్యాస్టిక్ అల్సర్, గాల్ బ్యాడర్ స్టోన్స్ , కిడ్నీ స్టోన్ ల బారిన పడుతున్నారు..


మరొక ఫ్యాషన్ ఏమిటంటే పెరుగు మజ్జిగ తీసుకుంటే వాంతులు చేసుకోవడం..

కొన్ని ఆహార పదార్థాలు ఎంత ఆరోగ్యకరమైన కూడా వాళ్లకు అనవసరం...


కాలేజీ పిల్లలు అయితే సరిగ్గా ఒక పిడికిలి పట్టేంత టిఫెన్, లంచ్ చిన్న బాక్సు రైస్..

చాలామంది ఫ్రూట్స్ అసలు తినరు...


గర్భవతులు అయిన తరువాత వారి బాధలు వర్ణనా తీతం

టోటల్ మెడిసిన్ మీద డిపెండ్ అవడం, 100 లో 90 మంది సిజేరియన్ ద్వారా పిల్లల్ని కంటున్నారు అంటే వారి శారీరక పటుత్వం ఎంత పడిపోయిందో ఆలోచించండి..

అలా ఉంటే పుట్టే పిల్లలు కూడాఏదో ఒక జన్యులోపంతో పుడుతున్నారు..

3వ తరగతి పిల్లాడికి సోదబుడ్డి లాంటి కళ్ళద్దాలు..

5వ తరగతి వారికి అల్సర్, బీపీ లు..

10 వ తరగతి దాటేలోపు ఎన్నో ఆరోగ్య సమస్యలు వచ్చేస్తున్నాయి..


వీటన్నికి కారణం మనం మన పిల్లలను సరైన పద్ధతిలో పెంచకపోవడమే..

అందుకే *తల్లిదండ్రులు మారాలి..*


*రేపటి సమాజానికి ఏమి నేర్పుతున్నాం...?*


ఒక్కసారి ఆలోచన చేయండి...


*సంస్కృతి సాంప్రదాయం అంటే ఏమిటి...?*


కేవలం గుడికి వెళ్లో, చర్చికి వెళ్లో, మసీదుకు వెళ్ళో 

పూజలు, ప్రార్థనలు చేసి మన సంస్కృతి సాంప్రదాయం అని పిల్లలకు అలవాటు చేస్తున్నాము, అది మాత్రమే కాదు సాంప్రదాయం అంటే.. అలా అనుకోవడం కొంత పొరపాటు..


పిల్లలకు..👇


👉  *బాధ్యత* 

👉  *మర్యాద*

👉  *గౌరవం* 

👉  *కష్టం* 

👉  *నష్టం* 

👉  *ఓర్పు*

👉  *సహనం*

👉  *దాతృత్వం*

👉  *ప్రేమ*

👉  *అనురాగం*

👉  *సహాయం*

👉  *సహకారం*

👉  *నాయకత్వం*

👉  *మానసిక ద్రృఢత్వం* 

👉  *కుటుంబ బంధాలు*

👉  *అనుబంధాలు*    

👉  *దైవ భక్తి*

👉  *దేశ భక్తి*


*ఈ భావనలు సంప్రదాయాలు అంటే..*


కొంచెం *కష్టమైనా సరే ఇవి తప్పక చిన్న వయసులోనే పిల్లలకు అలవాటు చేయాలి..* 

ఇవన్ని అలవాటు అయితే ఆరోగ్యం, మానసిక పరిస్థితి, సామాజిక సృహ, *ఉత్తమ జీవన విధానం వారికి అందించిన వారమవుతాం..*


పిల్లలకు ప్రేమ, భయం తో పాటుగా వాళ్ళు అన్ని విషయాలు మనతో పంచుకునే స్నేహపూర్వక వాతావరణం కల్పిద్ధాం...


మనం కూడా మమేకమవుదాం...


*భావి తరాలకు ఒక మానవీయ, విలువలతో కూడిన, సత్సాంప్రదాయ కుటుంబాలను కలిగిన సమాజానికై  బాటలు వేద్దాం.....*


     🙏🏻 *లోకా సమస్తాః సుఖినోభవంతు* 🙏🏻

[06/10, 3:38 pm] +91 93913 24915: *పురుష సూక్త3 వ శ్లో కం




*శ్లోకం..  3/25*


*ఏతావానస్య మహిమా! అతోజ్యాయాగ్ శ్చపూరుషః!!*


*పాదోస్య విశ్వా భూతాని! త్రిపాదస్యామృతం దివి!*


*భావం*


ఇక్కడ కానవస్తున్నదంతా భగవంతుని మహిమే! కానీ ఆ భగవంతుడు, వీటికంటే శ్రేష్టుడు. ఉద్భవమైనవన్నీ ఆయన పావుభాగము మాత్రమే! ఆయన ముప్పాతిక భాగము వినాశము లేని గగనములో ఉంది.  పరమాత్మ మహిమ అపారము! ఈ ప్రపంచములో ఒక్క అంశాన్ని సైతమూ మనము తెలుసుకోలేదు. ఇది పరమాత్మ యొక్క పావుభాగము మాత్రమే అంటూ పరిమాణానికి అందని ఆయన మహిమను ఈ మంత్రము తెలుపుతుంది. వేదకాల ఋషులు ఈ ప్రపంచాన్నే ఒక మహాయజ్ఙంగా చూచినారు.  పుట్టినవన్నీ గిడుతున్నాయి. కానవచ్చేవన్నీ కనుమరుగై పోతున్నాయి. మరణించేవి మరలా పుడుతున్నాయి. కనుమరుగైనవి కొత్తవి కానరావడానికి కారణమవుతున్నాయి. ఈ చక్రభ్రమణము దేన్ని‌ సూచిస్తుంది? మనమీ ప్రపంచములో ఒక భాగము. ఇక్కడ మనం జీవించగోరితే ఇక్కడనుండీ పుచ్చుకొన్నవాటిని తిరిగి ఇచ్చేయ్యాలి. ఆహారము, నీరు, ప్రాణవాయువు మొదలైన వాటిని పరిగ్రహిస్తాము. బొగ్గుపులుసు వాయువు, వ్యర్థపదార్థాలను

తిరిగి ఇచ్చివేస్తున్నాము. తెలివిని పొందుతున్నాము. కొన్నింటిని తిరిగి ఇచ్చేస్తున్నాము. ఇది యజ్ఙ విధి. అందరూ ఈ నియమాన్ని పాటించి తీరాలి. ఈ ప్రపంచ మహాయజ్ఙములో  ఒక చిన్న నమూనాయే అగ్నిలో ఆజ్యము పోసి చేసే యాగాలు. నెయ్యి మొదలైన ఆహుతులను అర్పిస్తాము. వర్షము, స్వర్గపదవి వంటివి ప్రాప్తించుకుంటాము. ఈ భావాన్నే  గీత 3/11 లో చెబుతుంది. ఏమని? మీరు దేవతలను మెప్పించండి. వారు మిమ్ములను సంతోషపెడుతారు. ఈ సృష్టి‌ సైతము ఈ యజ్ఞము వల్లే సంభవించింది. ఈ సూక్తములో రెండు కోవల సృష్టులు చెప్పబడినట్లు సాయనుడు వివరిస్తాడు. మొదటిది పూర్వ సృష్టి; రెండవది ఉత్తర సృష్టి‌. పూర్వ సృష్టిలో పరమాత్మ తనను ప్రపంచంగానూ అనేక ప్రాణులుగానూ సృష్టించుకున్నాడు. ఇది 4, 5 మంత్రాలలో వివరింపబడింది.

[06/10, 3:38 pm] +91 93913 24915: ✍️... రామ నామము ఎంత మధురం



మార్వాడా దేశంలో జానాబాయికి బాల్యం నుండి శ్రీరామనామ సంకీర్తనం చెయ్యడం అలవాటు.


నిరంతర శ్రీరామ సంకీర్తనం వలన ఆమె హృదయం రామనామంతో నిండిపోయింది.


నడుస్తుా,తింటుా, త్రాగుతుా, నిద్రపోతుా ఏపని చేస్తున్నా ఆమె నోటివెంట శ్రీరామ నామం ధ్వనిస్తుానే వుండేది. 


ఆమె గురించి విని దేశాటన చేసే కబీర్ ఆమె వుండే గ్రామం ఆమె దర్శనం చెయ్యాలని వెళ్ళాడు. 


ఆమె ఇంటికి వెళ్ళేటప్పటికి ఆమె పొరుగామెతో పిడకల కోసం తగవులాడుతున్నది.


 అయ్యెా! అంత దుారంనుండి 

ఈ తగవులు మారి కోసం వచ్చానా! అని కొంచెం బాధపడినా, ఆమె దగ్గరకు సమీపించి, అమ్మా! నీవు

 పిడకలకోసమే కదా దెబ్బలాడు తున్నావు! అవి నీవే అని ఎలా చెప్పగలమ్మా. అని అడిగాడుట. 




అంతట జానాబాయి నా పిడక వాయించి చుాడు 'రామ్ రామ్' అంటుంది.  రా! విను! అని జానాబాయి పిడక వాయించింది.

 'రామ్' ' రామ్' అని శబ్దం వచ్చిందట. 


కబీర్ ఆమె రామభక్తికి, దృఢత్వానికి జోహార్లు అర్పించాడు.


ఎంత నిర్మలమైన ..

నిష్కపటమైన భక్తి....🙏🙏


🌸జై శ్రీమన్నారాయణ🌸

[06/10, 4:05 pm] +91 93913 24915: 🕉🌞🌎🌙🌟🚩


*-Swami Vivekananda's wisdom for daily inspiration - Oct 5.*_


*_స్వామి వివేకానంద స్ఫూర్తి... రోజుకో సూక్తి - అక్టోబరు 5._*


*Through concentration of mind everything can be accomplished - even mountains can be crushed atoms. Concentration is the means through which we can gain anything and everything, mental, moral, or spiritual.*


*చిత్రైకాగ్రత ద్వారా సమస్తం సాధించవచ్చు. పర్వతాలను కూడా పరమాణువులుగా పొడి చేయవచ్చు. మానసికంగా, నైతికంగా, ఆధ్యాత్మికంగా ఏమైనా చేయడానికీ, ఏదైనా పొందడానికీ ఏకాగ్రతే మార్గం.*


🕉🌞🌎🌙🌟🚩


*-Inspiring Sayings of Swami Vivekananda / స్వామి వివేకానంద స్ఫూర్తిదాయక వచనాలు.-*


*Every idea that strengthens you must be taken up and every thought that weakens you must be rejected.*


*మిమ్మల్ని బలవంతులుగా చేసే ప్రతీ భావాన్ని స్వీకరించండి. బలహీనపరిచే ప్రతి ఆలోచనను తిరస్కరించండి.*


🕉🌞🌎🌙🌟🚩

[06/10, 4:05 pm] +91 93913 24915: *🌷29-మంద్రగీత🌷*

 🕉🌞🌎🌙🌟🚩


*🥀చక్రభ్రమణము🥀*



*5. పనులు చేయుట మానినచో సమస్య తేలికపడునని భావించితివా? ప్రయత్నించిచూడుము. క్షణము కూడా కర్మాచరణము లేక నిలువలేవు.*



*నీవు చేయుచున్న పనులన్నియు నీ స్వభావము నుంచి వచ్చుచున్నవి గాని చేతులనుండి కాదు. నీ స్వభావమనగా ప్రకృతి. దానినుండి ఎప్పుడూ సత్వ రజో తమో గుణములు పుట్టుచుండును. వానినుండి నీకు గల గుణములు వివిధములుగా ఉత్పన్నమగుచుండును. నీలోని గుణముల ప్రేరేపణచే జరుగుచున్నవే నీవు చేయుచున్న పనులు. అనగా నీ తర్కమునకు, తెలివికి సంబంధించినవి కావు. నీవు చేయు పనులు నీచే చేయబడుచున్నవి గాని నీవు చేయుటలేదు. ప్రకృతి నీచే చేయించుచున్నది గాని నీ ఇచ్ఛతో వానికి సంబంధము లేదు. నీ గుణములను  అనుసరించి ఇచ్ఛ అలవడును గాని ఇచ్ఛను అనుసరించి పనులు జరగవు. ఈ విషయమున ఎంత తెలివి గలవాడైనను అస్వతంత్రుడే.*



*6. స్వభావము ప్రేరేపించుచుండగా, తెలివి, తర్కము దానివెంట వచ్చుచుండగా నీవు పనుల వెంట ప్రేరేపింపబడుచున్నావు. ఇంకా చేయుట, మానుట నీకెట్లు లొంగును? నీవు ఆపగలిగినది భౌతిక శరీరమును మాత్రమే. కర్మేంద్రియములైన కాళ్ళు, చేతులు, మాట, స్త్రీ పురుష వాంఛ, మల మూత్రాది విసర్జనము నీకు లోకువయై ఉన్నవి. వాని ప్రవృత్తులను బంధించితివనుకొనుము. మనస్సు నీ స్వభావముచే ప్రేరేపింపబడి స్మరించుచుండును. ఇట్లు కర్మేంద్రియములను బంధించి ఇంద్రియార్థములను అందనీక వానినే మనస్సుతో స్మరించుచుండుట డంబాచారము అగును గాని సంయమము కాదు. కనుక సంయమము వలన కలుగవలసిన శాంతి కలుగదు.*


 🕉🌞🌎🌙🌟🚩

[06/10, 4:19 pm] +91 99660 06009: *సామాజిక సూత్రం*


లోకంలో మనుషుల నడవడి విచిత్రంగా ఉంటుంది. తనదైతే ఒకలా, ఇతరుల విషయంలో మరోలా ప్రవర్తిస్తుంటారు. మనిషి ఎప్పుడు ఎలా నడుచుకోవాలో మహాభారతం చెప్పినట్టు మరే గ్రంథం చెప్పలేదేమో! భారతం ధర్మజ్యోతి.

భీష్ముడు అంపశయ్య మీద ఉన్నాడు. కురుక్షేత్ర సంగ్రామంలోని మరణాల వల్ల ధర్మరాజు ఎంతో మనస్తాపం చెందాడు. అతడి మనసులోని కలతను తీర్చడానికి ఎందరో హితవచనాలు పలికినా శాంతి చేకూరలేదు. వాసుదేవుడు అతణ్ని భీష్ముడి దగ్గరకు తీసుకువెళ్లాడు. ధర్మరాజుకు ధర్మోపదేశం చేయమని కోరాడు. భీష్ముడు మహాజ్ఞాని. రాజనీతికి సంబంధించిన సమస్త విషయాలూ బోధించాడు. ధర్మం చాలా సూక్ష్మమైందని అది పలురీతుల్లో గోచరిస్తుందని చెబుతూ భీష్ముడు పరమ ధర్మమేమిటో వివరించాడు.

మహాభారతం శాంతిపర్వంలోని ‘ఒరులేమేమి యొనర్చిన నరవరయప్రియంబు తన మనంబున కగు...’అనే పద్యం ప్రపంచ వాంగ్మయంలోనే గొప్ప సూక్తి. కందుకూరి వీరేశలింగం ‘వివేకవర్ధిని’ పత్రికలో ఈ పద్యాన్ని ముఖతిలకంగా తీర్చిదిద్దారు. అనంతర కాలంలో కాశీనాథుని నాగేశ్వరరావు కూడా ‘ఆంధ్రపత్రిక’లో తమ ఆదర్శవాక్యంగా దీన్ని ప్రచురించేవారు. నాటికీ నేటికీ ఉత్తమ వ్యక్తిత్వానికి మార్గదర్శకమైన ప్రబోధం ఇందులో ఉంది.

ఇతరులు ఏది చేస్తే తన మనసుకు అప్రియం అవుతుందో తాను దాన్ని  ఇతరులకు చేయకుండా ఉండటం సకల ధర్మాలకూ కుదురులాంటిది. ధర్మం రెండు విధాలుగా ఉంటుంది. అవి విధి నిషేధాలు- చేయవలసినవి, చేయకూడనివి. జన సామాన్యం కోసం ప్రతిపాదించిన ధర్మం- నిషేధాత్మకమైంది. అంటే- ఏం చేయకూడదో తెలియజేస్తుంది. తననెవరైనా కొట్టినా, గాయపరచినా దేహానికి నొప్పి కలుగుతుంది. అది మనసుకూ బాధ కలిగిస్తుంది. కొన్ని శారీరకమైనవి కావు... మానసికంగా బాధిస్తాయి. నింద, హేళన, చులకన చేసే మాటలు- ఇవన్నీ మనసును గాయపరుస్తాయి. కొన్ని మనసులో నాటుకుపోయి బతికినంతకాలం పీడిస్తూనే ఉంటాయి. అటువంటి పనులు తాను ఇతరులకు చేయ రాదని భారతం హెచ్చరిస్తుంది. అందరిపట్లా సమబుద్ధి కలిగిఉండాలి. లౌకికంగా ఇది చాలా ప్రయోజ నకరం. ఇతరులపై పగ ఉంటే ఎవరూ ప్రశాంతంగా నిద్రపోలేరు. మనసులో పగ ఉంటే పామున్న ఇంట్లో నివసిస్తున్నట్టే అని భారతం చెబుతోంది. ఇతరుల విషయంలో మనం ఏం మాట్లాడాలన్నా, ఏం చేయాలన్నా ఒక్క క్షణం వివేకంతో ఆలోచిస్తే మనం మంచి నిర్ణయం తీసుకోగలుగుతాం. ఎవరినీ బాధపెట్టం. తరవాత మనమూ బాధపడం.

దీన్ని  మరోవిధంగానూ అన్వయించుకోవచ్చు. ఇతరులు తనపట్ల చేసిన ఏ పనులు తనకు ఆహ్లాదం కలిగించాయో అటువంటి పనులు తాను ఇతరులకు చేస్తూ ఉండటమే గొప్ప ధర్మం.

భారతంలోనే ఒక కథ ఉంది. సరమ దేవతల శునకం. సారమేయుడు దాని కొడుకు. జనమేజయుడు యజ్ఞం చేస్తుంటే ఆ పరిసరాలకు సారమేయుడు వచ్చి తిరుగాడుతున్నాడు. రాజుగారి తమ్ముళ్లు దాన్ని కొట్టి తరిమేశారు. అది ఏడుస్తూ తల్లితో మొరపెట్టుకుంది. సరమ ముందుగా తన కొడుకును అక్కడేమైనా పాడుపని చేశావా అని అడిగింది. ఏ తప్పూ చేయలేదని నిర్ధారించుకున్నాక రాజు దగ్గరకు వెళ్లింది. పసివాడు ఏ అపవిత్ర కార్యమూ చేయకుండా సంతోషంగా ఆడుకుంటూ తిరుగుతుంటే అతడి తమ్ముళ్లు అకారణంగా కొట్టి బాధించారని- ఇది చేయవచ్చు, ఇది చేయరాదని కొంచెమైనా ఆలోచించక సాధుజీవుల్ని హింసించే దుర్మార్గులకు ఆపదలు ముంచుకొస్తాయని నిందించి వెళ్లిపోయింది. నిష్కారణంగా, అనాలోచితంగా ఎవరికీ హాని కలిగించకూడదని ఇందులోని అంతరార్థం. 


సమూహంలో చేరాలనుకుంటే క్రింద నంబర్ కు నన్ను చేర్చమని సందేశాన్ని పంపండి మీకు లింక్ పంపడం జరుగుతుంది. 9966006009.

[06/10, 4:24 pm] +91 99660 06009: *శ్రీ*


ఏదైనా రాసేటప్పుడు పేపరుపైన “శ్రీ” కారం రాస్తారెందుకు?

“శ్రీ”  లక్ష్మీ ప్రదమైనది. మంగళకరమైనది మరియు మోక్ష దాయకమైనది. “శ్రీ” కారమున “శవర్ణ”, “రేఫ”, “ఈ” కారములు చేరి, “శ్రీ” అయినది. అందు “శవర్ణ” , “ఈ” కారములకు, “లక్ష్మీ దేవి” ఆధిదేవత, “రేపము” నకు, అగ్ని దేవుడు దేవత.


“శ్రియ మిచ్దేద్దు  తాశనాత్!” అను పురాణ వచనానుసారముగా “అగ్నీ లక్ష్మీ ప్రదుడే, శుభకరుడే. ఈ ఇధంగా “శ్రీ” లోగ మూడు వర్ణములకు శుభదేవతలే కారకులు.


మరియు, “శ” వర్ణమునకు గ్రహము “గురుడు”, “రేఫ “ఈ” కరములకు గ్రహములు “గురుడు”, “శుక్రుడు” గురు, శుక్ర గ్రహములు రెండూ శుభకరులే కావున “శ్రీ” శుభాన్ని సూచిస్తుంది. శుభాన్ని కోరుతుంది.


నిఘంటువులో, “కమలా శ్రీర్హరి ప్రియా” అని ఉండటంతో, లక్ష్మీ నామలలో “శ్రీ” ఒకటి అని తెలియుచున్నది. కావున శుభకరమైంది.


ఇన్ని విధాలుగా “శ్రీ” సర్వశ్రేష్టవాచకమైనది. ప్రతి శుభకార్యానికి, “శ్రీ” కారం తలమానికమై వెలుగొందుచున్నది. “శ్రీ” శుభసూచికయేకాదు, గౌరవప్రదమైనది కూడా.  ఏ ప్రాంతమందైననూ, ఏ భాషయందైననూ, “శ్రీ” అను పదము గౌరవ సూచకముగా, శుభసూచకముగా వాడుతుంటారు.

 సమూహంలో చేరాలనుకుంటే క్రింద నంబర్ కు నన్ను చేర్చమని సందేశాన్ని పంపండి మీకు లింక్ పంపడం జరుగుతుంది. 9966006009

[06/10, 4:46 pm] +91 93913 24915: ఉషఃకాలశ్చ గర్గశ్చ శకునం చ బృహస్పతి:౹

అంగిరాశ్చ మనోత్సాహో విప్రవాక్యం జనార్దనః౹౹


భావం 


గర్గఆచార్యునిప్రకారం ప్రయాణానికి ఉష:కాలం మంచిది , బృహస్పతి మతం ప్రకారం మంచి శకునం చూసుకుని వెళ్ళాలి, అంగిరస్సు మతం ప్రకారం మనసు ఉత్సాహంగా ఉంటే బయలుదేరడమే, జనార్దన మతం ప్రకారం బ్రాహ్మణ వాక్యం అనుకూలంగా ఉంటే వెళ్ళాలి..

[06/10, 5:06 pm] +91 93913 24915: 🌼🌿మన సమస్యలకి సుందరకాండ పరిష్కారాలు.!🌼🌿


సుందరకాండ అద్భుతమైన పారాయణం, 

ఎన్నో సమస్యలకు సుందరకాండ లోని వివిధ సర్గలు పారాయణ చేసి ఎంతో మంది పరిష్కారం పొందారు.. 

ఈ రోజుల్లో అందరికి వివిధ కారణాల వల్ల నిత్యం 

కాండం మొత్తం పారాయణ చేయలేరు, 

అయితే అందులో ఏ సమస్యకు ఏది పరిహారామో వివరంగా ఉంది. 

పారాయణ నియమాలతో ఉంటుంది. 

ఇక్కడ ఇచ్చిన వివరాలు ఒకసారి పరిశీలించండి.


1. ఆపదలు తొలగటానికి , సంపదలు కలగటానికి..

శ్లోకం.ఆపదమపహర్తారం దాతారం సర్వసంపదామ్

 లోకాభిరామం శ్రీరామం, భూయో భూయో నమామ్యహమ్ ||


21 దినములు , 

108 సార్లు , 

శక్తి  కొలది తమలపాకులు, 

అరటిపళ్ళు నివేదన చేయాలి.


2. విద్యాప్రాప్తికి.

ఒకసారి పరిపూర్ణంగా పారాయణ చేయవలెను . 

3 రోజులు ద్రాక్ష , అరటిపళ్ళు నివేదన


3. భూతబాధ  నివారణకు.

3 వ సర్గ వచనము రోజుకు 108 సార్లు 

30 దినములు పారాయణ చేయవలెను . 

1 కొబ్బరికాయ , అరటిపళ్ళు నివేదన.


4. సర్వ కార్య సిద్దికి.

64 వ సర్గ నిష్ఠతో 11 సార్లు 

40 దినములు పారాయణ చేయవలెను .

శక్తి  కొలది అరటిపళ్ళు నివేదన చేయవలెను.


5. శత్రు నాశనముకు.

51 వ సర్గ అతినిష్ఠతో 2 సార్లు 

21 దినములు పారాయణ చేయవలెను. 

శక్తి  కొలది ద్రాక్ష , బెల్లము నివేదన చేయవలెను.


6. వాహనప్రాప్తికి.

8 మరియి 9 వ సర్గలు ఏకాగ్రతతో 3 సార్లు 

27 దినములు పారాయణ చేయవలెను. 

శక్తి  కొలది అరటి ,దానిమ్మ నివేదన చేయవలెను.


7. మనశాంతికి.

11 వ సర్గ నిష్ఠతో 3 సార్లు 

21 దినములు పారాయణ చేయవలెను. 

అరటిపళ్ళు, ఖర్జూరము నివేదన చేయవలెను.


8. స్వగృహం కోరువారికి.

7వ సర్గ ఏకాగ్రతతో 1 సారి  

40 దినములు పారాయణ చేయవలెను.  

అరటిపళ్ళు చక్కెరతో నివేదన చేయవలెను.


9. యోగక్షేమాలకు.

13 వ సర్గ నిష్ఠతో 3 సార్లు 

27 దినములు పారాయణ చేయవలెను. 

శక్తి కొలది అరటి , దానిమ్మ నివేదన చేయవలెను.


10. ఉద్యోగప్రాప్తికి.

63 వ సర్గ నిష్ఠతో 5 సార్లు 

21 దినములు పారాయణ చేయవలెను . 

శక్తి కొలది అరటి ,దానిమ్మ నివేదన చేయవలెను.


11. రోగ నివారణకు.

34వ సర్గ ఏకాగ్రతతో 5 సార్లు ప్రతిదినము ,   

21 దినములు పఠించవలెను. 

శక్తి  కొలది బెల్లపు ముక్క అరటిపళ్ళు నివేదన చేయవలెను.


12. దుఃఖనివృత్తికి.

67 వ సర్గ నిష్ఠతో ప్రయత్నం మానకుండా 3 సార్లు 

21 దినములు పారాయణ చేయవలెను. 

శక్తి కొలది అరటిపళ్ళు,ఖర్జూరము నివేదన చేయవలెను.


13. దుస్వప్న నాశనానికి.

27వ సర్గ ఏకాగ్రతతో 1 సారి ప్రతిదినము పఠించవలెను . శక్తి కొలది అరటిపళ్ళు, ఖర్జూరము నివేదన చేయవలెను.


14. దూరముగా ఉన్న ఆప్తులు క్షేమమునకు.

33 నుండి 40 వ సర్గ వరకు 1 సారి , 

21 దినములు నిష్ఠతో పఠించవలెను . 

శక్తి కొలది అరటిపళ్ళు, ఖర్జూరము నివేదన చేయవలెను.


15. ధనప్రాప్తికి.

15వ సర్గ ఏకాగ్రతతో 1 సారి  

40 దినములు పఠించవలెను.

అరటిపళ్ళు, పటిక బెల్లం , మరియు  

రామాయణం లో అయోధ్యకాండలో యాత్రాదానము 

32 వ సర్గ 1 సారి , 

40 దినములు పఠించవలెను. 

శక్తి  కొలది అరటిపళ్ళు, ద్రాక్షనివేదన చేయవలెను . ( అగస్త్య , పరాశర , ఉమా సంహిత ప్రకారం చెప్పబడినది ).


16. దైవాపచారా ప్రాయశ్చిత్తం.

38 వ సర్గ ఏకాగ్రతతో 3 సార్లు 

27 దినములు పఠించవలెను. 

శక్తి కొలది అరటిపళ్ళు వీలైతే పనస నివేదన చేయవలెను.


17. బ్రహ్మజ్ఞానము కలుగుటకు.

19 వ సర్గ అతినిష్ఠతో రోజుకు ఒకసారి 

1 సంవత్సరము పఠించవలెను. 

శక్తి  కొలది అరటిపళ్ళు నివేదన చేయవలెను.


18. ఏలిననాటి శనీ దోష పరిహారమునకు.

సకల రోగ నివృత్తికి - సర్వ పాప నివృత్తికి

మొత్తం సుందరకాండ నిష్ఠతో 9 దినాలలో 1సారి 

68 రోజులు చదువవలెను. 

నివేదన రోజూ కొబ్బరికాయ సత్ఫాలితమునిచ్చును.


19. కన్యా వివాహమునకు.

9 దినములలో ఒకసారి పూర్తిగా 

68 దినాలలో పఠించవలెను. 

సీతారామ కళ్యాణం నిష్ఠతో 7 సార్లు 

ప్రతిరోజు పఠించవలెను.  

అప్పాలు , పాలు , పంచదార నివేదన చేయవలెను.


20. విదేశీ యానమునకు.

1 వ సర్గ ఏకాగ్రతతో రోజుకు 5  సార్లు 

30 దినములు పఠించవలెను. 

శక్తి కొలది అరటిపళ్ళు, ఖర్జూరము నివేదన చేయవలెను.


21. ధననష్ట నివృత్తికి.

55వ సర్గ నిష్ఠతో 3  సార్లు 

30 దినములు పఠించవలెను . 

శక్తి  కొలది అరటిపళ్ళు,పనస నివేదన చేయవలెను.


22. వ్యాజ్యములో విజయమునకు.

42 సర్గ అతి ఏకాగ్రతతో 3 సార్లు , 

21 దినములు పఠించవలెను. 

శక్తి  కొలది అరటిపళ్ళు, ద్రాక్ష , దానిమ్మ నివేదన చేయవలెను.


23. వ్యాపారాభివృద్ధికి.

15వ సర్గ నిష్ఠతో నియమంతో 5 సార్లు 

21 దినములు పఠించవలెను. 

శక్తి  కొలది అరటిపళ్ళు నివేదన చేయవలెను.


24. పుత్ర సంతానానికి.

ప్రతిదినం 7 వ సర్గ నిష్ఠతో 

68 రోజులు పారాయణ చేయవలెను . 

శక్తి  కొలది అరటిపళ్ళు , కొబ్బరికాయ ,నివేదన చేయవలెను. 

శక్తి  కొలది తమలపాకులతో అర్చన చేయవలెను . సుందరకాండ 16 రోజులు పారాయణ చేయవచ్చును.


25. ఋణ విముక్తికి.

28 వ సర్గ చాలా నిష్ఠగా రోజుకి 1 సారి 

41 రోజులు పఠించవలెను. 

శక్తి  కొలది అరటిపళ్ళు నివేదన చేయవలెను.


🌼🌿శ్రీరామ జయరామ జయ జయరామ..🌼🌿

[06/10, 5:06 pm] +91 93913 24915: అహంకార స్వరూపాన్ని గుర్తించడమే చాలా కష్టం.. మానం మాట్లాడే నాలుగు మాట ల్లో అప్రయత్నం గా అహంకారం ధ్వనిస్తుంది..


               మన లోని అహంకారాన్ని గుర్తించడం చాలా కష్టం.. మనల్ని మనం  పరిచయం చేసుకోవడం లొనే అహంకారం బయట పడుతుంది. 


        .మన ఆస్తిత్వానికి గుర్తులు మనమే చెబుతాము. పదవి డబ్బు చదువు లేదా కళల్లో ప్రవేశం ద్వారా పరిచయం చేసుకుంటాము.. 


        ఇలా పరిచయం చేసుకోవడం తప్పు కాదు. కానీ ఆ భావ ప్రకటన కోసం మనం ఉపయోగించే పదాల్లో అహంకారం బయట పడుతుంది. మన కంటే పెద్దలు ఎంతో వినయంగా నమ్రతగా గౌరవంగా స్నేహం గా మాట్లాడినా 

చాలా మంది లో వినయం సౌజన్యం లోపిస్తున్నది..


            .స్నేహం కోరి  వచ్చిన వాళ్ళని తృణీకరిస్తూ మాట్లాడటం ఇప్పటి సంప్రదాయం అయిపోయింది.

ఒకప్పుడు పెద్దలతో ఎలా మాట్లాడాలో నేర్పించేవారు...కనీసం ఇప్పుడు 

పలకరించిన వారికి నమస్కారం పెట్టడం కూడా అరుదు..

        

         రామాయణం లో ఆంజనేయ స్వామి సుందరకాండ లో 

చంప దగిన శత్రువే అయినప్పటికీ రావణాసురిడితో ఎంతో వినయంగా 

గౌరవంగా పలుకుతాడు...అతడిని చూసి ఇలా అనుకుంటాడు.

     

     అహో రూప మహో ధైర్య మహో సత్త్వ మహో ద్యుతిః

       అహో రాక్షస రాజస్య సర్వ లక్షణ యుక్తతా !!

       

        వాల్మీకి  రామాయణం సుందరకాండ 49 వ సర్గ 17 వ శ్లోకం


        ఆహా ఏమి ఈ రావణాసురుడి రూపం !ఏమి ఇతడి ధైర్యం !! ఏమి ఇతడి బలం ! ఏమి కాంతి ! ఏమి సర్వ లక్షణ సంపన్నత్వం.! 

        

       రావణాసురుడి ని చూసి హనుమ అనుకున్న మాటలివి.

శత్రువు లో కూడా ఉన్నా సద్గుణాలని ఆయన చూడగలిగాడు 

స్నేహం కోరి వచ్చిన వారితో తృణీకరించి మాట్లాడటం చాలామంది లో 

కనిపిస్తున్నది. 

     

      హనుమ తనని తాను పరిచయం చేసుకోవడం చాలా అద్భుతం గా 

ఉంటుంది... ఎక్కడ తన గురించి చెప్పుకొడు. 


       "  రావణాసురుడు హనుమ ని చూసి.  ఆశ్చర్య పోతూ ఇలా అన్నాడు..


       . నీవు.  మహానుభావుడి లా కనిపిస్తున్నావు బ్రహ్మ తేజస్సు తో ఉన్నావు..ఏ దేవత పంపాడు "

అంటే ,


        " నేను కేవలం వానరుడను.యుద్ధం కూడా ఆత్మ రక్షణ కోసమే చేశాను.

  

     అస్త్ర పాసైర్ణ శక్యో అహం బద్ధుమ్ దేవాసు రేరేపి 

      పితా మహాదేవ వరో మమస్యేషో అభ్యుపాగతః 

                 సుందరకాండ 50 వ సర్గ 16 వ శ్లోకం.


     "దేవతలు అసురులు కూడా నన్ను అస్త్ర పాశాలతో బంధించలేరు.

నీకు ఏవో వరాలు లభించినట్లే నాకు కూడా ఈ వారలు బ్రహ్మ దేవుని నుండి లభించాయి.."

 

               ఇదీ హనుమ వినయం..తన శక్తి ని తానూ చెప్పుకోలేదు.

సూచించాడు. శత్రువుల వద్ద కూడా వినయం నమ్రత పాటించాడు...

శ్రీ రామ చంద్రుడి దూత ని , సుగ్రీవుడి మంత్రిని అని మాత్రం చెప్పుకున్నాడు.  అహంకారం అనుమాత్రం లేదు...


     ఒక సారి. మన మాటలని. మనం పరిశీలించుకోవడం చాలా. అవసరం

..   

    శ్రీ సీత హనుమత్సమెత రామచంద్ర. కరుణా కటాక్ష ప్రాప్తిరస్తు..

శివానందలహరి 17_ వ శ్లోకం

 దశిక రాము



" జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ"


అవతారిక:

తనకు ఈశ్వర సాక్షాత్కారం అయిన అప్పటికీ , ఈశ్వర పాద దర్శనం 

జరగడం కష్టంగా ఉందని శంకరులు ఈ శ్లోకంలో చెప్పారు..


శ్లోకం 17


**ఫలద్వా పుణ్యానాం** 


**మయి కరుణ యా వా త్వయి విభో **

                         

**ప్రసన్నేపి స్వామిన్** 


**భవదమల పాదాబ్జ యుగళమ్**

                         

**కథం పశ్యేయం? మాం**


**స్థగయతి నమస్సంభ్రమజుషాం**

                         **నిలింపానాం శ్రేణిర్నిజ కనక మాణిక్య మకుటైః !!**


పదవిభాగం :

ఫలాత్ _ వా _ పుణ్యానాం _ మయి _ కరుణయా _ వా _ త్వయి

విభో _ ప్రసన్నో _ అపి _ స్వామిన్ _ భవదమలపాదాబ్జయుగళమ్

_ కథం _ పశ్యేయం _ మాం _ స్థగయతి _ నమసంభ్రమజుషాం _ 

నిలింపానాం _ శ్రేణిః _ నిజకనక మాణిక్య మకుటైః.


తాత్పర్యం : 

ప్రభూ, స్వామీ ! నేను చేసిన పుణ్య ఫలములవల్ల కానీ, నీకు నాయందు

కల దయవల్ల కానీ, నీవు నాయందు అనుగ్రహము కలవాడవైనా , నీ పవిత్ర

పాదపద్మ యుగళమును నేను ఎలా ౘూడగలను? నీకు నమస్కరింౘడానికై

తొందర పడుతున్న దేవతలు రత్నములు పొదిగిన స్వర్ణమయములైన తమ

కిరీటములను మీ పాదములయందు మోపి , నాకు అడ్డుపడుతున్నారు.

(దేవతలు గుంపులు గుంపులుగా వచ్చి, ఎప్పుడూ నీ పాదములపై తమ స్వర్ణ 

రత్న కిరీటములు మోపి , సాష్టాంగ నమస్కారాలు చేయడానికి తొందరపడుతూ ఉంటారు. ఆ కిరీటములు నా దృష్టులను అడ్డగింౘ డంవల్ల, నేను నీ పాద పద్మాలను ౘూడలేక పోతున్నాను.


వివరణ :

శంకరభగవత్పాదులు, ఈశ్వరునికి ఇలా నివేదింౘుకుంటున్నారు. 

" స్వామీ, మహాదేవా ! నన్ను లాలనతో నాయనా ! రా , నా పాదాలు

దర్శింౘుకో " అని నీవు నా కనుల ముందు ప్రత్యక్షమయ్యావు. నీ 

ప్రసన్నతకు కారణం నేను పూర్వ జన్మలలో చేసిన పుణ్యఫలం కావచ్చు.

ఆమాట మాత్రం నేను గట్టిగా అనలేను. ఎందుకంటే ఆమాట నాలో

అహంకారమును మేల్కొలుపుతుంది. దేవతల గుంపు ప్రక్కకు తప్పుకుంటే

గానీ నీ పాద దర్శనం నాకు లభింౘదు. నీ పాద దర్శనం అయితేగానీ నేను 

ధన్యుణ్ణి కాజాలను అని శంకరులు ఈశ్వరునికి విన్నవించారు.


పాదాలనే ఎందుకు ౘూడాలి ? అంటే భగవంతుని పాదాలు, ధర్మాచరణం

కోసం చరించేవి. అంతేకాదు. భగవత్పాదాలు మనకు అభయమునిచ్చేవి.

అంతేకాక ,వాంఛాధిక ఫలములను అందించేవి.


సౌందర్య లహరి లో శంకరులు అమ్మవారి పాదాలు, అభయాన్ని ఇచ్చి 

కోరినకోరికను మించిన ఫలాన్ని ఇస్తాయని ఇలా చెప్పారు.


              " భయాత్త్రాతుం ధాతుం ఫలమపి చ వాంఛాసమధికం

                  శరణ్యే లోకానాం తవ హి చరణావేవ నిపుణౌ "


🙏🙏🙏


ధర్మము - సంస్కృతి

**మూకపంచశతి**

 **దశిక రాము**


*జయ జయ జగదంబ శివే*

*జయ జయ కామాక్షి జయ జయాద్రిసుతే|*

*జయ జయ మహేశదయితే* 

*జయ జయ చిద్గగన కౌముదీధారే||*


🏵️ శ్రీ గురుభ్యోనమః🙏🙏🙏




**ఆర్యాశతకము**


🌹17.

శ్లోకం


**మధురస్మితేన రమతే**


**మాంసలకుచభారమన్ద గమనేన౹**


**మధ్యేకాఞ్చి మనోమే**


**మనసిజ సామ్రాజ్య గర్వబీజేన౹౹**



🌺భావం:


మన్మథుని సామ్రాజ్య గర్వమునకు మూలకారణమైన కామాక్షీదేవి , పరిపూర్ణవక్షస్థలభారము వలన మందగమనము గలదై,మధురమైనచిరునవ్వుతో కాంచీక్షేత్రమధ్యమమున కొలువై యున్నది. ఆచిదానంద స్వరూపిణి ని నా మనస్సునందు నిలుపుకొని ఆనందించుచున్నాను.


💮ధ్యాన మగ్నుడైన శంకరుని విచలితుని చేయబోయి ,ముక్కంటి ఆగ్రహానికి గురై బూడిద అయిన మన్మథుడు అమ్మవారి కటాక్షము తో తిరిగి జీవము ను పొంది మరల తనసామ్రాజ్యమును పునరుద్ధరణ చేసుకొనెను. సకలజీవ పోషణాభారము వహించు ఆ జగజ్జనని మధురహాసముతో కంచియందు కొలువై భక్తుల పాలించుచున్నది.

జీవప్రదాత,జీవనప్రదాత కూడా ఆ తల్లియే గదా! 🙏



🔱 అమ్మ పాదపద్మములకు నమస్కరిస్తూ. 🔱


   🌹 లోకాస్సమస్తా స్సుఖినోభవంతు 🌹


సశేషం....

చిదానందరూప వేంకటేశ్వరా

 చిదానందరూప వేంకటేశ్వరా

కావుమయ్య మమ్ము జగదీశ్వరా ||


1) చెంతజేరి నీతో మాటలాడితే 

   పంతము జేసేవు సంకటాహరణ 

   వాదులేలనయ్య ఓ శ్రీపతే 

   జాగుసేయక బ్రోవరావదేల || 


2) తిరువీధుల నడయాడగా

   భక్తి భావముతో పులకరించితీని 

   ఫుష్కరిణియందు స్నానమోనరించి

   ధన్యతజెందితి నిన్నుగాంచినంత || రాగం : సరస్వతి

సుందరకాండ

 మన సమస్యలకి సుందరకాండ అతిశక్తివంతమైన తాంత్రిక పరిష్కారాలు...........!!


సుందరకాండ అద్భుతమైన పారాయణం, ఎన్నో సమస్యలకు సుందరకాండ లోని వివిధ సర్గలు పారాయణ చేసి ఎంతో మంది పరిష్కారం పొందారు.. 

ఈ రోజుల్లో అందరికి వివిధ కారణాల వల్ల నిత్యం కాండం మొత్తం పారాయణ చేయలేరు, అయితే అందులో ఏ సమస్యకు ఏది పరిహారమో వివరంగా ఉంది. పారాయణ నియమాలతో ఉంటుంది. 

ఇక్కడ ఇచ్చిన వివరాలు ఒకసారి పరిశీలించండి.


 1. ఆపదలు తొలగటానికి , సంపదలు కలగటానికి

-----------------------------------

శ్లోకం : ఆపదమపహర్తారం దాతారం సర్వసంపదామ్

 లోకాభిరామం శ్రీరామం, భూయో భూయో నమామ్యహమ్ ||


21 దినములు , 108 సార్లు , శక్తి కొలది తమలపాకులు, అరటిపళ్ళు నివేదన చేయాలి.


 2. విద్యాప్రాప్తికి

----------------------

ఒకసారి పరిపూర్ణంగా సుందరకాండ మొత్తం పారాయణ చేయవలెను . 

మొదటి 3 రోజులు ద్రాక్ష , అరటిపళ్ళు నివేదన


 3. భూతబాధ నివారణకు

--------------------------------

3 వ సర్గ వచనము రోజుకు 108 సార్లు 30 దినములు పారాయణ చేయవలెను .

1 కొబ్బరికాయ , అరటిపళ్ళు నివేదన


4. సర్వ కార్య సిద్దికి

------------------------

64 వ సర్గ నిష్ఠతో 11 సార్లు 40 దినములు పారాయణ చేయవలెను .శక్తి కొలది అరటిపళ్ళు నివేదన చేయవలెను


5. శత్రు నాశనముకు

--------------------------

51 వ సర్గ అతినిష్ఠతో రోజుకు 2 సార్లు 21 దినములు పారాయణ చేయవలెను. శక్తి కొలది ద్రాక్ష , బెల్లము నివేదన చేయవలెను .


6. వాహనప్రాప్తికి

---------------------

8 మరియు 9 వ సర్గలు ఏకాగ్రతతో రోజుకు 3 సార్లు 27 దినములు పారాయణ చేయవలెను. శక్తి కొలది అరటి , దానిమ్మ నివేదన చేయవలెను .


7. మనః శాంతికి

--------------------

11 వ సర్గ నిష్ఠతో 3 సార్లు 21 దినములు పారాయణ చేయవలెను. అరటిపళ్ళు, ఖర్జూరము నివేదన చేయవలెను .


8. స్వగృహం కోరువారికి

------------------------------

7వ సర్గ ఏకాగ్రతతో 1 సారి 40 దినములు పారాయణ చేయవలెను. అరటిపళ్ళు చక్కెరతో నివేదన చేయవలెను .


9. యోగక్షేమాలకు

------------------------

13 వ సర్గ నిష్ఠతో 3 సార్లు 27 దినములు పారాయణ చేయవలెను. శక్తి కొలది అరటి , దానిమ్మ నివేదన చేయవలెను.


10. ఉద్యోగప్రాప్తికి

-----------------------

63 వ సర్గ నిష్ఠతో 5 సార్లు 21 దినములు పారాయణ చేయవలెను . శక్తి కొలది అరటి , దానిమ్మ నివేదన చేయవలెను .


11. రోగ నివారణకు

------------------------

34వ సర్గ ఏకాగ్రతతో 5 సార్లు ప్రతిదినము , 21 దినములు పఠించవలెను. శక్తి కొలది బెల్లపు ముక్క అరటిపళ్ళు నివేదన చేయవలెను .


12. దుఃఖనివృత్తికి

-------------------------

67 వ సర్గ నిష్ఠతో ప్రయత్నం మానకుండా 3 సార్లు 21 దినములు పారాయణ చేయవలెను. శక్తి కొలది అరటిపళ్ళు, ఖర్జూరము నివేదన చేయవలెను


13. దుస్వప్న నాశనానికి

---------------------------------

27వ సర్గ ఏకాగ్రతతో 1 సార్లు ప్రతిదినము పఠించవలెను . శక్తి కొలది అరటిపళ్ళు, ఖర్జూరము నివేదన చేయవలెను .


14. దూరముగా ఉన్న ఆప్తులు క్షేమమునకు

------------------------------------

33 నుండి 40 వ సర్గ వరకు 1 సారి , 21 దినములు నిష్ఠతో పఠించవలెను . శక్తి కొలది అరటిపళ్ళు, ఖర్జూరము నివేదన చేయవలెను .


15. ధనప్రాప్తికి

-------------------

15వ సర్గ ఏకాగ్రతతో 1 సారి 40 దినములు పఠించవలెను.*

*అరటిపళ్ళు, పటిక బెల్లం , మరియు రామాయణం లో అయోధ్యకాండలో యాత్రాదానము 32 వ సర్గ 1 సారి , 40 దినములు పఠించవలెను. శక్తి కొలది అరటిపళ్ళు, ద్రాక్షనివేదన చేయవలెను . ( అగస్త్య , పరాశర , ఉమా సంహిత ప్రకారం చెప్పబడినది ).


16. దైవాపచార ప్రాయశ్చిత్తం

------------------------------------

38 వ సర్గ ఏకాగ్రతతో 3 సార్లు 27 దినములు పఠించవలెను. శక్తి కొలది అరటిపళ్ళు వీలైతే పనస నివేదన చేయవలెను .


17. బ్రహ్మజ్ఞానము కలుగుటకు

------------------------------------

19 వ అతినిష్ఠతో రోజుకు ఒకసారి 1 సంవత్సరము పఠించవలెను. శక్తి కొలది అరటిపళ్ళు నివేదన చేయవలెను.


18. ఏలినాటి శనీ దోష పరిహారమునకు

సకల రోగ నివృత్తికి - సర్వ పాప నివృత్తికి

------------------------------------

మొత్తం సుందరకాండ నిష్ఠతో 9 దినాలలో 1సారి 68 రోజులు చదువవలెను. నివేదన రోజూ కొబ్బరికాయ సమర్పించాలి సత్ఫాలితమునిచ్చును .


19. అవివాహితులైన కన్యలకు వివాహము జరుగుటకు

--------------------------------

9 దినములలో ఒకసారి లెక్కన పూర్తిగా 68 దినాలలో పఠించవలెను. సీతారామ కళ్యాణం నిష్ఠతో 7 సార్లు ప్రతిరోజు పఠించవలెను. అప్పాలు , పాలు , పంచదార నివేదన చేయవలెను .


20. విదేశీ యానమునకు

-----------------------------

1 వ సర్గ ఏకాగ్రతతో రోజుకు 5 సార్లు 30 దినములు పఠించవలెను. శక్తి కొలది అరటిపళ్ళు, ఖర్జూరము నివేదన చేయవలెను .


21. ధననష్ట నివృత్తికి

----------------------------

55వ సర్గ నిష్ఠతో 3 సార్లు 30 దినములు పఠించవలెను . శక్తి కొలది అరటిపళ్ళు, పనస నివేదన చేయవలెను.


22. వ్యాజ్యములో విజయమునకు

-----------------------------------

42 సర్గ అతి ఏకాగ్రతతో 3 

సార్లు , 21 దినములు పఠించవలెను. శక్తి కొలది అరటిపళ్ళు, ద్రాక్ష , దానిమ్మ నివేదన చేయవలెను .


23. వ్యాపారాభివృద్ధికి

---------------------------

15వ సర్గ నిష్ఠతో నియమంతో 5 సార్లు 21 దినములు పఠించవలెను. శక్తి కొలది అరటిపళ్ళు నివేదన చేయవలెను .


24. పుత్ర సంతానానికి

---------------------------

ప్రతిదినం 7 వ సర్గ నిష్ఠతో 68 రోజులు పారాయణ చేయవలెను . శక్తి కొలది అరటిపళ్ళు , కొబ్బరికాయ , నివేదన చేయవలెను. శక్తి కొలది తమలపాకులతో అర్చన చేయవలెను . సుందరకాండ 16 రోజులు పారాయణ చేయవచ్చును .


 25. ఋణ విముక్తికి

--------------------------

28 వ సర్గ చాలా నిష్ఠగా , రోజుకి 1 సారి 41 రోజులు పఠించవలెను. శక్తి కొలది అరటిపళ్ళు నివేదన చేయవలెను .


సేకరణ:అచ్యుతపద శరణాగత శ్రీనివాస్ చిలుకమారి

. స్త్రీ కోరిక

హర్షవర్ధనుడనే రాజు యుద్ధంలో ఓడిపోయాడు. అతనిని చేతులకు బేడీలతో గెలిచిన రాజు వద్దకు తీసుకునివెళ్ళారు, ఆ సమయంలో గెలిచిన రాజు సంతోషకరమైన మానసిక స్థితిలో ఉన్నాడు.


 రాజు హర్షవర్ధనుని ముందు ఒక ప్రతిపాదనను ఉంచాడు "ఆ ప్రతిపాదన ఏమిటంటే "మీరు నాకు ఒక ప్రశ్నకు సరిగ్గా సమాధానం ఇవ్వగలిగితే నేను మీ రాజ్యాన్ని మీకు తిరిగి ఇస్తాను, ఒకవేళ ఇవ్వలేకపోతే రాజ్యాన్ని ఇవ్వడం కాదుకదా శిక్ష కూడా అనుభవించాలి"మరియు మీరు నా దేశంలో మీ జీవితాంతం ఖైదీగా ఉండవలసి ఉంటుంది అని అన్నాడు".


 “ప్రశ్న ఏమిటంటే, 


'ఒక స్త్రీ పురుషుని నుండి ఏమి కోరుకుంటుంది..?' 

 సమాధానం ఇవ్వడానికి మీకు ఒక నెల సమయం లభిస్తుంది. ”అని అనగా...


 రాజు ప్రతిపాదనను హర్షవర్ధనుడు అంగీకరించారు.


హర్షవర్ధనుడు వివిధ ప్రదేశాలకు వెళ్లి అనేక మంది పండితులు, బోధకులు, పూజారులు, నృత్యకారులు, వేశ్యలు, గృహిణులు, పనిమనిషి మరియు మరెంతో మందిని కలుసుకున్నారు.


 ఆమెకు ఆభరణాలు కావాలని కొందరు చెబితే, ఆస్తిపాస్తులని కొందరు, శారీరక సుఖాలని కొందరు మరికొందరేమో తాము మనిషి నుండి పిల్లలను కోరుకుంటున్నారని, మరొకరు అందమైన ఇల్లు మరియు కుటుంబం అని అన్నారు, మరొకరు స్త్రీ సింహాసనం కావాలని కోరుకుంటుంది అన్నారు


 ఈ సమాధానాలతో హర్షవర్ధనుడు అస్సలు సంతృప్తి చెందలేదు.


 నెల ముగిసిపోయే సమయం వచ్చింది,


 మరోవైపు, హర్షవర్ధనుడు సంతృప్తికరమైన సమాధానం సేకరించలేకపోయాడు.


 అప్పుడు ఎవరో చాలా దూరంగా, మరొక దేశంలో ఒక మంత్రగత్తె నివసిస్తున్నారని సమాచారం, ఇస్తూ ఆమెకు అన్ని సమాధానాలు తెలిసి ఉన్నందున ఆమె మాత్రమే ఈ ప్రశ్నకు సరైన సమాధానం ఇవ్వగలదు, అని సలహా ఇచ్చారు


 అప్పుడు హర్షవర్ధనుడు తన స్నేహితుడైన సిద్ధిరాజ్‌తో పాటు, పొరుగు దేశం వెళ్లి మంత్రగత్తెని కలిశాడు. హర్షవర్ధనుడు తన ప్రశ్న ఆమెను అడిగాడు.


అందుకు మంత్రగత్తె, "మీ స్నేహితుడు సిద్దిరాజు నన్ను వివాహం చేసుకోవడానికి అంగీకరిస్తేనే నేను మీకు సరైన సమాధానం ఇస్తాను" అని షరతు పెట్టింది.


 హర్షవర్ధనుడు చాలా ఆలోచించాడు మంత్రగత్తె ను చూస్తే చాలా ముసలిదానిలా కనిపిస్తూ ఉంది, మరియు చాలా అందవికారంగా ఉంది, తన స్నేహితుడికి ఇలాంటి వ్యక్తితో వివాహమంటే మిత్రుడికి అన్యాయం చేయటమే, అని ఆలోచించి సమాధానం తెలీకున్నా పరవాలేదు, కానీ మిత్రుడికి నష్టం జరగాలని అతను కోరుకోలేదు.అందుకే హర్షవర్ధనుడు ఆ ప్రతిపాదనను తిరస్కరించాడు


 కానీ సిద్దిరాజు మాత్రం, తన స్నేహితుడు, తన దేశ రాజు అయిన హర్షవర్ధనున్ని కాపాడటానికి మంత్రగత్తెను వివాహం చేసుకోవడానికి సమ్మతి తెలిపి వెంటనే వివాహం కూడా చేసుకున్నాడు.


 అప్పుడు మంత్రగత్తె హర్షవర్ధనునికి సమాధానమిస్తూ, *“ఒక స్త్రీ స్వతంత్రంగా ఉండాలని కోరుకుంటుంది, తద్వారా ఆమె స్వయంగా నిర్ణయాలు తీసుకుంటుంది.”*


 హర్షవర్ధనుడు ఈ సమాధానంకు సంతృప్తి పడ్డాడు,

అతను తనను గెలిచిన రాజుకు ఈ సమాధానం చెప్పాడు. రాజు సమాధానం ఒప్పుకొని, హర్షవర్ధనున్ని విడుదల చేసి తన రాజ్యాన్ని అతనికి తిరిగి ఇచ్చాడు.


 మరోవైపు, తన పెళ్లి రాత్రి మంత్రగత్తె తన భర్తతో, “మీకు స్వచ్ఛమైన హృదయం ఉంది. మీ స్నేహితుడిని కాపాడటానికి మీకు మీరే త్యాగం చేసారు, కాబట్టి నేను మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ” అంది


 “ప్రతిరోజూ, నేను 12 గంటలు అందవికారంగా కనిపిస్తాను మరియు తరువాతి 12 గంటలు చాలా అందంగా కనిపిస్తాను. మీరు ఇప్పుడు చెప్పండి, మీరు ఏ రూపాన్ని అంగీకరించాలనుకుంటున్నారు. ”అని అడిగింది


దానికి సిద్ధిరాజ్ “అది మీ నిర్ణయం నేను నిన్ను నా భార్యగా అంగీకరించాను, కాబట్టి, నీవు ఎలా వున్నా సరే అలాగే కోరుకుంటున్నాను అని బదులిచ్చాడు.”


 ఇది విన్న మంత్రగత్తె అందంగా మారి “మీరు నన్ను స్వయంనిర్ణయం తీసుకోవడానికి అనుమతించారు, అందువల్ల ఇప్పటినుండి నేను ఎప్పుడూ అందంగానే ఉంటాను” అని అన్నది.


 “వాస్తవానికి ఇదే నా నిజమైన రూపం. చుట్టుపక్కల ఉన్న అసహ్యమైన ప్రజల కోసం నేను నా రూపాన్ని అందవికారమైన మంత్రగత్తెగా మార్చాను అని చెప్పింది.....


 *ఇందులో పాఠకులు గమనించాల్సిందేమంటే..*


 *సామాజిక నిబంధనలు మహిళలను మగాడి మీద ఆధారపడేలా చేశాయి, కానీ, మానసికంగా ఏ స్త్రీ కూడా ఇతరుల మీద ఆధారపడటాన్ని అంగీకరించదు.*


 అందువల్ల, భార్యలకు స్వయం నిర్ణయాధికారం ఇచ్చిన గృహాలు సాధారణంగా సంతోషంగా ఉంటాయి.


 *భార్యను ఇంటి అధిపతిగా ఉండటానికి మీరు అనుమతించకపోవచ్చు, కాని, ఆమె జీవితంలో సగం మాత్రమే మీరు, మిగితా భాగాన్ని, ఆ సగం భాగాన్నయినా విడుదల చేయాలి, దీనితో ఆమె బహిరంగంగా ధైర్యంగా తన నిర్ణయాలు తీసుకోవచ్చు. తనకు ఒక మనస్సుందని, తనకంటూ ఒక వ్యక్తిత్వం ఉందని గుర్తించండి, మీ మానవత్వం మొగ్గతొడిగితే తాను మీ మనోక్షేత్రంలో పూవై పూస్తుంది...*

💐🌹🌺🌸🌼🌷🌸🌹🌺💐

Iam a Hindu


 

పూజ

 


At the age of 103


 

*ధార్మికగీత - 41*


              *శ్లో:- గంగా పాపం శశీ తాపం ౹*

                     *దైన్యం కల్పతరు స్తథా ౹*

                     *పాపం తాపంచ దైన్యంచ ౹*

                     *హన్తి సజ్జన దర్శనమ్ ౹౹*

                                        *****

*భా:- సకల నదులలో గంగానది అతి పవిత్ర మైనది. మూడు దిశలలో పారుతూ, "త్రిపథగ" అని కీర్తి కెక్కింది. భగీరథునిచే దివి నుండి భువికి దిగివచ్చింది. అలాంటి గంగలో ఒక్కసారి మునిగితే పాపాలు, పాతకాలు, మహా పాతకాలు హరించుకు పోతాయి. రాకా సుధాకరుడు తన చల్లని మృదువైన శీతల కిరణ స్పర్శచే జీవకోటి యొక్క కాయిక,మానసిక తాపాన్ని ఇట్టే పోగొడుతున్నాడు. కల్పవృక్షము మన కోరికల నీడేర్చి, మన దైన్యాన్ని, హైన్యాన్ని సమూలంగా తొలగిస్తుంది. పై మూడు కేవలం ఒక్కొకటి ఒక్కోదాన్ని మాత్రమే హరిస్తున్నాయి. వీటన్నిటి కంటె " సజ్జన సంగతి" మిక్కిలి విశిష్టమైనది. సజ్జన దర్శన, స్పర్శన, భాషణములు మన పాపాలను, తాపాలను, హీన, దీన పరిస్థితులను చక్క దిద్దుతాయి. సర్వ శ్రేయములను ఫలింపజేస్తున్నాయి. శ్రీకృష్ణ "దర్శనం" కుచేలుని కుబేరునిగా మార్చింది. పరమాత్మ గీతా "భాషణం" కిరీటిని ధన్యుణ్ణి చేసింది. శ్రీరామ పాద "స్పర్శనం" అహల్యను పునీతను చేసింది. అందుకే "త్రిజగతి సజ్జన సంగతి రేకా- భవతి భవార్ణవ తరణే నౌకా" అన్నారు శంకరా చార్యులు. "సాధు సంగంబు సకలార్థ సాధనంబు " అన్నారు కరుణశ్రీ. సత్పురుష సమాశ్రయము ఇహ-పర సాధకమై, మన జీవితానికి సాఫల్యము, సార్ధక్యము చేకూర్చగలదని సారాంశము.*

                                    *****

                       *సమర్పణ : పీసపాటి*

🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲